first 7 NT books

This commit is contained in:
Larry Versaw 2019-11-29 18:11:16 -07:00
parent 06a12ab8bf
commit 52a645baed
9 changed files with 8034 additions and 2 deletions

2058
41-MAT.usfm Normal file
View File

@ -0,0 +1,2058 @@
\id MAT - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h మత్తయి సువార్
\toc1 మత్తయి సువార్
\toc2 మత్తయి సువార్
\toc3 mat
\mt1 మత్తయి సువార్
\s5
\c 1
\p
\v 1 అబ్రాహాము, దావీదుల వంశం వాడైన యేసు క్రీస్తు పూర్వీకుల జాబితా.
\p
\v 2 అబ్రాహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు యూదా, అతని సోదరులు.
\p
\v 3 యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము. ఎస్రోము కొడుకు ఆరాము.
\s5
\p
\v 4 ఆరాము కొడుకు అమ్మీనాదాబు. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను. నయస్సోను కొడుకు శల్మాను.
\p
\v 5 శల్మానుకు రాహాబు ద్వారా పుట్టిన వాడు బోయజు. బోయజుకు రూతు ద్వారా పుట్టిన వాడు ఓబేదు. ఓబేదు కొడుకు యెష్షయి.
\p
\v 6 యెష్షయి కొడుకు దావీదు. గతంలో ఊరియాకు భార్యగా ఉన్న ఆమె ద్వారా దావీదుకు పుట్టిన వాడు సొలొమోను.
\s5
\p
\v 7 సొలొమోను కొడుకు రెహబాము. రెహబాము కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా.
\p
\v 8 ఆసా కొడుకు యెహోషాపాతు. యెహోషాపాతు కొడుకు యెహోరాము. యెహోరాము కొడుకు ఉజ్జీయా.
\s5
\p
\v 9 ఉజ్జీయా కొడుకు యోతాము. యోతాము కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా.
\p
\v 10 హిజ్కియా కొడుకు మనష్షే. మనష్షే కొడుకు ఆమోను. ఆమోను కొడుకు యోషీయా.
\p
\v 11 యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులను బబులోను చెరలోకి తీసుకుపోయారు.
\s5
\p
\v 12 బబులోనుకు వెళ్ళిన తరువాత యూదుల వంశావళి.
\p యెకొన్యా కొడుకు షయల్తీయేలు. షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు.
\p
\v 13 జెరుబ్బాబెలు కొడుకు అబీహూదు. అబీహూదు కొడుకు ఎల్యాకీము. ఎల్యాకీము కొడుకు అజోరు.
\p
\v 14 అజోరు కొడుకు సాదోకు. సాదోకు కొడుకు ఆకీము. ఆకీము కొడుకు ఎలీహూదు.
\s5
\p
\v 15 ఎలీహూదు కొడుకు ఎలియాజరు. ఎలియాజరు కొడుకు మత్తాను. మత్తాను కొడుకు యాకోబు.
\p
\v 16 యాకోబు కొడుకు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమె యేసుకు తల్లి. ఈ యేసునే క్రీస్తు అని పిలిచారు.
\p
\v 17 ఈ విధంగా అబ్రాహాము నుంచి దావీదు వరకూ మొత్తం పద్నాలుగు తరాలు. దావీదు నుంచి యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కాలం వరకూ పద్నాలుగు తరాలు. బబులోను చెరలోకి వెళ్ళిన కాలం నుంచి క్రీస్తు వరకూ పద్నాలుగు తరాలు.
\s5
\p
\v 18 ఇది యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏమి జరిగింది అనే దాని వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో నిశ్చితార్థం జరిగింది. కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా కలిసి నివసించక ముందే పరిశుద్ధాత్మ ప్రభావం వల్ల ఆమె గర్భవతి అయిందని వాళ్ళకి తెలిసింది.
\v 19 ఆమెను పెళ్ళాడనున్న యోసేపు దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకునే ముక్కుసూటి మనిషి. కానీ ఆమెను నలుగురిలో పరువు తీసే పాపం నాకెందుకులే అనుకున్నాడు. అందువల్ల గుట్టు చప్పుడు కాకుండా వివాహ ప్రయత్నం విరమించుకుందామనుకున్నాడు.
\s5
\p
\v 20 అతడు ఇలా ఆలోచించుకుంటూ ఉంటే ప్రభువు దూత ఒకడు అతనికి కలలో కనిపించాడు. "యోసేపూ, దావీదు రాజు వంశస్తుడా, మరియను పెళ్ళి చేసుకోడానికి వెనకాడవద్దు. ఆమె గర్భవతిగా ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది.
\v 21 ఆమె కొడుకును కంటుంది. తన ప్రజలను పాపం నుండి రక్షించేది ఆయనే గనక ఆయనకు యేసు అని పేరు పెట్టు.
\s5
\v 22 పూర్వకాలం దేవుడు యెషయా ద్వారా పలికించిన మాట నిజమయ్యేలా ఇది జరుగుతుంది. యెషయా ఇలా రాశాడు.
\q1
\v 23 "వినండి, కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది.
\q1 ఆయనకు "దేవుడు మనతో ఉన్నాడు" అని అర్థమిచ్చే "ఇమ్మానుయేలు" అనే పేరు పెడతారు."
\s5
\p
\v 24 యోసేపు నిద్ర లేచి, ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మరియను తన భార్యగా స్వీకరించాడు.
\v 25 అయితే ఆమె కొడుకును కనే వరకూ అతనికి ఆమెతో ఎలాటి లైంగిక సంబంధమూ లేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.
\s5
\c 2
\p
\v 1 మహా హేరోదు రాజు పరిపాలించే కాలంలో యూదయలోని బేత్లెహేము అనే ఊరిలో యేసు పుట్టాడు. కొంతకాలం గడిచిన తరువాత తూర్పున ఉన్న సుదూర ప్రాంతం నుండి, నక్షత్రాలను పరిశీలిస్తూ అధ్యయనం చేస్తూ ఉండే కొందరు యెరూషలేముకు వచ్చారు.
\v 2 వాళ్ళు అక్కడి వాళ్ళతో "యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన పుట్టాడని తెలియచేసే నక్షత్రాన్ని మేము తూర్పు దిక్కున చూసాము. ఆయనను ఆరాధించడానికి వచ్చాం" అన్నారు.
\p
\v 3 వాళ్ళు అడుగుతున్న విషయాన్ని గురించి హేరోదు రాజు విని చాలా కంగారుపడ్డాడు. యెరూషలేములో చాలామంది కూడా కంగారుపడ్డారు.
\s5
\v 4 అప్పుడు రాజు ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు అందరినీ పిలిపించాడు. "క్రీస్తు ఎక్కడ పుడతాడని ప్రవక్తలు ముందుగా చెప్పారో చూడండి" అని వారిని అడిగాడు.
\v 5 అందుకు వాళ్ళు "యూదయలోని బేత్లేహేము అనే గ్రామంలోనే ఆయన పుట్టాలి. ఎందుకంటే చాలాకాలం కిందట మీకా అనే ప్రవక్త ముందుగానే రాశాడు.
\v 6 యూదయలోని బేత్లేహేము గ్రామమా, యూదా పట్టణాలన్నిటికీ నువ్వేమీ తీసిపోవు. నా ఇశ్రాయేలు ప్రజలను పాలించేవాడు నీలో నుండే వస్తాడు."
\s5
\p
\v 7 అప్పుడు హేరోదు నక్షత్రాల సూచనలు చూసే ఆ శాస్త్రజ్ఞులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనిపించిన కాలాలను వాకబు చేశాడు.
\v 8 తరువాత వారిని బేత్లేహెముకు పంపిస్తూ "మీరు వెళ్ళి ఆ పిల్లవాడి కోసం బాగా వెదకండి. మీరు ఆయనను చూశాక నాకూ చెప్పండి. నేను వచ్చి ఆయనను ఆరాధిస్తాను" అన్నాడు.
\s5
\p
\v 9 రాజు చెప్పింది విన్న తరువాత ఆ మనుషులు బేత్లెహేము వైపుకు బయలుదేరారు. ఆశ్చర్యం! తూర్పున వాళ్ళు చూసిన నక్షత్రం మళ్లీ వాళ్ళకి ముందుగా వెళుతూ కనపడింది.
\v 10 ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఎగిరి గంతేసి దాన్ని వెంబడించారు. అది ఆ పిల్లవాడు ఉన్న ఇంటిపైగా ఆగింది.
\s5
\p
\v 11 వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లవాడినీ, తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి నమస్కరించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, ఖరీదైన సాంబ్రాణి , బోళం అనే పరిమళ ద్రవ్యం కానుకలుగా ఆయనకు సమర్పించారు.
\v 12 దేవుడు వాళ్ళకి కలలో కనపడి హేరోదు దగ్గరకు వెళ్ళవద్దని హెచ్చరించాడు. కాబట్టి వాళ్ళు వేరే దారిలో తమ దేశం వెళ్ళిపోయారు.
\s5
\p
\v 13 వాళ్ళు బేత్లేహేమును వదిలి వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, "పిల్లవాడినీ, తల్లినీ తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపో. నేను నీకు మళ్ళీ చేప్పేవరకు అక్కడే ఉండు. ఎందుకంటే హేరోదు ఈ పిల్లవాడిని చంపాలని తన సైనికులను పంపిస్తున్నాడు" అని చెప్పాడు.
\v 14 ఆ రాత్రివేళ యోసేపు లేచి పిల్లవాడినీ తల్లినీ తీసుకుని ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. హేరోదు చనిపోయే వరకు అక్కడే ఉండి, తరువాత వాళ్ళు ఐగుప్తు నుండి తిరిగి వచ్చారు.
\q
\v 15 "ఐగుప్తు నుండి నా కుమారుణ్ణి పిలిచాను." అని హోషేయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది.
\s5
\p
\v 16 జ్ఞానులు తనను మోసం చేసారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. జ్ఞానులు ఆ నక్షత్రం ద్వారా తన దగ్గరకు వచ్చిన కాలాన్ని లెక్కగట్టి ఆ పిల్లవాడి వయస్సును అంచనా వేసుకున్నాడు. దాని ప్రకారం బెత్లెహేములో, చుట్టూ ఉన్న గ్రామాల్లో రెండేళ్ళు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపమని తన సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు.
\s5
\v 17 దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఈ విధంగా నెరవేరాయి.
\q
\v 18 రామాలో స్త్రీలు శోకిస్తూ ఉన్నారు. రాహేలు చనిపోయిన తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది.
\q పిల్లలందరూ చనిపోవటం వల్ల ఎంత ఆదరించాలని చూసినా ఆమె ఓదార్పు పొందలేకపోయింది.
\s5
\p
\v 19 హేరోదు చనిపోయిన తరవాత ప్రభువు దూత ఐగుప్తులో ఉన్న యోసేపుకు కలలో కనపడి,
\v 20 "పిల్లవాడి ప్రాణం తీయాలని ప్రయత్నించిన వాళ్ళు చనిపోయారు. కనుక నువ్వు లేచి పిల్లవాడినీ తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు" అని చెప్పాడు.
\v 21 అప్పుడు యోసేపు లేచి పిల్లవాణ్ణి, తల్లినీ తీసుకుని ఇశ్రాయేలు దేశానికి తిరిగి వెళ్ళాడు.
\s5
\p
\v 22 అయితే అర్కేలా తన తండ్రి హేరోదుకు బదులుగా యూదయ ప్రాంతాన్ని ఏలుతున్నాడని యేసేపు విని, అక్కడికి వెళ్ళటానికి భయపడ్డాడు. తరువాత దేవుడు కలలో అతడితో చెప్పటంతో యోసేపు, మరియ, ఆ పిల్లవాడు గలిలయలోని నజరేతుకు వెళ్ళారు.
\v 23 యేసును నజరేయుడు అంటారని ప్రవక్తలు చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది.
\s5
\c 3
\p
\v 1 యేసు నజరేతులో ఉన్నప్పుడు, బాప్తిసమిచ్చే యోహాను యూదయ అరణ్యంలో ఒంటరిగా ఉంటూ తన దగ్గరకు వచ్చే ప్రజలకు పరలోకరాజ్యం గురించి చెపుతూ ఉన్నాడు.
\v 2 "పాపం చేయకండి. పరలోకరాజ్యం దగ్గరగా ఉంది. మీరు ఇంకా పాపం చేస్తూ వుంటే దేవుడు మిమ్మల్ని తిరస్క రిస్తాడు" అని బోధిస్తూ ఉన్నాడు.
\v 3 చాలాకాలం క్రితం యెషయా ప్రవక్త, "అరణ్యంలో ఒక స్వరం ఘోషిస్తూ ఉంది. ప్రభువు వస్తున్నాడు. అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఆయన కోసం అన్నీ సిద్ధం చెయ్యండి" అని రాసింది ఇతని గురించే.
\s5
\p
\v 4 యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలు వేసుకుని, నడుముకు తోలు బెల్టు కట్టుకునేవాడు. అడవిలో దొరికే మిడతల్నీ తేనెనూ తినేవాడు.
\v 5 యెరూషలేము, యూదయ, యోర్దాను నదీ ప్రాంతాల వారంతా యోహాను బోధ వినడానికి వచ్చేవారు.
\v 6 అతని బోధ విన్న తరవాత వాళ్ళు తమ పాపాలను ఒప్పుకున్నారు. యోహాను వారందరికీ బాప్తిసం ఇచ్చేవాడు.
\s5
\p
\v 7 చాలామంది పరిసయ్యులూ, సద్దూకయ్యూలూ ఆయన దగ్గరకు బాప్తిసం పొందడానికి రావడం యోహాను చూసి వారితో, "మీరు పాముపిల్లలు. మీ పాపాలను బట్టి దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడని మిమ్మల్ని ఎవరూ హెచ్చరించలేదా? దేవుని నుండి తప్పించుకోవచ్చని మీరు ఎప్పటికీ అనుకోవద్దు.
\v 8 మీరు నిజంగా పాపం చేయడం మానేస్తే, దానికి రుజువుగా మంచి పనులు చెయ్యండి.
\v 9 అబ్రాహాము సంతానానికి తోడుగా తాను ఉన్నానని దేవుడు చెప్పిన సంగతి నాకు తెలుసు. కాని "మేము అబ్రాహాము సంతానం, మేము పాపం చేసినా కూడా దేవుడు మమ్మల్ని శిక్షించడు" అని మీరు అనుకోవద్దు. మీకు తెలుసా? దేవుడు ఈ రాళ్ళ నుండి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడు.
\s5
\v 10 మంచి కాయలు కాయని ప్రతి చెట్టును నరికి మంటల్లో పడేస్తారు. అలాగే దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి ఇప్పుడే సిద్ధంగా ఉన్నాడు" అని చెప్పాడు.
\p
\v 11 "నా వరకు నేను అంత ముఖ్యమైనవాణ్ణి కాదు. ఎవరైనా తమ పాపాలను ఒప్పుకుంటే నేను కేవలం నీళ్ళతో బాప్తిసం ఇస్తాను. కాని గొప్ప శక్తిమంతుడు తొందరలో రాబోతున్నాడు. అతడు నాకంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఆయన చెప్పులను మోయటానికి కూడా నేను పనికిరాను. ఆయన మీకు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిసం ఇస్తాడు.
\v 12 మంచి గోదుమలను పొట్టు నుండి వేరు చేయటానికి తూర్పారబట్టే చేట ఆయన పట్టుకుని ఉన్నాడు. రైతు మంచి గోదుమలను తన గిడ్డంగిలో దాచుకున్నట్టు దేవుడు కూడా నీతిమంతులను పరలోకానికి తీసుకు పోతాడు. పొట్టును మంటల్లో వేసి కాల్చినట్టుగా ఆయన చెడ్డవారిని ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు."
\s5
\p
\v 13 ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం తీసుకోటానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యోర్దాను నది దగ్గరకు వచ్చాడు.
\v 14 యేసు యోహానును బాప్తిసం ఇమ్మని అడిగాడు. యోహాను "అసలు నేను నీచేత బాప్తిసం తీసుకోవాలి. నువ్వు పాపివి కాదు గదా, అలాటిది నువ్వు నా దగ్గరికి వచ్చావేంటి?" అన్నాడు.
\v 15 అందుకు యేసు, "ప్రస్తుతానికి బాప్తిసం ఇవ్వు. మనం ఇద్దరం ఈ విధంగా చేయడం దేవుని సంకల్పం" అన్నాడు. దాంతో యోహాను ఆయనకు బాప్తిసమిచ్చాడు.
\s5
\p
\v 16 యేసు బాప్తిసం తీసుకొని ఒడ్డుకి వచ్చిన వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురం లాగా తన మీదకి వాలడం ఆయన చూశాడు.
\v 17 "ఈయన నా ఇష్టమైన కుమారుడు. నేను ఈయనను ప్రేమిస్తున్నాను. ఈయనంటే నాకెంతో సంతోషం" అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.
\s5
\c 4
\p
\v 1 తరువాత దేవుని ఆత్మ యేసుని అపవాది శోధనలను ఎదుర్కోవటానికి ఎడారి ప్రాంతానికి తీసుకెళ్ళాడు.
\v 2 అప్పటికి ఆయన నలభై రాత్రింబగళ్ళు ఏమీ తినకపోవడంతో ఆయనకు చాలా ఆకలిగా ఉంది.
\v 3 ఆయనను శోధించటానికి సాతాను ఆయన దగ్గరకు వచ్చాడు. "నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే, తింటానికి ఈ రాళ్ళను రొట్టెలుగా మారమని చెప్పు" అన్నాడు.
\v 4 కాని యేసు, "నేను అలా ఎప్పటికీ చెప్పను. ఎందుకంటే
\q1 మనిషి కేవలం తిండి వల్ల మాత్రమే బతకడు.
\q1 దేవుడు మాట్లాడే ప్రతి మాట వినడం వల్ల బతుకుతాడు" అని దేవుని వాక్యంలో రాసి ఉంది" అన్నాడు.
\s5
\p
\v 5 తరవాత సాతాను యేసును దేవుని పట్టణమైన యెరుషలేముకు తీసుకెళ్ళాడు. గుడి గోపురం మీద ఆయనను నిలబెట్టాడు.
\v 6 "నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే కిందకు దూకు. దూకినా నీకేమీ కాదు ఎందుకంటే,
\q "ఆయన తన దూతలకు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడు.
\q వాళ్ళు నీ పాదాలకు రాయి తగలకుండా నిన్ను తమ చేతులతో ఎత్తిపట్టుకొంటారు" అని లేఖనాలలో రాసి ఉంది కదా" అన్నాడు.
\s5
\p
\v 7 అందుకు యేసు "లేదు. నేను అలా దూకను.
\q "నీ ప్రభువైన దేవుని పరీక్షించకూడదు" అని కూడా రాసి ఉంది" అని చెప్పాడు.
\p
\v 8 తరువాత సాతాను ఆయనను ఎత్తైన కొండ మీదికి తీసుకెళ్ళాడు. అక్కడనుండి ప్రపంచ దేశాలనూ, వాటి వైభోగాలనూ ఆయనకు చూపించాడు.
\v 9 "నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేసి నన్ను పూజిస్తే ఈ దేశాలన్నింటినీ వాటిలో ఉన్న అద్భుతమైన వస్తువులనూ నీకిచ్చేస్తాను" అన్నాడు.
\s5
\p
\v 10 యేసు "సాతానూ అవతలికి పో. నేను నిన్ను ఎప్పటికీ పూజించను.
\q నీ ప్రభువైన దేవుణ్ణి మాత్రమే పూజించాలి.
\q ఆయనకే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అని రాసి ఉంది" అని చెప్పాడు.
\p
\v 11 దాంతో సాతాను ఆయనను వదిలి వెళ్ళాడు. వెంటనే దేవదూతలు వచ్చి ఆయనకు సపర్యలు చేశారు.
\s5
\p
\v 12 యేసు యూదయ ప్రాంతంలో ఉన్నప్పుడు బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి హేరోదు రాజు యోహానును జైల్లో పెట్టించాడని చెప్పారు. అందుకని యేసు తిరిగి గలిలయలోని నజరేతుకు తిరిగి వెళ్ళిపోయాడు.
\v 13 తరువాత నజరేతును విడిచి కపెర్నహూముకు వచ్చి అక్కడ నివసించాడు. అది గలిలయ సరస్సు తీరంలో జెబులూను, నఫ్తాలి తెగలు నివసించిన ప్రాంతం.
\s5
\v 14 యెషయా ప్రవక్త చాలా కాలం క్రితం రాసిన మాటలు నెరవేరేలా యేసు అక్కడికి వెళ్ళాడు.
\q
\v 15 జెబూలూను నఫ్తాలి ప్రాంతాలు, యొర్దాను నది అవతల సముద్రం వైపున ఉన్న
\q1 యూదేతరులు నివసించే గలిలయ ప్రాంతాల్లో
\q1
\v 16 చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూశారు.
\q1 చావు నీడలో కూర్చున్న వారిపై వెలుగు ఉదయించింది.
\s5
\p
\v 17 యేసు కపెర్నహూములో ఉన్నప్పుడే, "పరలోకం నుండి దేవుని రాజ్య పాలన సమీపిస్తూ ఉంది. ఆయన పరిపాలనలో మీకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి పాపం చేయడం మానండి" అని బోధించడం మొదలుపెట్టాడు.
\s5
\p
\v 18 ఒకరోజు యేసు గలిలయ సముద్ర తీరాన నడుస్తున్నాడు. అక్కడ ఇద్దరు మనుషులు కనిపించారు. వారిలో ఒకడు సీమోను, ఇంకొకడు అతని తమ్ముడు అంద్రెయ. వాళ్ళు సముద్రంలో వలలు వేస్తూ ఉన్నారు.
\v 19 యేసు వారితో, "నాతో రండి. నాకు శిష్యులుగా చేయడం కోసం మనుషులను ఎలా తీసుకురావాలో నేను మీకు నేర్పుతాను. మనుషులను పట్టే జాలరులనుగా నేను మిమ్మల్ని చేస్తాను" అన్నాడు.
\v 20 వెంటనే వాళ్ళు తాము చేస్తున్న పనిని వదిలి, ఆయనతో వెళ్ళారు.
\s5
\p
\v 21 అక్కడనుండి వాళ్ళు ముగ్గురూ వెళ్తుండగా యేసు మరి ఇద్దరిని చూశాడు. వాళ్ళు యాకోబూ అతని తమ్ముడు యోహానూ. వాళ్ళు తమ తండ్రితో కూడా పడవలో తమ వలలు బాగు చేసుకుంటున్నారు. యేసు వాళ్ళను కూడా పిలిచాడు.
\v 22 వాళ్ళు కూడా వెంటనే తమ తండ్రినీ వలలనూ విడిచి యేసుతో వెళ్ళారు.
\s5
\p
\v 23 యేసు ఆ నలుగురితో కలిసి గలిలయ ప్రాంతం అంతా తిరిగాడు. సమాజకేంద్రాలలో ఉపదేశిస్తూ దేవుని రాజ్య శుభవార్తను ప్రకటిస్తూ, రోగులను నయం చేస్తూ ఉన్నాడు.
\v 24 సిరియాలోని ఇతర ప్రాంతాల ప్రజలు ఈయన చేస్తున్నది విని రోగులందరినీ నానా విధాల వ్యాధుల చేతా యాతనలచేతా బాధలు పడుతున్న వారినీ దయ్యాలు పట్టినవారినీ మూర్ఛరోగులనూ పక్షవాత రోగులనూ ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన వారిని బాగు చేశాడు.
\p
\v 25 గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతాల నుండీ యొర్దాను అవతలి ప్రాంతం నుండీ ప్రజలు తండోపతండాలుగా ఆయన వెంట వెళ్ళారు.
\s5
\c 5
\p
\v 1 యేసు ఆ జనాలను చూసి కొండ ఎక్కి కూర్చుని తన శిష్యులతో మాట్లాడసాగాడు.
\v 2 ఆయన వాళ్ళకి ఇలా బోధించడం మొదలుపెట్టాడు.
\q
\v 3 "దేవుని అవసరత తమకు ఉంది అని ఒప్పుకునే మనుషులను చూసి దేవుడు ఆనందిస్తాడు. పరలోకం నుండి దేవుడు వాళ్ళను పరిపాలిస్తాడు.
\q1
\v 4 ఈ లోకంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలను భరించలేక దుఃఖించే వారంటే దేవుడికి ఇష్టం. ఆయన వారిని ఆదరిస్తాడు.
\s5
\q1
\v 5 నమ్రత కలిగిన వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. త్వరలో చేయబోయే కొత్త భూమికి వాళ్ళు వారసులు అవుతారు.
\q
\v 6 అన్నపానాలకు ఆశ పడినట్టుగా నీతిగా బతకాలని ఆశ పడే వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. ఆయన వారికి నీతిగా బతికే సామర్థ్యం ఇస్తాడు.
\q
\v 7 ఇతరులను కరుణించే వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. దేవుడు కూడా వారిని దయగా చూస్తాడు.
\q
\v 8 దేవుడికి సంతోషం కలిగించాలని చూసే వాళ్ళంటే దేవుడికి ఇష్టం. వాళ్ళు దేవునితో ఉంటారు, ఆయన్ని చూస్తారు.
\s5
\q
\v 9 ఇతరులు శాంతి సమాధానాలతో జీవించటానికి సాయపడే వారిని చూసి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. అలాంటి వారిని తన బిడ్డలుగా చేసుకుంటాడు.
\q
\v 10 నీతి న్యాయాలతో జీవించే వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు. మనుషులు వారి నీతిని చూసి వారిని అవమానించి, దూషించినప్పుడు దేవుడు గౌరవం పొందుతాడు. ఇలాంటి నీతిగల మనుషులను దేవుడు పరలోకం నుండి ఏలుతాడు.
\s5
\q
\v 11 మనుషులు మిమ్మల్ని దూషించినప్పుడు దేవుడు ఆనందిస్తాడు.వారు మిమ్మల్ని హింసించి, మీమీద అబద్ధంగా అన్ని రకాల అపనిందలు మోపినప్పుడు దేవునికి గౌరవం కలుగుతుంది.
\q
\v 12 అప్పుడు సంతోషించండి. ఉప్పొంగి పొండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తలను కూడా మనుషులు ఇలాగే హింసించారు."
\s5
\p
\v 13 "ఉప్పు ఆహారానికి ఎంత రుచి ఇస్తుందో మీరు ఈ లోకానికి అంత ఉపయోగకరంగా ఉండాలి. ఒకవేళ ఉప్పు తన రుచిని పోగొట్టుకుంటే దాన్ని బాగుచేయటం ఎవరి వల్లా కాదు. మనుషులు దాన్ని బయట పారేసి దాన్ని తొక్కుతూ నడుస్తారు.
\v 14 చీకటిలో ఉన్న మనుషులకు వెలుగు ఉంటే ఎలా ఉంటుందో మీరు కూడా ఈ లోకానికి అలాంటి వెలుగుగా ఉండాలి. కొండమీద కట్టిన ఊరును మనుషులు అందరూ ఎలా చూస్తారో, అలాగే మిమ్మల్ని చూడాలి.
\s5
\v 15 ఎవరు కూడా దీపాన్ని వెలిగించి బుట్ట కింద పెట్టరు, దీపస్తంభం మీద పెడతారు. అప్పుడే కదా అది ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది?
\v 16 అలాగే మీరేం చేస్తారో మనుషులు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడూ మంచి పనులే చెయ్యాలి. అప్పుడు వాళ్ళు పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు."
\s5
\p
\v 17 "దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ నేను రద్దు చేయటానికి వచ్చానని మీరు అనుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే నేను వచ్చాను.
\v 18 నేను కచ్చితంగా చెబుతున్నాను. దేవుడు ఆకాశాన్నైనా భూమినైనా తొలగిస్తాడు కాని ధర్మశాస్త్రం అంతా నెరవేరేవరకు దాంట్లో నుండి ఒక్క సున్నా అయినా ఒక్క పొల్లు అయినా తొలగించడు.
\s5
\v 19 ఎందుకంటే ఈ ఆజ్ఞలలో ఎంత చిన్నదానినైన సరే పాటించకుండా పైగా ఇతరులకు అలా చేయమని చెప్పేవాణ్ణి పరలోకరాజ్యంలోఅతి తక్కువవాడిగా చూస్తారు. కానీ ఎవడైతే ఈ ఆజ్ఞలను పాటిస్తూ వాటిని ఇతరులకు బోధిస్తాడో వాణ్ణి పరలోకరాజ్యంలో గొప్పవాడిగా చూస్తారు.
\v 20 నేను మీతో చెపుతున్నాను, ధర్మశాస్త్ర పండితుల కంటే కూడా ఎక్కువగా మీరు ఆ ఆజ్ఞలకు లోబడాలి. ఇంకా మీ మనసుకి ఏది సరైనదిగా అనిపిస్తుందో అది మీరు తప్పక చేయాలి."
\s5
\p
\v 21 "హత్య చెయ్యకూడదు. హత్య చేస్తే ఉరిశిక్ష పడుతుంది, అని మన పితరులు చెప్పింది మీరు విన్నారు కదా. ఐతే నేను చెప్తున్నాను. మీరు ఎవరితోనైనా కోపంగా ఏమన్నా అంటే చాలు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు.
\v 22 మీరు ఎవరిమీదనైనా కోప్పడితే దేవుడే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎవరినైనా "చవటా" అని తిడితే మీమీద కోర్టులో కేసు పెట్టొచ్చు. ఎవరినైనా "తెలివి తక్కువ దద్దమ్మా" అంటే, దేవుడు మిమ్మల్ని నరకంలోకి తోస్తాడు."
\s5
\p
\v 23 "దేవుడికి నువ్వు కానుక సమర్పించే ముందు ఎవరితోనైనా గొడవ ఉన్నట్టు నీకు గుర్తుకు వస్తే
\v 24 నీ కానుకను అక్కడే వదిలి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాలి. నువ్వు అతనికి చేసిన దాన్ని గురించి అతణ్ణి క్షమాపణ అడగాలి. ఆపైన వచ్చి నీ కానుకను అర్పించ వచ్చు.
\s5
\p
\v 25 నువ్వు ఎవరికైనా అన్యాయం చేస్తే వాడు నిన్ను కోర్టుకు తీసుకెళ్తున్నాడనుకో. దారిలోనే నువ్వు వాడితో రాజీ పడిపో. లేకపోతే వాడు నిన్ను జడ్జీకి అప్పగిస్తాడు. అతడు నిన్ను జైల్లో పెడతాడు.
\v 26 ఇంకా ఇది కూడా మనసులో పెట్టుకో. ఒకవేళ నువ్వు గనక జైల్లో పడితే చచ్చినా బయటికి రావు. ఎందుకంటే జడ్జీ నువ్వు కట్టాల్సిన జరిమానా డబ్బు మొత్తం చెవులు పిండి వసూలు చేసే దాకా నిన్ను వదలడు. కాబట్టి నీ సాటి మనుషులతో ఎప్పుడూ శాంతి సమాధానాలతో ఉండాలని గుర్తుపెట్టుకో."
\s5
\p
\v 27 "వ్యభిచారం చేయకూడదు, అని దేవుడు మన పూర్వికులతో చెప్పిన మాట నువ్వు వినే ఉంటావు కదా.
\v 28 కాని నేను చేప్పేదేమిటంటే ఎవరైనా ఒక స్త్రీని కామంతో చూస్తే చాలు అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించినట్టుగానే దేవుడు పరిగణిస్తాడు."
\s5
\p
\v 29 "నువ్వు పాపం చేయడానికి నీ కన్ను కారణమైతే దాన్ని పీకి పారెయ్యి. పాపం చేయడానికి నీ రెండు కళ్ళు కారణం అయితే వాటిని పీకేసెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే గుడ్డివాడిగా ఉండి పాపం లేకుండా ఉండడం ఎంతో మేలు.
\v 30 నువ్వు పాపం చేయడానికి నీ చెయ్యి కారణమైతే దాన్ని నరికి పారెయ్యి. నీ శరీరమంతా నరకంలో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మేలు."
\s5
\p
\v 31 "భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకుల పత్రం రాసివ్వాలి, అని చెప్పడం కూడా మీరు విన్నారు.
\v 32 నేను మీతో చెప్పేదేమిటంటే వ్యభిచార కారణం కాకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను మళ్ళీ పెళ్ళి చేసుకొనేవాడూ వ్యభిచారం చేస్తున్నాడు."
\s5
\p
\v 33 "నువ్వు అసత్య ప్రమాణం చేయకూడదు. మీ ప్రమాణాలను ప్రభువు మీ ఎదుట నిలబడి ఉంటే చేసినట్టుగానే ఉండాలి, అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా.
\v 34 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే అసలు ఏ కారణంగానైనా ఒట్టు పెట్టుకోవద్దు. మీరు ప్రమాణం చేసిన వాటికి హామీ ఇవ్వటానికి దేవుని నివాస స్థలమైన పరలోకాన్ని ప్రస్తావించ వద్దు. ఎందుకంటే అది దేవుని సింహాసనం. అక్కడ నుండే ఆయన అన్ని విషయాలను శాసిస్తాడు.
\v 35 భూమి తోడు అని ఒట్టు పెట్టుకో వద్దు. ఎందుకంటే అది దేవుడి పాద పీఠం. యెరూషలేము తోడు అని ఒట్టు పెట్టుకోవద్దు. అది మన మహారాజు దేవుని నగరం."
\s5
\p
\v 36 "ఇంకా ఎవరికైనా ఏదైనా పని చేస్తానని నా తోడు అని ఒట్టు పెట్టుకోవద్దు. ఒక్క వెంట్రుకను సైతం తెల్లగాగానీ నల్లగా గానీ నువ్వు మార్చలేవు గదా, అలాంటప్పుడు అంత ముఖ్యమైన పని చేస్తానని ఎలా మాటిస్తావు?
\v 37 ఏదైనా పని చెయ్యాలనుకుంటే మీరు "అవును, నేను చేస్తాను" లేదా "కాదు, నేను చెయ్యలేను" అన్నట్టే ఉండాలి. మీరు అంతకన్నా ఎక్కువ ఏదైనా అంటే మీచేత అలా మాట్లాడించినవాడు సాతానే."
\s5
\p
\v 38 "మన పూర్వీకులు చెప్పిన మాట మీరు వినే ఉంటారు. ఎవరైనా మీ కంటికి గాయం చేస్తే మీరు అతని కంటికి గాయం చెయ్యాలి. ఒకవేళ నీ పన్ను రాలగొడితే వాడి పన్ను రాలగొట్టాలి.
\v 39 కానీ ఇప్పుడు నేను చేప్పేది వినండి. మీరు ఆపాలని ప్రయత్నించినా మీకు హాని కలిగించాలని చూసే వారిపై ప్రతీకారం తీర్చుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని అవమానించాలని మీ చెంప మీద కొడితే రెండవ చెంపమీద కొట్టడానికి వీలుగా అతని వైపు తిప్పు.
\s5
\p
\v 40 ఎవరైనా మీ చొక్కా కావాలని కోర్టులో దావా వేస్తే అతనికి దానితోపాటు నీ పైబట్టను కూడా ఇచ్చెయ్యి.
\v 41 ఒక రోమన్ సైనికుడు తన సరంజామాను ఒక మైలు దూరం మొయ్యమని నిన్ను బలవంతం చేస్తే రెండు మైళ్ళు మోసుకెళ్ళు.
\p
\v 42 ఇంకా ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే అతనికి ఇవ్వండి. ఎవరైనా అప్పు అడిగితే లేదనకుండా ఇవ్వండి."
\s5
\p
\v 43 "మీ సాటి ఇశ్రాయేలీయుణ్ణి ప్రేమించి శత్రువులైన విదేశీయులను ద్వేషించు అని దేవుడు మీ పూర్వికులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా.
\v 44 కాని ఇప్పుడు నేను చేప్పేది వినండి. మీ శత్రువులనూ స్నేహితులనూ సమానంగా ప్రేమించండి. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళ కోసం ప్రార్ధించండి.
\v 45 ఇలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి అయిన దేవునిలా మీరు ఉన్నట్టు. ఆయన అందరినీ దయగా చూస్తాడు. ఎందుకంటే ఆయన చెడ్డవారిపైనా మంచివారిపైనా సూర్యుణ్ణి సమానంగా ఉదయింపచేస్తాడు. తనకు లోబడేవారిపైనా లోబడని వారిపైనా కూడా వర్షం కురిపిస్తాడు.
\s5
\v 46 మిమ్మల్ని ప్రేమిస్తున్న మనుషులను మాత్రమే మీరు ప్రేమిస్తే దేవుడు మెచ్చి మేకతోలు కప్పుతాడని చూడవద్దు. పన్నులు కట్టించుకునే వాళ్ళు చేసే పాతకాల వంటివి చేసే వాళ్ళు కూడా తమను ప్రేమించే వారినే ప్రేమిస్తారు. మీరు వారికంటే మెరుగ్గా ఉండాలి."
\p
\v 47 "ఇంకా మీరు మీ స్నేహితులను మాత్రమే యోగ క్షేమాలు కనుక్కుంటూ వారిని దీవించమని దేవుని కోరితే అందులో గొప్పేముంది? దేవునికి లోబడని యూదేతరులు సైతం అలాగే చేస్తారు గదా.
\v 48 అందుకని పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు మీపట్ల నమ్మకంగా ఉన్నట్టే మీరు కూడా పూర్తిగా ఆయనపట్ల నమ్మకంగా ఉండాలి."
\s5
\c 6
\p
\v 1 మనుషులు చూడాలని వాళ్ళ ఎదుట మంచి పనులను చెయ్యొద్దు. అలా చెయ్యాలనుకుంటే మాత్రం పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు మీకు ఎలాంటి బహుమానమూ ఇవ్వడు.
\v 2 కాబట్టి, మీరు దానం చేసేటప్పుడు కపట భక్తులలాగా ఇతరులు మిమ్మల్ని చూడాలని సొంత డబ్బా కొట్టుకోకండి. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపటభక్తులు సమాజ మందిరాల్లో ప్రధాన వీధుల్లో అలా చేస్తారు.
\s5
\v 3 వాళ్ళు చేసినట్టుగా మీరు అస్సలు చెయ్యొద్దు. ముఖ్యంగా పేదవారికి మీరు ఏదైనా సాయం చేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా చెయ్యండి.
\v 4 ఎప్పుడైతే మీరు ఎవరికీ తెలియకుండా దానం చేస్తారో అప్పుడే మీ తండ్రి అయిన దేవుడు మీకు బహుమానం ఇస్తాడు.
\s5
\p
\v 5 ఆలాగే మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా కపట భక్తుల్లాగా ఉండొద్దు. మనుషులకు కనపడాలని సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టం. వాళ్ళు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను.
\p
\v 6 ఐతే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, లోపలి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని, రహస్యంగా తండ్రికి ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.
\v 7 అంతే కాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృథా మాటలు పదే పదే పలక వద్దు. ఎక్కువగా మాట్లాడితేనే దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటారు.
\s5
\v 8 కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు
\v 9 కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి.
\q “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామాన్ని అందరూ ఘనపరుస్తారు గాక.
\q2
\v 10 ప్రతి ఒక్కరిపై , ప్రతిదానిపై పూర్తిగా నీ అధికారం చెల్లు గాక.
\q2 పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.
\s5
\q2
\v 11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ప్రసాదించు.
\q2
\v 12 మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు.
\q2
\v 13 శోధన పాలైనప్పుడు మేము తప్పటడుగు వెయ్యకుండా చెయ్యి.
\q2 మాకు హాని చెయ్యాలని చూసే సాతాను నుండి మమ్మల్ని కాపాడు.
\s5
\p
\v 14 మీకు వ్యతిరేకంగా మనుషులెవరైనా తప్పులు చేస్తే వారిని క్షమించండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి అయిన దేవుడు మిమ్మల్నీ క్షమిస్తాడు.
\v 15 మీరు మనుషుల తప్పులు క్షమించకపోతే మీ తండ్రి కూడా మీ తప్పులు క్షమించడు.
\s5
\p
\v 16 దేవుని సంతోషపెట్టాలని మీరు ఉపవాసం ఉన్నప్పుడు దొంగ భక్తుల్లాగా మీ ముఖాలు ఉసూరుమంటూ పెట్టుకోవద్దు. తాము ఉపవాసం ఉన్నట్టు మనుషులకు కనబడాలని వాళ్ళు తమ ముఖాలను నీరసంగా చేసుకుంటారు. గుర్తుంచుకోండి. అదే ఆ మనుషులకు దొరికే బహుమానం.
\v 17 మీలో ప్రతి ఒక్కరూ ఎప్పుడైనా ఉపవాసం చేసినప్పుడు ఎప్పటిలాగానే తలకు నూనె రాసుకుని ముఖం కడుక్కోండి.
\v 18 అప్పుడు మీరు ఉపవాసం ఉన్నట్టు మనుషులు గమనించరు. కానీ ఎవరికీ కనిపించని మీ తండ్రి అయిన దేవుడు మీరు ఉపవాసం ఉన్నారని గమనిస్తాడు. ఎవరూ మిమ్మల్ని చూడకపోయినా ఆయన చూస్తాడు. మీకు ప్రతిఫలమిస్తాడు.
\s5
\p
\v 19 పెద్దమొత్తంలో ధనాన్నీ వస్తువులనూ స్వార్ధంతో మీకోసం భూమి మీద కూడబెట్టుకోకండి. ఎందుకంటే భూమి మీద ఉన్నదంతా నశించిపోయేదే. చెదలు బట్టలను నాశనం చేస్తాయి. లోహాలు తుప్పు పట్టి పాడైపోతాయి. దొంగలు దొంగిలిస్తారు.
\v 20 పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు.
\v 21 ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది.
\s5
\p
\v 22 “నీ శరీరానికి దీపం నీ కన్నే. కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది.
\v 23 నీ కన్ను పాడైతే నువ్వు ఇంక దేన్నీ సరిగ్గా చూడలేవు. ఇదే గనక జరుగుతూ ఉంటే కొంతకాలానికి అస్సలు ఏదీ చూడలేవు. అదే కొనసాగితే కొంత కాలానికి నువ్వసలు ఏమీ చూడలేని గుడ్డివాడివైపోతావు. పూర్తిగా చీకటిలో ఉంటావు. ఆలాగే, నువ్వు అత్యాశపరుడివిగా ఉంటే ఆత్మ సంబంధమైన అంధకారంలో ఉంటావు. నీ కళ్ళు చూసేవీ నీ మనస్సు ఆలోచించేదీ అత్యాశాపూరితమైన కోరికలతో నిండిన ఈ లోక సంపద గురించే అయితే నువ్వు చేస్తున్నదంతా దుర్మార్గమే.
\p
\v 24 ఇద్దరు యజమానులకు ఎవరూ ఒకేసారి సేవ చేయలేరు. అలా చెయ్యాలని ప్రయత్నిస్తే అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవుడికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.
\s5
\p
\v 25 “అందువల్ల నేను మీతో చెప్పేదేమంటే, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటాయో లేదోనని దిగులు పెట్టుకోకండి. మీరు తినే భోజనం కన్నా మీ జీవం గొప్పది. కట్టుకునే బట్టలకన్నామీ శరీరం గొప్పది.
\v 26 పిట్టలను చూడండి. అవి విత్తనాలు చల్లవు. పంట కోయవు, ధాన్యం నిలవ చేసుకోలేవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు ఆ పక్షుల కంటే తప్పకుండా గొప్పవాళ్ళే. మీకేది అవసరమో దేవుడు మీకు ఇస్తాడని నమ్మండి.
\s5
\p
\v 27 మీరు బెంగ పెట్టుకుంటే లాభమేమిటి? బెంగ పెట్టుకోవడం వల్ల జీవితకాలానికి ఒక్క నిమిషమైనా కలుస్తుందా. కాబట్టి దేని విషయంలోనూ దిగులు పెట్టుకోవద్దు.
\p
\v 28 కట్టుకోడానికి బట్టల గురించి కూడా మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. పువ్వులెలా పూస్తున్నాయో చూడండి. సంపాదనకై అవి పనిచేయవు. తమ బట్టలు తయారు చేసుకోలేవు.
\v 29 అయితే నేను అనేదేమిటంటే పూర్వకాలం సొలోమోను రాజు అందమైన బట్టలు ధరించేవాడు గదా, అతని బట్టలు సైతం ఈ గడ్డి పువ్వుల ముందు దిగదుడుపే.
\s5
\p
\v 30 గరిక మొక్కలు కొంచెం కాలమే ఉంటాయి. వాడిపోయాక వాటిని తగలబెట్టేస్తారు. దేవుడు వాటిని భలే ముస్తాబు చేస్తాడు గదా. అయితే గడ్డిమొక్కల కంటే మీరే ఆయనకి ఎక్కువ ఇష్టం. ఆయన మిమ్మల్నే ఎక్కువగా పట్టించుకుంటాడు. మీకు ఆపాటి నమ్మకం కూడా లేదు.
\v 31 కాబట్టి ఏమి తింటాం, ఏమి తాగుతాం, ఏమి కట్టుకుంటాం అని బెంగ పెట్టుకోకండి.
\s5
\v 32 దేవుని ఎరగని వాళ్ళు ఇలాంటి వాటి కోసం దిగులుపడుతుంటారు. అయితే పరలోకంలో ఉండే మీ తండ్రికి మీకేది అవసరమో తెలుసు.
\v 33 కాబట్టి మీ ఆలనా పాలనా చూసే దేవుని మీ వాడుగా చేసుకోవడం అనేదాన్ని మీ జీవితాల్లో అతి ముఖ్యమైనదిగా ఎంచండి. అప్పుడు ఆయన కూడా మీకు కావాల్సినవన్నీ ఇస్తాడు.
\v 34 కాబట్టి రేపు ఏమి జరుగుతుందా అని దిగులుపడొద్దు. దాని కష్టాలు దానికే ఉంటాయి. ఏ రోజు కష్టాలు ఆ రోజుకు చాలు.
\s5
\c 7
\p
\v 1 "ఇతరులు చేసిన తప్పుల గురించి పాపాల గురించి మీరు ఎప్పుడూ వేలెత్తి చూపించొద్దు. అప్పుడు దేవుడు మీ పాపాల గురించీ మాట్లాడడు.
\v 2 మీరు ఇతరులను ఖండిస్తే దేవుడు మిమ్మల్నీ ఖండిస్తాడు. మీరు ఎంతవరకు వారిని తోసిపుచ్చుతారో, దేవుడు కూడా అంతవరకు మిమ్మల్నీ తోసిపుచ్చుతాడు.
\s5
\v 3 మీలో ఎవరూ ఇతరులలో ఉన్న చిన్న చిన్న తప్పుల గురించి పట్టించుకోనక్కర లేదు. అది ఎలా ఉంటుందంటే ఎదుటివాడి కంట్లో ఒక చిన్న గడ్డిపోచను చూసినట్టుగా ఉంటుంది. కాని మీరు మాత్రం పెద్ద తప్పుల గురించి పట్టించుకుంటూ ఉండాలి. నీ కంట్లోని కొయ్య దుంగను నువ్వు చూసుకోవు.
\v 4 నీ కంట్లో పెద్ద దుంగను ఉంచుకుని నువ్వు ఇతరులతో "నీ కంట్లో నలుసు తీయనివ్వు" అని చెప్పకూడదు.
\v 5 నీ కంట్లో ఉన్న దుంగను మొదట తీసేసుకో. అప్పుడు నీ సాటిమనిషి కంట్లో ఉన్న నలుసు తీసివేయవచ్చు."
\s5
\p
\v 6 "మీపై దాడి చేసే కుక్కలకు దేవునికి చెందిన వస్తువులను ఇవ్వొద్దు. మీ ముత్యాలను పందుల ఎదుట వేయవద్దు. అలా చేస్తే అవి వాటిని కాళ్ళతో తొక్కేసి, తరువాత మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో. అలాగే, దేవుని గురించిన అద్భుతమైన సంగతులను దుర్మార్గులకు చెప్పకండి. వాళ్ళు తిరిగి మీకు హాని చేయవచ్చు."
\s5
\p
\v 7 "మీకు ఏది అవసరమో అది దేవుని అడుగుతూనే ఉండండి. ఆయన మీకు తప్పక ఇస్తాడని నమ్మండి.
\v 8 దేవుని అడిగి దాన్ని ఆయన ఇస్తాడని నమ్మే ప్రతివాడికీ అది దొరుకుతుంది.
\p
\v 9 నీ కొడుకు నిన్ను రొట్టె ఇమ్మని అడిగితే వాడికి రాయినిస్తావా?
\v 10 వాడు చేప కోసం అడిగితే పామునిస్తావా?
\s5
\v 11 మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచివి ఇవ్వాలన్న సంగతి మీకు తెలుసు. అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వాళ్ళకి అంతకంటే మంచివి కచ్చితంగా ఇస్తాడు."
\p
\v 12 "కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వాళ్ళకి చేయండి. ఎందుకంటే ధర్మశాస్త్రం, చాలా కాలం క్రితం ప్రవక్తలు రాసిన వాటి అర్థం ఇదే."
\s5
\p
\v 13-14 "పరలోకంలో దేవునితో కలిసి జీవించాలంటే చాలా కష్టం. అది చాలా కష్టమైన దారిలో వెళుతున్నట్టుగా ఉంటుంది. చాలా మంది మనుషులు నడిచే దారి ఇంకోటి ఉంది. అది చాలా విశాలంగా ఉంటుంది. కాని దానిలో ఉన్నది మరణమే. అందుకే నేను చెప్తున్నాను. పరలోకంలో దేవునితో కలిసి ఎప్పటికీ జీవించాలంటే కష్టమైన దారిలో నడిచి ఇరుకుగా ఉన్న గేటులోనుంచి ప్రవేశించాలి."
\s5
\p
\v 15 "అబద్దాలు చెప్పే వారిని జాగ్రతగా గమనించండి. దేవుడు చెప్పాడని ఏవేవో కల్పించి మీకు చెప్తుంటారు. వాళ్ళు గొర్రె తోలు కప్పుకున్న క్రూరమైన తోడేళ్ళు, మేకవన్నె పులులు.
\v 16 చెట్టుకు కాసిన పండ్లు చూసి అది ఏమి చెట్టో సులువుగా తెలుసుకోగలుగుతాం. ముళ్ళ పొదల్లో ద్రాక్షపండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూరుపండ్లు గానీ కోసుకోలేము గదా."
\p
\v 17 "ఇంకొక ఉదాహరణ. ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు పనికిమాలిన పండ్లు కాస్తుంది
\s5
\v 18 మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు.
\v 19 పనివాళ్ళు మంచి పండ్లు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తారు
\v 20 చెట్టుకు కాసిన పండ్లను చూసి అది ఏ రకమైన చెట్టో మనం తెలుసుకున్నట్టుగానే మనకెదురైన మనుషులు చేసేది చూసి వాళ్ళు మంచివారా కాదా అనేది మనం గుర్తించాలి.
\s5
\p
\v 21 చాలామంది నన్ను అలవాటుగా ప్రభూ ప్రభూ అని నా అధికారాన్ని అంగీకరించినట్టే పిలుస్తారు కాని అలా పిలిచిన ప్రతి ఒక్కరూ పరలోకంలో ప్రవేశించరు. ఎందుకంటే వాళ్ళు ఆయన ఇష్ట ప్రకారం చేసేవారు కాదు. పరలోకంలో దేవుని ఇష్ట ప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు.
\v 22 దేవుని తీర్పు రోజున చాలామంది నాతో, "ప్రభూ, ప్రభూ మేము నీ పేరున ప్రవచనాలు చెప్పలేదా? నీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామంలో చాలా అద్భుతాలు చేయలేదా?" అంటారు.
\v 23 అప్పుడు నేను "దుర్మార్గులారా, మీరెవరో నాకు తెలియనే తెలియదు. నా దగ్గర నుండి పొండి" అంటాను."
\s5
\p
\v 24 "కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు రాతి నేల మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు.
\v 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు.
\s5
\v 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు.
\v 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి. అప్పుడది కూలిపోయింది. కాబట్టి నేను చెప్పేది మీరు తప్పక వినాలి."
\s5
\p
\v 28 యేసు ఈ మాటలు చెప్పడం ముగించినప్పుడు ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు.
\v 29 ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాకుండా అధికారం గల వాడిలాగా వాళ్ళకి బోధించాడు.
\s5
\c 8
\p
\v 1 యేసు కొండ దిగి వచ్చాక ప్రజలు గుంపులుగా ఆయన్ని వెంబడించారు.
\v 2 యేసు ఆ జనాన్నివదిలి వస్తుండగా కుష్టు వ్యాధి ఉన్న ఒక రోగి వచ్చి ఆయన ముందు మోకరించాడు. అతడు యేసుతో, "ప్రభూ దయచేసి నన్ను బాగుచెయ్యి. నీకిష్టమైతే నన్ను నువ్వు స్వస్థపరచగలవు" అన్నాడు.
\v 3 అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకాడు. ఆయన అతనితో, "నిన్ను స్వస్థపరచడానికి నేను ఇష్ట పడుతున్నాను. ఇప్పుడే నిన్ను బాగుచేస్తాను" అన్నాడు. వెంటనే అతను స్వస్థపడ్డాడు.
\s5
\v 4 అప్పుడు యేసు అతనితో, "యాజకునికి తప్ప నేను నిన్ను స్వస్థపరచినట్టు ఎవరికీ చెప్పొద్దు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మోషే ఆజ్ఞాపించినట్టు కానుక చెల్లించు. అప్పుడు ప్రజలే దీని గురించి తెలుసుకుంటారు" అని చెప్పాడు.
\s5
\p
\v 5 యేసు కపెర్నహోం పట్టణానికి వెళ్ళినప్పుడు వందమంది రోమన్ సైనికులకు అధికారిగా ఉన్నవాడు యేసు దగ్గరికి వచ్చాడు. తనకు సాయం చెయ్యమని బ్రతిమాలాడు.
\v 6 ఆ అధికారి ఆయనతో, "ప్రభూ, ఇంటి దగ్గర నా పనివాడు పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. అతడు చాలా నొప్పి అనుభవిస్తున్నాడు" అన్నాడు.
\v 7 యేసు అతనితో, "నేను నీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను" అన్నాడు.
\s5
\v 8 కానీ ఆ అధికారి ఆయనతో, "నువ్వు నా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు. నా పనివాడు స్వస్థపడ్డాడని నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, అతను స్వస్థపడతాడు.
\v 9 నేను ఒక సైనికుణ్ణి. నేను నా అధికారుల ఆజ్ఞలకి లోబడాలి. అలాగే నా కింద నా ఆజ్ఞలకి లోబడే సైనికులు కూడా ఉన్నారు. వాళ్ళలో ఒకణ్ణి "వెళ్ళు" అంటే వెళ్తాడు. ఇంకొకడితో "రా" అంటే వస్తాడు. నా పనివాడితో "ఇది చెయ్యి" అంటే చేస్తాడు" అన్నాడు.
\p
\v 10 యేసు ఇది విని ఆశ్చర్యపోయాడు. తనతోపాటు నడిచే వాళ్ళతో ఆయన, "ఇది వినండి. ఇతడు యూదుడు కాకపోయినా నా మీద అతనికి ఉన్న విశ్వాసం ఇంకెవరిలోనూ, నాపై విశ్వాసం ఉంచుతారని నేను ఎదురుచూసిన ఇశ్రాయేలు వారిలో కూడా చూడలేదు.
\s5
\v 11 నేను నిజంగా చెప్తున్నాను. ఇంకా చాలా మంది యూదులు కానివాళ్ళు నాలో విశ్వాసం ఉంచుతారు. వాళ్ళు వేరు వేరు దేశాల నుండి వస్తారు. తూర్పు నుండీ, పడమర నుండీ, వస్తారు. ప్రతి వారిపై, ప్రతి దానిపై పరలోకం నుండి దేవుని పరిపాలన మొదలు కాగానే వీళ్ళందరూ వచ్చి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి విందులో కూర్చుంటారు."
\p
\v 12 "కానీ దేవుడు తాను ఏలుదామని అనుకున్న యూదుల్నినరకంలోకి తోసేస్తాడు. అక్కడ కారుచీకటి ఉంటుంది. అక్కడ వాళ్ళు పడే బాధకు ఏడుస్తూ ఉంటారు. తీవ్రమైన నొప్పితో పళ్ళు నూరుతూ ఉంటారు" అన్నాడు.
\v 13 తరవాత ఆ అధికారితో యేసు, "ఇంటికి వెళ్ళు. నువ్వు నమ్మింది నీకు జరుగుతుంది" అన్నాడు. అప్పుడు ఆ అధికారి ఇంటికి వెళ్ళి, యేసు తనతో ఆమాట చెప్పిన సమయంలోనే తన పనివాడు స్వస్థపడ్డాడని తెలుసుకున్నాడు.
\s5
\p
\v 14 యేసు, ఆయన శిష్యుల్లో కొందరు పేతురు ఇంటికి వెళ్ళారు. యేసు పేతురు అత్తగారిని చూశాడు. ఆమె జ్వరంతో పడుకుని ఉంది.
\v 15 యేసు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే ఆమెకి జ్వరం తగ్గి పోయింది. అప్పుడు ఆమె లేచి వాళ్లకు భోజనం వడ్డించింది.
\s5
\p
\v 16 ఆ సాయంత్రం విశ్రాంతి దినం గడిచి పోయినప్పుడు ప్రజలు దయ్యాలు పట్టిన వాళ్ళని, ఇతర రోగుల్ని తీసుకు వచ్చారు. ఆయన కేవలం మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగులందరినీ స్వస్థపరిచాడు.
\v 17 ఈ విధంగా యెషయా ప్రవక్త మాటలు,
\q1 "ఆయన ప్రజలను రోగాల నుండి విడిపించాడు, వాళ్ళను బాగుచేసాడు" అని రాసినవి నిజమయ్యాయి.
\s5
\p
\v 18 యేసు తన చుట్టూ ఉన్న ప్రజలను చూసి, తన శిష్యులతో పడవలో సరస్సుకు అవతలి వైపుకు తీసుకెళ్ళమన్నాడు.
\p
\v 19 వాళ్ళు పడవ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక యూదుల ధర్మశాస్త్ర పండితుడు యేసు దగ్గరికి వచ్చి ఆయనతో, "బోధకా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నేనూ అక్కడికే వచ్చి, నీతోనే ఉంటాను" అన్నాడు.
\v 20 యేసు జవాబిస్తూ, "నక్కలకి గుంటలు ఉంటాయి, పిట్టలకి గూళ్ళు ఉంటాయి. నేను మనుష కుమారుణ్ణి అయినా నాకు తల వాల్చుకునే స్థలం కూడా లేదు" అన్నాడు.
\s5
\p
\v 21 తరవాత యేసును అనుసరించే వాళ్ళల్లో ఒకడు, "ప్రభూ, ముందు ఇంటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వు. మా నాన్న చనిపోయాక పాతిపెట్టి , ఆ తరవాత నేను నీతో వస్తాను" అన్నాడు.
\v 22 కానీ యేసు అతనితో, "నాతో ఇప్పుడే రా. చనిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళని, వాళ్ళ మనుషులు చనిపోయే వరకూ ఎదురు చూడనివ్వు" అన్నాడు.
\s5
\p
\v 23 తరవాత యేసు పడవ ఎక్కాడు. శిష్యులు ఆయన్ని వెంబడించారు.
\v 24 అకస్మాత్తుగా బలంగా గాలి వీచింది. పెద్ద అలలు రావడంతో పడవలోకి నీరు చేరి పడవ నిండిపోసాగింది. యేసు నిద్రపోతున్నాడు.
\v 25 శిష్యులు వెళ్ళి ఆయన్ని లేపి ఆయనతో, "ప్రభూ, రక్షించు. మేము మునిగిపోతున్నాం" అన్నారు.
\s5
\v 26 ఆయన వాళ్ళతో, "భయమెందుకు? నేను మిమ్మల్ని రక్షిస్తానని మీరు పూర్తిగా నమ్మడం లేదు" అన్నాడు. ఆయన లేచి గాలిని గద్దించి, అలలకు సద్దుమణిగి పొమ్మని చెప్పాడు. వెంటనే గాలి ఆగిపోయింది, అలలు ఎగిసి పడటం ఆగిపోయింది.
\v 27 పడవలోని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు "ఈయన అసాధ్యుడు! ప్రకృతి సైతం ఈయన మాట వింటున్నది. గాలీ నీళ్ళు కూడా ఆయనకి లోబడుతున్నాయి" అనుకున్నారు.
\s5
\p
\v 28 వాళ్ళు సరస్సుకు తూర్పు వైపుకు చేరుకున్నారు. గదరేనీ ప్రాంతం వారు నివసించే చోటికి వచ్చారు. అక్కడ దయ్యం పట్టిన ఇద్దరు వ్యక్తులు ఊరి బయట సమాధి గుహల్లో ఉంటున్నారు. వాళ్ళు అటు వచ్చిన వాళ్ళపై దాడి చేసేవారు. ఆ దారిలో ఎవరూ ప్రయాణించే ధైర్యం చెయ్యడం లేదు.
\v 29 వాళ్ళు యేసును చూసి, అకస్మాత్తుగా కేకలు పెడుతూ "నువ్వు దేవుని కుమారుడివి. నీకూ మాకూ ఏం సంబంధం? మమ్మల్ని వదిలెయ్యి. దేవుడు మమ్మల్ని శిక్షించక ముందే మమ్మల్ని నువ్వు వేధించడానికి వచ్చావా?" అన్నారు.
\s5
\p
\v 30 అక్కడ దగ్గరలో పందుల మంద మేస్తూ ఉంది.
\v 31 ఆ దయ్యాలు , "నువ్వు ఎలాగూ మమ్మల్ని వీళ్ళల్లో నుండి బయటికి పంపించి వేస్తావు కాబట్టి ఆ పందుల్లోకి వెళ్లనివ్వు" అని యేసును బ్రతిమాలాయి.
\v 32 యేసు వాటితో "మీకు అదే కావాలంటే అలాగే, పొండి" అన్నాడు. అప్పుడు దయ్యాలు ఆ ఇద్దరు వ్యక్తుల్ని వదిలి పందుల్లోకి దూరాయి. అప్పుడు ఉన్నట్టుండి ఆ పందుల మంద దొర్లుకుంటూ పోయి కొండ వాలులో ఉన్న లోతైన నీటిలో పడి మునిగి చచ్చాయి.
\s5
\p
\v 33 ఆ పందుల్ని కాసేవాళ్ళు బెదిరిపోయారు. ఊళ్ళోకి వెళ్ళి దయ్యం పట్టిన ఆ ఇద్దరు మనుషులకి జరిగిన విషయంతో సహా అక్కడ జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పారు.
\v 34 అప్పుడు ఆ ఊరి వాళ్ళంతా యేసును కలవడానికి వచ్చారు. వాళ్ళు ఆయన్ని, ఆ దయ్యాల అదుపు నుండి బయటపడిన వ్యక్తుల్ని చూసినప్పుడు వాళ్ళు యేసును ఆ ప్రాంతం వదిలి పొమ్మని బ్రతిమాలారు.
\s5
\c 9
\p
\v 1 యేసు, ఆయన శిష్యులు పడవ ఎక్కారు. వారు ఉంటున్న కపెర్నహోము నుండి సరస్సు అవతల వైపుకు వెళ్ళారు.
\v 2 అక్కడ పక్షవాతం వచ్చిన మనిషిని పరుపు పైన కొందరు మనుషులు తీసుకువచ్చారు. తాను ఆ పక్షవాత రోగిని స్వస్థపరుస్తాడనే విశ్వాసం వాళ్లకు ఉన్నదని గ్రహించిన యేసు, "అబ్బాయ్, ధైర్యం తెచ్చుకో. నేను నీ పాపాలు క్షమిస్తున్నాను" అన్నాడు.
\s5
\v 3 యూదు పండితుల్లో కొందరు తమలో తాము "తాను దేవుడినని అనుకుంటున్నాడా ఏమిటి. ఇతడు పాపాలనెలాక్షమిస్తాడు?" అనుకున్నారు.
\p
\v 4 వాళ్ళ ఆలోచనలు తెలుసుకున్న యేసు "మీరు చెడు ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు?
\v 5 ఏది సులువు? నీ పాపాలు క్షమించాను అనడమా? నువ్వు లేచి నడువు అని చెప్పడమా?
\v 6 పాపాలు క్షమించడానికి మనుష్య కుమారుడికి, అంటే నాకు దేవుడు అధికారం ఇచ్చాడని మీరు తెలుసుకొనేలా చేస్తాను" అని, ఆ పక్షవాత రోగితో, "లేచి నీ పరుపు తీసుకొని ఇంటికి వెళ్ళు" అన్నాడు.
\s5
\v 7 వెంటనే ఆ మనిషి లేచి, తన పరుపు చుట్టుకుని వెళ్ళిపోయాడు.
\v 8 జన సమూహం ఇది చూసి అవాక్కయ్యారు. మనుషులకు అలాంటి అధికారం ఇస్తున్నందుకు దేవుని స్తుతించారు.
\p
\v 9 అక్కడి నుండి యేసు వెళ్ళిపోతూ, "మత్తయి" అనే పేరు గల మనిషిని చూశాడు. రోమన్ ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసే బల్ల దగ్గర అతను కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో "నాతో రా, నా శిష్యుడిగా ఉండు" అన్నాడు. అప్పుడు మత్తయి లేచి ఆయనతో వెళ్ళాడు.
\s5
\p
\v 10 యేసు, ఆయన శిష్యులు ఒక ఇంట్లో భోజనానికి కూర్చుని ఉన్నారు. వాళ్ళు తింటూ ఉండగా వాళ్ళతో పాటు చాలా మంది పన్ను వసూలుదార్లూ ఇతరులూ భోజనం చేస్తూ ఉన్నారు.
\v 11 పరిసయ్యులు అది చూసి, శిష్యులతో, "మీ బోధకుడు అలాంటి పన్ను వసూలుదార్లతో, తక్కిన వాళ్లతో స్నేహంగా భోజనం చేయడం బాగోలేదు" అన్నారు.
\s5
\v 12 వాళ్ళు అన్నది యేసు విని వాళ్ళకి ఈ ఉదాహరణ చెప్పాడు. "జబ్బు పడ్డ వాళ్ళకే డాక్టర్ అవసరం కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్లకి కాదు.
\v 13 "బలులు అర్పించడమే కాదు, మనుషుల పట్ల కనికరం చూపండి" అనే మాటల అర్థం తెలుసుకోండి. మేము నీతిమంతులం అనుకునే వాళ్ళు పాప జీవితాలను వదిలి నా దగ్గరికి రమ్మని పిలవడానికి నేను రాలేదు. మేము పాపులం అని తెలుసుకున్న వాళ్ళని పిలవడం కోసం వచ్చాను. ఇది మనస్సులో పెట్టుకోండి."
\s5
\p
\v 14 బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు వచ్చి "మేము పరిసయ్యులు తరచుగా దేవుని మెప్పించడం కోసం ఉపవాసం ఉంటాం. మరి మీ శిష్యులు చెయ్యరెందుకు?" అని అడిగారు.
\v 15 యేసు జవాబిస్తూ, "పెళ్ళి వేడుకల్లో పెళ్ళికొడుకు తన స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళు విలపించరు. అవునా? ఎందుకంటే ఆ సమయంలో వారికి విచారం ఉండదు. కానీ పెళ్ళికొడుకు వాళ్ళను వదిలి వెళ్ళిపోయినప్పుడు విచారంగా ఉంటారు. కాబట్టి ఉపవాసం ఉంటారు."
\s5
\p
\v 16 "చిరుగు పూడ్చడానికి కొత్త గుడ్డకు పాత గుడ్డ అతుకు వెయ్యొద్దు. అలా చేస్తే ఆ బట్ట ఉతికినప్పుడు కుచించుకుపోయి, బట్టను చింపేస్తుంది. ఆ చినుగు పెద్దదవుతుంది.
\s5
\v 17 అలాగే పాత చర్మంతో చేసిన సంచుల్లో కొత్త ద్రాక్షరసం పొయ్యరు. అలా చేస్తే ఆ ద్రాక్షరసం పులిసి వ్యాకోచించినప్పుడు సంచులు సాగి పిగిలిపోతాయి. ఆ ద్రాక్షరసం సారాయిగా మారుతున్నప్పుడు ఆ ద్రాక్ష సంచులు చిల్లులుపడి రసం కారిపోతుంది. తాజా ద్రాక్షరసం కొత్త సంచుల్లో పోస్తే అది పులిసినప్పుడు ఆ సంచులు సాగుతాయి. ఈ రకంగా రసమూ సంచులూ రెండూ భద్రంగా ఉంటాయి" అన్నాడు.
\s5
\p
\v 18 యేసు ఇలాచెబుతున్నప్పుడు ఊరి అధికారి ఒకడు ఆయన ఎదుటికి వచ్చి కాళ్ళపై పడ్డాడు. ఆయనతో, "నా కూతురు ఇప్పుడే చనిపోయింది. కానీ నువ్వు వచ్చి ఆమెపై చేతులు వేస్తే, ఆమె బ్రతుకుతుంది" అన్నాడు.
\v 19 యేసు లేచి తన శిష్యులతో కలిసి అతనితో వెళ్ళాడు.
\s5
\p
\v 20 అప్పుడు పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసుకు దగ్గరగా వచ్చింది. వెనకగా వచ్చి ఆయన వేసుకున్న అంగీ అంచు తాకింది.
\v 21 ఆమె "ఆయన వస్త్రం తాకితే చాలు, నేను స్వస్థపడతాను" అనుకుంది.
\v 22 అప్పుడు యేసు తనను ఎవరు తాకారో అని చుట్టూ చూశాడు. ఆయన ఆ స్త్రీని చూసి ఆమెతో, "అమ్మా, ధైర్యంగా ఉండు. నేను నిన్ను బాగుచేస్తానని నువ్వు నమ్మావు కాబట్టి నిన్ను స్వస్థపరిచాను" అన్నాడు. ఆ క్షణంలోనే ఆమె బాగుపడింది.
\s5
\p
\v 23 యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి సమాధి చేసే సమయంలో సంగీతం వాయించే వాళ్ళను, చనిపోయిన అమ్మాయి కోసం శోకాలు పెడుతున్న వాళ్ళను చూశాడు.
\v 24 "ఈ శోకాలు, సంగీతం చాలించండి. వెళ్ళిపొండి. ఈ అమ్మాయి చనిపోలేదు, నిద్రపోతూ ఉంది, అంతే" అన్నాడు. అక్కడ ఉన్నవాళ్ళకి ఆ అమ్మాయి చనిపోయిందని తెలుసు గనక ఆయన్ని చూసి నవ్వారు.
\s5
\v 25 యేసు వాళ్ళందర్నీ బయటికి పంపేసి, ఆ అమ్మాయి పడుకుని ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆ అమ్మాయి బ్రతికి లేచి కూర్చుంది.
\v 26 ఆ ప్రాంత ప్రజలంతా ఈ వార్త విన్నారు.
\s5
\p
\v 27 యేసు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా ఇద్దరు గుడ్డివాళ్ళు "దావీదు కుమారా, మాపై దయ చూపు, మమ్మల్ని బాగుచెయ్యి" అని కేకలేస్తూ వెంటబడ్డారు.
\v 28 యేసు ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఆ గుడ్డివాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. యేసు "నేను మిమ్మల్ని స్వస్థపరచగలనని మీరు అనుకుంటున్నారా?" అని అడిగాడు. వాళ్ళు ,"ఔను ప్రభూ" అన్నారు.
\s5
\v 29 అప్పుడు ఆయన వాళ్ళ కళ్ళు ముట్టుకుని, "మీ కళ్ళు నేను బాగు చెయ్యగలనని మీరు నమ్మారు కాబట్టి బాగుచేస్తున్నాను" అన్నాడు.
\v 30 వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. వాళ్ళు ఆయన్ని చూడగలిగారు. ఆయన "మిమ్మల్ని బాగుచేసిన ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు" అని గట్టిగా చెప్పాడు.
\v 31 కానీ వాళ్ళు బయటికి పోయి ఆ ప్రాంతమంతా ఈ విషయాన్ని చాటించారు.
\s5
\p
\v 32 ఆ ఇద్దరూ వెళ్తుండగానే మూగ దయ్యం వశపర్చుకున్న ఒకడిని కొందరు ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు.
\v 33 యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మనిషి మాట్లాడడం మొదలుపెట్టాడు. జన సమూహం ఇది చూసి ఆశ్చర్యపోతూ "ఇశ్రాయేలులో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాటి అద్భుతం చూడలేదు" అని చెప్పుకున్నారు.
\v 34 పరిసయ్యులు మాత్రం, "దయ్యాల రాజు సాతానే, దయ్యాలను వదిలించడానికి ఇతనికి అధికారం ఇచ్చాడు" అన్నారు.
\s5
\p
\v 35 తరువాత యేసు, ఆయన శిష్యులు గలిలయ లోని చాలా గ్రామాలకు వెళ్ళారు. పరలోకం నుండి దేవుని ఏలుబడి గురించిన శుభవార్త ప్రకటిస్తూ సమాజ మందిరాలలో యేసు బోధించాడు. ఆయన ప్రజల్లో ఉన్న రకరకాల వ్యాధుల్ని కూడా స్వస్థపరిచాడు.
\v 36 జన సమూహాన్ని ఆయన చూసినప్పుడు వాళ్ళంతా కలతగా దిగాలుగా ఉండడం చూసి జాలిపడ్డాడు. వాళ్ళు కాపరిలేని గొర్రెల్లా ఉన్నారు.
\s5
\p
\v 37 తరువాత ఆయన తన శిష్యులతో, "నా సందేశం వినడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు పంట కోతకు సిద్ధంగా ఉన్న పొలం వంటివాళ్ళు. కానీ ఆ పంట కోసి సమకూర్చడానికి ఎక్కువమంది లేరు.
\v 38 కాబట్టి ప్రభువైన దేవుని ఇంకా కోత పనివాళ్ళని పంపమని ప్రార్థన చెయ్యండి" అన్నాడు.
\s5
\c 10
\p
\v 1 యేసు తన పన్నెండుమంది శిష్యులను తన దగ్గరికి పిలిచాడు. మనుషులను అదుపులో పెట్టుకొనే దురాత్మల్ని వదిలించే శక్తినీ, అన్ని రకాల జబ్బులతో బాధపడుతున్న వాళ్ళని స్వస్థ పరిచే అధికారాన్నీ వాళ్ళకి ఇచ్చాడు.
\s5
\v 2 ఆయన పిలిచిన పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఇవి- పేతురు అనే కొత్త పేరు పొందిన సీమోను, పేతురు తమ్ముడు అంద్రెయ, జెబెదయి కొడుకు యాకోబు, అతని తమ్ముడు యోహాను,
\v 3 ఫిలిప్పు, బర్తోలోమయి, తోమా, పన్ను వసూలుదారుడు మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి,
\v 4 తీవ్ర వాది సీమోను, ద్రోహబుద్ధితో యేసును అధికారులకు పట్టిచ్చిన ఇస్కరియోతు యూదా.
\s5
\p
\v 5 వేరు వేరు చోట్ల శుభవార్త ప్రకటించడానికి ఆ పన్నెండు మంది అపొస్తలుల్ని పంపే ముందు యేసు ఈ సూచనలు ఇచ్చాడు. "యూదులు కానివారు ఉండే చోటికీ సమరయులుండే చోటికీ పోవద్దు.
\v 6 గొర్రెల కాపరి లేక చెదిరిపోయిన గొర్రెల్లా ఉన్న ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళండి.
\v 7 వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు పరలోకం నుండి దేవుడు తొందరలో ఏలడం మొదలు పెడతాడు అని చెప్పండి.
\s5
\v 8 రోగుల్ని స్వస్థపరచండి, చనిపోయిన వాళ్ళను బ్రతికించండి. కుష్టురోగుల్ని బాగుచేసి మళ్ళీ సమాజంలో కలిసేలా చెయ్యండి. దయ్యాల అదుపులో ఉన్నవాళ్ళను విడిపించండి. దేవుడు మీకు ఉచితంగా సాయం చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా ప్రజలకి ఉచిత సాయం చెయ్యండి.
\v 9 మీతో డబ్బులు తీసుకు పోవద్దు.
\v 10 చేతిసంచీ, అదనంగా చెప్పుల జత, చేతికర్రా కూడా తీసుకు పోవద్దు. పనిచేసే ప్రతివాడూ జీతం తీసుకుంటాడు కదా. అలాగే మీరు వెళ్ళిన వాళ్ళ దగ్గర భోజనం తినే అర్హత మీకు ఉంది."
\s5
\p
\v 11 "మీరు ప్రవేశించిన ఊళ్ళో మిమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానించే వాళ్ళను చూసుకోండి.
\v 12 మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్లకి మేలు చెయ్యమని దేవుని అడగండి. మీరు ఆ ఊరు వదిలి పోయే దాకా ఆ ఇంట్లోనే ఉండండి.
\v 13 మిమ్మల్ని ఆ ఇంటివాళ్ళు సంతోషంతో రానిస్తే దేవుడు నిజంగా వాళ్లకి మేలు చేస్తాడు. కాని వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా అంగీకరించకపోతే వాళ్ళకు మీ ప్రార్థన ఏమాత్రం సాయపడదు. దేవుడు వాళ్లకి మేలు చేయడు.
\s5
\v 14 ఏ ఇంటి వాళ్లైనా మిమ్మల్ని రానివ్వకపోతే మీ మాటల్ని ఒప్పుకోకపోతే అక్కడినుంచి వెళ్ళిపొండి. వెళ్ళే ముందు మీ కాలి దుమ్ము అక్కడ దులిపేయండి. అలా చెయ్యడంలో వాళ్ళు మిమ్మల్ని తిరస్కరించినట్టే దేవుడు కూడా వాళ్ళను తిరస్కరిస్తాడని హెచ్చరించండి."
\p
\v 15 "ఇది జాగ్ర్రత్తగా గుర్తుంచుకోండి. దేవుడు మనుషులందరికీ తీర్పు తీర్చేటప్పుడు సొదొమ, గొమొర్రా పట్టణాల్లోని చెడ్డవాళ్లను శిక్షిస్తాడు. కానీ మిమ్మల్ని తిరస్కరించిన వాళ్లకి పడే శిక్ష ఇంకా తీవ్రంగా ఉంటుంది."
\s5
\p
\v 16 "గమనించండి. తోడేళ్ళ వంటి మనుషుల మధ్యకు అమాయకమైన గొర్రెల్లా మిమ్మల్ని పంపుతున్నాను. పాముల్లాగా చురుకుగా ఉండండి. పావురాల్లాగా సాధు జీవులుగా ఉండండి.
\v 17 మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బంధించి, న్యాయ స్థానాలకు అప్పగించి, న్యాయ విచారణకు గురి చేస్తారు. సమాజమందిరాల్లో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు.
\v 18 మీరు నాకు చెందినవాళ్ళు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని రాజుల దగ్గరికీ గవర్నర్ల దగ్గరికీ తీసుకు వెళ్ళి విచారణ జరిపి శిక్ష విధిస్తారు. కానీ మీరు నా గురించి యూదులు కాని వాళ్లకీ పాలకులకీ సాక్ష్యమిస్తారు.
\s5
\p
\v 19 వాళ్ళు మిమ్మల్ని బంధించినప్పుడు ఏమి చెప్పాలీ అని కంగారు పడొద్దు. మీరు ఏమి చెప్పాలో అప్పటికప్పుడు మీకు తెలుస్తుంది.
\v 20 అది మీరు అనుకోవడం వల్ల కాదు, మీ పరలోకపు తండ్రి ఆత్మ మీకు తెలిపినది మీరు మాట్లాడతారు."
\s5
\p
\v 21 "నాలో విశ్వాసం ఉంచినందుకు అధికారులు మీకు మరణ శిక్ష విధిస్తారు. మనుషులు తమ సోదరులకు ఇలా చేస్తారు. తండ్రులు తమ పిల్లలకి చేస్తారు. పిల్లలు తలిదండ్రులపై తిరుగుబాటు చేస్తారు. అది వాళ్ళ చావుకు దారి తీస్తుంది.
\v 22 నన్ను నమ్మినందుకు చాలామంది మిమ్మల్ని ద్వేషిస్తారు. కానీ ఎవరైనా చనిపోయేంత వరకూ నమ్మకంగా నాలో విశ్వాసం ఉంచితే దేవుడు వాళ్ళని రక్షిస్తాడు.
\v 23 ఇది గుర్తుంచుకోండి. ఒక ఊరి వాళ్ళు మిమ్మల్ని హింసిస్తూ ఉంటే ఇంకొక ఊరికి వెళ్ళిపొండి. ఒక ఊరినుండి ఇంకొక ఊరికి వెళ్తూ నా గురించి చెప్పడం పూర్తయ్యే లోపలే మనుష్య కుమారుణ్ణి అయిన నేను తిరిగి వస్తాను."
\s5
\p
\v 24 "గురువు కంటే గొప్పవాణ్ణని శిష్యుడు అనుకోకూడదు. యజమానికంటే సేవకులు ఎక్కువ కాదు.
\v 25 గురువు కన్నా విద్యార్థి మెరుగైన వాడుగా ఉంటాడని ఎవరూ అనుకోరు గదా! అలాగే నేను మీ యజమానిని, గురువును. మనుషులు నన్ను హింసించారు కాబట్టి మిమ్మల్ని కూడా హింసిస్తారనే మీరు అనుకోవాలి. వాళ్ళ దృష్టిలో సాతాను ఇంటికి నేను యజమానిని. నా పట్ల వాళ్ళు అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే మీ విషయంలో మరింకెంత దుర్మార్గంగా ఉంటారో గదా!"
\s5
\p
\v 26 "వాళ్ళ గురించి మీకు భయంవద్దు. కప్పిపెట్టిన ప్రతిదీ బయట పడకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు.
\v 27 భయపడడానికి బదులుగా రాత్రిపూట చెప్పినట్టు నేను రహస్యంగా మీతో చెప్పింది మనుషులు పగలు చేసే పనుల్లా బాహాటంగా చెప్పండి. మనుషులు గుసగుసలుగా చెప్పుకున్నట్టు నేను ఏకాంతంలో చెప్పినవి ఇల్లెక్కి ప్రచారం చెయ్యండి."
\s5
\p
\v 28 "శరీరాన్ని చంపే వాళ్లకు భయపడకండి. వాళ్ళు మీ ఆత్మను నాశనం చేయలేరు. కానీ నరకంలో మీ శరీరాన్నీ ఆత్మనూ కూడా దేవుడు నాశనం చేయగలడు కాబట్టి ఆయనకి భయపడండి.
\v 29 పిచ్చుకలు చూడండి. రెండు పైసలకు రెండు పిచ్చుకలు కొనొచ్చు. వాటి విలువ చాలా తక్కువే. కానీ పరలోక తండ్రి అయిన నీ దేవుడికి తెలియకుండా ఏ పిచ్చుకైనా నేలరాలదు. ఆయనకు తెలియనిదేమీ లేదు.
\v 30 నీ గురించి కూడా అంతా తెలుసు. నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకి తెలుసు.
\v 31 పిచ్చుకల కంటే నిన్ను విలువైన వాడిగా దేవుడు చూస్తాడు. కాబట్టి చంపుతానని బెదిరించే వాళ్లకి భయపడకండి."
\s5
\p
\v 32 "ఎవరైనా నాకు చెందిన వాళ్ళుగా చెప్పుకోడానికి ఇష్టపడితేనే నేను కూడా పరలోక తండ్రి అయిన దేవుడికి నాకు చెందిన మనుషులుగా వాళ్ళ గురించి చెప్తాను.
\v 33 కానీ నాకు చెందిన మనుషులని ఇతరులకి చెప్పుకోడానికి భయపడే వాళ్ళ గురించి నేను కూడా పరలోకంలో నా తండ్రి దగ్గర వాళ్ళు నా వాళ్ళు కాదని చెప్తాను."
\s5
\p
\v 34 "మనుషులు ప్రశాంతంగా ఉండేలా చేయడానికి నేను భూమికి వచ్చానని అనుకోవద్దు. నేను వచ్చిన కారణంగా నన్ను వెంబడించే కొందరు చనిపోతారు.
\v 35 నేను భూమికి వచ్చినందువల్ల నాపై విశ్వాసం ఉంచని వాళ్ళు నాపై విశ్వాసం ఉంచిన వాళ్లకు వ్యతిరేకమౌతారు. ఉదాహరణగా కొందరు తమ తండ్రులకు వ్యతిరేకమౌతారు, కొందరు తమ కూతుళ్ళకు వ్యతిరేకమౌతారు. కొందరు కోడళ్ళు వాళ్ళ అత్తలకు వ్యతిరేకమౌతారు.
\v 36 ఒకే ఇంట్లో సభ్యులు వాళ్ళల్లో వాళ్ళే శత్రువులౌతారు."
\s5
\p
\v 37 "నాకంటే ఎక్కువగా తమ తలిదండ్రుల్ని ప్రేమించే వాళ్ళకు నా వాళ్ళు అయ్యే అర్హత లేదు.
\v 38 నా సంబంధిగా చనిపోవడానికి సిద్ధంగా లేకపోతే నా వాడుగా ఉండే అర్హత నీకు లేదు.
\v 39 చావు తప్పించుకోడానికి నన్ను తిరస్కరిస్తే అలాటి వాళ్ళకు నిత్య జీవం లేదు. నాపై విశ్వాసం ఉంచి అందుకోసం ప్రాణాలు వదులుకోడానికి ఇష్టపడితే వాళ్ళు దేవునితో నిత్యం జీవిస్తారు."
\s5
\p
\v 40 "మిమ్మల్నిఆహ్వానించే ప్రతివాడు నన్ను ఆహ్వానించినట్టే. నన్ను ఆహ్వానించే ప్రతివాడు దేవుని ఆహ్వానించినట్టే.
\v 41 ప్రవక్త అని ప్రవక్తను ఆహ్వానించే వాళ్ళకు ఆ ప్ర్రవక్తకు దేవుని నుండి దక్కే ప్ర్రతిఫలం దక్కుతుంది. నీతిమంతుడని తెలుసుకుని నీతిమంతుణ్ణి ఆహ్వానించే వాళ్ళంతా ఆ నీతిమంతుడు పొందే ప్ర్రతిఫలాన్నే పొందుతారు."
\s5
\p
\v 42 "ఇది గమనించుకోండి. మీరు ప్రాముఖ్యమైన వాళ్ళు కానప్పటికీ మీరు నా శిష్యుల్లో ఒకరు కాబట్టి మీకు దాహంగా ఉన్నప్పుడు చూసి ఎవరైనా మీకు తాగడానికి చల్లని నీళ్ళు ఇస్తే, అలా చేసిన వాళ్లకి దేవుడు తప్పక ప్రతిఫలం ఇస్తాడు."
\s5
\c 11
\p
\v 1 యేసు తన పన్నెండు మంది శిష్యులకి సూచనలు ఇవ్వడం ముగించిన తరువాత ఆయన వాళ్ళను వివిధ ఇశ్రాయేలీ పట్టణాలకు పంపించాడు. తక్కిన ఇశ్రాయేలీ పట్టణాల్లో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో బోధించి, నేర్పించడానికి ఆయన స్వయంగా వెళ్ళాడు.
\p
\v 2 బాప్తిసమిచ్చే యోహాను జైల్లో ఉండి క్రీస్తు చేస్తున్నవన్నీ విన్నాడు. తన శిష్యుల్లో కొందరిని ఆయన దగ్గరికి పంపించాడు.
\v 3 "ప్రవక్తలు వస్తాడని చెప్పిన క్ర్రీస్తువు నువ్వేనా? లేకపోతే ఇంకొకరి కోసం మేము కనిపెట్టాలా?" అని అడిగించాడు.
\s5
\p
\v 4 యోహాను శిష్యులతో యేసు, "మీరు వెళ్ళి ప్రజలు నా గురించి చెప్పుకుంటూ ఉండగా మీరు విన్నవీ నేను చేయగా మీరు చూసినవీ యోహానుకి చెప్పండి.
\v 5 కుంటివాళ్ళు నడుస్తున్నారు. గుడ్డివాళ్ళు చూస్తున్నారు. కుష్ఠు రోగులు స్వస్థపడుతున్నారు. చెవిటి వాళ్ళు వింటున్నారు. చనిపోయిన వాళ్ళు బతుకుతున్నారు. పేదలకు దేవుని శుభవార్త ప్రకటన జరుగుతున్నది.
\v 6 యోహానుతో ఇది కూడా చెప్పండి, నాలో విశ్వాసం పోగొట్టుకోకుండా ఉండే వాళ్ళను చూసి దేవుడు సంతృప్తిపడతాడు. ఎందుకంటే నేను చేసేది క్రీస్తు ఏమి చెయ్యాలని వాళ్ళనుకుంటున్నారో అది కాదు" అని చెప్పాడు.
\s5
\p
\v 7 యోహాను శిష్యులు వెళ్ళిపోయాక యేసు యోహాను గురించి ప్రజలతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన వాళ్ళతో, "యోహానును చూడడానికి మీరు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు మీరు ఏమి చూడాలనుకున్నారు? ఎత్తుగా పెరిగి గాలికి ఊగుతున్న గడ్డిని చూడడానికి అక్కడికి మీరు వెళ్ళలేదు. ఔనా?
\v 8 ఎలాంటి వ్యక్తిని చూడాలనుకుని మీరు వెళ్ళారు? ఖరీదైన బట్టలు వేసుకున్న వాణ్ణి చూడడానికి మాత్రం కచ్చితంగా కాదు. అలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళు రాజులు ఉండే కోటల్లో ఉంటారని మీకు బాగా తెలుసు."
\s5
\p
\v 9 "మరి ఎలాంటి వాణ్ణి చూడాలనుకున్నారు? ప్రవక్తనా? ఔను. నిజమే, కానీ మీకు ఒక సంగతి చెప్పాలి. యోహాను మామూలు వ్యక్తి కాదు.
\v 10 దేవుడు రాయించిన లేఖనాల్లో,
\q "ఇది గమనించండి. నీ రాక కోసం ప్రజల్ని సిద్ధ పరచడానికి
\q నీకంటే ముందుగా నా వార్తాహరుణ్ణి పంపుతున్నాను" అని ఎవరి గురించి రాసారో అతడే ఈ యోహాను."
\s5
\p
\v 11 "ఇది గమనించండి. బాప్తిసమిచ్చే యోహాను కంటే ఇంతవరకు ఈ లోకంలో పుట్టిన వాళ్ళెవ్వరూ గొప్పవాళ్ళు కాదు. కానీ ఆయన రాజ్యంలో ముఖ్యం కాకపోయినా పరలోకం నుండి దేవుడు ఎవరినైతే ఏలుతున్నాడో ఆ వ్యక్తి దేవుని దృష్టిలో యోహాను కంటే గొప్పవాడు.
\v 12 బాప్తిసమిచ్చే యోహాను బోధించిన కాలం నుండి ఇంతవరకు కొందరు వాళ్ళ సొంత పద్ధతిలో పరలోకం నుండి దేవుడు తమను ఏలాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయోజనం కోసం వాళ్ళు తమ సొంత శక్తిని వాడుతున్నారు."
\s5
\p
\v 13 "బాప్తిసమిచ్చే యోహాను కాలం వరకు అతని గురించి నేను చెప్తూ ఉన్నదంతా ధర్మశాస్త్రం చెప్పిందీ ప్రవక్తలు రాసిందీ మాత్రమే. అది మీరు చదవొచ్చు.
\v 14 అంతేకాదు, ఇది మీరు అర్థం చేసుకోవాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటే మీకు చెప్తున్నాను. నిజానికి యోహాను భవిష్యత్తులో రావాల్సిన రెండవ ఏలీయా.
\v 15 ఇది మీకు అర్థం కావాలంటే నేను చెప్పింది జాగ్రత్తగా ఆలోచించండి."
\s5
\p
\v 16 "ఇప్పుడున్న మీరూ ఇంకా ఇతరులు వీధుల్లో ఆటలాడుకునే పిల్లల్లాగా ఉన్నారు. వాళ్ళు ఒకరితో ఒకరు
\v 17 "మీకోసం వేణువు మీద ఉషారు పాట వాయించాం, కాని మీరు చిందులెయ్యలేదు. ఏడుపు పాట వాయించాం, కాని మీరు ఏడవలేదు" అంటారు."
\s5
\p
\v 18 "ఇవి మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు యోహానును చూసినా నన్ను చూసినా తృప్తి లేదు. యోహాను వచ్చి మీకు బోధిస్తున్నప్పుడు అతడు అందరిలాగా మంచి భోజనం తినడం లేదు, ద్రాక్షరసం తాగడం లేదు అన్నారు. అతన్ని తిరస్కరించి దయ్యం పట్టినవాడు అన్నారు.
\v 19 యోహానులా కాకుండా మనుష్య కుమారుణ్ణి అయిన నేను మీరు తినే భోజనమే తింటున్నాను, మీలా ద్రాక్షరసం తాగుతున్నాను. కాని నన్ను కూడా మీరు తిరస్కరించి, "చూడండి, ఇతడు తిండిబోతు, తాగుబోతు. పన్ను వసూలుదారులూ పాపులూ అతని స్నేహితులు" అంటారు. కానీ ఎవడైనా నిజంగా తెలివైన వాడైతే, మంచి పనులు చేయడంలో తెలివితేటలు చూపిస్తాడు" అన్నాడు.
\s5
\p
\v 20 యేసు ఎక్కువగా అద్భుతాలు చేసిన పల్లెల్లో ప్రజలు ఇంకా దేవుని వైపు తిరగడం లేదు. కాబట్టి ఆయన వాళ్ళను గద్దిస్తూ
\v 21 "కొరాజీను బేత్సయిదా ప్రజలారా! మీ స్థితి ఎంతో ఘోరం. మీ వీధుల్లో నేను గొప్ప అద్భుతాలు చేసాను. కానీ మీరు పాపం చేయడం మానలేదు. ఎప్పటినుండో ఇక్కడ చేసినవే తూరు, సీదోనుల్లో చేసినట్టైతే అక్కడి పాపులు కచ్చితంగా పాపం చేయడం మానేసేవారు. పాపం చేసినందుకు పాతబట్టలు కట్టుకుని, బూడిదలో కూర్చుని విచారం వెళ్ళబుచ్చే వాళ్ళు.
\v 22 మీకు చెప్తున్నాను. దేవుడు తూరు, సీదోను పట్టణాల్లో ఉన్న చెడ్డవాళ్ళను శిక్షిస్తాడు కానీ ఆయన మనుషులపై తీర్పు ఇచ్చేటప్పుడు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా శిక్షిస్తాడు."
\s5
\p
\v 23 "కపెర్నహోం పట్టణంలో నివసించే వాళ్లకు కూడా నేను చెప్పాల్సింది ఉంది. ఇతరులు నిన్ను పొగిడినట్టు నువ్వు తిన్నగా పరలోకం వెళ్తావని అనుకుంటున్నావా? అది జరగదు. చనిపోయిన తరవాత దేవుని శిక్షగా నువ్వు పాతాళానికి పోతావు. చాలా కాలం క్రితం నేను సొదొమలో ఇవే అద్భుతాలు చేసి ఉన్నట్టయితే అక్కడి చెడ్డవాళ్ళు పాపం చెయ్యడం తక్షణం మానేసే వారు. మీరు మాత్రం పాపం చెయ్యడం మానలేదు.
\v 24 నేను ఇంకా చెప్తున్నాను. సొదొమలో ఉన్న చెడ్డవాళ్లను దేవుడు శిక్షిస్తాడు. కానీ ప్రజలందరినీ ఆయన శిక్షించే అంతిమ దినాన నిన్ను ఆయన మరీ ఎక్కువగా శిక్షిస్తాడు" అన్నాడు.
\s5
\p
\v 25 ఆ సమయంలో యేసు ప్రార్థన చేస్తూ, "తండ్రీ! నువ్వు భూమీ పరలోకాల్లో అన్నిటి మీదా రాజ్యమేలుతున్నావు. మేమే తెలివైన వాళ్ళం, బాగా చదువుకున్న వాళ్ళం అనుకునే వాళ్ళని ఈ విషయాలు తెలుసుకోకుండా అడ్డుకున్నందుకు వందనాలు. పెద్దలు చెప్పినప్పుడు చిన్న పిల్లలు నమ్మినట్టు నీ సత్యాన్ని అంగీకరించిన వాళ్లకి నువ్వు వాటిని బయలు పరిచావు.
\v 26 ఔను తండ్రీ, అలా చేయడం మంచిదని నువ్వు అలా చేసావు" అన్నాడు.
\p
\v 27 తరువాత యేసు ప్రజలతో, "నా పని నేను చేసుకునేలా నా తండ్రి అయిన దేవుడు నేను తెలుసుకోవలసినవి అన్నీ నాకు బయలుపరిచాడు. నిజంగా నేనెవరో నా తండ్రికే తెలుసు. ఇంకా చెప్పాలంటే ఎవరికైతే నేను వెల్లడిస్తానో వాళ్లకి మాత్రమే తండ్రి తెలుసు."
\s5
\p
\v 28 "మీ నాయకులు మీకు చెప్పిన ఆజ్ఞలన్నీపాటించడానికి ప్రయత్నం చేసి, అలసిపోయిన వాళ్ళంతా నా దగ్గరికి రండి. వాటన్నిటి నుండి మీకు విశ్రాంతిని ఇస్తాను.
\v 29 ఎద్దు తన కాడికి కిందకు వచ్చినట్టు మీరు నాకు లోబడండి. నేను అణకువ, సున్నితత్వం ఉన్న వాణ్ణి. మీకు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది.
\v 30 నేను మీపై పెట్టే భారం చాలా తేలిక. మోయలేని బరువు మీ మీద పెట్టను."
\s5
\c 12
\p
\v 1 అది విశ్రాంతి దినం. ఆ సమయంలో యేసు, తన శిష్యులు పంట చేలల్లో నడిచి వెళ్తున్నారు. ఆయన శిష్యులకు ఆకలేసి కంకులు తుంచి తింటున్నారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం దీనికి అభ్యంతరం లేదు.
\v 2 శిష్యులు ఇలా చేయడం కొందరు పరిసయ్యులు చూసి యేసుతో, "చూడూ, నీ శిష్యులు విశ్రాంతి దినం అయినా పనిచేస్తున్నారు. ధర్మశాస్త్రం దీన్ని ఒప్పుకోదు" అన్నారు.
\s5
\p
\v 3 దానికి యేసు, "మన పితరుడు దావీదు రాజు, ఆయన మనుషులు ఆకలిగా ఉన్నప్పుడు ఏమి చేసారో లేఖనాల్లో ఉంది.
\v 4 దేవుణ్ణి ఆరాధించే పవిత్ర గుడారంలో దావీదు దేవుడి ముందు పెట్టిన రొట్టెను తిన్నాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం కేవలం యాజకులకి మాత్రమే ఆ రొట్టె తినే అనుమతి ఉంది. కానీ దావీదు, అతని మనుషులు కలిసి ఆ రొట్టెలు తిన్నారు.
\s5
\v 5 మోషే రాసింది మీరు కచ్చితంగా చదివే ఉంటారు. విశ్రాంతి రోజున యాజకులైనా సరే దేవాలయంలో పనిచేస్తే, వాళ్ళు విశ్రాంతిదినానికి సంబంధించిన ఆజ్ఞలకు లోబడకపోయినా, వాళ్ళు తప్పు చేసినట్టు కాదు."
\p
\v 6 "దీని అర్థం నేను చెప్తాను. నేను మీ దగ్గరికి వచ్చాను. నేను దేవాలయం కంటే గొప్ప వాణ్ణి.
\s5
\v 7 లేఖనాల్లో ఉన్న ఈ దైవవాక్కుల గురించి మీరు ఆలోచించాలి. "మీరు బలులు అర్పించడం మాత్రమే కాదు, కనికరం చూపించాలని కోరుతున్నాను." దీని అర్థం మీకు తెలిసి ఉంటే ఏ తప్పూ చెయ్యని నా శిష్యుల్ని మీరు నిందించరు.
\v 8 నేను మనుష కుమారుణ్ణి. విశ్రాంతి రోజున ఏమి చెయ్య వచ్చో ప్రజలకు చెప్పే అధికారం నాకు ఉంది" అన్నాడు.
\s5
\p
\v 9 ఆ రోజు అక్కడి నుండి వెళ్ళిపోయాక ఆయన ఒక సమాజ మందిరానికి వెళ్ళాడు.
\v 10 అక్కడ ఊచ చెయ్యి ఉన్న వ్యక్తి కనిపించాడు. అక్కడ ఉన్న పరిసయ్యులు విశ్రాంతి దినం గురించి వాదం పెట్టుకోవాలని ఉన్నారు. వాళ్ళలో ఒకడు ఆయనతో, "విశ్రాంతి రోజున ఎవరినైనా స్వస్థపరచడానికి దేవుడు అనుమతిస్తాడా?" అని అడిగాడు. యేసు ఏదొక తప్పు మాట్లాడి పొరపాటు చేస్తాడని వాళ్ళు అనుకున్నారు.
\s5
\v 11 ఆయన వాళ్లకు జవాబిస్తూ, "మీకు ఒక గొర్రె ఉందనుకోండి. అది విశ్రాంతి రోజున గుంటలో పడింది. దాన్ని అక్కడే వదిలేస్తారా? కచ్చితంగా వదలరు. దాన్ని జాగ్రత్తగా బయటికి తీస్తారు గదా."
\p
\v 12 "కానీ గొర్రె కంటే మనిషి విలువైన వాడు. కాబట్టి ఒక మనిషిని మంచి ఉద్దేశంతో స్వస్థపరచడం ఏ రోజైనా చెయ్యొచ్చు. అది విశ్రాంతి దినమైనా సరే" అని చెప్పాడు.
\s5
\v 13 అప్పుడు ఆయన ఆ వ్యక్తితో, "నీ చెయ్యి చాపు" అన్నాడు. ఆ వ్యక్తి తన ఊచ చెయ్యి చాపాడు. అది రెండో చెయ్యిలా మామూలుగా అయ్యింది.
\v 14 అప్పుడు పరిసయ్యులు సమాజ మందిరం వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కలిసి యేసుని ఎలా చంపుదామా అని కుట్రలు మొదలు పెట్టారు.
\s5
\p
\v 15 పరిసయ్యులు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని గ్రహించి, ఆయన శిష్యుల్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది రోగులతో సహా పెద్ద ఎత్తున జనం గుంపులు గుంపులుగా ఆయన్ని వెంబడించారు. ఆయన వాళ్ళని స్వస్థపరిచాడు.
\v 16 కానీ తన గురించి ఎవరికీ చెప్పొద్దని వాళ్లకి గట్టిగా చెప్పాడు.
\p
\v 17 ఇలా చెయ్యడం వల్ల పూర్వం యెషయా ప్రవక్త రాసింది నెరవేరింది. అదేమిటంటే,
\s5
\q
\v 18 "నేను ప్రేమించిన వాడు, నన్ను సంతృప్తి పరచినవాడు,
\q నేను ఎన్నుకున్న నా సేవకుడు ఇక్కడ ఉన్నాడు.
\q నా ఆత్మను ఆయనలో ఉంచుతాను,
\q ఆయన యూదులు కానివారికి రక్షణ తెచ్చి, న్యాయం చేస్తాడు.
\s5
\q
\v 19 ఆయన మనుషులతో పోట్లాడడు, కేకలు వేయడు. ఆయన వీధుల్లో అరవడు.
\q
\v 20 ఆయన బలహీనులతో సున్నితంగా వ్యవహరిస్తాడు,
\q కొన ప్రాణంతో ఉన్న వాణ్ణి ఆయన చంపడు.
\q ప్రజలకి న్యాయంగా తీర్పు తీర్చి వారిని నిరపరాధులుగా ప్రకటిస్తాడు.
\q
\v 21 కాబట్టి యూదులు కానివారు ఆయనలో నమ్మకం ఉంచుతారు."
\s5
\p
\v 22 ఒక రోజు కొందరు మనుషులు దయ్యం పట్టి గుడ్డి, మూగ అయిన వాణ్ణి తీసుకు వచ్చారు. యేసు దయ్యాన్ని వెళ్ళగొట్టి అతన్ని బాగు చేసాడు. అప్పుడు అతను చూడగలిగాడు, మాట్లాడగలిగాడు.
\v 23 అది చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. వాళ్ళల్లో ఒకరితో ఒకరు, "ఈయన దావీదు వంశంలో మనం కనిపెడుతున్న క్రీస్తు అయి ఉండొచ్చు" అనుకున్నారు.
\s5
\v 24 కానీ పరిసయ్యులు ఈ అద్భుతం గురించి విని, "ఆయన దేవుడు కాదు. బయల్జెబూలు. దయ్యాలరాజు. అందుకే దయ్యాలను వెళ్ళగొట్టగలుగుతున్నాడు" అన్నారు.
\p
\v 25 యేసుకు పరిసయ్యులు అనుకునేవన్నీ తెలుసు. కాబట్టి ఆయన వాళ్ళతో, "ఒకే రాజ్యంలోని ప్రజలు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటే తమ రాజ్యాన్ని తామే నాశనం చేసుకుంటారు గదా! ఒకే ఊరి వాళ్లుగాని, ఒకే ఇంట్లోని వాళ్ళు గానీ పోట్లాడుకుంటుంటే వాళ్ళు కచ్చితంగా ఒకటిగా, కుటుంబంగా నిలవలేరు.
\s5
\v 26 అదే విధంగా సాతాను తన సొంత దయ్యాల్ని బయటికి పంపేస్తే తనకుతానే విరోధం అవుతున్నట్టు గదా. అలాంటప్పుడు తన సేవకుల మీద అతడెలా ఏలుబడి చేయగలుగుతాడు?
\v 27 ఇంకా చెప్పాలంటే, సాతాను వలన నేను దయ్యాలను వెళ్ళగొడుతుంటే మీ శిష్యులు కూడా అదే సాతాను వల్ల దయ్యాలను వెళ్ళగొడుతున్నారా? వాళ్ళ పని వెనుక సాతాను శక్తి ఉంది అనే మీ మాటకు వాళ్ళే మీకు బుద్ధి చెబుతారు.
\s5
\v 28 దేవుని ఆత్మ వలన మాత్రమే నేను దయ్యాలను వెళ్ళగొడుతున్నానని ఇప్పటికే పరలోకం నుండి దేవుడు చేస్తున్న పాలన నిర్ధారిస్తుంది."
\p
\v 29 "నేను దయ్యాల్ని ఎలా వెళ్ళగొట్టగలుగుతున్నానో మీకు చెప్తాను. సాతాను లాంటి బలవంతుడి ఇంట్లోకి ఎవరూ చొరబడ లేడు. ఆ బలవంతుణ్ణి కట్టేయకుండా వాడి ఆస్తుల్ని దోచుకోలేడు. వాణ్ణి కట్టేస్తేనే అది సాధ్యం."
\p
\v 30 "అటోఇటో ఉండాలి తప్ప తటస్థంగా ఎవరూ ఉండలేరు. నన్ను వ్యతిరేకిస్తున్న దయ్యాల్ని పవిత్రాత్మ వలన మాత్రమే వెళ్ళగొడుతున్నానని గుర్తించనివాడూ నా శిష్యులు కావడానికి మనుషులను పోగుచెయ్యనివాడూ నా నుండి ప్రజలు దూరంగా వెళ్ళిపోయేలా చేస్తున్నట్టే.
\s5
\v 31 దయ్యాల్నివెళ్ళగొట్టింది పరిశుద్ధాత్మ వలన కాదు అని మీరు అంటున్నారు. కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను. ఎవరైనా ఇతరుల్ని అవమానించి, కోపం తెప్పించి, అలా చేసినందుకు విచారించి దేవుని క్షమించమని అడిగితే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు. కాని పరిశుద్ధాత్మను అవమానించిన వాణ్ణి మాత్రం దేవుడు క్షమించడు.
\v 32 మనుష్య కుమారుణ్ణి అయిన నన్ను విమర్శించే వాళ్ళని దేవుడు క్షమిస్తాడు. కానీ నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. పరిశుద్ధాత్మ చేసే పనుల్ని చెడ్డగా చేసి చెప్పే వాళ్ళని దేవుడు క్షమించడు. ఇప్పుడే కాదు రాబోయే లోకంలో కూడా దేవుడు క్షమించడు."
\s5
\p
\v 33 "ఒక చెట్టు పండు చూసినప్పుడు ఆ పండు మంచిదో కాదో చెప్ప వచ్చు. పండు మంచిదైతే దాని చెట్టూ మంచిదని తెలుస్తుంది. నేను మంచి పనులు చేస్తుంటే నేను మంచి వాణ్ణి ఔనో కాదో మీకు తెలుస్తుంది."
\p
\v 34 "మీరు పాము పిల్లల్లాంటి వాళ్ళు. మీరు చెడ్డవాళ్ళు కాబట్టి మంచిది ఏదీ మాట్లాడలేరు. ఒకడు చెప్పేది అతని మనస్సులో నుండి వస్తుంది.
\v 35 మంచి వాళ్ళు మంచి మాటలు మాట్లాడతారు. ఎలాగంటే మంచిమాటలు ఒక చోట పదిలంగా దాచి ఉంచి, ఏ సమయంలోనైనా వాటిని బయటికి తీయగలరు. అయితే దుష్టులు చెడు మాటలు పలుకుతారు. ఎందుకంటే వాళ్ళు అలాటి మాటలను దాచి ఉంచి ఎదో ఒక సమయంలో వాటిని బయటికి తెస్తారు."
\s5
\p
\v 36 "నేను మీకు చెప్తున్నాను. దేవుడు న్యాయం తీర్చే రోజున మనుషులు మాట్లాడిన ప్రతి పనికి రాని మాటనీ లెక్కలోకి తీసుకుంటాడు. వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఆయన తీర్పునిస్తాడు.
\v 37 మీరు మాట్లాడిన మాటల ఆధారంగా మీ మాటలు నీతిగా ఉన్నాయో లేవో మీరు దోషులో కాదో దాన్ని బట్టి దేవుడు అప్పుడు ప్రకటిస్తాడు" అన్నాడు.
\s5
\p
\v 38 అప్పుడు కొందరు పరిసయ్యులు, యూదు పండితులు యేసు మాటలకి స్పందిస్తూ "బోధకా, నిన్ను దేవుడు పంపాడని సూచనగా మేము చూస్తుండగా ఒక అద్భుతం చెయ్యి" అన్నారు.
\v 39 దానికి యేసు, "నేను అద్భుతాలు చెయ్యగా మీరందరూ చూసిన వాళ్ళే. చెడు ఉద్దేశంతో మీరు దేవుని నమ్మకంగా పూజించలేరు. దేవుడు నన్ను పంపాడని నిరూపించడానికి మీరు నన్ను అద్భుతం చెయ్యమంటున్నారు కానీ దేవుడు ఒకే అద్భుతాన్ని మీకు చూపిస్తాడు. అది యోనా ప్రవక్తకు జరిగిన అద్భుతం వంటిది."
\p
\v 40 "యోనాను దేవుడు బయటికి రప్పించే వరకు మూడు రాత్రింబగళ్ళు పెద్ద చేప కడుపులో ఉన్నాడు. అలాగే మూడు పగళ్ళు మూడు రాత్రులూ మనుష్య కుమారుడినైన నేను భూగర్భంలో ఉంటాను. తరువాత దేవుడు నన్ను మళ్ళీ బ్రతికిస్తాడు.
\s5
\v 41 దేవుడు అందరికీ తీర్పు ఇచ్చేటప్పుడు నీనెవె పట్టణంలో నివసించిన ప్రజలు ఆయన ఎదురుగా మీ పక్కన నిలబడతారు. యోనా హెచ్చరించినప్పుడు వాళ్ళు పాపం చెయ్యడం మానేశారు. నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. నేను యోనా కంటే గొప్పవాణ్ణి. కానీ మీరు పాపం చెయ్యడం మానలేదు కాబట్టి దేవుడు మీకు తీర్పు ఇస్తాడు."
\s5
\p
\v 42 "ఇశ్రాయేలు దేశానికి దక్షిణాన ఉన్న షేబా దేశంలో, చాలా కాలం క్రితం జీవించిన ఆ దేశం రాణి సొలోమోను జ్ఞానవాక్కులు వినడానికి చాలా దూరం నుండి వచ్చింది. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను. నేను సొలోమోను కంటే చాలా గొప్పవాణ్ణి. కానీ మీరు పాపం చెయ్యడం మానలేదు. కాబట్టి దేవుడు ప్రతి వాళ్లకి తీర్పు తీర్చేటప్పుడు షేబా దేశం రాణి ఆయన ఎదురుగా మీపక్కన నిలబడి మీపై నింద వేస్తుంది."
\s5
\p
\v 43 "కొన్ని సార్లు దురాత్మ ఒక వ్యక్తిని వదిలి పోయి, నిర్జన ప్రదేశాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండడానికి ఎవరు దొరుకుతారా అని వెదుకుతుంది. దానికి ఎవరూ దొరకక
\v 44 ఇంతకుముందు నేను ఉన్న వాడి దగ్గరికే వెళ్తాను అనుకుని, అక్కడికి తిరిగి వెళ్ళి అతని జీవితం కడిగిన ఇంటిలాగా అంతా శుభ్రంగా, పద్ధతిగా అమర్చి ఖాళీగా ఉండడం చూసింది. అతని వ్యక్తిగత జీవితం దేవుని ఆత్మ స్వాధీనంలో లేకపోవడం గమనించింది.
\v 45 అప్పుడు ఆ దురాత్మ వెళ్ళి, ఇంకా చెడ్డవి ఏడు ఆత్మల్ని తీసుకు వచ్చి అతనిలో ప్రవేశించి, అక్కడే ఉంటాయి. కాబట్టి అతని పరిస్థితి ముందు కంటే ఇంకా ఘోరంగా అయ్యింది. చెడ్డ వాళ్లైన మీరు కూడా నేను బోధించింది అనుభవంలో చూస్తారు" అన్నాడు.
\s5
\p
\v 46 యేసు ఇంకా జనాలతో మాట్లాడుతూ ఉండగా ఆయన తల్లీ తమ్ముళ్ళూ వచ్చారు. ఆయనతో మాట్లాడాలని బయట నిల్చున్నారు.
\v 47 ఆయనతో ఒకరు,"మీ అమ్మా, తమ్ముళ్ళూ నీతో మాట్లాడాలని బయట నిల్చుని ఉన్నారు" అని చెప్పారు.
\s5
\v 48 అప్పుడు యేసు అతనితో, "నా నిజమైన తల్లీ తమ్ముళ్ళూ ఎవరో మీకు చెప్తాను" అని,
\v 49 తన శిష్యులను చూపిస్తూ, "నా తల్లీ తమ్ముళ్ళు వీళ్ళే.
\v 50 పరలోకంలో ఉన్న నా తండ్రికి ఇష్టమైనట్టు ఎవరు ఉంటారో వాళ్ళే నా తమ్ముళ్ళూ నా తల్లీ" అన్నాడు.
\s5
\c 13
\p
\v 1 అదే రోజు యేసు అప్పటి వరకూ బోధిస్తున్న ఇంట్లోనుంచి గలిలయ సరస్సు తీరానికి వెళ్ళి, అక్కడ కూర్చున్నాడు.
\v 2 జనం చాలా పెద్ద గుంపుగా ఆయన ఉపదేశం వినడానికి ఆయన చుట్టూ చేరారు. ఆయన ఒక పడవ ఎక్కి బోధించడానికి కూర్చున్నాడు. జనం మాత్రం ఒడ్డున ఉండి, ఆయన చెప్పింది విన్నారు.
\s5
\p
\v 3 ఆయన చాలా ఉదాహరణలు ఉపయోగిస్తూ వాళ్లకి బోధించాడు. ఆయన చెప్తూ, "వినండి! ఒక మనిషి విత్తనాలు చల్లడానికి పొలం వెళ్ళాడు.
\v 4 నేలపై విత్తనాలు చల్లుతూ ఉంటే, కొన్ని విత్తనాలు దారిలో పడ్డాయి. కొన్ని పిట్టలు వచ్చి ఆ విత్తనాల్ని తినేశాయి.
\v 5 కొన్ని విత్తనాలు పై పైనే మట్టిపొర ఉన్న రాతి నేల మీద పడ్డాయి. అవి తొందరగా మొలకెత్తాయి.
\v 6 అయితే మొలకల వేర్లు లోతుగా లేక ఎండ వేడికి ఎండిపోయాయి."
\s5
\p
\v 7 "కొన్ని విత్తనాలు ముళ్ళ కంపల్లో పడ్డాయి. మొక్కలతో పాటు ముళ్ళకంపలు కూడా ఎదిగి మొక్కల్ని అణిచేసాయి.
\v 8 మిగిలిన విత్తనాలు మంచి నేలపై పడి ఏపుగా ఎదిగి మంచి పంటనిచ్చాయి. విత్తిన దానికి నూరు రెట్లు ఫలసాయం ఇచ్చాయి. కొన్ని మొక్కలు అరవై రెట్లు, కొన్ని ముప్ఫై రెట్లు ఉత్పత్తి చేసాయి.
\v 9 ఇది మీరు అర్థం చేసుకోగలిగితే నేను చెప్పింది ఆలోచిస్తారు" అన్నాడు.
\s5
\p
\v 10 తర్వాత శిష్యులు యేసు దగ్గరికి వెళ్ళి, "నువ్వు జనంతో మాట్లాడినప్పుడు ఉపమానాలు ఎందుకు వాడతావు?" అని అడిగారు.
\v 11 ఆయన జవాబిస్తూ, "ఇంతకు ముందు మీకు దేవుడు బయలు పరచని విషయం ఇప్పుడు ఆయన పరలోకం నుండి ఎలా ఏలుతాడో బయలుపరుస్తున్నాడు. కానీ ఇవి ఇతరులకి బయలు పరచలేదు.
\v 12 నేను చెప్పింది ఆలోచించి, అర్థంచేసుకుంటే దేవుడు ఇంకా ఎక్కువ అర్థం అయ్యేలా చేస్తాడు. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకోలేని వాళ్ళు ,వాళ్లకు తెలిసింది కూడా మర్చిపోతారు.
\s5
\v 13 అందుకే నేను ప్రజలతో మాట్లాడేటప్పుడు ఉపమానాలు వాడతాను. నేను చేసేవి వాళ్ళు చూసినా దాని వాళ్ళకి కాదు. నేను చెప్పేది వాళ్ళు వింటున్నా, దాని అసలు అర్థం చేసుకోలేరు" అన్నాడు.
\q
\v 14 పూర్వం యెషయా ప్రవక్త ద్వారా;
\q "నేను చెప్పింది మీరు వింటారు కానీ అర్థం చేసుకోలేరు.
\q నేను చేసేది చూస్తారు కాని అది ఏమిటో తెలుసుకోలేరు."
\q అని దేవుడు చెప్పింది పూర్తిగా నెరవేరేలా ఈ ప్రజలు చేస్తున్నారు.
\s5
\p
\v 15 దేవుడు యెషయాతో ఇలా కూడా చెప్పాడు;
\q "ఈ ప్రజలు నేను చెప్పింది వింటారు కానీ నా సందేశాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు.
\q వాళ్లకి చూడగల కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు చూసేది ఏమిటో స్పష్టంగా చూడలేరు.
\q వాళ్ళు కళ్ళు మూసేసుకున్నారు. వాళ్ళ కళ్ళతో చూడలేరు,
\q వాళ్ళ చెవులతో వినలేరు, వాళ్ళు అర్థం చేసుకోలేరు.
\q వాళ్ళు చూడగలిగీ వినీ , అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళు నావైపు తిరుగుతారు.
\q నేను వాళ్ళని స్వస్థపరుస్తానని దేవుడు చెప్తున్నాడు."
\s5
\p
\v 16 "మిమ్మల్ని అయితే సామర్ధ్యంగల వాళ్ళుగా దేవుడు చేసాడు ఎందుకంటే మీరు నేను చేసేవి గ్రహించగలరు, నేను చెప్పేవి అర్థం చేసుకోగలరు.
\v 17 ఇది గమనించండి. చాలా కాలం క్రితం బ్రతికిన చాలా మంది ప్రవక్తలూ నీతిమంతులూ నేను చేసేవీ మీరు చూస్తున్నవీ వాళ్ళు చూడాలని ఎంతో ఆశపడ్డారు. కానీ చూడలేక పోయారు. నేను చెప్తుండగా మీరు వింటున్నది వాళ్ళు వినాలని ఎంతో అనుకున్నారు కానీ వాళ్ళు వినలేక పోయారు, మీరు వింటున్నారు."
\s5
\p
\v 18 ఇప్పుడు నేను వివరించే ఉపమానం వినండి. రకరకాల నేలల్లో విత్తనాలు విత్తిన మనిషి గురించిన ఉపమానం.
\v 19 కొందరు దేవుడు ఏలడం గురించి వింటారు కానీ దాన్ని అర్థం చేసుకోలేరు. వాళ్ళు దారిలో పడిన విత్తనం లాంటి వాళ్ళు. సాతాను చెడ్డవాడు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి విన్నది మర్చిపోయేలా చేస్తాడు.
\s5
\v 20 కొందరు దేవుని సందేశాన్ని ఆనందంతో అంగీకరిస్తారు. వాళ్ళు రాతి నేలపైన పడిన విత్తనం లాంటి వాళ్ళు.
\v 21 వాక్యం వాళ్ళ హృదయం లోపలికి చొచ్చుకుపోక చాలా కొద్దికాలమే నమ్ముతారు. వాళ్ళు లోతుగా వేర్లు లేని వాళ్ళు. నేను చెప్పింది నమ్ముతారు కానీ ఇతరులు వాళ్ళని బాధపెట్టి, హింసించగానే వాళ్ళు విశ్వాసంలో ఉండక తోసిపుచ్చడం ద్వారా పాపం చేస్తారు.
\s5
\p
\v 22 కొందరు దేవుని సందేశం వింటారు. కానీ వాళ్ళు ధనవంతులుగా ఉండాలని బలంగా కోరిక ఉండి, డబ్బుతో ఏమి కొందామా అని ఆలోచిస్తూ కేవలం డబ్బు కోసమే ఆందోళన పడుతూ ఉంటారు. దాని ఫలితంగా దేవుని సందేశాన్ని వాళ్ళు మర్చిపోయి, వాళ్ళు చేయాలని దేవుడు ఆశించిన వాటిని చేయరు. వీళ్ళు ముళ్ళకంపల్లో పడిన విత్తనాల్లాంటి వాళ్ళు.
\v 23 కొందరు నా సందేశాన్ని విని అర్థం చేసుకున్న వాళ్ళు. వీళ్ళల్లో కొందరు దేవుని సంతృప్తి పరచడానికి చాలా చేస్తారు. కొందరు దేవుని సంతోషపెట్టడానికి ఇంకా ఎక్కువ చేస్తారు. కొందరు అంతకంటే ఎక్కువగా , కొందరు ఇంకా చాలా ఎక్కువగా దేవున్ని సంతోష పెట్టడానికి చేస్తారు. వీళ్ళు మంచి నేలపై పడిన విత్తనాల్లాంటి వాళ్ళు.
\s5
\p
\v 24 యేసు ఆ సమూహానికి ఇంకొక ఉపమానం చెప్పాడు, "దేవుడు పరలోకం నుండి ఏలడమనేది, ఒక రైతు పొలంలో మంచి విత్తనాలు చల్లినట్టు ఉంటుంది.
\v 25 అతని పనివాళ్ళు పొలం దగ్గర కాపలా కాయడానికి వెళ్ళి నిద్రపోతుండగా రైతు శత్రువు వచ్చి గోదుమల మధ్యలో కలుపు మొక్కల విత్తనాలు చల్లి వెళ్ళి పోయాడు.
\v 26 ఆ మొక్కలు పచ్చగా పెరిగి కంకులు వేసి నప్పుడు కలుపు మొక్కలు కూడా పెరిగాయి.
\s5
\v 27 రైతు పనివాళ్ళు వచ్చి, "అయ్యా! మీరు మాకు విత్తడానికి మంచి విత్తనాలే ఇచ్చారు. మేము ఆ విత్తనాలే చల్లాం కూడా. వాటిలో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?" అన్నారు.
\v 28 "ఇది నా శత్రువు చేసిన పని" అని రైతు అన్నాడు. పనివాళ్ళు అతన్ని, "కలుపు మొక్కలు పీకేయమంటారా?" అని అడిగారు.
\s5
\p
\v 29 "ఆ పని మాత్రం చెయ్యొద్దు. పొరపాటున గోదుమ మొక్కలు కూడా మీరు పీకేయవచ్చు.
\v 30 పంట కోసే కాలం వరకూ గోదుమ మొక్కల్ని , కలుపు మొక్కల్ని కూడా పెరగనివ్వండి. నేను పంట కొయ్యమని చెప్పినప్పుడు ముందు కలుపుమొక్కల్ని తీసి కాల్చేయడానికి కట్టలు కట్టండి. తరువాత గోదుమల్ని పోగుచేసి గిడ్డంగిలో పెట్టండి."
\s5
\p
\v 31 యేసు ఈ ఉపమానం కూడా చెప్పాడు, "దేవుడు పరలోకం నుండి ఏలడం ఒక మనిషి పొలంలో నాటిన ఆవగింజ మొక్కలా ఉంటుంది.
\v 32 మనుషులు విత్తే విత్తనాలు అన్నిటిలో ఆవగింజ చిన్నది. ఇశ్రాయేలు దేశంలో అవి చాలా పెద్ద మొక్కలుగా ఎదుగుతాయి. అవి పూర్తిగా ఎదిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో ఎత్తుగా అవుతుంది. చెట్లలా ఎదుగుతాయి. వాటి కొమ్మల్లో పక్షులు గూడు కట్టుకుంటాయి."
\s5
\p
\v 33 యేసు ఈ ఉపమానం కూడా చెప్పాడు, "దేవుడు పరలోకం నుండి ఏలడం ఒక స్త్రీ చేస్తున్న రొట్టెలా ఉంటుంది. నలభై కిలోల పిండి తీసుకుని, అందులో చిటికెడు ఈస్ట్ కలిపినప్పుడు పిండి పొంగుతుంది."
\s5
\p
\v 34 యేసు ప్రజలకి ఉపమానాలు చెప్పి విషయాలన్నీ బోధించాడు.
\v 35 అలా చెప్పడం వల్ల చాలా కాలం క్రితం ప్రవక్తల్లో ఒకరి ద్వారా దేవుడు చెప్పింది జరిగింది. "నేను ఉపమానాల్లో మాట్లాడతాను. నేను లోకం సృష్టించింది మొదలు నేను రహస్యంగా ఉంచింది ఉపమానాలుగా చెప్తాను."
\s5
\p
\v 36 యేసు జన సమూహాన్ని పంపేసిన తరవాత ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, "గోదుమ పంటలో కలుపు మొక్కల గురించి వివరించు" అని అడిగారు.
\v 37 ఆయన జవాబిస్తూ, మంచి విత్తనాలు విత్తే వాణ్ణి నేనే, మనుషకుమారుణ్ణి.
\v 38 పొలం మనుషులు బ్రతుకుతున్న ఈ లోకాన్ని సూచిస్తుంది. బాగా పెరిగిన విత్తనాలు దేవుడు తండ్రిగా ఉన్నవాళ్ళను సూచిస్తాయి. కలుపు మొక్కలు సాతాన్నితండ్రిగా పెట్టుకున్న వాళ్ళని సూచిస్తాయి.
\v 39 కలుపు మొక్కల విత్తనాలు చల్లిన శత్రువు సాతాన్నిసూచిస్తాడు. గోదుమ పంట కోసే సమయం యుగాంతాన్ని సూచిస్తుంది. పంట కోసే వాళ్ళు దేవ దూతల్ని సూచిస్తారు.
\s5
\v 40 సేకరించిన కలుపు మొక్కల్ని కాల్చేశారు. అది యుగాంతంలో దేవుని తీర్పు సమయంలో ప్రజలకి జరిగేది సూచిస్తుంది.
\p
\v 41 అది ఇలా ఉంటుంది. "మనుష్యకుమారుణ్ణి అయిన నేను, నా దూతల్ని పంపుతాను. నేను ఏలుతున్న వాళ్ళందరిలో దేవుని చిత్తానికి భంగం కలిగించే వాళ్ళని, ఇతరులతో పాపం చేయించే వాళ్ళని దూతలు పోగుచేస్తారు.
\v 42 వాళ్ళని దూతలు నరకంలోని మంటల్లోకి విసిరేస్తారు. అక్కడ వాళ్ళు నొప్పినీ బాధనూ భరించ లేక ఏడుస్తూ, పళ్ళు కొరుకుతూ ఉంటారు.
\v 43 ఏది ఎలా ఉన్నా, ప్రభువుకు నచ్చినట్టుగా బ్రతికే వాళ్ళు మాత్రం సూర్యుడు ప్రకాశించినట్టు మెరిసిపోతూ ఉంటారు. వాళ్ళు అలా మెరవడానికి కారణం వాళ్ళ తండ్రిగా ఉన్న దేవుడు వాళ్ళను ఏలుతాడు. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే నేను చెప్పింది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి."
\s5
\p
\v 44 "పరలోకం నుండి దేవుడు ఏలడం చాలా విలువైంది. అది చాలా కాలం క్రితం ఎవరో దాచిపెట్టిన నిధి ఒక వ్యక్తికి దొరికితే, అతను ఆ నిధిని భూమిలో పాతి పెట్టడం లాంటిది. అతను నిధిని తవ్వి చూసి, తిరిగి ఎవరూ అది కనిపెట్టకుండా పాతిపెట్టాడు. తరువాత అతను ఆ పొలం కొనడానికి తన ఆస్తులన్నీ అమ్మి, ఆ పొలాన్ని కొని, ఆ నిధిని సంపాదించుకుంటాడు."
\p
\v 45 "పరలోకం నుండి దేవుడు ఏలడం ఎంత విలువైనదంటే, మంచి నాణ్యత ఉన్న ముత్యాలను కొనడానికి వ్యాపారి వెదకడం లాంటిది.
\v 46 అతను బాగా ఖరీదైన ముత్యం అమ్మకంలో ఉండడం చూసి, ఆ ముత్యం కొనడానికి ఆస్తులన్నీ అమ్మి డబ్బు సంపాదించి, వెళ్ళి దాన్ని కొంటాడు."
\s5
\p
\v 47 "దేవుడు పరలోకం నుండి ఏలడం పెద్ద వలతో సరస్సులో చేపలు పట్టిన చేపలు పట్టే విధంగా ఉంటుంది. పనికి వచ్చేవి, పనికి రానివి అన్ని రకాల చేపల్ని వాళ్ళు పడతారు.
\v 48 వల నిండినప్పుడు ఒడ్డుకు వలను లాగి, కూర్చొని, పనికిరానివి పడేసి, మంచి చేపల్ని బుట్టలో వేసుకోవడం లాంటిది."
\s5
\p
\v 49 "యుగాంతంలో మనుషులకి ఇలాగే జరుగుతుంది. మనుషులకి తీర్పు ఇచ్చేటప్పుడు అక్కడికి దేవ దూతలు వస్తారు. నీతిమంతుల నుండి చెడ్డవాళ్లను వేరు చేస్తారు.
\v 50 నరకంలోని మంటల్లోకి చెడ్డ వాళ్ళను విసిరేస్తారు. వాళ్ళు ఆ నొప్పి, బాధ తట్టుకోడానికి ఏడుస్తూ, పళ్ళు కొరుకుతారు."
\s5
\p
\v 51 యేసు తన శిష్యుల్ని, "నేను చెప్పిన ఈ ఉపమానాలన్నీ అర్థం అయ్యాయా" అని అడిగాడు. వాళ్ళు, "మేము అర్థం చేసుకున్నాం" అన్నారు.
\v 52 అప్పుడు ఆయన, "బోధకులూ వ్యాఖ్యానించే వాళ్ళూ ఈ ఉపమానాల్ని అర్థం చేసుకుని ఆ ప్రకారం ఉంటూ పరలోకం నుండి దేవుని ఏలిక క్రింద ఉండడం గదిలోనుండి కొత్త బట్టలూ పాత బట్టలూ బయటికి తెచ్చి పంచిన ఇంటి ఓనర్ లాంటిది.
\v 53 యేసు ఈ ఉపమానాలు చెప్పడం పూర్తయ్యాక తన శిష్యుల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు."
\s5
\p
\v 54 తరవాత యేసు సొంత ఊరు నజరేతుకు వాళ్ళు వెళ్ళారు. సమాజమందిరాల్లో సబ్బాతు రోజున బోధించడం మొదలు పెట్టాడు. అయన మాటలకు అక్కడి ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారు. కానీ కొందరు ఇతడు మనలానే మామూలు మనిషి. ఇంత అవగాహనా, జ్ఞానం ఇతనికి ఎలా వచ్చింది? ఇలాంటి అద్భుతాలు ఎలా చెయ్యగలుగుతున్నాడు?
\v 55 ఇతడు వడ్రంగి కొడుకే గదా! ఇతని తల్లి మరియే గదా! ఇతని తమ్ముళ్ళు యాకోబు, యోసేపు, సీమోను, యూదా కదా!
\v 56 ఇతని చెల్లెళ్ళు అందరూ మన ఊరిలోనే ఉంటారు కదా! మరి ఇవన్నీ ఎలా చేస్తున్నాడు, ఎలా బోధించ గలుగుతున్నాడు? అనుకున్నారు.
\s5
\p
\v 57 యేసుకు అలాంటి అధికారం ఉండడాన్ని ఆ ఊరివాళ్ళు అంగీకరించలేక పోయారు. దానికి యేసు వాళ్ళతో, "నన్నూ ఇతర ప్రవక్తల్ని ఎక్కడికి వెళ్ళినా గౌరవించారు. కానీ మన ఊరిలో గౌరవించడం లేదు. మన సొంత కుటుంబాలు కూడా మనల్ని గౌరవించరు!" అన్నాడు.
\v 58 యేసుకు అలాంటి అధికారముందని ఆ ఊరి ప్రజలు నమ్మలేదు కాబట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చెయ్యలేదు.
\s5
\c 14
\p
\v 1 ఆ కాలంలో హేరోదు అంతిప దేశాన్ని ఏలుతున్నాడు. అతడు యేసు చేసిన అద్భుతాలు గురించి వార్తలు విన్నాడు.
\v 2 అతను తన సేవకులతో, "అతడు బాప్తిసమిచ్చే యోహానై ఉంటాడు. చనిపోయినవాడు బ్రతికి ఉంటాడు. అందుకే అతనికి అద్భుతాలు చేసే శక్తి వచ్చింది" అన్నాడు.
\s5
\p
\v 3 హేరోదు విషయంలో జరిగింది ఇది - హేరోదు తన సోదరుడు ఫిలిప్పు ఇంకా బ్రతికి ఉండగానే, అతని భార్య హేరోదియను పెళ్ళిచేసుకున్నాడు.
\v 4 కాబట్టి యోహాను నువ్వు దేవుని నియమానికి వ్యతిరేకంగా చేసావు అని హేరోదుతో అన్నాడు. ఆ మాట హేరోదియకు రుచించలేదు. హేరోదు ఆమెను సంతోషపెట్టడానికి యోహానును సైనికులను పంపి బంధించాడు. వాళ్ళు యోహానును గొలుసులతో బంధించి, చెరసాలలో వేశారు.
\v 5 యోహాను తల నరికేయాలని హేరోదు తన మనుషులకి ఆజ్ఞ జారీ చేయాలనుకున్నాడు కాని, దేవుని తరుపున మాట్లాడే ప్రవక్తగా యోహానును సాధారణ జనం నమ్మారు. కాబట్టి హేరోదు వాళ్లకి భయపడ్డాడు.
\s5
\p
\v 6 ఒకరోజు హేరోదు తన పుట్టినరోజు వేడుక జరుపుకుంటూ ఉండగా హేరోదియ కూతురు అతిథుల కోసం నాట్యం చేసింది. ఆ నాట్యం హేరోదుని ఎంతో సంతోషపెట్టింది.
\v 7 నీకు ఏమి కావాలో అది ఇస్తాను అని మాట ఇచ్చాడు. పైగా దేవుని సాక్షిగా ప్రమాణం చేసాడు.
\s5
\v 8 హేరోదియ కూతురు తన తల్లి దగ్గరికి వెళ్ళి ఏమి అడగమంటావని సలహా అడిగింది. ఏమి అడగాలో చెప్పింది. అప్పుడు హేరోదియ కూతురు హేరోదు దగ్గరికి వెళ్ళి, "బాప్తిసమిచ్చే యోహాను తల నరికి, నిజంగా చనిపోయాడో లేదో తెలియడానికి అతని తల పళ్ళెంలో పెట్టి, తెచ్చి ఇవ్వండి" అంది.
\p
\v 9 హేరోదియ కూతురుకి ఏమి కావాలో అది ఇస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేసినందుకు చాలా బాధపడ్డాడు. అతిధులందరూ అలా ప్రమాణం చెయ్యడం విన్నారు కాబట్టి అలా చెయ్యక తప్పలేదు. తన సేవకులకు ఆమె అడిగింది చెయ్యమని ఆజ్ఞ జారీ చేసాడు.
\s5
\v 10 యోహాను తల నరికి తెమ్మని సైనికులను పంపాడు.
\v 11 వాళ్ళు ఆ ప్రకారమే యోహాను తల పళ్ళెంలో పెట్టి ఆ అమ్మాయి దగ్గరికి తెచ్చారు. అప్పుడు ఆ అమ్మాయి తన తల్లి దగ్గరికి తీసుకెళ్ళింది.
\v 12 తరవాత యోహాను శిష్యులు జైలుకు వెళ్ళి యోహాను శరీరాన్ని తెచ్చి పాతిపెట్టారు. తరవాత వాళ్ళు యేసు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారు.
\s5
\p
\v 13 యేసు ఆ వార్త విన్న తరవాత తన శిష్యుల్ని మాత్రమే వెంటబెట్టుకుని గలిలయ సరస్సు పడవలోదాటి ఎవ్వరూ లేని ప్రదేశానికి బయలుదేరాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ప్రజలు తెలుసుకుని, కాలినడకన అక్కడికి వెళ్ళారు.
\v 14 యేసు ఒడ్డుకు చేరేసరికి చాలా పెద్ద ఎత్తున జన సమూహం ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వాళ్ళని చూసి జాలిపడి వాళ్ళల్లో ఉన్న రోగుల్ని స్వస్థపరిచాడు.
\s5
\p
\v 15 సాయంత్రం అవుతుండగా శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, "ఇది ఎవ్వరూ నివసించే ప్రదేశం కాదు, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. జనాన్ని పంపించేస్తే దగ్గరలో ఉన్న గ్రామాల్లో తినడానికి ఏమైనా కొనుక్కుంటారు" అన్నారు.
\s5
\v 16 కానీ యేసు తన శిష్యులతో, "భోజనం కోసం వాళ్ళు వెళ్లక్కరలేదు. వాళ్ళు తినడానికి మీరే ఏమన్నా ఇవ్వండి" అన్నాడు.
\v 17 దానికి శిష్యులు, "కానీ మన దగ్గర ఇప్పుడు ఐదు రొట్టెలు, రెండు వండిన చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి" అన్నారు.
\v 18 ఆయన, "వాటిని నా దగ్గరికి తీసుకురండి" అని,
\s5
\v 19 జన సమూహాన్ని అక్కడ ఉన్న గడ్డి మీద కూర్చోమని చెప్పాడు. ఐదు రొట్టెలు, రెండు చేపల్ని చేతుల్లోకి తీసుకుని ఆకాశం వైపు చూసి దేవునికి వందనాలు చెప్పి, వాటిని ముక్కలు చేశాడు. ఆ ముక్కలు శిష్యులకు ఇచ్చి అందరికీ పంచిపెట్టమని చెప్పాడు. వారు ఆయన చెప్పినట్టే చేశారు.
\v 20 అందరూ ఆకలి తీరే వరకూ తిన్నారు. మిగిలిన ముక్కల్ని కొందరు పోగుచేస్తే, మొత్తం పన్నెండు గంపలు అయ్యాయి.
\v 21 స్త్రీలు పిల్లలు కాకుండా లెక్క బెడితే ఇంచు మించు ఐదు వేలమంది పురుషులు అక్కడ తిన్నారు.
\s5
\p
\v 22 ఇది జరిగిన తరవాత యేసు ఆ జనాన్ని ఇంటికి పంపించేస్తూ తన శిష్యులతో పడవ ఎక్కి తన కంటే ముందు గలిలయ సముద్రం అవతలి వైపుకు వెళ్ళమని చెప్పాడు.
\v 23 వాళ్ళను పంపించేశాక ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసుకోడానికి కొండల్లోకి వెళ్ళాడు. సాయంత్రమైపోయినా ఆయన ఇంకా అక్కడే ఒంటరిగా ఉన్నాడు.
\p
\v 24 ఆ సమయానికి శిష్యులు తీరంనుండి చాలా దూరం లోపలికి వెళ్ళిపోయారు. శిష్యులు పడవ నడుపుతుంటే ఎదురు గాలి బలంగా వీస్తూ ఉంది. గాలికి చాలా పెద్ద అలలు ఏర్పడి, అలల తాకిడికి పడవ విపరీతంగా ఊగిసలాడుతూ మునిగిపోయే పరిస్థితికి వచ్చింది.
\s5
\p
\v 25 అప్పుడు యేసు కొండల్లోనుండి సరస్సు దగ్గరికి వచ్చాడు. తెల్లవారు జామున మూడు, ఆరు గంటల మధ్యలో పడవ దగ్గరికి నీటి మీద నడుస్తూ వచ్చాడు.
\v 26 ఆయన నీటి మీద నడవడం శిష్యులు చూసి భూతం అనుకున్నారు. వాళ్ళు హడలిపోయి, భయంతో గగ్గోలు పెట్టారు.
\v 27 వెంటనే యేసు వాళ్ళను వారిస్తూ, "నేనే, భయంలేదు. ధైర్యం తెచ్చుకోండి" అన్నాడు.
\s5
\p
\v 28 పేతురు ఆయనతో, "ప్రభూ, నువ్వే అయితే నీ దగ్గరికి నేను నడిచి రావచ్చా?" అన్నాడు.
\v 29 యేసు పేతురుతో "రా!" అన్నాడు. పేతురు పడవ దిగి, నీళ్ళమీద నడుస్తూ యేసు వైపు వెళ్ళాడు.
\v 30 కానీ పేతురు దృష్టి బలంగా వీచే గాలి మీదకు మళ్ళినప్పుడు అతనికి భయం వేసింది. నీళ్ళల్లో మునిగిపోతూ "ప్రభూ రక్షించూ!" అని అరిచాడు.
\s5
\v 31 వెంటనే యేసు అతని దగ్గరికి చేరి, పేతురును పైకి లాగాడు. ఆయన పేతురుతో, "నువ్వు నా శక్తిని కొంతవరకే నమ్మావు. నువ్వు మునిగిపోడానికి నేను వదిలేస్తానని ఎందుకు అనుమానించావు?" అన్నాడు.
\v 32 తరువాత యేసూ పేతురూ పడవ ఎక్కారు. వెంటనే అప్పటి వరకూ బలంగా వీస్తున్న గాలి ఆగిపోయింది.
\v 33 పడవలో ఉన్న శిష్యులందరూ వంగి యేసుకు నమస్కారం చేసి, "నువ్వు నిజంగా దేవుని కుమారుడివే!" అన్నారు.
\s5
\p
\v 34 వాళ్ళు సరస్సు చుట్టు తిరిగి గెన్నేసరెతు తీర ప్రాంతానికి చేరుకున్నారు.
\v 35 అక్కడి వాళ్ళు యేసును గుర్తుపట్టారు. యేసు వచ్చాడనే వార్తను ఆ ప్రాంతమంతా తెలిపారు. అక్కడి ప్రజలు యేసు దగ్గరికి రోగుల్ని తీసుకుని వచ్చారు.
\v 36 రోగులు ఆయన్ని ఒకసారి ముట్టుకోనిమ్మని, ఆయన అంగీ అంచు అయినా సరే ముట్టుకుంటే స్వస్థపడతామని వాళ్ళని బతిమాలారు. ఆయన్ను, కనీసం ఆయన అంగీ అంచును ముట్టిన వాళ్ళందరూ స్వస్థత పొందారు.
\s5
\c 15
\p
\v 1 కొందరు పరిసయ్యులూ యూదు పండితులూ కొందరు యెరూషలేము నుండి యేసుతో మాట్లాడడానికి వచ్చారు.
\v 2 వాళ్ళు, "మన పూర్వీకుల దగ్గరనుండి ఆచరిస్తున్న సంప్రదాయాన్ని మీ శిష్యులు పాటించడం లేదు. భోజనం చేసే ముందు చేతులు కడిగే ఆచారాన్ని పాటించడం లేదు" అన్నారు.
\p
\v 3 యేసు వాళ్ళకి జవాబిస్తూ, "మీరు మీ పితరులు నేర్పించినవి పాటిస్తూ, దేవుడి ఆజ్ఞలకి లోబడడం తోసిపుచ్చుతున్నారు.
\s5
\v 4 దేవుడు ఈ రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. "మీ తలిదండ్రుల్ని గౌరవించాలి, తలిదండ్రులను గురించి చెడ్డగా మాట్లాడే వాళ్లకు మరణ శిక్ష వేయాలి" అని.
\v 5 కానీ ప్రజలకు మీరేమి చెప్తారంటే, "నేను మీకు ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేస్తానని ప్రమాణం చేసాను" అని తమ తలిదండ్రులకి చెప్పొచ్చు.
\v 6 మీరు అలా చేస్తే మీ తలిదండ్రులకి ఏమీ ఇవ్వక్కరలేదు అంటారు. ఇలా దేవుడు ఆజ్ఞాపించింది పట్టించుకోరు కానీ మీ పూర్వికులు చెప్పింది చెప్పినట్టే తప్పకుండా పాటిస్తారు."
\s5
\p
\v 7 మీరు మంచి వాళ్ళల్లా మాత్రమే నటిస్తారు. మీ పితరుల గురించి దేవుడి ఆలోచన యెషయా ప్రవక్త చెప్పినప్పుడు మీ గురించి నిజాన్ని మాట్లాడుతూ,
\v 8 "వీళ్ళు నన్ను గౌరవించినట్టు మాట్లాడతారు కానీ వాళ్ళు అసలు నన్ను పట్టించుకోరు.
\v 9 ప్రజలు అనుకున్నవే సిద్ధాంతాలుగా బోధిస్తారు కాబట్టి వాళ్ళు నన్ను ఆరాధించడం వ్యర్థం" అన్నాడు.
\s5
\v 10 అప్పుడు యేసు జనాన్ని తన దగ్గరికి పిలిచాడు. ఆయన వాళ్ళతో, "నేను మీతో చెప్పేది విని అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి.
\v 11 ఒక వ్యక్తి తినడానికి నోటిలో పెట్టుకున్నదేదీ అతన్ని కలుషితం చెయ్యదు కాని, నోటి నుండి వచ్చే మాటలు మనిషిని దిగజారుస్తాయి" అన్నాడు.
\s5
\p
\v 12 తరవాత శిష్యులు యేసు దగ్గరికి వెళ్ళి, "నువ్వు చెప్పిన మాటలు పరిసయులకు కోపం తెప్పించాయి. నీకు తెలుసా?" అన్నారు.
\v 13 అప్పుడు యేసు వాళ్లకు ఈ ఉపమానం చెప్పాడు. "ఒక రైతు తను నాటని మొక్కని ఎలా వ్రేళ్ళతో సహా పీకి పడేస్తాడో, అలా పరలోకంలో ఉన్న నా తండ్రి తను చెప్పిన వాటికి వ్యతిరేకంగా బోధించే వాళ్ళని వదిలించేసుకుంటాడు."
\p
\v 14 "పరిసయుల్ని ఏమీ పట్టించుకోవద్దు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపించలేడు. అలా చేస్తే ఇద్దరూ కలిసి గుంటలో పడతారు. అలాగే దేవుని ఆజ్ఞల్ని ప్రజలు అర్థం చేసుకోడానికి వాళ్ళు సాయం చెయ్యలేరు."
\s5
\v 15 ఒక వ్యక్తి తినే భోజనం గురించి చెప్పిన ఉదాహరణ వివరించమని యేసును పేతురు అడిగాడు.
\v 16 యేసు వాళ్ళకు ఇలా జవాబు చెప్పాడు, "నేను మీకు బోధించేది కచ్చితంగా అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోలేక పోవడం నన్ను నిరాశ పరిచింది."
\p
\v 17 "మీరు తప్పక అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, మనుషులు ఏది తిన్నా అది వాళ్ళ కడుపులోకి వెళ్తుంది. తరవాత శరీరంలో నిలిచిపోయింది బయటికి వచ్చేస్తుంది.
\s5
\v 18 నోటితో మాట్లాడే చెడ్డమాటలు దేవుడు ఆ వ్యక్తిని తృణీకరించేలా చేస్తుంది. హృదయంలో మనిషి చేసే చెడు ఆలోచనల నుండి అవి వస్తాయి.
\v 19 చెడు ఆలోచనలు, హత్య, వ్యభిచారం, ఇతర లైంగిక పాపాలు, దొంగతనం, అబద్ద సాక్ష్యం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం హృదయంలోనుండే వస్తాయి.
\v 20 దేవుడు మనుషుల్ని అంగీకరించకుండా చేసేవి అవే. కానీ చేతులు కడుక్కోకుండా తినడం దేవుడు తృణీకరించడానికి కారణం కాదు."
\s5
\p
\v 21 యేసు శిష్యుల్ని తీసుకుని గలిలయ జిల్లాకు వెళ్ళి, తూరు సీదోను పట్టణాలు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు.
\v 22 ఆ ప్రాంతంలో ఉంటున్న కానాను గుంపుకు చెందిన ఒక స్త్రీ యేసు దగ్గరికి వచ్చింది. ఆమె గట్టిగా అరుస్తూ, "ప్రభూ నువ్వు దావీదు మహారాజు సంతతికి చెందిన వాడివి. నువ్వు క్రీస్తువు. నా మీద, నా కూతురు మీద జాలి చూపించు. ఆమె దయ్యం అదుపులో ఉండి, చాలా బాధపడుతుంది" అంది.
\v 23 కానీ యేసు ఆమెకి జవాబు చెప్పలేదు. శిష్యులు ఆయనతో, "ఆమె అరుచుకుంటూ, మన వెనకే వస్తూ ఇబ్బంది పెడుతుంది. వెళ్ళిపొమ్మని చెప్పు" అన్నారు.
\s5
\v 24 "తప్పిపోయిన గొర్రెల్లా ఉన్న ఇశ్రాయేలు ప్రజల కోసమే దేవుడు నన్ను పంపాడు" అని యేసు ఆమెతో చెప్పాడు.
\v 25 కానీ ఆ స్త్రీ యేసుకు ఇంకా దగ్గరికి వచ్చి, ఆయన ముందు మోకరించి, బ్రతిమాలుతూ, "ప్రభూ, సాయం చెయ్యవా" అని అడిగింది.
\p
\v 26 అప్పుడు ఆయన ఆమెతో, "పిల్లల కోసం సిద్ధపరచిన ఆహారాన్ని ఇంట్లోని కుక్క పిల్లలకి వెయ్యడం భావ్యం కాదు" అన్నాడు.
\s5
\v 27 కాని ఆ స్త్రీ జవాబిస్తూ, "ప్రభూ! మీరు చెప్పింది సబబే. కానీ కుక్కపిల్లలు కూడా యజమాని భోజనం చేసే బల్ల మీద నుండి క్రింద పడిన రొట్టె ముక్కల్ని తింటాయి కదా" అంది.
\v 28 అప్పుడు యేసు ఆమెతో, "ఓ స్త్రీ! నా మీద నీకు స్థిరంగా నమ్మకముంది కాబట్టి నువ్వు కోరుకున్నట్టే నీ కూతుర్ని స్వస్థపరుస్తాను" అన్నాడు. ఆ క్షణమే ఆమె కూతుర్ని దయ్యం వదిలి పోయింది. ఆమె బాగయ్యింది.
\s5
\p
\v 29 తరవాత యేసు , ఆయన శిష్యులు ఆ ప్రదేశం వదిలి, గలిలయ సముద్రం దగ్గరలో ఉన్న కొండ పైకి ఎక్కి ప్రజలకి బోధించడానికి కూర్చున్నాడు.
\v 30 అక్కడ తరవాతి రెండు రోజులూ జనం పెద్ద గుంపులుగా వస్తూనే ఉన్నారు. కుంటివాళ్ళని, గుడ్డివాళ్ళని, మూగవాళ్ళని, ఇతర వ్యాధులతో ఉన్నవాళ్ళని యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. బాగు చెయ్యడానికి వాళ్ళని ఆయన ముందు ఉంచారు. ఆయన వాళ్ళని బాగుచేసాడు.
\v 31 మూగవాళ్ళు మాట్లాడడం, కుంటివాళ్ళు నడవడం, వికలాంగులు బాగుపడడం, గుడ్డివాళ్లకు చూపు రావడం చూసి అక్కడివాళ్లు ఆశ్చర్యపడ్డారు. "ఇశ్రాయేలు దేశంలో మన మీద ఏలిక చేస్తున్న దేవునికి స్తోత్రం!" అన్నారు.
\s5
\p
\v 32 అప్పుడు యేసు తన శిష్యుల్ని పిలిచి, "వాళ్ళందరూ నాతో మూడు రోజులుగా ఉంటున్నారు. వాళ్లకి తినడానికి ఏమీ లేదని విచారంగా ఉంది. ఆకలితో వాళ్ళని పంపివేయడం నాకు ఇష్టం లేదు. అలా చేస్తే మధ్యలో వాళ్ళు మూర్చపోవచ్చు" అన్నాడు.
\v 33 అప్పుడు శిష్యులు, "ఇది ఎవరూ నివసించే స్థలం కాదు. ఇంత పెద్ద జన సమూహానికి సరిపడేంత ఆహారం తేవడం కష్టం" అన్నారు.
\v 34 "మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి" అని యేసు వాళ్ళని అడిగాడు. వాళ్ళు, "ఏడు చిన్న రొట్టెలు, వండిన రెండు చిన్న చేపలు ఉన్నాయి" అన్నారు.
\v 35 అప్పుడు యేసు జనాన్ని నేల మీద కూర్చోమన్నాడు.
\s5
\p
\v 36 ఆయన ఏడు రొట్టెలు, రెండు వండిన చేపల్ని తీసుకుని, దేవునికి వందనాలు చెప్పి, వాటిని ముక్కలు చేసి, వాళ్లకి ఇస్తూ ఉండమని శిష్యులకి చెప్పాడు. అప్పుడు శిష్యులు జనానికి పంచసాగారు.
\v 37 యేసు అద్భుతంగా ఆహారాన్ని విస్తారం చేసాడు. వాళ్ళందరూ కావలసినంత తృప్తిగా తిన్నారు. శిష్యులు మిగిలిన ముక్కల్ని పోగుచేశారు. అవి ఏడు పెద్ద గంపలు అయ్యాయి.
\v 38 అక్కడ భోజనం చేసిన పురుషులు నాలుగు వేల మంది. స్త్రీలని, పిల్లల్ని లెక్కపెట్టిన వాళ్ళు లేరు.
\p
\v 39 యేసు ప్రజలందరినీ పంపించేసి, ఆయన, శిష్యులు పడవ ఎక్కి సరస్సు మీద పడవ నడుపుకుంటూ మగదాను ప్రాంతానికి వెళ్ళారు.
\s5
\c 16
\p
\v 1 ఒకసారి కొంతమంది పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు దగ్గరికి వచ్చి, "యేసూ, నువ్వు నిజంగా దేవుడే నిన్ను పంపాడని మాకు నమ్మకం కుదిరేలా దేవుడి శక్తిని ఉపయోగించి ఒక అద్బుతం చేసి చూపించు" అన్నారు.
\v 2 అందుకు యేసు వాళ్ళతో, "మన దేశంలో సాయంత్రం పూట ఆకాశం ఎర్రగా కనబడితే "రేపంతా వాతావరణం చక్కగా ఉంటుంది" అని చెబుతాం."
\s5
\p
\v 3 "అదే పొద్దున పూట ఆకాశం ఎర్రగా కనిపిస్తే, "ఈ రోజు మబ్బులతో గాలివాన కురుస్తుందేమో" అని చెబుతాం. ఆకాశంలోకి చూసి మన చుట్టుపక్కల ఏమి జరగబోతుందో మీరు చెప్పగలుగుతున్నారు గానీ దేవుడు చేసే పనులను గురించి మీరు అర్థం చేసుకోలేరు.
\v 4 చెడ్డవాళ్లైన మీరు సూచక క్రియలు అడుగుతున్నారు గాని మీరు దేవుని మనసారా పూజింపరు. కాబట్టి ఒక పెద్ద చేప కడుపులో మూడు రోజులు గడిపి తిరిగి వచ్చిన యోనా ప్రవక్తను గురించిన సూచక క్రియ తప్పించి మీకు ఎలాంటి సూచనా ఇవ్వడం జరగదు" అన్నాడు.
\s5
\p
\v 5 తరువాత యేసు శిష్యుల్ని వెంటబెట్టుకుని గలిలయ సముద్రం ఒడ్డుకు బయలుదేరాడు. అక్కడకు చేరిన తరువాత, తినడానికి ఏమీ తమతోపాటు తెచ్చుకోలేదన్నసంగతి శిష్యులకు గుర్తుకు వచ్చింది.
\v 6 అదే సమయంలో యేసు, "పొంగజేసే పదార్థం లాంటి పరిసయ్యుల, సద్దూకయ్యుల పొంగజేసే పిండిని గురించి జాగ్రత్తగా ఉండండి" అని చెప్పాడు.
\v 7 యేసు చెప్పిన ఈ మాటలను శిష్యులు తప్పుగా అర్థం చేసుకున్నారు. తినడానికి ఏమీ తేలేదని యేసు ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళలో వాళ్ళు చెప్పుకున్నారు.
\v 8 యేసు వాళ్ళు మాట్లాడుకుంటున్నది తెలుసుకుని, "నేను పరిసయ్యులు, సద్దూకయ్యుల వంటి పొంగజేసే పిండిని గురించి మాట్లాడుతుంటే మీరేమో మనం రోజూ తినే రొట్టెల గురించి మాట్లాడుతున్నారు. నాకెంతో బాధ కలుగుతుంది. నేను చిన్న చిన్నపనులు మాత్రమే చేస్తానని నమ్ముతున్నారు."
\s5
\p
\v 9 "నేను తిండి గురించి కంగారు పడుతున్నానని అస్సలు అనుకోవద్దు. నేను ఒకసారి ఐదు రొట్టెలను దీవించి ఐదు వేలమంది ఆకలి తీర్చాను. అప్పుడు మిగిలిపోయిన రొట్టెలు మీరే గంపల్లోకి పోగుచేశారు.
\v 10 ఇంకోసారి ఏడు రొట్టె ముక్కలతో నాలుగు వేలమంది ఆకలి తీర్చానన్న సంగతి మీరు మర్చిపోయారా? అప్పుడు కూడా మిగిలిపోయిన రొట్టెలు గంపల్లోకి ఎత్తింది మీరే కదా.
\s5
\p
\v 11 "నేను రొట్టెల గురించి మాట్లాడడం లేదని మీరు అర్థం చేసుకోవాలి. పరిసయ్యులు, సద్దూకయ్యుల వంటి పొంగజేసే పిండిని గురించి నేను మాట్లాడుతున్నాను."
\v 12 అప్పుడు శిష్యులు, యేసు రొట్టేలలో వేసే పొంగజేసే పిండి గురించి మాట్లాడడం లేదనీ, పరిసయ్యులు, సద్దూకయ్యులు బోధించే తప్పుడు విషయాల గురించి మాట్లాడుతున్నాడని అర్థం చేసుకున్నారు.
\s5
\p
\v 13 తరువాత యేసు తన శిష్యులతో కలసి కైసరయ ఫిలిప్పి ప్రాంతానికి వచ్చాడు. "నేను నిజంగా మనుష్యకుమారుడినని ప్రజలు చెప్పుకుంటున్నారా?" అని శిష్యుల్ని అడిగాడు.
\v 14 అప్పుడు వాళ్ళు, "కొందరు నువ్వు మళ్ళీ బ్రతికి వచ్చిన బాప్తిసమిచ్చే యోహానువనీ, మరికొందరు దేవుడు చెప్పినట్టు పరలోకం నుండి దిగి వచ్చిన ఏలీయావనీ, కొందరేమో పూర్వం జీవించిన యిర్మీయా లాంటి ప్రవక్తలలో ఒకడివని చెప్పుకుంటున్నారు" అని చెప్పారు.
\p
\v 15 "అలాగైతే నా గురించి మీరు ఏమనుకుంటున్నారు?" అని యేసు అడిగాడు.
\v 16 అప్పుడు సీమోను పేతురు "నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడైన మెస్సీయవి" అన్నాడు.
\s5
\v 17 అప్పుడు యేసు, "యోనా కొడుకువైన సీమోనూ, నువ్వు ఈ మాట చెప్పి దేవుడికి సంతోషం కలిగించావు. వేరే మనుషులెవ్వరూ నీకు ఈ విషయం చెప్పలేదు. పరలోకంలో ఉన్న దేవుడే నువ్వు ఈ విషయం గ్రహించేలా చేశాడు.
\v 18 ఇదిగో చెప్తున్నా విను: నువ్వు పేతురువు. అంటే నువ్వు రాయిలాంటి వాడివి. ఒక ఇల్లు కట్టేటప్పుడు పునాది రాయి ఎంత ముఖ్యమో నువ్వు అలాంటివాడివి. నన్ను నమ్మిన వాళ్ళందరికీ నువ్వు అండగా ఉంటావు. మృత్యు బలం కూడా నీ ముందు నిలబడలేదు."
\s5
\p
\v 19 యేసు ఇంకా ఇలా అన్నాడు, "ఈ మనుషులు దేవుని రాజ్యంలో ప్రవేశించే తలుపులు తీయడానికి, మూయడానికి నీకు అధికారం ఇవ్వబడుతుంది. ఇక్కడ నువ్వు ఒప్పుకున్నవాటిని పరలోకంలో దేవుడు ఒప్పుకుంటాడు, నువ్వు కాదన్నవాటిని దేవుడు కాదంటాడు."
\p
\v 20 తరువాత యేసు, తానే మెస్సీయ అన్నవిషయం ఎవ్వరికీ చెప్పవద్దని తన శిష్యులను గట్టిగా హెచ్చరించాడు.
\s5
\p
\v 21 ఇక అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్ళవలసి ఉన్నదనీ, అక్కడ అధికారులైన పెద్దల ద్వారా, ప్రధాన యాజకుల ద్వారా, యూదు చట్టాలు బోధించే పండితుల ద్వారా హింసించబడి చనిపోతాననీ, తరువాత మూడవ రోజున మళ్ళీ బ్రతికి తిరిగి లేస్తాననీ చెప్పడం మొదలుపెట్టాడు.
\v 22 ఇది విన్న పేతురు యేసును పక్కకు తీసుకువెళ్ళాడు. "ప్రభూ, దేవుడు ఇలా జరగకుండా చెయ్యాలి. ఇది నీకు ఎట్టి పరిస్థితిలో జరగకూడదు" అని గద్దింపు స్వరంతో అన్నాడు.
\p
\v 23 అప్పుడు యేసు పేతురు వైపు చూసి, "నా దగ్గర నుండి వెళ్ళిపో! సాతాను నీలో ప్రవేశించి ఇలా మాట్లాడిస్తున్నాడు. నువ్వు నాచేత పాపం చేయించాలని చూస్తున్నావు, నువ్వు దేవుడు ఆలోచిస్తున్నట్టు కాకుండా మనుషుల్లాగా ఆలోచిస్తున్నావు."
\s5
\p
\v 24 తరువాత యేసు శిష్యులతో, "ఎవరైనా నన్ను నమ్మి నా అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటే వాళ్ళు తమకున్నవన్నీ విడిచిపెట్టి, తమ సొంత సిలువను మోసుకుంటూ నన్ను వెంబడించాలి."
\v 25 తన ప్రాణం కాపాడుకోవాలని ప్రయత్నం చేసేవాడు అందుకు బదులు తన ప్రాణం పోగొట్టుకుంటాడు. అయితే నా కోసం తన ప్రాణం పోగొట్టుకొనేవాడు దాన్ని దక్కించుకుంటాడు.
\v 26 ఒక మనిషి ఈ లోకంలో తాను కోరుకున్నదంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏమి దక్కుతుంది? తన ప్రాణంకన్నా విలువైనది మనిషి ఏమి ఇవ్వగలడు?
\s5
\p
\v 27 జాగ్రత్తగా వినండి. మనుష్య కుమారుడినైన నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకం నుండి దూతలతో కలసి ఈ లోకానికి తిరిగి వస్తాను. అప్పుడు తండ్రి మహిమ వెలుగు నాపై ఉంటుంది. నేను ఈ లోకంలో ప్రతివారికీ వాళ్ళు చేసిన అన్ని రకాల పనులబట్టి వాళ్లకు బహుమతులు ఇస్తాను.
\v 28 ఇప్పుడు ఇక్కడ నన్ను చూస్తున్నవాళ్ళలో కొందరు వాళ్ళు చనిపోకముందే నేను రారాజుగా పరలోకం నుండి దిగి రావడం చూస్తారని మీతో కచ్చితంగా చెప్తున్నాను.
\s5
\c 17
\p
\v 1 ఒక వారం రోజులు గడిచిన తర్వాత యేసు పేతురు, యాకోబు, యాకోబు తమ్ముడు యోహానులను వెంటబెట్టుకుని మనుషులకు దూరంగా ఒక ఎత్తైన కొండ పైకి తీసుకువెళ్ళాడు.
\v 2 వాళ్ళు అక్కడ ఉన్న సమయంలో శిష్యులు ముగ్గురూ చూస్తూ ఉండగానే యేసు రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వేసుకున్న బట్టలు వెలుగుతో ధగధగలాడాయి.
\s5
\p
\v 3 ఉన్నట్టుండి పూర్వ కాలంలో జీవించిన ప్రవక్తలు మోషే, ఏలీయాలు అక్కడికి దిగివచ్చి యేసుతో మాట్లాడుతున్నారు.
\v 4 ఇది చూసిన పేతురు యేసుతో, "ప్రభూ, మనం ఇక్కడే ఉండిపోతే చాలా బాగుంటుంది. నువ్వు చెప్తే నీకు ఒకటీ, మోషేకి ఒకటీ, ఏలీయాకు ఒకటీ మూడు పాకలు వేస్తాను" అన్నాడు.
\s5
\p
\v 5 పేతురు అలా మాట్లాడుతూ ఉండగానే, గొప్ప వెలుగుతో నిండిన ఒక మేఘం వాళ్ళను కమ్మివేసింది. ఆ మేఘంలో నుంచి దేవుడు పలికిన మాటలు వినబడ్డాయి, "ఈయన నేను ప్రేమించే నా కుమారుడు. ఈయన గురించి నేను ఆనందంగా ఉన్నాను. మీరు ఈయన మాట తప్పకుండా వినండి."
\p
\v 6 దేవుని మాటలు విన్న ఆ ముగ్గురు శిష్యులు భయంతో వణికిపోయారు. నేల మీద బోర్లా పడిపోయారు.
\v 7 యేసు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళను తట్టి లేపాడు. "ఏమీ భయం లేదు, లేచి నిలబడండి" అని చెప్పాడు.
\v 8 వాళ్ళు లేచి చూసినప్పుడు అక్కడ యేసు తప్పించి ఇంకెవ్వరూ వాళ్లకు కనబడలేదు.
\s5
\p
\v 9 వాళ్ళు కిందికి దిగి వచ్చేటప్పుడు యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "మనుష్యకుమారుడు చనిపోయి తిరిగి లేచే రోజుదాకా మీరు చూసిన ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు."
\v 10 అప్పుడు శిష్యులు, "నువ్వు చెప్తున్నది నిజమైతే, యూదు చట్టాలు బోధించే బోధకులు మెస్సీయ రాక ముందు మొదట ఏలీయా రావాలని చెప్తున్నారు కదా. ఏది నిజం?" అని అడిగారు.
\s5
\p
\v 11 యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "మీరు అంటున్నది నిజమే, మెస్సీయ రాకను సిద్ధం చేయడానికి ఏలీయాను పంపుతానని దేవుడు వాగ్దానం చేశాడు.
\v 12 అయితే ఇది గమనించండి: ఏలీయా ఇప్పటికే వచ్చాడు. మన నాయకులు అతణ్ణి చూశారు గానీ, అతడే మెస్సీయా కంటే ముందుగా పంపబడినవాడని వాళ్ళు గుర్తించలేదు. బదులుగా వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు అతణ్ణి బాధించారు. అదే విధంగా వాళ్ళు పరలోకం నుండి వచ్చిన నన్ను కూడా శ్రమలపాలు చేస్తారు."
\v 13 యేసు, ఏలీయాను బాప్తిసమిచ్చే యోహానుతో పోల్చి చెబుతున్నాడని శిష్యులు అర్థం చేసుకున్నారు.
\s5
\p
\v 14 తరువాత యేసు తన ముగ్గురు శిష్యులతో దిగి వచ్చినప్పుడు మిగిలిన శిష్యులు, జన సమూహాలు వాళ్ళతో కలిశారు. అప్పుడు ఒక వ్యక్తి యేసు ఎదుటికి వచ్చి ఆయన ముందు మోకరించి, ఇలా చెప్పాడు,
\v 15 "అయ్యా, నా కొడుకుని కనికరించి, వాణ్ణి బాగుచెయ్యి. వాడు మూర్చరోగంతో బాధపడుతున్నాడు. ఈ రోగంవల్ల వాడు పదే పదే నీళ్ళలో, నిప్పుల్లో పడిపోతూ ఉన్నాడు.
\v 16 నీ శిష్యులు బాగుచేస్తారని వాళ్ళ దగ్గరకి తీసువెళ్ళాను, వాళ్లకు వీలవ్వలేదు."
\s5
\p
\v 17 అప్పుడు యేసు, "దేవుని శక్తిని నమ్మలేని గందరగోళ పరిస్థితిలో ఉన్న ఈ తరం మనుషులారా, నేను చేస్తున్నట్టు మీరు ఎప్పటికి చేయగలుగుతారు? నేను ఎంతకాలం మీతోపాటు ఉంటాను? ఆ పిల్లవాణ్ణి నా దగ్గరికి తీసుకురండి" అన్నాడు.
\v 18 వాళ్ళు ఆ బాలుణ్ణి తీసుకువచ్చినప్పుడు యేసు అతణ్ణి పట్టి పీడుస్తున్న దురాత్మను తీవ్రంగా గద్దించాడు. ఆ దురాత్మ పిల్లవాణ్ణి విడిచిపెట్టింది. వెంటనే పిల్లవాడు బాగుపడ్డాడు.
\s5
\p
\v 19 తరువాత కొందరు శిష్యులు యేసు ఒక్కడే ఉన్న సమయంలో ఆయన దగ్గరికి వచ్చి, "మేమెందుకు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాం?" అని అడిగారు.
\p
\v 20 ఆయన ఇలా జవాబిచ్చాడు, "మీరు దేవుని శక్తి మీద పూర్తి నమ్మకం ఉంచలేదు. ఇది ఆలోచించండి. ఆవగింజలు చూడండి, అవి చాలా చిన్నవి. అవి పెరిగినప్పుడు మొక్కలుగా అవుతాయి.
\v 21 అదే విధంగా మీ విశ్వాసం కొంచెంగా ఉన్నప్పటికీ మీరు దేవుని ఏది అడిగినా ఆయన తప్పకుండా మీకు చేస్తాడు. ఈ కొండను చూసి, "ఇక్కడినుంచి అవతలికి వెళ్ళు" అని మీరు చెప్తే, అది మీరు చెప్పినట్లు పక్కకు వెళ్తుంది."
\s5
\p
\v 22 గలిలయ ప్రాంతంలో వాళ్ళంతా ఉన్నప్పుడు యేసు, "త్వరలో మనుష్య కుమారుడు విరోధుల చేతికి చిక్కుతాడు.
\v 23 వాళ్ళు నన్ను చంపుతారు. అయితే నేను చనిపోయిన మూడవ రోజున దేవుడు నన్ను బ్రతికిస్తాడు." ఇది విన్న శిష్యులు ఎంతో విచారంలో మునిగిపోయారు.
\s5
\p
\v 24 యేసు, ఆయన శిష్యులు కపెర్నహూముకు చేరుకున్నారు. దేవాలయం పన్ను కట్టించుకునే వ్యక్తి పేతురు దగ్గరకు వచ్చి, "మీ గురువుగారు దేవాలయం పన్ను కట్టడా ఏంటి?" అని అడిగాడు.
\p
\v 25 అందుకు పేతురు "తప్పకుండా కడతాడు" అని చెప్పి యేసు ఉన్న గదిలోకి వచ్చే లోపుగానే యేసు సీమోనుతో, "సీమోనూ, రాజులు పన్నులు ఎవరి దగ్గర వసూలు చేస్తారు? తమ సొంత దేశ ప్రజల నుండా, లేక ఆక్రమించుకున్న ఇతర దేశాల ప్రజల నుండా?" అని అడిగాడు.
\s5
\p
\v 26 అందుకు పేతురు "ఇతర దేశాల ప్రజల నుండే" అని చెప్పాడు. యేసు, "కాబట్టి సొంత దేశ ప్రజలు పన్ను కట్టనవసరం లేదు కదా?
\v 27 అయినప్పటికీ వెళ్ళి మనందరి కోసం ఆలయం పన్ను కట్టు. లేకపోతే వాళ్ళకు కోపం వస్తుంది. పన్ను కట్టడానికి డబ్బు కోసం నువ్వు గలిలయ సముద్రానికి వెళ్ళు. అక్కడ గాలం వేసి చేపలు పట్టు. మొదటగా దొరికిన చేపను తీసుకుని దాని నోట్లో దొరికిన వెండి నాణెం తీసుకుని పన్ను వసూలుదారునికి చెల్లించు. దాని విలువ మనం కట్టాల్సిన పన్ను మొత్తానికి సరిపోతుంది" అని చెప్పాడు.
\s5
\c 18
\p
\v 1 రోజులు గడుస్తూ ఉన్నప్పుడు ఒక సమయంలో శిష్యులు యేసు దగ్గరకు వచ్చారు. "దేవుడు నిన్ను పరలోకానికి రాజుగా చేసినప్పుడు మాలో ఎవరిని గొప్పవాడుగా ఎంచుతావు?" అని యేసును అడిగారు.
\v 2 అప్పుడు యేసు ఒక పిల్లవాణ్ణి పిలిచి మధ్యలో నిలబెట్టాడు.
\v 3 "నిజం చెప్తున్నాను వినండి. మీరు మార్పు చెంది ఇలాంటి చిన్నపిల్లల వంటి తగ్గింపు మనస్సు పొందకపోతే మీరు ఎన్నటికీ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు."
\s5
\p
\v 4 "చిన్నపిల్లవాడిలాగా ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు పరలోకంలో గొప్పవాళ్ళుగా ఎంచబడతారు.
\v 5 ఇంకా, ఇలాంటి పిల్లల్ని నా పేరట ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళు నన్ను చేర్చుకున్నట్టుగానే దేవుడు చూస్తాడు."
\p
\v 6 "నన్ను నమ్మినవాళ్ళను, లేదా చిన్నపిల్లలను అల్పులుగా భావించి వాళ్ళను పాపం చేయమని పురిగొల్పే వ్యక్తిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు. అలాంటి వాడి మెడకు ఒక పెద్ద బరువైన రాయి కట్టి లోతుగా ఉన్న సముద్రంలో పడవేయడమే అలాంటివాడికి తగిన శిక్ష."
\s5
\p
\v 7 "ఇతరులను పాపం చేయడానికి ప్రేరేపించడం ఎంత దారుణం! పాపంలో పడేసే అనేక శోధనలు ఎదురౌతాయి. అయితే ఒక వ్యక్తి మరో వ్యక్తిని పాపంలో పడేలా చేయడం క్షమించరాని నేరం.
\v 8 కాబట్టి నీ చేతులు గానీ, కాళ్ళు గానీ పాపం చేయాల్సివస్తే వాటిని వాడడం మానేయండి. తప్పని పరిస్థితిలో పాపం చేయాల్సివస్తే పాపం చెయ్యకుండా ఉండేందుకు వాటిని నరికివేయండి. ఒకవేళ నువ్వు రెండు కాళ్ళు, రెండు చేతులు కలిగి ఉండి దేవుడి చేత నరకంలో త్రోయబడి నానా యాతనలు పడేకంటే, ఒక చెయ్యి ఒక కాలుతో పరలోకంలో కలకాలం జీవించడం మంచిది కదా."
\s5
\p
\v 9 "అవును, నీ కళ్ళతో పాపపు పనులు చూడాల్సివస్తే అలాంటి పనులు చూడకు. తప్పనిసరి అయితే పాపం చూడకుండా, చెయ్యకుండా ఉండేందుకు నీ కంటిని పెరికి వెయ్యి. రెండు కళ్ళు కలిగి ఉండి నిత్యమైన నరక శిక్ష అనుభవించేకంటే, ఒంటి కన్నుతో దేవునితో కలసి పరలోకంలో కలకాలం జీవించడం మేలు కదా."
\s5
\p
\v 10 "చిన్నపిల్లలలో ఎవరినీ తక్కువగా చూడవద్దు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పరలోకంలో దూతలు పిల్లల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటారు.
\v 11 మీలో ఎవరైనా చిన్న పిల్లలకు హాని కలిగిస్తే దూతలు మీపై దేవుడికి ఫిర్యాదు చేస్తారు."
\s5
\p
\v 12 "ఒక విషయం చెబుతాను, ఆలోచించండి. నీకు వంద గొర్రెలు ఉన్నాయనుకో. వాటిల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోయింది. అప్పుడు నువ్వేం చేస్తావు? మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెల్ని కొండ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టి తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెను వెదకడానికి వెళ్తావు కదా.
\v 13 ఆ గొర్రెపిల్ల కనబడినప్పుడు నీకు ఎంతో సంతోషం కలుగుతుంది కదా. మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెల గురించి కంటే తప్పిపోయిన ఒక్క గొర్రె దొరికినప్పుడు నీకు కలిగే ఆనందం ఎక్కువగా ఉంటుంది.
\v 14 అదే విధంగా తప్పిపోయిన గొర్రె విషయం గొర్రెల కాపరి ఆనందించినట్టు ఈ చిన్నపిల్లల్లో ఎవ్వరూ తప్పిపోయి నరకంలో పడకుండా ఉండాలని పరలోకంలోని తండ్రియైన దేవుడు కోరుకుంటున్నాడు."
\s5
\p
\v 15 "నీ తోటి విశ్వాసి ఎవరైనా నీకు వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతణ్ణి కలుసుకుని అతనితో మాట్లాడు. అతడు నువ్వు చెప్పినది విని చేసిన తప్పును గ్రహించి క్షమాపణ కోరితే నువ్వు మంచి స్నేహితుణ్ణి సంపాదించుకున్నవాడివౌతావు.
\v 16 ఒకవేళ అతడు నీ మాట వినకపోతే ఇద్దరు విశ్వాసులను వెంటబెట్టుకు వెళ్ళు. ప్రతి విషయం ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల ఎదుట రుజువు కావాలి గనక ఈ విధంగా చెయ్యి."
\s5
\p
\v 17 "అప్పుడు కూడా నీ విషయంలో తప్పు చేసిన వ్యక్తి మాట వినకపోతే అతణ్ణి సరిదిద్దమని మీ సంఘం అంతటికీ విషయం చెప్పు. అప్పుడు కూడా అతడు వాళ్ళ మాట వినకపోతే ఇక అతణ్ణి సమాజం నుంచి వెలివేయబడిన వాడుగా, మనసు లేని కసాయివాడిగా ఎంచు."
\s5
\p
\v 18 "ఈ విషయం గుర్తు పెట్టుకోండి. మీ సమాజంలో ఎవరినైతే మీరు దండించాలని కోరుకుంటారో, లేదా మెచ్చుకుంటారో అదే విధంగా పరలోకంలో కూడా జరుగుతుంది.
\v 19 మరో విషయం, ఈ లోకంలో కనీసం ఇద్దరు, లేదా అంతకంటే ఎక్కువమంది కూడుకుని కలసి ఏక మనసుతో దేని గురించైనా ప్రార్ధిస్తే దాన్ని దేవుడు తప్పక నెరవేరుస్తాడు.
\v 20 ఇది నిజం. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నన్ను నమ్మి కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను."
\s5
\p
\v 21 తరువాత పేతురు యేసు దగ్గరకు వచ్చి, "నా తోటి విశ్వాసి నాపట్ల తప్పు చేసి క్షమాపణ కోరితే నేను అతణ్ణి ఎన్నిసార్లు క్షమించాలి? ఏడుసార్లు సరిపోతుందా?" అని అడిగాడు.
\v 22 అందుకు యేసు, "ఏడుసార్లు మాత్రమే కాదు, డెభ్భై ఏడు సార్ల వరకైనా క్షమించాలని నేను నీతో చెప్తున్నాను" అని చెప్పాడు.
\s5
\p
\v 23 దీనిని పరలోక రాజ్యాన్ని తన సేవకులతో డబ్బు లెక్కలు సరిచూసుకునే రాజుతో పోల్చవచ్చు. ఆ రాజు తనకు బాకీ ఉన్న సేవకుల నుండి డబ్బు వసూలు చేసుకోవాలని కోరుకున్నాడు.
\p
\v 24 సేవకులు తమ తమ లెక్కలు సరిచూసుకునేందుకు రాజు దగ్గరకు వచ్చారు. రాజు సేవకుడు బాకీ ఉన్న ఒకణ్ణి తీసుకువచ్చాడు. వాడు రాజుగారికి మూడు లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు.
\v 25 అయితే బాకీ తీర్చడానికి వాడి దగ్గర అంత డబ్బు లేదు. రాజు వాడి భార్యా పిల్లల్ని, ఆస్తిపాస్తుల్ని అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు.
\s5
\p
\v 26 అంత పెద్ద మొత్తం తీర్చే స్తోమత వాడికి లేదు. కాబట్టి వాడు రాజుగారి కాళ్ళమీద పడి, "అయ్యా, నాకు కొంచెం సమయం ఇవ్వండి. నేను బాకీ తప్పకుండా తీరుస్తాను" అని బతిమాలుకున్నాడు.
\p
\v 27 వాడు తన బాకీ తీర్చలేడని రాజు గ్రహించాడు. వాడి మీద జాలిపడ్డాడు. వాడు ఇవ్వాల్సిన బాకీ మొత్తం రద్దు చేసి వాణ్ణి విడిచిపెట్టాడు.
\s5
\p
\v 28 "అప్పుడు వాడు తనకు చిన్న మొత్తం బాకీ ఉన్న మరొక సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. వాడి పీక పట్టుకుని "నా బాకీ వెంటనే తీర్చు"అంటూ అతణ్ణి వేధించడం మొదలుపెట్టాడు.
\v 29 అందుకు ఆ సేవకుడు వాడి కాళ్ళు పట్టుకుని "కొంచెం ఓపిక పట్టు. నీ బాకీ నెమ్మదిగా తీర్చుకుంటాను" అని వేడుకున్నాడు."
\s5
\p
\v 30 "అయితే ఆ మొదటి సేవకుడు ఏ మాత్రం జాలి చూపకుండా బాకీ రద్దు చేయడానికి నిరాకరించాడు. అందుకు బదులు అతణ్ణి గురించి అధికారులకు ఫిర్యాదు చేసి తన బాకీ తీర్చేవరకు జైలులో పెట్టించాడు.
\v 31 ఇదంతా గమనించిన మిగిలిన పనివాళ్ళు వాడు చేసిన పనికి బాధపడ్డారు. వాళ్ళు రాజుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా రాజుకు వివరించారు."
\s5
\p
\v 32 "రాజుకి కోపం వచ్చింది. వెంటనే రాజు తన సేవకుల్ని పంపించాడు, వాళ్ళు రాజుకు పెద్ద మొత్తం బాకీ ఉన్న ఆ సేవకుణ్ణి బంధించి తీసుకువచ్చారు. అప్పుడు రాజు, "నీ నీచమైన బుద్ది బయటపెట్టావు. దుర్మార్గుడా, నువ్వు బతిమాలుకున్నావని నీమీద జాలిపడి నీ బాకీ మొత్తం రద్దు చేశాను.
\v 33 అలాగే నేను చేసినట్టు నువ్వు కూడా నీకు బాకీ ఉన్నవాడిపై జాలి చూపించి వాణ్ణి వదిలిపెట్టాలి కదా, అని చెప్పి,
\s5
\v 34 "తన సైనికులని పిలిచి వాడు తనకు బాకీ ఉన్న మొత్తం చెల్లించే వరకు వాణ్ణి తీవ్రంగా హింసించి చెరసాలలో ఉంచమని ఆజ్ఞాపించాడు."
\p
\v 35 "మీలో ప్రతి ఒక్కరూ మీ సాటి విశ్వాసుల విషయంలో నిజాయితీ కలిగి, కనికరం చూపించకపోతే దేవుడు కూడా మీ విషయంలో అలాగే ప్రవర్తిస్తాడు" అని వాళ్ళతో చెప్పాడు.
\s5
\c 19
\p
\v 1 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత తన శిష్యులతో కలసి గలిలయ ప్రాంతం నుండి యొర్దాను నది పక్కన ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్ళాడు.
\v 2 అక్కడ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను వెంబడించారు. వాళ్ళలో జబ్బు పడి ఉన్న చాలా మందిని యేసు బాగుచేశాడు.
\s5
\p
\v 3 కొందరు పరిసయ్యులు యేసుకు చిరాకు కలిగించి ఆయనతో వాదులాట పెట్టుకోవడానికి అక్కడికి వచ్చారు. వాళ్ళు యేసుని, "ఎలాంటి కారణం వలనైనా ఒక పురుషుడు తన భార్యను వదిలెయ్యడాన్ని యూదుల చట్టం ఆమోదిస్తుందా?" అని అడిగారు.
\v 4 అప్పుడు యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "దేవుడు సృష్టి కార్యం తరువాత మొదటగా పురుషుడినీ, తరువాత స్త్రీనీ చేశాడని మీరు గ్రంథాలలో చదివారు కదా.
\s5
\v 5 అందుకే పురుషుడు తన తల్లినీ తండ్రినీ విడిచిపెట్టి తన భార్యను పెళ్ళి చేసుకుంటాడు. వాళ్ళిద్దరూ ఒకే వ్యక్తిలాగా కలిసి జీవిస్తారు, అని చెప్పాడు.
\v 6 అదేవిధంగా మొదట వేరు వేరుగా ఇద్దరు వ్యక్తులుగా ఉన్న వీళ్ళు ఇప్పుడు కలసి ఏక శరీరులుగా ఉంటారు. ఇది సత్యం గనుక, దేవుడు ఏకం చేసిన వీళ్ళను ఏ మనిషీ విడదీయకూడదు."
\s5
\p
\v 7 అందుకు పరిసయ్యులు, "అదే నిజమైతే, ఒకడు తన భార్య నుంచి విడిపోవాలని కోరుకుంటే అందుకు కారణం తెలుపుతూ విడాకుల పత్రం రాసి ఇవ్వొచ్చు అని మోషే ఆజ్ఞాపించాడు గదా" అన్నారు.
\v 8 అందుకు యేసు, "మీ పూర్వీకుల హృదయకాఠిన్యాన్ని బట్టి మోషే అలా చెప్పి ఉండవచ్చు గానీ మొదటగా దేవుడు స్త్రీ పురుషుడ్ని సృష్టించినప్పుడు వారిద్దరూ కలిసి ఉండాలి గానీ విడిపోవాలన్నది దేవుని ఉద్దేశం కాదు.
\v 9 నేను మీతో చెప్పేదేమిటంటే ఎవరైనా ఒకడు తన భార్య వ్యభిచారం చేసిన కారణంగా కాక, తన భార్యను విడిచిపెట్టి వేరొక స్త్రీని పెళ్ళి చేసుకుంటే అతడు వ్యభిచారం అనే పాపం చేసినట్టుగా దేవుడు ఎంచుతాడు."
\s5
\p
\v 10 శిష్యులు "అదే నిజమైతే పురుషులు పెళ్ళి చేసుకోకుండా ఉంటేనే మంచిది" అన్నారు.
\v 11 అందుకు యేసు, "దేవుడు అనుమతించిన వాళ్ళు తప్ప మరి ఇంకెవ్వరూ ఈ బోధను అంగీకరించరు.
\v 12 పుట్టినప్పటి నుంచి పురుషత్వం లోపం కారణంగా పెళ్ళి చేసుకోకుండా ఉన్నవాళ్ళు కొందరు ఉన్నారు. నపుంసకులుగా మార్చబడిన వాళ్ళు, అలాగే పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా మార్చుకున్న వాళ్ళూ పెళ్ళికి దూరంగా ఉన్నారు. పెళ్ళి గురించి నేను చెప్తున్న మాటలు అర్థం చేసుకున్నవాడు వాటిని అంగీకరించి పాటిస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 13 తరువాత కొందరు యేసు తమ పిల్లల తలలపై చేతులుంచి ప్రార్ధించాలని ఆశించి పిల్లలను యేసు దగ్గరకు తీసుకువచ్చారు. అయితే శిష్యులు వాళ్ళను యేసు దగ్గరకు రానీయకుండా అడ్డుకున్నారు.
\v 14 అది చూసిన యేసు, "ఆ పిల్లలను ఆపకండి. నా దగ్గరకు రానీయండి. పరలోక రాజ్య పాలనలో వినయం, నమ్మకత్వం ఉన్న ఇలాంటి పిల్లలకే స్థానం దక్కుతుంది" అని చెప్పాడు.
\v 15 ఆ పిల్లలపై చేతులు వేసి వాళ్ళను దీవించాడు. తరువాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 16 యేసు వీధిలో నడుస్తూ ఉండగా ఒక యువకుడు యేసును కలుసుకుని, "నేను దేవుడి రాజ్యంలో కలకాలం ఉండాలంటే ఎలాంటి మంచి పనులు చెయ్యాలి?" అని అడిగాడు.
\p
\v 17 అందుకు యేసు, "మంచి పనులను గురించి నన్నెందుకు అడుగుతున్నావు? నిజంగా మంచి వాడు దేవుడొక్కడే. అయితే నిత్య జీవం కోసం నీ ప్రశ్నకు జవాబేమిటంటే మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ నెరవేర్చు" అని చెప్పాడు.
\s5
\p
\v 18 ఆ యువకుడు "ఏ ఆజ్ఞలు నేను నెరవేర్చాలి?" అని అడిగాడు. యేసు, "నరహత్య చెయ్యవద్దు, వ్యభిచారం చెయ్యవద్దు, దొంగతనం చెయ్యవద్దు, దొంగ సాక్ష్యం చెప్పవద్దు,
\v 19 నీ తల్లిదండ్రులను గౌరవించు, నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అలాగే నీ పక్కన ఉన్నవాణ్ణి కూడా ప్రేమించు" అని చెప్పాడు.
\s5
\p
\v 20 ఆ యువకుడు, "ఈ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తున్నాను. నిత్య జీవం కోసం ఇంకా నేనేం చెయ్యాలి" అని అడిగాడు.
\p
\v 21 అప్పుడు యేసు, "అయితే నువ్వు తప్పకుండా చెయ్యాలని దేవుడు కోరేది ఒకటుంది. ఇంటికి వెళ్ళి, నీకు ఉన్నదంతా అమ్మివేసి, వచ్చినదంతా పేదవాళ్ళకు పంచిపెట్టు. అప్పుడు పరలోకంలో నీకు ఆస్తి సమకూరుతుంది. తరువాత నా శిష్యుడిగా మారి నన్ను వెంబడించు" అన్నాడు.
\v 22 ఆ యువకుడు బాగా ఆస్తిపరుడు. తన ఆస్తి ఇతరులకు పంచడం అతనికి ఇష్టం లేదు. అందువల్ల ఈ మాటలు విన్న అతడు ముఖం చిన్నబుచ్చుకున్నాడు.
\s5
\p
\v 23 అప్పుడు యేసు తన శిష్యులతో, "ఇది మనసులో ఉంచుకోండి, ధనవంతులు తమ జీవితాలను దేవుని పాలనకు లోబరచుకోవడం ఎంతో కష్టం.
\v 24 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జం గుండా ఒంటె దూరి వెళ్ళడం తేలిక" అని చెప్పాడు.
\s5
\p
\v 25 ఈ మాటలు విన్న శిష్యులు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. ధనవంతులను దేవుడు ఎక్కువగా దీవిస్తాడని వాళ్ళు అనుకునేవాళ్లు. అప్పుడు వాళ్ళు, "అలాగైతే మరి ఎవ్వరూ రక్షింపబడలేరు" అన్నారు.
\p
\v 26 యేసు వాళ్ళకేసి తీక్షణంగా చూశాడు. "అవును, మనుషులు తమను తాము రక్షించుకోవడం అసాధ్యమే. అయితే దేవుడు వాళ్ళను రక్షిస్తాడు. ఎందుకంటే దేవుడికి అంతా సాధ్యమే" అని చెప్పాడు.
\v 27 అప్పుడు పేతురు, "అయ్యా, మేము మాకున్నదంతా విడిచిపెట్టి నీ శిష్యులంగా నీతోపాటు ఉంటున్నాము. ఈ సంగతి నీకూ తెలుసు. మరైతే దీనివల్ల మాకొచ్చే లాభం ఏమిటి?" అని అడిగాడు.
\s5
\p
\v 28 అందుకు యేసు, "ఇది మీ మనస్సుల్లో ఉంచుకోండి. మీకు గొప్ప మేలు కలుగుతుంది. దేవుడు నిర్మించే కొత్త లోకంలో మనుష్య కుమారుడినైన నేను మహిమ సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఇప్పుడు నన్ను వెంబడిస్తున్న మీరు పన్నెండు సింహాసనాల మీద కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల ప్రజలకు తీర్పు తీరుస్తారు."
\s5
\p
\v 29 "నా శిష్యులైన మీరు నా కోసం మీ ఇళ్ళను, భూములను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెళ్ళను, భార్యా పిల్లలను నా కోసం విడిచిపెట్టి వచ్చారు గనుక దేవుడు తగిన బహుమతి ఇస్తాడు. మీలో ప్రతివాడూ ఇంతకు వంద రెట్లు ప్రతిఫలం పొందుతారు. దాంతోపాటు దేవుడితోపాటు కలకాలం జీవిస్తారు.
\v 30 ఈ లోకంలో ఇప్పుడు ముఖ్యమైన వాళ్ళు అనేకమంది భవిషత్తులో సామాన్యులు అవుతారు, ముఖ్యులు కానివారు చాలామంది ముఖ్యులు అవుతారు."
\s5
\c 20
\p
\v 1 దేవుడు పరిపాలించే పరలోకరాజ్యం ఒక తోట యజమాని చేసిన పనిలాగా ఉంది. ఎలాగంటే, ప్రతిరోజూ పొద్దున్నే తోట యజమాని మార్కెట్టుకి వెళ్ళి అక్కడ కూర్చుని ఉండే పనివాళ్ళను తన ద్రాక్ష తోటలోకి పనికి కుదుర్చుకున్నాడు.
\v 2 ఒక్కొక్కరికి వంద రూపాయలు కూలీ ఇచ్చేలా బేరం కుదుర్చుకుని వాళ్ళను పనిలోకి పంపించాడు.
\s5
\p
\v 3 "ఉదయం తొమ్మిది గంటలకి మార్కెట్టుకి వెళ్ళి అక్కడ చేయడానికి పని ఏమీ లేకుండా ఉన్న కొంతమంది పనివాళ్ళను చూశాడు.
\v 4 అతడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, "పొద్దున్న వెళ్ళినవాళ్ళ లాగా మీరు కూడా నా ద్రాక్షతోటకి వెళ్ళి పనిచెయ్యండి. మీకు న్యాయమైన కూలీ ముట్టజెప్తాను" అన్నాడు.
\s5
\p
\v 5 "మధ్యాహ్నం పన్నెండు గంటలకి మార్కెట్టుకి వెళ్ళి అక్కడ ఉన్న పనివాళ్ళను సరియైన కూలీ ఇస్తానని చెప్పి తోటకు పంపించాడు.
\v 6 మళ్ళీ సాయంత్రం 5 గంటలకి మార్కెట్టుకి వెళ్ళి ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్న పనివాళ్ళను చూశాడు. అతడు వాళ్ళతో, "పనేమీ చేయకుండా రోజంతా ఇలా ఉన్నారేమిటి?" అని అడిగాడు.
\v 7 అందుకు వాళ్ళు "మమ్మల్ని ఎవ్వరూ పనిలోకి పెట్టుకోలేదు" అని చెప్పారు. "నేను మీకు పని ఇస్తాను. మీరు నా ద్రాక్షతోటకి వెళ్ళి అక్కడున్నవాళ్ళతో కలిసి పనిచెయ్యండి" అని చెప్పినప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్ళారు."
\s5
\p
\v 8 "పని సమయం ముగిసిన తరువాత యజమాని తన మేనేజర్ ని పిలిచాడు. "పనివాళ్ళందరినీ పిలిపించు. చివర వచ్చిన వాళ్ళతో మొదలుపెట్టి మొదట వచ్చిన వాళ్ళందరికీ కూలీ డబ్బులు ఇవ్వు" అని చెప్పాడు.
\v 9 ఆ మేనేజర్ సాయంత్రం ఐదు గంటలకు పనికి వచ్చిన వాళ్ళతో కలిపి అందరికీ సమానంగా కూలీ డబ్బులు ఇచ్చాడు.
\v 10 పొద్దున్నే పని మొదలుపెట్టిన కూలీ డబ్బుల కోసం వెళ్ళినప్పుడు తమకు చెప్పిన కూలీ కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడ్డారు. కానీ వాళ్లకు ముందుగా చెప్పిన డబ్బులే అందాయి."
\s5
\p
\v 11 "అందువల్ల వాళ్ళంతా ద్రాక్షతోట యజమాని దగ్గరికి వెళ్ళి తమకు అన్యాయం జరిగిందని వాపోయారు.
\v 12 వాళ్ళు యజమానితో "ఇదేం బాగోలేదు. చివరగా వచ్చిన వీళ్ళు ఒక్క గంట మాత్రమే పనిచేశారు. మేమైతే పొద్దుటినుంచి ఎండలో కష్టపడి పనిచేశాం. నువ్వేమో అందరికీ సమానంగా కూలీ డబ్బులు ఇచ్చావు" అన్నారు."
\s5
\p
\v 13 "అందుకు ద్రాక్షతోట యజమాని, "మిత్రమా, నేనేమీ మీకు అన్యాయం చెయ్యలేదు. నేను చెప్పిన జీతానికి పనిచెయ్యడానికి నువ్వు ఒప్పుకున్నావు.
\v 14 నీ కూలీ నువ్వు తీసుకుని వెళ్ళిపో! మీరంతా పని మొదలు పెట్టిన తరువాత వచ్చిన వీరికి మీతోపాటు సమానంగా కూలీ ఇవ్వడం నా ఇష్టం.
\s5
\v 15 నా డబ్బు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసే హక్కు నాకు ఉంది. అవునా, కాదా? నా మంచితనాన్ని చూసి కుళ్ళుకుంటున్నావా?" అన్నాడు.
\v 16 ఇదేవిధంగా దేవుడిచ్చే బహుమతులు కూడా ఇలాగే ఉంటాయి. తక్కువ ప్రాముఖ్యత ఉన్న వాళ్ళు కొందరికి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎంతో ముఖ్యమైన వాళ్ళుఅనుకునే కొందరికి ఆయన ఏ ప్రతిఫలాన్నీ ఇవ్వడు."
\s5
\p
\v 17 యేసు యెరూషలేముకు వెళ్లబోయేటప్పుడు తన పన్నెండు మంది శిష్యులను ఒకచోటికి తీసుకువెళ్ళి వాళ్ళతో ఏకాంతంగా మాట్లాడాడు.
\v 18 "జాగ్రత్తగా వినండి! మనం ఇప్పుడు యెరూషలేముకు వెళ్ళబోతున్నాం. అక్కడ యూదు అధికారులు, యూదు చట్టాలు బోధించే పండితులూ మనుష్య కుమారుణ్ణి అయిన నన్ను బంధిస్తారు. నాకు తీర్పు తీర్చి మరణ శిక్ష విధిస్తారు.
\v 19 నన్ను అవమానపరచి , హింసించి మేకులతో సిలువకు వేలాడదీసి చంపడానికి యూదులు కానివాళ్ళకు అప్పగిస్తారు. అయితే చనిపోయిన నన్ను దేవుడు మూడవ రోజున తిరిగి బ్రతికేలా చేస్తాడు."
\s5
\p
\v 20 అప్పుడు జెబెదయి కొడుకులైన యాకోబు, యోహానుల తల్లి ఈ ఇద్దరినీ వెంటబెట్టుకుని యేసు దగ్గరికి వచ్చి యేసుకు నమస్కరించి తన కోసం ఒక పని చేసిపెట్టమని అడిగింది.
\v 21 అదేమిటో చెప్పమని యేసు ఆమెతో అన్నాడు. అందుకామె, "యేసూ, నువ్వు రాజుగా తిరిగి వచ్చినప్పుడు నా కొడుకులిద్దరినీ నీ కుడిపక్కన ఒకరిని, ఎడమ పక్కన ఒకరిని కూర్చోబెట్టుకుంటావని నాకు మాట ఇవ్వు" అంది.
\s5
\p
\v 22 అప్పుడు యేసు ఆమెతో, ఆమె కొడుకులిద్దరితో ఇలా చెప్పాడు, "మీరు అడుగుతున్నదేమిటో మీకు అర్థం కావడం లేదు. నేను హింసలు పొందబోతున్నట్టుగా మీరు హింసలు పొందుతారా?" అని అడిగాడు. అందుకు వాళ్ళు "హింసలు భరించగలం" అని చెప్పారు.
\v 23 యేసు, "అవును, నేను హింసలు పొందినట్టు మీరు కూడా పొందగలరు. అయితే కుడి పక్కన, ఎడమ పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టుకుని పాలించే అధికారం నాకు లేదు. నా తండ్రియైన దేవుడు వీటిని ఎవరి కోసం నియమించాడో వాళ్ళకే దక్కుతాయి."
\p
\v 24 మిగిలిన పది మంది శిష్యులు యాకోబు యోహానుల కోరిక విని వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా యేసు పక్కన కూర్చునే మహా భాగ్యం తమకు కూడా దక్కాలని కోరుకుంటున్నారు.
\s5
\p
\v 25 యేసు వాళ్ళను తన దగ్గరికి పిలిచి, "యూదులు కాని ప్రజల్లో అధికారులు ప్రజలపై పెత్తనం చెలాయిస్తారని మీకు తెలుసు. అలాగే ప్రముఖులైన అధికారులు తమ క్రిందివాళ్ళమీద అధికారం చూపిస్తారు.
\v 26 మీరు వాళ్ళలాగా ఉండకూడదు. అందుకు భిన్నంగా మీలో గొప్పవాడుగా ఉండాలని కోరుకునేవాడు మీకు సేవకుడుగా ఉండాలి."
\p
\v 27 "అవును, మీలో ఎవరిని దేవుడు గొప్పవాడిగా ఎంచాలని కోరుకుంటాడో వాడు మిగిలినవాళ్ళందరికీ దాసుడుగా ఉండాలి.
\v 28 నాలాగా చెయ్యండి. నేను మనుష్య కుమారుడినైనప్పటికీ నేను ఇతరుల చేత సేవలు చేయించుకోవడానికి రాలేదు. అందుకు బదులుగా ఇతరులకి సేవ చేయడానికీ, వాళ్ళ చేతుల్లో ప్రాణం కోల్పోయి అనేకమంది పాపాల కోసం నా ప్రాణం ఇవ్వడానికీ వచ్చాను."
\s5
\v 29 వాళ్ళు యెరికో పట్టణం దాటిపోతూ ఉన్నప్పుడు జనులు పెద్ద గుంపుగా ఆయనను వెంబడించారు.
\v 30 వాళ్ళు నడుస్తూ ఉండగా దారి పక్కన ఇద్దరు గుడ్డివాళ్ళు కూర్చుని ఉండడం చూశారు. ఆ గుడ్డివాళ్ళు యేసు ఆ దారిన వెళ్తున్నాడని విని, "ప్రభూ, దావీదు కుమారా, నువ్వే మెస్సీయ్యవు. మమ్మల్ని కనికరించు" అంటూ కేకలు వేశారు.
\v 31 గుంపులో ఉన్న మనుషులు వాళ్ళపై కోపగించుకుని నెమ్మదిగా ఉండమని వాళ్ళను హెచ్చరించారు. అయితే ఆ గుడ్డివాళ్ళు ఇంకా గట్టిగా "ప్రభూ, దావీదు కుమారా, మెస్సీయా, మమ్మల్ని కనికరించు!" అని కేకలు వేశారు.
\s5
\p
\v 32 యేసు అక్కడే ఆగిపోయి వాళ్ళను తన దగ్గరకు తీసుకురమ్మని పిలిచాడు. వాళ్ళను "నేను మీకేం చెయ్యాలి?" అని అడిగాడు.
\v 33 అందుకు వాళ్ళు "ప్రభూ, మేము చూడగలిగేలా మా కళ్ళు బాగుచెయ్యి" అని అడిగారు.
\v 34 యేసు వాళ్ళను చూసి జాలిపడి తన చేతులతో వాళ్ళ కళ్ళు తాకాడు. వెంటనే వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. యేసుని వెంబడిస్తూ ముందుకు సాగారు.
\s5
\c 21
\p
\v 1 వాళ్ళు యెరూషలేము దగ్గరలో ఉన్న ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే అనే ఊళ్ళోకి వచ్చారు.
\v 2 యేసు తన ఇద్దరు శిష్యులను పిలిచాడు. వాళ్ళతో "మీరు ఎదురుగా ఉన్న ఊళ్ళోకి వెళ్ళండి. ఊరు మొదట్లోనే కట్టేసి ఉన్న ఒక గాడిద, దాని పిల్ల కనబడతాయి. వాటి కట్లు విప్పి నా దగ్గరికి తోలుకురండి.
\v 3 ఎవరైనా మిమ్మల్ని దాని గురించి అడిగితే, "ఇవి ప్రభువుకు కావాలి"అని చెప్పండి. అప్పుడు అతడు వాటిని మీతో పోనిస్తాడు" అని చెప్పాడు.
\s5
\v 4 ఇద్దరు శిష్యులు వెళ్ళి యేసు చెప్పినట్టు చేశారు.
\v 5 గాడిదను, దాని పిల్లను యేసు దగ్గరికి తీసుకువచ్చారు.
\s5
\v 6 యేసు కూర్చునేందుకు వీలుగా తమ బట్టలు తీసి దాని పైన వేశారు.
\v 7 యేసు ఆ గాడిద మీద కూర్చున్నాడు.
\p
\v 8 జనులు గుంపులుగా యేసు చుట్టూ సమకూడి తమ బట్టలు దారి పొడవునా పరిచారు. మరికొందరు ఒలీవ చెట్టు కొమ్మలు నరికి వాటిని దారిలో పరిచారు.
\s5
\v 9 జనులు యేసు ముందూ వెనుకా నడుస్తూ,
\q "దావీదు కుమారుడైన మెస్సీయకు స్తోత్రం!"
\q "దేవుడి ప్రతినిధిగా అధికారంతో వస్తున్న ఈయనను దేవుడు దీవిస్తాడు గాక!"
\q "ఉన్నత స్థలంలో ఉన్న దేవుడికి స్తోత్రం కలుగును గాక!"
\p అంటూ కేకలు వేశారు.
\v 10 యేసు యెరూషలేములోనికి రాగానే ప్రజలు అనేకులు "వీళ్ళు ఈయనను ఇలా ఎందుకు పొగుడుతున్నారు?" అంటూ కలవరం చెందారు.
\p
\v 11 యేసుతో ఉన్న జనులు "ఈయన యేసు, గలిలయలోని నజరేతు నుంచి వచ్చిన ప్రవక్త" అని జవాబిచ్చారు.
\s5
\p
\v 12 తరువాత యేసు కోవెలలోకి వెళ్ళి గుమ్మం దగ్గర రకరకాల వస్తువులు అమ్ముతున్న, కొంటున్న వాళ్ళనందరినీ బయటకు వెళ్ళగొట్టాడు. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్లకి రోము నాణేల మారకం చేసేవాళ్ళ బల్లలనూ, అర్పణల కోసం పావురాలు అమ్మేవాళ్ళ పీటలను పడద్రోశాడు.
\v 13 అప్పుడు ఆయన వాళ్ళతో, "దేవుడు ప్రవక్త ద్వారా పలికించినట్టు "నా ఆలయం ప్రార్థనలకు నిలయం" అని ఉంది. కాని మీరు దాన్ని దొంగల నిలయంగా చేశారు."
\p
\v 14 తరువాత అనేకమంది గుడ్డివాళ్ళూ, కుంటివాళ్ళూ యేసు దగ్గరికి వచ్చారు. ఆయన వాళ్ళందరినీ బాగుచేశాడు.
\s5
\p
\v 15 ప్రధాన యాజకులు, యూదు చట్టాలు బోధించే పండితులు యేసు చేసిన ఈ అద్భుత కార్యాలన్నీ చూశారు, ఇంకా చిన్న పిల్లలు యేసు గురించి "దావీదు కుమారుడైన మెస్సీయకు స్తోత్రం!" అని వేస్తున్న కేకలు విన్నారు.
\v 16 వాళ్లకు కోపం వచ్చింది. "వీళ్ళు వేస్తున్న కేకలు వింటున్నావా? అలా చేస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నావు?" అని అడిగారు. అప్పుడు యేసు ఇలా చెప్పాడు, "అవును, వింటున్నాను. మీరు లేఖనాల్లో, చిన్న పిల్లలు నన్ను స్తుతిస్తారని, అందునుబట్టి దేవుడు ఆనందిస్తాడని రాసిన మాటలు మీరు మర్చిపోయారా? కీర్తనకారుడు తన కీర్తనలలో "చిన్న పిల్లలకు, చంటి బిడ్డలకు నిన్ను స్తుతించడం నేర్పించావు" అని రాశాడు కదా."
\p
\v 17 తరువాత యేసు ఆ ఊరిని విడిచిపెట్టి బయలుదేరి బేతనియ చేరుకొని అక్కడే ఆ రాత్రి గడిపాడు.
\s5
\p
\v 18 తెల్లవారగానే లేచి తిరిగి పట్టణంలోకి వస్తూ ఉండగా ఆయనకు ఆకలి వేసింది.
\v 19 దారి పక్కనే అంజూరుు చెట్టు కనిపించింది. ఆ పండ్లు తిందామని చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టుకి ఆకులు తప్ప కాయలేమీ లేవు. అందుకని ఆయన ఆ చెట్టుకేసి చూసి, "ఇక ముందు నువ్వు ఎన్నటికీ కాపు కాయవు" అని చెప్పాడు. ఫలితంగా ఆ అంజూరుు చెట్టు ఎండిపోయింది.
\s5
\p
\v 20 తరువాతి రోజు ఆ అంజూరు చెట్టు పూర్తిగా ఎండిపోయి ఉండడం శిష్యులు చూశారు. "ఈ చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందో కదా" అని యేసుతో అన్నారు.
\p
\v 21 అందుకు యేసు వాళ్ళతో ఇలా చెప్పాడు, "ఇది వినండి: మీరు దేవుడిని నమ్మినప్పుడు సందేహం లేకుండా ఎలాంటి పనులైనా చెయ్యగలరు. ఈ అంజూరు చెట్టు విషయంలో నేను చేసినది మీరు చూశారు కదా. అంతే కాదు, మీకు పూర్తి నమ్మకం ఉంటే నాలాగా అద్భుతాలు మీరు కూడా చేయగలరు. ఆ కొండను చూడండి, దానితో "నువ్వు లేచి ఆ సముద్రంలో పడిపో" అని మీరు చెప్తే అది తప్పక జరుగుతుంది.
\v 22 దీనికి తోడు మీరు దేనికోసమైనా దేవుడికి ప్రార్థించినప్పుడు దాన్ని దేవుడు ఇస్తాడనీ, దాన్ని మీరు పొందారని నమ్మండి."
\s5
\p
\v 23 ఆ తరువాత యేసు కోవెల దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న మనుషులకు బోధించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో కొందరు ప్రధాన యాజకులు, మత పెద్దలు అక్కడికి వచ్చారు. వాళ్ళు యేసుతో, "నువ్వు ఏ అధికారంతో ఈ పనులన్నీ చేస్తున్నావు? నిన్న నువ్వు చేసిన పనులకు నీకు అధికారం ఎవరిచ్చారు?" అని అడిగారు.
\v 24 అందుకు యేసు, "నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, దానికి జవాబు చెప్పండి. అప్పుడు నేను ఈ పనులు ఏ అధికారంతో చేస్తున్నానో చెప్తాను.
\s5
\v 25 బాప్తిసమిచ్చే యోహానుకు తన మాటలు నమ్మిన వాళ్లకు బాప్తిసం ఇచ్చే అధికారం ఎక్కడినుంచి వచ్చింది? అతడు ఆ అధికారం దేవుడినుంచి పొందాడా లేక మనుషులు ఇచ్చారా?"
\p వాళ్ళు ఏమి జవాబు చెప్పాలో తమలో తాము చర్చించుకున్నారు. "ఇప్పుడు గనక మనం దేవుడి నుంచే అని చెప్తే, అందుకు ఆయన అలాగైతే మీరు అతడి సందేశం నమ్మవలసినది గదా, అంటాడు.
\v 26 అలా కాక, మనుషుల నుంచి, అని చెప్తే జనం మనపై తిరగబడతారు." ఎందుకంటే ప్రజలు యోహాను దేవుడు పంపిన ఒక ప్రవక్త అని నమ్ముతున్నారు.
\v 27 అందుకని వాళ్ళు "యోహాను ఆ అధికారం ఎక్కడినుంచి పొందాడో మాకు తెలియదు" అని చెప్పారు. అప్పుడు యేసు, "నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పలేదు గనక నిన్న నేను చేసిన పనులకు ఎవరు అధికారం ఇచ్చారన్నదానికి నేను కూడాజవాబు చెప్పను" అన్నాడు.
\s5
\p
\v 28 ఆయన ఇంకా మాట్లాడుతూ, "నేను చెప్పబోయేదాని గురించి మీకేమనిపిస్తుంది? ఒక వ్యక్తికి ఇద్దరు కొడుకులున్నారు. అతడు తన పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి, "బాబూ, మన ద్రాక్షతోటకు వెళ్ళి పనిచెయ్యి" అని చెప్పాడు.
\v 29 అప్పుడు వాడు, "నాన్నా నేను వెళ్ళను" అని చెప్పాడు. తరువాత వాడు తన మనసు మార్చుకుని తోటకు వెళ్ళి పనిచేశాడు.
\v 30 తరవాత ఆ తండ్రి చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళి పెద్ద కొడుకుకు చెప్పినట్టు చెప్పాడు. అయితే చిన్న కొడుకు, "సరే నాన్నా, తోటకి వెళ్తాను" అని చెప్పాడు గానీ ఆ పని చెయ్యలేదు."
\s5
\p
\v 31 "కాబట్టి ఆ ఇద్దరు కొడుకుల్లో ఎవరు తండ్రి మాట విన్నట్టు?" అని అడిగినప్పుడు వాళ్ళు "పెద్ద కొడుకే" అని చెప్పారు. అప్పుడు యేసు, "అయితే వినండి, మీరు పన్నులు వసూలు చేసేవాళ్ళను, వ్యభిచారులను వాళ్ళు మోషే నియమించిన చట్టాలను ఆచరించరని వాళ్ళను చిన్నచూపు చూస్తుంటారు గానీ దేవుడు వాళ్ళనే మొదటగా చేర్చుకుంటాడు.
\v 32 నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, బాప్తిసమిచ్చే యోహాను మంచి మార్గంలో నడవాలని చెప్పిన మాటలు మీరు వినలేదు. అయితే పన్ను వసూలు చేసేవాళ్ళు, వ్యభిచారులు అతని మాటలు నమ్మి, తమ పాప స్వభావాన్ని మార్చుకున్నారు. దాన్ని చూసి కూడా మీరు అతని మాటలు వినలేదు, పాపం చెయ్యడం మానలేదు."
\s5
\p
\v 33 "మరొక ఉపమానం చెప్తా వినండి. ఒక ద్రాక్ష తోట నాటించిన ఒక యజమాని ఉన్నాడు. అతడు తన తోట చుట్టూ ప్రహరీ గోడ కట్టించి ఒక ద్రాక్ష గానుగ ఏర్పాటు చేశాడు. ఒక ఎత్తైన గోపురం కట్టించి తోటకు కాపలా నియమించాడు. ప్రతి యేడూ పంట తనకు అప్పగించేలా కొంతమందికి తన తోట కౌలుకు ఇచ్చాడు. తరువాత అతడు వేరే దేశానికి వెళ్ళాడు."
\p
\v 34 "కొంత కాలం గడచిన తరువాత పంట చేతికొచ్చే సమయంలో ఆ యజమాని తన వంతు తీసుకురమ్మని కొందరు పనివాళ్ళను కౌలుదారుల దగ్గరికి పంపించాడు.
\s5
\v 35 ఆ కౌలుదారులు ఆ సేవకులను బంధించి ఒకణ్ణి కొట్టారు. ఒకణ్ణి చంపివేశారు, మరొకడిని రాళ్ళతో కొట్టి చంపారు."
\p
\v 36 "తరువాత ఆ యజమాని ఇంకా ఎక్కువమంది సేవకులను పంపాడు. ఆ కౌలుదారులు ముందు వచ్చిన వాళ్ళకు చేసినట్టుగానే వీళ్ళ పట్ల కూడా ప్రవర్తించారు.
\v 37 ఇది విన్న యజమాని "నా కొడుకునైతే వాళ్ళు తప్పకుండా గౌరవిస్తారు, ఎలాంటి హానీ తలపెట్టరు"అనుకుని తోటలో భాగం కోసం తన కొడుకుని పంపించాడు."
\s5
\p
\v 38 "యజమాని కొడుకు వస్తూ ఉండడం చూసిన కౌలుదారులు "ఆ వచ్చేవాడు ఈ ఆస్తి మొత్తానికి వారసుడు. మనం వీణ్ణి గనక చంపేస్తే ఇక ఈ ఆస్తి అంతా మనం పంచుకోవచ్చు" అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు.
\v 39 వాళ్ళు అతణ్ణి పట్టుకుని ద్రాక్షతోట బయటకు ఈడ్చుకువెళ్లి చంపి పడేశారు."
\s5
\p
\v 40 "నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ యజమాని వచ్చి ఆ కౌలుదారుల్ని ఏమి చేస్తాడని మీరు అనుకుంటున్నారు?" అని యేసు అడిగాడు.
\p
\v 41 అందుకు వాళ్ళు, "యజమాని ఆ దుర్మార్గుల్ని నాశనం చేస్తాడు. తనకు సక్రమంగా పంటలో భాగమిచ్చే వేరే కౌలుదారులకు అతని తోటను అప్పగిస్తాడు" అని బదులిచ్చారు.
\s5
\p
\v 42 అప్పుడు యేసు, "మీరు లేఖనాల్లో చదివిన ఈ మాటలను జాగ్రత్తగా ధ్యానం చెయ్యండి.
\q ఇల్లు కట్టేవాళ్ళు తీసి పడవేసిన రాయి చివరికి ఇతరులు కట్టుకునే ఇళ్ళకి అదే ముఖ్యమైన పునాది రాయి అయింది.
\q ప్రభువే దీనిని చేశాడు, ఇది మనకెంతో ఆశ్చర్యకరం."
\s5
\p
\v 43 "కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, అలాంటి ప్రజలను దేవుడు తనవాళ్ళుగా ఉండనీయకుండా తీసివేస్తాడు. తాను కోరుకున్న విధంగా ఉండే ప్రజలను తన సొంత ప్రజలుగా స్వీకరిస్తాడు.
\v 44 ఎవడైనా ఒక బండ రాయి మీద పడితే వాడు ముక్కలు ముక్కలు అవుతాడు, అదే రాయి వాడి మీద పడితే వాడు నజ్జు నజ్జు అయిపోతాడు."
\s5
\p
\v 45 ఈ ఉదాహరణ విన్న పరిసయ్యులు, యూదుల పెద్దలు తాము ఈ యేసును మెస్సీయ అని నమ్మకపోవడం వలన ఇది తమ గురించే చెప్పాడని అనుకున్నారు.
\p
\v 46 వాళ్ళు యేసును పట్టుకుని బంధించాలని చూశారు. అయితే ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఆయనను ఒక ప్రవక్తగా భావిస్తూ ఆయన చెప్పే మాటలు వింటున్నారు గనుక ఆ ప్రజలు తిరగబడతారని భయపడ్డారు.
\s5
\c 22
\p
\v 1 యేసు యూదు నాయకులకు అనేక ఉపమానాలు చెప్పాడు. వాటిల్లో ఇది ఒకటి.
\v 2 "పరలోక రాజ్య పాలన ఒక రాజు తన కొడుకు పెళ్ళికి విందు భోజనాలు ఏర్పాటు చేసినట్టు ఉంది.
\v 3 ఆ విందు సిద్ధం అయినప్పుడు భోజనానికి పిలిచిన వాళ్ళనందరినీ ఆహ్వానించమని తన సేవకులను పురమాయించాడు. సేవకులు ఆ కబురు చెప్పినప్పుడు వాళ్ళంతా విందుకు రాకుండా సాకులు చెప్పసాగారు."
\s5
\p
\v 4 "అప్పుడు అతడు వేరే సేవకులను వాళ్ళ దగ్గరకు పంపుతూ, "ఆహ్వానితులందరికీ ఇలా చెప్పండి. రాజు మీతో ఇలా చెప్పమన్నాడు, నేను మీ కోసం విందు సిద్ధం చేశాను. కొవ్విన దూడల మాంసం, ఎద్దుల మాంసం వండించాను. అంతా సిద్ధంగా ఉంది. పెళ్ళి విందు మొదలయ్యే సమయం అయింది."
\s5
\p
\v 5 "సేవకులు ఈ కబురు చెప్పినప్పుడు వాళ్ళంతా రకరకాల సాకులు చెప్పారు. కొందరేమో పొలానికి వెళ్ళాలనీ, మరి కొందరేమో వ్యాపారం నిమిత్తం వెళ్ళాలనీ చెప్పి రాకుండా మానివేశారు.
\v 6 మిగిలినవాళ్ళు రాజు సేవకులను పట్టుకుని అవమానపరిచి చంపివేశారు.
\v 7 జరిగినది తెలుసుకున్న రాజుకు చాలా కోపం వచ్చింది. వాళ్ళందరినీ చంపివేసి ఆ ఊరంతటినీ తగలబెట్టమని తన సైనికులను పంపించాడు.
\s5
\v 8 సేవకులు ఆ పని చేసినప్పుడు, రాజు మరికొంతమంది సేవకులను పిలిచి "నేను పెళ్ళి విందు సిద్ధం చేశాను. కానీ వాళ్ళంతా విందు ఆరగించడానికి యోగ్యులు కారు.
\v 9 కాబట్టి మీరు వెళ్ళండి, దారి వెంట మీకు కనిపించిన వాళ్ళందరినీ పెళ్ళి విందుకు తీసుకురండి" అని చెప్పాడు.
\v 10 సేవకులు వెళ్ళారు, తమకు కనిపించిన వాళ్ళందరినీ పోగుచేశారు. వాళ్ళలో కొందరు మంచివాళ్ళూ, కొందరు చెడ్డవాళ్ళూ ఉన్నారు. వాళ్ళందరినీ విందు జరిగే భోజనాల గదికి తీసుకువచ్చారు. ఆ హాలంతా నిండిపోయింది."
\s5
\p
\v 11 "రాజు అక్కడ కూర్చున్న అతిధులను చూడడానికి లోపలికి వచ్చాడు. వచ్చిన వాళ్ళలో పెళ్ళి విందు బట్టలు వేసుకోకుండా ఉన్న ఒకడు కనిపించాడు.
\v 12 రాజు అతనితో, "మిత్రమా, పెళ్ళి విందుకు అతిథులు వేసుకోవలసిన బట్టలు వేసుకోకుండా లోపలికి ఎలా వచ్చావు?" అని అడిగాడు. ఆ వ్యక్తికి ఏమి చెప్పాలో తెలియలేదు. మౌనంగా ఉండిపోయాడు.
\s5
\v 13 అప్పుడు రాజు సైనికులను పిలిచి, "ఇతని కాళ్ళు చేతులు కట్టి బయటి చీకటి గదిలో పడవేయండి. అక్కడ మనుషులు ఏడుస్తూ, పళ్ళు కొరుక్కుంటూ ఉంటారు" అని ఆజ్ఞాపించాడు."
\p
\v 14 తరువాత యేసు, "ఈ ఉపమానం ఉద్దేశం ఏమిటంటే దేవుడు తన దగ్గరికి రమ్మని అందరినీ పిలుస్తున్నాడు. అయితే ఆయన దగ్గర ఉండేందుకు అర్హత ఉన్నవాళ్ళు కొద్దిమందే" అన్నాడు.
\s5
\p
\v 15 ఈ సంగతి చెప్పిన తరువాత, పరిసయ్యులు పోగయ్యారు. యేసు చేత ఏదైనా తప్పు మాటలు పలికించి ఆయనను ఇరికించాలని పథకం వేశారు.
\v 16 కొంతమంది హేరోదు వర్గానికి చెందిన మనుషులతోపాటు తమ అనుచరులను యేసు దగ్గరికి పంపించారు. వాళ్ళు యేసుతో, "బోధకా, నువ్వు నీతిమంతుడవనీ, దేవుడు కోరినట్టు జీవించాలనే సత్యాలు బోధిస్తున్నావనీ మాకు తెలుసు. నీ బోధల్లో ఎలాంటి లోపమూ లేదనీ, ఎవ్వరి విషయంలోనూ పక్షపాతం చూపించవనీ మాకు తెలుసు.
\v 17 అయితే ఒక విషయం చెప్పు. రోమా ప్రభుత్వానికి పన్ను చెల్లించడం న్యాయమేనా, కాదా?"
\s5
\p
\v 18 వాళ్ళు మనసులో చెడు ఆలోచన పెట్టుకుని తనను ఇరికించాలని చూస్తున్నారని యేసు గ్రహించాడు. తాను ఇచ్చే జవాబు వల్ల అటు రోమా అధికారుల ద్వారా గానీ, ఇటు యూదు అధికారుల ద్వారా గానీ తనను ఇబ్బందులపాలు చెయ్యాలని వీళ్ళు చూస్తున్నారు. యేసు ఇలా చెప్పాడు, "మోసగాళ్ళారా, మీరు నా చేత తప్పుడు మాటలు పలికించాలని చూస్తున్నారు.
\v 19 ఏదీ రోమా పన్ను చెల్లించే ఒక నాణెం చూపించండి." వాళ్ళు ఒక నాణెం చూపించారు.
\s5
\p
\v 20 "ఈ నాణెం మీద ఉన్న బొమ్మ ఎవరిదీ?" యేసు అడిగాడు.
\v 21 వాళ్ళు "రోమ ప్రభుత్వ అధికారి సీజరుది" అని చెప్పారు. "అయితే ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి, దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వండి."
\v 22 యేసు చెప్పిన ఈ జవాబుకి వాళ్ళు అవాక్కయ్యారు. ఇక నోరెత్తలేక పోయారు. ఆయన్ని విడిచిపెట్టి అక్కడినుంచి వెళ్ళిపోయారు.
\s5
\p
\v 23 అదేరోజు కొందరు సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చారు. వీళ్ళు చనిపోయినవాళ్ళు మళ్ళీ తిరిగి బ్రతకరు అని నమ్మే యూదులలో ఒక గుంపుకు చెందినవాళ్ళు. వాళ్ళు యేసుతో ఇలా అన్నారు,
\v 24 "బోధకా, మోషే రాసిన గ్రంథాల్లో "ఒక పురుషుడు తనకు పిల్లలు లేకుండా చనిపోతే అతని తమ్ముడు చనిపోయిన వ్యక్తి భార్య ద్వారా పిల్లల్ని కనాలి. ఆ విధంగా ఆ పిల్లలు చనిపోయిన వ్యక్తికి వారసులు అవుతారు" అని ఉంది కదా."
\s5
\p
\v 25 "ఒక కుటుంబంలో ఏడుగురు మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళలో పెద్దవాడు పెళ్ళి చేసుకుని తనకు పిల్లలు లేకుండానే చనిపోయాడు. కాబట్టి రెండవవాడు మొదటివాడి భార్యని పెళ్ళి చేసుకున్నాడు గానీ అతడు కూడా పిల్లల్ని కనకుండానే చనిపోయాడు.
\v 26 అలాగే మూడవవాడు, తరువాత మిగిలిన నలుగురూ ఆమెను పెళ్ళి చేసుకుని పిల్లలు లేకుండానే చనిపోయారు.
\v 27 చివరకు ఆ స్త్రీ కూడా చనిపోయింది.
\v 28 దేవుడు చనిపోయినవాళ్ళను మళ్ళీ బ్రతికించినప్పుడు ఆ ఏడుగురు అన్నదమ్ములలో ఆ స్త్రీకి ఎవరు భర్తగా ఉంటారు? ఇక్కడ బతికి ఉన్నప్పుడు అందరూ ఆమెకు భర్తలయ్యారు కదా."
\s5
\p
\v 29 అందుకు యేసు, "మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. లేఖనాల్లో రాసి ఉన్నది మీరు గ్రహించలేదు. దేవుడికి చనిపోయినవాళ్ళను తిరిగి బ్రతికించే శక్తి ఉన్నదని మీకు తెలియదు.
\v 30 ఆ స్త్రీ ఎవ్వరికీ భార్యగా ఉండదు. ఎందుకంటే దేవుడు బ్రతికించిన వాళ్ళు పరలోకంలో దేవదూతలుగా మారిపోతారు. అక్కడ ఎవ్వరూ పెళ్ళిళ్ళు చేసుకోరు."
\s5
\p
\v 31 "అయితే తిరిగి బ్రతికిన వాళ్ళను గురించి దేవుడు మాట్లాడాడు. దీనిని మీరు చదివే ఉంటారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయిన చాలాకాలం తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతూ,
\v 32 "నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు కొలిచిన దేవుణ్ణి" అన్నాడు. చనిపోయిన వాళ్ళు దేవుని ఆరాధించలేరు. బ్రతికి ఉన్నవాళ్ళు మాత్రమే ఆరాధిస్తారు. కనుక చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇంకా బ్రతికి ఉన్నాయని మనం నమ్మాలి" అన్నాడు.
\p
\v 33 యేసు చెప్పిన మాటలు విని అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు.
\s5
\p
\v 34 సద్దూకయ్యులు యేసుతో వాదించడానికి వెళ్ళి యేసు ఇచ్చిన జవాబులకు ఆశ్చర్యపోయి మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి వచ్చారని పరిసయ్యులు తెలుసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. యేసుని కలుసుకుని ఆయనతో ఏ ఏ విషయాలు మాట్లాడాలో సిద్ధం చేసుకున్నారు.
\v 35 దేవుడు మోషేకి ఇచ్చిన చట్టాలు బాగా చదివిన న్యాయవాది ఒకడు వాళ్ళలో ఉన్నాడు. అతడు యేసుతో వాదించడానికి సిద్ధపడ్డాడు.
\p
\v 36 అతడు యేసుతో, "బోధకా, దేవుడు మోషేకిచ్చిన ఆజ్ఞల్లో అత్యంత ముఖ్యమైనది ఏది?" అని అడిగాడు.
\s5
\p
\v 37 రాసిఉన్న ఆజ్ఞలను యేసు అతనికి గుర్తుచేస్తూ, "నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రేమించాలి. నీ కోరికల్లో, నీ ఆలోచనల్లో, నీ పనుల్లో ఆయన ప్రేమను చూపించాలి.
\v 38 ఇదే దేవుడు మోషేకిచ్చిన ఆజ్ఞలలో ముఖ్యమైనది."
\s5
\p
\v 39 "తరువాతి ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే, "నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో అలాగే సాటి మనుషుల్ని కూడా ప్రేమించాలి."
\v 40 ఈ రెండు ఆజ్ఞలు మోషే రాసిన పుస్తకాల్లో, ప్రవక్తలు రాసిన పుస్తకాల్లో ప్రధానమైనవి."
\s5
\p
\v 41 పరిసయ్యులు ఒకచోట గుమిగూడి ఉన్నప్పుడు యేసు వాళ్ళను ఇలా అడిగాడు,
\v 42 "మెస్సీయ ఎవరని మీరు అనుకుంటున్నారు? ఆయన ఎవరి వంశానికి చెందినవాడు?" అందుకు వాళ్ళు, "ఆయన దావీదు వంశంవాడు" అని బదులిచ్చారు.
\s5
\v 43 అప్పుడు యేసు, "మెస్సీయ దావీదు వంశానికి చెందినవాడైతే దావీదు ఆయనను "ప్రభూ" అని పిలువనక్కరలేదు. దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయనను అలా పిలిచాడు.
\v 44 దావీదు మెస్సీయ గురించి రాస్తూ, "దేవుడు నా ప్రభువుతో, నేను నీ శత్రువులను నీ కాళ్ళకింద ఉంచేవరకూ నేను నిన్ను ఘనపరిచే విధంగా నా కుడిపక్కన కూర్చో" అని పలికాడు."
\s5
\p
\v 45 "కాబట్టి దావీదు మెస్సీయను "నా ప్రభూ" అని పిలిచాడంటే ఆయన దావీదు వంశం వాడు ఎలా అవుతాడు? ఆయన దావీదు కంటే గొప్పవాడు."
\v 46 యేసు మాటలు విన్నవారిలో ఎవరూ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. దీని తరువాత ఆయనను ఇరకాటంలో పెట్టాలని చూసే ఎలాంటి ప్రశ్నా అడగడానికి వాళ్ళు సాహసించలేదు.
\s5
\c 23
\p
\v 1 అప్పుడు యేసు గుంపు గూడిన జనంతో, తన శిష్యులతో ఇలా అన్నాడు,
\v 2 "మన యూదు ధర్మశాస్త్ర నియమాలను బోధించే పరిసయ్యులూ, వాళ్ళ మనుషులూ దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం మోషేకిచ్చిన ధర్మశాస్త్రం అర్థం చెప్పడం కోసం మాత్రమే తామున్నట్టు అనుకుంటారు.
\v 3 మీరు ఒకటి చెయ్యండి, వాళ్ళు మీకు ఏది బోధిస్తే దాన్ని తప్పకుండా పాటించండి గానీ, వాళ్ళు చేసే పనులు మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళు చేయమని చెప్తారు గానీ వాటిని వాళ్ళే చేయరు."
\s5
\p
\v 4 "చెయ్యడానికి కష్టమైనా ఎన్నో నియమాలు పాటించమని వాళ్ళు మీకు చెప్తారు. గానీ ఆ చెప్పిన నియమాల్ని అనుసరించడంలో కొంచెం కూడా సహాయం చెయ్యరు. ఇదెలా ఉందంటే మోయలేనంత బరువు మోపులు కట్టి మోయమని ఒక మనిషి భుజాల మీద పెట్టినట్టుంది. అయితే వాళ్ళు అది మోసేందుకు సహాయానికి మాత్రం తమ చిటికెన వేలు కూడా కదిలించరు.
\v 5 వాళ్ళు ఏ పని చేసినా, మనుషులకు కనబడాలనే, తమను చూసి మెచ్చుకోవాలనే చేస్తారు. ఉదాహరణకు, తమ చేతులపై రాసిన రక్ష రేకులను ఇంకొంచెం వెడల్పుగా చేసుకుంటారు. దేవుణ్ణి గౌరవించేవాళ్ళు అని మనుషులు అనుకోవాలని తమ అంగీల కుచ్చులు పెద్దగా చేసుకుంటారు."
\s5
\p
\v 6 " మనుషులంతా తమను గొప్ప చేయాలని వీళ్ళు అనుకుంటారు. ఉదాహరణకు, విందుల్లో బాగా గొప్ప వాళ్ళు కూర్చునే చోట కూర్చుంటారు. సమాజ మందిరాల్లో కూడా గొప్ప ఆసనాలే కోరుకుంటారు.
\v 7 సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, "బోధకా, బోధకా" అని పిలిపించుకోవడం వీళ్ళకి చాలా ఇష్టం."
\s5
\p
\v 8 "కాబట్టి శిష్యులారా, మీరు మాత్రం ఆ యూదు బోధకుల్లాగా "బోధకా, బోధకా" అని పిలిపించుకోవద్దు. నేను మాత్రమే మీ బోధకుణ్ణి. అంటే అర్థం మీరందరూ సోదరీ సోదరులు, అందరూ సమానమే.
\v 9 ఈ భూమి మీద, "తండ్రి" అని ఎవ్వరూ పిలిపించుకోవద్దు. ఎందుకంటే పరలోకంలో ఉన్న దేవుడే మీ అసలైన తండ్రి.
\v 10 అంతే కాదు, మనుషుల చేత మీరు "గురువు" అని పిలిపించుకోవద్దు. ఎందుకంటే క్రీస్తే మీ ఏకైక గురువు."
\s5
\p
\v 11 "దేవుడు మీ అందరిలో మిమ్మల్నే ముఖ్యులుగా గుర్తించాలనుకుంటే మీరు సేవకుల్లాగా ఇతరులకు సేవ చేసేవారి లాగా ఉండాలి.
\v 12 తనకు తానే గొప్పవాడిని అని గొప్పలు చెప్పుకునే వాణ్ణి దేవుడు అణిచి వేస్తాడు, ఎవరైతే మేము చాలా తక్కువ వాళ్ళం అనుకుంటారో వాళ్ళని దేవుడు నిజంగా గౌరవిస్తాడు."
\s5
\p
\v 13-14 "ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా, మీరు కపట వేషధారులు! అయ్యో, దేవుడు మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో! ఎందుకంటే పరలోక రాజ్య అధికారం కిందికి మీరు రారు, ఇతరులను కూడా రానివ్వరు. మీరూ వెళ్లరు, వాళ్ళనీ రానివ్వరు."
\p
\v 15 "ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా, మీరు కపట వేషదారులు! అయ్యో, దేవుడు ఎంత కఠినంగా మిమ్మల్ని శిక్షిస్తాడో! మీరు చెప్పే బోధల్ని ఒక్క మనిషితో నమ్మించడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టి వచ్చినంత పని చేస్తారు. ఎంతో కష్టపడితే గానీ ఒక వ్యక్తిని కూడా మీ బోధలు నమ్మేలా చేయలేరు. ఎట్టకేలకు మీరు బోధించిన దాన్ని ఎవరైనా నమ్మి మీ దగ్గరకి వస్తే, అతణ్ణి మీకంటే రెండింతలు ఎక్కువ నరకపాత్రుడుగా చేస్తారు."
\s5
\p
\v 16 "యూదు నాయకుల్లారా, అయ్యో, దేవుడు ఎంత కఠినంగా మిమ్మల్ని శిక్షిస్తాడో! మీరే గుడ్డి వాళ్ళు, అయినా మీరు ఇతరులను నడిపించాలని చూస్తున్నారు. మీరు, "కోవెల ఏదో ఒక మనిషి అన్నట్టుగా దానిమీద ఒట్టు పెట్టుకొని ఒక పని చేయడంలో విఫలమైతే అది పరవాలేదు గానీ కోవెలలోని బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే మాత్రం అతడు ఆ మాటకి కట్టుబడి ఉండాలని మీరు చెప్తారు.
\v 17 మీరు బుద్ధి లేని వాళ్ళలా, గుడ్డివాళ్ళలా ఉన్నారు. కోవెలలోని బంగారం గొప్పదే గానీ, కోవెల అంతకన్నా గొప్పది కదా! ఎందుకంటే దేవుని కోసం ఆ బంగారాన్ని పవిత్ర పరిచేది దేవాలయమే కదా!"
\s5
\p
\v 18 "అలాగే బలిపీఠం ఒక వ్యక్తి అన్నట్టు దాని మీద ఒట్టు పెట్టుకొని అలా చేయడంలో విఫలమైతే అది పరవాలేదు గానీ బలిపీఠం మీద ఉన్న అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే మాత్రం ఆ మాటకి కట్టుబడి తీరాల్సిందే అని కూడా మీరు చెప్తారు.
\v 19 మీరు గుడ్డివాళ్ళులా ఉన్నారే! బలిపీఠం మీద ఉన్న అర్పణ గొప్పదే గానీ ఆ అర్పించిన అర్పణను దేవునికోసం పవిత్ర పరిచే బలిపీఠం అంతకన్నా గొప్పది కదా!"
\s5
\p
\v 20 "బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, బలిపీఠం తోడనే కాకుండా దానిపై ఉన్న అర్పణ తోడని కూడా ఒట్టుపెట్టుకుంటున్నాడు.
\v 21 అవును, అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకునే వాడు దేవాలయం తోడనీ, దానిలో నివసించే దేవుని తోడని కూడా ఒట్టు పెట్టుకుంటున్నాడన్న మాట.
\v 22 ఆకాశం తోడని ఒట్టు పెట్టుకునేవాడు, దేవుని సింహాసనం తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు. అదే సమయంలో దానిపై కూర్చున్న దేవుని తోడనీ ఒట్టు పెట్టుకుంటున్నాడు."
\s5
\p
\v 23 "ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా, అయ్యో, మిమ్మల్ని దేవుడు ఎంత కఠినంగా శిక్షిస్తాడో! మీరు కపట వేషదారులు. ఎందుకంటే, పుదీనా, సోంపు, జీలకర్రల్లో దేవునికి పదో వంతు ఇస్తారు గానీ, వీటికంటే ఎంతో ప్రాముఖ్యమైన దేవుని నియమాలకు మాత్రం లోబడరు. ఉదాహరణకు, మీరు పక్కవారి విషయంలో న్యాయంగా ఉండరు, జాలీ, కరుణా చూపించరు. వాళ్ళ వస్తువుల్ని బలవంతంగా లాగేసుకుంటారు. పుదీనాలో, సొంపులో పదో వంతు దేవునికి ఇవ్వడం మంచిదే గానీ, దేవుని ఆజ్ఞలు పాటించడం మరీ ముఖ్యం.
\v 24 మీరు గుడ్డివాళ్ళు. అయినాగానీ మీకేదో కనపడుతున్నట్టు పక్కవాడికి దారి చూపడానికి ప్రయత్నిస్తారు. దేవుడికి కోపం తెప్పించ కూడదని మంచి నీళ్ళు తాగేటప్పుడు చిన్న పురుగును కూడా వడకట్టి చూసుకుంటూ జాగ్రత్తగా తాగుతారు. కానీ మీ ప్రవర్తన ఎంత అధ్వాన్నంగా ఉందంటే, మీరు ఒంటెల్ని మింగేసేవాళ్ళ లాగా ఉన్నారు."
\s5
\p
\v 25 "కపట వేషదారులైన ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా! అయ్యో, దేవుడు మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో! మీరు బయటికి చాలా మంచివాళ్ళలాగా కనిపిస్తారు. చాలా నిజాయితీపరులని ఇతరులు అనుకునేలా బయటి వాళ్ళకి గొప్పగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. అయితే నిజానికి వాళ్ళకి వ్యతిరేకంగా పాపం చేస్తూ అత్యాశతో మీ స్వంత సుఖభోగాల కోసం వాళ్లకు చెందినవాటన్నిటినీ లాగేసుకుంటారు. మీరు బయట శుభ్రంగా ఉన్న గిన్నె, పళ్ళెం లాంటి వాళ్ళు. అవి బయట చాలా శుభ్రంగా ఉన్నట్టు కనిపిస్తున్నా, లోపలంతా మురికిగా ఉంటాయి.
\v 26 గుడ్డి వాళ్లైన పరిసయ్యులారా, ముందు మీరు పక్కవాడి దగ్గర దోచుకోవడం మానెయ్యండి. అప్పుడు లోపలా, బయటా, రెండు వైపులా శుభ్రంగా ఉన్న పాత్రల్లాగా నిజాయితీగా ఉండగలుగుతారు."
\s5
\p
\v 27 "కపట వేషదారులారా, ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా! అయ్యో, దేవుడు మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో! మీరు సమాధుల మీద ఉన్న కట్టడాల్లాటి వాళ్ళు. అవి సున్నం వేసి ఉండటం వలన మనుషులు వాటిని చూసి, సమాధులని గమనించి వాటిని ముట్టి మైల పడకుండా పక్కనుండి వెళ్ళిపోతారు. అవి బయటికి అందంగా కనిపిస్తాయి గానీ, వాటి లోపలంతా చనిపోయిన వారి ఎముకలతో, కుళ్ళు వాసనతో నిండి ఉంటుంది.
\v 28 మీరు ఆ సమాధుల్లాటి వాళ్ళు. మనుషులు మీ వైపు చూసినప్పుడు మీరు చాలా నిజాయితీగా, నీతిమంతుల్లాగా కనిపిస్తారు. గానీ, లోపల మీరు కపట వేషధారులు. ఎందుకో తెలుసా, మీరు దేవుని ఆజ్ఞలకు లోబడనే లోబడరు."
\s5
\p
\v 29 "ధర్మశాస్త్ర బోధకుల్లారా, పరిసయ్యుల్లారా, మీరు కపట వేషధారులు. దేవుడు మిమ్మల్ని ఎంత కఠినంగా శిక్షిస్తాడో! పూర్వ కాలంలో ఎవరో చంపిన ప్రవక్తల సమాధులు తిరిగి మళ్ళీ కట్టిస్తున్నారు. నీతిమంతుల స్తూపాలను అలంకరిస్తున్నారు.
\v 30 మీరు "మా పూర్వికులు జీవించిన కాలంలో మేము ఉండి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో మేము వాళ్ళతో కలిసే వాళ్ళమే కాదు" అంటారు.
\v 31 ఈ విధంగా మీరు ప్రవక్తలను చంపినవాళ్ళ సంతానం నుండి వచ్చామని చెప్పకనే చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా వాళ్ళ లాటి వాళ్ళే."
\s5
\p
\v 32 "ఇంకేంటి, మీరు కూడా మీ పూర్వీకులు చేసిన పాపాలను పూర్తి చేసేయండి.
\v 33 మీరు దుష్టులు. విష సర్పాల కంటే కూడా ప్రమాదకరమైన వాళ్ళు. మీరు తప్పకుండా దేవుని శిక్షనుండి, అంటే నరక శిక్ష నుండి తప్పించుకుంటామని బుద్ధిహీనంగా అనుకుంటారు."
\s5
\p
\v 34 "కాబట్టి వినండి, అందుకే నేను ప్రవక్తలనూ, పండితుల్నీ, బోధకుల్నీ పంపుతాను. వాళ్ళల్లో మీరు కొందరిని సిలువ వేసీ, కొందరిని మరో రకంగానూ చంపుతారు. కొంతమందినేమో సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు. మరి కొంతమందిని ఊరినుండి తరిమి తరిమి కొడతారు.
\v 35 ఆదాము కొడుకూ నీతిమంతుడూ అయిన హేబెలు మొదలు, పరిశుద్ధ స్థలానికీ, బలిపీఠానికీ మధ్యలో మీ పూర్వికులు చంపిన బరక్యా కొడుకు జెకర్యా రక్తం వరకూ ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధం అంతా మీ మీదికి వస్తుంది.
\v 36 నా పరిచర్యను గమనిస్తున్న మీరు దీని గురించి ఆలోచించండి. ఆ ప్రవక్తలను చంపినందుకు దేవుని శిక్ష వారి మీదికి కచ్చితంగా వస్తుందని మీతో చెబుతున్నాను."
\s5
\p
\v 37 "యెరూషలేము ప్రజలారా, పూర్వకాలం నుండీ ప్రవక్తలను చంపుతూ, దేవుడు మీ దగ్గరకు పంపిన వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపినవాళ్ళు మీరు. కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద కాపాడినట్టు ఎన్నో సార్లు నేను మిమ్మల్ని పోగుచేసి కాపాడాలని అనుకున్నాను కానీ మీరు నన్ను అలా చేయనివ్వ లేదు.
\v 38 కాబట్టి ఇక వినండి. మీ పట్టణం మనుషులు నివసించడానికి వీలు లేనిదిగా తయారవుతుంది.
\v 39 ఇది గుర్తుంచుకోండి. నేను మళ్ళీ తిరిగి రావడం మీరు చూస్తారు. అప్పుడు "దేవుని అధికారంతో వస్తున్న ఈ మనిషి దేవునికెంతో ప్రియమైనవాడు" అని మీరు నా గురించి చెప్పుకుంటారు."
\s5
\c 24
\p
\v 1 యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు కూడా ఆయనతో నడుస్తూ, ఈ దేవాలయ భవనాలు ఎంత అందంగా ఉన్నాయో అంటూ మాట్లాడటం మొదలుపెట్టారు.
\v 2 అప్పుడాయన, "మీరు ఇప్పుడు చూస్తున్న ఈ భవనాల గురించి ఒక నిజాన్ని చెబుతున్నాను వినండి. ఒక సైన్యం వీటిని కచ్చితంగా సమూల నాశనం చేసేస్తుంది. ఈ భవనాల్లో ఉన్న ప్రతీ రాయినీ ఒకదానిపై ఒకటి ఉండకుండా కూలగొట్టేస్తారు" అని వారితో అన్నాడు.
\s5
\p
\v 3 తరువాత, యేసు ఒలీవకొండ మీద ఒంటరిగా కూర్చుని ఉన్న సమయంలో శిష్యులు ఆయన దగ్గరికెళ్ళి, "కోవెల గురించి నువ్వు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏమి జరుగుతుంది? లోకాంతం అయ్యేటప్పుడు ఎలా తెలుస్తుంది? మాకు చెప్పు" అని అడిగారు.
\p
\v 4 యేసు, "నేను చెప్పేదేమిటంటే లోకాంతంలో ఏమి జరుగుతుంది అనే విషయాల్లో ఎవ్వరు మిమ్మల్నిమోసం చేయకుండా చూసుకోండి!
\v 5 చాలా మంది నా పేరు చెప్పి వచ్చి "నేనే క్రీస్తుని" అని చెబుతారు. మరీ ముఖ్యంగా, "నేనే మెస్సీయని" అని చెబుతారు. అలా వాళ్ళు చాలా మందిని దారి తప్పేలా చేస్తారు."
\s5
\p
\v 6 "మీరు యుద్ధాల గురించీ, యుద్ధ వార్తల గురించీ వింటారు. కాబట్టి మీరు కంగారు పడకండి. ఇవన్నీ జరిగి తీరాలని దేవుడే చెప్పాడని మనసులో ఉంచుకోండి. అయితే ఇవి జరిగినప్పుడు లోకం అంతమయ్యే కాలం వచ్చేసిందని మాత్రం కాదు. అంతం వెంటనే రాదు.
\v 7 మనుషుల్లో గుంపుల మధ్య ఘర్షణలూ, ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యం కాలు దువ్వడాలూ, కరవులూ, భూకంపాలూ కలుగుతాయి.
\v 8 ఇవన్నీ బిడ్డ పుట్టటానికి ముందు గర్భిణీ స్త్రీకి వచ్చే ప్రసూతి నొప్పుల్లాటివి. ఇవి కష్టాలకు ఆరంభం మాత్రమే."
\s5
\p
\v 9 "చాలా ఘోరాలు జరుగుతాయి. మనుషులు మిమ్మల్ని హింసిస్తారు, చంపుతారు. మీరు నన్ను విశ్వసించడం వల్ల నా గురించి మనుషులంతా మిమ్మల్ని అసహ్యించుకుంటారు.
\v 10 అంతే కాదు, ఆ హింసలు చూసి అనేకమంది వెనక్కి తగ్గుతారు. వాళ్ళు ఒకరినొకరు ద్వేషించుకొని తమ సాటి విశ్వాసుల్ని శత్రువులకు పట్టిస్తారు.
\v 11 కపట ప్రవక్తలు అనేకమంది వచ్చి, ప్రవక్తలం అని అబద్ధాలు చెప్పి ఎంతో మందిని మోసం చేస్తారు."
\s5
\p
\v 12 "దేవుని ఆజ్ఞలకు లోబడక పోవడం వల్ల ఎక్కువమందిలో అన్యాయం పెరిగిపోయి విశ్వాసులు చాలామందిలో ప్రేమ అణగారిపోతుంది. ఒకరి నొకళ్ళు ప్రేమించుకోవడం మానేస్తారు.
\v 13 అయితే ఎవరు చివరి వరకు దేవునిపై నమ్మకం ఉంచి నిలబడతారో వాళ్ళని దేవుడు రక్షిస్తాడు.
\v 14 రాబోయే రోజుల్లో దేవుడు లోకాన్నంతటినీ ఎలా పరిపాలిస్తాడో తెలిపే శుభవార్తను విశ్వాసులు లోకమంతా తెలియజేస్తారు. ఆ తరవాత లోకం అంతరించిపోతుంది."
\s5
\p
\v 15 "అయితే, లోకం అంతరించక ముందు ఒక అసహ్యాన్ని పుట్టించే వినాశనకారి పరిశుద్ధ దేవాలయాన్ని మైలపడేలా చేసే ఒక హేయమైన వస్తువును దేవాలయంలో ఉంచి ప్రజలను లోపలి రాకుండా అడ్డుకుంటాడు. దీనిగురించి చాలా కాలం క్రితమే దానియేలు ప్రవక్త రాశాడు. ఇప్పుడు దీన్ని చదువుతున్న వారందరూ ఒకసారి దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. ఇది నా హెచ్చరిక.
\v 16 దేవాలయంలో ఇలా జరగ్గానే యూదా ప్రాంతంలో ఉన్నవాళ్ళందరూ ఎత్తైన కొండలకి పారిపోవాలి.
\v 17 పారిపోయే ముందు ఇంటి బయట ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకోడానికి లోపలి వెళ్ళకూడదు.
\v 18 పొలంలో పని చేసేవాళ్ళు పారిపోయే ముందు తమ బట్టలు తీసుకెళ్ళడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు."
\s5
\p
\v 19 "అయ్యో, ఆ రోజుల్లో గర్భవతుల పరిస్థితీ, చంటిపిల్లల తల్లుల పరిస్థితీ ఎంత ఘోరంగా ఉంటుందో! ఎందుకంటే వాళ్ళు మహా బాధలకు గురౌతారు. వాళ్ళకి పారిపోవడం ఎంతో కష్టం.
\v 20 ఆ పారిపోయే సమయం శీతాకాలం గానీ, విశ్రాంతి దినం గానీ రాకుండా చూసుకోండి.
\v 21 ఎందుకంటే ఆ సమయంలో మనుషులందరూ తీవ్రమైన శ్రమలకు గురౌతారు. సృష్టి మొదలైనప్పటి నుంచీ ఇంత బాధలు ఎప్పుడూ పొందలేదు, భవిష్యత్తులో పొందరు కూడా.
\v 22 దేవుడు గనుక ఆ రోజుల్ని తగ్గించకపోతే ప్రతి ఒక్కళ్ళూ చనిపోతారు. అయితే ఆయన ఎన్నుకున్న ప్రజల కోసం ఆ రోజులు తగ్గించడానికి తీర్మానించుకున్నాడు."
\s5
\p
\v 23 "ఆ సమయంలో మీతో ఎవరైనా, ఇదిగో మెస్సీయ ఇక్కడ ఉన్నాడనీ, అదుగో అక్కడ ఉన్నాడనీ మీతో చెప్తే మీరు నమ్మవద్దు.
\v 24 వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి రక రకాల అద్భుతాలూ, నోరు వెళ్ళబెట్టి చూసే ఎన్నెన్నో మాయలూ, మీ కళ్ళముందు కనపరుస్తారు. ఆఖరికి దేవుడెన్నుకున్న మిమ్మల్ని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు.
\v 25 ఇదిగో, ఇవన్నీ జరక్క ముందే నేను మీతో చెబుతున్నానని మర్చిపోవద్దు."
\s5
\p
\v 26 "కాబట్టి ఎవరైనా మీతో, ఇదిగో క్రీస్తు అరణ్యంలో ఉన్నాడనీ, గది లోపల ఉన్నాడనీ చెప్పినా సరే మీరు నమ్మొద్దు.
\v 27 మెరుపు తూర్పున తళుక్కుమని మెరిసి పడమర వైపు అందరూ చూసేటట్టు ఎలా కన్పిస్తుందో, అలాగే మనుషకుమారుడి రాక ఉంటుంది.
\v 28 రాబందులన్నీ ఒకే చోట పోగైతే ఎదో ఒక జంతు కళేబరం అక్కడ ఉండి ఉంటుందని సులువుగా తెలిసినట్టే. ఆయన రాక అందరికీ స్పష్టంగా తెలిసిపోతుంది.
\s5
\v 29 మనుషులకు బాధలు అయ్యిపోయిన వెంటనే సూర్యుని చీకటి కమ్ముతుంది. చంద్రుడు ఇంక కాంతిని ఇవ్వలేడు. ఆకాశం నుండి నక్షత్రాలన్నీరాలిపోతాయి. ఆకాశంలో ఉన్నవస్తువుల స్థానాలన్నిటినీ దేవుడు కదిలించేస్తాడు."
\s5
\p
\v 30 "తరువాత, ఆకాశంలో మనుషకుమారుడు వచ్చే కదలికలు అందరూ స్పష్టంగా చూస్తారు. భూమి మీద ఉన్న ఆయన్ని నమ్మని అన్నిరకాల జాతుల ప్రజలూ ఆయన్ని చూసి గుండెలు బాదుకుని ఏడుస్తారు. వాళ్ళు మనుషకుమారుడు మేఘాల్లో, మహా శక్తితో, మహా మహిమతో రావడం చూస్తారు.
\v 31 ఆయన పరలోకం నుండి తన దూతల్ని భూమి నాలుగు పక్కలకి పంపుతాడు. ఆ దూతలు గొప్ప బూర శబ్దం వినీ వినగానే భూమి మీద దేవుడు ఎన్నుకొన్నఆయన ప్రజలందర్నీ ఒకచోటికి సమకూరుస్తారు."
\s5
\p
\v 32 "అంజూరుు చెట్టు ఎదిగే విధానం గురించి ఇప్పుడు కొంచెం తెలుసుకోండి. దాని కొమ్మలు లేతగా ఉండి దాని ఆకులు చిగిరిస్తూ ఉంటే గనక వేసవి కాలం దగ్గర పడిందని అర్థం అవుతుంది.
\v 33 అలాగే మీరు ఈ సంగతులన్నీ జరగడం మీరు చూసినప్పుడు ఆయన రాక సమీపంగా ఉందని మీరు గ్రహించాలి."
\s5
\p
\v 34 "ఈ సంగతులన్నీ ముందునుండీ గమనించిన వాళ్ళు చనిపోక ముందే ఇవన్నీ జరుగుతాయని కచ్చితంగా చెబుతున్నాను.
\v 35 నేను చెప్పిన ఈ సంగతులు కచ్చితంగా జరగబోతున్నాయి. ఆకాశమూ, భూమీ ఒకానొక రోజు గతించిపోతాయి గానీ, నేను చెప్పే మాటలు మాత్రం ఎప్పుడూ నిజమౌతాయి."
\s5
\p
\v 36 "అయితే ఇదెప్పుడు జరుగుతుంది అనే విషయం, అంటే, ఆ రోజు గానీ ఆ గంట గానీ, ఏ మనిషికీ గానీ, పరలోకంలో ఉన్న దూతలకు గానీ, చివరికి కుమారుడికి కూడా తెలియదు. ఒక్క తండ్రికి మాత్రమే ఆ విషయం తెలుసు."
\s5
\p
\v 37-39 "నోవహు జీవించిన రోజుల్లో ఎలా ఉండేదో అలాగే రాబోయే రోజుల్లో కూడా ఉండబోతున్నది. ఆ మనుషులకు జలప్రళయం వచ్చేవరకు కూడా తమకి ఏదైనా చెడు జరుగుతుందేమో అనే ఆలోచన కూడా లేదు. ఎప్పటి లాగానే వాళ్ళు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, తల్లిదండ్రులు వారి కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తూనే ఉన్నారు. నోవహు, అతని కుటుంబం, ఓడలోకి వెళ్ళే రోజు వరకు కూడా వాళ్ళు అలా చేస్తూనే ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి ఓడలో ఉన్నవారు తప్ప మిగిలినవాళ్ళంతా కొట్టుకుపోయే వరకూ వాళ్ళ కళ్ళు తెరుచుకోలేదు. అచ్చం అలాగే దేవుని నమ్మని వాళ్ళు కూడా మనుష కుమారుని రాకను తెలుసుకోలేరు."
\s5
\p
\v 40 "ఆయన రాక సంభవించినప్పుడు అందరూ పరలోకానికి వెళ్ళలేరు. ఉదాహరణకు, పొలంలో ఇద్దరు మనుషులు ఉంటే వాళ్ళలో ఒక్కడు మాత్రమే వెళ్ళిపోతాడు. ఇంకొకడు శిక్ష పొందడానికి మిగిలిపోతాడు.
\v 41 అలాగే ఇద్దరు ఆడవాళ్ళు కలిసి తిరగలి విసురుతూ ఉండగా ఒకామె వెళ్ళిపోతుంది. ఇంకొకామె మిగిలిపోతుంది.
\v 42 కాబట్టి ఏరోజున ప్రభువు భూమి మీదకు వస్తాడో మీకు తెలియదు కాబట్టి అన్ని సమయాల్లో మెలకువగా ఉండండి."
\s5
\p
\v 43 "దొంగలు రాత్రి ఏ సమయంలో వస్తారో ఆ ఇంటి యజమానికి తెలిసిపోతే, అతడు మెలకువగా ఉండి, దొంగతనం చేయనివ్వడు కదా! అలాగే మనుష్యకుమారుడు అనుకోని సమయంలో ఒక దొంగ లాగా వస్తాడు.
\v 44 మీరు ఎదురు చూడని గంటలో మనుష్యకుమారుడు భూమి మీదకి వస్తాడు కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి."
\s5
\p
\v 45 "ఒక నమ్మకమైన, తెలివైన సేవకుడు ఎలా ఉంటాడో ఆలోచించండి. ఇంటి యజమాని తన ఇంట్లో ఉన్న ఒక సేవకుణ్ణి, మిగిలిన సేవకులందరి మీదా మేనేజర్ గా నియమించాడు. అతడు వారందరికీ సమయానికి భోజనం పెట్టమని చెప్పాడు. తరవాత అతడు దూర ప్రయాణమై పోయాడు.
\v 46 యజమాని చాలా కాలం తరవాత ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ సేవకుడు తన పని నమ్మకంగా చేసినట్టు గమనిస్తే అతడు చాలా సంతోషిస్తాడు.
\v 47 అతడు ఆ సేవకుణ్ణి తన ఆస్తి అంతటి మీదా మేనేజర్ గా నియమిస్తాడు అని మీతో కచ్చితంగా చెబుతున్నాను."
\s5
\p
\v 48 "అయితే అలా కాకుండా, అతడు ఒక దుష్టుడైన కపట సేవకుడైతే తనలో తాను, "ఆ, ఏముందిలే, నా యజమాని చాలా దూరం ప్రయాణమై వెళ్ళాడు, ఇప్పట్లో రాడు, నేనేమి చేసినా అతడు కనుక్కోలేడు" అనుకొని
\v 49 తన తోటి సేవకులందరినీ కొడుతూ తాగుబోతులతో కలిసి తింటూ తాగుతూ జల్సా చేస్తూ ఉంటాడు.
\v 50 అప్పుడు అతడు ఊహించని సమయంలో, అతడు ఎదురు చూడని రోజున అతని యజమాని తిరిగి వస్తాడు.
\v 51 అతడు ఆ సేవకుణ్ణి చూసి, కఠినంగా శిక్షించి కపట వేషధారులుండే చోట అతణ్ణి పడవేస్తాడు. అక్కడి మనుషులు యాతన తట్టుకోలేక ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటారు."
\s5
\c 25
\p
\v 1 "పరలోకం నుండి దేవుని పరిపాలనను ఈ విధంగా పోల్చవచ్చు. పదిమంది కన్యలు పెళ్ళికొడుకును కలుసుకోడానికి ఒక పెళ్ళివిందుకు వెళ్ళారు. వాళ్ళు దీపాలు పట్టుకుని పెళ్ళికొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు.
\v 2 ఇందులో ఐదుగురు తెలివి గలవాళ్ళు, ఐదుగురు తెలివి తక్కువ వాళ్ళు.
\v 3 అయితే, తెలివి తక్కువ కన్యలు దీపాలు పట్టుకున్నారు గానీ వాటిలో నూనె అయిపోతే అదనంగా కావలసిన ఒలీవ నూనె తీసుకెళ్ల లేదు.
\v 4 అయితే తెలివి గల కన్యలు మాత్రం దీపాలలో కావలసిన నూనెతో బాటు, సీసాల్లో కూడా అదనంగా నూనె వేసి తెచ్చుకున్నారు."
\s5
\p
\v 5 "పెళ్ళి కొడుకు రావడానికి చాల సమయం తీసుకున్నాడు. రాత్రి చాలా ఆలస్యమైపోయింది. అయితే కన్యలందరూ అలసిపోయి మత్తుగా నిద్ర పోయారు.
\v 6 అర్ధ రాత్రి వేళ, "ఇదిగో, పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు, బయటికి వెళ్ళి ఆయన్ని కలుసుకోండి!" అని కొందరు అరుస్తూ వాళ్ళని నిద్ర లేపారు."
\s5
\p
\v 7 "అమ్మాయిలు అందరూ లేచి తమ దీపాలను సరి చేసుకొని వెలిగించుకున్నారు.
\v 8 అప్పుడు తెలివి తక్కువ కన్యలు తెలివైన వారితో, "మా దీపాలు ఆరిపోయేలా ఉన్నాయి, మీ నూనె కొంచెం మాకిస్తారా?" అని అడిగారు.
\v 9 దానికి వాళ్ళు, "మా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికీ సరిపోదేమో, మీరు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కోండి" అని చెప్పారు.
\s5
\v 10 అయితే, ఈ తెలివి తక్కువ కన్యలు నూనె కొనుక్కోడానికి వెళ్తుండగానే పెళ్ళికొడుకు వచ్చేశాడు. అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు కన్యలు పెళ్ళికొడుకుతో కలిసి పెళ్ళికూతురు కనిపెడుతూ ఉన్న పెళ్ళి హాల్లోకి వెళ్ళారు. వెంటనే తలుపు మూసేశారు."
\p
\v 11 "ఆ తరవాత మిగిలిన కన్యలు పెళ్ళి వేడుక దగ్గరికి వచ్చి "ప్రభూ, తలుపు తెరవండి" అని పెళ్ళి కొడుకుని అడిగారు.
\v 12 కానీ, పెళ్ళి కొడుకు వారితో, "మీరెవరో నిజంగా నాకు తెలీదు. కాబట్టి నేను మీకోసం తలుపు తీయను" అన్నాడు."
\p
\v 13 యేసు ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నాడు, "ఈ విధంగా మీకు జరక్కూడదు కాబట్టీ, ఆయన ఎప్పుడు వస్తాడో, ఆ గంటైనా, రోజైనా మీకు తెలీదు కాబట్టీ, మెలకువగా ఉండండి."
\s5
\p
\v 14 "మనుష్యకుమారుడు రాజుగా ఏలడానికి పరలోకం నుండి తిరిగిరావడం దూర ప్రయాణం వెళ్ళబోతున్న ఒక మనిషి పోలికగా ఉంది. అతడు ప్రయాణానికి వెళ్ళే ముందు తన సేవకులందరినీ పిలిచి, వాళ్ళకి తన ఆస్తిలో కొంత సొమ్ము ఇచ్చి, తాను తిరిగి వచ్చేంతవరకు పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి తనకోసం మరింత సంపాదించమని చెప్పాడు.
\v 15 అతడు ఆ ఆస్తిని ఉపయోగించడంలో వాళ్ళ వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి పంచి ఇచ్చాడు. ఉదాహరణకు, ఒక సేవకునికి 165 కిలోల బరువైన 5 సంచుల బంగారం ఇస్తే, ఇంకొక సేవకునికి 66 కిలోల బరువైన రెండు సంచుల బంగారాన్నీ, ఇంకొకడికి 33 కిలోల బరువైన ఒక సంచి బంగారాన్నీ ఇచ్చాడు. తరవాత అతడు ప్రయాణమై వెళ్ళిపోయాడు.
\v 16 ఐదు సంచుల బంగారాన్ని తీసుకున్న సేవకుడు వెంటనే వెళ్ళి, దానితో వ్యాపారం చేసి, ఇంకో ఐదు సంచుల బంగారాన్ని సంపాదించాడు."
\s5
\p
\v 17 అలాగే, రెండు సంచుల బంగారాన్ని తీసుకున్న సేవకుడు వ్యాపారం చేసి, ఇంకో రెండు సంచుల బంగారాన్ని సంపాదించాడు.
\v 18 అయితే ఒక్క సంచి బంగారం తీసుకున్న సేవకుడు వెళ్ళి, నేలలో గుంట తవ్వి, జాగ్రత్తగా ఉంటుందని అక్కడ దాచిపెట్టాడు."
\s5
\p
\v 19 "చాలా కాలం తరవాత ఆ యజమాని తిరిగి వచ్చాడు. తన సేవకులందరినీ పిలిచి, తానిచ్చిన డబ్బుతో ఎలా వ్యాపారం చేశారు అని లెక్కలడిగాడు.
\v 20 ఐదు సంచుల బంగారం తీసుకున్న సేవకుడు 10 సంచులు తెచ్చాడు. అతడు, "అయ్యగారూ, మీరు నాకు ఐదు సంచుల బంగారం ఇచ్చారు. చూడండి, వాటితో వ్యాపారం చేసి, ఇంకా అదనంగా ఐదు సంచుల బంగారం సంపాదించాను" అన్నాడు.
\v 21 దానికి ఆ యజమాని, "నువ్వు నమ్మకమైన మంచి సేవకుడివి. నువ్వు ఈ చిన్న మొత్తాన్ని చాలా నైపుణ్యంగా వాడావు. నిన్ను ఇంకా ఎక్కువ పనులమీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నువ్వు కూడా భాగం పంచుకో" అన్నాడు."
\s5
\p
\v 22 "రెండు సంచుల బంగారం తీసుకున్న సేవకుడు కూడా వచ్చి, యజమానితో, "అయ్యగారూ, మీరిచ్చిన రెండు సంచుల బంగారాన్ని జాగ్రత్తగా వాడాను. చూడండి, వాటితో వ్యాపారం చేసి అదనంగా రెండు సంచుల బంగారం సంపాదించాను" అన్నాడు.
\v 23 అందుకు ఆ యజమాని, "నువ్వు నమ్మకమైన మంచి సేవకుడివి. నువ్వు ఈ చిన్న మొత్తాన్ని చాలా నైపుణ్యంగా వాడావు. నిన్ను ఇంకా ఎక్కువ పనులకు నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నువ్వు కూడా భాగం పంచుకో" అన్నాడు."
\s5
\p
\v 24 "ఒక సంచి బంగారం తీసుకున్న సేవకుడు వచ్చి యజమానితో, "అయ్యగారూ, మీరు నన్ను ఏం చేస్తారో అని భయపడ్డాను. మీరు మీది కానిదీ, పెట్టుబడి ఏమీ పెట్టని పెద్ద మొత్తాలనూ, ఇతరులనుండి లాక్కునేంత కఠినాత్ములనీ, వేరేవారు నాటిన పంటను కోసుకొనే వాళ్ళనీ నాకు తెలుసు.
\v 25 ఈ డబ్బు పోతే మీరేం చేస్తారో అని భయపడి దీనిని భూమిలో పాతిపెట్టాను. ఇదిగో, దయచేసి తీసేసుకోండి" అన్నాడు.
\s5
\v 26 అప్పుడు ఆ యజమాని, "నువ్వు సోమరిపోతువి, పనికిమాలిన చెడ్డ సేవకుడివి. నేను పెట్టుబడి కూడా పెట్టకుండా ఎక్కువ మొత్తాన్ని లాక్కునేంత కఠినాత్ముడననీ, ఎవడో నాటిన పంటను కోసుకొనేవాడిననీ నీకు తెలుసు కదా.
\v 27 అలాంటప్పుడు కనీసం నా డబ్బులు బ్యాంక్ లో వేసి ఉంటే నేను తిరిగి వచ్చినప్పుడు వాటిని వడ్డీతో సహా తీసుకొనేవాడిని కదా."
\s5
\v 28 అప్పుడు ఆ యజమాని తన సేవకులతో, "అతని దగ్గర ఉన్న సంచెడు బంగారాన్ని తీసేసి పది సంచీలు బంగారం సంపాదించిన సేవకునికి ఇచ్చెయ్యండి.
\v 29 దేవుడు ఉన్నదానిని సరిగ్గా ఉపయోగించేవానికి ఇంకా ఎక్కువ ఇస్తాడు. వాళ్లకి ఎంతో సమృద్ధి ఉంటుంది. కానీ తన దగ్గర ఉన్నదాన్ని కూడా సరిగ్గా ఉపయోగించని వాడి దగ్గరనుండి వాడికి ఇంతకు ముందు ఉన్నది కూడా తీసేస్తాడు.
\v 30 ఆ పనికిమాలిన సేవకుణ్ణి బయట చీకటిలోకి విసిరేయండి. అక్కడ హాహాకారాలు చేస్తూ బాధలు తట్టుకోలేక పళ్ళు కొరుక్కుంటున్నవారితో ఉంటాడు."
\s5
\p
\v 31 "మనుష్యకుమారుడు తన అద్భుతమైన కాంతితో తన దూతలందరితో తిరిగివచ్చి మహా రాజుగా సింహాసనం మీద కూర్చుని ప్రతి ఒక్కరికీ తీర్పు తీరుస్తాడు.
\v 32 ప్రజలందరూ సమూహాలుగా ఆయన ముందు నిలబడతారు. అప్పుడు ఒక గొల్లవాడు మేకలనూ గొర్రెలనూ వేరు చేసినట్టు వాళ్ళని వేరుచేస్తాడు.
\v 33 ఆయన మంచివాళ్ళని కుడివైపూ, చెడ్డవారిని ఎడమవైపూ నిలబెడతాడు."
\s5
\p
\v 34 "అప్పుడాయన, కుడివైపున ఉన్నవాళ్ళతో, "నా తండ్రి ఆశీర్వదించిన వాళ్లలారా రండి, లోకాన్ని సృష్టించినప్పటినుండీ మీకోసం సిద్ధం చేస్తున్న మంచి వాటన్నిటినీ, ఆయన రాజ్యాన్నీ మీరు స్వాధీనం చేసుకోండి.
\v 35 ఇవన్నీ మీకోసమే, ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. నేను దాహంతో ఉన్నప్పుడు నాకు నీళ్ళిచ్చారు. మీ ఊరికి కొత్తగా వస్తే నన్ను పిలిచి మీ ఇళ్ళల్లో ఉండనిచ్చారు.
\v 36 నాకు వేసుకోడానికి బట్టలు లేకపోతే మీరు బట్టలు ఇచ్చారు, నాకు జబ్బు చేస్తే నాగురించి శ్రద్ధ తీసుకున్నారు. నేను జైల్లో ఉంటే, వచ్చి నన్ను పరామర్శించారు" అంటాడు."
\s5
\p
\v 37 "అప్పుడు మంచివాళ్ళు అని దేవుడు పిలిచినవాళ్ళు, "ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేస్తే మేము తినడానికి ఇచ్చాం? ఎప్పుడు దాహం వేస్తే తాగడానికి నీళ్ళిచ్చాం?
\v 38 ఎప్పుడు మా ఊరికి నువ్వు కొత్తగా వస్తే మేము మా ఇంట్లో ఉండనిచ్చాం? ఎప్పుడు నీకు వేసుకోడానికి బట్టలు లేకపోతే బట్టలిచ్చాం?
\v 39 ఎప్పుడు నువ్వు జబ్బు పడ్డావు? ఎప్పుడు నువ్వు జైల్లో ఉన్నావు? ఎప్పుడు మేము నిన్ను పరామర్శస చేశాం? ఇవేమీ మాకు గుర్తు లేవే!" అంటారు.
\v 40 అప్పుడు రాజు ఇలా అంటాడు, "మీ సహ విశ్వాసులు ఎవరికైనా, లోకంలో బీదా బిక్కీకి ఇలా చేసినా కచ్చితంగా మీరు నాకు చేసినట్టే."
\s5
\p
\v 41 "అయితే రాజు ఎడమవైపు ఉన్నవారిని చూసి, "దేవుడు శపించిన వాళ్ళలారా, నన్ను వదిలిపొండి. దేవుడు సాతానుకూ, అతని దూతలకూ సిద్ధం చేసిన నిత్యం మండే అగ్నిగుండంలోకి పొండి.
\v 42 మీకు అదే సరైంది. ఎందుకంటే నేను ఆకలితో ఉన్నప్పుడు తినడానికి ఏమీ ఇవ్వలేదు. నేను దాహంతో ఉన్నప్పుడు తాగడానికి ఏమీ ఇవ్వలేదు.
\v 43 మీ ఊరికి కొత్తగా వస్తే మీ ఇంట్లోకి నన్ను రానీయలేదు, నేను వేసుకోడానికి బట్టలు లేకుండా ఉంటే నాకు బట్టలియ్యలేదు, నేను జబ్బు పడ్డప్పుడూ, జైల్లో ఉన్నప్పుడూ కూడా నన్ను చూడ్డానికి రాలేదు" అంటాడు."
\s5
\p
\v 44 "అప్పుడు వాళ్ళు, "ప్రభూ, నువ్వెప్పుడు ఆకలిగా ఉంటే మేం భోజనం పెట్టలేదు? ఎప్పుడు దాహంగా ఉంటే మేం నీళ్ళివ్వలేదు? ఎప్పుడు కొత్తగా ఊరికొస్తే మా ఇంట్లోకి రానివ్వలేదు? ఎప్పుడు బట్టలు లేకుండా ఉంటే మేం నీకు బట్టలివ్వలేదు? నువ్వెప్పుడు జబ్బుగా ఉంటే, ఎప్పుడు జైల్లో ఉంటే మేము పరామర్శించలేదు?" అని అడుగుతారు."
\p
\v 45 "ఆయన వాళ్లకి ఇలా జవాబిస్తాడు, "నిజానికి నా ప్రజలకూ, ఆఖరికి మీ దగ్గర ఉన్న బీదా బిక్కీకీ ఎలాంటి సాయం చేసినా అది కచ్చితంగా నాకు చేసినట్టే. మీరు వాళ్లకి చేయలేదు కాబట్టి నాక్కూడా మీరు చేయనట్టే."
\p
\v 46 "కాబట్టి నా ఎడం వైపు ఉన్నవాళ్ళు దేవుని నిత్య శిక్ష అయిన అగ్నిగుండంలోకీ, నా కుడివైపు ఉన్నవాళ్ళు దేవునితో కలిసి నిత్యం నివసించే పరలోకానికీ వెళ్ళండి."
\s5
\c 26
\p
\v 1 యేసు ఈ విషయాలన్నీ చెప్పడం ముగించిన తరవాత, తన శిష్యులతో ఇలా అన్నాడు,
\v 2 "రెండు రోజుల తరవాత మనం పస్కా పండగ చేసుకుంటామని మీకు తెలుసు కదా. ఆ సమయంలోనే మనుష్య కుమారుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు."
\s5
\p
\v 3 అదే సమయంలో ముఖ్య యాజకులూ, యూదు పెద్దలూ కైఫా అనే ప్రధాన యాజకుడి ఇంట్లో సమావేశమయ్యారు.
\v 4 అక్కడ వాళ్ళు యేసుని ఎలా మోసపూరితంగా, యుక్తిగా పట్టుకుని చంపాలో పథకం రచించారు.
\v 5 అయితే "ఇది పస్కా పండుగ సమయం. మనం ఆ పని ఇప్పుడు చేస్తే ప్రజల్లో అల్లర్లు జరగవచ్చు" అని తమలో తాము అనుకున్నారు.
\s5
\p
\v 6 యేసు, ఆయన శిష్యులు, బేతనియ గ్రామంలో సీమోను ఇంట్లో భోజనం చేస్తున్నారు. యేసు ఇంతకు ముందు సీమోనుకు ఉన్న కుష్టరోగాన్ని బాగుచేశాడు.
\v 7 వాళ్ళు భోజనం చేస్తుండగా ఒక స్త్రీ ఆ ఇంటికి వచ్చింది. ఆమె అందమైన, రాతితో చేసిన ఒక కూజాలో చాలా ఖరీదైన అత్తరును పట్టుకొచ్చింది. ఆమె యేసు భోజనం చేస్తూ ఉండగా, ఆయన దగ్గరకి వెళ్ళి, తలమీద నుండి ఆ అత్తరును పోసింది.
\v 8 అది చూసి శిష్యులకు చాల కోపం వచ్చింది. వాళ్ళలో ఒకడు, "ఈ అత్తరు ఇలా వృధా చేయడం ఏమిటి? ఇది చాలా ఘోరం. ఎంతో నష్టం.
\v 9 దీన్ని గనక మనం అమ్మి ఉంటే ఎంతో డబ్బు వచ్చేది. అప్పుడది పేదవాళ్ళకు దానం చేసేవాళ్ళం కదా!" అన్నాడు.
\s5
\p
\v 10 వాళ్ళు అంటున్న మాటలు యేసు గ్రహించి, "ఈ స్త్రీని మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నాకోసం ఎంతో అద్భుతమైన పని చేసింది.
\v 11 పేదవాళ్ళు ఎప్పుడూ మీతోనే ఉంటారని గుర్తు పెట్టుకోండి. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకి మీరు సాయం చేయొచ్చు. కానీ నేను ఎల్లకాలం మీతో ఉండను."
\s5
\p
\v 12 "ఈమె ఈ అత్తరును నా శరీరంపై పోయడం ఎలా ఉందంటే నేను తొందరలో చనిపోతున్నానని ఈమెకు తెలిసిందేమో అన్నట్టుగా ఉంది. అంతే కాదు, ఈ అత్తరు నాపై పోసి నా భూస్థాపన కోసం నన్ను సిద్ధం చేసింది.
\v 13 ఈ లోకంలో నా గురించిన సువార్త ప్రకటిస్తున్నప్పుడెల్లా ఈమె చేసిన పని గుర్తు చేసికొని ఈమెనూ, ఈమె చేసిన పనినీ లోకమంతా ప్రశంసిస్తుంది" అన్నాడు.
\s5
\p
\v 14 అప్పుడు పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా ముఖ్య యాజకుల దగ్గరికి వెళ్ళాడు.
\v 15 అతడు వారిని, "ఒకవేళ నేను యేసును మీకు పట్టిస్తే, మీరు నాకు ఎంత డబ్బు ఇస్తారు?" అని అడిగాడు. వాళ్ళు అతనికి ముప్ఫై వెండి నాణేలు ఇవ్వడానికి ఒప్పుకుని ఆ నాణేలు లెక్కబెట్టి అతనికి ఇచ్చారు.
\v 16 అప్పటినుండి యూదా ఆయన్ని వాళ్ళకి పట్టిచ్చే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
\s5
\p
\v 17 వారమంతా జరిగే పొంగని రొట్టెల పండగ మొదటి రోజున శిష్యులు యేసు దగ్గరకి వచ్చి, "మనం కలిసి పస్కా పండుగ భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు?" అని అడిగారు.
\v 18 యేసు, శిష్యుల్లో ఇద్దరిని పిలిచి వాళ్ళేం చేయాలో చెప్పాడు. వారితో, "మీరు పట్టణంలోని పలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో, "సమయం దగ్గర పడుతోంది. నేను నా శిష్యులతో కలిసి మీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను. భోజనం తయారు చేయడానికి ఈ ఇద్దరినీ పంపుతున్నాను" అని మా గురువు చెబుతున్నాడు అని చెప్పండి" అన్నాడు.
\v 19 యేసు చెప్పినట్టుగా ఆ శిష్యులు చేశారు. వాళ్ళు వెళ్ళి అతని ఇంట్లో యేసు ఆజ్ఞాపించినట్టుగా పస్కా భోజనం తయారు చేశారు.
\s5
\p
\v 20 యేసు సాయంకాలం తన పన్నెండు మంది శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నాడు.
\v 21 వారందరూ కలిసి భోజనం చేస్తుండగా ఆయన, "జాగ్రత్తగా వినండి. మీలో ఉన్న ఒకడు కచ్చితంగా నన్ను శత్రువులకు అప్పగిస్తాడు" అన్నాడు.
\v 22 శిష్యులందరూ దుఃఖంలో మునిగిపోయారు. వాళ్ళలో ప్రతి ఒక్కడూ "ప్రభువా, అది నేనా?" అని అడగటం మొదలుపెట్టారు.
\s5
\v 23 అప్పుడాయన, "నాతోబాటు భోజనం పాత్రలో చేయి పెట్టి, భోజనం చేస్తున్నవాడే కచ్చితంగా నన్ను శత్రువు చేతికి అప్పగిస్తాడు.
\v 24 మనుష్యకుమారుడు చనిపోవడం ఖాయం. ఎందుకంటే లేఖనాలు కూడా నా గురించి ఆ విషయాన్ని చెబుతున్నాయి. అయితే, నన్ను శత్రువుల చేతికి అప్పగించిన మనిషికి మాత్రం ఘోరమైన శిక్ష పడుతుంది. అతనికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టకపోయి ఉంటే ఎంతో బాగుండేది" అని జవాబిచ్చాడు.
\v 25 అప్పుడు, ఆయన్ని అప్పగింపబోతున్న యూదా, ఆయనతో, "బోధకా, కచ్చితంగా నేను కాదు కదా?" అన్నాడు. యేసు అతనితో "నువ్వు చెప్పకనే చెప్తున్నావు కదా" అని అన్నాడు.
\s5
\p
\v 26 భోజనం చేస్తుండగా, యేసు ఒక రొట్టె తీసుకుని, దేవునికి స్తుతులు చెప్పి దాన్ని విరిచి ముక్కలు చేసి, తన శిష్యులకు ఇస్తూ, "ఈ రొట్టెను తీసికొని తినండి. ఇది నా శరీరం" అన్నాడు.
\s5
\v 27 తరవాత ద్రాక్షరసం పాత్రను పట్టుకుని దేవునికి స్తుతులు చెప్పి వాళ్ళకిచ్చి, "మీరందరూ ఈ పాత్రలో ఉన్నది తాగండి.
\v 28 ఈ ద్రాక్ష రసం నా రక్తం. తొందరలోనే నా శరీరం నుండి నేనే దాన్ని చిందింపబోతున్నాను. ఈ రక్తం ప్రజలందరి పాపక్షమాపణకు గుర్తుగా దేవుడు చేసిన కొత్త ఒడంబడిక.
\v 29 జాగ్రత్తగా వినండి. ఒక కొత్త అర్థంతో ఈ విధంగా మీతో కలిసి మళ్ళీ ద్రాక్షరసం తాగేంత వరకు నేను దాన్ని తాగను. ఆ విధంగా నా తండ్రి పరిపాలనలోనే జరుగుతుంది" అన్నాడు.
\s5
\p
\v 30 తరవాత వాళ్ళు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకు బయలుదేరారు.
\v 31 వెళ్ళే దారిలో యేసు వారితో ఇలా చెప్పాడు, "ఈ రాత్రి నాకు జరిగేదాన్ని బట్టి మీరంతా నన్ను వదిలి పారిపోతారు. ఇది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే, "నేను కాపరిని దెబ్బ తీస్తాను. మందలోని గొర్రెలన్నిటినీ చెదరగొడతాను" అని లేఖనాల్లో దేవుడు రాయించి ఉంచాడు కదా.
\v 32 అయితే నేను మరణం నుండి తిరిగి లేచిన తరవాత మీకంటే ముందుగా గలలియకు వెళతాను."
\s5
\p
\v 33 అప్పుడు పేతురు, "మిగిలిన శిష్యులందరూ నీకు జరిగిన దాన్ని చూసి వదిలి వెళ్ళిపోయినా నేను మాత్రం కచ్చితంగా నిన్ను వదిలి వెళ్ళనే వెళ్ళను" అన్నాడు.
\v 34 యేసు అతనితో, "నిజమేమిటంటే, ఈ రాత్రే కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదని మూడు సార్లు చెప్తావు" అన్నాడు.
\v 35 పేతురు ఆయనతో, "నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నేను మాత్రం నిన్ను ఎరుగను అని చెప్పను" అన్నాడు. మిగిలిన శిష్యులందరూ కూడా ఇదే విషయం చెప్పారు.
\s5
\p
\v 36 యేసు శిష్యులతో కలిసి గేత్సేమనే అనే చోటికి వచ్చాడు. అక్కడ వారితో, "నేనక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకు మీరిక్కడే ఉండండి" అని చెప్పి,
\v 37 పేతురు, యాకోబు, యోహానులను తనతోబాటు తీసుకెళ్ళాడు. ఆయన తీవ్రమైన దుఖంతో, కలతతో నిండిపోయాడు.
\v 38 తరవాత ఆయన వారితో, "నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తుంది. మీరిక్కడే నాతోబాటు మెలకువగా ఉండండి" అని చెప్పాడు.
\s5
\p
\v 39 ఆయన కొంత దూరం వెళ్ళి, నేలమీద సాష్టాంగపడి ముఖం నేలమీద ఆనించి, "నా తండ్రీ, వీలైతే ఇలా శ్రమ పడకుండా చేయి. కానీ నా ఇష్ట ప్రకారం కాక నీ ఇష్ట ప్రకారమే చేయి" అని ప్రార్థించాడు.
\v 40 తరవాత ఆయన శిష్యుల దగ్గరికి వచ్చి, వాళ్ళు నిద్ర పోతుండగా చూసి, "నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా? మీరు నిద్ర పోతుంటే, నాకు చాలా నిరుత్సాహంగా ఉంది.
\v 41 ఎవ్వరూ పాపం గురించి మిమ్మల్ని పరీక్షకు గురి చేయకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు నేను చెప్పేది చేయాలనుకుంటున్నారు గానీ తీరా చేయబోయేటప్పటికి మీకు శక్తి చాలడం లేదు" అని అన్నాడు.
\s5
\p
\v 42 రెండో సారి మళ్ళీ దూరంగా వెళ్ళి, "నా తండ్రీ, నేను శ్రమ పడడం తప్పని సరి అయితే, నీ ఇష్టమే జరగనివ్వు" అని ప్రార్థించాడు.
\p
\v 43 ఆయన ఆ ముగ్గురు శిష్యుల దగ్గరికి తిరిగి వచ్చి వాళ్ళు మళ్ళీ నిద్ర పోవడం చూశాడు. వాళ్ళు కళ్ళు తెరవలేకపోతున్నారు.
\v 44 కాబట్టి వాళ్ళనలా వదిలేసి ఆయన మళ్ళీ దూరంగా వెళ్ళి మూడో సారి కూడా ఇంతకు ముందు లాగానే ప్రార్థన చేశాడు.
\s5
\v 45 అప్పుడాయన తిరిగి తన శిష్యుల దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, "మీరింకా నిద్ర పోవడం చూస్తే నాకు నిరుత్సాహంగా ఉంది. చూడండి, మనుష్య కుమారుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది.
\v 46 లేవండి, ఇక వెళ్దాం. మనం వెళ్ళి వాళ్ళని కలుద్దాం. అదిగో, నన్ను పట్టించేవాడు వస్తున్నాడు."
\s5
\p
\v 47 యేసు ఇంకా మాట్లాడుతూ ఉండగానే, పన్నెండు మంది శిష్యులలో ఒకడైన యూదా యేసును శత్రువుల చేతికి అప్పగించడానికి వచ్చాడు. అతనితో బాటు కత్తులూ కర్రలూ పట్టుకుని పెద్ద గుంపు కూడా ఉంది. వారిని ముఖ్య యాజకులూ, ఇతర పెద్దలూ పంపారు.
\v 48 "నేనేవరికైతే ముద్దు పెడతానో అతణ్ణి పట్టుకోమ" ని యూదా వాళ్ళకి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు.
\s5
\p
\v 49 అతడు వెంటనే యేసు దగ్గరకు వచ్చి, "బోధకా, నీకు శుభం" అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు.
\v 50 యేసు అతనితో, "మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది తొందరగా చేయి" అన్నాడు. వెంటనే యూదాతో ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి, ఆయన్ని ఒడిసి పట్టుకున్నారు.
\s5
\p
\v 51 అకస్మాత్తుగా యేసుతో ఉన్నవాళ్ళలో ఒకడు ఒరలోనుండి కత్తి తీసి ప్రధాన యాజకుని సేవకుణ్ణి చంపాలనుకున్నాడు గానీ అతని చెవిని మాత్రమే తెగనరికాడు.
\v 52 యేసు అతనితో, "కత్తిని ఒరలో పెట్టేయ్. కత్తి వాడాలనుకున్న వారంతా కత్తితోనే నశించిపోతారు.
\v 53 ఇప్పుడు గనక నేను నా తండ్రిని వేడుకుంటే పన్నెండు వ్యూహాల సైన్యాలకంటే ఎక్కువమంది దూతల్ని పంపలేడని మీరనుకుంటున్నారా?
\v 54 నేను అలా వేడుకుంటే మెస్సీయకు ఈ విధంగా జరుగుతుందని ప్రవక్తలు రాసిన మాటలు ఎలా నెరవేరతాయ్?" అన్నాడు.
\s5
\p
\v 55 యేసు తనను ముట్టడించిన గుంపును చూసి, "మీరు నన్ను ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులు, కర్రలతో ఇప్పుడు వచ్చారే, ప్రతి రోజూ కోవెలలో కూర్చుని బోధించినప్పుడు మీరెందుకు నన్ను పట్టుకోలేక పోయారు?
\v 56 అయితే, లేఖనాల్లో ప్రవక్తలు రాసిన ప్రవచనాలు నెరవేరాల్సి ఉంది కాబట్టి ఇదంతా జరిగింది" అన్నాడు. అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు.
\s5
\p
\v 57 యేసును బంధించిన మనుషులు ఆయన్ని ప్రధాన యాజకుడు కైఫా ఇంటికి తీసుకొచ్చారు. యూదు ధర్మశాస్త్రాన్ని బోధించేవారూ, పెద్దలూ అందరూ అప్పటికే అక్కడికి చేరుకున్నారు.
\v 58 పేతురు దూరంగా ఉండి, యేసును వెంబడిస్తూ ఉన్నాడు. అతడు ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వచ్చాడు. అక్కడ సైనికులతో బాటు కూర్చొని ఏమి జరుగుతుందో అని చూస్తూ ఉన్నాడు.
\s5
\p
\v 59 ప్రధాన యాజకుడూ, మిగిలిన యూదు మహాసభ పండితులూ, పెద్దలూ యేసును చంపించాలని దొంగ సాక్ష్యం చెప్పే వ్యక్తుల కోసం వెదుకుతూ ఉన్నారు.
\v 60 చాలా మంది అబద్ద సాక్ష్యాలు చెప్పారు కానీ వాళ్ళకి ఉపయోగకరమైనది ఒక్కటీ లేదు. చివరికి ఇద్దరు మనుషులు ముందుకు వచ్చారు.
\v 61 వాళ్ళు "ఈ మనిషి, "నేను దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో తిరిగి కడతాను" అని చెప్పాడు" అన్నారు.
\s5
\p
\v 62 అప్పుడు ప్రధాన యాజకుడు నిలబడి యేసుతో, "నువ్వు జవాబు చెప్పదలచుకోలేదా? వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు నీ జవాబు ఏమిటి?" అని అడిగాడు.
\v 63 అయితే యేసు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు ప్రధాన యాజకుడు ఆయనతో, "నిజం చెప్పమని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను. మహా శక్తిమంతుడైన దేవుడు వింటున్నాడు. నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువా?" అని అడిగాడు.
\v 64 యేసు, "అవును, నువ్వే అన్నావు గదా, అయితే మీకందరికీ చెప్తున్నాను, ఒకానొక రోజు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుడైన దేవుని పక్కన కూర్చుని పరిపాలన చేయడం చూస్తారు. అంతేగాక ఆయన ఆకాశమేఘాల మీద ఆసీనుడై తిరిగిరావడం మీరు చూస్తారు" అన్నాడు.
\s5
\p
\v 65 ప్రధాన యాజకుడు కోపంతో ఊగిపోతూ తన పైవస్త్రాన్ని చింపేసుకున్నాడు. "ఇతడు దేవుడినే అవమానించాడు. తనను తాను దేవునితో సమానం చేసుకున్నాడు. ఇంకా వేరే సాక్ష్యాలతో పని లేదు. ఇతడేమి చెప్పాడో మీరే విన్నారు కదా.
\v 66 మీరేమంటారు?" అని సభవారిని అడిగాడు. వాళ్ళు, "మన చట్టాల ప్రకారం ఇతడు దోషి. చావుకు తగినవాడు" అన్నారు.
\s5
\v 67 వెంటనే కొంతమంది ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. కొందరు పిడికిలితో గుద్దారు. కొందరు చెంపల మీద కొట్టారు.
\v 68 "నువ్వు క్రీస్తువని చెప్పుకుంటున్నావు కదా, నిన్నెవరు కొట్టారు చెప్పు" అన్నారు.
\s5
\p
\v 69 పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతణ్ణి చూసి, "నువ్వు కూడా గలలియ జిల్లావాడైన యేసుతో ఉండేవాడివే కదా?" అంది.
\v 70 అక్కడ ఉన్న అందరూ వింటూ ఉండగా పేతురు, "లేదు లేదు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకేమీ తెలియదు" అన్నాడు.
\s5
\v 71 అతడు వసారాలో నుండి లేచి గేటు దగ్గరకి వెళ్ళాడు. అప్పుడు ఇంకొక పనిపిల్ల తన దగ్గర ఉన్న వాళ్ళతో, "ఈ మనిషి నజరేతు వాడైన యేసుతో ఉంటాడు" అంది.
\v 72 కానీ పేతురు మళ్ళీ దాన్ని అంగీకరించలేదు. "నేను అబద్ధం చెప్తే గనక దేవుడు నన్ను శిక్షిస్తాడు. నేను చెప్తున్నాను, ఆ మనిషి ఎవరో కూడా నాకు తెలీదు" అన్నాడు.
\s5
\p
\v 73 కొంతసేపైన తరవాత అక్కడ నిలబడిన కొంతమంది పేతురు దగ్గరికి వచ్చి, అతనితో, "నువ్వు కచ్చితంగా ఆ మనిషితో ఉన్నవాడివే. నువ్వు గలలియ వాడివని నీ యాసను బట్టి మాకర్ధమై పోతుంది" అన్నారు.
\v 74 ఇక దాంతో పేతురు ఒట్లు, శాపనార్థాలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు, "నేను నిజమే చెబుతున్నాననే దానికి పరలోక దేవుడే సాక్షి. ఆ మనిషి నాకు తెలియనే తెలియదు" అన్నాడు. వెంటనే కోడి కూసింది.
\v 75 అప్పుడు పేతురు, "కోడి కూయక ముందే నువ్వు మూడుసార్లు నేను ఎవరో తెలియదని చెబుతావు" అన్న యేసు మాటలు గుర్తు తెచ్చుకొని, వసారా బయటికి వెళ్ళి తాను చేసిన దానికి ఎంతో దుఖంతో పెద్దగా వెక్కి వెక్కి ఏడ్చాడు.
\s5
\c 27
\p
\v 1 ఉదయాన్నే ముఖ్య యాజకులందరూ, మహా సభ పెద్దలందరూ కలిసి యేసును చంపడానికి రోమన్లకు ఎలా నచ్చజెప్పాలా అని ఆలోచించారు.
\v 2 వాళ్ళు ఆయన చేతులు కట్టేసి రోమా గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి తీసుకెళ్ళారు.
\s5
\p
\v 3 అప్పుడు యేసుని పట్టించిన యూదా, వాళ్ళు యేసును చంపడానికే తీర్మానించారని గ్రహించాడు. కాబట్టి తాను చేసిన దానికి మనస్తాపం చెందాడు. తనకు వాళ్ళు ఇచ్చిన ముప్ఫై నాణాలు పట్టుకుని ముఖ్య యాజకుల దగ్గరికీ, పెద్దల దగ్గరికీ వెళ్ళాడు.
\v 4 "నేను పాపం చేశాను, నిర్దోషి అయిన మనిషిని మీకు అప్పగించాను" అని వాళ్ళతో అన్నాడు. వాళ్ళు, "అయితే మాకేంటి? అది నీ సమస్య. నువ్వే చూసుకో" అన్నారు.
\v 5 అప్పుడు యూదా ఆ డబ్బులు తీసుకొని ఆ దేవాలయ వసారాలో విసిరేశాడు. తరవాత వెళ్ళి ఉరివేసుకొని చనిపోయాడు.
\s5
\p
\v 6 ప్రధాన యాజకులు ఆ నాణేలు తీసుకొని, "ఇది ఒక మనిషిని చంపడానికి ఇచ్చిన డబ్బు. వీటిని కానుకల పెట్టెలో వేయడం ధర్మశాస్త్రానికి విరుద్ధం" అని చెప్పుకున్నారు.
\v 7 కాబట్టి ఆలోచించి ఆ డబ్బుతో ఒక పొలం కొన్నారు. దాన్ని కుమ్మరి వాడి పొలం అని పిలుస్తారు. పరాయి దేశస్తులు ఎవరైనా, యెరూషలేములో చనిపోతే వాళ్ళని పాతిపెట్టడానికి ఆ పొలాన్ని కేటాయించారు.
\v 8 అందుకే ఇప్పటికీ ఆ స్థలాన్ని "రక్తభూమి" అని పిలుస్తారు.
\s5
\v 9 చాలా కాలం క్రితమే యిర్మీయా ప్రవక్త రాసిన ఈ మాటలు నెరవేర్పుకు వచ్చేలా వాళ్ళు ఆ కుమ్మరివాడి పొలం కొన్నారు,
\v 10 "ఇశ్రాయేలు నాయకులందరూ కలిసి ఆయనకు కట్టిన వెల ముప్ఫై వెండి నాణేలు. ప్రభువు నాకు ఆజ్ఞాపించినట్టుగానే వాళ్ళు వాటితో ఒక కుమ్మరి వాడి పొలాన్ని కొన్నారు."
\s5
\p
\v 11 యేసు గవర్నర్ ఎదుట నిలబడ్డాడు. "నువ్వు యూదుల రాజువి అని చెప్పుకున్నావా?" అని గవర్నర్ ఆయన్ని అడిగాడు. "అవును, నువ్వు అన్నట్టే" అని యేసు అతనికి జవాబిచ్చాడు.
\p
\v 12 అయితే ముఖ్య యాజకులు, పెద్దలు ఆయన మీద రక రకాలైన అబద్ధపు ఆరోపణలు చేస్తున్నప్పుడు మాత్రం ఆయన ఏమీ తిరిగి జవాబు చెప్పలేదు.
\v 13 పిలాతు ఆయనతో, "వాళ్ళు నీమీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో వింటున్నావా? నువ్వేమీ మాట్లాడవా?" అన్నాడు.
\v 14 అయితే యేసు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోయాడు. తన మీద వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా తిరిగి జవాబివ్వలేదు. దీనికి గవర్నర్ చాలా ఆశ్చర్యపోయాడు.
\s5
\p
\v 15 ప్రతి సంవత్సరం, పస్కా పండగ జరిగే సమయంలో జైలులో ఉన్న ఒక ఖైదీని గవర్నర్ విడుదల చేయడం ఒక ఆనవాయితీ. ప్రజలు ఏ ఖైదీని కోరుకుంటే అతణ్ణి గవర్నర్ విడుదల చేస్తాడు.
\v 16 ఆ సమయంలో యెరూషలేము జైల్లో బరబ్బ అనే పేరు మోసిన ఖైదీ ఉన్నాడు.
\s5
\v 17 జనమంతా గుమికూడి ఉండగా పిలాతు వాళ్ళని, "మీరు ఏ ఖైదీని విడుదల చేయాలనుకుంటున్నారు? మెస్సీయ అని పిలిచే యేసునా?" అని అడిగాడు.
\v 18 అతడు ఈ ప్రశ్న ఎందుకు అడిగాడంటే, ఆ ముఖ్య యాజకులు కేవలం యేసు మీద అసూయ చేతనే ఆయన్ని తన దగ్గరకు తీసుకొచ్చారని అతడు గ్రహించాడు. కాబట్టి ప్రజలంతా యేసుని విడిపించమంటారని అతడు అనుకున్నాడు.
\p
\v 19 పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, "ఈ మనిషి గురించి ఉదయాన్నే నాకొక కల వచ్చింది. నువ్వు ఆ నిర్దోషికి శిక్ష వేయొద్దు. ఆయన జోలికి పోవద్దు" అని కబురు పంపింది.
\s5
\v 20 కానీ ముఖ్య యాజకులు, పెద్దలు బరబ్బని విడుదల చేయమనీ, యేసుకు మరణ శిక్ష అమలు చేయమనీ పిలాతును అడగమని జనాలపై వత్తిడి తెచ్చారు.
\v 21 ఆ విధంగా గవర్నర్ర్ వాళ్ళని "ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయాలి?" అని అడిగితే వాళ్ళు, "బరబ్బ" అని కేకలు వేశారు.
\v 22 "అలా అయితే యేసును ఏంచేయాలి? మరి మీలో కొంతమంది ఆయన్ని మెస్సీయ అన్నారు కదా?" అని పిలాతు వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు, "సిలువ వెయ్యమని నీ సైనికులకు ఆజ్ఞాపించు" అన్నారు.
\s5
\p
\v 23 అప్పుడు పిలాతు, "ఎందుకు? అతడు ఏ నేరం చేశాడు?" అని వాళ్ళని అడిగాడు. అయితే వాళ్లింకా గట్టిగా కేకలు వేస్తూ, "సిలువ వేయండి" అని అరిచారు.
\p
\v 24 ఇంకా దానికి బదులుగా ఏం చేయాలన్నా అల్లరి ఎక్కువవుతుందే గానీ తన ప్రయత్నాలేవీ సాగవని అనుకుని పిలాతు జనమంతా చూస్తుండగా, ఒక పళ్ళెం తీసుకొని అందులో తన చేతులు కడిగేసుకుని, "ఇలా చేతులు కడుక్కోవడం ద్వారా ఈ మనిషి మరణం విషయంలో నా తప్పేమీ లేదు, అదంతా మీ తప్పే అని చూపించడానికి ఇలా చేశాను" అన్నాడు.
\s5
\p
\v 25 అప్పుడు అక్కడి ప్రజలంతా, "అతని చావు వలన కలిగే అపరాధం మామీదా, మా పిల్లల మీదా కుడా ఉంటుంది గాక!" అని జవాబిచ్చారు.
\v 26 అప్పుడు అతడు వాళ్ళకి బరబ్బని విడుదల చేయమని సైనికులకి ఆజ్ఞాపించాడు. అయితే యేసును మాత్రం కొరడాలతో కొట్టమని సైనికులకు చెప్పాడు. ఆ తరవాత యేసుని సిలువ వేయడం కోసం సైనికులకు అప్పగించాడు.
\s5
\p
\v 27 అప్పుడు గవర్నర్ కింద ఉన్న సైనికులు యేసుని సైనికుల శిబిరాల్లోకి తీసుకు వెళ్ళారు. ఆ పటాలమంతా ఆయన చుట్టూ పోగయ్యారు.
\v 28 వాళ్ళు ఆయన బట్టలు లాగివేశారు. ఆయన ఒక రాజు అన్నట్టుగా ఒక మెరిసే ఎర్రని అంగీని ఆయనకు కప్పారు.
\v 29 ముళ్ళతో ఉన్న ఒక చెట్టు తీగలను కోసి వాటిని ఒక కిరీటంలాగా అల్లి ఆయన తల మీద ఉంచారు. ఆయన కుడి చేతిలో ఒక రాజు దండం పట్టుకున్నట్టుగా ఒక గడ్డి రెల్లును ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, "యూదుల రాజుకు శుభం" అంటూ ఆయన్ని ఎగతాళి చేశారు.
\s5
\p
\v 30 వాళ్ళు ఆయన మీద ఉమ్ముతూనే ఉన్నారు. ఆయన చేతికర్రని తీసుకొని దానితో ఆయన తలమీద కొడుతూ ఉన్నారు.
\v 31 అలాగ ఆయన్ని హేళన చేసిన తరవాత ఆయన అంగీని తీసేసి, ఆయన వస్త్రాలు ఆయనకి తొడిగించారు. అక్కడినుండి ఆయన్ని సిలువ వేసే స్థలానికి నడిపించుకుంటూ వెళ్ళారు.
\s5
\p
\v 32 యేసు తన సిలువని కొంత దూరం మోసుకెళ్ళిన తరవాత ఆ సైనికులు కురేనే అనే పట్టణానికి చెందిన సీమోను అనే వ్యక్తిని చూశారు. యేసు సిలువను అతని చేత బలవంతంగా మోయించారు.
\v 33 వాళ్ళు గొల్గొతా అనే స్థలానికి వచ్చారు. ఆ పేరుకి అర్థం, "కపాలం లాంటి స్థలం."
\v 34 అక్కడికి చేరిన తరవాత ద్రాక్షరసంలో చేదు ద్రవాన్ని కలిపారు. వాళ్ళు ఆయన్ని మేకులతో సిలువకి కొట్టేటప్పుడు అంతగా బాధ కలగకుండా ఉండేందుకు దాన్ని యేసుకు తాగించారు. అయితే ఆయన దాన్ని రుచి చూసి దాన్ని తాగడానికి నిరాకరించాడు. కొంతమంది సైనికులు ఆయన బట్టలు లాగేసుకున్నారు.
\s5
\p
\v 35 అప్పుడు వాళ్ళు ఆయన్ని సిలువకు మేకులతో కొట్టారు. తరవాత చీట్లు వేసి ఆయన బట్టల్లో ఏది ఎవరికీ వస్తుందో చూసి పంచుకున్నారు.
\v 36 ఎవరైనా ఆయన్ని కాపాడటానికి వస్తారేమో అని ఆ సైనికులు సిలువకు కాపలాగా కూర్చున్నారు.
\v 37 యేసుని ఎందుకు సిలువకు మేకులతో కొట్టామో చెప్పడానికి ఒక చెక్క ముక్కను యేసు తలపైగా సిలువకు తగిలించారు. దానిపైన, "ఈయన యూదులకు రాజైన యేసు" అని రాసి ఉంది.
\s5
\p
\v 38 అదే సమయంలో వాళ్ళు ఇద్దరు బందిపోట్లను కూడా సిలువ వేశారు. ఒక సిలువని యేసుకు కుడివైపునా, మరొకటి ఎడమ వైపునా నిలబెట్టారు.
\v 39 ఆ పక్కగా వెళ్తున్న ప్రజలు ఆయన్ని చూసి ఆయనేదో ఒక దుర్మార్గుడైనట్టుగా తమ తలలు ఊపుతూ ఎగతాళి చేస్తున్నారు.
\v 40 వాళ్ళు ఆయనతో, "మన దేవాలయాన్ని కూలదోసి మళ్ళీ మూడు రోజుల్లోనే దాన్ని కడతానని చెప్పావు. ఆ విధంగా చేసేవాడివైతే నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు కదా! నువ్వు దేవుని కుమారుడివైతే సిలువ మీదనుండి దిగి రా!" అన్నారు.
\s5
\p
\v 41 అదే విధంగా ముఖ్య యాజకులూ, యూదా ధర్మశాస్త్రాన్ని బోధించే వారూ, పెద్దలు కూడా ఆయన్ని ఎగతాళి చేశారు.
\v 42 "ఈయన రోగుల్ని స్వస్థ పరిచాడు గానీ తనకు తాను సహాయం చేసుకోలేడు. తను ఇశ్రాయేలుకు రాజునని చెప్పుకున్నాడు కాబట్టి సిలువ మీద నుండి దిగి రావాలి. అప్పుడు మేము ఆయన్ని నమ్ముతాం."
\s5
\p
\v 43 "తాను దేవునిలో విశ్వాసముంచాననీ, తాను మానవునిగా ఉన్న దేవుడిననీ అన్నాడు. ఒకవేళ దేవుడికి అతనంటే ఇష్టమైతే ఇప్పుడే దేవుడు అతణ్ణి విడిపించాలి!" ఇలాంటి రక రకాల మాటలతో వాళ్ళు ఆయన్ని హేళన చేశారు.
\v 44 అలాంటి మాటలే పలుకుతూ ఆయనకు అటూ ఇటూ సిలువలపై ఉన్న బందిపోట్లు కూడా ఆయన్ని ఎగతాళి చేశారు.
\s5
\p
\v 45 మధ్యాహ్నం అయినప్పుడు ఆ దేశం అంతా చీకటి కమ్మేసింది. మధ్యాహ్నం మూడు గంటల వరకూ అలా చీకటిగానే ఉండిపోయింది.
\v 46 సుమారు మూడు గంటల సమయంలో యేసు, "ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?" అని పెద్దగా అరిచాడు. దాని అర్థం, "నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచిపెట్టావు?" అని.
\v 47 ఆ పక్కన నిలబడి ఉన్న కొందరు "ఏలీ" అనే మాట విని, ఆయన ఏలీయా ప్రవక్తని పిలుస్తున్నాడేమో అనుకున్నారు.
\s5
\p
\v 48 వెంటనే వాళ్ళలో ఒకడు పరిగెత్తి ఒక స్పాంజిముక్క తీసుకొచ్చాడు. దాన్ని చేదు ద్రాక్షరసంలో ముంచి, దాన్ని ఒక గడ్డి పుల్ల చివర తగిలించి యేసు దానిలోని ద్రాక్షరసాన్ని పీల్చుకుంటాడేమో అని దాన్ని ఆయన ముఖం దగ్గరకు ఎత్తి పట్టుకున్నాడు.
\v 49 అక్కడ ఉన్న ఇంకొందరు, "ఆగాగు, ఏలీయా వచ్చి ఆయన్ని కాపాడతాడేమో చూద్దాం" అన్నారు.
\v 50 అప్పుడు యేసు మళ్ళీ ఇంకొకసారి పెద్దగా కేక వేసి తన ఆత్మని దేవునికి అప్పగించి చనిపోయాడు.
\s5
\p
\v 51 అదే క్షణంలో దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉండే బరువైన, మందమైన తెర పైనుండి కిందికి రెండుగా చిరిగిపోయింది. భూమి కంపించింది, కొన్ని చోట్ల పెద్ద రాతి బండలు చీలిపోయాయి.
\v 52 సమాధులు తెరుచుకున్నాయి. దేవునిపై భయభక్తులతో జీవించి చనిపోయిన చాలా మంది శరీరాలు తిరిగి జీవం పొందాయి.
\v 53 వాళ్ళు సమాధుల నుండి బయటికి వచ్చారు. యేసు తిరిగి లేచిన తరవాత వాళ్ళు యెరూషలేములోకి వెళ్ళి చాలామందికి కనిపించారు.
\s5
\p
\v 54 యేసుని సిలువకు మేకులతో కొట్టిన సైనికులను పర్యవేక్షించే అధికారి అక్కడే నిలబడి చూస్తున్నాడు. ఆ సిలువలకు కాపలాగా ఉన్న సైనికులు కూడా అక్కడే ఉన్నారు. భూకంపం రావడం, ఇంకా అక్కడ జరిగిన ఇతర విషయాలను చూసినప్పుడు వాళ్ళు భయంతో వణికిపోయారు. "ఈయన నిజంగా దేవుని కుమారుడు" అని వాళ్ళు పెద్దగా చెప్పుకున్నారు.
\p
\v 55 అక్కడ చాలామంది స్త్రీలు కూడా దూరంనుండి చూస్తున్నారు. యేసుకు అవసరమైన వస్తువులను ఏర్పాటు చేయడానికి వారంతా గలిలయనుండి ఆయనతో కలిసి వచ్చారు.
\v 56 వారిలో మగ్దలకు చెందిన మరియ, యాకోబు, యోసేపుల తల్లి అయిన ఇంకొక మరియ, యాకోబు, యోహానుల తల్లి ఉన్నారు.
\s5
\p
\v 57 సాయంకాలం అయినప్పుడు యోసేపు అనే ఒక ధనవంతుడు అక్కడికి వచ్చాడు. అతడు అరిమతయియ అనే ఊరువాడు. అతడు కూడా యేసు శిష్యుడే.
\v 58 అతడు పిలాతు దగ్గరకి వెళ్ళి యేసు శరీరాన్ని తీసుకువెళ్ళి సమాధి చేయడానికి అనుమతి అడిగాడు. అతణ్ణి ఆ శరీరాన్ని తీసుకుపోనిమ్మని పిలాతు సైనికులకు ఆజ్ఞాపించాడు.
\s5
\p
\v 59 కాబట్టి యోసేపు, ఇతరులు కలిసి ఆ శరీరాన్ని శుభ్రమైన తెల్లని గుడ్డతో చుట్టారు.
\v 60 దాన్ని యోసేపు ఒక కొండ రాతిలో తన పనివారి చేత స్వంతగా తొలిపించుకున్న కొత్త సమాధిలో ఉంచారు. ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద గుండ్రని చదునైన రాయిని దొర్లించి వెళ్ళిపోయారు.
\v 61 మగ్దలేనే మరియ, ఇంకో మరియ, ఆ సమాధికి అవతల కూర్చొని గమనిస్తూ ఉన్నారు.
\s5
\p
\v 62 తరువాతి రోజు యూదులకు విశ్రాంతి రోజైన శనివారం. ముఖ్యయాజకులు, కొంతమంది పరిసయ్యులు పిలాతు దగ్గరకి వెళ్ళారు.
\v 63 వాళ్ళు అతనితో, "ఈ మోసగాడు బతికి ఉన్న సమయంలో "నేను చనిపోయిన మూడు రోజులకి మళ్ళీ సజీవంగా తిరిగి లేస్తాను" అని చెప్పినట్టు మాకు జ్ఞాపకం.
\v 64 కాబట్టి ఆ సమాధిని మూడు రోజుల పాటు కాపలా కాయమని మీ సైనికులకు ఆజ్ఞాపించండి. మీరు అలా చేయకపోతే అతని శిష్యులు వచ్చి అతని శరీరాన్ని దొంగిలించవచ్చు. అప్పుడు వాళ్ళు ఆయన చనిపోయినా తిరిగి బతికి లేచాడని ప్రజల్లో ప్రచారం చేస్తారు. అలా చెప్పి వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తే అది అంతకు ముందు అతడు చేసిన దానికంటే ఎక్కువ మోసం అవుతుంది" అన్నారు.
\s5
\p
\v 65 అప్పుడు పిలాతు వాళ్ళతో, "మీరు కొంతమంది సైనికుల్ని తీసుకు వెళ్ళొచ్చు. సమాధి దగ్గరకు వెళ్ళి మీకు చేతనయినంత వరకు దానికి కావలి ఏర్పాటు చేసుకోండి" అన్నాడు.
\v 66 కాబట్టి వాళ్ళు వెళ్ళి ఆ సమాధి మీద ఉంచిన రాతిని అటూ ఇటూ కొండకు తాళ్ళతో కట్టి దానిపై ముద్ర వేశారు. ఆ సమాధికి కొంతమంది సైనికుల్ని కూడా కాపలా పెట్టారు.
\s5
\c 28
\p
\v 1 విశ్రాంతి దినం అయిపోగానే ఆదివారం ఉదయాన్నే మగ్దల గ్రామానికి చెందిన మరియ, ఇంకొక మరియ కలిసి యేసు సమాధి దగ్గరకి వెళ్ళారు.
\v 2 ఒక బలమైన దేవదూత పరలోకం నుండి దిగిరావడం వలన అక్కడ పెద్ద భూకంపం కలిగింది. అతడు వచ్చి ఆ సమాధి ముఖద్వారానికి అడ్డుగా నిలిపిన ఆ రాతిని దొర్లించి వేసి, ఆ రాతి మీద ఎక్కి కూర్చున్నాడు.
\s5
\v 3 అతని రూపం మెరుపులాగా వెలిగిపోతున్నది. అతని వస్త్రాలు మంచులాగా తెల్లగా ఉన్నాయి.
\p
\v 4 అక్కడ కావలి ఉన్న భటులు భయంతో వణికిపోయారు. చివరికి వాళ్ళు చచ్చిపోయిన వారిలాగా కింద పడిపోయారు.
\s5
\p
\v 5 ఆ దూత ఆ స్త్రీలతో ఇలా చెప్పాడు, "భయపడాల్సిన పని లేదు! సిలువకు మేకులతో కొట్టిన యేసు కోసం మీరు వెదకుతున్నారని నాకు తెలుసు.
\v 6 ఆయన ఇక్కడ లేడు! యేసు మీతో ఏమని చెప్పాడో అలాగే దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు. రండి, వచ్చి ఆయన శరీరం ఉంచిన స్థలం చూడండి!
\v 7 తరవాత వెంటనే వెళ్ళి "ఆయన మరణం నుండి తిరిగి లేచాడు! మీకంటే ముందుగా గలలియకు వెళ్తాడు, అక్కడ మీరు ఆయన్ని చూడొచ్చు" అని ఆయన శిష్యులతో చెప్పండి. నేను మీతో చెప్పిన విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి!"
\s5
\p
\v 8 వెంటనే ఆ స్త్రీలు సమాధిని వదిలి వెళ్ళిపోయారు. వాళ్లకి చాలా భయం వేసింది గానీ అదే సమయంలో చాలా సంతోషంతో నిండిపోయారు. ఏమి జరిగిందో శిష్యులతో చెప్పడానికి పరుగెత్తి వెళ్ళారు.
\v 9 వాళ్ళు పరుగెత్తుతూ ఉండగా ఒక్కసారిగా వాళ్ళకి యేసు ప్రత్యక్షం అయ్యాడు. "మీకు శుభం కలుగుతుంది!" అని ఆయన వారితో అన్నాడు. ఆ స్త్రీలు ఆయన దగ్గరగా వచ్చి ఆయన పాదాలకు మొక్కారు.
\v 10 అప్పుడు యేసు వారితో, "భయపడవద్దు! వెళ్ళి, నా శిష్యులందరూ గలలియకు వెళ్లాలని వారితో చెప్పండి. వాళ్ళు నన్నక్కడ చూస్తారు."
\s5
\p
\v 11 ఆ స్త్రీలు వెళ్తూ ఉండగా, ఆ సమాధిని కాపలా కాస్తున్న కొందరు సైనికులు నగరంలోకి వెళ్ళారు. అక్కడ ఏమేమి జరిగిందో అదంతా ప్రధాన యాజకులకి వివరించారు.
\v 12 ఆ వెంటనే ప్రధాన యాజకులూ, యూదా మత పెద్దలూ కలిసి సమావేశమయ్యారు. ఆ సమాధి ఎందుకు ఖాళీగా ఉన్నదో వివరించడానికి ఒక ప్రణాళిక వేశారు. వాళ్ళు ఆ సైనికులకి లంచంగా చాలా సొమ్ము ముట్టజెప్పారు.
\v 13 వారితో, "మేము నిద్ర పోతుండగా యేసు శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని దొంగతనంగా ఎత్తుకెళ్ళారు"అని చెప్పండి."
\s5
\p
\v 14 "ఈ సంగతి గవర్నర్ గారికి తెలిస్తే ఆయన మీ మీద కోపం తెచ్చుకోకుండా మేము చూసుకుంటాం. కాబట్టి మీరేమీ కంగారు పడవద్దు" అని చెప్పారు.
\v 15 కాబట్టి ఆ సైనికులు ఆ డబ్బు తీసుకొని వాళ్ళు తమకి చెప్పినట్టుగానే చేశారు. ఈనాటి వరకూ ఆ కథ యూదుల మధ్య ప్రచారంలో ఉంది.
\s5
\p
\v 16 ఆ తరవాత పదకొండు మంది శిష్యులు గలలియ జిల్లాకి వెళ్ళారు. యేసు తమకి వెళ్ళమని చెప్పిన ఆ కొండ దగ్గరికి వెళ్ళారు.
\v 17 వాళ్ళు ఆయన్ని అక్కడ చూసి ఆయన్ని ఆరాధించారు. అయితే వారిలో కొంతమంది మాత్రం యేసు నిజంగా బ్రతికాడా అని సందేహించారు.
\s5
\p
\v 18 అప్పుడు యేసు వారికి దగ్గరగా వచ్చి, "పరలోకంలో, భూలోకంలో అంతటి మీదా, సర్వ మానవుల మీదా నా తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చాడు.
\v 19 కాబట్టి మీరు వెళ్ళి నా అధికారాన్ని ఉపయోగించి సమస్త జాతుల ప్రజలకూ నా సందేశం వినిపించి వారిని కూడా నా శిష్యులుగా చేయండి. తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మల అధికారం కింద వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి.
\s5
\v 20 నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించానో దానినంతటినీ వాళ్ళకి బోధించండి. నేను ఈ యుగాంతం వరకూ మీతో ఎల్లప్పుడూ ఉంటానని జ్ఞాపకం ఉంచుకోండి."

1222
42-MRK.usfm Normal file
View File

@ -0,0 +1,1222 @@
\id MRK - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h మార్కు సువార్
\toc1 మార్కు సువార్
\toc2 మార్కు సువార్
\toc3 mrk
\mt1 మార్కు సువార్
\s5
\c 1
\p
\v 1 దేవుని కుమారుడు, యేసు క్రీస్తు గురించిన సువార్త ఇది. యెషయా ప్రవక్త రాసిన గ్రంథంలో ఈ సువార్తను గురించి ఇలా ఉంది. "ఇదిగో, నా వార్తాహరుణ్ణి నీకు ముందుగా పంపుతున్నాను.
\v 2 ప్రజలు సంతోషంగా నిన్ను ఆహ్వానించేలా అతడు వాళ్ళను సిద్ధం చేస్తాడు.
\v 3 అతడు అడవిలో కేక పెడుతూ వింటున్న వారితో ఇలా అంటున్నాడు. ప్రభువుని స్వాగతించడానికి తయారుగా ఉండండి."
\s5
\v 4 యెషయా గ్రంథం లో రాసి ఉన్న ఆ వార్తాహరుడు యోహానే. ప్రజలు అతణ్ణి "బాప్తీసం ఇచ్చేవాడు" అని పిలిచారు. అతడు అడవిలో ఉండే వాడు. ప్రజలతో, "చేసిన పాపాలకి పశ్చాత్తాప పడండి. ఇక మీదట పాపం చేయకూడదు అని నిర్ణయించుకోండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించొచ్చు. ఆ తరువాత నేను మీకు బాప్తీసం ఇస్తాను." అని చెప్తూ ఉండేవాడు.
\p
\v 5 యూదయ ప్రాంతం లో, యెరూషలేము పట్టణ ప్రాంతాల్లో చాలా మంది ఈ యోహాను చెప్తున్నది వినడానికి అడవిలోకి వెళ్లారు. వారిలో చాలా మంది ఆయన మాటలు విన్న తరువాత "మేము పాపం చేసాము" అని ఒప్పుకున్నారు. తరువాత యోహాను యోర్దాను నదిలో వారికి బాప్తిసం ఇచ్చాడు.
\p
\v 6 యోహాను ఒంటె వెంట్రుకలతో చేసిన బట్టలు కట్టుకుని, నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అడవిలో దొరికే తేనె, మిడతలు అతని ఆహారం
\s5
\v 7 అతడు "అతి త్వరలో చాలా గొప్ప వాడు రాబోతున్నాడు. ఆయనతో పోలిస్తే నేను సూర్యుని ముందు దివిటీనే. వంగి ఆయన చెప్పులు విప్పడానికి కూడా తగను.
\v 8 నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చాను గాని ఆయన మీకు దేవుని పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు" అన్నాడు.
\s5
\p
\v 9 యోహాను బోధిస్తున్న సమయంలోనే, గలిలయకు చెందిన నజరేతు ఊరి నుండి, యోహాను బోధిస్తున్న చోటుకి యేసు రాగా యోహాను ఆయనకి బాప్తిసం ఇచ్చాడు.
\v 10 యేసు నీళ్లలో నుండి ఒడ్డుకు రాగానే ఆకాశం చీలి, దేవుని ఆత్మ పావురం లాగా తన మీదికి దిగి రావడం చూశాడు.
\v 11 అప్పుడు దేవుడు ఆకాశం నుండి "నువ్వు నా ప్రియ కుమారుడివి, నీ విషయం నాకెంతో ఆనందం" అని పలికాడు.
\s5
\p
\v 12 వెంటనే దేవుని ఆత్మ యేసును అరణ్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు.
\v 13 ఆయన అక్కడ నలభై రోజులున్నాడు. ఆ సమయంలో సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అక్కడ అడవి మృగాల మధ్య జీవించాడు. అప్పుడు దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు.
\s5
\p
\v 14 యోహానును చెరసాలలో వేసిన తరవాత యేసు గలిలయ ప్రాంతానికి వచ్చి దేవుని రాజ్య సువార్త బోధించసాగాడు.
\v 15 "కాలం దగ్గర పడింది. త్వరలోనే దేవుడు రాజుగా కనబడబోతున్నాడు. "అయ్యో, పాపం చేసాను, ఇకమీదట చెయ్యను." అని పశ్చాత్తాపపడితే దేవుడు క్షమిస్తాడు. ఈ సువార్తను నమ్మండి" అని ప్రకటిస్తూ వచ్చాడు.
\s5
\p
\v 16 ఒక రోజు ఆయన గలిలయ సరస్సు ఒడ్డున నడుస్తూ ఉండగా సీమోను, అతని సోదరుడు అంద్రెయ సరస్సులో వల వేయడం చూశాడు. వాళ్ళు చేపలు పట్టుకుని, వాటిని అమ్ముకుంటూ జీవించే జాలరులు.
\v 17 యేసు వారితో, "నాతో రండి, ఇప్పుడు మీరు చేపలు పడుతున్నట్టే మనుషుల్ని పట్టడం ఎలాగో మీకు నేర్పిస్తాను" అన్నాడు.
\v 18 వారు వెంటనే వలలను వదిలిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
\s5
\p
\v 19 ఆయన వారితో ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కొడుకులు యాకోబును, అతని సోదరుడు యోహానునూ చూశాడు. వాళ్ళు తమ పడవల్లో కూర్చుని వలలు బాగు చేసుకుంటున్నారు.
\v 20 యేసు వారిని చూసిన వెంటనే తన వెంట రమ్మని పిలిచాడు. వారు తమ తండ్రి జెబెదయిని పడవలో పనివారి దగ్గర విడిచిపెట్టి యేసు వెంట వచ్చారు.
\s5
\p
\v 21 తరువాత ఆయన తన శిష్యులతో కలిసి దగ్గరలో ఉన్న కపెర్నహూము అనే ఊరికి వెళ్ళాడు. ఆ తరువాత వచ్చిన విశ్రాంతి రోజున ఆయన యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ చేరిన వారికి బోధించడం మొదలుపెట్టాడు.
\v 22 అది చూసిన వాళ్ళంతా ఆయన ఉపదేశానికి ఆశ్చర్యపడ్డారు. స్వతహాగా తనకే ఉన్న స్వంత విషయ పరిజ్ఞానంతో ఆయన బోధించాడు. యూదుల ధర్మశాస్త్రం బోధించే వారిలాగా ఇతరులు చెప్పినదే తాము చిలకపలుకుల్లాగా చెప్పే గురువుల్లాగా బోధించలేదు.
\s5
\p
\v 23 ఆ సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు పెద్దగా కేకలు పెడబొబ్బలు పెట్టడం మొదలు పెట్టాడు.
\v 24 వాడు, "యేసూ, నజరేతు వాడా, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చెయ్యడానికి వచ్చావా? నీవెవరివో నాకు తెలుసులే. నువ్వు దేవుని పవిత్రుడివి" అని కేకలు వేశాడు.
\v 25 యేసు దురాత్మను గద్దిస్తూ, "నోరు మూసుకో, ఇతన్ని వదిలి వెళ్ళు” అన్నాడు.
\v 26 ఆ దయ్యం అతన్ని గిజగిజలాడించి పెద్దగా కేకలు పెట్టించి, అతనిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది.
\s5
\v 27 అక్కడున్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు. "ఇదేమిటి? అధికారంతో కూడిన ఈ కొత్త ఉపదేశం అద్భుతంగా ఉందే! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి" అని ముక్కున వేలేసుకున్నారు.
\v 28 ఆయన్ని గురించిన సమాచారం గలిలయ ప్రాంతమంతా త్వరగా వ్యాపించింది.
\s5
\p
\v 29 సమాజ మందిరం నుండి బయటకు వచ్చిన వెంటనే యేసు, ఆయనతో ఉన్న వారు సీమోను, అంద్రెయల ఇంటికి వచ్చారు. యాకోబు, యోహాను కూడా వారితో ఉన్నారు.
\v 30 సీమోను అత్త జ్వరంతో మంచం పట్టి ఉంది. వెంటనే అక్కడున్న వాళ్ళు యేసుకు ఆ విషయం చెప్పారు.
\v 31 ఆయన ఆమె దగ్గరికి వచ్చి, ఆమె చెయ్యి పట్టుకుని లేవనెత్తిన వెంటనే జ్వరం తగ్గిపోవడమే కాకుండా, ఆమె లేచి అందరికీ ఆహారం వడ్డించడం వంటి పనులు చేయసాగింది.
\s5
\p
\v 32 సాయంకాలం సూర్యాస్తమయానికల్లా ప్రజలు రోగులనూ, దయ్యాలు పట్టిన వారినీ, అలాంటి చాలా మందిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు.
\v 33 నేల ఈనినట్టుగా ఆ పట్టణంలోని వారంతా సీమోను ఇంటికి వచ్చేశారు.
\v 34 రకరకాల రోగాలతో ఉన్న వారిని యేసు బాగు చేశాడు. ఎన్నో దయ్యాలను వెళ్ళగొట్టాడు. తాను దేవుడి దగ్గరనుండి వచ్చిన పరిశుద్ధుడినని ఆ దయ్యాలకు తెలుసు గనుక ఆయన వాటిని మాట్లాడనివ్వలేదు.
\s5
\p
\v 35 మరుసటి రోజు ఇంకా తెల్లవారక ముందే యేసు లేచి ఆ పట్టణం బయట ఏకాంత ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థనలో గడిపాడు.
\v 36 సీమోను, అతని ఉన్న వారు యేసు కోసం వెతికారు.
\v 37 ఆయన కనబడినప్పుడు, "అందరూ నీ కోసం చూస్తున్నారు" అని ఆయనతో అన్నారు.
\s5
\v 38 ఆయన వారితో, "చుట్టుపక్కల గ్రామాలకు వెళ్దాం పదండి. అక్కడ కూడా నేను ప్రకటించాలి. నేను ఈ లోకానికి వచ్చింది అందుకే" అన్నాడు.
\v 39 ఆయన గలిలయ ప్రాంతమంతటా తిరుగుతూ, యూదుల సమాజ మందిరాల్లో బోధిస్తూ, ప్రజలను పట్టి పీడిస్తున్న దయ్యాలను వెళ్ళగొడుతూ ఉన్నాడు.
\s5
\p
\v 40 ఒకరోజు ఒక కుష్టురోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరిల్లి, "దయతో నన్ను స్వస్థ పరుచు. నీకిష్టమైతే నన్ను బాగు చేయగలవు" అని ఆయనను బతిమాలాడు.
\v 41 యేసు అతనిపై జాలిపడి, చెయ్యి చాపి అతన్ని తాకి "నిన్ను బాగు చేయడం నాకిష్టమే, స్వస్థత పొందు” అన్నాడు.
\v 42 వెంటనే కుష్టురోగం అతన్ని వదలిపోయింది. అతడు బాగయ్యాడు.
\s5
\v 43 ఆయన అతన్ని పంపివేస్తూ, అతన్ని హెచ్చరించాడు. ఏమనంటే,
\v 44 "ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పొద్దు సుమా, నువ్వు శుద్ధుడివైనట్టు యాజకునికి మాత్రం కనిపించు. యాజకుడు నువ్వు బాగుపడ్డావని పరీక్షించి తెలుసుకుంటాడు. తరువాత మోషే ఆజ్ఞాపించిన ప్రకారం అర్పణలు అర్పించు. అప్పుడు సమాజం ముందు నీకు కుష్టు లేదని ఋజువౌతుంది" అన్నాడు.
\s5
\p
\v 45 కానీ అతడు యేసు చెప్పింది చెప్పినట్టు చెయ్యకుండా అందరికీ యేసు తనని ఎలా స్వస్థపరిచాడో చాటించసాగాడు. అప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ఆయన మీద పడడం మొదలు పెట్టారు. ఆ కారణంగా యేసు ఆ ఉళ్ళో బహిరంగంగా తిరగలేక ఊరి బయట నిర్మానుష్య ప్రదేశాల్లో ఉండిపోవలసి వచ్చింది. అయితే వివిధ ప్రాంతాల నుండి ప్రజలే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు.
\s5
\c 2
\p
\v 1 కొన్నిరోజుల తరువాత యేసు కపెర్నహోముకు తిరిగి వచ్చాడు. యేసు తిరిగి వచ్చాడనీ, ఇంట్లో ఉన్నాడనీ వార్త దావానలంలా వ్యాపించింది.
\v 2 చూస్తుండగానే చాలా మంది యేసు ఉన్న ఆ ఇంటికి చేరుకున్నారు. జనం విపరీతంగా రావడం వల్ల మనిషి నిలబడడానికి కూడా చోటు లేక పోయింది. తలుపు దగ్గర సైతం జనం క్రిక్కిరిసిపోయారు. యేసు వారికి దైవోపదేశం చేయసాగాడు.
\s5
\p
\v 3 నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని అతను పడుకున్న పరుపుతో సహా మోసుకుంటూ అక్కడికి తెచ్చారు
\v 4 ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకు రాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు కొంత మేర ఊడదీసి, సందు చేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా తాళ్ళతో యేసు ముందు దించారు
\s5
\v 5 తన వల్ల ఈ రోగి స్వస్థత పొందుతాడని ఆ మనుషులు ఎంత గట్టిగా నమ్మారో యేసు గ్రహించి ఆ రోగితో, "కుమారా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది" అన్నాడు.
\p
\v 6 అక్కడ ఉన్న కొందరు ధర్మశాస్త్ర పండితులు ఉలిక్కిపడి తమలో తాము ఇలా ఆలోచించారు,
\v 7 "ఈ మనిషి తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? పొగరెక్కి దేవుణ్ణి అవమానిస్తున్నాడు గదా. దేవుడు తప్ప పాపాలు క్షమించ గలవారెవరు?"
\s5
\p
\v 8 వారు లోలోపల ఇలా ఆలోచిస్తున్నారని యేసు అంతరాత్మలో గ్రహించి, వారితో ఇలా అన్నాడు, "మీరు ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు?
\v 9 ఏది తేలిక? ఈ పక్షవాత రోగితో, నీ పాపాలకు క్షమాపణ దొరికింది అనడమా? లేక లేచి నీ పడక ఎత్తుకుని నడువు, అనడమా?
\s5
\v 10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి" అని చెప్పి, ఆ పక్షవాత రోగిని చూసి,
\v 11 "నువ్వు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళమని నేను నీతో చెబుతున్నాను" అన్నాడు.
\v 12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పరుపు చుట్టుకుని అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, "మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే" అని దేవుణ్ణి స్తుతించారు.
\s5
\p
\v 13 యేసు మళ్లీ గలిలయ సరస్సు తీరానికి వెళ్ళాడు. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వారికి ఉపదేశం చేశాడు
\v 14 ఆయన నడుస్తుండగా, దారిలో అల్ఫయి కొడుకు లేవీని చూశాడు. అతడు పన్ను వసూలు చేసే చోట కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో, "నా వెంట రా" అని పిలిచాడు. అతడు లేచి ఆయన వెంట వెళ్ళాడు.
\s5
\p
\v 15 తరువాత లేవి ఇంట్లో యేసు భోజనం చేస్తున్నపుడు పన్ను వసూలు చేసేవారు, సమాజంలో పాపులు అనిపించుకునే వాళ్ళు చాలామంది ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు.
\v 16 అది చూసి ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు ఆయన శిష్యులతో, "మీ గురువుగారు పాపులతో, పన్ను వసూలు చేసేవాళ్లతో కలిసి భోజనం చేస్తున్నాడేమిటి?" అన్నారు.
\s5
\p
\v 17 యేసు ఈ మాట విని వారితో, "ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడి అవసరం లేదు. రోగులకే వైద్యుడు అవసరం. మేము నీతిపరులమని అనుకుంటున్న వారిని పిలవడానికి నేను రాలేదు, మేము నీతిపరులం కాదు, పాపాత్ములమే అని తమ గురించి తాము అనుకుంటున్న వారిని పిలవడానికే వచ్చాను" అన్నాడు.
\s5
\p
\v 18 ఆ సమయంలో బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు, మరి కొంతమంది పరిసయ్యులు తరచూ చేస్తున్నట్టే ఉపవాసం ఉన్నారు. కొంత మంది యేసు దగ్గరికి వచ్చి "యోహాను శిష్యులూ, పరిసయ్యుల శిష్యులూ ఉపవాసం చేస్తారు గాని నీ శిష్యులు ఉపవాసం చెయ్యరేమిటి?" అని ఆయనను అడిగారు.
\v 19 యేసు వారితో, "పెళ్ళికొడుకు తమతో ఉన్న సమయంలో అతని స్నేహితులు ఉపవాసం చేస్తారా? అతడు ఉన్నంత కాలం వారు ఉపవాసం చేయరు. పెళ్ళి అనేది పెళ్ళికుమారుడితో కలిసి పండగలా చేసుకునేది. అది ఉపవాసం చేసే సమయం కాదు, మరి ముఖ్యంగా పెళ్ళికొడుకు వారితో ఉన్నప్పుడు కాదు.
\s5
\v 20 పెళ్ళికొడుకును వారి దగ్గర నుండి తీసుకు వెళ్ళే సమయం వస్తుంది. ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు."
\p
\v 21 యేసు వారితో ఇంకా ఇలా చెప్పాడు. "పాత బట్ట చిరుగుకు నీటిలో తడపని కొత్త బట్టతో ఎవరూ మాసిక వేయరు. అలా చేస్తే కొత్తది పాత దాన్ని గుంజి, చినుగు పెద్దదవుతుంది
\s5
\v 22 అలాగే, కొత్త ద్రాక్షారసం నిలవచేయడానికి పాత తిత్తుల్లో ఎవరూ పోయరు. అలా పోస్తే కొత్త ద్రాక్షరసం పులియడం మొదలవగానే దానికి తగినట్టుగా ఆ తిత్తులు సాగక పోవడం వల్ల చినిగిపోయి ద్రాక్షారసం కూడా కారిపోతుంది. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లోనే పోయాలి."
\s5
\p
\v 23 ఒక విశ్రాంతి రోజున ఆయన పంట చేలలో తన శిష్యులతో కలిసి నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు తినడానికి కొన్ని ధాన్యం కంకులు తుంచుకున్నారు.
\v 24 పరిసయ్యులలో కొందరు అది చూసి యేసుతో "చూడు, నీ శిష్యులు విశ్రాంతి రోజున యూదుల ఆచారం ప్రకారం చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?" అని అడిగారు.
\s5
\p
\v 25 అందుకాయన వారితో, "దావీదు రాజు, అతనితో ఉన్నవారు అవసరంలో ఆకలిగా ఉన్నప్పుడు చేసింది మీరు చదవలేదా?ఈ సంగతి పవిత్ర గ్రంథంలో ఉంది కదా?
\v 26 అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మందిరంలో ప్రవేశించి "ఆకలిగా ఉంది. తినడానికేమైనా ఇవ్వండి" అన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు అబ్యాతారు, దేవుని సన్నిధిలో ఉన్న రొట్టెలు అతనికి ఇవ్వలేదా? దావీదు మన శాస్త్రాల ప్రకారం యాజకులు తప్ప మరెవ్వరూ తినకూడని రొట్టెలు తిని తనతో ఉన్నవారికి పెట్టలేదా?" అన్నాడు.
\s5
\p
\v 27 ఆయన వారితో , "విశ్రాంతి రోజు మనుషుల కోసమే ఏర్పాటు అయింది. మనుషులు విశ్రాంతి రోజు కోసం కాదు.
\v 28 కాబట్టి మనుష్య కుమారుడు విశ్రాంతి రోజుకు కూడా ప్రభువే" అని స్పష్టంగా వారితో చెప్పాడు.
\s5
\c 3
\p
\v 1 మరోసారి ఒక విశ్రాంతి రోజున యేసు సమాజమందిరంలో ప్రవేశించాడు. చెయ్యి చచ్చుబడిపోయిన వాడొకడు అక్కడ ఉన్నాడు.
\v 2 పరిసయ్యుల వర్గానికి చెందిన కొద్ది మంది అక్కడ ఉన్నారు. వారు "ఈ విశ్రాంతి రోజున పాటించాల్సిన మన నియమాలను యేసు పాటిస్తాడా పాటించడా, లేక అదేమీ లెక్క చేయకుండా ఈ మనిషిని బాగుచేస్తాడా, చూడాలి," అనుకుంటూ ఏదో ఒక నేరం మోపాలి అని జాగ్రత్తగా గమనిస్తున్నారు.
\s5
\p
\v 3 యేసు ఆ చెయ్యి చచ్చుబడిన వాడితో, "ఇటు వచ్చి అందరి ముందూ నిలబడు" అన్నాడు. ఆయన అలా అనగానే వాడు వచ్చి అందరి ముందు నిలబడ్డాడు.
\v 4 అప్పుడు ఆయన వారితో, "విశ్రాంతి రోజున మేలు చేయడం ధర్మమా? కీడు చేయడం ధర్మమా? దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రజల్ని మంచి చేయమని చెబుతున్నదా లేక చెడు చేయమని చెబుతున్నదా? ధర్మశాస్త్రం విశ్రాంతి రోజున ఒక మనిషి ప్రాణం కాపాడవద్దనిగాని, ఆ మనిషి చనిపోయినా పరవాలేదని గానీ, చెప్పిందా?" అన్నాడు. అందుకు వారు ఏ జవాబూ చెప్పలేదు.
\s5
\p
\v 5 యేసు వాళ్ళను తీక్షణంగా చూశాడు. అవసరంలో నిస్సహాయంగా నిలబడి ఉన్న మనిషికి సహాయం చేయక పోగా, ఎటువైపు నుండీ కూడా సహాయం అందకూడదు, మా ఆచారాలే ముఖ్యం అన్నట్టు ఉన్న వారి కఠిన హృదయాలను బట్టి నొచ్చుకొని, కోపంతో రగిలిపోయాడు. అప్పుడు ఆ చెయ్యి చచ్చుబడిన వాడితో, "నీ చెయ్యి చాపు" అనగానే వాడు చెయ్యి చాపాడు. వెంటనే అతని చెయ్యి పూర్తిగా బాగైపోయింది.
\p
\v 6 అప్పుడు పరిసయ్యులు బయటకు వెళ్ళి, హేరోదు అంతిప అనే అధికారి అనుయాయులతో, కొందరు యూదులతో కలిసి యేసుని చంపడానికి కుట్ర పన్నారు. హేరోదు అంతిప గలిలయ ప్రాంతపు అధికారి.
\s5
\p
\v 7 యేసు తన శిష్యులతో కలసి గలిలయ సరస్సు ఒడ్డున వెళ్తూ ఉన్నాడు. గలిలయ, యూదయ ప్రాంతాల నుండి వచ్చిన చాలామంది ప్రజలు ఆయన వెంబడిస్తూ వెళ్ళారు.
\v 8 యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ, యెరూషలేము పట్టణ ప్రాంతాల నుండీ, ఇదూమియ సీమ నుండీ, యొర్దాను నదికి తూర్పు వైపు నుండీ, తూరు, సీదోను చుట్టుపక్కల ప్రాంతాలనుండీ ఆయన దగ్గరికి వచ్చారు.
\s5
\v 9 ఎందుకంటే ఆయన చాలామంది జబ్బులు నయం చేశాడు.
\p
\v 10 అందువల్ల వ్యాధులతో ఉన్నవాళ్లు ఆయనను తాకాలని ఆయన దగ్గరికి తోసుకొస్తున్నారు. ఆయనని తాకితే చాలు స్వస్థపడతామని వాళ్ళందరూ నమ్ముతున్నారు. అప్పుడాయన తన శిష్యులతో "తొక్కిసలాట జరుగుతూ ఉంది, నా కోసం ఒక చిన్న పడవ తీసుకురండి. ఒడ్డు నుండి కాస్త విడిగా నిలబడతాను" అన్నాడు.
\s5
\p
\v 11 దయ్యాలు ఆయనను చూడగానే, అవి తాము పట్టి పీడిస్తున్న వాళ్ళని ఆయన ఎదుట నేలపై పడేసి, "నువ్వు దేవుని కుమారుడివి" అని కేకలు వేశాయి.
\v 12 యేసు, తానెవరో తెలపాల్సిన పని లేదని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు.
\s5
\p
\v 13 తరువాత యేసు కొండ ప్రాంతానికి ఎక్కి వెళుతూ తనను అనుసరించాలని కోరుకున్న వారిని పిలిచాడు. వారు ఆయనతో వెళ్ళారు.
\v 14 తనతో ఉండడానికీ, బయటకు వెళ్ళి సువార్త ప్రకటించడానికీ ఆయన పన్నెండు మందిని నియమించాడు. వారికి పంపించిన వాళ్ళు లేక అపొస్తలులు అని పేరు పెట్టాడు.
\v 15 రోగాలు బాగుచేయడానికీ, దయ్యాలను వెళ్ళగొట్టడానికీ వారికి అధికారం ఇచ్చాడు.
\p
\v 16 ఆ పన్నెండుమంది పేర్లు ఏవంటే, సీమోను (ఇతనికి ఆయన పేతురు అనే కొత్త పేరు పెట్టాడు),
\s5
\v 17 ఇతనితోపాటు జెబెదయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను (వీరికి ఉన్న చురుకుదనం, ఉత్సాహాన్ని బట్టి ఆయన "బోయనేర్గెసు" అనే పేరు పెట్టాడు, ఆ మాటకి "గర్జించే వాళ్ళు" అని అర్థం),
\v 18 ఇంకా అంద్రెయ, ఫిలిప్పు, బర్తొలొమయి, మత్తయి, తోమా, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను అనే వారూ,
\v 19 చివరిగా తరువాతి రోజుల్లో యేసును శత్రువులకు పట్టి ఇచ్చిన ఇస్కరియోతు యూదా.
\s5
\p
\v 20 తరువాత యేసు, ఆయన శిష్యులు ఒక ఇంటికి వెళ్ళారు. మళ్ళీ అక్కడ చాలా మంది గుమిగూడి ఉన్నారు. కాబట్టి వారికి భోజనం చేయడానికి కూడా వీలు లేకపోయింది
\v 21 ఇది తెలిసిన యేసు కుటుంబీకులు ఆయనను పట్టుకుని ఇంటికి తీసుకు వెళ్ళడానికి వచ్చారు. ఎందుకంటే కొందరు "ఆయనకు మతి స్థిమితం లేదు" అన్నారు.
\p
\v 22 యెరూషలేము నుండి వచ్చిన కొద్దిమంది ధర్మశాస్త్ర పండితులేమో యేసు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని విని "బయల్జెబూలు ఇతణ్ణి ఆవహించాడు. ఆ దయ్యాల అధిపతి సహాయంతోనే ఇతడు దయ్యాలను పారదోలుతున్నాడు" అని అందరి సమక్షంలో అన్నారు.
\s5
\p
\v 23 యేసు అలా అన్నవారిని తన దగ్గరికి పిలిచి, ఒక ఉదాహరణ చెప్పాడు. "సైతాను సైతానును ఎలా వెళ్ళగొడతాడు?
\v 24 ఒకే రాజ్యంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం మొదలు పెడితే ఆ రాజ్యం ఒక్కటిగా ఎప్పటికీ వుండదు. పైగా నాశనం అవుతుంది కూడా.
\v 25 అలాగే, ఒకే ఇంట్లో ఉండే ఒకే కుటుంబసభ్యుల మధ్యలో ఇలాంటి పోట్లాటలు మొదలైతే ఆ ఇల్లు గానీ, ఆ కుటుంబం గానీ ఒక్కటిగా ఉండకపోగా దుంపనాశనం అవుతుంది.
\s5
\v 26 అలాగే సైతాను తనకు తానే విరోధంగా ఉంటే అతని బలం ఉడిగిపోయి అధికారం అంతమౌతుంది గదా.
\v 27 అసలు ఒక బలవంతుడి ఇంట్లో దొంగతనం చేయాలంటే మొదట అతణ్ణి కట్టిపడేయాల్సిందే గదా."
\s5
\p
\v 28 యేసు ఇంకా ఇలా చెప్పాడు. "జాగ్రత్తగా గమనించండి, మనుషులు ఎన్ని రకాల పాపాలు చేసినా, ఆఖరికి దేవుణ్ణి దూషించినా కూడా దేవుడు క్షమిస్తాడు.
\v 29 కాని పరిశుద్ధాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎన్నటికీ క్షమించడు. అలా చేసేవాడు పాపం చేసి శాశ్వత కాలం దోషిగా ఉంటాడు."
\v 30 ఆయనకు దయ్యం పట్టింది అని వారు అన్నందుకు ఆయన వారితో ఇలా చెప్పాడు.
\s5
\p
\v 31 అప్పుడు యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చి, బయట నిలబడి యేసు కోసం కబురు చేశారు.
\v 32 ఆ సమయంలో యేసు చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. వారిలో ఒకడు "మీ అమ్మ, తమ్ముళ్ళు బయట నీ కోసం చూస్తున్నారు" అన్నాడు.
\s5
\v 33 ఆయన తనతోపాటు ఉన్న వారితో, "ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?" అన్నాడు.
\v 34 తన చుట్టూ కూర్చున్న వారిని చూస్తూ, "మీరే నా తల్లి, మీరే నా సోదరులు.
\v 35 ఎందుకంటే, దేవుని ఇష్టప్రకారం నడుచుకునే వారే నా సోదరులు, నా అక్క చెల్లెళ్ళు, నా తల్లి" అన్నాడు.
\s5
\c 4
\p
\v 1 మరొకసారి ఆయన గలలీ సరస్సు ఒడ్డున ఉపదేశిస్తున్నాడు. ఆయన మాట్లాడుతుండగా చుట్టూ జనాల తాకిడి ఎక్కువైపోయింది. దాన్నుండి తప్పించుకుని, అందరితోనూ స్పష్టంగా మాట్లాడడం కోసం, ఆయన ఒడ్డునున్న ఒక పడవను కొంచం నీటి లోకి తోసి దాని మీద కూర్చుని మాట్లాడసాగాడు. వెంటనే ప్రజలందరూ వినడానికి వీలుగా నీళ్ళ దగ్గరికి జరిగారు.
\p
\v 2 అప్పుడు ఎన్నో సూక్తులు నీతికథల పంలో చెప్పాడు.
\s5
\v 3 "ఇది వినండి. ఒక రైతు తన పొలంలో విత్తనాలు చల్లడానికి వెళ్ళాడు.
\v 4 విత్తనాలు చల్లుతూ ఉండగా, కొన్ని దారి పక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినేశాయి.
\v 5 మరికొన్ని మట్టి ఎక్కువగా లేని రాతినేల మీద పడ్డాయి. పై పైన కాస్త తేమ తగలడం వల్ల అవి త్వరగానే మొలకెత్తాయి. అయితే అడుగున రాతి నేల ఉండడం వల్ల వేర్లు కిందికి లోతుగా ఎదగలేదు.
\s5
\v 6 ఆ లేత మొక్కలమీద సూర్యరశ్మి పడగానే వాటి వేర్లు లోతుగా లేనందువల్ల ఎండ వేడికి వడిలిపోయి ఎండిపోయాయి.
\v 7 ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో పడ్డాయి. అక్కడ విత్తనాలు మొలకెత్తాయి, కానీ ఆ ముళ్ళ తుప్పలు ఆ మొక్కలకంటే బలంగా పెరిగి, ఎదుగుతున్న మొక్కలను అణచి వేయడం వల్ల అవి పంటకు రాలేదు.
\s5
\v 8 మిగిలిన విత్తనాలు మంచి సారవంతమైన నేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, చక్కగా పెరిగి మంచి పంటను ఇచ్చాయి. కొన్ని మొక్కలు ముప్ఫై రెట్లు, కొన్ని అరవై రెట్లు, ఇంకొన్ని వంద రెట్లు పండి కోతకు వచ్చాయి."
\v 9 యేసు ఇలా చెప్పి "జాగ్రత్తగా విని, విచారించి తెలుసుకుంటే తప్ప యదాలాపంగా వింటే ఇప్పుడు చెప్పింది అర్థం కాదు" అన్నాడు.
\s5
\p
\v 10 తరువాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు, ఆయన సన్నిహితులు కొందరు ఆ కథ గురించి ఆయనను అడిగారు
\v 11 "దేవుడు తనని తాను రాజుగా అగుపరచుకుంటున్న ఈ సందేశాన్ని నేను మీకు వివరిస్తాను. ఆసక్తి లేని ఇతరులకైతే ఇలాంటి ప్రతీ విషయమూ ఉపమానాల రూపంలోనే చెబుతాను.
\v 12 ఎందుకంటే,
\q వాళ్ళు నేను చేస్తున్నది చూస్తూనే ఉన్నా గ్రహించరు.
\q నేను చెప్పేది వింటున్నాఅర్థం చేసుకోలేరు.
\q వాళ్ళు గ్రహిస్తే అర్థం చేసుకుంటే
\q దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో."
\s5
\p
\v 13 ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, "ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? మరైతే మిగతావన్నీ ఎలా అర్థం చేసుకుంటారు?
\v 14 నేను మీకు చెప్పిన కథలో, విత్తనాలు చల్లేవాడు దేవుని సందేశాన్ని ఇతరులకు చెప్పేవాడు. అంటే వాడు చల్లేది దేవుని వాక్కునే.
\v 15 కొంతమంది ఆ విత్తనాలు పడిన కాలి బాటను పోలి వుంటారు. వాళ్ళు దేవుని సందేశం వింటారు గానీ, వెంటనే సైతాను వచ్చి, దొరికిన విత్తనాల్ని పక్షులు చటుక్కున ఎలా పట్టుకు పోతాయో అలా విన్నవాళ్ళు మర్చిపోయేలా చేస్తాడు.
\s5
\p
\v 16 అలాగే కొంతమంది పైపైనే మట్టి ఉండి అడుగున రాతి నేలను పోలిన వారు. వీళ్ళు దేవుని సందేశం విని మొదట ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు.
\v 17 కానీ పలచగా మట్టి ఉన్న రాతి నేల మీద మొక్క ఎలా పెరగలేక ఎండిపోయిందో అలా దేవుని సందేశాన్ని విని అంగీకరించినందుకు, వారిని ఎవరైనా హీనంగా చూసినా, బాధ పెట్టినా వెంటనే వాళ్ళు దేవుని సందేశాన్ని నమ్మడం మానేస్తారు.
\s5
\p
\v 18 కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి వారు. వీరు దేవుని సందేశాన్ని విని, నాటిన విత్తనం భూమిని చీల్చుకుని ఎలా పైకి ఎదుగుతుందో మొదట అలానే ఉంటారు.
\v 19 కానీ, "మనం ఇలాగే ఉండిపోతే ఎలా, ఇంకా చాలా సంపాదించాలి, చాలా పనులు చేయాల్సి ఉంది" అనుకుంటూ జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఎక్కువైపోయి, ఎదుగుతున్న మొక్కను చుట్టూ ఉన్న ముళ్ళ తుప్పలు ఎలా అణగ తొక్కుతాయో, అలా దేవుని సందేశం అణిగిపోయి మొక్క ఫలించకుండా పోతుంది. అందువల్ల దేవుడు ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో మర్చిపోయి, ఎంతసేపూ తమ సొంత విషయాల్లోనే మునిగి పోతారు.
\p
\v 20 మరి కొందరు సారవంతమైన నేలలాంటి వారు. వీళ్ళు దేవుని సందేశాన్ని విని, అంగీకరించి, నమ్మకంగా ఆచరణలో పెడతారు. చక్కగా ఎదిగిన మొక్క పరిస్థితులను సానుకూల పరుచుకుని ఎలా మంచి పంటనిస్తుందో, అలా కొందరు ముప్ఫై రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు వంద రెట్లు ఫలిస్తారు."
\s5
\p
\v 21 ఆయన వారితో ఇంకొక కథ చెప్తూ, "దీపాన్ని వెలిగించి, తీసుకొచ్చి, బోర్లించిన పాత్ర కింద, లేక మంచం కింద ఉంచుతారా? దాన్ని ఎత్తుగా, అందరికీ వెలుగు కనబడేలా దీపస్తంభం మీద ఉంచుతాం గదా.
\v 22 అలా ఆ వెలుగు పడగానే, అప్పటివరకూ కనబడకుండా దాచినవి బయటపడతాయి. చీకటి మాటున రహస్యంగా జరుగుతున్నవీ బయటపడతాయి.
\v 23 ఇది అర్థం కావాలంటే, జాగ్రత్తగా విని, విచారించి తెలుసుకోవాలే తప్ప, యదాలాపంగా వింటే ఇప్పుడు చెప్పింది అర్థం కాదు" అన్నాడు.
\s5
\p
\v 24 యేసు వారితో ఇంకా ఇలా అన్నాడు, "నేను మీతో చెప్పేది జాగ్రత్తగా గమనించండి. మీరు నానుంచి విన్న దానిని ఎంతగా పట్టించుకుంటారో, దేవుడు కూడా అంతగా మీకు ఆ మాటలు అర్థం అయ్యేలా చేస్తాడు. మీ ఆసక్తిని చూసి ఇంకా బాగా అర్థం అయ్యేలా కూడా చేస్తాడు.
\v 25 వినాలి, నేర్చుకోవాలి అనే ఆసక్తి కలిగిన వారికి దేవుడు ఆ సామర్థ్యం ఇంకా ఎక్కువగా ఇస్తాడు. అలా లేని వారినుండి అంటే మొక్కుబడిగా వింటున్న వారి దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు."
\s5
\p
\v 26 ఆయన మళ్ళీ ఇలా అన్నాడు, "రాజు తన ప్రజల యోగ క్షేమాలు చూడడానికి అంతఃపురం వదిలి, ప్రజల మధ్యకు వచ్చినట్టుగా దేవుడు తన ప్రభుత్వంతో మనుషుల మధ్యకు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. ఒక మనిషి పొలంలో గింజలు చల్లి,
\v 27 చల్లిన విత్తనాల గురించి ఏ బాదరబందీ లేకుండా, నిద్ర పోతున్నా మెలకువగా ఉన్నా రాత్రి, పగలు అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఉంటాయి.
\v 28 ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తరువాత కంకి, ఆ కంకి నిండా గింజలు పుడతాయి.
\v 29 పంట పండీ పండగానే అతడు కోతకాలం వచ్చిందని, వెంటనే తన మనుషులను పంపించి పంట కోస్తాడు."
\s5
\p
\v 30 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు. "దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం?
\v 31 దేవుని రాజ్యాన్ని ఆవగింజలతో పోల్చితే, మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకీ అవి చిన్నవైనప్పటికీ, పెద్ద మొక్కలుగా పెరుగుతాయి.
\v 32 దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు సైతం దాని నీడలో గూడు కట్టుకుంటాయి."
\s5
\p
\v 33 యేసు ఇలాంటి ఉదాహరణలు, కథలు ఎన్నో ఉపయోగించి, ప్రజలందరికీ దేవుని సందేశాన్ని ఉపదేశించాడు. వారు అర్థం చేసుకోగలిగిన కొద్దీ మరి ఎక్కువగా వివరించాడు.
\v 34 కథలు లేకుండా వారికి ఏ ఉపదేశమూ చేయలేదు. తరువాత ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం వారికి అన్నీ వివరించి చేప్పేవాడు.
\s5
\p
\v 35 ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుండగా ఆయన తన శిష్యులతో, "సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి" అన్నాడు.
\v 36 యేసు అప్పటికే పడవ ఎక్కేశాడు. శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు. మిగతా వారు కూడా పడవలు ఎక్కి వారివెంట వెళ్ళారు.
\v 37 అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. అలలు లేచి పడవను నీళ్ళతో నింపసాగాయి.
\s5
\v 38 పడవ వెనక భాగంలో యేసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, "గురువుగారూ! మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?" అని గాభరాగా అన్నారు.
\v 39 ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, "శాంతించు! ఆగిపో!" అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.
\s5
\p
\v 40 అప్పుడాయన శిష్యులతో, "మీరెందుకు భయపడుతున్నారు? నేను మిమ్మల్ని కాపాడగలననే విశ్వాసం ఇంకా కలగలేదా?" అన్నాడు.
\v 41 వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, "ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!" అని చెప్పుకున్నారు.
\s5
\c 5
\p
\v 1 వారు గలలీ సరస్సు దాటి అవతలి ఒడ్డున ఉన్న గెరాసేను ప్రాంతానికి వెళ్ళారు.
\v 2 యేసు పడవ దిగగానే దయ్యం పట్టిన వాడొకడు స్మశానం నుండి ఆయన దగ్గరికి వచ్చాడు.
\s5
\v 3 వాడు స్మశానంలోనే నివసించేవాడు. వాణ్ణి గురించి తెలిసిన ప్రజలు వాణ్ణి కట్టడి చెయ్యడానికి ప్రయత్నం చేసినా వీలు కాలేదు. ఇనప గొలుసులతో సైతం వాణ్ణి ఎవ్వరూ కట్టెయ్యలేకపోయారు.
\v 4 వాడి చేతులు, కాళ్ళు ఎన్నిసార్లు గొలుసులతో, సంకెళ్ళతో కట్టినా ఆ సంకెళ్ళు తెంపి, కట్లను చిందరవందర చేసే వాడు. వాణ్ణి అదుపు చేసే శక్తి ఎవరికీ లేకపోయింది.
\s5
\v 5 వాడు స్మశానంలో, కొండల మీదా, గుహల్లోనూ రేయింబవళ్ళు తిరుగుతూ పెద్దగా కేకలు పెడుతూ తన శరీరాన్ని పదునైన రాతి ముక్కలతో గాయపరచుకొనేవాడు.
\p
\v 6 వాడు యేసును దూరం నుండి చూసి పరుగెత్తుకు వచ్చి ఆయన ముందు మోకరించి నమస్కారం చేశాడు.
\s5
\v 7 యేసు అతనితో, "అపవిత్రాత్మా, ఈ మనిషిని వదలి బయటకు రా!" అన్నాడు.
\v 8 అప్పటికీ ఆ మనిషిని వదలడం ఇష్టంలేని దయ్యం "యేసూ, మహోన్నత దేవుని కుమారా! నాతో నీకేం పని? దేవుని పేరిట నిన్ను బతిమాలుతున్నాను, నన్ను బాధ పెట్టవద్దు!" అని గట్టిగా కేకలేస్తూ అన్నాడు.
\s5
\v 9 ఆయన, "నీ పేరేమిటి?" అని అతణ్ణి అడిగాడు. "నా పేరు దయ్యాల దళం. మేము చాలా మంది అపవిత్రాత్మలం కలసి ఇతనిలో ఉన్నాం" అని అతడు జవాబు చెప్పాడు
\v 10 ఆ ప్రాంతం నుండి తమను పంపివేయవద్దని ఆ దయ్యాలు ఆయన్ని ఎంతో బతిమాలుకున్నాయి. అందుకు యేసు ససేమిరా అన్నాడు.
\s5
\p
\v 11 అదే సమయంలో ఆ కొండ పక్కన పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది.
\v 12 ఆ దయ్యాలు యేసుతో, "మమ్మల్ని ఆ పందుల గుంపులో చొరబడడానికి అనుమతి ఇవ్వు" అని ప్రాధేయపడ్డాయి.
\v 13 యేసు వాటికి అనుమతి ఇచ్చాడు. దయ్యాలు అతణ్ణి వదిలి ఆ పందుల్లోకి చొరబడ్డాయి. ఆ మందలో సుమారు రెండు వేల పందులు ఉన్నాయి. అవి వాలుగా ఉన్న కొండమీద నుండి వేగంగా పరుగెత్తి సముద్రంలో పడి మునిగి చచ్చాయి.
\s5
\v 14 ఆ పందులు మేపేవారు పారిపోయి ఊర్లో, ఆ చుట్టుపక్కల పల్లెప్రాంతాల్లో ఈ సంగతి చెప్పారు. అక్కడి ప్రజలు జరిగినదాన్ని చూడాలని వచ్చారు.
\p
\v 15 వారు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాల సేన పట్టిన వాడు బట్టలు వేసుకొని బుద్ధిగా కూర్చుని ఉండడం గమనించారు. ఇదంతా చూసి వారికి భయం వేసింది.
\s5
\v 16 దయ్యాలు మనిషిని వదిలిపోవడం, ఆ తరువాత పందుల్లో దూరడం, పందులు సరస్సులో పడడం, అంతా స్వయంగా చూసినవారు, దయ్యాలు పట్టిన వాడికి జరిగిన దాన్ని గురించి, పందుల గురించి అందరికీ కళ్ళకి కట్టినట్టు చెప్పారు.
\v 17 వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళిపొమ్మని వేడుకున్నారు.
\s5
\p
\v 18 యేసు పడవ ఎక్కుతూ ఉండగా దయ్యాలు వదిలి పోయినవాడు వచ్చి తనను కూడా వెంట రానిమ్మని బతిమాలాడు.
\v 19 కాని యేసు దానికి అంగీకరించలేదు. అతనితో, "నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళి ప్రభువు నీకు చేసినదాని గురించీ, నీపై చూపిన దయ గురించీ మీ వాళ్ళకి చెప్పు" అన్నాడు
\v 20 అతడు వెళ్ళి, యేసు తనకు చేసిన గొప్ప కార్యం గురించి దెకపొలి చుట్టుపక్కల ప్రాంతంలో కనీసం పది పట్టణాలలో ప్రకటించాడు. అది విన్న అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగింది.
\s5
\p
\v 21 యేసు పడవ ఎక్కి తిరిగి గలలీ సరస్సు అవతలి ఒడ్డుకు చేరుకొన్నాడు. ఆయన సరస్సు ఒడ్డున ఉండగానే పెద్ద గుంపు ఆయన దగ్గర చేరింది.
\v 22 అప్పుడు యాయీరు అనే యూదుల సమాజ మందిరం అధికారి ఒకడు యేసును వెతుక్కుంటూ వచ్చి ఆయన పాదాల దగ్గర మోకరిల్లి,
\v 23 "నా కూతురు చావు బతుకుల్లో ఉంది. దయచేసి నువ్వు వచ్చి నీ చేతులు ఆమె మీద ఉంచు. ఆమె బాగుపడి బతుకుతుంది" అని దీనంగా వేడుకున్నాడు.
\v 24 యేసు అతని వెంట బయలుదేరాడు. పెద్ద గుంపు ఆయన మీద పడుతూ ఆయన వెంట వెళ్ళింది.
\s5
\p
\v 25 పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో దిన దిన గండంగా బ్రతుకుతున్న ఒక స్త్రీ ఆ గుంపులో ఉంది.
\v 26 ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కాని, ఆమె బాధ తగ్గలేదు. తన డబ్బంతా ఖర్చు చేసింది. అయినా జబ్బు నయం కావడానికి బదులు ఆమె పరిస్థితి ఇంకా క్షీణించింది.
\v 27 చాలామంది రోగులను యేసు నయం చేసాడని విని, యేసు దగ్గరకు వచ్చింది. చుట్టూ ఉన్న గుంపులోకి శక్తినంతా కూడదీసుకుని చొరబడింది.
\s5
\v 28 "నేను ఆయన్ని గానీ, ఆయన బట్టలు గానీ తాకితే చాలు, నాకు నయమౌతుంది" అనుకుని, ఆయన వెనకగా వచ్చి ఆయన అంగీ అంచు తాకింది.
\v 29 వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. తన జబ్బు పూర్తిగా నయమైందని ఆమెకి తెలిసిపోయింది.
\s5
\p
\v 30 వెంటనే యేసు తనలో నుండి శక్తి ప్రవహించిందనీ ఎవరో స్వస్థపడ్డారనీ గ్రహించి, ప్రజల వైపు తిరిగి, "నా అంగీ తాకినదెవరు?" అన్నాడు.
\v 31 ఆయన శిష్యులు, "ఇంతమంది నీ మీద పడుతున్నారు గదా! అయినా "నన్ను తాకినది ఎవరు" అంటున్నావేమిటి?" అన్నారు.
\v 32 కాని యేసు, తనను తాకిన వారికోసం చుట్టూ చూశాడు.
\s5
\p
\v 33 ఆ స్త్రీ తన రోగం నయం అయిందన్న సంగతి యేసు గ్రహించి, తనకోసమే వెతుకుతున్నాడని గ్రహించి భయంతో వణుకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడి, జరిగిందంతా చెప్పింది.
\v 34 ఆయన ఆమెతో, "ఏమ్మా, నేను నయం చేయగలని నమ్మావు కదా. నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది. నీ జబ్బు సంపూర్ణంగా నయం అయిందనీ, మరెప్పటికీ నిన్ను వేధించదనీ మాట ఇస్తున్నాను. హాయిగా ఇంటికి వెళ్ళు" అన్నాడు.
\s5
\p
\v 35 యేసు ఇంకా మాట్లాడుతుండగా, యూదుల సమాజ మందిరం అధికారి యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి అతనితో, "నీ కూతురు చనిపోయింది. ఇంక గురువును ఇంటిదాకా తీసికెళ్ళి ఇబ్బంది కలిగించడం ఎందుకు? వద్దులే" అన్నారు.
\s5
\v 36 యేసు వారి మాటలు పట్టించుకోకుండా, యాయీరుతో, "భయపడకు, అమ్మాయి తప్పక బతుకుతుంది. నమ్మకం ఉంచు, అసలు వదులుకోవద్దు" అన్నాడు
\v 37 అప్పుడాయన తనతో సన్నిహితంగా ఉన్న పేతురును, యాకోబును, యాకోబు సోదరుడు యోహానును తప్ప ఎవ్వరినీ తన వెంట యాయీరు ఇంటికి రానివ్వలేదు.
\p
\v 38 వాళ్ళు ఆ ఇంటి దగ్గరకు వచ్చినపుడు, అక్కడ ఉన్నవారు బిగ్గరగా ఏడుస్తూ, శోకాలు పెడుతూ గుండెలు బాదుకుంటూ ఉండడం చూశాడు.
\s5
\v 39 ఆయన ఇంట్లోకి వెళ్ళి వాళ్లతో, "ఎందుకు గాభరా పడుతున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఆమె చనిపోలేదు, నిద్రలో ఉంది, అంతే" అన్నాడు.
\v 40 కాని, వారు ఆయనను హేళన చేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోవడం వాళ్ళు కళ్ళారా చూశారు. యేసు వారందర్నీ బయటకు పంపి, తరవాత ఆమె తండ్రిని, తల్లిని, తనతో ఉన్న శిష్యుల్ని వెంటబెట్టుకొని ఆమెను పడుకోబెట్టి ఉన్న గదిలోకి వెళ్ళాడు.
\s5
\v 41 ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, "తలితా కుమీ" అన్నాడు. వాళ్ళ భాషలో ఆ మాటకు, "చిన్ని పాపా, నీతో నేనంటున్నాను, లే" అని అర్థం.
\v 42 వెంటనే ఆ అమ్మాయి లేచి నడవసాగింది. ఆ అమ్మాయి వయస్సు పన్నెండేళ్ళు. ఇది చూసిన వారంతా చాలా ఆశ్చర్య పోయారు.
\v 43 నేను చేసిన ఈ సంగతి ఎవ్వరికీ చెప్పవద్దని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించాడు. ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా ఇవ్వమని వారితో చెప్పాడు.
\s5
\c 6
\p
\v 1 యేసు కపెర్నహోము పట్టణం నుండి తన స్వగ్రామం నజరేతుకు తన శిష్యులతో కలసి వెళ్ళాడు.
\v 2 యూదుల విశ్రాంతి రోజున, యూదులు వారి మత విశ్వాసాన్ని బోధించుకునే సమాజ మందిరంలో యేసు ప్రవేశించి ఉపదేశించడం మొదలు పెట్టాడు. చాలామంది ఆయన ఉపదేశం విని ఎంతో ఆశ్చర్యపడ్డారు. "ఈ సంగతులన్నీ ఇతనికెలా తెలుసు? దేవుడు ఇతనికి ఎంతటి జ్ఞానం ఇచ్చాడు! ఇతని ద్వారా ఇన్ని మహత్కార్యాలు ఎలా జరుగుతున్నాయి?
\v 3 ఇతడు మామూలు వడ్రంగే కదా! మరియ కొడుకేగదా! యాకోబు, యోసే, యూదా, సీమోనుల అన్నే గదా. ఇతడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు గదా!" అని చెప్పుకుంటూ ఆయన గురించి చాలా తక్కువ చేసి మాట్లాడడమే కాకుండా ఆయన విషయంలో చాలా అసూయపడ్డారు.
\s5
\p
\v 4 యేసు వారితో, "నాకైనా, ఏ ప్రవక్తకైనా తన సొంత ఉళ్ళో, సొంత వారి మధ్య, సొంత ఇంట్లో తప్ప అన్ని చోట్లా గౌరవం లభిస్తుంది” అన్నాడు.
\v 5 అక్కడ యేసు కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని బాగు చేయడం తప్ప మరి ఏ మహత్కార్యాలూ చేయలేకపోయాడు.
\v 6 వారి అపనమ్మకానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ తరువాత యేసు చుట్టుపక్కల గ్రామాలు తిరుగుతూ ఉపదేశం చేశాడు.
\s5
\p
\v 7 ఒక రోజు యేసు తన పన్నెండుమంది శిష్యులను దగ్గరికి పిలుచుకుని, "మీరు వెళ్ళి ప్రజలకు బోధించాల్సిన సమయం వచ్చింది" అంటూ, వారికి దయ్యాలను వెళ్ళగొట్ట గల అధికారమిచ్చి, ఇద్దరిద్దరిగా పంపుతూ ఇలా ఆజ్ఞ ఇచ్చాడు.
\v 8 "ప్రయాణం కోసం చేతికర్ర తప్ప ఇంకేదీ తీసుకు వెళ్ళకండి. ఆహారం గాని, సామాన్లు పెట్టుకునే చేతి సంచిగాని, ప్రయాణం కోసం డబ్బుగాని, తీసుకు వెళ్ళకండి.
\v 9 ఒంటిమీది దుస్తులు తప్ప విడిగా దుస్తులు తీసుకు వెళ్ళకండి.
\s5
\v 10 ఏ గ్రామం, ఊరు వెళ్ళినా, అక్కడ ఎవరైనా వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే, ఆ ఇంటికి వెళ్ళాక అక్కడే తినండి, అక్కడే పడుకోండి. ఆ గ్రామం విడిచే వరకూ ఆ ఇంట్లోనే ఉండండి.
\v 11 ఏ ఊరు వాళ్లైనా మిమ్మల్ని స్వీకరించకపోతే, మీ మాటలు వినకపోతే, మీరు ఆ గ్రామం వదిలే ముందు వారి తిరస్కారానికి సాక్ష్యంగా మీ పాద ధూళిని దులిపి వేయండి."
\s5
\p
\v 12 తరువాత శిష్యులు వెళ్ళి, చాలా గ్రామాలూ, ఊర్లూ తిరుగుతూ "మీ పాపాల గురించి పశ్చాత్తాప పడండి, మీ ప్రవర్తనను సరి చేసుకోండి, ఇకమీదట తప్పులు చేయకూడదని నిర్ణయించుకోండి, అలాంటి వారిని దేవుడు క్షమిస్తాడు" అంటూ ప్రకటించారు.
\v 13 శిష్యులు ఎన్నో దయ్యాలను వదిలించారు. అనేకమంది రోగులను నూనె రాసి బాగుచేశారు.
\s5
\p
\v 14 యేసు పేరు బాగా ప్రసిద్ధి కావడం వల్ల ఆ సంగతి ఆ నోటా ఈ నోటా హేరోదు రాజుకు తెలిసింది. బాప్తిసం ఇచ్చే యోహాను బతికి వచ్చాడని, అందుకే యేసులో మహత్కార్యాలు చేసే శక్తి ఉన్నదని కొందరు అన్నారు.
\v 15 కొద్దిమంది, "ఈయన ఒకప్పటి ప్రవక్త ఏలీయా, ఆయనను దేవుడు తిరిగి పంపిస్తాను అన్నాడు గదా" అన్నారు. ఇంకొందరు, "ఈయన ఫలానా అని ఇదమిద్దంగా చెప్పలేము కానీ, తప్పకుండా పూర్వకాలపు ప్రవక్తల వంటి ప్రవక్తే” అన్నారు.
\s5
\p
\v 16 కాని, హేరోదైతే, "నేను తల నరికించిన యోహానే మళ్ళీ బతికి వచ్చాడు" అన్నాడు.
\v 17 అంతకు ముందు ఏం జరిగిందంటే, హేరోదియ అనే ఆమెను ఈ హేరోదు వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఆమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య.
\s5
\v 18 యోహాను హేరోదుతో, "నీ సోదరుడు బ్రతికుండగానే అతని భార్యను తెచ్చుకోవడం అన్యాయం, దేవుడు ఇలాంటి వివాహాలను అనుమతించడు" అని హెచ్చరించాడు. హేరోదియకు ఆ హెచ్చరికలు రుచించ లేదు. అందుచేత ఆమె యోహానుకు వ్యతిరేకంగా హేరోదుపై ఒత్తిడి తీసుకువచ్చింది. గత్యంతరం లేక హేరోదు సైనికులను పంపి యోహానును బంధించి, ఖైదులో వేయించాడు.
\p
\v 19 హేరోదియ మాత్రం యోహాను మీద పగపట్టి, అతణ్ణి చంపాలని ఆశించింది. కానీ అలా చెయ్యలేకపోయింది. హేరోదు యోహానును జైల్లో వేయించడం ద్వారా ఒక విధంగా హేరోదియ నుండి కాపాడినట్టు అయింది.
\v 20 ఎందుకంటే హేరోదు యోహానుకు భయపడేవాడు. యోహాను దైవభక్తుడు, నీతిమంతుడు, పవిత్రమైనవాడు అని హేరోదుకు తెలుసు కనుక అతణ్ణి కాపాడుతూ వచ్చాడు. హేరోదు యోహాను మాటలు విన్న ప్రతీసారీ బెంబేలు పడేవాడు. అయినా అతని మాటలు వినడానికి ఇష్టపడేవాడు.
\s5
\p
\v 21 ఒక రోజు హేరోదియకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని అధికారులను, సేనానులను, గలిలయలోని గొప్పవారిని పిలిచి తన పుట్టిన రోజు విందు చేశాడు.
\v 22 హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిథుల్ని మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, "నీకు ఏది ఇష్టమో అడుగు, ఇస్తాను!
\s5
\v 23 అర్థ రాజ్యమైనా సరే!" . అని ఆవేశంతో ప్రమాణం చేశాడు.
\p
\v 24 ఆమె బయటకి వెళ్ళి తన తల్లితో, "నన్నేమి కోరుకోమంటావు?" అని అడిగింది. ఆమె, "బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో" అని చెప్పింది.
\v 25 వెంటనే ఆమె రాజు దగ్గరికి గబగబా వెళ్ళి, "బాప్తిసం ఇచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించండి, నాకు కావలసింది అదే" అని అడిగింది.
\s5
\v 26 రాజుకు చాలా దుఃఖం కలిగింది గానీ, తను తొందరపాటుగా చేసిన ప్రమాణం తనతో కూర్చుని ఉన్నవారంతా విన్నారు. ఇక ఆమె కోరికను తోసిపుచ్చలేక పోయాడు.
\v 27 అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకు రమ్మని భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి చంపాడు.
\v 28 అతని తలను ఒక పళ్ళెంలో పెట్టి, తీసుకు వచ్చి ఆమెకు హేరోదు తరుపున కానుకగా ఇచ్చాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది.
\v 29 యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి అతని శవాన్ని తీసుకుపోయి సమాధి చేశారు. ఇదంతా మనసులో వుండడం వల్ల హేరోదు యేసును గురించి అలా అన్నాడు.
\s5
\p
\v 30 పన్నెండుమంది అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు.
\v 31 వారి దగ్గరికి అనేకమంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి కాస్త విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, "మీరు నాతో రండి. మనం ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి, కొంత విశ్రాంతి తీసుకుందాం" అన్నాడు.
\p
\v 32 వాళ్లంతా పడవలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళారు.
\s5
\v 33 అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయనను, ఆయన శిష్యులను గుర్తుపట్టి, వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో గమనించి, వివిధ గ్రామాల నుంచి, చుట్టు పక్కల పట్టణ ప్రాంతాలనుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికన్నా ముందే ఆ ప్రదేశానికి చేరుకున్నారు.
\v 34 పడవలో యేసు, ఆయన శిష్యులు అక్కడికి చేరినప్పుడు, వారికంటే ముందే అక్కడకి చేరిన పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజలను చూసి ఆయనకు అమితమైన జాలి కలిగింది. అందుచేత ఆయన వారికి అనేక విషయాలు ఉపదేశించసాగాడు.
\s5
\p
\v 35 చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, "ఇది మనుషులెవారూ లేని తావు. ఇక్కడ ఎవరూ నివసించ గలిగే పరిస్థితి లేదు. ఇప్పటికే పొద్దుపోయింది.
\v 36 ఈ ప్రజలకు తినడానికి ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివెయ్యి" అన్నారు.
\s5
\v 37 అయితే యేసు వారితో "మీరే వారికి తినడానికి ఏమైనా పెట్టండి" అన్నాడు. అందుకు వారు ఆయనతో, "వీళ్ళకు ఆహారం పెట్టాలంటే రెండు వందల దేనారాలకు రొట్టెలు కొనాలి. అంటే ఒక మనిషి దాదాపు రెండు వందల రోజులు పని చేస్తే వచ్చే కూలీ అది. మనవల్లేమౌతుంది" అని ఆయనతో అన్నారు.
\v 38 ఆయన వారితో, "మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి" అన్నాడు. వారు వెళ్ళి చూసి, "ఐదు రొట్టెలు, రెండు కాల్చిన చిన్నచేపలు ఉన్నాయి" అన్నారు.
\s5
\p
\v 39 అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు.
\v 40 ప్రజలు పంక్తికి యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు.
\v 41 యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకొని ఆకాశం వైపు చూసి, దేవునికి ఆ ఆహారం నిమిత్తం కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపల్ని కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు.
\s5
\v 42 అందరూ తిని సంతృప్తి చెందారు.
\v 43 శిష్యులు మిగిలిన రొట్టె ముక్కల్ని, చేప ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు.
\v 44 ఆ రోజు అక్కడ రొట్టెలు, చేపలు తిన్న పురుషులు ఐదు వేల మంది. ఇంకా ఉన్న స్త్రీలనూ, పిల్లలనూ లెక్కబెట్టలేదు.
\s5
\p
\v 45 ఆ తరువాత యేసు తన శిష్యులను తనకన్నా ముందు గలలీ సరస్సు దాటి బేత్సయిదా అనే ఊరికి వెళ్ళమని చెప్పి వారిని పడవ ఎక్కించాడు.
\v 46 తరువాత తనతో ఉన్న జనసమూహాన్ని కూడా పంపేసి ఆయన ప్రార్థన చేసుకోడానికి కొండకు వెళ్ళాడు.
\v 47 చీకటి పడుతూ ఉన్న సమయానికి బెత్సయిదాకు బయలుదేరిన శిష్యులు ఉన్న పడవ సరస్సు నడిబొడ్డున ఉంది. యేసు మాత్రం ఒడ్డునే ఉండిపోయాడు.
\s5
\p
\v 48 ఎదురుగాలి విపరీతంగా వీస్తూ ఉండడం వల్ల శిష్యులు దాదాపు ఆ రాత్రంతా పడవను గాలికి ఎదురు నడపలేక, చాలా కష్టపడుతూ సరస్సు మధ్యలోనే ఉండిపోవడం యేసు చూశాడు. ఆయన తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా,
\v 49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకొని భయపడి గావుకేకలు వేశారు.
\v 50 వెంటనే యేసు వారితో "ధైర్యంగా ఉండండి. నేనే, భయపడకండి" అన్నాడు.
\s5
\v 51 ఆయన వారి దగ్గరికి వచ్చి, పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు మ్రాన్పడిపోయారు.
\v 52 ఎందుకంటే అంతకుముందే ఐదు రొట్టెలు, రెండు చేపల్ని ఎన్నో రెట్లుగా పెంచి, పంచిపెట్టిన అద్భుతాన్ని వారు చూశారు గానీ, ఆయన ఎంత శక్తిమంతుడో వారు గ్రహించలేక పోయారు. వారి హృదయాలు బండబారి పోయినందువల్ల రొట్టెలను, చేపలను గురించిన సంగతి వారు గ్రహించలేదు.
\s5
\p
\v 53 వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరి అక్కడ పడవ నిలిపారు.
\p
\v 54 వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు.
\v 55 ప్రజలు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు పరుగెత్తుకుంటూ వెళ్ళి యేసు వచ్చిన సమాచారం అందరికీ అందించారు. ప్రజలు రోగులను మంచాల మీద మోసుకుంటూ ఆయన ఉన్న చోటికి తీసుకొచ్చారు.
\s5
\v 56 యేసు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ పల్లెలో ప్రవేశించినా వారు రోగులను వీధుల్లో పడుకోబెట్టి, ఆయన వస్త్రాన్నయినా తాకనియ్యమని ఆయనను బతిమాలారు. ఆయనను తాకిన వారంతా బాగుపడ్డారు.
\s5
\c 7
\p
\v 1 ఒక రోజు యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులూ ధర్మశాస్త్ర పండితులూ యేసు చుట్టూ గుమికూడారు.
\s5
\v 2 వారు ఆయన శిష్యుల్లో కొందరు అశుద్ధమైన చేతులతో, అంటే ఆచార నియమం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం గమనించారు.
\v 3 పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దల సంప్రదాయం ప్రకారం తమ చేతుల్ని ఆచారరీతిగా కడుక్కోకుండా భోజనం చేయరు. అలా కడుక్కోవడానికి వీలుగా లేకపోతే భోజనం చేయడానికి నిరాకరిస్తారు.
\v 4 ప్రత్యేకంగా ఎప్పుడైనా బయటకు బజారుకు పోయి రిగి ఇంటికి రాగానే అలా ఒక పద్దతిగా కడుక్కునే ఆచారాన్ని పాటించకపోతే దేవుడు తప్పక కోపిస్తాడని వాళ్ళు నమ్మే వారు. ఎందుకంటే బజారుకెళ్ళి సరుకులు కొనుక్కుంటూ దేవుని దృష్టిలో అపవిత్రమైన దాన్ని దేన్నైనా ముట్టుకుని ఉండొచ్చు. యూదుల దృష్టిలో అపవిత్రమైనవి అని భావిస్తున్న పట్టీలో కొన్ని వస్తువులే కాదు కొంతమంది మనుషులు కూడా ఉన్నారు.
\s5
\v 5 ఆరోజు పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు, యేసు శిష్యులు సాంప్రదాయాన్ని పాటించకపోవడంతో, "మీ శిష్యులు పెద్దల సంప్రదాయాన్ని పాటించకుండా అశుద్ధమైన చేతులతో ఎందుకు భోజనం చేస్తున్నారు?" అని యేసును అడిగారు.
\s5
\v 6 యేసు వారితో, "ఈ ప్రజలు మాటలతో నన్ను గౌరవిస్తారు గానీ,
\q1 వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది.
\q1
\v 7 వారు మానవ కల్పితమైన నియమాలను
\q1 దేవుని ఉపదేశంగా బోధిస్తారు కాబట్టి వారి ఆరాధన వ్యర్థం, అని మీ పూర్వికులను యెషయా గద్దించాడు. ఇప్పుడు మీలో కపట వేషధారులైన వారి గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికిన ఆ మాటలు చక్కగా అతికినట్టు సరిపోయాయి.
\s5
\p
\v 8 మీరూ మీ పూర్వీకుల్లాగే దేవుని ఆజ్ఞల్ని తోసిపుచ్చి మనుషులు నేర్పించిన సంప్రదాయాలకు పెద్ద పీట వేశారు.
\v 9 మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరడంలో మీరు సిద్ధహస్తులు."
\p
\v 10 "ఉదాహరణకి మోషే, మీ తల్లిదండ్రుల్ని గౌరవించమనీ, తల్లిని తండ్రిని దూషించిన వారికి శిక్ష మరణదండన అనీ దేవుని ఆజ్ఞగా రాశాడు కదా.
\s5
\v 11 కానీ మీరైతే, ఒక వ్యక్తి తన తల్లితో, తండ్రితో "అయ్యో, మీకు సాయం చేయాలని నాకు ఉంది గానీ, అదంతా కొర్బాన్ (అంటే దైవార్పితం, దేవుడికి మొక్కుకున్నాను)" అనేస్తే ఇక మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞ పాటించనక్కర్లేదు, అని బోధిస్తున్నారు.
\v 12 పైగా ఇంక ఆ వ్యక్తి తన తల్లిదండ్రుల కోసం ఏమీ చేయనక్కర లేదని కూడా చెబుతారు. దేవుడికి మొక్కుకున్నాను అని చెబితే చాలు, తల్లి, తండ్రులకు చేయవలసినదంతా ఎగ్గొట్టొచ్చు అని నేర్పిస్తున్న మీరు,
\v 13 మీ పెద్దల సంప్రదాయాలను పాటించే ముసుగులో దేవుని ఆజ్ఞ మీరుతున్నారు. ఇలాంటివి మరెన్నో మీరు చేస్తున్నారు" అన్నాడు.
\s5
\p
\v 14 అప్పుడు యేసు ప్రజలందరినీ తన దగ్గరికి రమ్మని పిలిచి, "నేను చెప్పేది ప్రతి ఒక్కరూ విని జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
\v 15 మనుషులు తింటున్న పదార్థాలను బట్టి దేవుడు వారిని మైలగా, శుచిగా, లేక భ్రష్టుడుగా, పవిత్రుడుగా ఎంచడు. అంటే బయట నుండి మనిషి లోపలికి వెళ్ళేవి ఏవీ అతన్ని అపవిత్రం చేయవు.
\v 16 మనిషిలోనుండి బయటకు వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది" అన్నాడు.
\s5
\p
\v 17 ఆయన జనసమూహన్ని విడిచి ఒక ఇంట్లో ప్రవేశించిన తరువాత ఆయన శిష్యులు ఇందాక మాట్లాడిన ఉపదేశం గురించి వివరంగా చెప్పమని ఆయనను అడిగారు.
\p
\v 18 ఆయన వారితో, "అరే, మీకు ఇంకా అర్థం కాలేదా?" బయట నుండి మనిషిలోకి వచ్చేది అతన్ని అపవిత్రం చేయదు. దేవుడు దాన్నిబట్టి అతణ్ణి అపవిత్రుడనో, పవిత్రుడనో ఎంచడు.
\v 19 తిన్నదేదీ మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతుంది” అని చెప్పాడు. (ఈ విధంగా చెప్పడం ద్వారా అన్ని ఆహార పదార్ధాలూ తినడానికి పనికొచ్చేవే అనీ, వాటిని బట్టి దేవుడు ఒకణ్ణి చేరదీసేది కానీ, దూరంగా పెట్టేది కానీ లేదు అని యేసు సూచించాడు).
\s5
\p
\v 20 ఆయన మళ్ళీ అన్నాడు, "మనిషి లోపలి నుండి బయటకు వచ్చేవే, అంటే అతని ఆలోచనలూ, ఉద్దేశాలు, వాటినిబట్టి చేసే పనులు అతన్ని దేవుడి దృష్టిలో అపవిత్రం చేస్తాయి.
\v 21 ఎందుకంటే మనిషి హృదయంలో నుండి చెడ్డ తలంపులు బయటకు వచ్చి ఆ మనిషిచేత దొంగతనాలు చేయిస్తాయి, లైంగికమైన అవినీతి పనులు చేయిస్తాయి, ఆవేశంతో హత్యలు చేయిస్తాయి."
\p
\v 22 "అంతమాత్రమే కాక అంతరంగంలోని చెడ్డ తలంపులవల్లే మనిషి వ్యభిచారం చేయడానికి సిగ్గుపడక పోగా ఆ కామవికారాలనుబట్టి అతిశయిస్తాడు. దురాశతోటి లంచాలు ఆశించడమే కాక పరాయి సొమ్ము మీద కన్నేస్తాడు. ఎదుటివారి నాశనం కోరినట్టుగా, నేను తప్ప ఎవడూ బాగుపడకూడదు అన్నట్టుగా దుర్మార్గతలు, మోసాలు, అసూయలు, అహంభావం, మూర్ఖత్వం, ఎదుటివారిని చిన్న చూపు చూడడం, వారిని దూషించడం మరెన్నో ఇలాంటివి బయటకు వస్తాయి.
\v 23 ఇవన్నీ లోపలి నుండి బయటకు క్రియల రూపంలో వచ్చి మనిషిని దేవుని దృష్టిలో అపవిత్రం చేస్తాయి."
\s5
\p
\v 24 యేసు తన శిష్యులతో గలలీ ప్రాంతం విడిచి తూరు, సీదోను ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్ళాడు. తాను అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదని ఆయన ఉద్దేశం. కాని, యేసు వారిదగ్గరకు వచ్చినట్టుగా వారు పసిగట్టేసారు. ఆయన వారికి కనిపించకుండా ఉండలేకపోయాడు.
\p
\v 25 ఒక స్త్రీ యేసు గురించి విని, వచ్చి ఆయన కాళ్ళపై పడింది. ఆమె కూతురికి దయ్యం పట్టింది.
\v 26 ఈమె సిరియాకు చెందిన ఫెనికయా ప్రాంతంలో పుట్టిన గ్రీసు దేశస్తురాలు. తన కూతురులో నుండి ఆ దయ్యాన్ని వదిలించమని యేసును బతిమలాడింది.
\s5
\v 27 అందుకు యేసు ఆమెతో, "మొదటగా పిల్లలు తృప్తిగా తినాలి. తల్లి వండిన ఆహారం పిల్లలకు కడుపునిండా పెట్టకుండా తీసి కుక్క పిల్లలకు వేయడం భావ్యమా?" అన్నాడు.
\v 28 అందుకామె, "ఔను ప్రభూ, అది నిజమే గాని, ఆ ఇంటి కుక్కలు కూడా బల్లకింద ఉండి పైనుంచి పిల్లలు పడేసిన ముక్కలు తింటాయి కదా" అని జవాబు ఇచ్చింది
\s5
\v 29 అప్పుడాయన ఆమెతో, "ఈ మాట చెప్పినందువల్ల ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళవచ్చు. నీ కూతురిని దయ్యం వదలిపోయేలా చేశాను" అన్నాడు.
\v 30 ఆమె ఇంటికి వెళ్ళి తన కూతురు మంచంపై ప్రశాంతంగా పడుకుని ఉండడం చూసింది. దయ్యం ఆమెను వదలిపోయింది.
\s5
\p
\v 31 యేసు, ఆయన శిష్యులు తూరు నుండి బయలుదేరి, సీదోనుకు ఉత్తర దిశగా బయలుదేరి, కొంత దూరం పోయాక అక్కడనుండి తూర్పుకు తిరిగి దెకపొలి అనే పది గ్రామాలున్న మండల ప్రాంతం గుండా వెళుతూ దక్షిణాన గలిలయ సముద్రం దగ్గరగా ఉన్న పట్టణాలను చేరుకున్నారు.
\p
\v 32 అక్కడ కొందరు చెవుడు, నత్తి ఉన్న మనిషిని ఆయన దగ్గరికి తీసుకు వచ్చి అతని మీద చెయ్యి ఉంచి స్వస్థపరచమని వేడుకున్నారు.
\s5
\v 33 యేసు అతన్ని జనంలో నుండి పక్కకి తీసుకు వెళ్ళి మొదట తన చేతి వేళ్ళను అతని రెండు చెవుల్లోనూ ఉంచాడు. తరువాత తన చేతి వేళ్ళపై ఉమ్మి వేసుకుని అతని నోరు తెరవమని నాలుకను తన వేళ్ళతో తాకాడు.
\v 34 అప్పుడు ఆయన ఆకాశం వైపు తల ఎత్తి నిట్టూర్చి, "ఎప్ఫతా" అని అతనితో అన్నాడు. ఆ మాటకు వారి భాషలో "తెరుచుకో" అని అర్థం.
\v 35 వెంటనే అతని చెవులు తెరుచుకున్నాయి. చక్కగా విన సాగాడు. అతని నాలుక సడలి తేటగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా అతణ్ణి పీడించిన జబ్బు వదిలిపోయింది.
\s5
\v 36 ఆ సంగతి ఎవ్వరితోనూ చెప్పవద్దని యేసు అతనికి, అతని చుట్టూ ఉన్నవారికీ ఆజ్ఞాపించాడు కాని, ఎంత కఠినంగా వారికి ఆజ్ఞాపించాడో అంత ఎక్కువగా వారు దాన్ని చాటించారు
\v 37 అది విన్నవారందరూ అంతులేని ఆశ్చర్యంతో "ఈయన చాలా అద్భుతాలు చేశాడు, అంతే కాకుండా అన్నిటినీ చక్కపరుస్తున్నాడు. చెవిటివారు వినగలిగేలా చేస్తున్నాడు, మూగ వారు మాట్లాడేలా చేస్తున్నాడు" అని చెప్పుకున్నారు.
\s5
\c 8
\p
\v 1 ఆ రోజుల్లో ఒకసారి ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న యేసు చుట్టూ పెద్ద జనసమూహం గుమిగూడారు. రెండు రోజులపాటు వాళ్ళు ఆయన మాటలు వింటూ వుండిపోయారు. మూడోరోజు వాళ్ళదగ్గర తినడానికి ఇంకేమీ లేదని యేసు గమనించాడు. అప్పుడాయన తన శిష్యులను దగ్గరికి పిలిచి,
\v 2 "ఈ ప్రజల మీద నాకు జాలి కలుగుతున్నది. వారు ఇప్పటికే మూడు రోజుల నుండి నా దగ్గర ఉన్నారు. తినడానికి వారి దగ్గర ఏమీ లేదు.
\v 3 వారిని ఇప్పుడు పంపివేస్తే దారిలో సొమ్మసిల్లి పోవచ్చు, వారిలో కొందరు చాలా దూరం నుండి కూడా వచ్చారు" అన్నాడు.
\p
\v 4 యేసు మనసు వారికి అర్థం అయింది. వాళ్ళందరికీ భోజనం ఏర్పాట్లు చూడమని ఆయన అంటున్నాడని తెలిసి శిష్యులలో ఒకడు "ఇంత పెద్ద గుంపుకి ఆహారం అమర్చడం మన వల్ల అయ్యే పని కాదు. పైగా ఈ చుట్టుపక్కల ఊళ్లు కూడా ఏమీ లేవు" అన్నారు.
\s5
\v 5 "మీ దగ్గర రొట్టెలు వుండాలి కదా, ఎన్ని ఉన్నాయి?" అని శిష్యుల్ని ఆయన తిరిగి అడిగాడు. "ఏడు చిన్న రొట్టెలు ఉన్నాయి" అని వారు జవాబిచ్చారు.
\p
\v 6 యేసు ఆ ప్రజలందరినీ నేల మీద కూర్చోమని ఆజ్ఞాపించాడు. ఆ ఏడు రొట్టెలను చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞత చెప్పి వాటిని ముక్కలు చేసి శిష్యులకిచ్చి వారందరికీ పంచమన్నాడు. శిష్యులు అలాగే చేశారు.
\s5
\v 7 వారి దగ్గర కొన్నివండిన చిన్న చేపలు కూడా ఉన్నట్టు తరువాత శిష్యులు గమనించి వాటిని కూడా యేసు చేతిలో పెట్టారు. ఆయన వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని అందరికీ పంచమని శిష్యులకు ఇచ్చాడు.
\v 8 ఆ ప్రజలంతా తృప్తిగా తిన్న తరువాత మిగిలిన ఆహారాన్ని ఏడు పెద్ద గంపల నిండా నింపారు.
\v 9 తిన్నవారిలో పురుషులే సుమారు నాలుగు వేలమంది.
\p యేసు వారిని పంపివేసి,
\v 10 వెంటనే తన శిష్యులతో కలసి, పడవ ఎక్కి గలలీ సరస్సు చుట్టూ తిరిగి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.
\s5
\v 11 అప్పుడు కొద్దిమంది పరిసయ్యులు వచ్చి యేసుతో వాదించడం మొదలుపెట్టారు. ఆయనను దేవుడు పంపించాడు అని నమ్మడానికి గుర్తుగా తమకోసం ఆకాశం నుండి ఒక సూచన చూపమని అడిగారు.
\v 12 దానికి ఆయన తనలో తాను పెద్దగా నిట్టూర్చి, "ఈ తరం వారు అద్భుతాలు చేయమని ఎందుకు అడుగుతున్నారు? మీతో కచ్చితంగా చెప్తున్నాను, ఈ తరానికి ఏ సూచనా చూపడం జరగదు" అని వారితో చెప్పాడు.
\p
\v 13 తరవాత ఆయన వారిని విడిచిపెట్టి, తన శిష్యులతో కలసి మళ్ళీ పడవ ఎక్కి గలలీ సరస్సు అవతలి ఒడ్డు చేరుకున్నాడు.
\s5
\v 14 శిష్యులు తమతో రొట్టెలు తెచ్చుకోవడం మర్చిపోయారు. వారి దగ్గర పడవలో ఒక్క రొట్టె తప్ప ఏమీ లేదు.
\v 15 యేసు వారితో, "పరిసయ్యులకు, హేరోదుకు సంబంధించిన రొట్టె పిండిని పొంగజేసే ఈస్ట్ గురించి జాగ్రత్తగా ఉండండి" అన్నాడు.
\s5
\p
\v 16 శిష్యులు, ఆయన అన్న మాటను అర్థం చేసుకోకుండా "మన దగ్గర రొట్టెలు లేవని ఇలా అంటున్నాడా?" అని ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
\v 17 అది కనిపెట్టి యేసు, "రొట్టెలు లేవనే విషయం ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కాలేదా? మీరు గ్రహించలేదా? మీ బుద్ధి మందగించిందా? ఆలోచించరా?
\s5
\v 18 మీరు కళ్ళుండి కూడా చూడరా? చెవులుండి కూడా వినరా? మీకు గుర్తు లేదా?
\v 19 ఐదు రొట్టెలు విరిచి ఐదు వేల మందికి నేను పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరు ఎన్ని పెద్ద గంపలు నింపారు?" అని అడిగాడు. వారు, "పన్నెండు” అని జవాబు చెప్పారు.
\s5
\v 20 "మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని పెద్ద గంపలు నింపారు?" అని అడిగినప్పుడు వారు, "ఏడు గంపల నిండా" అని జవాబు చెప్పారు
\v 21 ఆయన వారితో, "భోజనం గురించి ఎప్పటికీ దిగులు పడక్కర్లేదన్న సంగతి ఇంకా మీకు అర్థం కాలేదా? నాకు చాలా నిరుత్సాహంగా ఉంది" అన్నాడు.
\s5
\p
\v 22 యేసు, ఆయన శిష్యులు బేత్సయిదా అనే పట్టణానికి వచ్చారు. అక్కడి వారు కొందరు ఒక గుడ్డివాణ్ణి యేసు దగ్గరికి తీసుకు వచ్చారు. అతని మీద చెయ్యి ఉంచి బాగు చెయ్యమని వేడుకున్నారు.
\v 23 యేసు ఆ గుడ్డివాడి చేయి పట్టుకుని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. అతని కళ్ళ మీద ఉమ్మివేసి, అతని మీద చేతులుంచి, "నీకు ఏమైనా కనిపిస్తుందా?" అన్నాడు.
\s5
\v 24 ఆ గుడ్డివాడు పైకి చూస్తూ, "మనుషులు అస్పష్టంగా నడుస్తున్న చెట్ల లాగా కనిపిస్తున్నారు" అన్నాడు.
\v 25 అప్పుడు ఆయన మళ్ళీ అతని కళ్ళపై తన చేతులుంచాడు. అప్పుడా మనిషి కళ్ళు తెరుచుకొని బాగుపడి అన్నిటినీ స్పష్టంగా చూడగలిగాడు.
\v 26 యేసు అతనిని పంపివేస్తూ, "నువ్వు ఊరిలోకి వెళ్ళవద్దు, నీ ఇంటికి వెళ్ళిపో" అని అతనితో చెప్పాడు.
\s5
\p
\v 27 యేసు ఆయన శిష్యులతో కలిసి ఫిలిప్పు కైసరయ పట్టణం పరిసర గ్రామాలకు వెళ్ళాడు. దారిలో ఆయన, "నేను ఎవరినని ప్రజలు చెప్పుకుంటున్నారు?" అని తన శిష్యులను అడిగాడు.
\v 28 అందుకు వారు, "బాప్తిసం ఇచ్చే యోహానని కొందరూ, ఏలీయా అని కొందరూ, పూర్వం ఉన్న ప్రవక్తల్లో ఒకడు అని కొందరూ అంటున్నారు" అని చెప్పారు.
\s5
\v 29 "అయితే నేనెవరినని మీరు అనుకుంటున్నారు?" అని ఆయన వారిని అడిగాడు. దానికి జవాబుగా పేతురు, "నువ్వు క్రీస్తువి!" అన్నాడు.
\p
\v 30 అప్పుడు ఆయన తన గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వారిని హెచ్చరించాడు.
\s5
\v 31 ఆ తరువాత యేసు వారితో ఇలా చెప్పడం మొదలు పెట్టాడు, "మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు భరించాలి. పెద్దలు, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితుల తిరస్కారానికి గురై మృత్యువాత పడాలి. ఆయన మూడు రోజుల తరువాత సజీవంగా బతికి వస్తాడు."
\p
\v 32 యేసు ఈ విషయం చాలా స్పష్టంగానే చెప్పాడు. అయితే పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, పక్కకు తీసుకు వెళ్ళి అలా మాట్లాడినందుకు మందలించాడు.
\s5
\v 33 కాని యేసు వెనక్కి తిరిగి తన శిష్యులను చూసి, పేతురుతో, "సైతాను నీచేత ఇలా మాట్లాడిస్తున్నాడు. అలాంటి ఆలోచనలు మానుకో. దేవుడు కోరుకున్నట్టు కాక మనుషులు కోరుకుంటున్నట్టు నన్ను చావవద్దని అడుగుతున్నావు. నా వెనక్కి పో! మనుషుల సంగతుల పైనే గాని దేవుని సంగతుల మీద నీకు మనసు లేదు” అని గద్దించాడు.
\p
\v 34 తరువాత యేసు తన శిష్యులను, ప్రజలను దగ్గరికి పిలిచి వారితో ఇలా అన్నాడు. "ఎవరైనా నా శిష్యుడిగా నా వెంట రావాలనుకుంటే, ఎలాగోలాగా ఇబ్బంది లేకుండా బతికితే చాలు అనుకోకూడదు. తప్పు చేసినవాడు కొరడా దెబ్బలు తింటూ తనకి దాపురించిన మరణశిక్ష అనుభవించడానికి, తన మీద ఉంచిన సిలువను మోసుకుంటూ ఎలా నడుస్తాడో అలా నాతో నడవాలి.
\s5
\v 35 ఎందుకంటే నన్ను హింసించినట్టే నా వారిని మనుషులు హింసించడం మొదలు పెట్టినపుడు, తన ప్రాణాన్ని దక్కించుకోవాలని "నేను యేసుకు చెందిన వాణ్ణి కాదు అని చెప్పి తప్పించుకో జూసేవాడు దాన్ని నిజంగా పోగొట్టుకుంటాడు. కాని నా కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయని వాడు, లేక కోల్పోయేవాడు దాన్ని దక్కించుకుంటాడు. అతడు నాతో నిత్యం జీవిస్తాడు."
\p
\v 36 "ఒక మనిషి నిత్యజీవాన్ని సంపాయించుకోకుండా ప్రపంచమంతా సంపాదించి, చివరికి తన ప్రాణాన్నే పోగొట్టుకుంటే ఆ వ్యక్తికి ఏం లాభం?
\v 37 ఒకడు తన ప్రాణాన్ని తిరిగి పొందడానికి, లేక నిత్యజీవాన్ని సంపాయించుకోవడానికి దేవుడికి ఏమి ఇవ్వగలడు? అలా ఇవ్వడానికి వాడి దగ్గర ఏమీ లేదు. జాగ్రత్తగా ఆలోచించండి.
\s5
\v 38 దేవునికి వ్యతిరేకంగా వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడి ఆయన వాళ్ళం కాదు, ఆయనెవరో మాకు తెలీదు అంటే మనుష్య కుమారుడు కూడా తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు అలాంటి వారి విషయంలో సిగ్గుపడతాడు, వారెవరో నాకు తెలీదు అంటాడు."
\s5
\c 9
\p
\v 1 ఆయన తన శిష్యులతో, "నేను చెప్పేది జాగ్రతగా వినండి. దేవుడు రాజుగా తానే తన గొప్ప శక్తిని మీలో కొందరికి ఇప్పుడు చూపిస్తాడు. మీరు చనిపోక ముందే ఆయన చేసే ఈ పనిని మీరు చూస్తారు" అన్నాడు.
\p
\v 2 ఆరు రోజుల తరువాత యేసు పేతురును, యాకోబును, యాకోబు సోదరుడు యోహానును ఒక ఎతైన కొండపైకి తీసుకు వెళ్ళాడు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు, ఆయన వారి ఎదుట రూపాంతరం చెందాడు.
\v 3 ఆయన బట్టలు కళ్ళు మిరుమిట్లు గొలిపే తెల్లని రంగులోకి మారాయి. ఈ లోకంలో ఎవరు ఉతికినా కూడా కానంత తెల్లగా ఆయన బట్టలు మారాయి.
\s5
\v 4 చాలాకాలం క్రితం జీవించిన ఏలీయా, మోషే వారికి కనిపించారు. వారు యేసుతో మాట్లాడుతూ ఉన్నారు.
\p
\v 5 కొంతసేపటికి పేతురు తేరుకుని "బోధకా, మనం ఇక్కడ ఉంటే అద్భుతంగా ఉంటుంది. మీరు అనుమతిస్తే మూడు కుటీరాలను కడతాము. ఒకటి మీకు, ఒకటి మోషేకు, మరొకటి ఏలీయా కోసం" అన్నాడు.
\v 6 అతను ఏదో చెప్పాలనుకుని ఇలా చెప్పాడు, కానీ అసలు ఏమి చెప్పాలో అతనికి తెలియదు. అతడు, మిగిలిన ఇద్దరు శిష్యులు జరిగింది చూసి భయపడిపోయారు.
\s5
\v 7 అప్పుడు మెరుస్తున్న మేఘం ఒకటి వారికి కనిపించి, వారిని కమ్ముకుంది. ఆ మేఘంలో నుండి దేవుడు వారితో "ఈయన నేను ఎంతో ప్రేమించే నా కుమారుడు. కాబట్టి ఆయన మీతో చెప్పే మాటలు వినండి" అన్నాడు.
\v 8 వారు ముగ్గురూ అయోమయంగా చుట్టూ చూస్తుంటే, అకస్మాత్తుగా యేసు ఒక్కడే వారికి కనిపించాడు. అక్కడ ఆయనతో ఇంక ఎవరూ లేరు.
\s5
\p
\v 9 వారు కొండ దిగివస్తున్నప్పుడు, యేసు వారితో ఇప్పుడు ఇక్కడ తనకు జరిగింది ఎవరికీ చెప్పవద్దని చెప్పాడు. ఆయన వారితో, తాను అంటే మనుష్యకుమారుడు చనిపోయి, తిరిగి లేచిన తరువాత దీన్ని బయట పెట్టవచ్చని చెప్పాడు.
\v 10 కాబట్టి వారు చాలా కాలం ఇతరులకు ఈ విషయం చెప్పలేదు. కానీ ఆయన చనిపోయి తిరిగి లేస్తానని చెప్పినదాన్ని గురించి తమలోతాము చర్చించుకున్నారు.
\s5
\p
\v 11 వారు యేసును, "క్రీస్తు రావడానికి ముందు, ఏలీయా తిరిగి వస్తాడని మన ధర్మశాస్త్రాన్ని బోధించేవారు చెబుతున్నారేమిటి?" అని అడిగారు.
\v 12 అందుకు యేసు "అది నిజమే, దేవుడు అంతా మొదట నిర్ణయించిన ప్రకారమే చేశాడు. అలానే ఏలీయా మొదట వచ్చి అంతా సరిచేస్తాడని మాట ఇచ్చాడు. అలాగే ఇప్పటికే ఏలీయా వచ్చాడు. మన మతపెద్దలు గ్రంథాల్లో రాసినట్లే ఈ ప్రజలు అతడితో తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. కాని మనుష్యకుమారుడైన నన్ను గురించి అదే గ్రంథాల్లో ఇంకా ఎక్కువగా రాశారు. ప్రజలు నన్ను నిరాకరిస్తారని, నేను అనేక బాధలు పొందాలని ఆ గ్రంథాల్లో నా గురించి రాశారు" అన్నాడు.
\p
\v 13 ఆయన ఆ ముగ్గురితో కలిసి మిగిలిన శిష్యులు ఉన్న చోటికి వచ్చాడు.
\s5
\v 14 వారి చుట్టూ పెద్ద జనసమూహం ఉంది. కొందరు యూదా ధర్మశాస్త్ర బోధకులు వారితో వాదిస్తున్నారు.
\v 15 ఆయన రావడం చూసి ఆ జనసమూహం ఆశ్చర్యపోయారు. వెంటనే వారందరు పరుగెత్తుకెళ్ళి ఆయనకు నమస్కరించారు.
\p
\v 16 ఆయన వారితో, "మీరు దేన్ని గురించి వాదిస్తున్నారు?" అని అడిగాడు.
\s5
\v 17 ఆ జనసమూహంలో ఒకడు ఆయనతో, "బోధకా నా కుమారుడిలో దురాత్మ చేరి, అతణ్ణి మాట్లాడకుండా చేస్తుంది. నా కొడుకును బాగు చేస్తారని మీ దగ్గరికి తీసుకువచ్చాను.
\v 18 తనను దురాత్మ పట్టినప్పుడు వాడు బిగదీసుకుపోతున్నాడు. పళ్ళు కొరుక్కుంటున్నాడు. నోట్లోంచి చొంగ కారుతుంది. దయ్యం అతణ్ణి కింద పడేస్తుంది. నీ శిష్యుల్ని ఆ దురాత్మను వదిలించమని అడిగాం, కాని వారివల్ల కావడం లేదు.
\p
\v 19 అప్పుడు యేసు, "విశ్వాసం లేని మనుషులారా, నేను చాలాకాలం నుండి మీతో ఉంటున్నా కూడా నేను చేస్తున్న దానిని మీరు చేయలేకపోతున్నారు. మీరు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఆ పిల్లవాణ్ణి నా దగ్గరకు తీసుకు రండి" అన్నాడు.
\s5
\v 20 అప్పుడు యేసు దగ్గరికి ఆ పిల్లవాణ్ణి తెచ్చారు. ఆ దురాత్మ యేసును చూసీ చూడడం తోటే వాణ్ణి విలవిల్లాడిస్తూ కింద పడవేసింది. వాడు నేలపై గిలగిలకొట్టుకుంటూ, నోట్లోనుంచి చొంగ కార్చాడు.
\v 21 యేసు ఆ అబ్బాయి తండ్రితో, "ఎంత కాలం నుంచి ఇలా ఉంది?" అని అడిగాడు. అతడు "చిన్నతనం నుంచే ఉంది.
\v 22 అంతే కాదు ఈ దురాత్మ చాలాసార్లు వాడిని చంపాలని మంటల్లోకి, నీళ్ళలోకి తోసేస్తుంది. నీ వల్లనైతే మాపై దయుంచి, సహాయం చెయ్యి" అన్నాడు.
\s5
\p
\v 23 యేసు "నేను చేయగలను. తనని ఎవరైతే నమ్ముతారో, వారికోసం ఏదైనా దేవుడు చేస్తాడు" అన్నాడు.
\v 24 వెంటనే ఆ పిల్లవాడి తండ్రి, "నువ్వు చేయగలవని నేను నమ్ముతున్నాను, కానీ గట్టి నమ్మకం లేదు. నా నమ్మకం బలపడేలా నాకు సహాయం చెయ్యి" అని గట్టిగా అరిచాడు.
\p
\v 25 యేసు జనసమూహం ఇంకా పెరగడం గమనించాడు. ఆయన ఆ దురాత్మను గద్దించాడు. "ఓ దురాత్మా, ఈ పిల్లవాడికి మూగ, కుంటితనం నీవల్లే వచ్చింది. అతడిలో నుండి బయటకు రా! మళ్ళీ ఎప్పుడూ ఆతణ్ణి పీడించడానికి వీల్లేదని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను" అన్నాడు.
\s5
\v 26 ఆ దురాత్మ బిగ్గరగా కేకలు పెడుతూ ఆ అబ్బాయిని నేల మీద పడి తన్నుకునేలా చేసి విడిచిపెట్టింది. ఆ పిల్లవాడు కదలటం లేదు. శవంలా పడి ఉన్నాడు. కాబట్టి చాలా మంది, "పిల్లవాడు చనిపోయాడు" అన్నారు.
\v 27 అయితే యేసు ఆ పిల్లవాడి చేయి పట్టుకుని లేపాడు. అప్పుడు ఆ పిల్లవాడు లేచి నిల్చున్నాడు.
\s5
\p
\v 28 తరువాత యేసు, ఆయన శిష్యులు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, వారు ఆయన్ని, "మేమెందుకు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాం?" అని అడిగారు.
\v 29 అప్పుడు ఆయన వారితో "ఉపవాసం, ప్రార్థనల ద్వారా దేవుడు మీకు ఇచ్చే శక్తి ద్వారానే ఇలాటి దురాత్మలను మీరు వెళ్లగొట్టగలరు. అంతే తప్ప వాటిని వెళ్లగొట్టటానికి మరో మార్గం అంటూ లేదు" అన్నాడు.
\s5
\p
\v 30 తరువాత యేసు ఆయన శిష్యులు ఆ ప్రాంతం వదిలి, గలిలయ ప్రాంతం మీదుగా ప్రయాణించారు. యేసు తాను ఎక్కడ ఉండేదీ ఎవరికి తెలియనియ్యలేదు.
\v 31 ఆయన తన శిష్యులకు బోధించడానికి తగినంత సమయం కోసం చూస్తున్నాడు. ఆయన వారితో, "ఏదో ఒక రోజు మనుష్యకుమారుడైన నన్ను నా శత్రువులు నిర్బంధిస్తారు. ఇతరజాతివారి చేతికి నన్ను అప్పగిస్తారు. వాళ్ళు నన్ను చంపుతారు. కాని చనిపోయి మూడో రోజు నేను తిరిగి బ్రతుకుతాను" అన్నాడు.
\v 32 ఆయన చెబుతున్న విషయాలు వారికి ఆర్థం కాలేదు. వాటి అర్థం ఏమిటో ఆయన్ని అడగటానికి వారు భయపడ్డారు.
\s5
\p
\v 33 అప్పుడు యేసు ఆయన శిష్యులు తిరిగి కపెర్నహోముకు వచ్చారు. వారందరూ ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆయన వారిని, "మనం దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు దేన్ని గురించి మాట్లాడుకుంటున్నారు?" అని అడిగాడు.
\v 34 వారు జవాబు చెప్పలేక మిన్నకుండిపోయారు. ఎందుకంటే ప్రయాణంలో వారు ఒకరితో ఒకరు వాదించుకునే వాటిల్లో ఒక్కటైనా ముఖ్యమైనది లేదు. అందుకే వారు జవాబు చెప్పటానికి సిగ్గు పడ్డారు.
\p
\v 35 ఆయన కూర్చుని తన పన్నెండు మంది శిష్యులను దగ్గరకు రమ్మన్నాడు. అప్పుడు వారితో, "దేవుడు తనని ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించాలి అని కోరుకుంటే, మొదటగా తనని తాను అందరికంటే తక్కువవాడుగా భావించుకోవాలి. అతడు అందరికీ సాయపడాలి."
\s5
\v 36 అయన ఒక పిల్లవాణ్ణి వారి మధ్య నిలబెట్టాడు. ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని వారితో ఇలా అన్నాడు.
\v 37 "చిన్నపిల్లలు నన్ను ప్రేమిస్తారు కాబట్టి నన్ను స్వీకరిస్తారు. వీళ్ళలాగా ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, వాళ్ళు నన్ను స్వీకరించగలరని దేవుడు భావిస్తాడు. అంతేకాకుండా ఎవరైతే నన్ను పంపించాడో, ఆ దేవుణ్ణి వాళ్ళు నిజంగా స్వీకరించగలరు" అన్నాడు.
\s5
\p
\v 38 యేసుతో యోహాను, "బోధకా, ఎవరో ఒకతను దురాత్మలను వెళ్ళగొట్టడం మేము చూశాము. అతనికి ఆ విధంగా చేసే అధికారం నీ నుంచి వచ్చినట్టు చెబుతున్నాడు. ఐతే అతణ్ణి అలా చేయకుండా మేము అడ్డుపడ్డాము. ఎందుకంటే అతడు నీ శిష్యుల్లో ఒకడు కాదు" అని చెప్పాడు.
\v 39 యేసు, "అతణ్ణి ఆపవద్దు. నా పేరుతో అతడు గొప్ప పనులు చేస్తున్నప్పుడు, అది నాకు మంచి పేరే తెచ్చిపెడుతుంది గదా.
\s5
\v 40 మనల్ని వ్యతిరేకించకుండా మన ఉద్దేశాలను నెరవేరుస్తున్న వారు మనవారే కదా.
\v 41 క్రీస్తునైన నన్ను అనుసరించే మీకు తాగడానికి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా కూడా, అలాటి వారికి దేవుడు తప్పకుండా తగిన బహుమతి ఇస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 42 ఇంకా "నాపై నమ్మకం ఉంచినవాళ్ళు, సమాజంలో చిన్నపిల్లల్లాగా అల్పమైన వాళ్ళు సైతం పాపం చేయడానికి ఎవరైతే కారణం అయ్యారో వారిని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు. నన్ను నమ్ముకున్న వారిచేత పాపం చేయించి శిక్ష పొందడం కంటే, మెడకు పెద్దరాయి కట్టుకుని సముద్రంలో పడడం ఎంతో మేలు.
\v 43 కాబట్టి పాపం చెయ్యడానికి నీ చేతుల్లో ఒక దాన్ని ఉపయోగించ దలుచుకుంటే దాన్ని నరికి పారెయ్యడం మంచిది. పరలోకంలో శాశ్వతకాలం జీవించడం కోసం ఈ లోకంలో ఒక చేతితోనే జీవించవలసి వచ్చినా కూడా పర్వాలేదు.
\v 44 నువ్వు పాపం చేస్తే దేవుడు నీ శరీరం మొత్తాన్ని నరకంలో పడవేస్తాడు. అది ఎప్పటికీ ఆరని నరకాగ్ని" అన్నాడు.
\s5
\p
\v 45 "పాపం చెయ్యడానికి నీ కాళ్ళలో ఒక దాన్ని ఉపయోగించ దలుచుకుంటే దాన్ని నరికి పారెయ్యడం మంచిది. పరలోకంలో శాశ్వతకాలం జీవించడం కోసం ఈ లోకంలో ఒంటి కాలితో జీవించవలసి వచ్చినా ఫర్వాలేదు.
\v 46 కాని నువ్వు పాపం చేస్తే దేవుడు నీ మొత్తం శరీరాన్ని నరకంలో పడవేస్తాడు గదా."
\s5
\p
\v 47 "నువ్వు కంటితో చూసేది ఏదైనా నిన్ను పాపం చేయమని ప్రేరేపిస్తుందనుకుంటే వాటిని చూడడం మానివెయ్యి. పాపం చేయకుండా ఉండాలంటే అవసరమైతే నీ కన్ను పీకి పారవెయ్యి. నువ్వు రెండు కళ్ళతో నరకంలో పడటం కంటే, దేవుని ఆధిపత్యాన్ని ఒప్పుకుని ఒక కంటితో ఉండటం ఎంతో మేలు కదా.
\v 48 ఆ నరకంలో అంతులేనంత కాలం పురుగులకు ఆహారంగా మనుష్యులును వేస్తారు, అక్కడి మంటలు చల్లారవు" అని చెప్పాడు.
\s5
\p
\v 49 "మనుషులు ఆహారంలో ఉప్పు కలుపుకున్నట్టే దేవుడు కూడా మనుష్యుల్లో ఆగ్నిని పడేస్తాడు.
\v 50 ఆహారంలో ఉప్పు వేయడం మంచిది. కాని ఆ ఉప్పు రుచి కోల్పోతే నువ్వు దానిని మళ్ళీ ఉప్పగా మార్చలేవు. మనందరం ఆహారానికి రుచి కల్పించే ఉప్పులాగా ఉండాలి. ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలి."
\s5
\c 10
\p
\v 1 యేసు తన శిష్యులతో కలసి ఆ ప్రాంతం విడిచిపెట్టి యొర్దాను నదికి తూర్పుగా నడుస్తూ, యూదయకు ప్రయాణం చేశారు. ఆయన్ని చూడగానే జనసమూహం ఆయన చుట్టూ చేరడం ప్రారంభించారు. ఆయన ఎప్పటిలానే వారికి బోధించడం ప్రారంభించాడు.
\v 2 ఆయన వారికి బోధిస్తున్నప్పుడు కొందరు పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని, "మన ధర్మశాస్త్రం ప్రకారం ఏ మనిషైనా తన భార్యకు విడాకులు ఇవ్వవచ్చా?" అని అడిగారు. వారు ఆ విధంగా అడిగింది ఆయన అవుననో, కాదనో చెబితే దాన్ని బట్టి ఆయనలో తప్పు పట్టుకోవచ్చని.
\p
\v 3 ఆయన జవాబిస్తూ "మీ పూర్వీకులకు దీన్ని గురించి మోషే ఏమని ఆజ్ఞాపించాడు?" అని అడిగాడు.
\v 4 వారు "విడాకుల పత్రం రాసి ఇచ్చి ఆమెను పంపించెయ్య వచ్చని చెప్పాడు" అన్నారు.
\s5
\v 5 యేసు వారితో, "మీ పూర్వికులు తమ భార్యలను వదిలి పెట్టాలని మొండిగా కోరుకున్నారు. అందుకే మోషే ధర్మశాస్త్రంలో ఇలాటి నియమం రాశాడు.
\v 6 అయితే దేవుడు మాత్రం మొదట్లో మానవుల్ని చేసినప్పుడు,
\q1 దేవుడు వారిని స్త్రీ పురుషులుగా నిర్మించాడు, అని ధర్మశాస్త్రం చెబుతున్నది.
\s5
\p
\v 7 ఎప్పుడైతే పురుషుడు వివాహం చేసుకుంటాడో, అప్పటినుంచి అతడు తన తల్లిదండ్రులను కచ్చితంగా విడిచిపెట్టి తన భార్యతో కలసి ఉండాలి, అని దేవుడు చెప్పింది ఇందుకే.
\v 8 వాళ్ళిద్దరూ ఒకే మనిషిగా మారిపోతారు. ఇక వారు ఇద్దరు మనుషులు కాదు, ఒక్కరే.
\v 9 ఇది సత్యం. కాబట్టి, ఏ పురుషుడు తన భార్యను విడిచిపెట్టకూడదు. దేవుడు వారిద్దరినీ జత కలిపాడు. వారిద్దరూ కలిసి ఉండాలని దేవుడు ఆశించాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 10 యేసు , ఆయన శిష్యులు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, వాళ్ళు దీన్ని గురించి ఆయన్ని అడిగారు.
\v 11 ఆయన వారితో, "ఎవరన్నా తన భార్యకు విడాకులిచ్చి ఇంకో స్త్రీని పెళ్ళి చేసుకుంటే దేవుని దృష్టిలో అతడు వ్యభిచారం చేస్తున్నట్టే.
\v 12 అలాగే దేవుని దృష్టిలో ఏ స్త్రీ అయితే తన భర్తకు విడాకులిచ్చి ఇంకో పురుషుణ్ణి పెళ్ళిచేసుకుంటుందో ఆమె వ్యభిచారం చేస్తున్నట్టే" అని చెప్పాడు.
\s5
\p
\v 13 అదే సమయంలో కొందరు తమ చిన్నపిల్లల్ని యేసు ముట్టుకుని దీవించాలని ఆయన దగ్గరికి తెచ్చారు. కాని శిష్యులు వాళ్ళను అడ్డుకుని గదమాయించారు.
\v 14 వారలా చేయడం చూసి యేసు వారిపై కోప్పడ్డాడు. ఆయన తన శిష్యులతో, "చిన్నపిల్లలను నా దగ్గరకు రానివ్వండి. వారిని ఆపవద్దు. ఎవరైతే ఈ చిన్నపిల్లల లక్షణాలు కలిగి ఉంటారో, వారినే దేవుడు పాలించడానికి ఒప్పుకుంటాడు.
\s5
\v 15 మీరొక విషయాన్ని గమనించండి. చిన్న పిల్లల్లాగా ఎవరైతే దేవుణ్ణి తమ రాజుగా అంగీకరించరో, వారిని దేవుడు కచ్చితంగా తన రాజ్యంలోకి రానివ్వడు."
\v 16 తరువాత ఆయన ఆ చిన్నపిల్లలను కౌగిలించుకున్నాడు. వారి తలలపై తన చేతులుంచి, వారికి మంచి జరగాలని దేవుణ్ణి కోరాడు.
\s5
\p
\v 17 ఆయన మళ్ళీ తన శిష్యులతో కలసి ప్రయాణానికి సిద్దమయ్యాడు. ఒక వ్యక్తి ఆయన దగ్గరకు పరుగు పరుగున వచ్చాడు. అతడు యేసు ముందు మోకరిల్లి ఆయన్ని, "సద్బోధకా, పరలోకానికి వెళ్ళాలంటే నేనేం చెయ్యాలి?" అని అడిగాడు.
\v 18 యేసు అతడితో, "నన్ను మంచివాడని ఎందుకు అంటున్నావ్? దేవుడొక్కడే మంచివాడు" అన్నాడు.
\v 19 "సరే, నీ ప్రశ్నకు జవాబు ఏంటంటే, నీకు మోషే చెప్పిన ధర్మశాస్త్రం తెలుసుగా. హత్య, వ్యభిచారం, దొంగతనం చేయగూడదు. అబద్ద సాక్ష్యం చెప్పకూడదు. ఎవరినీ మోసం చేయవద్దు. నీ తల్లిదండ్రులను గౌరవించు. నువ్వు పాటించవలసినవి ఇవే" అని చెప్పాడు.
\s5
\v 20 ఆ వ్యక్తి యేసుతో, "బోధకా, నా చిన్నతనం నుండి ఆ ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను" అని చెప్పాడు.
\p
\v 21 యేసు అతనికేసి చూసినప్పుడు ఆయనకి అతనిపై ప్రేమ కలిగింది. ఆయన అతడితో "నువ్వు ఇప్పటివరకు చేయకుండా వదిలేసింది ఒకటుంది. ఇంటికి పోయి నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టు. తద్వారా నువ్వు పరలోకంలో ధనవంతుడివి అవుతావు. నేను నీకు చెప్పినదంతా చేసిన తరువాత వచ్చి నన్ను అనుసరించు" అన్నాడు.
\v 22 యేసు చెప్పిన మాట విని అతడు చాలా నిరుత్సాహ పడ్డాడు. అతడు చాలా ధనవంతుడు కాబట్టి బాధగా ఆయన దగ్గర నుండి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 23 యేసు తన చుట్టూ ఉన్నవాళ్ళను చూసి తన శిష్యుల వైపు తిరిగి, "ధనవంతులు దేవుని రాజ్యాన్ని అంగీకరించడం చాలా కష్టం" అన్నాడు.
\v 24 ఆయన చెప్పింది విన్న శిష్యులు కంగారుపడ్డారు. యేసు మళ్ళీ, "నా ప్రియ స్నేహితుల్లారా, దేవుని రాజ్యాన్ని ఇలాటి వారు అంగీకరించడం చాలా కష్టం.
\v 25 నిజానికి, ధనవంతులు దేవుని రాజ్యాన్ని అంగీకరించడం కంటే, చాలా పెద్ద జంతువైన ఒంటె సూది రంధ్రంలో దూరడం సులభం" అన్నాడు.
\s5
\p
\v 26 ఆయన శిష్యులు ఇది విని చాలా ఆశ్చర్యపోయారు. వారు ఒకరితో ఒకరు, "అలాగైతే ఎవరూ రక్షణ పొందలేరు గదా?" అని చెప్పుకున్నారు.
\v 27 యేసు వారిపైపు చూసి, "నిజమే, ఎవరైనా తమను తాము రక్షించుకోవడం అసాధ్యమే గానీ దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు గనక వాళ్ళను తప్పక రక్షించగలడు" అని చెప్పాడు.
\p
\v 28 పేతురు యేసుతో, "బోధకా, మేము అన్నీ వదిలిపెట్టి నీ వెంట తిరుగుతున్నాం గదా" అన్నాడు.
\s5
\v 29 దానికి యేసు, "మీరంతా ఇది తెలుసుకోండి. సువార్త కోసం, ఎవరైతే నాకోసం తమ ఆస్తిపాస్తుల్ని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అక్కాచెల్లెళ్ళను, అన్నదమ్ములను, ఇళ్ళను వదులుకుంటారో
\v 30 వాళ్ళందరూ తాము వదులుకున్న దానికంటే వంద రెట్లు ఈ జీవితంలోనే పొందుతారు. దానితో బాటు ఆస్తిపాస్తులు, ప్రియమైన అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లలు, ఇళ్ళు ఉంటాయి. అయితే మీరు నన్ను నమ్ముకున్న కారణాన లోకులు మిమ్మల్ని హింసిస్తారు. కానీ రాబోయే కాలంలో అంతకంటే ఎక్కువైన పరలోకాన్ని మీరు పొందుతారు.
\v 31 కాని నేను మిమ్మల్నందరినీ హెచ్చరిస్తున్నాను. మీలో కొందరు తమను తాము ముఖ్యమైన వారిగా భావించుకుంటున్నారు గదా. అయితే రాబోయే కాలంలో మీలో కొందరు ముఖ్యమైనవారు అనిపించుకోరు. అలాగే ముఖ్యం కాని వారిలో కొందరు ముఖ్యమైనవారుగా రాబోయే కాలంలో ఉంటారు."
\s5
\p
\v 32 కొన్ని రోజులు తరువాత వాళ్ళు అదే విధంగా తమ ప్రయాణాన్ని కొనసాగించారు. యేసు, ఆయన శిష్యులు యెరూషలేము దారిలో నడుస్తున్నారు. యేసు వారికంటే కొంచెం ముందుగా నడుస్తున్నాడు. అది చూసి ఆయన శిష్యులు ఆశ్చర్యపోతున్నారు. వారితో ఉన్న మిగతావారు భయపడ్డారు. ఆయన తన పన్నెండు మంది శిష్యులను వారినుంచి వేరు చేసి తనతో పాటు వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళాడు. అప్పుడు మళ్ళీ తనకు జరగపోయే దాన్ని వారికి చెప్పడం మొదలుపెట్టాడు.
\p
\v 33 ఆయన వారితో, "నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు యెరూషలేముకు వెళ్తున్నాం. అక్కడ ధర్మశాస్త్రాన్ని బోధించే పండితులు, ప్రధాన యాజకులు మనుష్యకుమారుడినైన నన్ను బంధిస్తారు. నాకు మరణశిక్ష పడాలని ప్రకటిస్తారు. ఆ తరవాత నన్ను రోమన్ ప్రభుత్వానికి అప్పగిస్తారు.
\v 34 వాళ్ళు నన్ను ఎగతాళి చేసి నాపై ఉమ్మివేస్తారు. నన్ను కొరడాలతో కొట్టి హింసించి నన్ను చంపుతారు. కాని చనిపోయిన మూడో రోజున నేను మళ్ళీ తిరిగి బ్రతుకుతాను" అని చెప్పాడు.
\s5
\p
\v 35 మార్గమధ్యంలో, జెబెదయి ఇద్దరు కొడుకులు యాకోబు, యోహానులు యేసు దగ్గరకు వచ్చి, ఆయనతో, "బోధకా, దయచేసి నువ్వు మా కోరిక మన్నించాలి" అని అడిగారు.
\v 36 ఆయన వారిని, "మీకేం కావాలి?" అని అడిగాడు.
\v 37 వారు ఆయనతో, "ప్రభూ, నువ్వు నీ రాజ్యాన్ని పాలించేటప్పుడు మాలో ఒకణ్ణి నీ కుడి వైపునా మరొకణ్ణి ఎడమ వైపునా కూర్చోనివ్వు" అని అడిగారు.
\s5
\v 38 యేసు వారితో, "మీరేం అడుగుతున్నరో మీకు అర్థం అవుతున్నదా?" అన్నాడు. తరువాత వాళ్ళను, "నేను పొందబోయే బాధల్ని మీరు భరించగలరా? నేను పొందబోయే మరణం లాంటి మరణాన్ని మీరు పొందగలరా?" అని అడిగాడు.
\v 39 వాళ్ళు ఆయనతో, "అవును, మేము పొందగలం" అన్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, "నిజమే, నేను అనుభవించబోయే బాధల్ని మీరు అనుభవిస్తారు. శత్రువులు నన్ను ఏ విధంగా చంపబోతున్నారో ఆ విధంగానే మిమ్మల్ని కూడా చంపుతారు.
\v 40 కాని నా సరసన ఎవరు ఉండాలో ఎంపిక చేసుకునే అవకాశం నాకు లేదు. దేవుడు ముందుగానే ఎంపిక చేసిన వారికే ఆ స్థానాన్ని ఇస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 41 తరువాత యాకోబు, యోహానులు యేసును అడిగిన దాన్ని గురించి మిగతా పది మంది శిష్యులకు తెలిసింది. వాళ్ళు అలా అడగడం తమకు నచ్చలేదని వారికి చెప్పారు.
\v 42 అప్పుడు యేసు తన శిష్యులందరినీ దగ్గరకు పిలిచి, వాళ్ళతో, "రాజులు, ప్రభుత్వ పెద్దలు తామేదో గొప్ప వాళ్ళమన్నట్టు తమ ప్రజలపై పెత్తనం చేస్తూ మురిసి పోతుంటారని మీకు తెలుసు. అంతేకాకుండా వాళ్ళ పైఆధికారులు వాళ్ళపై పెత్తనం చెలాయిస్తారనీ మీకు తెలుసు.
\s5
\v 43 కాని మీరు వారిలా ఉండవద్దు. దానికి విరుద్దంగా, మీలో ఎవరైతే దేవుడు మిమ్మల్ని గొప్పవాడుగా చూడాలనుకుంటారో, అతడు తనను మిగతా వారికి సేవకుడిలా భావించుకోవాలి."
\p
\v 44 "ఇంకా నేను చెప్పేదేమిటంటే, మీలో ఎవరైతే దేవుడు మిమ్మల్ని ముఖ్యమైనవానిగా భావించాలనుకుంటారో, అతడు మిగతా వారికి బానిసగా మారిపోవాలి.
\v 45 మనుష్యకుమారుడినైన నేను మీతో సేవ చేయించుకోడానికి రాలేదు. దానికి విరుద్ధంగా మీకు సేవ చేయడానికీ నా జీవితాన్ని ధారపోసి అనేకమందిని రక్షించడానికీ వచ్చాను" అన్నాడు.
\s5
\p
\v 46 యేసు ఆయన శిష్యులు యెరూషలేముకు పోతూ, దారిలో యెరికో అనే ఊరికి చేరుకున్నారు. అప్పుడు గొప్ప జనసమూహం వెంట రాగా ఆయన యెరికోను వదిలి వెళ్ళిపోతున్నాడు. గుడ్డి వాడొకడు రోజూ దారి పక్కనే కూర్చుని అడుక్కునేవాడు. అతడి పేరు బర్తిమయి. అతడి తండ్రి పేరు తీమయి.
\v 47 నజరేతు వాడు యేసు అటుగా వెళ్తున్నాడని అతడు విన్నాడు. అతడు, "ఓ యేసూ, దావీదు వంశంలో పుట్టిన క్రీస్తూ, నాపై దయ చూపించు" అని గొంతు చించుకుని అరవసాగాడు.
\v 48 దారిన వెళుతున్న వాళ్ళంతా నోరు మూసుకోమని అతన్ని గదమాయించారు. కాని అతడు మరింత బిగ్గరగా "దావీదు కుమారుడైన క్రీస్తూ, నా పై దయ చూపించు" అని అరిచాడు.
\s5
\p
\v 49 యేసు ఆగి, "అతణ్ణి ఇక్కడకు తీసుకు రండి" అన్నాడు. అక్కడి వారు ఆ బిచ్చగాడితో, "నీ పంట పండింది. యేసు నిన్ను పిలుస్తున్నాడు, రా" అన్నారు.
\v 50 అతడు వెంటనే తన పైబట్టను విసిరేసి, చటుక్కున లేచి ఆయన దగ్గరకు వచ్చాడు.
\s5
\v 51 యేసు అతడితో, "నేను నీకు ఏం చేయాలి? నీ కోరిక ఏమిటి?" అని అడిగాడు. ఆ గుడ్డివాడు ఆయనతో, "బోధకా, నాకు మళ్లీ చూపు ప్రసాదించు" అని చెప్పాడు.
\v 52 యేసు అతడితో, "నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నేను నిన్ను బాగుచేస్తున్నాను. ఇక నువ్వు వెళ్ళవచ్చు" అని చెప్పాడు. అతనికి వెంటనే చూపు వచ్చింది. సంతోషంగా యేసుతో కలిసి ఆ దారినే వెళ్ళాడు.
\s5
\c 11
\p
\v 1 యేసు, ఆయన శిష్యులు యెరూషలేము మార్గంలోని బేత్పగే, బేతనియలకు దగ్గరగా ఉన్న ఒలీవల కొండకు చేరుకున్నారు. అప్పుడు యేసు ఇద్దరు శిష్యులను పిలిచి, వాళ్ళతో
\v 2 "మీరు ఎదురుగా ఉన్న ఆ గ్రామంలోకి వెళ్ళండి. ఆ గ్రామంలో ప్రవేశించగానే, ఒక కట్టి ఉన్న గాడిద పిల్ల కనిపిస్తుంది. దానిమీద ఇంతకుముందు ఎవరూ కూర్చోలేదు. దాన్ని విప్పి నా దగ్గరికి తోలుకు రండి.
\v 3 ఎవరైనా మీతో, "ఇలా ఎందుకు చేస్తున్నారు?" అని అడిగితే "ప్రభువుకి ఇది కావాలి" అని చెప్పండి."
\s5
\p
\v 4 ఆయన చెప్పినట్లే ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళి, ఆ గాడిద పిల్లను కనుగొన్నారు. ఆ గాడిద పిల్ల ఒక వీధి ప్రక్కనే ఉన్న ఇంటి తలుపుకి కట్టేసి ఉంది. వాళ్ళు దాన్ని విప్పారు.
\v 5 అక్కడే ఉన్న కొంతమంది వాళ్ళు చేస్తున్న దాన్ని చూసి వారితో, "మీరు గాడిదను ఎందుకు విప్పుతున్నారు?" అని అడిగారు.
\v 6 వాళ్ళకి యేసు ఏమని బదులు ఇవ్వమని చెప్పాడో, అదే విధంగా వాళ్ళు ఆ మనుషులకు చెప్పారు.
\s5
\v 7 ఆ ఇద్దరు శిష్యులు ఆ గాడిదపిల్లను యేసు దగ్గరకు తెచ్చి ఆయన కూర్చోడానికి వీలుగా, దానిపై కొన్ని బట్టలు పరిచారు.
\v 8 అనేకమంది తమ బట్టలను ఆయనకు ముందుగా దారిపొడుగునా నేలపై పరిచారు. మిగతా వారు దగ్గరిలోని పొలాల్లోకి వెళ్ళి, ఈత చెట్టు కొమ్మలను నరికి, నేలపై ఆయనకు ముందుగా పరిచారు.
\v 9 ఆయనకు ముందు, వెనుకగా వస్తున్న వారందరు బిగ్గరగా, "దేవునికి స్తుతులు! సర్వాధికారిగా వస్తున్న ఈయన్ని దేవుడు దీవించు గాక" అంటూ కేకలు వేసారు.
\p
\v 10 అంతేకాకుండా వారు "మన పూర్వికుడైన దావీదు రాజు ఏ విధంగా పాలించాడో , ఆ విధంగానే నీ పాలన కూడా ఉండేలా దేవుడు దీవించు గాక! అలాగే పరలోకంలో ఉన్న దేవునికి స్తుతులు కలుగు గాక" అంటూ కేకలు వేసారు.
\s5
\p
\v 11 ఆ విధంగా యేసు యెరూషలేములోకి వచ్చాడు. వెంటనే ఆయన దేవాలయ ప్రాంగణం లోకి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్నదంతా ఆయన ఒకసారి కలియజూసి, వెంటనే అక్కడి నుంచి వచ్చేసాడు. ఎందుకంటే అప్పటికే సాయంకాలం కావస్తుంది. ఆయన తన ఇద్దరు శిష్యులతో కలసి బేతనియకు వచ్చాడు.
\p
\v 12 తరువాతి రోజు యేసు ఆయన శిష్యులు బేతనియ నుంచి వస్తున్నప్పుడు, ఆయనకు చాలా ఆకలేసింది.
\s5
\v 13 ఆయన కొంత దూరంలో ఉన్న అంజూరుు చెట్టును చూశాడు. అది ఆకులతో గుబురుగా ఉంది. ఏమైనా పళ్ళు దొరుకుతాయేమోనని ఆయన దాని దగ్గరకు వెళ్ళాడు. కాని ఒక్క పండు కూడా కానరాలేదు. కారణం అది అంజూరుు పండ్లకాలం కాదు.
\p
\v 14 ఆయన ఆ చెట్టుతో, "ఇక ఎప్పటికి పండ్లు కాయని చెట్టుగానే ఉంటావు. ఎవ్వరూ నీ దగ్గరికి పండ్ల కోసం మళ్ళీ రారు" అని చెప్పాడు. ఆ మాటలు శిష్యులు విన్నారు.
\s5
\v 15 యేసు, ఆయన శిష్యులు యెరూషలేముకి తిరిగి వచ్చి, దేవాలయ ప్రాంగణంలోకి వెళ్లారు. అక్కడ మనుషులు బలుల కోసం జంతువులను కొనడం అమ్మడం ఆయన చూశాడు. వాళ్ళనందరినీ దేవాలయ ప్రాంగణం నుంచి తరిమివేశాడు. అంతేకాకుండా ఆలయానికి అర్పణగా వస్తున్న వాటిని రోమన్ నాణేల్లోకి మారుస్తున్న వాళ్ళ బల్లలను ఆయన తోసేసాడు. బలికోసం పావురాలు అమ్ముతున్న వాళ్ళ కుర్చీలను కూడా తోసేసాడు.
\v 16 దేవాలయ ప్రాంగణంలో ఎవరూ ఎలాటి అమ్మకాలు చెయ్యడానికి ఆయన అంగీకరించలేదు.
\s5
\p
\v 17 తరువాత వాళ్ళకి ఆయన బోధిస్తూ, "దేవుడు గ్రంథాల్లో రాయించినది ఏమిటంటే, నా ఇల్లు అన్ని జాతులవారికీ ప్రార్థన స్థలంగా ఉండాలని నేను కోరుతున్నాను. కాని బందిపోటు దొంగలైన మీరు, నా ఇంటిని దొంగలు దాక్కునే గుహగా చేశారు" అన్నాడు.
\p
\v 18 ఆయన చేసిన దాన్ని గురించి యూదుల ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన యాజకులు తరువాత తెలుసుకున్నారు. అప్పటినుంచి ఆయన్ని ఎలా చంపాలని వాళ్ళు ఆలోచించారు. కాని ఆయన బోధలు విన్న ప్రజలు ఆశ్చర్యంతో ఆయన్ని చాలా అభిమానించడం వాళ్ళు గమనించారు. కాబట్టి ఆయన అంటే భయపడ్డారు.
\p
\v 19 ప్రతి రోజూ సాయంకాలానికి యేసు ఆయన శిష్యులు ఆ నగరాన్ని వదిలి వెళ్ళేవారు.
\s5
\v 20 మరుసటి రోజు ఉదయమే వాళ్ళు యెరూషలేముకు వెళ్తుంటే , యేసు శపించిన ఆ అంజూరు చెట్టు పూర్తిగా ఎండిపోయి వాళ్ళకి కనిపించించింది.
\v 21 పేతురు ఆ చెట్టు గురించి యేసు ఏం చెప్పాడో గుర్తుకు వచ్చి యేసుతో, "బోధకా నువ్వు శపించిన ఆ చెట్టు ఏ విధంగా ఎండిపోయిందో చూడు" అన్నాడు.
\s5
\v 22 దానికి జవాబుగా యేసు, "దేవుణ్ణి మీరు ఏం కావాలని అడుగుతారో దాన్ని ఆయన చేస్తాడని విశ్వాసం ఉంచండి"
\v 23 మీరు గమనించవలసింది ఏమిటంటే, ఆ పర్వతాన్ని చూసి దానితో, "లేచి సముద్రంలో పడు" అని ఎటువంటి సందేహం లేకుండా అంటే అది తప్పకుండా జరుగుతుంది. నువ్వు అనుకున్నది జరుగుతుంది అని నువ్వు నమ్మితే, దేవుడు నీకోసం దాన్ని చేస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 24 "కాబట్టి నేను చెప్పేదేమిటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి అడిగే దాన్ని పొందినట్టుగా నమ్మితే దేవుడు నీకోసం దాన్ని చేస్తాడు.
\v 25 ఇప్పుడు ఇంకో విషయాన్ని కూడా మీకు చెబుతాను. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నీకు ఎవరైతే హాని చేస్తారో వారిపై నీకున్న కోపాన్ని తీసివేసి, వారిని క్షమించు. ఏవిధంగా ఐతే నీ పాపాల్ని పరలోకంలోని తండ్రి క్షమిస్తున్నాడో, ఆవిధంగా నువ్వు వాళ్ళని క్షమించు.
\v 26 అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు."
\s5
\p
\v 27 యేసు ఆయన శిష్యులు యెరూషలేములోని దేవాలయ ప్రాంగణానికి మళ్ళీ వచ్చారు. అక్కడ ఆయన తిరుగుతుంటే, పెద్దలు, యూదు ధర్మశాస్త్ర పండితులు, ప్రధాన యాజకులు గుంపుగా ఆయన దగ్గరకు వచ్చారు.
\v 28 వాళ్ళు ఆయనతో, "నువ్వు ఏ అధికారంతో ఇదంతా చేస్తున్నావు? నిన్న ఆ విధంగా చేసే అధికారం నీకు ఎవరిచ్చారు?" అని అడిగారు.
\s5
\v 29 యేసు వాళ్ళతో, "నేనూ మిమ్ముల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సరైన జవాబు చెబితే, నేను కూడా నాకు ఎవరు ఆ అధికారాన్ని ఇచ్చారో చెబుతాను.
\v 30 తన దగ్గరకు వస్తున్న వారికి బాప్తిసం ఇచ్చిన యోహానుకి ఆ అధికారం దేవుడు ఇచ్చాడా? లేక మనుషులు ఇచ్చారా?" అని అడిగాడు.
\s5
\v 31 ఆయన అడిగిన దానికి ఎలాటి జవాబు చెప్పాలో వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారు. వాళ్ళల్లో వాళ్ళు, "ఒక వేళ అధికారం దేవుడి నుంచి వచ్చింది అని చెబితే, "మీరు యోహాను చెబుతున్న వాటిని ఎందుకు నమ్మలేదు?" అంటాడు.
\v 32 అలా కాకుండా మనం అతనికి ఆ అధికారం మనుషుల వల్ల వచ్చింది అంటే, ఇక మన పనైపోతుంది!" అనుకున్నారు. ఎందుకంటే అలా చెబితే ప్రజలు తమపై తిరగబడతారని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే యోహాను దేవుడు పంపిన ప్రవక్తగా ప్రజలు నిజంగా నమ్ముతున్నారని వాళ్ళకి తెలుసు.
\v 33 అందువల్ల వాళ్ళు యేసుతో, "యోహానుకు వచ్చిన ఈ అధికారం ఎవరి నుంచి వచ్చిందో మాకు తెలియదు" అన్నారు. అప్పుడు యేసు వాళ్ళతో, "నేను అడిగిన ప్రశ్నకు మీరు జవాబు చెప్పలేదు కాబట్టి నేను కూడా నిన్న ఏ అధికారంతో అదంతా చేశానో చెప్పను" అన్నాడు.
\s5
\c 12
\p
\v 1 అప్పుడు యేసు వారితో ఒక కథ చెప్పడం ప్రారంభించారు. ఆయన "ఒక మనిషి ద్రాక్ష తోటను వేసాడు. దాని చుట్టూ కంచె వేసాడు. ద్రాక్ష రసం నింపడానికి ఒక రాతి తొట్టె తొలిపించాడు. ద్రాక్ష తోటను కాపలా కాసే వారి కోసం ఒక కావలి గోపురం నిర్మించాడు. ద్రాక్ష తోటను సేద్యం చెయ్యడానికి కొందరు రైతులకు కౌలుకిచ్చి, అతడు మరో దేశానికి వెళ్ళిపోయాడు.
\v 2 ద్రాక్ష తోట పక్వకాలానికి వచ్చినపుడు, ఆ తోట యజమాని తన కౌలు కోసం తన పని వాడిని, ఆ కౌలు రైతుల దగ్గరకు పంపాడు. ఎందుకంటే ఫలించిన ద్రాక్ష తోటలో తన భాగంగా రావలసిన పంట అతడు తీసుకోవాలనుకున్నాడు.
\v 3 కాని ఆ కౌలుదారులు ఆ వచ్చిన పనివాడికి, కౌలు ఇవ్వకపోగా అతణ్ణి తోటలోనుంచి బయటకిలాగి అతని మీద పడి కొట్టారు. అతణ్ణి అక్కడనుంచి తరిమివేశారు."
\s5
\p
\v 4 "ఆ తరవాత ఆ తోట యజమాని వాళ్ళ దగ్గరకు మరొక పనివాణ్ణి పంపాడు. కాని వాళ్ళు ఎంతమాత్రం తాము చేస్తున్న తప్పుకు సిగ్గుపడక, అతణ్ణి కూడా వాళ్ళు తలపై మోది గాయపరిచారు.
\v 5 అలా జరిగిన తరువాత కూడా ఆ తోట యజమాని మరో పనివాణ్ణి పంపాడు. అతణ్ణి కూడా వాళ్ళు చంపేశారు. అతడు ఎంతమంది పనివాళ్ళను పంపినా వాళ్ళను బాధలు పెట్టారు. కొంతమందిని గాయపరచి, కొంతమందిని చంపారు.
\s5
\v 6 వారి దగ్గరకు పంపడానికి ఆ తోట యజమాని దగ్గర మరొక వ్యక్తి ఉన్నాడు- ఆయన ప్రియమైన కొడుకు. తన సొంత కొడుకైతే వాళ్ళు తప్పకుండా గౌరవిస్తారని భావించి అతణ్ణి పంపాడు.
\v 7 కాని దుర్మార్గులైన ఆ కౌలుదారులు, ఆ తోట యజమాని కొడుకుని చూసి తమలో తాము, "చూడండి, తోట యజమాని కొడుకు వస్తున్నాడు. ఏదో ఒకనాటికి ఈ ద్రాక్ష తోటకు అతడే యజమాని అవుతాడు. కాబట్టి ఈ తోట మన సొంతం కావాలంటే అతణ్ణి చంపేద్దాం" అనుకున్నారు.
\s5
\v 8 వాళ్ళు ఆ తోట యజమాని కొడుకును పట్టుకుని బంధించి చంపారు. తరువాత అతడి శవాన్ని తోట బయట పారేసారు.
\v 9 కాబట్టి ఇప్పుడు ఆ తోట యజమాని ఏం చేస్తాడో మీకు తెలుసా? అతడు వచ్చి, తోట కౌలుకు తీసుకున్న ఆ దుర్మార్గులను చంపుతాడు. అప్పుడు దాన్ని జాగ్రత్తగా చూసుకోవటానికి వేరే మనుషుల్ని ఏర్పాటు చేస్తాడు.
\s5
\v 10 మీరు రోజు చదువుతున్న గ్రంథాల్లో రాసిన ఈ వాక్యాల్ని ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించడి. "ఇల్లు కట్టేవారు, ఆ ఇల్లు కట్టడంలో ఒక రాయి తీసి పారేశారు. కాని దేవుడు అదే రాయిని సరైన స్థలంలో పెట్టాడు. ఆ ఇంటికి అదే ముఖ్యమైన రాయిగా మారింది.
\v 11 దేవుడు చేసిన ఈ పనిని చూస్తుంటే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి" అన్నాడు.
\p
\v 12 ఆయన చెప్పిన కథలోని ఆ రాక్షసులు ఎవరో కాదు, యేసు తమను మనసులో పెట్టుకునే ఈ కథ ఆయన చెప్పాడని యూదు పెద్దలు గ్రహించారు. కాబట్టి వాళ్ళు ఆయన్ని బంధించాలని అనుకున్నారు. కాని అలా చేస్తే అక్కడే ఉన్న జనసమూహం ఏం చేస్తారోనని వాళ్ళు భయపడ్డారు. అందుకే ఆయన్ని వదిలి వెళ్ళిపోయారు.
\s5
\p
\v 13 అప్పుడు ఆ యూదా పెద్దలు, హేరోదు అంతిపాను మద్దతు దారులైన కొంతమంది సంఘ సభ్యులను, కొంతమంది పరిసయ్యలను యేసు దగ్గరకు పంపారు. వాళ్ళు ఆయనపై కుట్ర పన్నారు. ఆయన మాట్లాడే మాటల్లో ఏదో ఒక తప్పు దొర్లేలా చేసి, ఇదిగో ఈయన తప్పుడు బోధలు చేస్తున్నాడు అంటూ అందరికీ చూపించి, ఆయనపై నేరారోపణ చేయాలనుకున్నారు.
\p
\v 14 యూదా పెద్దలు పంపిన మనుష్యులు వచ్చి ఆయనతో, "బోధకా" నువ్వు సత్యమే బోధిస్తున్నావని మాకు తెలుసు. అలానే నీ గురించి ఎదుటి వారు ఏం అనుకుంటారో అని నువ్వు లెక్కచేయవు అని మాకు తెలుసు. ముఖ్యమైన వ్యక్తులకు నువ్వు చెప్పేది నచ్చక పోయినా నువ్వు పట్టించుకోవు. మేము ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడో దాన్నే బోధిస్తావు. కాబట్టి ఈ విషయం గురించి నువ్వేం ఆలోచిస్తున్నావో మాకు చెప్పు: మనం రోమన్ ప్రభుత్వానికి పన్ను కట్టడం తప్పా, ఒప్పా? మనం పన్ను కట్టాలా, కట్టనవసరం లేదా?" అని అడిగారు.
\v 15 కానీ దేవుడు ఏం చేయమంటున్నాడో తెలుసుకోవాలని నిజంగా వాళ్ళు అనుకోవడం లేదని యేసుకు తెలుసు, అందుకే వాళ్ళతో, "నేను ఏదైనా తప్పు మాట్లాడితే నాపై నేరారోపణ చెయ్యాలని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు. అయినా మీ ప్రశ్నకు జవాబు ఇస్తాను. ఒక నాణెం చూపించండి" అన్నాడు.
\s5
\v 16 వాళ్ళు ఒక నాణెం ఆయనకి చూపారు. వాళ్ళతో ఆయన, "ఈ నాణెంపై ఉన్న బొమ్మ ఎవరిది? దీనిపై ఎవరి పేరు ఉంది?" అని అడిగాడు. దానికి వాళ్ళు, "దీనిపై బొమ్మ, పేరు సీజర్ వి" అని చెప్పారు.
\v 17 యేసు, "నిజమే, కాబట్టి సీజర్ కి చెందినవి సీజరుకీ దేవుడికి చెందేవి దేవుడికీ ఇవ్వండి" అని చెప్పాడు. ఆయన చెప్పిన సమాధానికి వాళ్ళు ఆశ్చర్యపోయారు.
\s5
\p
\v 18 సద్దూకయ్యుల బృందానికి చెందిన కొంతమంది మనుషులు కూడా అక్కడ ఉన్నారు. చనిపోయినవారు తిరిగి బతుకుతారు అని నమ్మే యూదుల నమ్మకాన్ని వీళ్ళు ఒప్పుకోరు. కొంతమంది సద్దుకయ్యాలు యేసు దగ్గరికి వచ్చి ఆయనతో,
\v 19 "బోధకా, మోషే రాసినట్టు, ఒకడు పిల్లలు లేకుండా చనిపోతే, అతడి సోదరుడు ఆ వితంతువును పెళ్లి చేసుకుని తన సోదరుని కోసం వారసుణ్ణి కనాలి అని చెప్పాడు.
\s5
\v 20 దీనికి ఒక ఉదాహరణ. ఒక కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు. అందులో పెద్దవాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. కానీ వారికి పిల్లలు పుట్టలేదు. కొంతకాలానికి అతడు చనిపోయాడు.
\v 21 ఆ కుటుంబంలో రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతడికి కూడా పిల్లలు పుట్టలేదు. ఇతడు కూడా చనిపోయాడు. మూడోవాడు కూడా తన సోదరుని లాగానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అతడికి కూడా పిల్లలు పుట్టలేదు. తరువాత అతడు చనిపోయాడు.
\v 22 చివరికి మొత్తం ఏడుగురు సోదరులు, ఒకరి తరువాత ఒకరు ఆమెను పెళ్ళి చేసుకున్నారు, కానీ ఎవ్వరికీ పిల్లలు పుట్టలేదు. ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. అందరి తరువాత ఆమె కూడా చనిపోయింది."
\p
\v 23 "చనిపోయిన మనుషులు తిరిగి బతికే రోజున, ఆ స్త్రీ ఎవరి భార్య అవుతుంది? మనం గుర్తు పెట్టుకోవలసిదేంటంటే, ఆమె ఆ ఏడుగురు అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకుంది" అన్నారు.
\s5
\v 24 యేసు వాళ్ళతో, "మీరు పొరపాటు పడుతున్నారు. దీన్ని గురించి గ్రంథాలు ఏమి బోధిస్తున్నాయో మీకు తెలియదు. అంతేకాక మనుషులను బ్రతికించే దేవుడి శక్తి ఏంటో కూడా మీరు అర్థం చేసుకోలేదు.
\v 25 ఆ అన్నదమ్ములెవ్వరికీ ఆ స్త్రీ భార్యగా ఉండదు. ఎందుకంటే మనుషులు తిరిగి బ్రతికినప్పుడు, పురుషులకు భార్యలు, స్త్రీలకు భర్తలు ఉండరు. వాళ్ళందరూ దేవదూతల్లాగా పరలోకంలో ఉంటారు. దేవదూతలు పెళ్ళిళ్ళు చేసుకోరు."
\s5
\p
\v 26 "ఇక మనుషులు చనిపోయి తిరిగి బ్రతికే విషయానికి వస్తే మోషే రాసిన గ్రంథంలో చనిపోయిన వాళ్ళను గురించి ఇలా రాశాడు. మీరు కచ్చితంగా చదివే ఉంటారు. కాలిపోతున్న పొదను చూస్తున్న మోషేతో దేవుడు ఇలా, "ఎవరు నన్ను ఆరాధించారో , ఆ అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి" అన్నాడు.
\v 27 ఇప్పుడు ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళు చనిపోయినట్టు కాదు. ఆయన్ని ఆరాధించిన వాళ్ళు జీవిస్తున్నట్టే. కాబట్టి చనిపోయిన మనుషులు తిరిగి బ్రతకరని మీరు చెప్పేది సరికాదు" అని జవాబు చెప్పాడు.
\s5
\p
\v 28 యూదుల ధర్మశాస్త్ర బోధకుల్లో ఒకడు వాళ్ళ సంభాషణ అంతా విన్నాడు. సద్దూకయ్యుల ప్రశ్నకు యేసు సరిగ్గా సమాధానం చెప్పాడని గ్రహించాడు. కాబట్టి అతడు ముందుకు వచ్చి యేసుతో, "ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి?" అని అడిగాడు.
\v 29 యేసు అతడికి, "ఆజ్ఞల్లో ముఖ్యమైన ఆజ్ఞ ఇదే. "ఓ ఇశ్రాయేలూ విను, మన ప్రభువైన దేవుడొక్కడే ప్రభువు.
\v 30 నువ్వు చేసే పనులన్నిటిలోనూ , నువ్వు చేసే ఆలోచలన్నిటిలోనూ, నీ భావనలన్నిటిలోనూ, నీ కోరికలన్నిటిలోనూ నీ ప్రభువైన దేవుణ్ణి ప్రేమించాలి"
\v 31 తరవాత ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటంటే, "నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో, అలానే నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలానే ప్రేమించాలి." ఈ రెంటికీ మించిన ముఖ్యమైన ఆజ్ఞలంటూ మరేవీ లేవు" అని చెప్పాడు.
\s5
\p
\v 32 ఆ వ్యక్తి యేసుతో, "బోధకా, నువ్వు చాలా చక్కగా జవాబు చెప్పావు. మన దేవుడొక్కడే దేవుడు అని నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఆయన తప్ప వేరే దేవుడు లేడు.
\v 33 అలాగే మన పనులన్నిటిల్లో, మన ఆలోచనలన్నిటిల్లో, మన భావనలన్నిటిల్లో, మన కోరికలన్నిటిల్లో మన దేవుడినే ప్రేమించాలని నువ్వు చెప్పింది నిజమే. అంతేకాకుండా మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో మనతో పరిచయం ఉన్న ప్రతి మనిషినీ మనం ప్రేమించాలని నువ్వు సరిగ్గా చెప్పావు. దహన బలులుగా జంతువులను, ఆహారపదార్థాలను, ఇతర అర్పణలను అర్పించడం కంటే నువ్వు చెప్పిన వీటిని చేస్తే దేవుడు నిజంగా సంతోషిస్తాడు అని నువ్వు చెప్పింది ఎంతో నిజం" అని చెప్పాడు.
\p
\v 34 అతడు సరిగా జవాబు చెప్పాడని యేసు గ్రహించాడు. అతనితో "దేవుడు తన పాలనలోకి నిన్ను తీసుకోవడానికి నువ్వు ఎంతో దూరంలో లేవు" అని చెప్పాడు. ఆ తరువాత ఆ యూదా పెద్దలు ఆయన్ని కుట్రపూరితమైన ప్రశ్నలు అడగాలన్న ఆలోచనను మానుకున్నారు. ఎందుకంటే ఆయన్ని ఇంకా ప్రశ్నలను అడగాలంటే వారికి భయం వేసింది.
\s5
\p
\v 35 ఆ తరువాత దేవాలయ ఆవరణలో ప్రజలకు బోధిస్తూ ఆయన ఇలా అన్నాడు. "ధర్మ శాస్త్రాన్ని బోధిస్తున్నవారు చెప్పేదంతా నిజమేనా? క్రీస్తు దావీదు కుమారుడా?
\v 36 పరిశుద్ధాత్ముని ద్వారా దావీదు క్రీస్తును గురించి, దేవుడు నా ప్రభువుతో పలికిన మాట, "నీ శత్రువులు పూర్తిగా దాసోహం అయ్యే వరకు ఎక్కడైతే నీకు గొప్ప గౌరవం కలుగుతుందో, అక్కడ అంటే అందరికంటే అత్యున్నతమైన నా కుడివైపున కూర్చో" అని దావీదు పలికాడు.
\v 37 ఈ కీర్తనలో దావీదు క్రీస్తును ప్రభువు అని పిలుస్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తును దావీదు కుమారుడు అని ఎలా చెబుతారు?" ఆయన బోధించే ఈ విషయాలను అనేకమంది సంతోషంగా విన్నారు.
\s5
\p
\v 38 యేసు ప్రజలకు బోధిస్తున్నప్పుడు, వాళ్ళతో ఆయన, "ధర్మశాస్త్రాన్ని బోధించే వారిలా ఉండకుండా జాగ్రత్త పడండి. తామెంతో గొప్పవాళ్ళమన్నట్టు ప్రదర్శిస్తూ, పొడుగాటి అంగీలు వేసుకొని వీధుల్లో తిరుగుతూ ప్రజలు తమను గౌరవించాలని కోరుకుంటారు. బజారుల్లో ప్రజలు తమకు గౌరవంగా నమస్కారం చేయాలని కోరుకుంటారు.
\v 39 యూదుల ప్రార్థన మందిరాలలో ప్రముఖ స్థానాల్లో కూర్చోడానికి ఇష్టపడతారు. పండుగల్లో ప్రముఖులు కూర్చునే చోట కూర్చోడానికి ఇష్టపడతారు.
\v 40 వాళ్ళు వితంతువుల ఆస్తులను, ఇళ్ళను దిగమింగుతారు. బహిరంగ ప్రదేశాల్లో సుదీర్ఘ ప్రార్థనలు చేస్తూ, అందరూ తమను మంచివాళ్ళు అనుకోవాలని చూస్తారు. వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 41 తరువాత యేసు దేవాలయ ఆవరణలో ప్రజలు తమ కానుకలు వేసే హుండీకి ఎదురుగా కూర్చున్నాడు. అక్కడ ఆ విధంగా కూర్చుని, ప్రజలు కానుకలు వేసే కానుకల పెట్టెలో ఒక కానుకను గమనించాడు. వానిలో అనేకమంది ధనవంతులు చాలా పెద్ద మొత్తంలో కానుకలు వేస్తున్నారు.
\v 42 అప్పుడు పేద విధవరాలు వారితోపాటే వచ్చి తన దగ్గర ఉన్న రెండు రాగి నాణేలను అందులో వేసింది. ఆ మొత్తం విలువ చాలా తక్కువ.
\s5
\v 43 యేసు తన శిష్యులందరినీ తన చుట్టూ సమకూర్చి వారితో, "ఇదిగో, వీరందరి దగ్గర చాలా ధనం ఉందనేది వాస్తవం, కాని దానిలో కొద్ది భాగాన్ని మాత్రమే వారు ఇచ్చారు. కాని బీద విధవరాలు ఈ రోజు తన అవసరాలకు కావలసిన ధనం మొత్తం హుండీలో వేసింది.
\v 44 కాబట్టి వారందరి కంటే కూడా ఈ బీద విధవరాలు చాలా ధనాన్ని హుండీలో వేసింది" అని చెప్పాడు.
\s5
\c 13
\p
\v 1 యేసు దేవాలయ ఆవరణ వదిలి వెళ్తున్నప్పుడు, ఆయన శిష్యుల్లో ఒకడు ఆయనతో, "బోధకా, ఈ భవనాలు ఎంత రమ్యంగా ఉన్నాయో, ఈ పెద్ద పెద్ద రాళ్లు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో చూడండి" అన్నాడు.
\v 2 యేసు అతడితో, "నిజమే, నువ్వు చూస్తున్న ఈ భవనాలు అద్బుతంగా ఉన్నాయి. కాని వీటి గురించి నీకు ఒకటి చెప్పాలి. ఇవి పూర్తిగా ధ్వంసం అవుతాయి. ఈ కోవెల ఆవరణలో ఒకదానిపై ఒకటి పేర్చిన ఈ రాళ్లు ఇక్కడ ఉండవు" అన్నాడు.
\s5
\p
\v 3 వాళ్ళు దేవాలయం నుండి లోయలోగుండా వెళ్ళి ఒలీవ కొండకు చేరుకున్నారు. అక్కడ యేసు కూర్చున్నాడు. వారు ఒంటరిగా ఉన్నపుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రేయ ఆయన దగ్గరకు వచ్చి, ఆయనతో,
\v 4 ఈ విషయాలన్నీ ఎప్పుడు జరుగుతాయో చెప్పమని ఇవి జరగడానికి ముందు జరిగే విషయాలు ఏమిటని అడిగారు.
\s5
\v 5 యేసు వారికి సమాధానంగా, జరగబోయే వాటికి సంబంధించి ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్తపడండి.
\v 6 అనేకమంది వచ్చి నేను వాళ్ళను పంపానని చెబుతారు. వాళ్ళు, "నేనే క్రీస్తును" అని చెప్పుకుంటారు. వాళ్ళు అనేకమందిని నా పేరుతో మోసం చేస్తారు."
\s5
\p
\v 7 "మీరు దూర ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్న వార్తలు గురించి విన్నప్పుడు, అలాగే ఆ యుద్ధాలలో సైనికుల పోరాటాల శబ్దాలు విన్నప్పుడు, కంగారుపడవద్దు. ఈ విషయాలన్ని కచ్చితంగా జరుగుతాయి. కాని ఇవి జరుగుతున్నప్పుడే, దేవుడు మొదట్లో నిర్ణయించినట్లుగా అంతా నాశనం చేస్తున్నట్లు ఆలోచించకండి."
\p
\v 8 "దేశ దేశాల్లో ఉన్న మనుష జాతులు ఒకరితో ఒకరు కలహించుకుంటారు. వివిధ దేశాల రాజులు, అధిపతులు ఒకరిపై ఒకరు పోరాడుకుంటారు. వివిధ ప్రాంతాల్లో భూకంపాలు కూడా వస్తాయి, అనేకచోట్ల కరువుకాటకాలు వస్తాయి. ఇలా జరుగుతున్నప్పటికీ, మనుషులు పడుతున్న ఈ బాధలకి ఇది కేవలం ఆరంభం మాత్రమే. వీళ్ళు పడబోయే ఈ మొదటి హింసలు, బిడ్డను కనడానికి స్త్రీ పడే మొదటి పురిటినొప్పుల వంటివే. వాళ్ళు అంతకంటే ఎక్కువ బాధలు పడతారు."
\s5
\p
\v 9 "ఆ సమయంలో మనుషులు మీకు చేయబోయే దానికి సిద్ధంగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని బంధించి నాయకుల సమూహం ముందు నిలబెట్టి, దోషుల్లా విచారిస్తారు. మనుషులు వివిధ ప్రార్థనా మందిరాల్లో మిమ్మల్ని కొడతారు. ప్రభుత్వ ఉన్నత ఆధికారుల ముందుకు మిమ్మల్ని ఈడ్చుకు పోయి విచారిస్తారు. దాని ఫలితంగా మీరు నా గురించిన సువార్తను బోధించడానికి వీలౌవుతుంది.
\v 10 దేవుడు ముందుగా నిర్ణయించిన తన ప్రణాళిక ప్రకారం సమస్తాన్నీ నాశనం చేయకముందే నా శిష్యులు సువార్తను అన్నీ దేశాల వారికి కచ్చితంగా ప్రకటించాలి."
\s5
\p
\v 11 "ఆ మనుషులు మిమ్మల్ని బంధించినప్పుడు ఏం చెప్పాలా అని ఆందోళన పడకండి. ఆ సమయంలో దేవుడు మీ మనస్సుల్లో పెట్టినది చెప్పండి. ఆ సమయంలో మాట్లాడేది మీరు కాదు. మీ ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు.
\v 12 కొందరు తమ సొంత సోదర సోదరీలకు ద్రోహం చేస్తారు. కొందరు తండ్రులు తమ పిల్లలను మోసం చేస్తారు. కొందరు పిల్లలు తమ తల్లి దండ్రులను మోసం చేస్తారు.
\v 13 నన్ను నమ్మడం వల్ల అనేక మంది మిమ్మల్ని ద్వేషిస్తారు. అయితే ఎవరైతే తాము జీవితాంతం నాపై నమ్మకం ఉంచుతారో, వారే రక్షణ పొందగలరు."
\s5
\p
\v 14 "ఆ సమయంలో అసహ్యమైన వస్తువులు, విషయాలు కోవెలలోకి వస్తాయి. వాటివల్ల కోవెల అపవిత్రం అవుతుంది. అందువల్ల మనుషులు దేవాలయానికి వెళ్ళడం మానేస్తారు. ఏదైతే అక్కడ ఉండకూడదో, అది అక్కడ ఉండటం మీరు చూసినప్పుడు, త్వరగా అక్కడనుంచి పారిపోవాలి" (దీన్ని చదువుతున్న వాళ్ళు దీనిపై శ్రద్ధ పెట్టాలి). ఆ సమయంలో ఎవరైతే యూదయ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళు కొండ ప్రాంతాలకు పారిపోవాలి.
\v 15 ఇళ్ళ బయట ఉన్నవాళ్ళు దేనికోసం తమ ఇళ్ళల్లోకి పోకూడదు.
\v 16 పొలాల్లో పనిచేసుకునే వాళ్ళెవ్వరూ వేరే బట్టల కోసం తమ ఇళ్ళకు పోకూడదు."
\s5
\p
\v 17 "ఆ రోజుల్లో గర్భవతుల గురించీ, పాలిస్తున్న తల్లుల గురించీ చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు తప్పించుకు పారిపోవడం చాలా కష్టం.
\v 18 ఆ రోజుల్లో వచ్చే హింసలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి అవి చలికాలంలో రాకూడదని ప్రార్థన చేయండి, అప్పుడు ప్రయాణం చేయడం కష్టం.
\v 19 ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకూ కనీవినీ ఎరుగని కష్టాలు ఆ రోజుల్లో వస్తాయి.
\v 20 ప్రభువైన దేవుడే ఆ హింసలు తగ్గించాలని నిర్ణయించుకోపోతే, ఆ హింసలు విపరీతంగా ఉంటాయి. చాలామంది హతం అవుతారు. కాని ఆయన ఆ రోజుల్ని తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తాను ఎంపిక చేసుకున్న వాళ్ళపై చాలా ప్రేమ."
\s5
\p
\v 21 "కాబట్టి ఆ సమయంలో ఎవరైనా మీతో, "క్రీస్తు ఇక్కడ ఉన్నాడు చూడండి, అక్కడ ఉన్నాడు చూడండి" అని చెబితే నమ్మవద్దు.
\v 22 ఆ కాలంలో కొందరు తామే క్రీస్తు అంటూ అందరినీ తప్పుదోవ పట్టిస్తారు. కొందరు తాము దేవుడు పంపిన ప్రవక్తలుగా అందరికీ చెప్పుకుంటారు. వాళ్ళు అనేక అద్బుతాలు చేసి చూపిస్తారు. అంతేకాకుండా వాళ్ళు దేవుడు ఎంపిక చేసుకున్నవాళ్ళను కూడా మోసం చేయడానికి చూస్తారు."
\p
\v 23 "ఇవి అన్నీ జరగడానికి ముందే వాటిని గురించి నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నానని గుర్తుపెట్టుకోండి" అప్రమత్తంగా ఉండండి"
\s5
\v 24 మనుషులు ఆ హింసలు అనుభవించిన తరువాత సూర్యుడు నల్లగా మారతాడు. చంద్రుడు ప్రకాశించడు.
\v 25 నక్షత్రాలు ఆకాశం నుంచి రాలి పడతాయి. ఆకాశంలో ఉన్న శక్తులన్నీ వాటి స్థానం నుంచి కదిలిపోతాయి.
\v 26 అప్పుడు మహిమతోను, శక్తితోను వస్తున్న మనుష్య కుమారుడినైన నన్ను ఈ ప్రజలందరూ చూస్తారు."
\p
\v 27 "అప్పుడు నేను నా దూతలను భూమి మీదకు పంపిస్తాను. వాళ్ళు అన్నీ చోట్ల దేవుడు ఎంపిక చేసుకున్న వాళ్ళనందరినీ అంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా కలిపి నా దగ్గరకు పోగుచేస్తారు.
\s5
\v 28 అంజూరు చెట్లు ఏవిధంగా పెరుగుతాయో మీరందరూ నేర్చుకోవాలని ఇప్పుడు నేను కోరుతున్నాను. ఎప్పుడైతే వాటి కొమ్మలు లేతగా మారతాయో, వాటికీ ఆకులు చిగురిస్తాయే అప్పుడు మనకు వేసవికాలం దగ్గర్లో ఉందని మీకు అర్థం అవుతుంది.
\v 29 అదే విధంగా నేను ఇప్పుడు ఏవైతే వివరించానో, అవి జరగడం చూడగానే నేను తిరిగి వచ్చే సమయం దగ్గర్లో ఉందని మీలో మీరు తెలుసుకుంటారు. నేను అప్పటికే తలుపు దగ్గర ఉన్నట్లుగా ఆ సమయం ఉంటుంది.
\s5
\v 30 నేను చెప్పే విషయాలు జరిగే వరకు మనుష్య జాతి అంతం కాదు. ఇది మీ మనస్సుల్లో ఉంచుకోండి."
\p
\v 31 "నేను చెప్పిన ఈ ప్రవచనాలు తప్పక జరుగుతాయని మీరు నమ్మవచ్చు. భూమి, ఆకాశాల్లో ఉన్నవి ఒకనాటికి నశించి పోతాయేమో కాని నేను మీతో చెప్పే ఈ విషయాలు కచ్చితంగా జరుగుతాయి.
\v 32 కాని నేను ఏ సమయంలో తిరిగి వస్తానో ఏవరికి కచ్చితంగా తెలియదు. పరలోకంలోని దేవదుతలకు కూడా తెలియదు. చివరికి దేవుని కుమారుడినైన నాక్కూడా తెలియదు. ఒక్క నా తండ్రికి మాత్రమే తెలుసు.
\s5
\v 33 ఏ సమయంలో, ఏప్పుడు ఈ సంఘటనలు జరుగుతాయో మీకు తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి, సిద్ధంగా ఉండండి."
\p
\v 34 "ఒక మనిషి తన ఇల్లు విడిచి చాలా దూరం వెళ్ళవలసి వచ్చినప్పుడు, అతడు తన పనివాళ్ళను పిలిచి ఇంటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. తన పనివాళ్ళల్లో ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పజెప్పాడు. అలాగే తన ఇంటి కాపలాదారుడికి తాను వచ్చే సరికి సిద్ధంగా ఉండమని చెప్పాడు.
\s5
\v 35 తన యజమానుడు తెల్లవారుజామున వస్తాడో, కోడి కూసే వేళకు వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, సాయంత్రం పూట వస్తాడో అతడికి తెలియదు కాబట్టి ఆ మనిషి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అలాగే నేను ఏప్పుడు తిరిగి వస్తానో మీకు తెలియదు కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి.
\v 36 నేను మీరు ఉహించని సమయంలో వచ్చేటప్పటికి, మీరు సిద్ధంగా ఉండకపోవడం జరగకూడదు.
\v 37 ఈ మాటల్ని నా శిష్యులైన మీకు మాత్రమే చెప్పడం లేదు. నేను అందరికీ అంటే నా మాటలు చదివే వాళ్ళందరికీ చెబుతున్నాను. ఎప్పుడూ సిద్ధంగా ఉండండి" అని చెప్పాడు.
\s5
\c 14
\p
\v 1 వారం రోజులపాటు జరుపుకునే పండుగను వాళ్ళు పస్కా పండుగ అని పిలుస్తారు. దానికి ఇంకా రెండు రోజులే ఉంది. అదే సమయంలో వారు పులియని రొట్టెల పండుగను కూడా జరుపుకుంటారు. ప్రధాన యాజకులు, యూదా ధర్మ శాస్త్ర బోధకులు యేసును రహస్యంగా బంధించి ఎలా చంపాలా అని ఆలోచన చేస్తున్నారు.
\v 2 కాని వాళ్ళు ఒకరితో ఒకరు ఇలా, "మనం ఈ పండగ రోజుల్లో ఏమీ చేయ వద్దు. ఎందుకంటే ఇప్పుడు చేస్తే ప్రజలు మనపై ఎదురు తిరిగి అల్లర్లు చేస్తారు" అని చెప్పుకున్నారు.
\s5
\p
\v 3 యేసు బేతనియ లోని సీమోను ఇంట్లో ఉన్నాడు. అతడు కుష్టురోగి. వాళ్ళందరూ భోజనం చేస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆమె రాతి కూజాలో చాలా విలువైన సువాసననిచ్చే అత్తరు తీసుకు వచ్చింది. ఆమె ఆ సీసా మూత తీసి యేసు తలపై మొత్తం అత్తరును పోసింది.
\v 4 అక్కడే ఉన్న కొంతమంది మనుషులు ఆమె చేసింది చూసి చాలా కోపగించుకుని, తమలో తాము, "ఆమె ఈ అత్తరు మొత్తాన్ని ఇలా వృధా చేయడం ఎందుకు?
\v 5 దీన్ని అమ్మితే సంవత్సరానికి సరిపడా ఆదాయం వచ్చేది. ఆ డబ్బును పేదవాళ్ళకు ఇవ్వవచ్చు కదా" అనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆమెను విమర్శించారు.
\s5
\p
\v 6 కాని యేసు వాళ్ళతో, "ఆమెను తిట్టవద్దు. ఆమె నాకు చేసిన ఈ పని సరైనదిగానే నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు ఆమెను బాధ పెట్టవద్దు.
\v 7 పేద ప్రజలు ఎప్పుడూ మీతోనే ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకు సాయం చేయవచ్చు. కాని నేను మీతో ఎక్కువ కాలం ఇక్కడ ఉండను.
\v 8 ఆమె ఏమైతే చేయగలదో, అది సరిగానే చేసినందుకు అభినందించాలి. నన్ను ఆపాదమస్తకం అభిషేకించడం ద్వారా నా శరీరాన్ని సమాధి చేయడానికి సిద్ధం చేసింది. ఎందుకంటే నేను త్వరలో చనిపోతున్నానని ఆమెకు తెలిసే ఇది చేసింది.
\v 9 నేను మీకు చెప్పేదేంటంటే, లోకమంతటికీ ఈ సువార్త ప్రచారం చేసేటప్పుడు నా శిష్యులు ఆమె చేసిన దీన్ని తప్పక చెబుతారు, మనుషులు ఆమెను గుర్తు చేసుకుంటారు" అని చెప్పాడు.
\s5
\p
\v 10 అప్పుడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి , ఆయన్ని బంధించడానికి వాళ్ళకు తాను ఏ విధంగా సాయపడగలడో మాట్లాడాడు. తాను పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైనప్పటికీ ఈ పాపానికి ఒడిగట్టాడు.
\v 11 అతడు వాళ్ళకు సాయం చేయటానికి సిద్ధపడినందుకు ప్రధాన యాజకులు చాలా సంతోషించారు. వాళ్ళు అతడికి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నారు. దానికి యూదా అంగీకరించి, ఆయన్ని వాళ్లకు అప్పగించడానికి అనువైన సమయం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాడు.
\s5
\p
\v 12 పొంగని రొట్టెల పండగ మొదటి రోజున, పస్కా కోసం గొర్రెల్ని వధించే సమయంలో యేసు శిష్యులు ఆయనతో, "మనందరం భోజనం చెయ్యడం కోసం ఎక్కడ ఏర్పాటు చెయ్యమంటావు?" అని అడిగారు.
\v 13 ఆ ఏర్పాట్లు చేయడానికి ఆయన తన శిష్యుల్లో ఇద్దర్ని పిలిచి యేసు, "యెరూషలేముకు వెళ్ళండి. పెద్ద కుండలో నీళ్ళు నింపుకుని వెళ్తున్న ఒక మనిషి మీకు ఎదురౌతాడు. అతడి వెంట వెళ్ళండి.
\v 14 అతడు ఇంట్లోకి వెళ్ళగానే ఇది ఎవరి ఇల్లు అని అడిగి, అతడితో, "మా బోధకుడు శిష్యులతో కలసి పస్కా పండగ భోజనం చేయడానికి ఏర్పాటు చేయమని మాకు చెప్పాడు. దయచేసి మాకు ఒక గది చూపించు" అని అడగండి.
\s5
\v 15 అతడు మీకు ఆ ఇంటి పైఅంతస్తులోని పెద్దగది చూపిస్తాడు. అది మనం భోజనం చేయడానికి కావలసిన అన్ని సామాన్లతో సిద్ధపరచి ఉంది. అప్పుడు అక్కడ మన కోసం భోజనాలు సిద్ధపరచండి" అని చెప్పాడు.
\v 16 కాబట్టి ఆ ఇద్దరు శిష్యులు ఆ నగరంలోకి వెళ్ళి అక్కడ ఆయన చెప్పినట్లుగానే అన్ని జరగడం చూశారు. వాళ్ళు పస్కా పండగకు కావలసిన భోజనం అక్కడ సిద్ధం చేశారు.
\s5
\p
\v 17 సాయంకాలం అయినప్పుడు, యేసు ఆయన పన్నెండు మంది శిష్యులు అక్కడకి చేరుకున్నారు.
\v 18 వాళ్ళందరూ అక్కడ కూర్చుని తింటున్నప్పుడు, యేసు వాళ్ళతో, "జాగ్రత్తగా వినండి. శత్రువులు నన్ను బంధించడానికి మీలో ఒకడు అవకాశం ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ నాతో కలసి భోజనం చేస్తున్నారో, వాళ్ళల్లో ఒకడు ఇది చేస్తాడు" అని చెప్పాడు.
\v 19 ఆ శిష్యులు బాధపడుతూ, ఆయనతో ఒకడి తరువాత ఒకడు, "కచ్చితంగా నేను కాదుగా?" అని అడిగారు.
\s5
\v 20 అప్పుడు ఆయన వారితో, "మీ పన్నెండు మందిలో నాతో పాటు గిన్నెలోని పులుసులో రొట్టె ముంచే వాడే.
\v 21 మనుష్య కుమారుడినైన నేను చనిపోతాను. ఎందుకంటే ఆ విధంగానే నా గురించి ముందుగానే రాశారు. కాని నన్ను మోసం చేసిన ఆ మనిషికి భయంకరమైన శిక్ష ఉంది. నిజానికి, అతడు పుట్టకపోతేనే, ఆతడికి చాలా మంచిది" అన్నాడు.
\s5
\p
\v 22 వాళ్ళు తింటున్నప్పుడు ఆయన ఒక రొట్టెను తీసుకుని, దేవునికి దానికోసం కృతజ్ఞతలు చెప్పాడు. తరువాత ఆ రొట్టెను ముక్కలు చేసి వారికీ ఇస్తూ వారితో, "ఇది నా శరీరం ఇది తీసుకుని తినండి."
\v 23 ఆ తరవాత, ద్రాక్ష రసంతో నిండిన గిన్నెను తీసుకుని, దేవునికి దాని కోసం కృతజ్ఞతలు చెప్పాడు. తరువాత ఆయన వాళ్ళకి దాన్ని ఇస్తే , వాళ్ళందరూ తాగారు.
\v 24 ఆయన వారితో , "ఈ ద్రాక్ష రసం నా రక్తం, నా శత్రువులు నన్ను చంపినపుడు చిందేది. అనేకుల పాపాలను క్షమించడానికి దేవుడు చేసిన వాగ్దానాన్ని నా రక్తంతో స్థిరపరుస్తున్నాను.
\v 25 ఇది మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. దేవుడు తనను తాను రాజుగా చూపించుకున్నప్పుడే ఈ ద్రాక్ష రసాన్ని తారాగుతాను అప్పటి వరకు తాగను.
\s5
\p
\v 26 ఒక కీర్తన పాడిన తరువాత, వాళ్ళు ఒలీవ కొండకు బయలుదేరి వెళ్లారు.
\v 27 వాళ్ళు ఆ దారిలో వెళ్ళ్తున్నప్పుడు యేసు వాళ్ళతో, "దేవుడు నా గురించి చెప్పినది వాళ్ళు లేఖనాల్లో ఇలా రాశారు, "నేను గొర్రెల కాపరిని చంపుతాను, దానితో అతని గొర్రెలు చెల్లాచెదురు అవుతాయి." ఇప్పుడు ఆ మాటలు నిజం కాబోతున్నాయి. మీరు నన్ను వదలి పారిపోతారు.
\s5
\v 28 కాని దేవుడు మళ్ళీ నన్ను బ్రతికించిన తరువాత, నేను మీ కంటే ముందుగా గలిలయ రాష్ట్రానికి వెళ్తాను. అక్కడ మళ్ళీ మిమ్ముల్ని కలుస్తాను." అని చెప్పాడు.
\p
\v 29 పేతురు ఆయనతో, "బహుశా మిగతా శిష్యులందరూ నిన్ను వదలినా నేను మాత్రం నిన్ను వదలి పెట్టనే పెట్టను." అన్నాడు.
\s5
\v 30 యేసు అతడితో, "ఈ అర్ధరాత్రి కోడి రెండుసార్లు కూయకముందే, నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు నా గురించి చెబుతావు.
\v 31 కాని పేతురు ఆయనతో, "వాళ్ళు నన్ను చంపినా కూడా నువ్వు నాకు తెలియదని చెప్పనే చెప్పను"అని గట్టిగా వాదించాడు. అలాగే మిగతా శిష్యులు కూడా అదే విధంగా చెప్పారు.
\s5
\p
\v 32 అదే మార్గంలో గేత్సేమనే అనే చోటికి యేసు, ఆయన శిష్యులు వచ్చారు. అప్పుడు ఆయన తన శిష్యులు కొందరితో, "నేను ప్రార్థన చేసుకుని వచ్చేవరకు ఇక్కడ ఉండండి" అని చెప్పాడు.
\v 33 ఆయన పేతురును, యాకోబును, యోహానును తీసుకుని వెళ్ళాడు. ఆయన చాలా కలత చెందాడు.
\v 34 ఆయన వారితో , "నేను చాల బాధాకరమైన స్థితిలో ఉన్నాను. అది నా చావును గురించిన బాధ. మీరు ఇక్కడ ఉండి గమనించండి" అన్నాడు.
\s5
\v 35 ఆయన కొంచెం ముందుకు వెళ్ళి, నేలమట్టుకు వంగాడు. ఈ బాధలు పడకుండా సాధ్యమైతే తప్పించ మని ప్రార్థన చేసాడు.
\v 36 ఆయన , "నా తండ్రి , నువ్వే సమస్తాన్ని చేసేవాడివి కాబట్టి ఇప్పుడు నాకు ఈ హింసలు తప్పించు. అయితే నేను కోరింది తప్పక చెయ్యాలని కాదు. నువ్వు ఏం చెయ్యాలనుకున్నావో అదే చెయ్యి.
\s5
\v 37 అప్పుడు ఆయన తిరిగి తన శిష్యుల దగ్గరికి వస్తే వారు నిద్రపోతున్నారు. ఆయన వారిని నిద్రలేపి వారితో, "సీమోనూ, నువ్వు కూడా నిద్ర పోతున్నావా? కొంచం సేపు కూడా మెలకువగా ఉండలేరా?" అన్నాడు.
\v 38 ఆయన వారితో, "నేను చెప్పింది చెయ్యాలని మీకు ఉంది. కాని మీరు బలహీనులు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్ధించండి. దాని వల్ల మీకు శోధనలు వచ్చినపుడు తట్టుకుని నిలబడగలరు.
\p
\v 39 తరవాత మళ్ళీ ప్రార్థన చేయడానికి అక్కడి నుండి వెళ్ళి, అంతకుముందు ప్రార్థన చేసినట్టే మళ్ళీ చేసాడు.
\s5
\v 40 శిష్యులు ఆ సమయంలో నిద్రమత్తులో జోగుతున్నందున, కనీసం కళ్ళు తెరవలేకపోయారు. ఆయన వాళ్ళని నిద్రలేపినప్పుడు ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు నోరు తెరవడానికి సిగ్గుపడ్డారు.
\p
\v 41 ఆయన మళ్ళా వెళ్ళి ప్రార్థించాడు. ఆయన మూడోసారి వచ్చి చూసినప్పుడు, వాళ్ళు మళ్ళా నిద్రించడం ఆయన గమనించి, వాళ్ళతో, "మీరింకా నిద్రపోతూనే ఉన్నారా? సరేలే, ఇంక అవసరం లేదు. నేను హింసలు పడే సమయం మొదలైంది. మనుష్యకుమారుడినైన నన్ను పట్టుకోవడానికి పాపాత్ములు తన ప్రయత్నం మొదలుపెట్టారు. చూడండి.
\v 42 కాబట్టి లేవండి. ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. నన్ను పట్టుకోవాలనుకున్న వాళ్ళకి దారి చూపిస్తున్న వాడు వస్తున్నాడు" అన్నాడు.
\s5
\v 43 ఆయన వాళ్ళతో మాట్లాడుతుండగానే యూదా వచ్చాడు. అతడు యేసు పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైనప్పటికీ యేసు శత్రువులు ఆయన్ని పట్టుకునే వీలు కల్పించడానికి అతడు వచ్చాడు. కత్తులతో, దుడ్డు కర్రలతో ఒక గుంపు అతనితో వచ్చింది. యూదా సంఘ పెద్దలు వాళ్ళని పంపారు.
\v 44 ద్రోహానికి పాల్పడిన యూదా అంతకుముందు ఆ గుంపుతో "నేనెవర్నైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే మీకు కావలసినవాడు. నేను ఆయన్ని ముద్దు పెట్టుకోగానే, ఆయన్ని బంధించి అక్కడ నుంచి తీసుకుపోండి" అని చెప్పాడు.
\v 45 కాబట్టి యూదా అక్కడకు చేరుకున్న వెంటనే యేసు దగ్గరకు వెళ్ళి యేసుతో, "నా బోధకుడా" అని పిలిచి, ఆయన్ని ముద్దు పెట్టుకున్నాడు.
\v 46 అప్పుడు వాళ్ళు యేసును పట్టుకున్నారు.
\s5
\v 47 అయితే ఆయన పక్కనే ఉన్న శిష్యుల్లో ఒకడు కత్తిదూసి ప్రధాన యాజకుని పనివాడిపై దాడి చేసి వాడి చెవి నరికాడు.
\p
\v 48 యేసు వాళ్ళతో, "నేనేమైనా బందిపోటు దొంగనా, నన్ను బంధించడానికి కత్తులతోను, దుడ్డు కర్రలతోను వచ్చారు?
\v 49 వింతగా ఉంది. నేను ప్రతి రోజూ కోవెల ఆవరణలో ప్రజలకు బోధించ లేదా? మరి అక్కడ ఎందుకని నన్ను బంధించలేదు? ఐతే ప్రవక్తలు నా గురించి గ్రంథాల్లో రాసినవి నిజం కావడానికి ఇలా జరుగుతుంది" అని చెప్పాడు.
\p
\v 50 ఆయన శిష్యులంతా ఒక్కసారిగా ఆయన్ని వదలి పారిపోయారు.
\s5
\v 51 ఆ సమయంలో ఒక యువకుడు యేసు వెంట వెళ్ళ్తున్నాడు. అతడు తన శరీరానికి నార బట్టను మాత్రమే చుట్టుకున్నాడు. ఆ గుంపు అతణ్ణి కూడా పట్టుకోబోయారు.
\v 52 అతడు వాళ్ళని విదిలించుకొని తన నార బట్టను వాళ్ళ చేతుల్లోనే వదలి, బట్టల్లేకుండా పారిపోయాడు.
\s5
\p
\v 53 యేసును బంధించిన మనుషులు ఆయన్ని ప్రధాన యజకుని ఇంటికి తీసుకుని వెళ్ళారు. యూదా పెద్దల సమాజం మొత్తం అక్కడికి చేరుకుంటున్నారు.
\v 54 పేతురు యేసును కొంత దూరంగా వెంబడిస్తూ వెళ్ళాడు. ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి వెళ్ళి అక్కడ కాపలా మనుషులతో పాటు కూర్చుని చలికాచుకుంటున్నాడు.
\s5
\p
\v 55 ప్రధాన యాజకులు, యూదా సమాజ పెద్దలందరూ యేసుకు మరణ శిక్ష పడడానికి కావలసిన గట్టి సాక్ష్యం కోసం చూశారు. కాని అధికారులు ఆయన్ని చంపడానికి సరిపడే సాక్ష్యాలు వాళ్ళు తీసుకు రాలేకపోయారు.
\v 56 కొందరు యేసును గురించి అబద్ధాలు చెప్పారు, కాని వాళ్ళు చెప్పిన సాక్ష్యాల్లో ఒక్కటి కూడా ఒకదానితో ఒకటి సరిపడలేదు. కాబట్టి యేసుపై చర్యలు తీసుకోవడానికి వాళ్ళు చెప్పిన సాక్ష్యాల్లో తగినంత బలం లేదు.
\s5
\p
\v 57 చివరికి కొందరు తప్పుడు ఆరోపణలు మోపుతూ,
\v 58 "మనుషులు కట్టిన ఈ దేవాలయాన్ని నేను కూల్చివేసి, ఏ ఒక్కరి సాయం లేకుండానే దాన్ని తిరిగి మూడురోజుల్లోనే కడతాను అని అతడు చెప్పినప్పుడు మేము విన్నాము" అని ఆరోపించారు.
\v 59 కాని మిగతా వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళల్లో కొందరి సాక్ష్యం సరిపోలేదు.
\s5
\p
\v 60 అప్పుడు ప్రధాన యాజకుడు వాళ్ళ ఎదుట నిలబడి యేసుతో, "నువ్వు ఏమీ జవాబు చెప్పవా? నీపై వీళ్ళు చేస్తున్నా ఆరోపణలు గురించి నువ్వేం చెబుతావు?" అని అడిగాడు.
\v 61 కాని యేసు ఏ జవాబూ చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకుడు మళ్ళీ ప్రయత్నిస్తూ, ఆయనతో, "నువ్వు క్రీస్తువా? నువ్వు దేవుని కుమారుణ్ణి అని చెబుతున్నావా?" అని అడిగాడు.
\v 62 యేసు, "నేనే. ఇంకా సర్వశక్తిమంతుడైన ఆ దేవుని కుడిచేతి ప్రక్కన కూర్చుని పాలించే మనుష్య కుమారుడిలా నన్ను నువ్వు చూస్తావు. ఆకాశం నుంచి మేఘవాహనుడై క్రిందికి దిగి వచ్చే నన్ను నువ్వు కూడా చూస్తావు" అన్నాడు.
\s5
\p
\v 63 యేసు ఆవిధంగా చెప్పినప్పుడు, ఆయన మాటలకు నిరసనగా ప్రధాన యాజకుడు తన పై వస్త్రాలు చింపుకుని, "ఈ మనిషికి వ్యతిరేకంగా ఇంతకంటే సాక్ష్యాలు ఇంకేం కావాలి?
\v 64 ఇతడు చేసిన దైవదూషణ మీరు విన్నారు కదా. వీడు తనని తాను దేవుడిగా చెప్పుకుంటున్నాడు" అన్నాడు. వారంతా అంగీకరించి యేసుపై నేరం ఖాయం చేసి ఆయన్ని మరణ శిక్షకు అర్హుడిగా ఎంచారు.
\v 65 అప్పుడు కొందరు ఆయనపై ఉమ్మి వేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టడం మొదలుపెట్టారు. ఆయనతో, "నువ్వు ప్రవక్తవైతే, నిన్ను కొట్టిందెవరో చెప్పు" అంటూ అపహసించారు. యేసుకు కాపలాఉన్నవాళ్లు కూడా ఆయన్ని తమ అరచేతుల్తో కొట్టారు.
\s5
\p
\v 66 పేతురు ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలో ఉన్నపుడు , ప్రధాన యజకుని ఇంట్లో పనిచేసే ఒక పాప అతడి దగ్గరకు వచ్చింది.
\v 67 చలిమంట దగ్గర చలి కాచుకుంటున్న పేతుర్ని ఆ పాప చూసినప్పుడు, అతని దగ్గరగా వచ్చి పరీక్షగా చూసింది. అప్పుడు ఆమె, "నజరేతునుంచి వచ్చిన యేసు అనే మనిషితో పాటు నువ్వు కూడా ఉన్నావు కదా" అని అడిగింది.
\v 68 కాని అతడు నిరాకరిస్తూ, "నువ్వు చెబుతున్న దాని గురించి నాకు తెలియదు" నువ్వు చెప్పెదానిగూర్చి నాకేమి అర్థం కావడం లేదు" అని చెప్పాడు. అప్పుడు అతడు అక్కడ నుంచి ఆవరణలోని గుమ్మం దగ్గరకు వెళ్ళిపోయాడు.
\s5
\v 69 అతణ్ణి ఆ పని మనిషి అక్కడ చూసి మళ్ళీ ఆ ఆవరణలో నిలుచున్న వాళ్ళతో "ఇతడు కూడా ఇవాళ బంధించిన ఆ వ్యక్తి మనుషుల్లో ఒకడు" అని చెప్పింది.
\v 70 కాని అతను మళ్ళీ ఆ మాటని నిరాకరించాడు. కొంతసేపటికి అక్కడ నిలుచున్న వాళ్ళు పేతురుతో, "నువ్వు కూడా గలిలయ రాష్ట్రానికి చెందిన వాడవని చెప్పొచ్చు. కాబట్టి యేసుతో పాటు ఉన్నవారిలో నువ్వు కూడా ఒకడివే" అన్నారు.
\s5
\v 71 కానీ అతడు తాను చెప్పేది నిజం కాకపోతే దేవుడు తన్ను శిక్షిస్తాడని చెప్పడం మొదలు పెట్టాడు. అతడు, "మీరు చెప్పే వ్యక్తి గురించి నాకు అసలు తెలియదు" అని చెప్పాడు.
\v 72 వెంటనే రెండవ సారి కోడి కూసింది. అప్పుడు పేతురు యేసు తనతో ముందే చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. యేసు, "ఈ రోజు కోడి రెండు సార్లు కూయక ముందే నేను తెలియదని మూడు సార్లు అంటావు" అని చెప్పాడని గుర్తుకు వచ్చింది. అప్పుడు పేతురు యేసు తనకి తెలియదని మూడుసార్లు నిరాకరించానని అర్థమైనప్పుడు అతడు ఏడ్వటం మొదలు పెట్టాడు.
\s5
\c 15
\p
\v 1 తెల్లవారుజామున ప్రధాన యాజకులు, మిగతా యూదా సమాజ పెద్దలతో కలసి రోమా అధిపతి ముందు యేసుపై నేరారోపణ చెయ్యడం ఎలానో నిర్ణయిచడానికి సమావేశం అయ్యారు. వాళ్ళ కాపలదారులు మళ్ళీ యేసును చేతులు కట్టేసారు. వాళ్ళు ఆయన్ని గవర్నర్ పిలాతు ఇంటికి తీసుకువెళ్ళారు.
\p
\v 2 పిలాతు యేసుతో, "నువ్వు యూదుల రాజువని నువ్వు చెపుతున్నావా?" అని అడిగాడు. యేసు అతడితో, "నీకు నువ్వుగానే అడుగుతున్నావా?" అని అడిగాడు.
\v 3 అప్పుడు ప్రధాన యాజకులు యేసు చాలా తప్పుడు పనులు చేశాడని వాదించారు.
\s5
\v 4 కాబట్టి పిలాతు మళ్ళీ యేసుతో, "నీ దగ్గర ఏం సమాధానం లేదా? నువ్వు ఎన్నో నేరాలు చేసినట్టుగా వాళ్ళు నీపై ఆరోపిస్తున్నారో చూడు" అన్నాడు.
\v 5 కాని యేసు అంతకుమించి ఏం మాట్లాడలేదు. పిలాతు చాలా ఆశ్చర్యపోయాడు.
\s5
\p
\v 6 ప్రతి పస్కా పండుగ సమయంలో జైల్లో ఉన్న ఒక ఖైదీని విడుదల చేయడం అధిపతికి ఆచారంగా వస్తుంది.
\v 7 ఆ సమయంలో బరబ్బా అనే కరడుగట్టిన నేరస్థుడు జైల్లో ఉన్నాడు. అతడు రోమన్ ప్రభుత్వానికి ఎదురు తిరిగి, అనేక హత్యలు చేసాడు.
\v 8 కొంత మంది గుంపుగా పిలాతు దగ్గరకు వెళ్ళి గతంలో జరిగినట్లే తమకు ఎవరినైనా విడుదల చేయమని అడిగారు.
\s5
\v 9 పిలాతు సమాధానంగా వాళ్ళని, "ఎవరినైతే మీ రాజుగా చెబుతున్నారో ఆ వ్యక్తిని విడుదల చేయడం మీకు ఇష్టమేనా?" అని అడిగాడు.
\v 10 అతడు ఇలా ఎందుకు అడిగాడంటే, ప్రధాన యాజకులు ఏం చేయాలనుకుంటున్నారో అతడికి అర్ధమైంది. వాళ్ళు యేసుపై నిందారోపణలు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఆయన పై అసూయతో ఉన్నారు. కారణం అనేక మంది మనుషులు ఆయన శిష్యులుగా అవుతున్నారు.
\p
\v 11 కానీ ప్రధాన యాజకులు యేసుకు బదులుగా బరబ్బాను విడుదల చేయమని గుంపుని వేడుకునేలా ప్రేరేపించారు.
\s5
\v 12 పిలాతు వాళ్ళతో, "నేను బరబ్బాను విడుదల చేస్తే, మీ రాజును నేనేం చెయ్యాలని మీరు కోరుతున్నారు?" అని అడిగాడు.
\v 13 అప్పుడు వాళ్ళు తిరిగి బిగ్గరగా, "ఆయన్ని సిలువ వేయమని నీ సైనికులకు ఆజ్ఞాపించు" అని అరిచారు.
\s5
\p
\v 14 అప్పుడు పిలాతు వాళ్ళతో, "ఎందుకు? ఇతడు చేసిన నేరం ఏమిటి?" అని అడిగాడు. కాని వాళ్ళు మరింత గట్టిగా, "అతణ్ణి సిలువ వెయ్యి" అని అరిచారు.
\v 15 కాబట్టి అతడు ప్రజలను సంతోషపెట్టాలని బరబ్బను విడుదల చేశాడు. అప్పుడు సైనికులు యేసును కొట్టారు. తరువాత ఆయన్ని తీసుకువెళ్ళి సిలువ వేయమని పిలాతు అజ్ఞాపించాడు.
\s5
\p
\v 16 సైనికులు యేసును తమ సైనిక శిబిరాలకు తీసుకుపోయారు. వాళ్ళందరూ ఒక చోటికి చేరారు.
\v 17 వాళ్ళు యేసుకు పొడుగాటి ఊదారంగు అంగీ తొడిగి ముళ్ళ కంపతో చేసిన కిరీటం ఆయన తలపై పెట్టారు.
\v 18 అప్పుడు ఒక రాజును సంబోధించినట్టు పిలుస్తూ ఎగతాళి చేశారు. వాళ్ళు, "యూదుల రాజా నీకు జోహార్లు" అన్నారు.
\s5
\v 19 వాళ్ళు పదేపదే ఆయన తలపై కర్రతో కొడుతూ, ఆయనపై ఉమ్మివేశారు. ఆయన ముందు మోకాళ్ళపై కూర్చుని ఆయన్ని గౌరవిస్తున్నట్లు నటించారు.
\p
\v 20 వాళ్ళు ఆయన్ని ఎగతాళి చేయడం పూర్తి అయిన తరువాత ఆ ఊదారంగు అంగీ తీసి, ఆయన బట్టలు ఆయనకు తొడిగి, ఆయన్ని సిలువకు మేకులతో కొట్టడానికి నగరానికి బయటకు తీసుకు వెళ్లారు.
\p
\v 21 సీమోను అనే వ్యక్తి కురేనే నుంచి అప్పుడే వచ్చాడు. అతడు అలెగ్జాండరు, రూఫస్ ల తండ్రి. ఎక్కడినించో అతడు నగరంలోకి తన దారిని తాను యేసును దాటి పోతున్నాడు. అప్పుడు సైనికులు సీమోనును పట్టుకుని యేసు సిలువను మోయడానికి బలవంతపెట్టారు.
\s5
\v 22 సైనికులు గొల్గొతా అనే స్థలానికి వాళ్ళిద్దర్నీ తీసుకువచ్చారు. గొల్గొతా అంటే "పుర్రె" అని అర్థం.
\v 23 అప్పుడు వాళ్ళు ద్రాక్షరసంలో బోళాన్ని కలిపి ఆయనకు తాగడానికి ఇవ్వడానికి ప్రయత్నించారు. కాని ఆయన తాగలేదు.
\p
\v 24 కొందరు సైనికులు ఆయన బట్టలు తీశారు. అప్పుడు వాళ్ళు ఆయన్ని సిలువకు మేకులతో కొట్టారు. ఆ తరువాత చీట్లు ద్వారా ఆయన బట్టలు తమలో తాము పంచుకున్నారు.
\s5
\v 25 ఆయన్ని సిలువ వేసేటప్పటికి ఉదయం తొమ్మిది గంటలు అయింది.
\v 26 ఆయన్ని ఏ కారణంతో సిలువ వేస్తున్నారో, ఆ కారణాన్ని ఒక పలకపై రాసి, దాన్ని ఆయన తలపైన సిలువకు తగిలించారు. దానిమీద, "యూదులకు రాజు" అని రాశారు.
\p
\v 27 ఇద్దరు దొంగల్ని కూడా వాళ్ళు సిలువ వేశారు. యేసుకు కుడివైపున ఒకణ్ణి, ఎడమవైపున ఒకణ్ణి సిలువ వేశారు.
\v 28 ఆయనను అక్రమకారుల్లో ఒకడిగా ఎంచారు’ అని లేఖనాల్లో రాసిన వాక్కు దీని వలన నెరవేరింది.
\s5
\v 29 ఏవరైతే అటు వైపుగా వెళ్ళు తున్నవాళ్ళు, తమ తలలు అడ్డంగా ఉపుతూ ఆయన్ని అవమానించారు. వాళ్ళు, "ఆహా నువ్వు దేవాలయాన్ని పడగొట్టి మళ్ళీ మూడురోజుల్లోనే తిరిగి కడతానని చెప్పావు కదా.
\v 30 ఇప్పుడు సిలువ మీది నుంచి దిగి నిన్ను నువ్వు రక్షించుకుంటే, నువ్వు అది చేయగలవు అనుకుంటాము" అన్నారు.
\s5
\v 31 యూదుల ధర్మశాస్రాన్ని బోధకులతో కలసి ప్రధాన యాజకులు కూడా యేసును హేళన చేస్తూళు ఒకరితో ఒకరు, "ఇతడు అనేక మందిని ఇబ్బందుల్లోనించి రక్షించాడు కాని తనను మాత్రం రక్షించుకోలేడు" అన్నారు.
\v 32 వీడు "నేనే క్రీస్తును. ఈ ఇశ్రాయేలు ప్రజలను పాలించే రాజును, అన్నాడు. అతడి మాటలు నిజమైతే, అతడు తప్పకుండా ఇప్పుడు సిలువ దిగి వస్తాడు. అప్పుడు మేము నమ్ముతాము" అన్నారు. అలాగే ఆయనతో పాటు సిలువ వేసిన ఆ ఇద్దరు కూడా ఆయన్ని అవమానించారు.
\s5
\p
\v 33 మధ్యాహ్న సమయంలో ఆ ప్రదేశం మొత్తం చీకటిగా మారింది. మధ్యాహ్నం మూడు గంటలవరకు అలాగే చీకటిగానే ఉంది.
\v 34 మధ్యాహ్నం మూడు గంటలకు యేసు బిగ్గరగా కేకవేస్తూ, "ఏలోయి , ఏలోయి , లామా సబక్తానీ" అన్నాడు. అంటే నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచి పెట్టావు అని అర్థం.
\v 35 అక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు "ఏలోయి" అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు "అతడు ఏలీయా ప్రవక్తను పిలుస్తున్నాడు చూడండి" అన్నారు.
\s5
\p
\v 36 అందులో ఒకడు పరుగెత్తికెళ్లి పులిసిన ద్రాక్షరసంలో స్పాంజి ముంచి తీసుకొచ్చాడు. అతడు దాన్ని వెదురుకర్ర చివరన తగిలించి, యేసు నోటితో ఆ చిరకను పీల్చుకునేలా ఎత్తి నోటి దగ్గర పెట్టాడు. అతడు, "ఆగండి. ఇప్పుడు సిలువ నుండి ఇతన్ని దింపడానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం" అన్నాడు.
\p
\v 37 అప్పుడు యేసు గట్టిగా కేక పెట్టాడు. అప్పుడు ఊపిరి ఆగిపోయింది. ఆయన చనిపోయాడు.
\v 38 అదే సమయంలో దేవాలయం పవిత్ర స్థలానికి అడ్డుగా ఉన్న తెర పైనుంచి క్రిందికి రెండుగా చీలింది.
\s5
\v 39 యేసును సిలువకు మేకులతో కొట్టిన ఆ సైనికులపై అధికారి యేసుకు ఎదురుగా నిల్చుని ఉన్నాడు. యేసు చనిపోయిన విధానం అతడు చూసి "నిజంగానే ఈ మనిషి దేవుని కుమారుడు" అన్నాడు.
\p
\v 40 అక్కడ కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు కొంత దూరం నుంచి జరుగుతున్న సంఘటనలను చూస్తున్నారు. ఆయన గలిలయలో ఉన్నపుడు యేసుతో కలసి ఉన్నవాళ్ళు. ఆయనకు ఏంకావాలో వాటిని అందించేవారు. వారు యేసుతో కలసి యేరూషలేముకు వచ్చారు. వాళ్ళల్లో మగ్ధలేనే అనే ఊరినుంచి వచ్చిన మరియ ఉంది. వాళ్ళలో మరొక మరియ ఉంది. ఆమె యుసే, చిన్న యకోబులకు తల్లి సలోమి కూడా ఉంది.
\p
\v 41 ఆ సాయం సంధ్యా సమయంలో అరిమతయి నుండి వచ్చిన యోసేపు అక్కడకు వచ్చాడు.
\s5
\v 42 అతడు యూదుల మహాసభలో పేరు పొందిన ఒక సభ్యుడు. అతడు దేవుడే రాజుగా గల దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళలో ఒకడు.
\v 43 సబ్బాతుకు ముందు రోజును యూదులు సిద్ధపడే రోజుగా పిలిస్తారు. ఆ రోజు సాయంత్రం సమిపిస్తూ ఉండగా అతడు ధైర్యం తెచ్చుకొని పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు శరీరాన్ని సిలువ పై నుండి దించి వెంటనే సమాధి చేయడానికి తనకు ఇవ్వమని అడిగాడు.
\v 44 ఆ మాట విని పిలాతు, "యేసు ఇంత త్వరగా చనిపోయాడా?" అని ఆశ్చర్యపోయాడు. అప్పుడు తన అధికారులలో యేసును సిలువ వేసిన ఒకడిని పిలిచి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నాడు.
\s5
\v 45 ఆ అధికారి యేసు నిజంగా చనిపోయాడని నిర్ధారించాడు. అప్పుడు ఆ శరీరాన్ని యోసేపు తీసుకు వెళ్ళడానికి అంగీకరించాడు.
\p
\v 46 మరణించిన వారి శరీరాలకు చుట్టే నారతో చేసిన వస్త్రాలను యేసేపు తన వెంట తీసుకెళ్ళాడు. యేసేపు, అతనితో ఉన్న మరి కొద్ది మంది కలిసి యేసు శరీరాన్ని సిలువ పైనుండి దించి తాము తెచ్చిన వస్త్రాలతో చుట్టి, అంతకు మునుపే ఒక కొండ రాతిలో తొలిచిన సమాధిలో ఉంచారు. తరువాత వాళ్ళు ఒక పలకవంటి రాతి బండను దాని ద్వారానికి అడ్డుగా వేశారు.
\v 47 మగ్డలేనే నుండి వచ్చిన మరియ, యోసేపు తల్లి మరియా ఇద్దరు యేసు శరీరాన్ని ఎక్కడ ఉంచారో గమనించారు.
\s5
\c 16
\p
\v 1 యూదుల సబ్బాతు రోజు అనగా శనివారం పూర్తి అయిన వెంటనే, మగ్దలేనే నుండి వచ్చిన మరియ, చిన్న యాకోబు తల్లి మరియ, సలోమి అను ముగ్గురు స్త్రీలు, చనిపోయి సమాధిలో ఉంచిన యేసు శరీరానికి పూయాలని, అత్తరు సీసాలు, సువాసన వెదజల్లే లేపనాల వంటివి కొనుగోలు చేశారు. యూదులలో చనిపోయిన వారికి చేసే దిన కర్మల ఆచారంలో భాగంగా ఇవి కొన్నారు.
\p
\v 2 యూదుల కేలండర్ ప్రకారం వారంలోని మొదటి రోజైన ఆదివారం తెల్లవారుజామున ఆ స్త్రీలు తెల్లవారే లేచి తాము కొన్న సుగంధ ద్రవ్యాలు తీసుకుని యేసును ఉంచిన సమాధి వైపుగా వెళ్ళారు.
\s5
\p
\v 3 వాళ్ళు నడుస్తూ ఇలా మాట్లాడుకున్నారు. "ఆ సమాధి ముందు అడ్డంగా ఉంచిన బండ రాయిని దొర్లించడానికి మనకెవరు సాయం చేస్తారు?"
\v 4 వాళ్లక్కడకు చేరుకోగానే అడ్డంగా ఉంటుంది అనుకున్న ఆ పెద్ద బండ రాయి ఎవరో సునాయాసంగా దొర్లించినట్టు ప్రక్కకు పడి ఉంది.
\s5
\v 5 అప్పుడు ఆ స్త్రీలు గుహవంటి ఆ సమాధి లోపలికి వెళ్ళగానే వాళ్ళని ఆశ్చర్యచకితుల్ని చేసిన దృశ్యం ఒకటి కనబడింది. అక్కడ యువ ప్రాయంలో తెల్లటి దుస్తులతో వెలిగిపోతున్న దేవదూతను చూశారు.
\p
\v 6 అప్పుడు యువకుడిలా ఉన్న ఆ దేవదూత, "కంగారు పడకండి, మీరు సిలువకు మేకులతో కొట్టి క్రూరంగా హింసించి చంపిన నజరేతు వాడైన యేసు కోసం చూస్తున్నారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన లేచాడు. ఇక్కడ లేడు. మరణించిన తరువాత ఆయన శరీరాన్ని వాళ్ళు ఉంచిన స్థలం ఇదే.
\v 7 మీరు వెళ్ళి ఆయన శిష్యులకు ఈ విషయం చెప్పండి. ఇంతకుముందు ఆయన మీ అందరితో చెప్పినట్లు మీ అందరికంటే ముందే గలలీకి వెళ్ళిపోతున్నాడు. అక్కడకి వెళ్ళండి, మీరూ ఆయనని చూస్తారు" అని ఆ దేవదూత అన్నాడు.
\s5
\p
\v 8 అప్పుడు ఆ స్త్రీలు సమాధిలోనుండి బయటకు పరుగెత్తారు. భయమూ, కంగారూ కలగలిసిపోయి వణికిపోయారు. అందువల్ల ఎవరితోనూ ఒక్క మాట కూడా చెప్పడానికి తెగించలేదు.
\s5
\v 9 మరణంనుండి తిరిగి లేచిన యేసు ఆదివారం ఇంకా తెల్లవారక ముందే మొట్టమొదటిగా మగ్దలేనే నుండి వచ్చిన మరియకు కనపడ్డాడు. ఈమె గతంలో ఏడు అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న సమయంలో యేసు వచ్చి, వాటిని పారద్రోలగా స్వస్థత పొందిన స్త్రీ.
\v 10 ఆవిడ, యేసు మరణించాడని సంతాపంతో ఏడుస్తూ ఉన్న యేసు శిష్యుల దగ్గరకు ఉరుకులు పరుగులతో వెళ్ళి, యేసు తిరిగి లేచాడనీ, తాను కళ్ళారా చూశాననీ చెప్పింది.
\v 11 ఆవిడ ఎంత చెప్పినా వారు నమ్మలేక పోయారు.
\s5
\p
\v 12 అదేరోజు మరికొంత సేపటికి యేసు, తన శిష్యులలో ఇద్దరు యెరూషలేము నుండి వేరొక ప్రాంతానికి వెళుతుంటే, తోటి బాటసారిలాగ వచ్చి వారికి తనని తాను కనపరుచుకున్నాడు.
\v 13 ఆయనను గుర్తుపట్టిన వెంటనే ఆ ఇద్దరు శిష్యులు వెనక్కితిరిగి యెరూషలేము వెళ్ళిపోయి మిగిలిన శిష్యులందరికీ జరిగింది చెప్పారు. అయినా వాళ్ళు నమ్మలేదు.
\s5
\p
\v 14 ఆ తరువాత యేసు శిష్యులు పదకొండు మంది ఒక చోట చేరి భోజనం చేస్తూ ఉండగా, ఆయన వారి మధ్యకు వచ్చి కనపడ్డాడు. తాను మరణం నుండి తిరిగి లేచిన సంగతి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నమ్మనందుకు చివాట్లు పెట్టాడు.
\p
\v 15 ఆయన వారితో "మీరు ప్రపంచం మొత్తం తిరగండి. తిరుగుతూ నేను మరణించి, సమాధి లో ఉండి తిరిగి లేచి మరణాన్ని జయించాను అన్న సువార్తను ప్రతి ఒక్కరికీ చాటండి.
\v 16 మీరు ప్రకటించిన సువార్తను నమ్మి, అందుకు రుజువుగా బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరినీ దేవుడు రక్షిస్తాడు.
\s5
\v 17 ఈ సువార్తను నమ్మి రక్షణ పొందిన వారంతా నేను వారితో ఉన్నాను అనడానికి నిదర్శనంగా ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతారు. మనుషులలోనుండి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టగలుగుతారు. ఎప్పుడూ నేర్చుకోని పరాయి భాషలు మాట్లాడగలుగుతారు.
\v 18 ఒకవేళ పాములను పట్టుకోవాల్సి వచ్చినా, విషం తాగాల్సి వచ్చినా అవి వారికి హాని చేయవు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి మీద తమ చేతులు ఉంచినపుడు, దేవుడు వారిని స్వస్థ పరుస్తాడు."
\s5
\p
\v 19 యేసు ప్రభువు తన శిష్యులకు ఈ విషయాలన్నీ చెప్పిన తరువాత, దేవుడు ఆయనను పైకి, పరలోకంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన తన సింహాసనంపై, దేవుని కుడి పక్కన కూర్చున్నాడు. అలా దేవునితో కలిసి పరిపాలించడానికి అత్యున్నతమైన, ఘనమైన స్థానంలో ఉన్నాడు.
\p
\v 20 శిష్యులైతే యెరూషలేము నుండి బయలుదేరి అన్ని ప్రదేశాలు తిరుగుతూ దేవుని సువార్త ప్రకటించారు. ప్రభువు వాళ్లకి ఎంత సామర్ధ్యం ఇచ్చాడంటే, వాళ్ళు ఎక్కడికి పొతే అక్కడ ప్రజలు ఆశ్చర్య పడేలా శారీరక, మానసిక రోగాలను నయం చేశారు, అద్భుతాలు చేసారు. ఆయన ఇలా చేయడంతో శిష్యులు ప్రకటిస్తున్న సువార్త సత్యమని చూపించాడు.

2194
43-LUK.usfm Normal file
View File

@ -0,0 +1,2194 @@
\id LUK - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h లూకా సువార్త
\toc1 లూకా సువార్త
\toc2 లూకా సువార్త
\toc3 luk
\mt1 లూకా సువార్త
\s5
\c 1
\p
\v 1 గౌరవనీయులైన తియోఫి గారికి,
\p ఈ మధ్య మన ప్రాంతాల్లో జరిగిన అద్భుత సంఘటనల గురించి చాలా మంది వివరంగా రాశారు.
\v 2 మొదటి నుండి ఈ సంఘటనలు జరగడం చూసిన వాళ్ళ ద్వారా మనం విన్నాము. వీళ్ళే దేవుని వాక్యాన్ని ఇతరులకు అందించారు.
\v 3 నేను కూడా వీళ్ళు రాసి, బోధించిన ప్రతి విషయం గురించి కూలంకషంగా పరిశీలించిన మీదట, ఓ ఘనులైన తియోఫిలా గారూ, ఈ విషయాలు గురించిన కచ్చితమైన సమాచారం మీకు రాయడం మంచిదనిపించింది.
\v 4 మీరు విన్న సంగతులు వాస్తవాలేనని మీరు తెలుసుకోవాలని ఇలా చేస్తున్నాను.
\s5
\p
\v 5 హేరోదు రాజు యూదయ దేశాన్ని పరిపాలించిన కాలంలో అక్కడ జెకర్యా అనే యూదీయ అర్చకుడు ఉండేవాడు. అతడు అబీయా అనే యాజక వర్గానికి చెందినవాడు. అతడు, అతని భార్య ఎలీసబెత్, ఇద్దరూ అహరోను వంశీయులు.
\v 6 దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞకూ తూ చ తప్పకుండా విధేయత చూపారు కాబట్టి దేవుడు ఈ ఇద్దరినీ నీతి గలవారుగా ఎంచాడు.
\v 7 కాని వాళ్ళకి పిల్లలు లేరు. ఎలీసబెత్ గొడ్రాలు. అంతేగాకుండా ఆమె, ఆమె భర్త వయసు మీరిన వృద్ధులు.
\s5
\p
\v 8 యెరూషలేము దేవాలయంలో యాజకుల అర్చనలకు సంబంధించి జెకర్యా యాజక వర్గం వారి వంతు వచ్చింది. ఒకరోజు జెకర్యా ఆలయంలో అర్చనాదికాలు జరిగిస్తున్నాడు.
\v 9 వాళ్ళ సంప్రదాయం ప్రకారం దేవాలయం లోపలికి వెళ్లి ధూపం వేయడానికి యాజకులు చీట్లు వేసుకుంటే జెకర్యా వంతు వచ్చింది.
\p
\v 10 అతడు ధూపం వేస్తున్న చోట ఆ సమయంలో దేవాలయం బయటి ఆవరణంలో చాలామంది ప్రజలు ప్రార్థన చేస్తూ ఉన్నారు.
\s5
\v 11 అప్పుడు ప్రభువు పంపిన ఒక దేవదూత జకర్యాకు కనిపించాడు. ఆ దేవదూత ధూపం వేసే బలిపీఠం కుడి వైపున నిలబడి ఉన్నాడు.
\v 12 జెకర్యా ఆ దూతను చూసి ఉలిక్కిపడ్డాడు. అతనికి చాలా భయం వేసింది.
\p
\v 13 కాని ఆ దేవదూత జెకర్యాతో, "భయపడొద్దు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభువు నీ విన్నపం విన్నాడు. నీ భార్య ఎలీసబెత్ నీ కోసం ఒక కొడుకును కంటుంది. ఆ బిడ్డకు నువ్వు యోహాను అని పేరు పెట్టాలి.
\s5
\v 14 ఆ బిడ్డ పుట్టినందుకు నువ్వూ, ఇంకా చాలామంది సంతోషిస్తారు.
\v 15 అతడు దేవుని దృష్టిలో చాలా గొప్పవాడుగా ఉంటాడు. అతడు ఎప్పుడూ ద్రాక్షారసం గానీ, ఎలాటి సారాయి గానీ తాగకూడదు. అతడు తల్లి కడుపులో పడినప్పటి నుండే పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఉంటాడు.
\s5
\v 16 అతడు ఇశ్రాయేల్ జాతిలో అనేకమందిని పాపం చెయ్యవద్దనీ ప్రభువైన దేవునికి మళ్ళీ విధేయత చూపాలనీ ఒప్పిస్తాడు.
\v 17 నీకు పుట్టబోయే కుమారుడు ప్రభువుకు ముందుగా వెళుతూ, ఏలీయా ప్రవక్తలాగా ఆత్మలో శక్తితో నిండి ఉంటాడు. అతడు తల్లిదండ్రులకు తమ పిల్లలపై ప్రేమ కలిగేలా చేస్తాడు. అవిధేయులను కూడా దేవుని పట్ల విధేయత గల సజ్జనుల్లాగా జ్ఞానంతో జీవించేలా చేస్తాడు. ఈ విధంగా అతడు ప్రభువు రాకడ కోసం అనేకమందిని సమాయత్తపరుస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 18 అప్పుడు జెకర్యా దేవదూతతో "నేను చాలా ముసలివాణ్ణి, నా భార్య కూడా వృద్ధాప్యంలో ఉంది. మరి నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయని నేనెలా నమ్మగలను?" అన్నాడు.
\p
\v 19 అప్పుడు దేవదూత అతనితో, "నేను గాబ్రియేల్ ని. దేవుని సన్నిధిలో నిలబడి ఉండే వాణ్ణి. నీ జీవితంలో జరిగే శుభవార్త చెప్పడానికి దేవుడు నన్ను పంపాడు.
\v 20 దేవుడు నిర్ణయించిన సమయంలో నేను నీకు చెప్పిందంతా కచ్చితంగా జరుగుతుంది. కానీ నువ్వు నా మాటలు నమ్మడం లేదు కాబట్టి ఇప్పటినుంచి నీ కొడుకు పుట్టే వరకు నువ్వు ముగావాడుగా ఉంటావు" అన్నాడు.
\s5
\p
\v 21 దేవాలయంలో జెకర్యా, దేవదూత మాట్లాడుకుంటూ ఉండగా, బయట ఆవరణంలో ప్రజలు జెకర్యా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అతడు అంత ఆలస్యం ఎందుకు చేస్తున్నాడో తెలియక అయోమయంలో ఉన్నారు.
\v 22 జెకర్యా దేవాలయంలో నుండి బయటికి వచ్చినపుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. లోపల ఏమి జరిగిందో చెప్పడానికి చేతులతో సైగలు చేశాడు. అప్పుడు అతడు దేవాలయంలో దేవుని దివ్యదర్శనం చూసాడని ప్రజలు గ్రహించారు.
\p
\v 23 దేవాలయంలో యాజకుడిగా జెకర్యా సేవాకాలం పూర్తయ్యాక, అతడు యెరూషలేము నుండి ఇంటికి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 24 ఇది జరిగిన కొంత కాలానికి అతని భార్య ఎలీసబెత్ నెల తప్పింది. కాని ఐదు నెలల వరకు ఆమె ఇతరుల కంట పడలేదు.
\v 25 ఆమె తనలో తాను, "దేవుడు నా కడుపు పండించాడు. ఈ విధంగా నాపై ఆయన కనికరం చూపించాడు. మనుషుల్లో నాపై ఉన్న మచ్చ తొలగించాడు" అనుకుంది.
\s5
\p
\v 26 ఎలీజబెత్ ఆరో నెల కడుపుతో ఉండగా గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామానికి దేవుడు గాబ్రియేలు దూతను పంపాడు.
\v 27 అక్కడ దావీదు రాజు వంశంలో పుట్టిన యోసేపు అనే మనిషితో నిశ్చితార్థం జరిగిన ఒక కన్య ఉంది. ఆమెతో మాట్లాడడానికి ఆ దూత వెళ్ళాడు. ఆ కన్య పేరు మరియ.
\p
\v 28 దూత ఆమెతో, "దైవానుగ్రహ పూర్ణురాలా, నీకు శుభం. దేవుడు నీతో ఉన్నాడు" అన్నాడు.
\v 29 ఈ శుభ వచనం విని మరియ ఉక్కిరిబిక్కిరైపోయింది. దూత మాటలకు అర్థం ఏమిటో అనుకుంటూ విస్తుబోయింది.
\s5
\p
\v 30 అప్పుడు దూత ఆమెతో, "మరియా, భయం లేదు. నువ్వు దేవుని అనుగ్రహానికి నోచుకున్నావు.
\v 31 నువ్వు గర్భవతివౌతావు. నీకు కొడుకు పుడతాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టాలి.
\v 32 ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని అంతా మహోన్నతుడైన దేవుని కుమారుడు అంటారు. ప్రభువైన దేవుడు ఆయన్ను తన పూర్వికుడైన దావీదులాగా తన ప్రజలపై రాజుగా చేస్తాడు.
\v 33 అయన సర్వదా యాకోబు సంతతిని పరిపాలిస్తాడు. ఆయన రాజ్య పాలనకు అంతం ఉండదు" అని చెప్పాడు.
\s5
\p
\v 34 అప్పుడు మరియ "నేను కన్యను గదా, ఇది ఎలా జరుగుతుంది?" అని అడిగింది.
\v 35 అందుకు దేవదూత "పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. నీకు పుట్టబోయే బిడ్డ పవిత్రుడు. ఆయన్ని దేవుని కుమారుడు అంటారు.
\s5
\v 36 ఇది కూడా విను. మీ బంధువు ఎలీసబెత్ ముసలితనంలో నెల తప్పింది. ఇప్పుడు ఆమెకు ఆరవ నెల.
\v 37 దేవునికి అసాధ్యమంటూ ఏదీ లేదు" అని చెప్పాడు.
\v 38 అప్పుడు మరియ, "సరే. నేను దేవుని పాద దాసిని. నువ్వు చెప్పినది నాకు జరుగు గాక" అంది. అప్పుడు దూత వెళ్లిపోయాడు.
\s5
\p
\v 39 ఇది జరిగిన తరువాత కొన్ని రోజులకు మరియ ప్రయాణమై శీఘ్రంగా యూదయ మన్య ప్రాంతంలో జెకర్యా ఉండే ఊరికి వెళ్ళింది.
\v 40 ఆమె జెకర్యా ఇంటికి వెళ్ళి అతని భార్య ఎలీసబెత్ ను పలకరించింది.
\v 41 మరియ పలకరింపును విన్న వెంటనే ఎలీసబెత్ గర్భంలో ఉన్న బిడ్డ ఉల్లాసంగా కదిలాడు. వెంటనే దేవునికి స్తుతి చెల్లించేలా పరిశుద్ధాత్మ ఎలీసబెత్ ను ప్రేరేపించాడు.
\s5
\v 42 ఆమె సంబర పడిపోతూ మరియతో,
\q "దేవుడు నిన్ను స్త్రీలందరికన్నా మిన్నగా దీవించాడు.
\q నువ్వు గర్భాన మోస్తున్న బిడ్డను ఆయన దీవించాడు.
\q
\v 43 నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావడం ఎంత అదృష్టం!
\q
\v 44 నువ్వు నన్ను పలకరించగానే నా కడుపులో ఉన్న బిడ్డ గంతులేశాడు.
\q నువ్వు రావడం వాడికెంత సంతోషంగా ఉందో!
\q
\v 45 ప్రభువు చెప్పినది నెరవేరుతుందని నమ్మి నువ్వు ధన్యురాలివయ్యావు" అంది.
\s5
\p
\v 46 అప్పుడు మరియ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఇలా అంది.
\q ఏమని ప్రభువును స్తుతించగలను!
\q
\v 47 నన్ను రక్షించిన దేవుని గురించి ఆనందంతో ఉప్పొంగి పోతున్నాను.
\s5
\q
\v 48 ఆయన తన దాసిని విస్మరించలేదు.
\q కాబట్టి అన్ని కాలాల్లో మనుషులు నన్ను ధన్య అంటారు.
\q
\v 49 సర్వ శక్తిశాలి నా పట్ల గొప్ప కార్యాలు చేసాడని వారంటారు.
\q ఆయన పవిత్రుడు.
\s5
\q
\v 50 ఆయనపై భక్తిశ్రద్ధలు నిలిపే వాళ్ళ పట్ల తరతరాలకు ఆయన కరుణ చూపుతాడు.
\q
\v 51 మహా శక్తి శాలిగా తనను కనపరచుకుంటాడు.
\q హృదయంలో గర్వపు ఆలోచనలు ఉన్నవాళ్ళను చెదరగొడతాడు.
\s5
\q
\v 52 ఏలుబడి చేసే రాజులను గద్దె నుండి దించి,
\q వేధింపులకు లోనైన ప్రజలకు మన్నన కలిగిస్తాడు.
\q
\v 53 ఆకలితో ఉన్నవాళ్ళకి మంచి భోజనం పెట్టి,
\q ధనికులను వట్టి చేతుల్తో పంపేసాడు.
\s5
\q
\v 54 ఆయన తనను సేవించే ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసాడు.
\q చాలా కాలం క్రితం ఆయన మన పూర్వీకులకు
\q కరుణ చూపిస్తానని వాళ్లకి మాట ఇచ్చాడు.
\q
\v 55 అబ్రాహాము, అతని సంతానమంతటికీ
\q నిరంతరం తన దయను కనపరుస్తూ
\q తన మాట నిలబెట్టుకున్నాడు.
\s5
\p
\v 56 మరియ మూడు నెలలు ఎలీసబెత్ దగ్గర గడిపి ఇంటికి తిరిగి వెళ్ళింది.
\p
\v 57 ఎలీసబెత్ నెలలు నిండి కొడుకుని కన్నది.
\v 58 ఆమె చుట్టపక్కాలు ఆమె పట్ల దేవుడు చూపించిన దయ గురించి విని ఎలీసబెత్ తో కలిసి సంతోషించారు.
\s5
\p
\v 59 ఎనిమిదో రోజున బిడ్డ సున్నతి వేడుకకు బంధువులు వచ్చారు. తండ్రి పేరు జెకర్యా కాబట్టి బిడ్డకు అదే పేరు పెట్టాలని వాళ్ళు అనుకున్నారు.
\v 60 కాని బిడ్డ తల్లి ఎలీసబెత్ వాళ్ళతో, "అలా కాదు. వీడి పేరు యోహాను" అంది.
\v 61 "కానీ యోహాను అనే పేరు గలవాళ్ళు మీ బంధువుల్లో ఎవరూ లేరు గదా" అని వాళ్ళు ఆమెతో అన్నారు.
\s5
\v 62 అప్పుడు వాళ్ళు ఆ బిడ్డ తండ్రికి సైగ చేసి తన బిడ్డకు ఏం పేరు పెట్టాలనుకుంటున్నాడో చెప్పమన్నారు.
\v 63 అతడు రాయడానికి పలక తెమ్మని సైగ చేసాడు. వాళ్ళు అతనికి పలక ఇచ్చారు. అతడు "ఈ బిడ్డ పేరు యోహాను" అని రాసాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు.
\s5
\p
\v 64 వెంటనే జెకర్యాకు నోరు వచ్చింది. అతడు దేవుణ్ణి కీర్తించడం మొదలు పెట్టాడు.
\v 65 దేవుడు చేసింది చూసి ఇరుగుపొరుగు వాళ్ళు నిర్ఘాంతపోయారు. జరిగిన దాన్ని వాళ్ళు చాలా మందికి చెప్పారు. యూదయ కొండ ప్రాంతం అంతా ఈ వార్త పాకిపోయింది.
\v 66 ఇది విన్న ప్రతి ఒక్కరూ దీన్ని గురించి ఆలోచించసాగారు. "ఈ పసివాడు ఎదిగాక ఏం చేస్తాడో అని చాలా కుతూహలంగా ఉంది" అని అందరూ అన్నారు. జరిగినదంతా చూసాక దేవుడు ఆ బిడ్డకు ఆసరాగా ఉంటాడని వాళ్ళకి అర్థమై పోయింది.
\s5
\p
\v 67 కొడుకు పుట్టాక జెకర్యా పరిశుద్దాత్మ స్వాధీనంలో ఉండి, దేవుని మాటలు ఇలా పలికాడు.
\q
\v 68 తన ప్రజలను విడిపించడానికి వచ్చిన
\q మన ఇశ్రాయేలు ప్రజలు ఆరాధించే దేవుడైన ప్రభువుకు స్తోత్రం!
\s5
\q
\v 69 మనల్ని తన మహా శక్తితో రక్షించడానికి
\q తన సేవకుడైన దావీదు రాజు సంతతిలో
\q ఒకణ్ణి ఆయన పంపుతున్నాడు.
\q
\v 70 పూర్వం ప్రవక్తల ద్వారా దేవుడు దీన్ని పలికించాడు.
\q
\v 71 ఈ శక్తిశాలియైన రక్షకుడు మనల్ని మన
\q శత్రువుల నుండి విడిపించి,
\q మనల్ని ద్వేషించే వాళ్ళ బారి నుండి రక్షిస్తాడు.
\s5
\q
\v 72 మన పూర్వీకుడు అబ్రాహాముకు ఇచ్చిన మాటతో,
\q ఆయన చేసిన ప్రమాణంతో
\q
\v 73 ఆయన పవిత్రమైన నిబంధన గుర్తు చేసుకుంటూ,
\q మన పితరుల పట్ల కరుణ కలిగి దీన్ని చేసాడు.
\q
\v 74 బెదరకుండా ఆయనను సేవించేలా
\q మన శత్రువుల బలం నుండి మనల్ని కాపాడతానని దేవుడు మాట ఇచ్చాడు.
\q
\v 75 మన జీవితాలన్నీ నీతిని అనుసరిస్తూ
\q పూర్తిగా ఆయనకు సమర్పించాలని ఆయన ఇలా చేసాడు.
\s5
\p
\v 76 తరువాత జెకర్యా తన బిడ్డకు ఇలా చెప్పాడు.
\q కుమారా, నిన్ను సర్వోన్నతుడైన దేవుని ప్రవక్త అని పిలుస్తారు.
\q నువ్వు ప్రభువుకు ముందుగా వెళుతూ
\q ఆయన వచ్చేకాలానికి ప్రజలను సిద్ధం చేస్తావు.
\q
\v 77 ఆయన ప్రజలను పాపశిక్ష నుండి విడిపిస్తాడనీ
\q ఆయన వాళ్ళని క్షమిస్తాడనీ నువ్వు వాళ్ళకి తెలియచేస్తావు.
\s5
\q
\v 78 దేవుడు దయ, కరుణ కలిగినవాడు కాబట్టి
\q ఆయన మనల్ని క్షమిస్తాడు.
\q దీని కారణంగా ఈ రక్షకుడు ఉదయించే సూర్యుడిలా ఉంటాడు.
\q ఆయన పరలోకం నుండి మన దగ్గరికి వచ్చి మనకు సాయం చేస్తాడు.
\q
\v 79 మరణ భయంతో ఉన్నవాళ్ళ మీద,
\q ఆత్మసంబంధమైన చీకటిలో ఉన్నవాళ్ళ మీద ఆయన ప్రకాశిస్తాడు.
\q మనం శాంతిసమాధానాలతో మనుగడ సాగించేలా ఆయన నడిపిస్తాడు.
\s5
\p
\v 80 కొంత కాలానికి జెకర్యాా, ఎలీసబెత్ ల బిడ్డ పెరిగి పెద్దవాడై, ఆత్మీయంగా బలం పుంజుకున్నాడు. అప్పుడతడు ఏకాంత ప్రదేశంలో జీవించాడు. ఇశ్రాయేలులో దేవుని ప్రజలకు బహిరంగంగా బోధించడం మొదలుపెట్టినప్పుడు కూడా అక్కడే నివసించాడు.
\s5
\c 2
\p
\v 1 ఆ రోజుల్లో రోమా సామ్రాజ్య పాలనలో ఉన్న ప్రాంతాలన్నిటిలో జనాభా లెక్కలు సేకరించాలని సీజర్ అగస్టస్ ఆజ్ఞాపించాడు.
\v 2 ఇది సిరియా దేశానికి కురేనియస్ గవర్నర్ గా ఉన్నప్పుడు జరిగిన మొదటి జనసంఖ్య.
\v 3 అందులో పేరు నమోదు చేయించుకోడానికి అందరూ తమ స్వగ్రామాలకు వెళ్లారు.
\s5
\p
\v 4 యోసేపు దావీదు వంశంలో పుట్టినవాడు గనక ఆ జనసంఖ్యలో నమోదు కావడానికి యూదయలోని బేత్లెహేం అనే ఊరికి వెళ్ళాడు. అది దావీదు స్వగ్రామం.
\v 5 యోసేపు తనకు ప్రదానం జరిగి, గర్భవతిగా ఉన్న మరియను కూడా తీసుకుని వెళ్ళాడు.
\s5
\v 6 వాళ్ళు బేత్లెహేము చేరుకునే సమయానికి మరియకు నెలలు నిండాయి.
\v 7 అక్కడ ఉండడానికి సత్రంలో వాళ్ళకి చోటు దొరకలేదు. ఆ రాత్రి వాళ్లు పశువుల కొట్టంలో తలదాచుకున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, మరియ తన తొలిచూలు కానుపుగా మగబిడ్డను ప్రసవించి, మెత్తటి గుడ్డలతో చుట్టి పశువుల మేత తొట్టిలో పడుకోపెట్టింది.
\s5
\p
\v 8 ఆ రాత్రి కొంతమంది గొర్రెల కాపరులు బేత్లెహేము పొలాల్లో మందలు కాచుకుంటున్నారు.
\v 9 హటాత్తుగా ప్రభువు దూత వాళ్ళకు ప్రత్యక్షం అయ్యాడు. మిరుమిట్లు గొలిపే కాంతి వాళ్ళ చుట్టూ ప్రకాశించింది. వాళ్ళు భయభ్రాంతులయ్యారు.
\s5
\v 10 కాని ఆ దూత వాళ్ళతో, "భయం లేదు. నేను మీకు ఒక శుభవార్త చెప్పటానికి వచ్చాను. దాని వల్ల మీతో సహా మనుషులందరికీ గొప్ప మేలు కలుగుతుంది. అందరికీ పరమానందం కలుగుతుంది.
\v 11 మీ పాపాల నుంచి కాపాడే రక్షకుడు దావీదు ఊరిలో మీకోసం ఈరోజు పుట్టాడు. ఈయన క్రీస్తు ప్రభువు.
\v 12 మీకు ఒక కొండ గుర్తు చెబుతా వినండి. ఒక పసికందును మెత్తటి గుడ్డలతో చుట్టి పశువుల మేత తొట్టిలో పండుకోబెట్టి ఉండటం మీరు చూస్తారు."
\s5
\p
\v 13 ఉన్నట్టుండి అసంఖ్యాకమైన దూతల సమూహం పరలోకం నుండి దిగి వచ్చి ఆ దూతతోబాటు దేవుణ్ణి ఈ విధంగా స్తుతించారు.
\q
\v 14 "సర్వోన్నత లోకంలో దేవదూతలు అందరూ దేవుణ్ణి కీర్తిస్తారు గాక. ఆయనకు ఇష్టమైన వారికి భూమి మీద శాంతి సమాధానాలు కలుగు గాక."
\s5
\p
\v 15 ఆ దూతలు వాళ్ళ దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత, ఆ గొర్రెల కాపరులు, "ఈ వార్త ప్రభువు మనకు తెలియచేసాడు. మనం బేత్లెహేముకు వెళ్ళి ఈ అద్భుతాన్ని చూద్దాం పదండి" అని ఒకడితో ఒకడు చెప్పుకున్నారు.
\v 16 పరుగుపరుగున వెళ్ళి మరియ, యోసేపు ఉన్నచోటు వెతికి, పశువుల మేత తొట్టిలో పడుకుని ఉన్న బిడ్డను చూసారు.
\s5
\v 17 ఆ బిడ్డను గురించి దేవదూత తమతో చెప్పిన మాటలను అందరికీ ప్రచారం చేసారు.
\p
\v 18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్నవారంతా ఆశ్చర్యపోయారు.
\v 19 మరియ మాత్రం ఈ సంగతులు అన్నీ ఆలోచించుకుంటూ తన మనసులో పదిలపరచుకుంది.
\v 20 ఆ గొర్రెల కాపరులు తమ పొలాలకు తిరిగి వెళ్ళిపోయారు. ఐతే వాళ్ళు దూత తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటినన్నిటిని గురించి దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నారు.
\s5
\p
\v 21 ఎనిమిదవ రోజున, ఆ బిడ్డకు సున్నతి ఆచారం జరిగినప్పుడు, వాళ్ళు ఆయనకు యేసు అనే పేరు పెట్టారు. ఆయన కడుపులో పడక ముందు దేవదూత వాళ్ళకి చెప్పింది ఈ పేరే.
\s5
\p
\v 22 మోషే ధర్మశాస్త్రం ప్రకారం బాలెంత రాలి మైల రోజులు పూర్తి అయినాయి.
\v 23 "ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకి సమర్పణ చేయాలి" అని ధర్మశాస్త్రం లో రాసి ఉంది.
\v 24 ఇంకా ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా జత గువ్వలు గానీ రెండు పావురం పిల్లల్ని గాని బలిగా అర్పించడానికి వాళ్ళు ఆయనను యెరూషలేముకు తీసుకువెళ్ళారు.
\s5
\p
\v 25 ఆ రోజుల్లో యెరూషలేములో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు దేవునికి ఇష్టమైనట్టుగా జీవిస్తూ ఆయన ఆజ్ఞలకు విధేయుడై ఉండేవాడు. ఇశ్రాయేలు జాతికి రక్షణ కలగాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ వున్నాడు. పరిశుద్ధాత్మ అతణ్ణి నడిపిస్తున్నాడు.
\v 26 అతడు ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్దాత్మ తెలియజేశాడు.
\s5
\p
\v 27 ధర్మశాస్త్ర ఆనవాయితీ ప్రకారం, ఆలయంలో కొన్ని కర్మకాండలు జరిగించడానికి యోసేపు, మరియలు బాల యేసును అక్కడికి తీసుకువచ్చారు. ఆ రోజు సుమెయోను ఆత్మప్రేరణ వల్ల దేవాలయంలోకి వచ్చాడు
\v 28 అప్పుడు సుమెయోను తన చేతుల్లో యేసును ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు.
\p
\v 29 "ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున నన్ను ప్రశాంతంగా కడతేరి పోనిస్తున్నావు గదా!"
\s5
\q1
\v 30 "యూదేతరులకు నిన్ను చూపించే వెలుగుగా,
\q1
\v 31 నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా,
\q1
\v 32 నీవు అందరి ఎదుటా సిద్ధం చేసిన నీ రక్షణను నేనిప్పుడు కళ్ళారా చూశాను."
\s5
\p
\v 33 యేసు గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆయన తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపోయారు.
\v 34 సుమెయోను వాళ్ళని దీవించి, యేసు తల్లి మరియతో అన్నాడు. "ఇశ్రాయేలులో చాలా మంది పడిపోవడానికి, చాలామంది రక్షణ పొందడానికి దేవుడు ఈ బాలుణ్ణి నియమించాడు. ఈయన దేవుడు పంపిన సూచన. అనేక మంది ఈ సూచనను వ్యతిరేకిస్తారు.
\v 35 ఫలితంగా అనేకమంది హృదయాలోచనలు బట్టబయలు అవుతాయి. అంతేకాక నీ గుండెల్లోకి ఒక కత్తి దూసుకుపోతుంది" అన్నాడు.
\s5
\p
\v 36 అన్నాఅనే ఒక ప్రవక్త ఆ దేవాలయంలో ఉంది. ఆమె పండు ముసలి. ఆమెది ఆషేరు గోత్రం. ఆమె తండ్రి పేరు ఫనూయేలు. ఆమె పెళ్ళి అయిన ఏడేళ్లకు భర్త చనిపోయాడు.
\v 37 ఆ తరవాత ఎనభై నాలుగేళ్ళ వయసు దాకా వితంతువుగా ఉంది. ఆమె దేవాలయంలోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేస్తూ ఉండేది.
\v 38 ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి, ఆ బిడ్డను గురించి దేవుణ్ణి స్తుతించింది. ఇంకా యెరూషలేము విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ పసికందును గురించి మాట్లాడుతూ వచ్చింది.
\s5
\p
\v 39 తరువాత యోసేపు, మరియ ప్రభువు ధర్మశాస్త్రం ప్రకారం ఆ ఆచారాలన్నీ పూర్తి చేసుకుని గలిలయలోని తమ ఊరు నజరేతుకు వెళ్ళిపోయారు.
\v 40 ఆ పసివాడు పెరుగుతూ, బలపడుతూ జ్ఞానవంతుడయ్యాడు. దేవుని అనుగ్రహం ఆయనపై ఉంది.
\s5
\p
\v 41 ఏటేటా యేసు తలిదండ్రులు పస్కా పండక్కి యెరూషలేము వెళ్ళేవాళ్ళు.
\v 42 యేసుకు పన్నెండేళ్ళు వచ్చినప్పుడు ఎప్పటిలానే వారంతా పండక్కి యెరూషలేము వెళ్ళారు.
\v 43 పండగ అన్ని రోజులూ అయిపోయాక, ఆయన తలిదండ్రులు ఇంటికి తిరిగి వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. కాని యేసు యెరూషలేములో ఉండిపోయాడు. ఆయన అక్కడే ఉండిపోయిన విషయం తలిదండ్రులకు తెలియదు.
\v 44 వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్న వేరే గుంపులో ఉన్నాడనుకున్నారు. ఒక రోజు ప్రయాణం తరువాత పిల్లవాడు కనిపించకపోయే సరికి కంగారుగా చుట్టాలు, తెలిసిన వాళ్ళ మధ్య ఆయన కోసం వెదికారు.
\s5
\v 45 ఆయన కనిపించక ఆయన కోసం వెతుక్కుంటూ యెరూషలేముకు తిరిగి వెళ్ళారు.
\p
\v 46 మూడు రోజుల తరువాత ఆయన దేవాలయ ప్రాంగణంలో యూదీయ మత నాయకుల మధ్య కూర్చొని ఉండడం చూసారు. ఆయన ఆ పండితులు బోధించేది వింటూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడు.
\v 47 ఆయన చెప్పింది విని, ఆయన ప్రజ్ఞకు బోధకులు అడిగిన ప్రశ్నలకి ఆయన ఇచ్చే జవాబులకూ అక్కడ కూర్చున్న వారు ముక్కున వేలేసుకుంటున్నారు.
\s5
\p
\v 48 ఆయన తలిదండ్రులు ఆయన్ని చూసి, చాలా ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి ఆయనతో, "బాబూ, ఇలా చేసావేంటి? నేను, మీ నాన్న నీ కోసం చాలా కంగారుగా వెదుకుతున్నాం" అన్నది.
\v 49 ఆయన వాళ్ళతో, "మీరు నా కోసం ఎందుకు వెదుకుతున్నారు? నా తండ్రి పనిలో నేనుండాలని మీకు తెలీదా?" అన్నాడు.
\v 50 ఆయన మాటల్లో అర్ధాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు.
\s5
\p
\v 51 అప్పుడు ఆయన తన తల్లిదండ్రులతో కలిసి నజరేతుకు తిరిగి వెళ్ళాడు. వాళ్ళ మాట వింటూ వారితో కలిసి ఉన్నాడు. ఆ సంగతులన్నిటినీ ఆయన తల్లి మనస్సులో తలపోసుకుంటూ వచ్చింది.
\v 52 ఏళ్ళు గడుస్తుండగా, యేసు నానాటికీ జ్ఞానవంతుడయ్యాడు. ఎదిగాడు. దేవుడి దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ దినదిన ప్రవర్థమానం అవుతూ ఉన్నాడు.
\s5
\c 3
\p
\v 1 అప్పటికి సీజరు తిబెరియ రోమ్ సామ్రాజ్యాన్ని పదిహేనేళ్ళుగా పరిపాలిస్తున్నాడు. పొంతి పిలాతు యూదయ మండలం గవర్నర్. హేరోదు అంతిప గలిలయ పరగణాల పరిపాలకుడు. అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయ, త్రకోనీతి ప్రాంతాలను పాలించేవాడు. లుసానియానేమో అబిలేనే పరగణాల అధికారి.
\v 2 అన్న, కయప అనేవాళ్ళు ప్రధాన యాజకులు. అప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కొడుకు యోహానుతో దేవుడు మాట్లాడాడు. ఆ సమయంలో యోహాను ఎడారి ప్రదేశంలో ఉంటున్నాడు.
\s5
\p
\v 3 అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా సంచరిస్తూ మనుషులతో, "దేవుడు మీ పాపాలు క్షమించాలంటే మీరు పశ్చాత్తాపపడాలి. ఆపైన నేను మీకు బాప్తిసం ఇస్తాను" అని చెప్పేవాడు.
\s5
\v 4 పూర్వకాలం యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథం చుట్టలో ఇలా రాసి ఉంది,
\q1 "అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి.
\q1 ఆయన కోసం బాటలు తిన్నగా చేయండి.
\s5
\q1
\v 5 మనుషులు ప్రతి పల్లాన్నీ పూడ్చి ప్రతి మెరకనూ సాఫీగా చేసి
\q1 వంకరదారులను నిటారుగా చేసి గతుకుల బాటలను నునుపు చేస్తారు గదా.
\q1 అలానే దేవుడు మిమ్మల్ని దీవించడానికి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్నీ తీసి పారెయ్యాలి.
\q1
\v 6 అప్పుడు దేవుడు మనుషులను రక్షించే తీరును అందరూ కళ్ళారా చూస్తారు."
\s5
\p
\v 7 యోహాను తన చేత బాప్తిసం పొందడానికి తండోపతండాలుగా వస్తున్న వాళ్ళని చూశాడు. "మీరు నాగుపాముల్లాగా విషపు మనుషులు! "దేవుడు ప్రతి ఒక్కరినీ ఒకానొక రోజున వాళ్ళ పాపాలను బట్టి దండిస్తాడని మాకెవరూ చెప్పలేదు గదా, మేము తప్పించుకుంటాములే" అనుకుంటున్నారేమో.
\s5
\v 8 మీ చెడు ప్రవర్తన నుండి నిజంగా మారిపోయారని బాహ్య సూచనలు మీ బ్రతుకుల్లో కనిపించాలి. "మేము అబ్రాహాము సంతానం గదా" అని మీలో మీరు చెప్పుకుంటున్నారేమో. దేవుడు ఈ రాళ్లను సైతం అబ్రాహాము సంతానంగా చెయ్యగలడని మీతో చెప్తున్నాను" అని హెచ్చరించాడు.
\s5
\p
\v 9 "చెట్టును కూకటివేళ్ళతో పెళ్ళగించి నరికి వేయడానికి గొడ్డలి సిద్ధంగా ఉంది. మంచి కాయలు కాయని చెట్టును నరికి తగలబెట్టినట్టే, మీ పాపాల నుండి తొలగకపొతే దేవుడు మిమ్మల్ని కూడా శిక్షిస్తాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 10 అప్పుడు గుంపులో కొంతమంది, "అలాగైతే మేమేం చేయాలి?" అని అతన్ని అడిగారు.
\v 11 అతడు, "రెండు చొక్కాలు ఉన్నవాడు ఒక్కటి కూడా లేని వాడికి ఒకటివ్వాలి, అలానే భోజనపదార్థాలు ఉన్నవాడు లేని వాడికి కొంత పెట్టాలి" అని చెప్పాడు.
\s5
\p
\v 12 కొందరు పన్ను వసూలు చేసే వాళ్ళు బాప్తిసం పొందడానికి వచ్చి, "బోధకా, మేమేం చేయాలి?" అని అడిగారు.
\v 13 అతడు, "రోమా ప్రభుత్వం ప్రజలనుండి మిమ్మల్ని ఎంత వసూలు చేయమన్నదో దాని కంటే ఎక్కువ వసూలు చెయ్యొద్దు" అని వాళ్ళతో చెప్పాడు.
\s5
\p
\v 14 "మరి మా సంగతేంటి? మేమేం చేయాలి?" అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. "ఎవరి దగ్గరా బెదిరించి డబ్బు గుంజవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి" అని అతడు వాళ్ళతో చెప్పాడు.
\s5
\p
\v 15 క్రీస్తు వస్తాడని ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ ఉన్న రోజులవి. యోహానే క్రీస్తేమో అని చాలామంది లోలోపల అనుకుంటున్నారు.
\v 16 వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు, "అబ్బే, నేను కాదు. క్రీస్తు నాకన్నా చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నాకన్నా శక్తిసంపన్నుడు వస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో, అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు."
\s5
\p
\v 17 "ఆయన తన కళ్ళంలో ఊకనూ ధాన్యం గింజలనూ వేరుచేయడానికి తూర్పారబట్టే పంటికోల చేత పట్టుకున్నాడు. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో తగలబెడతాడు."
\s5
\p
\v 18 అతడు ఇంకా ఇలానే చాలా మాటలు చెప్పి తమ పాపాలకు పరితాపపడి దేవుని వైపు తిరగాలని ప్రజలను హెచ్చరిస్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు.
\p
\v 19 ఆ రోజుల్లో హేరోదు రాజు అతని సోదరుడు బతికి ఉండగానే అతని భార్య హేరోదియను పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయం, ఇంకా అతడు చేసిన చెడు పనులన్నిటి విషయం యోహాను అతన్ని మందలించాడు.
\v 20 హేరోదు అంతవరకూ తాను చేసిన దుండగాలు చాలవన్నట్టు యోహానును బంధించి కారాగారంలో పెట్టాడు.
\s5
\p
\v 21 యోహానును జైల్లో పెట్టకముందు ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఆ తరువాత ఆయన ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరుచుకుంది.
\v 22 పరిశుద్ధాత్మ పావురం ఆకారంలో ఆయన మీద వాలాడు. అప్పుడు ఆకాశం నుండి దేవుడు యేసుతో "నీవు నేనెంతగానో ప్రేమించే నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం" అన్నాడు.
\s5
\p
\v 23 యేసు దేవుని పని మొదలుపెట్టినప్పుడు ఆయనకు సుమారు ముప్ఫై ఏళ్ళు. ఆయన యోసేపు కొడుకు (అని ప్రజలు ఎంచారు). యోసేపు హేలీ కొడుకు.
\p
\v 24 హేలీ మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు. లేవి మెల్కీ కొడుకు.
\s5
\p
\v 25 మెల్కీ యన్న కొడుకు. యన్న యోసేపు కొడుకు. యోసేపు మత్తతీయ కొడుకు. మత్తతీయ ఆమోసు కొడుకు. ఆమోసు నాహోము కొడుకు. నాహోము ఎస్లి కొడుకు. ఎస్లి నగ్గయి కొడుకు.
\p
\v 26 నగ్గయి మయతు కొడుకు. మయతు మత్తతీయ కొడుకు. మత్తతీయ సిమియ కొడుకు. సిమియ యోశేఖు కొడుకు. యోశేఖు యోదా కొడుకు.
\s5
\p
\v 27 యోదా యోహన్న కొడుకు. యోహన్న రేసా కొడుకు. రేసా జెరుబ్బాబెలు కొడుకు. జెరుబ్బాబెలు షయల్తీయేలు కొడుకు. షయల్తీయేలు నేరి కొడుకు.
\p
\v 28 నేరి మెల్కీ కొడుకు. మెల్కీ అద్ది కొడుకు. అద్ది కోసాము కొడుకు. కోసాము ఎల్మదాము కొడుకు. ఎల్మదాము ఏరు కొడుకు.
\p
\v 29 ఏరు యెహోషువ కొడుకు. యెహోషువ ఎలీయెజెరు కొడుకు. ఎలీయెజెరు యోరీము కొడుకు. యోరీము మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు.
\s5
\p
\v 30 లేవి షిమ్యోను కొడుకు. షిమ్యోను యూదా కొడుకు. యూదా యోసేపు కొడుకు. యోసేపు యోనాము కొడుకు. యోనాము ఎల్యాకీము కొడుకు.
\p
\v 31 ఎల్యాకీము మెలెయా కొడుకు. మెలెయా మెన్నా కొడుకు. మెన్నా మత్తతా కొడుకు. మత్తతా నాతాను కొడుకు. నాతాను దావీదు కొడుకు.
\p
\v 32 దావీదు యెష్షయి కొడుకు. యెష్షయి ఓబేదు కొడుకు. ఓబేదు బోయజు కొడుకు. బోయజు శల్మాను కొడుకు. శల్మాను నయస్సోను కొడుకు.
\s5
\p
\v 33 నయస్సోను అమ్మీనాదాబు కొడుకు. అమ్మీనాదాబు అద్మిను కొడుకు. అద్మిను అర్నీ కొడుకు. అర్నీ ఎస్రోము కొడుకు, ఎస్రోము పెరెసు కొడుకు. పెరెసు యూదా కొడుకు.
\p
\v 34 యూదా యాకోబు కొడుకు. యాకోబు ఇస్సాకు కొడుకు. ఇస్సాకు అబ్రాహాము కొడుకు. అబ్రాహాము తెరహు కొడుకు. తెరహు నాహోరు కొడుకు.
\p
\v 35 నాహోరు సెరూగు కొడుకు. సెరూగు రయూ కొడుకు. రయూ పెలెగు కొడుకు. పెలెగు హెబెరు కొడుకు. హెబెరు షేలహు కొడుకు.
\s5
\p
\v 36 షేలహు కేయినాను కొడుకు. కేయినాను అర్పక్షదు కొడుకు. అర్పక్షదు షేము కొడుకు. షేము నోవహు కొడుకు. నోవహు లెమెకు కొడుకు.
\p
\v 37 లెమెకు మెతూషెల కొడుకు. మెతూషెల హనోకు కొడుకు. హనోకు యెరెదు కొడుకు. యెరెదు మహలలేలు కొడుకు. మహలలేలు కేయినాను కొడుకు.
\p
\v 38 కేయినాను ఎనోషు కొడుకు. ఎనోషు షేతు కొడుకు. షేతు ఆదాము కొడుకు. ఆదాము దేవుని కొడుకు.
\s5
\c 4
\p
\v 1 యేసు యోర్దాను నదీ లోయను వదిలి వచ్చినప్పుడు ఆయన పూర్తిగా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్య ప్రాంతానికి తీసుకుపోయాడు.
\v 2 పరిశుద్ధాత్మ నలభై రోజుల వరకు ఆయనను అరణ్యంలోనే ఉంచాడు. అక్కడ ఉండగా సాతాను ఆయనను పరీక్షలకు గురి చేశాడు. అరణ్యంలో ఉన్నంత కాలం యేసు ఏమీ తినలేదు. నలభై రోజుల తరువాత ఆయన చాలా ఆకలిగా ఉన్నాడు.
\s5
\p
\v 3 అప్పుడు సాతాను యేసుతో "నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే రొట్టెలుగా మారమని ఈ రాళ్ళకు ఆజ్ఞాపించి వాటిని తినొచ్చుగా" అన్నాడు.
\v 4 దానికి యేసు, "లేదు. నేను అలా చెయ్యను. లేఖనాల్లో,
\q1 "మనిషి కేవలం ఆహారం వల్ల మాత్రమే బతకడు" అని రాసి ఉంది" అన్నాడు.
\s5
\p
\v 5 అప్పుడు సాతాను యేసును ఎత్తైన పర్వతం శిఖరం పైకి తీసుకుపోయి, లోకంలోని దేశాలన్నిటినీ ఒక్క క్షణంలో చూపించాడు.
\v 6 అప్పుడు సాతాను యేసుతో, "ఈ దేశాలన్నీ ఏలే సర్వాధికారం నేను నీకు ఇవ్వగలను. ఈ సంపదలు, శోభ నీవి అవుతాయి. అవన్నీ దేవుడు నాకు ఇచ్చేశాడు గనక నేను వాటిని ఎవరికివ్వాలంటే వాళ్ళకి ఇవ్వగలను.
\v 7 కాబట్టి నువ్వు నన్ను పూజిస్తే ఇదంతా నీకే" అన్నాడు.
\s5
\v 8 కాని యేసు, "లేదు. నేను నిన్ను పూజించను. లేఖనాలలో,
\q1 "నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించాలి.
\q1 నువ్వు సేవించదగిన వాడు ఆయన ఒక్కడే" అని రాసి ఉంది" అన్నాడు.
\s5
\p
\v 9 అప్పుడు సాతాను యేసును యెరూషలేము దేవాలయ గోపురం పైకి తీసుకుపోయి, "నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే ఇక్కడ నుండి కిందకు దూకు."
\q1
\v 10 "దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.
\q1
\v 11 పడిపోతుంటే వాళ్ళు వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు. నీకు గాయం కాదు. నీ పదం సైతం రాయికి తగలదు" అని రాసి ఉంది గదా” అని ఆయనతో అన్నాడు.
\s5
\p
\v 12 కాని యేసు, "లేదు, అలా ఒక్కనాటికీ చెయ్యను. లేఖనాల్లో
\q1 "నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించడానికి ప్రయత్నించ వద్దు" అని రాసి ఉంది" అని జవాబిచ్చాడు.
\p
\v 13 సాతాను యేసును అన్ని రకాలుగా పరీక్షించడం అయ్యాక కొంతకాలం ఆయన్ని విడిచి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 14 దీని తరువాత యేసు అరణ్య ప్రాంతం విడిచి గలిలయ జిల్లాకు తిరిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఆయనకి శక్తి నిచ్చాడు. ఆ ప్రాంతమంతా ప్రజలు యేసును గురించి విని, ఆయన గురించి ఇతరులకి చెప్పారు.
\v 15 వాళ్ళ సమాజ మందిరాల్లో ఆయన బోధించాడు, ఆయన బోధల గురించి వారందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు.
\s5
\p
\v 16 తరువాత యేసు తాను పెరిగిన నజరేతుకు వెళ్ళాడు. విశ్రాంతి రోజున ఆయన ఎప్పటిలాగా సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ ఆయన లేఖనాల నుండి చదివి విన్పించడానికి లేచి నిలబడ్డాడు.
\v 17 చాలా కాలం క్రితం యెషయా ప్రవక్త మాటలు రాసి ఉన్న తోలు చుట్టను సమాజమందిరం మనిషి ఆయన చేతికి అందించాడు. యేసు దాన్ని విప్పి చూసినప్పుడు,
\s5
\q1
\v 18 "ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు.
\q1 పేదలకు దేవుని శుభవార్త చెప్పడానికి ఆయన నన్ను నియమించాడు.
\q1 బందీలుగా ఉన్నవాళ్ళకి విడుదల ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు.
\q1 గుడ్డి వాళ్ళకు చూపు, వేధింపుల్లో ఉన్నవాళ్ళకి స్వేచ్ఛ కలుగుతుందని,
\q1
\v 19 ప్రజల పట్ల అనుకూలంగా ప్ర్రభువు పని చేయడానికి ఇదే సమయమని ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు" అనే మాటలు రాసి ఉన్న పేజీ కనిపించింది.
\s5
\p
\v 20 ఆయన ఆ చుట్టను మడిచి, అక్కడి మనిషికి ఇచ్చి కూర్చున్నాడు. సమాజమందిరంలోని వాళ్ళంతా ఆయన్నే చూస్తున్నారు.
\v 21 ఆయన వాళ్ళతో, "మీరు విన్న ఈ లేఖనం ఈ రోజు మీ కళ్ళెదుట నెరవేరింది" అన్నాడు.
\v 22 ప్రతి ఒక్కరూ ఆయన చెప్పింది విని ఆశ్చర్యపోయారు. అంతా కలవరపడ్డారు. వాళ్ళలో కొందరు "ఇతను యోసేపు కొడుకే గదా!" అనుకున్నారు.
\s5
\v 23 ఆయన వాళ్ళతో, "మీలో కొందరు కచ్చితంగా నాకు "వైద్యుడా, నిన్ను నువ్వు స్వస్థపరచుకో" అనే సామెత చెబుతారు. "కపెర్నహోంలో చేసిన అద్భుతాలు నీ స్వంత ఊరిలో, అంటే ఇక్కడ చెయ్యి" అని మీరంటారు" అన్నాడు.
\p
\v 24 తరువాత ఆయన "పెరటి తోటకూర వైద్యానికి పనికి రాదన్నట్టు ప్రవక్త ఉపదేశాలను అతని స్వంత ఊరు జనం అంగీకరించరు అనేమాట నిజమే.
\s5
\v 25 కాని ఇది ఆలోచించండి. ప్రవక్త ఏలీయా జీవించిన రోజుల్లో మూడున్నర సంవత్సరాలు అనావృష్టి వల్ల దేశమంతా భయంకరమైన కరువు వచ్చింది.
\v 26 కాని ఇశ్రాయేలు దేశం లో చాలా మంది వితంతువులు ఉండగా ఏ ఇశ్రాయేలీ వితంతువు దగ్గరికీ దేవుడు ఏలీయాను పంపలేదు. సీదోనులో వితంతువుకు సాయం చెయ్యడానికి సారెపతు ఊరికి పంపాడు.
\v 27 ప్రవక్త ఎలీషా జీవించిన కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది కుష్ఠు రోగులు ఉన్నారు. కాని ఎలీషా వాళ్ళెవ్వరినీ స్వస్థపరచలేదు. సిరియా వాడైన నయమానునే బాగుచేశాడు" అన్నాడు.
\s5
\p
\v 28 సమాజ మందిరంలోఇది విన్న వాళ్ళందరికీ పట్టరాని కోపం వచ్చింది.
\v 29 లేచి ఆయన్ని ఊరి బయటికి తోసుకుంటూ పోయారు. కొండ అంచుకు తీసుకెళ్ళి, తలక్రిందులుగా పడదోసి చంపేయాలనుకున్నారు.
\v 30 కాని ఆయన వాళ్ళ మధ్య నుండి తప్పుకుని వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 31 ఒక రోజు ఆయన గలిలయ సీమలోని కపెర్నహోం వెళ్ళాడు. తరువాతి రోజు విశ్రాంతి. ఆయన సమాజ మందిరంలో ప్రజలకు బోధించాడు.
\v 32 ప్రజలకు ఆజ్ఞాపిస్తూ చెప్పే ఆయన బోధల ధోరణికి వారందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు.
\s5
\p
\v 33 ఆ రోజు దయ్యం పట్టిన ఒకడు ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. వాడు గట్టిగా అరుస్తూ,
\v 34 "ఓ నజరేతువాడా యేసూ, దయ్యాలతో నీకేం సంబంధం? మమ్మల్నందర్నీ నాశనం చేయడానికి వచ్చావా? నువ్వెవరివో నాకు తెలుసులే. నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన పవిత్రమూర్తివి" అన్నాడు.
\s5
\v 35 అప్పుడు యేసు, "నోరు మూసుకో. అతనికేమీ హాని చెయ్యక అతనిలోనుండి బయటికి రా" అన్నాడు. దయ్యం అతణ్ణి వారి మధ్యలో కింద పడేసి అతనికి ఏ హానీ చేయకుండా అతనిలో నుండి బయటికి వచ్చేసింది.
\v 36 అది చూసి సమాజ మందిరంలో ఉన్న వాళ్ళంతా నివ్వెరపోయారు. వాళ్ళు ఒకరితో ఒకరు, "ఆయన చాలా ధైర్యంగా మాట్లాడతాడు. ఆయన మాటల్లో చాలా ప్రభావం ఉంది. దురాత్మలు కూడా ఆయన మాట విని ఆయన ఆజ్ఞాపించగానే మనిషిని వదిలి బయటికి వస్తున్నాయి" అనుకున్నారు.
\v 37 ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో యేసు చేసిన దాన్ని గురించి ప్రజలు మాట్లాడుకుంటూనే ఉన్నారు.
\s5
\p
\v 38 యేసు సమాజ మందిరం నుంచి సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్తగారు అప్పుడు తీవ్రమైన జ్వరంతో మంచం పట్టి ఉంది. అక్కడ ఉన్న కొందరు ఆమెను బాగు చెయ్యమని యేసును అడిగారు.
\v 39 ఆయన ఆమె దగ్గర నిలబడి జ్వరానికి ఆజ్ఞ ఇవ్వగానే ఆమెలోని జ్వరం పోయింది. వెంటనే ఆమె లేచి వాళ్ళకి భోజనం వడ్డించింది.
\s5
\p
\v 40 ఆ రోజు పొద్దుగుంకే వేళకు చాలామంది తమకు తెలిసిన వారినీ, చుట్టాలనూ రకరకాల జబ్బులు నయం చేయించుకోవడం కోసం ఆయన దగ్గరికి తీసుకు వచ్చారు. ఆయన వాళ్ళపై చేతులుంచి అందర్నీ స్వస్థపరిచాడు.
\v 41 చాలా మందిలో నుండి దయ్యాలను బయటికి పొమ్మని ఆజ్ఞాపించాడు. అవి వాళ్ళని వదిలి పోతున్నప్పుడు "నువ్వు దేవుని కుమారుడివి" అని అరిచాయి. కాని అలా అందరికీ చెప్పొద్దని ఆయన ఆ దయ్యాలకు ఆజ్ఞాపించాడు. ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు.
\s5
\p
\v 42 మరుసటి ఉదయం యేసు ఒక ఏకాంత స్థలానికి వెళ్ళాడు. ప్రజలు గుంపులుగా ఆయన ఉన్న చోటికి వెతుక్కుంటూ వచ్చారు. తమను విడిచి పోకుండా ఆయన్ని ఆపడానికి చూసారు.
\v 43 కాని ఆయన వాళ్ళతో, "దేవుడు ప్రజలను ఎలా ఏలుతాడో మిగిలిన ఊర్లలో కూడా చెప్పాలి. అది చేయడానికే దేవుడు నన్ను పంపాడు" అన్నాడు.
\v 44 కాబట్టి ఆయన యూదయ ప్రాంతంలో వివిధ గ్రామాల్లో ఉన్న సమాజ మందిరాల్లో బోధిస్తూ ఉన్నాడు.
\s5
\c 5
\p
\v 1 ఒక రోజు యేసు మాట్లాడుతుండగా చాలా మంది ప్రజలు గుంపుగా ఆయన చుట్టూ చేరి వింటున్నారు. ఆయన గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు.
\v 2 సరస్సు ఒడ్డున రెండు చేపలను పట్టే పడవలు ఉన్నాయి. జాలరులు పడవలను వదిలి వలలు కడుక్కుంటున్నారు.
\v 3 యేసు ఆ రెండు పడవల్లో ఒక దానిపై ఎక్కాడు (ఆ పడవ సీమోనుది). ఒడ్డు నుండి నీళ్ళలోకి కొంత దూరం పడవను తోయమని యేసు సీమోనును అడిగి, పడవలో కూర్చుని బోధించడం కొనసాగించాడు.
\s5
\p
\v 4 ఆయన బోధించడం పూర్తయ్యాక సీమోనుతో, "పడవను కొంచెం లోతుకు పోనిచ్చి, వలలు వేసి కొన్ని చేపలు పట్టు" అన్నాడు.
\v 5 సీమోను "అయ్యా, రాత్రంతా చాలా కష్టపడ్డాం. అయినా ఒక్క చేప కూడా దొరకలేదు. అయినా నువ్వు చెప్పావు కాబట్టి మళ్ళీ వలలు వేసి చూస్తాను" అన్నాడు.
\v 6 సీమోను, అతని మనుషులు వలలు వేశారు. వలలు పిగిలిపోయేలా చేపలు పడ్డాయి.
\v 7 వాళ్ళు తమతో కలిసి చేపలు పట్టే వాళ్ళని కూడా వచ్చి సాయం చేయమని పిలిచారు. పడవ మునిగిపోయేంతగా చేపలు పడ్డాయి. వాటితో రెండు పడవలు నింపారు.
\s5
\p
\v 8 ఇది చూసి సీమోను పేతురు యేసు కాళ్ళపై పడి, "ప్రభూ, దయ చేసి నన్ను వదిలి వెళ్ళిపో. నేను పాపాత్ముణ్ణి" అన్నాడు.
\v 9 లెక్క లేనన్ని చేపలు పడడం చూసి పేతురు ఆశ్చర్యపోయి అలా అన్నాడు. జెబెదయి కొడుకులు యాకోబు, యోహాను ఇద్దరూ సీమోనుకు చేపల వ్యాపారంలో భాగస్తులు.
\v 10 యేసు మాత్రం "సీమోనూ ఏం భయం లేదు. ఇప్పటివరకు నువ్వు చేపలు పట్టావు. కాని, ఇప్పటి నుండి నా శిష్యుడుగా నువ్వు మనుషులను సమకూర్చుతావు" అన్నాడు.
\p
\v 11 కాబట్టి పడవలు ఒడ్డుకు చేర్చాక వాళ్ళు చేపల వ్యాపారాన్ని, తమకు ఉన్నదంతా వదిలి యేసు వెంట వెళ్లారు.
\s5
\p
\v 12 యేసు అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఊరిలో ఉండగా ఒక కుష్ఠు రోగి ఆయనను చూసి, దగ్గరికి వచ్చి ఆయన ఎదుట నేలను తాకేలా వంగి బతిమాలుతూ, "ప్రభూ, దయచేసి నన్ను బాగుచెయ్యి. నీకిష్టమైతే నన్ను నువ్వు స్వస్థపరచగలవు" అన్నాడు.
\v 13 అప్పుడు యేసు అతని చెయ్యి పట్టుకుని, "నాకు ఇష్టమే. ఇప్పుడే స్వస్థత పొందు" అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి బాగుపడ్డాడు.
\s5
\v 14 యేసు "ఇప్పడు నువ్వు బాగైన విషయం వెంటనే ఎవరికీ చెప్పొద్దు. ముందు యెరూషలేములోని యాజకుడికి కనపడు. అతడు నీకు కుష్ఠు లేదని పరీక్షించి చెబుతాడు. మోషే ఆజ్ఞాపించినట్టు కుష్టురోగానికి అర్పించాల్సిన అర్పణ యాజకుడి దగ్గరికి తీసుకెళ్ళు" అన్నాడు.
\s5
\p
\v 15 ఆ వ్యక్తిని యేసు ఎలా స్వస్థపరిచాడో చాలామంది విన్నారు. దాని ఫలితంగా యేసు బోధలు వినడానికి, రోగాల నుండి స్వస్థత పొందడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.
\v 16 అయినా ఆయన తరచుగా ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు.
\s5
\p
\v 17 ఒకరోజు యేసు బోధిస్తూండగా, పరిసయ్యుల శాఖ వాళ్ళు కొందరు దగ్గరలో కూర్చున్నారు. వాళ్ళలో కొందరు యూదీయ ధర్మశాస్త్రం బోధించే పండితులు. గలిలయ జిల్లాలోని గ్రామాల నుండి, యూదయ ప్రాంతంలోని యెరూషలేము నుండి కొందరు వచ్చారు.
\s5
\p
\v 18 యేసు అక్కడ ఉన్నప్పుడు పక్షవాత రోగిని కొందరు మంచంపై పడుకోబెట్టి ఆయన దగ్గరికి మోసుకొచ్చారు. ఆ రోగిని యేసు ఎదుటికి తేవాలని ఇంట్లోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
\v 19 కాని ఇంటి నిండా జనం ఉండడం వల్ల వాళ్ళు అతన్ని లోపలికి తీసుకు రాలేక పోయారు. కాబట్టి వాళ్ళు బయటి మెట్లెక్కి, కప్పు పైకి చేరుకుని ఆ ఇంటిపై పెంకులు తీసి, పై కప్పులోనుండి మంచంతో సహా ఆ రోగిని యేసు ఎదుట దించారు.
\s5
\p
\v 20 తాను ఆ రోగిని స్వస్థపరుస్తానని వాళ్ళు నమ్మారు అని యేసు గ్రహించి అతనితో, "మిత్రమా, నేను నీ పాపాలు క్షమిస్తున్నాను" అన్నాడు.
\v 21 ధర్మశాస్త్రం బోధించే పండితులు, మిగిలిన పరిసయ్యులు ఇది విని వాళ్ళ మనసుల్లో "ఈ మనిషి గర్విష్టి. అందుకే ఇలాటి మాటలు మాట్లాడి దేవుణ్ణి అవమానిస్తున్నాడు. దేవుడు తప్ప మరెవరూ పాపాలు క్షమించలేరని మనందరికీ తెలుసు" అనుకున్నారు.
\s5
\v 22 వాళ్ళేమి అనుకుంటున్నారో యేసుకు తెలుసు. ఆయన వాళ్ళతో "నేను పలికిన దాని గురించి మీలో మీరు ఎందుకు ప్రశ్నించుకుంటున్నారు? ఇది ఆలోచించండి.
\v 23 ఈ వ్యక్తి పాప క్షమాపణ పొందాడో లేదో ఎవరూ చూడలేరు గదా. కాబట్టి "నువ్వు క్షమాపణ పొందావు" అని చెప్పడం సులువే. కాని స్వస్థత పొందిందీ లేనిదీ ప్రజలు వెంటనే కళ్ళతో చూస్తారు గనక "లేచి నడువు" అని చెప్పడం అంత తేలిక కాదు.
\v 24 నేను ఈ మనిషిని బాగుచేస్తాను. భూమి మీద మనుషుల పాపాలు క్షమించే అనుమతిని దేవుడు మనుష్య కుమారుడైన నాకు కూడా ఇచ్చాడని మీకు నిరూపిస్తాను" అని చెప్పి పక్షవాతం వచ్చిన మనిషితో, "నీ పరుపు చుట్టుకుని లేచి ఇంటికి వెళ్ళు" అన్నాడు.
\s5
\v 25 వెంటనే ఆ రోగికి వ్యాధి నయమైంది. వాళ్ళందరి ఎదుట లేచి నిల్చున్నాడు. తనను మోసుకు వచ్చిన పరుపును చుట్టుకుని దేవునికి స్తుతులర్పిస్తూ ఇంటికి వెళ్ళాడు.
\v 26 అక్కడి వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. యేసు చేసినది చూసి నివ్వెరపోతూ దేవుణ్ణి స్తుతించారు. "ఈ రోజు నమ్మశక్యం గానీ విషయాలు చూశాము గదా!" అనుకున్నారు.
\s5
\p
\v 27 అప్పుడు యేసు అక్కడినుండి బయలుదేరి రోమా ప్రభుత్వం తరుపున పన్ను వసూలు చేసే లేవి అనే వ్యక్తిని చూసాడు. పౌరులు ప్రభుత్వం విధించిన పన్నులు కట్టే చోట అతడు కూర్చుని ఉన్నాడు. యేసు అతనితో "నాతో రా. నా శిష్యుడిగా ఉండు" అన్నాడు.
\v 28 కాబట్టి లేవీ తన ఉద్యోగం వదిలేసి యేసుతో వెళ్ళాడు.
\s5
\p
\v 29 తరువాత లేవి తనకు తానుగా యేసుకు, ఆయన శిష్యులకు విందు ఏర్పాటు చేసాడు. అక్కడ చాలామంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, మరికొంతమంది కలిసి భోజనం చేస్తున్నారు.
\v 30 పరిసయ్యుల శాఖకు చెందిన కొందరు ధర్మశాస్త్ర పండితులు యేసు శిష్యులతో "ఘోర పాపులతో, పన్ను వసూలు చేసే వాళ్ళతో, మీరు భోజనం చేస్తున్నారేంటి" అన్నారు.
\v 31 అప్పుడు యేసు వాళ్ళతో, "వైద్యుడి అవసరం రోగులకు మాత్రమే తెలుసు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు తెలీదు.
\v 32 అలాగే నేను వచ్చింది మేము నీతిపరులం అనుకోనే వాళ్ళ కోసం కాదు. మేము పాపులం అనుకునే వాళ్ళను పరివర్తనం చెంది నా దగ్గరకు రమ్మని ఆహ్వానించడానికే వచ్చాను" అన్నాడు.
\s5
\p
\v 33 ఆ యూదీయ నాయకులు యేసుతో, "బాప్తిసమిచ్చే యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటారు. పరిసయ్యుల శిష్యులూ అంతే. కాని, నీ శిష్యులు తింటూ, తాగుతూ ఉంటారు. ఇతరుల్లాగా ఉపవాసం ఉండరు. ఎందుకు?" అని ప్రశ్నించారు.
\v 34 యేసు, "పెళ్లికొడుకుతో ఉన్న స్నేహితులకు ఉపవాసం చేయమని మీరు చెప్పరు కదా.
\v 35 ఒక రోజున పెళ్ళికొడుకు తన స్నేహితుల దగ్గర నుండి వెళ్ళిపోయే తరుణం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు" అని జవాబు చెప్పాడు.
\s5
\p
\v 36 తన ఉద్దేశం వారికి వంటబట్టేలా చెయ్యడానికి యేసు ఇంకొక ఉదాహరణ చెప్పాడు. "పాత గుడ్డకి కొత్తగుడ్డ మాసిక వెయ్యరు. అలా చేస్తే కొత్త గుడ్డ చినిగిపోతుంది. పాత గుడ్డ కొత్తగుడ్డకు అతకదు.
\s5
\v 37 మరొకటి. కొత్త ద్రాక్షరసం పాత తోలు సంచుల్లో నిలవ చెయ్యరు. అలా చేస్తే తిత్తులు చినిగి పోతాయి. ఎందుకంటే కొత్త ద్రాక్షారసం పులిసినప్పుడు చర్మం సాగాలి. పాత చర్మం సాగదు గనక పాత సంచి అయితే పిగిలి పోతుంది. రసం కూడా నేలపాలవుతుంది.
\v 38 అందువల్ల కొత్త ద్రాక్షరసం కొత్త సంచుల్లోనే పొయ్యాలి."
\p
\v 39 "పాత ద్రాక్షరసం తాగిన తరువాత కొత్తదాన్ని ఎవరూ ఇష్టపడరు. పాతదే బాగుందని అంటారు."
\s5
\c 6
\p
\v 1 ఒక విశ్రాంతి రోజున యేసు, ఆయన శిష్యులు పంట చేలలో నడిచి వెళ్తూండగా శిష్యులు కొన్ని కంకులు తెంపి, ధాన్యం గింజలు చేతులతో నలిపి పొట్టు తీసి నోట్లో వేసుకుంటున్నారు.
\v 2 ఇది గమనించిన పరిసయ్యులు, "మీరు ఇలా చేయకూడదు. విశ్రాంతి రోజున పని చేయకూడదని మన ధర్మశాస్త్రం చెప్పింది కదా" అన్నారు.
\s5
\v 3 ఆ పరిసయ్యులకు యేసు జవాబిస్తూ, "రాజు కాకముందు దావీదుకు, అతని మనుషులకు ఆకలేసినపుడు ఏమి చేసారో మీరు లేఖనాలలో చూడలేదా.
\v 4 దావీదు ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి తినడానికి ఏమైనా కావాలని అడిగాడు. యాజకుడు దేవుని సన్నిధిలో పెట్టి ఉంచిన నైవేద్యం రొట్టెలు వాళ్ళకిచ్చాడు. ఆ రొట్టెలు యాజకులు మాత్రమే తినాలని మోషే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు. దావీదు, అతని మనుషులు యాజకులు కాకపోయినా దావీదు కొంత తిని, తన మనుషులకు ఇచ్చాడు. ఇది మీకు తెలుసు కదా.
\v 5 అలాగే విశ్రాంతి రోజున ఏమి చెయ్యాలో నిర్దేశించే అధికారం మనుష్యకుమారుడికి ఉంది."
\s5
\p
\v 6 ఇంకొక విశ్రాంతి రోజున సమాజమందిరంలో యేసు బోధ చేస్తూ ఉండగా కుడి చెయ్యి చచ్చుబడిపోయిన మనిషి అక్కడ ఉన్నాడు.
\v 7 ధర్మశాస్త్ర పండితులు, అక్కడ ఉన్న పరిసయ్యులు యేసును గమనిస్తున్నారు. ఆయన ఎవరినైనా స్వస్థపరిస్తే చూసి, విశ్రాంతి రోజున పని చేసినందుకు, వాళ్ళ నియమాలు మీరినందుకు తప్పు పడదామని కనిపెడుతూ ఉన్నారు.
\v 8 వాళ్ళు ఏమనుకుంటున్నారో యేసుకు తెలుసు. ఆయన అవిటి చెయ్యి ఉన్న వాణ్ణి చూసి, "ఇటు వచ్చి అందరి ఎదుటా నిలబడు" అని చెప్పాడు. ఆ వ్యక్తి వెళ్ళి నిలబడ్డాడు.
\s5
\v 9 అప్పుడు యేసు, "ప్రజలకు మోషే ద్వారా దేవుడిచ్చిన ఆజ్ఞలు విశ్రాంతి రోజున మేలు చేయడానికా, లేక కీడు చేయడానికా? విశ్రాంతి రోజు ఉన్నది ప్రాణాన్ని రక్షించడానికా, లేక ప్రాణం తియ్యడానికా? అని మిమ్మల్ని అడుగుతున్నాను" అని వాళ్ళతో అన్నాడు.
\p
\v 10 ఎవరూ జవాబు ఇవ్వలేదు. యేసు ఒకసారి అందరినీ చూసి, ఆ మనిషితో, "నీ చచ్చుబడిన చెయ్యి చాపు" అన్నాడు. ఆ వ్యక్తి చాపగానే అతని చెయ్యి పూర్తిగా బాగుపడింది.
\v 11 కాని మత నాయకులు వెర్రి కోపంతో నిండిపోయి, యేసును వదిలించుకోడానికి ఏమి చెయ్యాలబ్బా అని ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.
\s5
\p
\v 12 కొంత కాలమయ్యాక ఒక రోజు యేసు ప్రార్థన చేసుకోడానికి కొండపైకి వెళ్ళాడు. అక్కడ ఆయన ఆ రాత్రంతా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
\p
\v 13 తరువాత రోజు ఆయన తన శిష్యులందరినీ పిలిచి, వాళ్ళలో పన్నెండు మందిని ఎంపికచేసి, వాళ్ళకి అపోస్తలులు అని పేరు పెట్టాడు.
\s5
\v 14 వాళ్ళు ఎవరంటే సీమోను- ఇతనికి యేసు పెట్టిన కొత్త పేరు పేతురు, అంద్రెయ- పేతురు తమ్ముడు, యాకోబు, అతని తమ్ముడు యోహాను, ఫిలిప్పు, బర్తోలోమయి,
\v 15 మత్తయి- ఇతని ఇంకొక పేరు లేవీ, తోమా, ఇంకొక యాకోబు- ఇతను అల్ఫయి కొడుకు, సీమోను - ఇతను దేశ భక్తుల వర్గం వాడు,
\v 16 యూదా- ఇతని తండ్రి పేరు కూడా యాకోబే, ఇస్కరియోతు యూదా- యేసుకు నమ్మక ద్రోహం చేసినవాడు.
\s5
\p
\v 17 కొండపై నుండి యేసు తన శిష్యులతో కలసి దిగి వచ్చి మైదానంలో నిలబడ్డాడు. అక్కడ ఆయన శిష్యుల గుంపు ఉంది. యెరూషలేము నుండి చాలా మంది జనం అక్కడికి వచ్చారు. యూదయలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తూరు సీదోను పట్టణ ప్రాంతాల నుండి జనం కూడా వచ్చారు.
\v 18 వారంతా యేసు బోధ వినడానికి వచ్చారు. వాళ్ళ రోగాలను ఆయన స్వస్థపరిచాడు. దయ్యాల పీడ కింద ఉన్న వాళ్ళను కూడా ఆయన బాగు చేసాడు.
\v 19 జన సమూహంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనను ముట్టుకోవాలని తహతహలాడుతున్నారు. ఆయన తన ప్రభావంతో ప్రతి ఒక్కరినీ బాగుచేసాడు.
\s5
\p
\v 20 తరువాత ఆయన తన శిష్యులను చూసి,
\q1 "పేదలుగా ఉండడం మంచిది, దేవుడే మిమ్మల్ని ఏలుతున్నాడు.
\q1
\v 21 మీరు ఆకలిగా ఉండడం మంచిది, దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు.
\q1 మీరు దుఃఖించడం మంచిది, ఒక రోజున దేవుడు మీకు ఆనందాన్నిచ్చి నవ్వు పుట్టిస్తాడు.
\s5
\q1
\v 22 ఇతరులు మిమ్మల్ని తృణీకరించి, ద్వేషిస్తే మీకు మంచిది.
\q1 మనుష్య కుమారుణ్ణి మీరు వెంబడించిన కారణంగా మిమ్మల్ని వాళ్ళు చులకన చేసి, మిమ్మల్ని చెడ్డవాళ్ళు అంటారు.
\q1
\v 23 అలా జరిగితే సంతోషించండి. ఆనందంతో చిందులు వెయ్యండి.
\q1 దేవుడు గొప్ప ప్రతిఫలం పరలోకంలో మీకిస్తాడు. పూర్వం ప్రవక్తల పట్ల వాళ్ళ పితరులు కూడా అలానే చేశారని మర్చిపోవద్దు."
\s5
\p
\v 24 "అయ్యో ధనికులారా, మీకు విచారమే. మీ ధనం ఇప్పటికే మీకు కావలసిన సౌకర్యాలన్నీ ఇచ్చేసింది.
\v 25 అయ్యో, నాకు కావలసినదంతా ఉందని ఎవరన్నా అనుకుంటే అతనికి యాతన. ఇవి మీకు తృప్తి ఇవ్వవని మీరు తెలుసుకుంటారు. ఇప్పుడు సంతోషంగా ఉండే మీరు రేపు ఏడుస్తారు.
\s5
\p
\v 26 ప్రతి ఒక్కరూ మిమ్మల్ని పొగుడుతుంటే మీకు వేదనే. దేవుని ప్రవక్తలని చెప్పుకొనే అబద్ధ ప్రవక్తలను మీ పితరులు కూడా అలాగే పొగిడారు.
\s5
\v 27 కానీ నేను చెప్పేది వినే ప్రతి ఒక్కరూ మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్లకు మేలు చేయండి.
\v 28 మిమ్మల్ని శపించే వాళ్ళని దీవించమని దేవుని అడగండి. మిమ్మల్ని బాధించే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి."
\s5
\p
\v 29 "నిన్ను చెంపదెబ్బ కొట్టేవాడికి రెండవ చెంప చూపించు. ఎవరైనా నీ కోటు లాక్కుపోతూ నీ చొక్కా కూడా కావాలంటే అది కూడా ఇచ్చెయ్యి.
\v 30 ఎవరు ఏమి అడిగితే అది ఇచ్చెయ్యి. నీ వస్తువులు ఇమ్మని ఎవరైనా అడిగితే తిరిగి ఇమ్మని అడగవద్దు."
\s5
\p
\v 31 "ఇతరులు నీకు ఏమి చెయ్యాలని కోరుకుంటావో అలాగే వాళ్ళకి నువ్వు చెయ్యాలి.
\v 32 మిమ్మల్ని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తే ఆ విషయంలో దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు అనుకోవద్దు. పాపులు కూడా తమను ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తారు కదా!
\v 33 మీకు మంచి చేసే వాళ్ళకే మంచి చేస్తే దేవుని దగ్గరనుండి మెప్పు కోరుకోవద్దు. పాపులు కూడా అదే చేస్తారు.
\v 34 తిరిగి వెనక్కి ఇచ్చేవాళ్ళకే మీరు అప్పుగాని, ఆస్తిగాని ఇస్తే దేవుని మెప్పు కోరవద్దు. పాపులు కూడా అప్పిస్తారు, తిరిగి ఇవ్వాలని కోరుకుంటారు."
\s5
\p
\v 35 "మీరు శత్రువులను ప్రేమించండి. వాళ్ళకి మంచి చేయండి. అప్పిచ్చి తిరిగి చెల్లించాలని ఆశించవద్దు. అప్పుడు దేవుడు మీకు మంచి ఫలితం ఇస్తాడు. మీరు మహోన్నతుడైన దేవుని పిల్లలు. ఆయన కృతజ్ఞతలేని వాళ్ళ మీద, చెడ్డవాళ్ళమీద తన దయ చూపిస్తున్నాడు.
\v 36 కాబట్టి మీ పరలోకపు తండ్రి అందరిపై కరుణ చూపుతున్నట్టు, మీరు తరుల పట్ల కరుణ చూపించాలి."
\s5
\p
\v 37 "ఇతరుల్ని కఠినంగా విమర్శించవద్దు. అప్పుడు దేవుడు నిన్ను కఠినంగా విమర్శించడు. ఇతరుల్ని నిందించొద్దు. చెడు చేసే వాళ్ళని క్షమించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు.
\s5
\v 38 ఇతరులకు మంచివి ఇవ్వండి. అప్పుడు దేవుడు మీకు ధారాళంగా ఇస్తాడు. ఎలానంటే ధాన్యం బుట్టలో అదిమి, కుదించి, అది పూర్తిగా నిండి, పక్కలకు జాలువారేటంతగానన్నమాట. గుర్తుంచుకోండి. మీరు ఇతరులను ఏ స్థాయిలో చూస్తారో, సంతోషపెడతారో అదే స్థాయిలో దేవుడు మిమ్మల్ని చూస్తాడు, సంతోషపెడతాడు."
\s5
\p
\v 39 ఆయన తన శిష్యులకు ఈ పోలిక చెప్పాడు. "గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపడానికి ప్రయత్నం చెయ్యకూడదు. అలా చేస్తే ఇద్దరూ గుంటలో పడతారు.
\v 40 గురువు కంటే శిష్యుడు గొప్ప కాదు. కాని పూర్తి శిక్షణ పొందాక అతడు తన గురువులా అవుతాడు. కాబట్టి మీరు నాలాగా అవ్వాలి."
\s5
\p
\v 41 "ఇతరులు చేసిన తప్పిదాలను పట్టించుకోవద్దు. అది చేస్తే నీ కంట్లో కొయ్య దుంగను ఉంచుకుని కూడా పట్టించుకోకుండా ఎదుటివాడి కంట్లో నలకను ఎత్తి చూపుతున్నట్టు.
\v 42 నువ్వు నీ కంట్లోని కొయ్య దుంగను చూసుకోకుండా వేరే వాడితో "మిత్రమా, నీ కంట్లో ఉన్న నలక తీసేస్తాను రా" అనకూడదు. అలా చేస్తే నువ్వు కపటివి. మొదట నువ్వు పాపాలు చెయ్యడం మానాలి. అది నీ కంట్లో కొయ్య దుంగను తీసివెయ్యడం లాంటిది. అలా చెయ్యగలిగితే ఆత్మ సంబంధమైన అంతర దృష్టి నీకు ఉంటుంది. అప్పుడు ఇతరుల కంట్లో నలక పోయేలా సాయం చేయగలవు."
\s5
\p
\v 43 "మంచి చెట్టు పనికిరాని కాయలివ్వదు, పనికిమాలిన చెట్టు మంచి కాయలివ్వదు అని అందరికీ తెలుసు.
\v 44 చెట్టు కాయను చూసి చెట్టు ఎలాంటిదో ఎవరైనా చెప్పగలరు. ఉదాహరణకు ముళ్ళ పొదలో అంజూరు కాయల కోసం ఎవరూ చూడరు. రక్కెస పొదలో ద్రాక్షపళ్ళు కోసుకోవాలని చూడరు.
\s5
\v 45 మంచివాళ్ళు మంచి పనులు చేస్తారు. అవి వాళ్ళ మంచి ఆలోచనా పద్ధతిని తెలుపుతాయి. చెడ్డవాళ్ళు చెడ్డ పనులు చేస్తారు. అవి వాళ్ళ చెడు ఆలోచనా పద్ధతిని తెలుపుతాయి. మనుషుల ఆలోచనలే వాళ్ళ ప్రవర్తన, మాటతీరును తెలుపుతాయి."
\s5
\p
\v 46 యేసు ప్రజలతో, "నా మాటకు లోబడి, నేను చెప్పింది చేయకుండా నన్నెందుకు "ప్రభూ, ప్రభూ" అని పిలుస్తున్నారు?
\v 47 నా ఉపదేశం విని విధేయత చూపుతూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు
\v 48 ఇల్లు కట్టడానికి రాతి చట్టు మీద లోతైన పునాది వేసుకునే వాళ్ళు. అప్పుడు వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా ఇంటిని కదల్చ లేవు. ఎందుకంటే అతడు రాతి మీద పునాది వేసాడు.
\s5
\v 49 కానీ నా బోధలు విని నా మాటలకు లోబడకుండా ఉంటే, వాళ్ళు పునాది వేయకుండా ఇల్లు కట్టేవాళ్ళతో సమానం. వరదలు వచ్చి, నది పొంగినప్పుడు ఇల్లు కుప్పగూలి ధ్వంసమై పోతుంది."
\s5
\c 7
\p
\v 1 యేసు ప్రజలతో మాట్లాడడం పూర్తయ్యాక కపెర్నహోం వెళ్ళాడు.
\s5
\v 2 ఆ ఊరిలో రోమా సైన్యంలో వందమంది సైనికులపై అధికారి అయిన సేనానికి ఇష్టమైన పనివాడు ఒకడున్నాడు. ఆ పనివాడు చాలా జబ్బుపడి, చనిపోయేలా ఉన్నాడు.
\v 3 శతాధిపతి యేసు గురించి విని యూదీయ పెద్దలను ఆయన దగ్గరకు పంపి "అయ్యా, వచ్చి నా పనివాణ్ణి స్వస్థపరచండి" అని అడిగించాడు.
\p
\v 4 వాళ్ళు యేసు దగ్గరికి వచ్చి శతాధిపతి పనివాణ్ణి బాగు చెయ్యమని బతిమాలారు. వాళ్ళు యేసుతో, "నీ నుండి ఈ సాయం పొందడానికి అతడు అర్హుడు.
\v 5 మన ప్రజల్ని అతడు బాగా చూసుకుంటాడు. మన కోసం సమాజమందిరాలను కట్టించాడు కూడా" అని చెప్పారు.
\s5
\v 6 కాబట్టి యేసు వాళ్ళతో ఆ అధిపతి ఇంటికి బయలుదేరాడు. అతని ఇంటికి అల్లంత ఉండగా ఆ అధికారి మళ్ళీ కొందరిని యేసు దగ్గరకు పంపి, "ప్రభూ, నువ్వు శ్రమ తీసుకోకు. నువ్వు నా ఇంటికి వచ్చేటంత యోగ్యత నాకు లేదు.
\v 7 అందుకే నాకు నేనుగా నీ దగ్గరికి రాలేకపోయాను. కాని నువ్వు ఒక్క మాట చెప్పు. నా పనివాడు బాగవుతాడు.
\v 8 నాకు ఈ సాయం చేస్తావని నాకు తెలుసు. నేను కూడా అధికారుల ఆజ్ఞలకు లోబడేవాడినే. నా ఆజ్ఞకు లోబడే సైనికులూ నాకున్నారు. నేను వాళ్ళతో "వెళ్ళు" అంటే వెళ్తారు, "రా" అంటే వస్తారు. నా పనివాణ్ణి "ఇది చెయ్యి" అంటే చేస్తాడు" అని కబురు పంపాడు.
\s5
\p
\v 9 ఆ అధిపతి చెప్పింది యేసు విని ఆశ్చర్యపోయాడు. జనసమూహం వైపు తిరిగి, "మీకు చెబుతున్నాను, ఈ యూదేతరుడిలో కనిపించిన విశ్వాసం ఇశ్రాయేలీయులలో సైతం నేను చూడలేదు సుమా" అన్నాడు.
\v 10 శతాధిపతి దగ్గర నుండి వచ్చిన వాళ్ళు తిరిగి ఇంటికి పోయి ఆ పనివాడు ఆరోగ్యంగా ఉండడం చూసారు.
\s5
\p
\v 11 దీని తరువాత వెంటనే యేసు నాయీను అనే గ్రామానికి వెళ్ళాడు. ఆయన శిష్యులు, పెద్ద జన సమూహం ఆయనతో వెళ్లారు.
\v 12 ఆ ఊరి పొలిమేర దగ్గరికి వచ్చినప్పుడు, పెద్ద గుంపు ఆ ఊరిలోనుండి బయటికి వస్తున్నది. వాళ్ళు అప్పుడే చనిపోయిన మనిషిని మోసుకొస్తున్నారు. చనిపోయిన వాడి తల్లి విధవరాలు. ఆమెకు అతడు ఒక్కడే కొడుకు. ఆమె ఆ గుంపులో ఉంది. వాళ్ళు శవాన్ని పాతిపెట్టడానికి వెళ్తున్నారు.
\v 13 ప్రభువు ఆమెను చూసి కనికరపడి ఆమెతో, "ఏడవ్వద్దమ్మా" అన్నాడు.
\v 14 ఆయన వాళ్ళకి దగ్గరగా వచ్చి శవాన్ని పడుకోబెట్టిన పాడెను ముట్టుకున్నాడు. పాడెను మోసుకుపోతున్న వాళ్ళు ఆగారు. ఆయన, "అబ్బాయ్, నేను చెబుతున్నాను, లే" అన్నాడు.
\v 15 ఆ కుర్రవాడు లేచి కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు యేసు అతనిని తల్లికి అప్పగించాడు.
\s5
\v 16 అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దేవుని స్తుతిస్తూ ఒకరికొకరు "ఆ గొప్ప ప్రవక్త మన మధ్య వెలిశాడు. తన ప్రజలను కాపాడడం కోసం దేవుడు వచ్చాడు!" అనీ చెప్పుకున్నారు.
\v 17 ఈ వార్త యూదయ ప్రాంతమంతా, దగ్గరలోని ఇతర ప్రాంతాలన్నిటికీ దావానలంలా పాకిపోయింది.
\s5
\p
\v 18 బాప్తిసమిచ్చే యోహానుతో అతని శిష్యులు ఈ విషయాలన్నీ చెప్పారు.
\v 19 అప్పుడు యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని "మీరు వెళ్ళి దేవుడు వాగ్దానం చేసినట్టు రావలసిన వాడివి నువ్వేనా, లేక మేము ఇంకొకరి కోసం ఎదురు చూడాలా? అని ప్రభువును అడిగి తెలుసుకోండి" అని చెప్పి పంపాడు.
\v 20 ఆ ఇద్దరు శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, "బాప్తిసమిచ్చే యోహాను మమ్మల్ని పంపాడు. దేవుడు వాగ్దానం చేసింది నీ గురించేనా, లేక వేరొకరి కోసం మేము ఎదురు చూడాలా?" అని అడిగారు.
\s5
\p
\v 21 సరిగ్గా అదే సమయంలో యేసు అనేకమంది రోగులనూ, బాధితులనూ, దయ్యాలు పట్టిన వారిని బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు.
\v 22 ఆ ఇద్దరికీ ఆయన జవాబిస్తూ, "తిరిగి వెళ్ళి మీరు చూసినవీ విన్నవీ యోహానుతో చెప్పండి. గుడ్డి వాళ్ళు చూస్తున్నారు. కుంటివాళ్ళు నడుస్తున్నారు. కుష్ట రోగులు బాగుపడుతున్నారు. చెవిటివారు వింటున్నారు. చనిపోయినవాళ్ళు బతుకుతున్నారు. బీదలకు శుభవార్త ప్రకటన జరుగుతున్నది.
\v 23 నేను చేసేది చూసేవాళ్ళని దేవుడు దీవిస్తాడు. నేను చెప్పేది వినేవాళ్ళు నా నుండి వెళ్ళిపోరు" అన్నాడు.
\s5
\p
\v 24 యోహాను శిష్యులు వెళ్ళిపోయాక యోహాను గురించి జనంతో యేసు మాట్లాడడం ప్రారంభించాడు. "ఏమి చూడడానికి మీరు అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగుతూ ఉండే గడ్డిపోచనా?
\v 25 లేక పోతే ఏమి చూడడానికి వెళ్ళారు? సుతారమైన బట్టలు వేసుకున్నవాడినా? చూడండి, విలువైన బట్టలు వేసుకొనేవాళ్ళు, సుఖ భోగాలు అనుభవించే వాళ్ళు రాజ భవనాల్లో ఉంటారు.
\v 26 మరి అక్కడికి దేన్ని చూడడానికి వెళ్లారు? ప్రవక్తనా? ఔను. ఆ మాటకొస్తే సాధారణ ప్రవక్త కంటే యోహాను గొప్పవాడు.
\s5
\v 27 చాలా కాలం క్రితం ప్రవక్తలు అతని గురించి-
\q1 "చూడు, నీకు ముందుగా నేను నా దూతను పంపుతున్నాను.
\q1 నీ రాక కోసం ప్రజలను అతడు సిద్ధం చేస్తాడు" అని రాశారు.
\p
\v 28 "ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళలో యోహాను కంటే గొప్పవాడు లేదు. అయినప్పటికీ దేవునితో జీవిస్తూ, ఆయనతోనే ఉండే అల్పుడు సైతం యోహాను కంటే గొప్పవాడు" అన్నాడు.
\s5
\p
\v 29 యోహాను చేత బాప్తిసం పొందిన వాళ్ళందరూ పన్ను వసూలు చేసేవాళ్ళతో సహా, యేసు చెప్పింది విన్నారు. బాప్తిసం పొందడం ద్వారా దేవుడు న్యాయ వంతుడని వాళ్ళు అంగీకరించారు.
\v 30 కాని పరిసయ్యులు, ధర్మశాస్త్ర పండితులు యోహాను చేత బాప్తిసం పొందలేదు. తమ విషయంలో దేవుని చిత్తాన్ని తిరస్కరించారు.
\s5
\p
\v 31 యేసు ఇంకా మాట్లాడుతూ "ఈ కాలం మనుషులు ఎలా ఉన్నారో చెప్పమంటారా, చూడండి.
\v 32 వాళ్ళు మైదానంలో ఆడుకొనే చిన్న పిల్లల్లా ఉన్నారు. ఒకరినొకరు పిలుచుకుంటూ, "మేము వేణువు ఊది సంగీతం వినిపించాం, మీరు నాట్యం చెయ్యలేదు. ఏడుపు పాట పాడాము, మీరేమీ ఏడవలేదు" అంటున్నారు.
\s5
\v 33 అలానే యోహాను మీ దగ్గరికి వచ్చాడు. అతడు అందరూ తినేవి తినలేదు, ద్రాక్షరసం తాగలేదు. మీరు అతణ్ణి తిరస్కరించి "దయ్యం పట్టినవాడు" అన్నారు.
\v 34 మనుష్య కుమారుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇతరులు తినే మామూలు ఆహారం తిన్నాడు, ద్రాక్షరసం తాగాడు. మీరు ఆయన్ని కూడా తిరస్కరించి, "చూడండి, ఇతడు తిండిపోతు, తాగుబోతు. పన్ను వసూలుదార్లతో, పాపులతో కలిసిమెలిసి ఉంటాడు" అంటున్నారు.
\v 35 అయితే దేవుని నిజమైన పిల్లలు మాత్రం యోహాను, నేను చేసేవి జ్ఞానపూరిత విషయాలని గ్రహిస్తారు."
\s5
\p
\v 36 ఒకరోజు సీమోను అనే పరిసయ్యుడు యేసును భోజనానికి పిలిచాడు. యేసు అతని ఇంటికి భోజనానికి వెళ్ళాడు.
\v 37 అదే ఊళ్ళో అందరికీ తెలిసిన వేశ్య ఒకామె ఉంది. పరిసయ్యుడి ఇంటికి యేసు భోజనానికి వస్తాడని తెలిసి, ఆమె పాలరాతి బుడ్డిలో అత్తరు తీసుకొని అక్కడికి వెళ్ళింది.
\p
\v 38 యేసు భోజనం చెయ్యబోతుండగా ఆమె యేసు పాదాల దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె కన్నీళ్లు జలజలా యేసు పాదాలపై పడ్డాయి. ఆమె తన జుట్టుతో యేసు పాదాలు తుడుస్తూనే ఉంది. యేసు పాదాలు ముద్దు పెట్టుకుంటూ తాను తెచ్చిన అత్తరు ఆయన పాదాలపై ఒలకబోసింది.
\s5
\p
\v 39 యేసును ఆహ్వానించిన పరిసయ్యుడు ఆమె చేసింది చూసి, "ఈయన నిజంగా ప్రవక్త అయితే తనను ముట్టుకున్న ఈ కులట ఎవరో, ఎలాంటిదో తెలుస్తుంది గదా" అనుకున్నాడు.
\p
\v 40 యేసు అతనితో, "సీమోనూ! నేను నీకు చెప్పాల్సింది ఒకటుంది" అన్నాడు. అతడు, "బోధకా ఏమిటది?" అని అడిగాడు.
\s5
\v 41 యేసు అతనికి ఒక కథ చెప్తూ, "వడ్డీ వ్యాపారి దగ్గర ఇద్దరు అప్పు తీసుకున్నారు. వాళ్ళల్లో ఒకడు ఐదొందలు వెండి నాణాలు, ఇంకొకడు యాభై వెండి నాణాలు బాకీ ఉన్నారు.
\v 42 అప్పు తీర్చడం వాళ్ళవల్ల కాలేదు. కాబట్టి ఆ వ్యక్తి ఆ ఇద్దరికీ రుణ మాఫీ చేశాడు. కాబట్టి వాళ్ళల్లో ఎవరికి అతడంటే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది?" అని అడిగాడు.
\v 43 సీమోను "ఎక్కువ డబ్బు అప్పు తీసుకున్న వాడే అనుకుంటా" అన్నాడు. అప్పుడు యేసు, "నువ్వు సరిగ్గా చెప్పావు" అని,
\s5
\p
\v 44 ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, "ఈమె ఏమి చేసిందో ఒకసారి ఆలోచించు. నేను నీ ఇంట్లో అడుగు పెట్టగానే సాధారణంగా అతిధులను ఆహ్వానించే వాళ్ళు ఏమి చేస్తారో అది నువ్వు చేయలేదు. కాళ్ళకు నీళ్ళియ్యలేదు. కాని, ఈమె తన కన్నీళ్ళతో నా పాదాలు కడిగింది, తన జుట్టుతో తుడిచింది.
\v 45 నువ్వు నన్ను ముద్దు పెట్టుకొని ఆహ్వానించలేదు. కానీ ఈమె నేను వచ్చినప్పటి నుండి నా పాదాలు ముద్దు పెట్టుకోవడం ఆపలేదు.
\s5
\v 46 నువ్వు నా తలకు ఒలీవ నూనె రాయలేదు. కాని ఈమె నా పాదాలకు అత్తరు పూసింది.
\v 47 కాబట్టి నేను చెబుతున్నాను చూడు. ఆమె చేసిన చాలా ఎక్కువ పాపాలకు క్షమాపణ కలిగింది. అందుకే ఆమె ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నది. కాని తాను తక్కువ పాపాలు చేశాననీ వాటికి క్షమాపణ వచ్చిందనీ భావించే వాడు నన్ను తక్కువగానే ప్రేమిస్తాడు."
\s5
\v 48 తరువాత ఆయన ఆమెతో, "నీ పాపాలకు క్షమాపణ దొరికింది" అని చెప్పాడు.
\p
\v 49 ఆయనతో భోజనానికి కూర్చున్న వాళ్ళు తమలో తాము, "పాపాలు క్షమించడానికి ఇతనెవరు?" అనుకున్నారు.
\v 50 కాని యేసు ఆ స్త్రీతో, "నువ్వు నాపై విశ్వాసముంచడం వలన దేవుడు నిన్ను రక్షించాడు. ఇక వెళ్ళు. దేవుడు నీకు శాంతిని ప్రసాదిస్తాడు" అన్నాడు.
\s5
\c 8
\p
\v 1 ఆ తరువాత ఆయన పన్నెండు మంది శిష్యులతో కలిసి వివిధ పట్టణాలకు, గ్రామాలకు తిరిగాడు.
\v 2 ఆయన స్వస్థపరచిన, దురాత్మల బారి నుండి విడిపించిన చాలా మంది ఆడవాళ్లు ఆయనతో ప్రయాణం చేశారు. వీళ్ళల్లో మగ్దల గ్రామంలో ఏడు దయ్యాల నుండి విడుదల పొందిన మరియ,
\v 3 హేరోదు రాజు అంతిప దగ్గర నిర్వాహకుడుగా పనిచేసే కూజా అనే అతని భార్య యోహన్నా, సూసన్నా, ఇంకా కొందరు ఉన్నారు. వాళ్ళు యేసుకూ ఆయన శిష్యులకూ సహకారంగా ఉంటూ తమ సొంత డబ్బుతో వారి అవసరాలు చూసుకునే వాళ్ళు. కొన్ని నిధులు అందించేవాళ్ళు.
\s5
\p
\v 4 యేసును చూడడానికి చాలా పల్లెల నుండి వచ్చిన వాళ్ళు ఒక రోజు పెద్ద జన సమూహంగా సమకూడారు. అప్పుడు ఆయన వాళ్లకు ఈ కథ చెప్పాడు.
\v 5 "ఒక మనిషి విత్తనాలు చల్లడానికి తన పొలానికి వెళ్ళాడు. అతడు చల్లుతుండగా కొన్ని మనుషులు నడిచే దారిలో పడ్డాయి. అప్పుడు వాటిలో కొన్నిటిని మనుషులు తొక్కేస్తే, కొన్నిటిని పక్షులు తినేశాయి.
\v 6 కొన్ని విత్తనాలు మట్టి తక్కువ ఉన్న రాతి నేల మీద పడ్డాయి. ఆ విత్తనాలు మొలకెత్తగానే ఆ నేలలో తేమ లేక ఆ మొక్కలు ఎండిపోయాయి.
\s5
\v 7 కొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కలు ఉన్న నేలపై పడ్డాయి. చల్లిన విత్తనాలతోబాటు ఆ ముళ్ళ మొక్కలు కలసి పెరిగి వాటిని అణచి వేయడంతో అవి పెరగలేదు."
\p
\v 8 కాని చల్లిన కొన్ని విత్తనాలు సారవంతమైన నేల మీద పడి చక్కగా పెరిగి, నూరంతల పంట పండాయి. ఈ విషయాలు చెప్పాక, యేసు వాళ్ళందరితో, "మీలో ప్రతి ఒక్కరూ నేను చెప్పినది జాగ్రత్తగా ఆలోచించాలి" అన్నాడు.
\s5
\v 9 అప్పుడు యేసు శిష్యులు ఆ కథ భావం చెప్పమని అడిగారు.
\p
\v 10 అందుకు ఆయన, "దేవుడు రాజుగా ఎలా ఏలుతాడో తెలుసుకునే భాగ్యం మీకు దొరికింది. కాని నేను అందరితో ఉపమాన పద్ధతిలోనే మాట్లాడతాను కాబట్టి"
\q "వాళ్ళు చూసినా గానీ నిజంగా చూడలేరు.
\q విన్నా గానీ వాళ్ళకి అర్థం కాదు."
\s5
\p
\v 11 ఈ కథ అర్థం ఏమిటంటే, విత్తనాలు దేవుని వాక్యానికి సూచన.
\v 12 దేవుని వాక్యం మనుషులు వింటారు గానీ సాతాను వచ్చి వాళ్ళ హృదయాల్లో నుంచీ, వాళ్ళ మనస్సుల్లో నుంచీ దేవుని వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఫలితంగా వాళ్ళు వాక్యాన్ని నమ్మరు, రక్షణ పొందరు. దారిలో పడిన విత్తనాలు తెలిపే సంగతి ఇదే.
\v 13 కొందరు దేవుని వాక్యాన్ని సంతోషంగా విని అంగీకరిస్తారు గానీ వాళ్ళకి లోతైన వేర్లు ఉండవు. ఫలితంగా కొంత కాలం మాత్రమే నమ్ముతారు. కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని వాక్యాన్ని నమ్మడం మానేస్తారు. ఇది రాతి నేల మీద పడిన విత్తనాల విషయం.
\s5
\v 14 కొందరు దేవుని వాక్యం వింటారు గానీ వాళ్ళ జీవితంలో ధనవ్యామోహం ప్రాపంచిక చింతలకు సంబంధించిన కలతలు దేవుని వాక్యాన్ని వాళ్ళలో నిలవనివ్వవు. ఫలితంగా వాళ్ళు ఆత్మీయంగా ఎదగ లేరు. ఇది ముళ్ళ మొక్కల మధ్య ఎదిగిన విత్తనాలకు సూచన.
\p
\v 15 దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దాన్ని ఘనమైనదిగా ఎంచి సరైన హృదయంతో అంగీకరించి, దేవుని వాక్యానికి లోబడి నిలకడైన నమ్మకం కలిగిన మనుషులు మంచి ఆత్మ ఫలాన్ని అందిస్తారు. ఇది సారవంతమైన నేలపై పడిన విత్తనాల్ని సూచిస్తుంది.
\s5
\p
\v 16 ఎవరూ దీపం వెలిగించి బుట్టతో కప్పిపెట్టరు. మంచం కింద పెట్టరు. ఇంట్లోకి వచ్చేవాళ్ళకి వెలుగిచ్చేలా దీపస్థంభం మీద ఉంచుతారు.
\v 17 దీన్ని బట్టి ఒకానొక రోజు దాచిపెట్టిన ప్రతిదీ బయటపడుతుంది. రహస్యంగా ఉంచిన ప్రతిదీ బట్టబయలు అవుతుంది.
\v 18 కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా, స్పష్టంగా వినాలి. తన సత్యాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి దేవుడు ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాడు. కాని ఎవరైతే వాళ్ళకి అర్ధమైన కొద్ది విషయాన్ని నమ్మలేకపోతారో ఉన్నది కూడా వాళ్ళ దగ్గర నుండి దేవుడు తీసేస్తాడు.
\s5
\p
\v 19 ఒకరోజు యేసు తల్లీ సోదరులూ ఆయనను చూడాలని వచ్చారు. కానీ జనం గుంపుగా ఉండడం వల్ల ఆయన దగ్గరకు కూడా వెళ్ళలేకపోయారు.
\v 20 అప్పుడు, "నిన్ను చూడాలని మీ అమ్మా తమ్ముళ్ళూ వచ్చారు" అని ఎవరో ఆయనతో చెప్పారు.
\v 21 అందుకు యేసు, "దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం చేసే వారే నా తల్లీ, నా సోదరులూనూ" అన్నాడు.
\s5
\p
\v 22 మరొక రోజు యేసు తన శిష్యులతో "సరస్సు అవతల తీరానికి వెళ్దాం పదండి" అని చెప్పాడు. వారంతా ఒక పడవ ఎక్కారు.
\v 23 పడవలో వెళ్తుండగా, యేసు నిద్రపోయాడు. ఉన్నట్టుండి సరస్సులో భయంకరమైన గాలివాన మొదలై, పడవలోకి నీళ్ళు వచ్చేసి, చాలా ప్రమాదకరంగా మారింది.
\s5
\v 24 యేసు శిష్యులు ఆయన్ని లేపారు. వాళ్ళు ఆయనతో, "అయ్యా, అయ్యా, మేము చచ్చి పోతున్నాం" అన్నారు. అప్పుడు ఆయన లేచి గాలినీ ఉవ్వెత్తున లేచే అలలను ఆగమని ఆజ్ఞాపించాడు. అవి అణిగిపోయాయి. అంతా నెమ్మది అయ్యింది.
\v 25 అప్పుడు ఆయన వాళ్ళతో, "మీ విశ్వాసం ఇంత బలహీనంగా ఉందేమిటి?" అన్నాడు. అక్కడ జరిగినది చూసిన శిష్యులకు భయం, ఆశ్చర్యం కలిగాయి. వాళ్ళు ఒకరితో ఒకరు, "గాలినీ, నీళ్ళనూ కూడా ఆజ్ఞాపించే ఈయనెవరో గదా" అనుకున్నారు.
\s5
\p
\v 26 యేసు, ఆయన శిష్యులు పడవ ప్రయాణం కొనసాగించి, గలిలయ జిల్లా నుండి సరస్సుకు అవతలి వైపు ఉన్న గెరాసేను ప్రజలు నివసించే ప్రాంతానికి వచ్చారు.
\v 27 అప్పుడు యేసు పడవ దిగగానే ఆ ప్రాంతపు మనిషి ఒకడు ఆయనకు ఎదురయ్యాడు. ఆ మనిషికి దయ్యాలు పట్టాయి. చాలా కాలం నుండి అతడు బట్టలు వేసుకోలేదు. ఇంట్లో ఉండడం లేదు. సమాధులే అతని నివాసం.
\s5
\v 28 అతడు యేసును చూసి గట్టిగా కేకలు పెట్టాడు. ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశాడు. "మహోన్నతుడైన దైవ కుమారా యేసూ, నా జోలి నీకెందుకు? దయచేసి నన్ను హింస పెట్టొద్దు" అన్నాడు.
\p
\v 29 యేసు అతనిలోని దురాత్మను బయటికి రమ్మని ఆజ్ఞాపించినందు వల్ల అతడు అలా అన్నాడు. ఆ మనిషి చేతులకీ కాళ్ళకీ గొలుసులు వేసి కాపలా కాస్తున్నప్పటికీ చాలా సార్లు హటాత్తుగా దురాత్మ అతణ్ణి బలంగా పట్టి ఆ మనిషి గొలుసులు తెంచుకొనేవాడు. దయ్యాలు అతన్ని ఎడారి ప్రాంతాల్లోకి తీసుకెళ్ళిపోయేవి.
\s5
\p
\v 30 అప్పుడు యేసు అతన్ని, "నీ పేరేంటి?" అని అడిగాడు. అతడు "నా పేరు సైన్యం" అన్నాడు. ఎందుకంటే అతనిలో చాలా దయ్యాలు ఉన్నాయి.
\v 31 దేవుడు శిక్షించే అఖాతంలోకి తమను పంపొద్దని ఆ దయ్యాలు యేసును బతిమాలాయి.
\s5
\v 32 ఆ దగ్గరలో కొండ వాలులో పందుల మంద మేస్తున్నది. ఆ పందుల్లో దూరడానికి దయ్యాలు తమకు అనుమతి ఇమ్మని బతిమాలాయి. ఆయన అనుమతించాడు.
\v 33 ఆ భూతాలు ఆ మనిషిని వదిలి పందుల్లో దూరాయి. దాంతో ఆ పందులు గుట్టపై నుండి సరస్సు వాలులోకి వడిగా పరిగెత్తి సరస్సులో పడి ఊపిరాడక చచ్చాయి.
\s5
\p
\v 34 పందులు కాసేవాళ్ళు జరిగింది చూసి పారిపోయారు. ఊర్లోకి వెళ్ళి తాము చూసినదంతా ఊరివాళ్ళకి చెప్పారు.
\v 35 అప్పుడు ఊరి జనం జరిగింది చూడడానికి వచ్చారు. వాళ్ళు యేసు దగ్గరికి వచ్చినప్పుడు దయ్యాలు వదిలిన వాడు బట్టలు వేసుకొని, యేసు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పేది వింటూ ఉండడం చూసారు. అతడు చక్కగా మతిస్థిమితంగా ఉన్నాడు. ఊరి వాళ్ళకి భయమేసింది.
\s5
\v 36 అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళకి దయ్యాలు పట్టిన ఆ మనిషిని యేసు ఎలా స్వస్థపరిచాడో, ఏమి జరిగిందో చూసిన మనుషులు వివరించారు.
\p
\v 37 అప్పుడు గెరాసేను చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు భయపడి, యేసును అక్కడినుంచి వెళ్ళిపొమ్మని అన్నారు. యేసు, ఆయన శిష్యులు సరస్సు దాటి పోవడానికి పడవ ఎక్కారు.
\s5
\v 38 వాళ్ళు వెళ్ళే ముందు దయ్యాలు వదిలిన ఆ మనిషి "దయచేసి, నీతో నన్ను రానివ్వు" అని బతిమాలాడు. కాని యేసు,
\v 39 "లేదు, మీ ఇంటికి వెళ్ళి, నీకు దేవుడు చేసినవి ప్రజలందరికీ చెప్పు" అన్నాడు. ఆ మనిషి వెళ్ళి, ఆ ఊరంతా యేసు తనకు ఏమి చేసాడో చెప్పాడు.
\s5
\p
\v 40 తరవాత యేసు, ఆయన శిష్యులు సరస్సు దాటి కపెర్నహోం తిరిగి వెళ్ళారు. అక్కడ జన సమూహం ఆయన కోసం కనిపెడుతూ ఆయనను ఆహ్వానించారు.
\v 41 సమాజమందిరం నాయకుల్లో యాయీరు అనే పేరు గల ఒకడు యేసు దగ్గరికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి,
\v 42 చావుబతుకుల మధ్య ఉన్న తన పన్నెండేళ్ళ ఒక్కగానొక్క కూతుర్ని బాగు చెయ్యడానికి తన ఇంటికి రమ్మని ఆయనను వేడుకున్నాడు. యేసు వెళుతుండగా చాలా మంది గుంపుగా ఆయన్ని చుట్టుముట్టారు.
\s5
\p
\v 43 ఆ గుంపులో పన్నెండేళ్ళ నుండి ఆగకుండా రక్తం స్రవించే రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. వైద్యం కోసం ఆమె తన డబ్బంతా ఖర్చు చేసింది. కాని ఎవ్వరూ ఆమెని స్వస్థపరచ లేకపోయారు.
\p
\v 44 ఆమె యేసు వెనకగా వెళ్ళి ఆయన అంగీ అంచు ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
\s5
\v 45 యేసు, "నన్నెవరు ముట్టుకున్నారు?" అని అడిగాడు. అందరూ ఆయన చుట్టూ ఉన్నా, వాళ్ళెవరూ తనను ముట్టుకోలేదని ఆయన ఉద్దేశం. పేతురు, "ప్రభూ నీ చుట్టూ జనం తొడతొక్కిడిగా నీ మీద పడుతున్నారు. వాళ్ళల్లో ఎవరైనా నిన్ను ముట్టుకొని ఉండొచ్చు అన్నాడు.
\v 46 కాని యేసు, "నాకు తెలుసు. కావాలని నన్ను ఎవరో ముట్టుకున్నారు. ఆ వ్యక్తిని స్వస్థపరచడానికి నాలోనుండి ప్రభావం బయటికి వెళ్ళింది" అన్నాడు.
\s5
\p
\v 47 ఆ స్త్రీ తానిక దాగలేనని గ్రహించి, వణుకుతూ ఆయన ఎదుటికి వచ్చి, పాదాలపై పడి అందరూ వింటూ ఉండగా తాను ఆయన్ని ఎందుకు ముట్టుకుందో చెప్పి, వెంటనే తాను బాగైన సంగతి చెప్పింది.
\v 48 యేసు ఆమెతో, "అమ్మా, నేను నిన్ను బాగు చెయ్యగలనని నమ్మావు కాబట్టి బాగుపడ్డావు. నా దేవుని శాంతి నీకు ఎప్పుడూ ఉంటుంది. ఇక వెళ్ళు" అన్నాడు.
\s5
\p
\v 49 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే యాయీరు ఇంటి నుండి ఒక మనిషి వచ్చి యాయీరుతో, "మీ అమ్మాయి చనిపోయింది. కాబట్టి బోధకుణ్ణి ఇక బాధ పెట్టొద్దు" అన్నాడు.
\v 50 యేసు అది విని, "భయం లేదు. నమ్మకముంచు. ఆమె బ్రతుకుతుంది" అన్నాడు.
\s5
\v 51 ఆయన ఆ ఇంటికి చేరాక తనతో పేతురునూ, యోహానునూ, యాకోబునూ, చనిపోయిన అమ్మాయి తలిదండ్రులనూ తప్ప ఇంకెవ్వరినీ రానివ్వలేదు.
\v 52 అమ్మాయి చనిపోయిందని అక్కడి వారందరూ గట్టిగా శోకాలు పెడుతున్నారు. కాని యేసు, "ఏడవొద్దు. పాప చనిపోలేదు. నిద్రపోతోంది" అన్నాడు.
\v 53 ఆ అమ్మాయి చనిపోయిందని వాళ్ళకి తెలుసు గనక వాళ్ళు ఆయన్ని చూసి నవ్వారు.
\s5
\v 54 యేసు ఆమె చెయ్యి పట్టుకుని, "పాపా, లే" అన్నాడు.
\v 55 వెంటనే, ఆమె ఆత్మ ఆమెలోకి వచ్చి, ఆమె లేచింది. యేసు ఆమెకి తినడానికి ఏదైనా పెట్టమని చెప్పాడు.
\v 56 ఆమె తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. కాని జరిగిన సంగతి ఎవరితోనూ చెప్పొద్దని యేసు వాళ్ళతో చెప్పాడు.
\s5
\c 9
\p
\v 1 యేసు తన పన్నెండుమంది శిష్యులను పిలిచి, వాళ్ళకి అన్ని రకాల రోగాలు స్వస్థపరచడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి అధికారం, శక్తి ఇచ్చాడు.
\v 2 ఆయన వాళ్ళని స్వస్థ పరచడానికి, దేవుడు తనను రాజుగా ఎలా చూపించుకుంటాడో బోధించడానికి పంపాడు.
\s5
\p
\v 3 వాళ్ళు వెళ్ళే ముందు, "మీ ప్రయాణం కోసం ఏమీ తీసుకు వెళ్లొద్దు. చేతి కర్రగాని, సంచిగాని, డబ్బులు కాని, ఆహారం కాని, అదనంగా బట్టలు కూడా తీసుకు పోవద్దు.
\v 4 మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా ఆ ఇంట్లోనే ఉండండి.
\s5
\v 5 ఏ ఊరి వాళ్లైనా మిమ్మల్ని రానివ్వకపోతే మీరు అక్కడే ఉండనక్కర లేదు. ఆ ఊరు వదిలేటప్పుడు మీ పాదాల దుమ్ము దులిపేయండి. వాళ్ళు తిరస్కరించినందుకు వాళ్ళకది హెచ్చరిక."
\p
\v 6 అప్పుడు యేసు శిష్యులు బయలు దేరి చాలా గ్రామాలు పర్యటించారు. వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటా దేవుని సువార్త చెప్పి, రోగుల్ని స్వస్థపరిచారు.
\s5
\p
\v 7 గలిలయ జిల్లాను ఏలుతున్న హేరోదు జరుగుతున్న విషయాలన్నీ విన్నాడు. కొందరు బాప్తిసమిచ్చే యోహాను మళ్ళీ బ్రతికాడని చెప్పడంతో హేరోదు కంగారుపడ్డాడు.
\v 8 కొందరు ఏలీయా ప్రవక్త మళ్ళీ వచ్చాడని, ఇంకొందరు ఆయన చాలా కాలం క్రితం వచ్చిన ప్రవక్తలలో ఒకడని అనుకున్నారు.
\v 9 కాని హేరోదు, "అతడు యోహానై ఉండడు. అతని తల తీయించాము గదా! మరి నేను వింటున్న ఈ వ్యక్తి ఎవరు?" అనుకున్నాడు. యేసును చూసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
\s5
\p
\v 10 అపోస్తలులు తిరిగి వచ్చి వాళ్ళు చేసినవన్నీ యేసుకు చెప్పారు. అప్పుడు ఆయన వాళ్ళను వెంటబెట్టుకొని బేత్సయిదాకు ఏకాంతంగా వెళ్ళాడు.
\v 11 కాని యేసు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకున్న జనం ఆయన్ని వెంబడించారు. ఆయన వాళ్ళని ఆహ్వానించి, దేవుడు తనను రాజుగా ఎలా వెల్లడిచేసుకుంటాడో వాళ్ళతో మాట్లాడి, స్వస్థత అవసరమయ్యే వాళ్ళని స్వస్థపరిచాడు.
\s5
\p
\v 12 ఆ రోజు బాగా ఆలస్యమైపోయింది కాబట్టి పన్నెండుమంది శిష్యులు యేసు దగ్గరికి వచ్చి, "దయచేసి ఈ పెద్ద జనసమూహాన్ని పంపించేస్తే చుట్టుపక్కల ఉన్న పల్లెపట్టుల్లో తినడానికేమైనా చూసుకుని ఉండడానికి ఏర్పాటు వెదుక్కుంటారు. ఇది నిర్జన ప్రదేశం గదా అన్నారు.
\v 13 కాని ఆయన వాళ్ళతో, "మీరే వాళ్ళకి ఏమైనా పెట్టండి" అన్నాడు. వాళ్ళు, "మనకున్న దంతా ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు మాత్రమే. వీళ్ళందరికీ సరిపడే ఆహారం కొని తేవడం అసాధ్యం."
\v 14 అక్కడ దాదాపు ఐదు వేలమంది పురుషులు ఉన్నారు మరి. అప్పుడు యేసు శిష్యులతో, "యాభై మంది చొప్పున గుంపులుగా అందరినీ కూర్చోమని చెప్పండి" అన్నాడు.
\s5
\v 15 శిష్యులు అలాగే చేశారు. ప్రజలు కూర్చున్నారు.
\v 16 అప్పుడు ఆయన ఐదు రొట్టెలు, రెండు చేపలు తీసుకున్నాడు. ఆకాశం వైపు చూసి వాటి కోసం దేవునికి కృతఙ్ఞతలు చెప్పాడు. తరువాత ముక్కలు చేసి వాటిని శిష్యులకిచ్చి పంచమన్నాడు.
\v 17 అందరూ తిన్నారు. అందరికీ సరిపడేంత అందింది. తరువాత శిష్యులు మిగిలిన రొట్టె ముక్కల్ని సేకరించారు. అవి పన్నెండు గంపలయ్యాయి.
\s5
\p
\v 18 ఒక రోజు యేసు ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన వాళ్ళతో, "ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు?" అని అడిగాడు.
\v 19 వాళ్ళు "కొందరు బాప్తిసమిచ్చే యోహానని, కొందరు ఏలీయా ప్రవక్త అని, మిగిలిన వాళ్ళు పూర్వకాలం ప్రవక్తలలో ఒకరు తిరిగి బ్రతికాడని అంటున్నారు" అన్నారు.
\s5
\v 20 ఆయన "మరి మీరేమనుకుంటున్నారు?" అని అడిగాడు. పేతురు "నువ్వు క్రీస్తువు. దేవుని దగ్గర నుండి వచ్చావు" అన్నాడు.
\v 21 అప్పుడు యేసు ఈ సంగతి ఎవరితోనూ చెప్పొద్దని వాళ్ళను గట్టిగా హెచ్చరించాడు.
\v 22 అప్పుడు ఆయన వాళ్ళతో, "మనుష్య కుమారుడినైన నేను చాలా హింసలు పొందవలసి ఉంది. పెద్దలు, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర బోధకులు నన్ను తిరస్కరించి ఆ తరువాత నన్ను చంపుతారు. తరువాత నేను మూడో రోజున తిరిగి బ్రతుకుతాను. ఇది తప్పక జరుగుతుంది" అన్నాడు.
\s5
\p
\v 23 ఆయన వాళ్ళకి యింకా "మీలో ఎవరైనా నా శిష్యులుగా నన్ను వెంబడించాలంటే మీ ఇష్టం వచ్చినట్టు ఉండడం కాదు. ప్రతి రోజూ హింస అనుభవించాలి. మీ ప్రాణాలివ్వాల్సి ఉంటుంది కూడా.
\v 24 ఎవరైతే తమ ప్రాణాలు రక్షించు కోవాలనుకుంటారో వాళ్ళు నిత్య జీవం కోల్పోతారు. నా శిష్యులుగా ఉండడం కోసం తమ ప్రాణాలు ఫణంగా పెట్టేవాళ్ళు నిత్యం జీవిస్తారు.
\p
\v 25 ఈ లోకంలో అంతా సంపాదించుకొని తనను తాను పోగొట్టుకుంటే, అంటే తానే నాశనం అయిపోతే ఏమి లాభం?
\s5
\v 26 ఎవరైనా నా సందేశం తిరస్కరించి, నాకు చెందిన వాడినని అంగీకరించకపోతే నేను నా మహిమతో, తండ్రి మహిమతో, దేవ దూతలతో వచ్చినప్పుడు నేను కూడా అతణ్ణి అంగీకరించను.
\v 27 ఒక వాస్తవం చెప్తున్నాను, ఇక్కడ నిలబడి ఉన్నవాళ్ళు కొందరు దేవుడు తనను రాజుగా కనపరచుకునేంత వరకు బ్రతికే ఉంటారు."
\s5
\p
\v 28 యేసు ఆ మాటలు చెప్పిన ఎనిమిది రోజులకి ఆయన పేతురు, యాకోబు, యోహానులను వెంటపెట్టుకుని ప్రార్థన చేసుకోవడానికి కొండ పైకి వెళ్ళాడు.
\v 29 ఆయన ప్రార్థన చేసుకుంటూండగా ఆయన ముఖం మారిపోయింది. ఆయన బట్టలు ధగధగా కళ్ళు మిరుమిట్లుగొలిపేలా మెరిసిపోయాయి.
\s5
\v 30 అకస్మాత్తుగా, పూర్వకాలపు ప్రవక్తలు ఇద్దరు కనిపించి యేసుతో మాట్లాడారు. వాళ్ళు మోషే, ఏలీయా.
\v 31 వాళ్ళు గొప్పతేజస్సుతో కనిపించి, యెరూషలేములో నేరవేరబోయే ఆయన మరణం గురించి యేసుతో ముచ్చటిస్తున్నారు.
\s5
\v 32 పేతురు, తక్కిన శిష్యులు నిద్రమత్తులో ఉన్నారు. మెలకువ వచ్చాక వాళ్ళు యేసు తేజాన్ని చూసారు. ఆయనతో ఉన్న ఇద్దరు వ్యక్తులను కూడా చూసారు.
\p
\v 33 మోషే ఏలీయాలు యేసుని విడిచి వెళ్తుండగా, పేతురు యేసుతో, "స్వామీ, మనం ఇక్కడ ఉండడం మంచిది. నీకు, మోషేకు, ఏలీయాకు మూడు ఆశ్రమాలు కడదాం" అన్నాడు. అసలు తానేమి అంటున్నాడో తనకే తెలియదు.
\s5
\p
\v 34 ఇలా మాట్లాడుతుండగానే ఒక మేఘం వాళ్ళని కమ్ముకుంది. శిష్యులు అది చూసి భయపడ్డారు.
\v 35 మేఘంలో నుండి దేవుని దివ్యవాణి వినిపించింది. "ఈయన నేను ఎన్నుకున్న నా కుమారుడు, ఈయన మాట వినండి."
\v 36 ఆ స్వరం వినిపించిన తరువాత ఆ ముగ్గురు శిష్యులు చూస్తే యేసు మాత్రమే ఉన్నాడు. చాలాకాలం పాటు వాళ్ళు చూసింది ఎవరికీ చెప్పలేదు.
\s5
\p
\v 37 ఆ తరువాతి రోజు వాళ్ళు కొండ దిగి రాగా పెద్ద గుంపు యేసుని కలుసుకుంది.
\v 38 హటాత్తుగా ఆ గుంపులో ఒకడు, "నా కొడుకుని ఆదుకోవా. నిన్ను ప్రాధేయ పడుతున్నాను.
\v 39 ఉన్నట్టుండి ఒక దయ్యం వాణ్ణి పట్టుకుంటుంది. వెంటనే వాడు భయంకరంగా అరుస్తాడు. అది వాణ్ణి విలవిల్లాడిస్తూ, నోటివెంట నురగలు కక్కేలా చేస్తుంది. వాణ్ణి పట్టి పీడిస్తుంది. వదిలే ముందు వాణ్ణి చాలా గాయపరుస్తుంది.
\v 40 దాన్ని వెళ్ళగొట్టమని నీ శిష్యులను అడిగాను గానీ వాళ్ళు చేయలేకపోయారు" అని చెప్పాడు.
\s5
\p
\v 41 అప్పుడు యేసు, "విశ్వాసం లేనిఈ తరం వాళ్ళ ఆలోచనలన్నీ భ్రష్టమైపోయాయి. మీకు విశ్వాసం అలవడాలంటే నేనెంత కాలం మీతో ఉండాలి?" అని శిష్యులతో అన్నాడు. "నీ కొడుకుని ఇటు తీసుకురా" అని ఆ తండ్రితో చెప్పాడు.
\v 42 వాళ్ళు ఆ పిల్లవాణ్ణి తీసుకొస్తుండగా, దయ్యం వాణ్ణి కింద పడేసి భయంకరగా అల్లాడించింది. కాని యేసు ఆ దయ్యాన్ని గదిమాడు. ఆ పిల్లవాణ్ణి బాగుచేసి, ఆ తండ్రికి అప్పగించాడు.
\s5
\v 43 దేవుని ప్రభావానికి అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యచకితులౌతూ ఉంటే యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు.
\p
\v 44 "నేను చెప్పేది జాగ్రతగా వినండి. మనుష్య కుమారుడనైన నేను త్వరలో శత్రువుల చేతికి చిక్కబోతున్నాను."
\v 45 కాని శిష్యులు ఈ మాటలు అర్థం చేసుకోలేదు. దేవుడే వాళ్ళకి అర్థం కాకుండా చేసాడు. అందుకనే వాళ్ళు తెలుసుకోలేక పోయారు. ఆ మాట ఆయనను అడిగేందుకు భయపడ్డారు.
\s5
\p
\v 46 తరువాత తమలో ఎవరు గొప్పవాడు అనే వాదం శిష్యుల్లో వచ్చింది.
\v 47 యేసు వాళ్ళ ఆలోచన తెలుసుకుని, ఒక చిన్న బిడ్డను తెచ్చి తన దగ్గర నిలబెట్టుకున్నాడు.
\v 48 ఆయన వాళ్ళతో, "ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరు స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరించినట్టే. నన్ను స్వీకరిస్తే నన్ను పంపిన దేవుడిని స్వీకరించినట్టే. మీలో ఎవరు అందరికంటే చిన్నవాడిగా ఉంటారో వాడే గొప్పవాడు."
\s5
\p
\v 49 ఒకసారి యోహాను యేసుతో, "ప్రభూ, ఎవరో నీ పేరట దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. వాడు మనవాడు కాదు. అందుకని అతన్ని మేము అడ్డుకున్నాం" అన్నాడు.
\v 50 అందుకు యేసు, "మీరు అతణ్ణి అడ్డుకోకండి. అతని వలన మీకు హాని లేనప్పుడు, అతడు మీకు సహాయం చేస్తున్నట్టే."
\s5
\p
\v 51 దేవుడు తనను తిరిగి పరలోకానికి తీసుకువెళ్ళే రోజు దగ్గర పడుతున్నదని యేసు గ్రహించి, యెరూషలేముకు వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
\v 52 ఆయన తనకంటే ముందుగా కొంతమంది దూతలను యెరూషలేముకు పంపాడు. వాళ్ళు ఆయన వెళ్ళడానికి అంతా సిద్దం చేయడానికి సమరియ అనే ప్రాంతానికి చేరుకున్నారు.
\v 53 ఆయన యెరూషలేముకు వెళ్తున్నాడని, సమరయులు యేసును వాళ్ళ గ్రామాల్లోకి రానివ్వలేదు.
\s5
\v 54 శిష్యులు యాకోబు, యోహానులు ఇది చూసి "ప్రభూ, ఆకాశం నుండి మంటలు కురిపించి వీళ్ళని నాశనం చేయమని దేవుడిని అడగమా" అని యేసుని అడిగారు.
\v 55 కాని యేసు వాళ్ళను కఠినంగా మందలించాడు.
\v 56 తరువాత వాళ్ళు మరో గ్రామానికి వెళ్లారు.
\s5
\p
\v 57 తరువాత యేసు ఆయన శిష్యులు దారిన వెళ్తున్నప్పుడు, ఒకడు వచ్చి "నువ్వెక్కడికి వెళ్ళినా నేను నీతోనే వస్తాను" అన్నాడు.
\v 58 అందుకు యేసు, నక్కలకు నేలలో రంధ్రాలు ఉన్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి. కాని, మనుష్యకుమారుడు పడుకోవడానికి కూడా తావు లేదు" అని అతనితో చెప్పాడు.
\s5
\v 59 ఆయన ఇంకో వ్యక్తితో, "నాతో రా" అన్నాడు. ఆ వ్యక్తి "స్వామీ, ముందు నేను వెళ్ళి నా తండ్రిని సమాధి చేసి రావచ్చా" అన్నాడు.
\v 60 అందుకు యేసు, "చచ్చిన వాళ్ళే చచ్చిన తమ వాళ్ళని పాతిపెట్టుకుంటారులే. నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని అందరికీ ప్రకటించు" అన్నాడు.
\s5
\v 61 మరొకడు వచ్చి, "ప్రభూ, నీ వెంటే వస్తాను గానీ మా ఇంట్లోని వాళ్ళని అడిగి వస్తాను" అన్నాడు.
\v 62 అందుకు యేసు, భూమి దున్నే వాడు నాగలిపై చేయి పెట్టి వెనక్కి తిరుగుతాడా? అలాటివాడు దేవుని రాజ్యానికి తగడు" అనిఅతనితో చెప్పాడు.
\s5
\c 10
\p
\v 1 ఆ తరువాత యేసు ప్రభువు ఇంకా డెబ్భై మందిని సువార్తకు పంపడానికి నియమించాడు. ఆయన ఉద్దేశం ప్రకారం నిర్ణయించిన ప్రతి ఊరికి ఇద్దరిద్దరిని పంపాడు.
\p
\v 2 వాళ్ళని పంపుతూ ఆయన "పంటకోత ఎక్కువ. పనివాళ్ళు తక్కువ. కాబట్టి పంట కోయడానికి పనివాళ్ళని పంపమని యజమానిని బతిమాలుకోండి."
\s5
\p
\v 3 "ఇక వెళ్ళండి. కానీ గుర్తుంచుకోండి. మిమ్మల్ని వద్దనుకోవాలనుకునే వాళ్ళ దగ్గరికే మిమ్మల్ని పంపుతున్నాను. మీరు తోడేళ్ళ మధ్య గొర్రెపిల్లల్లా ఉంటారు.
\v 4 వెళ్ళేటప్పుడు డబ్బు తీసుకెళ్ల వద్దు. ప్రయాణం సంచులు తీసుకెళ్ల వద్దు. ఇంకో చెప్పుల జత పెట్టుకోవద్దు. దారి మధ్యలో ఎవ్వరినీ కుశల ప్రశ్నలు వేయవద్దు."
\s5
\p
\v 5 "ఏ ఇంట్లోనైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటివాళ్ళతో ముందుగా "ఈ ఇంట్లోవాళ్ళకి దేవుడు శాంతినిచ్చు గాక" అని చెప్పండి.
\v 6 వాళ్ళు దేవుని శాంతి కావాలనుకుంటే మీ ద్వారా ఆ శాంతిని పొందుతారు. దేవుడిచ్చే శాంతి వాళ్ళు వద్దనుకుంటే మీరు ఇవ్వాలనుకున్న శాంతి మీరే అనుభవిస్తారు, వాళ్ళు కాదు."
\p
\v 7 "ఆ గ్రామం వదిలే వరకూ అదే ఇంట్లో ఉండండి. ఒక ఇంటింటికీ మార వద్దు. వాళ్ళు మీకు ఏది పెడితే అది తినండి, తాగండి. ఎందుకంటే పనిచేసే వాడికి జీతం రావాలి గదా.
\s5
\v 8 ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరి వాళ్ళు ఏది పెడితే అది తినండి.
\v 9 రోగులను స్వస్థపరచండి. త్వరలో దేవుడు రాజుగా ఏలుతాడని వాళ్ళకి చెప్పండి.
\s5
\v 10 మీరు ప్రవేశించిన ఊరి వాళ్ళు మిమ్మల్ని వెళ్ళిపొమ్మంటే ఆ ఊరి రచ్చబండ దగ్గరికి వెళ్ళి,
\v 11 "ఇదే మీకు హెచ్చరిక. మా కాళ్ళకు అంటిన దుమ్ము కూడా దులిపేసి వెళ్ళిపోతున్నాము. అయినా మీరు ఇది తెలుసుకోవాలి. దేవుడు తప్పకుండా అందరిపైనా రాజుగా ఏలుతాడు, అని చెప్పండి."
\p
\v 12 "నేను మీకు చెప్తున్నాను, తీర్పుదినం ఒకటి ఉంది. ఆ రోజు దేవుడు అందరికీ తీర్పు తీర్చే సమయంలో ఆ ఊరి వాళ్ళు శిక్ష పొందుతారు. పూర్వం సొదోమ పట్టణంలోని దుర్మార్గులు పొందిన శిక్ష కంటే అది ఘోరంగా ఉంటుంది."
\s5
\p
\v 13 "కొరాజీన్ పురమా, బెత్సయిదా పురమా, ఆ పట్టణాల ప్రజలారా, రాబోయే కాలంలో మీ గతి ఎంత భయంకరమో! మీరు పశ్చాతాప పడడానికి తిరస్కరించారు. మీ ఎదుట జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో జరిగి ఉంటే, వాళ్ళు ఎప్పుడో గోనెపట్ట కట్టుకొని, తలపై దుమ్మెత్తి పోసుకుని, కటిక నేలమీద కూర్చుని పాపాలు ఒప్పుకుని ఎప్పుడో మనస్సు మార్చుకునేవాళ్ళు."
\p
\v 14 "నేను అద్భుతాలు చేయటం చూసినా మీరు పశ్చాత్తాప పడలేదు. నన్ను నమ్మలేదు. కడపటి తీర్పు రోజున ప్రతి ఒక్కరికీ దేవుడు తీర్పు తీర్చేటప్పుడు తూరు, సీదోను పట్టణంలోని దుష్టుల కంటే కూడా మీకే ఘోరమైన శిక్ష పడుతుంది.
\v 15 కపెర్నహోం లో నివసించే ప్రజలకు ఒక మాట చెప్పాలి. పరలోకంలో మీకు సన్మానం చేస్తారనుకుంటున్నారా? అదేం కాదు, మిమ్మల్ని నిన్ను పాతాళానికి తొక్కెయ్యడం జరుగుతుంది."
\s5
\p
\v 16 యేసు ఇంకా మాట్లాడుతూ, "మీ మాట ఎవరు వింటే వాళ్ళు నా మాట విన్నట్టే. మీ మాటలు ఎవరు తిరస్కరిస్తే, వాళ్ళు నా మాటలు తిరస్కరించినట్టే. నన్ను ఎవరు కాదంటారో వాళ్ళు నన్ను పంపిన నా దేవుణ్ణి కాదన్నట్టే."
\s5
\p
\v 17 యేసు నియమించిన 72 మంది వెళ్ళి ఆయన చెప్పినట్టే చేశారు. వాళ్ళు చాలా ఆనందంగా తిరిగి వచ్చారు. వాళ్ళు "ప్రభూ, నువ్విచ్చిన అధికారంతో ఆజ్ఞాపించగానే దయ్యాలు కూడా మాకు లొంగి పారిపోయాయి" అన్నారు.
\p
\v 18 ఆయన జవాబిస్తూ, "మీరు ఈ పనిమీద వెళ్ళినప్పుడు సాతాను మెరుపులా ఆకాశం నుండి కింద పడడం చూశాను.
\v 19 వినండి, దయ్యాలను గద్దించడానికి నేను మీకు అధికారమిచ్చాను. అవి మిమ్మల్ని ఏమీ చేయవు. మన శత్రువైన సాతాను కంటే బలంగా ఉండే స్థితి నేను మీకు ఇచ్చాను. మీకు ఏదీ హాని చెయ్యనే చెయ్యదు.
\v 20 కాని దయ్యాలు లోబడుతున్నాయని సంతోషించే కంటే పరలోకంలో మీ పేర్లు రాసి ఉన్నందుకు సంతోషించండి."
\s5
\p
\v 21 అప్పుడు యేసు పరిశుద్దాత్మలో పరవశమై పోయాడు. ఆయన "తండ్రీ, భూమి ఆకాశాల ప్రభూ, కొందరు పండితులు తమకే అన్నీ తెలుసుననుకుంటారు. కాని వాళ్ళు ఈ విషయాలను తెలుసుకోనియ్యకుండా చేసినందుకు నీకు స్తోత్రం. దానికి బదులుగా నీ సత్యాన్ని చిన్న పిల్లల్లాగా ఒప్పుకునే వాళ్ళకి నువ్వు తెలియచేస్తున్నావు. ఔను తండ్రీ, అలా చేయడం నీకు ఇష్టం."
\s5
\p
\v 22 యేసు మళ్ళీ శిష్యులతో, "నా తండ్రి నాకు అన్నీఇచ్చాడు. నా తండ్రికి మాత్రమే తన కుమారుడినైన నేను ఎవరో తెలుసు. తండ్రి ఎవరో కుమారుడికి అంటే నాకు మాత్రమే, కేవలం నాకు మాత్రమే తెలుసు. నాకూ నేను ఎవరికి వెల్లడి చేసానో వారికీ మాత్రమే తండ్రి తెలుసు" అన్నాడు.
\s5
\p
\v 23 తరువాత ఆయన తన శిష్యులు ఒంటరిగా ఉన్నప్పుడు, "నేను చేసిన పనులు దేవుడు మిమ్మల్ని చూడనివ్వడం మీకు గొప్ప అదృష్టం.
\v 24 ఇది మీరు తెలుసుకోవాలి. మీరు చూస్తున్న ఈ కార్యాలు చూడాలని పూర్వం ప్రవక్తలూ రాజులూ ఆశించారు, కాని చూడలేకపోయారు. ఎందుకంటే అప్పుడు ఈ సంఘటనలు జరగలేదు. నేను చెప్పగా మీరు వినిన సంగతులు తామూ వినాలని తహతహలాడారు. అయితే ఆ కాలంలో నేను ఈ విషయాలు బయట పెట్టలేదు" అన్నాడు.
\s5
\p
\v 25 ఒక రోజు యేసు ప్రజలకు బోధిస్తుండగా, యూదీయ ధర్మశాస్త్ర బోధకుడు అక్కడ ఉన్నాడు. అతడు కష్టమైన కొన్ని ప్రశ్నలు యేసును అడిగి పరీక్షించాలని అనుకున్నాడు. కాబట్టి అతడు లేచి నిలబడి, "ఉపదేశకా, దేవునితో నిత్యం జీవించాలంటే ఏమి చెయ్యాలి?" అని అడిగాడు.
\v 26 అందుకు యేసు అతనితో," దేవుడిచ్చిన మోషే ధర్మశాస్త్రం నువ్వు చదివావు కదా. ఆజ్ఞలు ఏమి చెప్తున్నాయి?" అని అడిగాడు.
\v 27 అతడు,
\q1 "నీ పరిపూర్ణ హృదయంతో, నీ పరిపూర్ణ శక్తితో, నీ పరిపూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి.
\q1 నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో నీ సాటి మనిషిని అలా ప్రేమించాలి" అన్నాడు.
\p
\v 28 యేసు "నువ్వు సరిగ్గానే చెప్పావు. అదంతా చెయ్యి. దేవునితో నిత్యం జీవిస్తావు," అన్నాడు.
\s5
\p
\v 29 కాని ఇతరుల విషయంలో తాను మంచిగానే ఉంటున్నాను అని చూపించుకోవాలని అతడు "నేను ప్రేమించాల్సిన నా సాటి మనిషి అంటే ఎవరు?" అని యేసును అడిగాడు.
\v 30 అందుకు యేసు "ఒక రోజు ఒక యూదుడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. దారిలో దోపిడి దొంగలు అతని మీద దాడి చేశారు. అతని బట్టలు, అతనివన్నీ దోచుకుని, అతన్ని కొట్టి, కొన ప్రాణంతో వదిలేసారు."
\s5
\p
\v 31 "ఆ దారిలో యూదుల అర్చకుడు ఒకడు వెళ్తూ, ఆ వ్యక్తిని చూసి సహాయం చేయడానికి బదులు పక్కగా దాటి వెళ్ళిపోయాడు
\v 32 అలాగే దేవాలయంలో పనిచేసే లేవీయుడు అటుగా వచ్చి అతన్ని చూశాడు. కాని అతడు కూడా తప్పుకుని వెళ్ళిపోయాడు.
\s5
\v 33 తరువాత సమరయ ప్రాంతం వాడొకడు ఒకడు అటుగా వచ్చి ఆ వ్యక్తిని చూసి జాలిపడ్డాడు.
\v 34 అతణ్ణి సమీపించి గాయాలకు ఒలీవ నూనె ద్రాక్షరసం రాసి కట్టుకట్టాడు. తన గాడిద పై అతన్ని ఎక్కించుకుని సత్రానికి తీసుకెళ్ళి అతని బాగోగులు చూశాడు."
\p
\v 35 "తరువాత ఉదయం రెండు వెండి నాణాలు ఆ సత్ర యజమానికి ఇచ్చి, "ఇతనిని జాగ్రత్తగా చూసుకోండి. ఒక వేళ ఇంతకన్నా ఎక్కువ డబ్బు ఖర్చయితే నేను తిరిగి వచ్చినప్పుడు కట్టేస్తాను" అన్నాడు."
\s5
\p
\v 36 ఇదంతా చెప్పి యేసు "బందిపోట్లు అతనిపై దాడిచేసి, కొట్టి వెళ్ళిపోయాక ముగ్గురు మనుషులు అతణ్ణి చూసారు. ఆ ముగ్గురిలో అతణ్ణి ఎవరు అసలైన సాటి మనిషిగా చూశారు?" అని అడిగాడు.
\v 37 ధర్మశాస్త్ర బోధకుడు "అతని పట్ల జాలిపడ్డ వాడే" అన్నాడు. అప్పుడు యేసు అతనితో, "ఔను. సరిగ్గా చెప్పావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ సహాయం అవసరం అయిన వాళ్ళకు నువ్వు కూడా అలా చెయ్యి" అన్నాడు.
\s5
\p
\v 38 యేసు శిష్యులతో ప్రయాణం సాగిస్తూ యెరూషలేము దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాడు. మార్త అనే స్త్రీ తన ఇంట్లోకి వాళ్ళని ఆహ్వానించింది.
\v 39 ఆమె చెల్లెలు పేరు మరియ. ఆమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే బోధ వింటున్నది.
\s5
\v 40 కాని మార్త వంటలో మునిగిపోయింది. ఆమె గబగబా వెళ్ళి యేసుతో "ప్రభూ, వంట పనంతా మా చెల్లి నా మీద వదిలేసింది. నువ్వు పట్టించుకోవా? దయచేసి నాకు పనిలో సాయం చెయ్యమని దానితో చెప్పు" అంది.
\p
\v 41 కాని ప్రభువు, "మార్తా, మార్తా నువ్వు చాలా పనులు పెట్టుకుని హైరానా పడుతున్నావు.
\v 42 కాని నిజంగా అన్నిటికన్నా అవసరమైనది నా బోధ వినడమే. మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఆమె అలా చేసి పొందిన దీవెన ఆమె నుండి ఎవరూ తీసివేయలేరు" అన్నాడు.
\s5
\c 11
\p
\v 1 ఒక రోజు యేసు ఒక చోట ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయ్యాక ఆయన శిష్యుల్లో ఒకడు, "ప్రభూ, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు మేము కూడా ప్రార్థన చేసేటప్పుడు ఎలా చెయ్యాలో నేర్పించు" అని అడిగాడు.
\s5
\p
\v 2 ఆయన వాళ్ళకి "మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇలా చెప్పండి.
\q1 తండ్రీ, నీ పేరు అందరూ పవిత్రంగా గౌరవించాలి. త్వరలో నువ్వు అంతటా అందర్నీ పాలించాలి.
\s5
\q1
\v 3 ప్రతి రోజూ మాకు అవసరమయ్యే ఆహారం దయచెయ్యి.
\q1
\v 4 మా పట్ల ఇతరులు చేసిన తప్పులు మేము క్షమించినట్టు మేము చేసిన తప్పులు క్షమించు.
\q1 మేము శోధనలో పడినప్పుడు పాపం చేయకుండా సహాయం చెయ్యి."
\s5
\p
\v 5 తరువాత ఆయన వాళ్ళతో, "మీలో ఒకడు అర్ధరాత్రి మీ స్నేహితుని ఇంటికి వెళ్ళాడనుకో. బయట నిలబడి "మిత్రమా, మూడు రొట్టెలు బదులివ్వు.
\v 6 నా స్నేహితుడొకడు ప్రయాణం చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాడు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేవు" అని అడిగాడనుకో.
\v 7 అతడు లోపలే ఉండి, "నన్ను విసికించొద్దు. చిన్న పిల్లలు నాతో పడుకున్నారు. తలుపు వేసి ఉంది. నేను లేచి ఇవ్వలేను" అంటాడు.
\v 8 నువ్వు అతని స్నేహితుడివైనా అతనికి లేవడం ఇష్టం లేకపోవచ్చు. కాని నేను చెప్తున్నాను. నువ్వు అతన్ని వదలకుండా అడుగుతూ ఉంటే అతడు కచ్చితంగా లేచి నీకు కావలసింది ఇస్తాడు."
\s5
\p
\v 9 కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నీకు కావలసింది దేవుణ్ణిని అడుగుతూనే ఉండు. అప్పుడు అది మీకు ఇస్తాడు. ఆయన చిత్తాన్ని వెదకండి. ఆయన మీకు తెలియజేస్తాడు. తలుపు కొడుతున్నట్టు అత్యవసరంగా దేవునికి ప్రార్థన చేస్తూనే ఉండండి. మీరు అడిగింది పొందేలా దేవుడు దారి చూపిస్తాడు.
\p
\v 10 గుర్తుంచుకోండి! అడిగిన వాళ్ళు తాము అడిగినది పొందుతారు. వెతికిన వాళ్ళకి దొరుకుతుంది. తట్టిన వాళ్ళకు తలుపు తెరుచుకుంటుంది.
\s5
\p
\v 11 మీలో ఒకరికి కొడుకు ఉంటే వాడు తినడానికి చేప అడిగితే దానికి బదులు పామును ఇయ్యవు గదా.
\v 12 లేదా గుడ్డుకోసం అడిగితే దానికి బదులు తేలును ఇవ్వవు కదా
\v 13 మీరు పాపులైనా మీ పిల్లలకి మంచి వాటిని ఇవ్వాలనుకుంటారు కదా! మరి మీ పరలోకపు తండ్రిని మీరు పరిశుద్ధాత్మనిమ్మని అడిగితే తప్పకుండా ఇవ్వడా?
\s5
\p
\v 14 ఒక రోజు దయ్యం పట్టి మూగవాడై పోయిన వాడు యేసు దగ్గరికి వచ్చాడు. యేసు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టగానే అతడు మాట్లాడాడు. అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపోయారు.
\v 15 కాని కొంత మంది, "దయ్యాలరాజు బయల్జేబూలు యేసులో ఉండి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టగలిగేలా చేశాడు" అన్నారు.
\s5
\p
\v 16 కొందరు ఆయన దేవుని దగ్గర నుండి వచ్చాడని నిరుపించుకోడానికి ఒక అద్భుతం చేయమని అడిగారు.
\v 17 కాని వాళ్ళు ఏమి అనుకుంటున్నారో ఆయనకి తెలుసు. అందుకే ఆయన, "ఒకే రాజ్యంలో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు గొడవపడరు. అలా చేస్తే ఆ రాజ్యం నాశనమైపోతుంది. ఒకే ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకరికొకరు వ్యతిరేకమైతే ఆ కుటుంబం నాశనమైపోతుంది.
\s5
\v 18 అదేవిధంగా సాతాను, వాడి దయ్యాలు పోట్లాడుకుంటే వాళ్ళ పాలన ఎక్కువ కాలం నిలవదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను దయ్యాల అధిపతి శక్తితో దయ్యాలను వెళ్ళగొడుతున్నానన్నారు.
\v 19 ఇప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టడానికి నాకు సాతానే అధికారం ఇవ్వడం నిజమైతే, మీ శిష్యులు కూడా అదే సాతాను శక్తితో దయ్యాలను వెళ్ళగొడుతున్నారా ఏంటి? కానే కాదు. ఆ మాట సరికాదని వాళ్ళే నిర్ధారిస్తున్నారు.
\v 20 దయ్యాలను వెళ్ళగొట్టడం దేవుని శక్తితోనే అయితే దేవుడు తన పరిపాలన మొదలు పెట్టాడని నేను చూపిస్తున్నాను."
\s5
\p
\v 21 "ఒక బలవంతుని ఇంట్లో ఎవరూ ఏమీ దొంగిలించకుండా చాలా ఆయుధాలు, సంరక్షకులు ఉన్నారు.
\v 22 అంతకంటే బలవంతులు వచ్చి వాళ్ళపై దాడి చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకంటేనే కదా ఆ వ్యక్తి ఆ ఇంటి నుండి ఏదైనా దోచుకుని దానితో తన ఇష్టం వచ్చినట్టు చేయగలిగేది?
\v 23 నన్ను వైపు లేని వాడు నాకు విరోధే. వాడు నా దగ్గరికి మనుషులను రానివ్వడు. వాళ్ళను నానుండి వెళ్ళగొడతాడు."
\s5
\p
\v 24 ఇంకా యేసు మాట్లాడుతూ, "కొన్ని సార్లు దురాత్మ ఎవరినైనా వదిలి వెళ్ళి, అటు ఇటు తిరుగుతూ దానికి అనుకూలమైన స్థలం దొరకక తనలో తాను, "ఇంతకు ముందు నేను నివసించిన మనిషిలోనే వెళ్ళి ఉంటాను అనుకొని
\v 25 తిరిగి వెనక్కి వెళ్ళి, ఆ వ్యక్తి కడిగిన ఇంటిలా మరింత శుభ్రంగా ఉండి, ఇంకా ఖాళీగా ఉండడం చూస్తుంది.
\v 26 అప్పుడు ఈ దురాత్మ వెళ్ళి ఇంకా ఏడు చెడ్డ దయ్యాలను తెస్తుంది. అవన్నీ ఆ వ్యక్తిలోకి దూరి హాయిగా ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి పరిస్థితి ఇంతకు ముందు కంటే ఇంకా అధ్వాన్నంగా మారుతుంది.
\s5
\p
\v 27 యేసు ఇది చెప్పడం విన్న ఒక స్త్రీ బిగ్గరగా, "నిన్ను తొమ్మిది నెలలు మోసిన గర్భం, నీకు పాలిచ్చిన స్తనాలు - ఎంత ధన్యమో కదా!" అంది.
\v 28 ఆయన జవాబిస్తూ, "దేవుని సందేశం విని, దానికి లోబడినవాళ్ళు మరింత ధన్యులు" అన్నాడు.
\s5
\p
\v 29 యేసు చుట్టూ ఇంకా ఎక్కువ జనం చేరినప్పుడు ఆయన "ఈ కాలం వాళ్ళు చెడ్డవాళ్ళు. నేను దేవుని దగ్గర నుండి వచ్చానో లేదో రుజువు చెయ్యడానికి ఒక అద్భుతం చేయమంటున్నారు. కానీ యోనాకు ఏమి జరిగిందో అది ఒక్కటే వాళ్ళు నిర్ధారించుకోడానికి సూచన.
\v 30 పూర్వ కాలం నీనెవె ప్రజలకు సాక్ష్యంగా ఉన్న యోనా విషయంలో జరిగిన అద్భుతం లాగానే మనుష్యకుమారుని విషయంలో దేవుడు చేసే అద్భుతం మాత్రమే మీకు సాక్ష్యం."
\s5
\p
\v 31 "పూర్వం షెబా దేశం రాణి సొలోమోను జ్ఞానం గురించి విని, ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సొలోమోను కంటే గొప్పవాడైన నేను ఉన్నాను. కాని నేను చెప్పేది వీళ్ళు వినరు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఆ రాణి అక్కడ నిలబడి ఇప్పుడు ఉన్న ప్రజలపై నేరం మోపుతుంది."
\s5
\p
\v 32 "నీనెవెలో నివసించిన ప్రజలు యోనా బోధించినప్పుడు మనస్సు మార్చుకున్నారు. ఇప్పుడు యోనా కంటే గొప్పవాణ్ణి వచ్చి మీకు బోధిస్తున్నాను. కాని మీ పాపపు పద్ధతులు మార్చుకోవడం లేదు. దేవుడు ప్రజలందరికీ తీర్పు ఇచ్చేటప్పుడు నీనెవే ప్రజలు నిలబడి, ఇప్పుడు జీవిస్తున్న వాళ్ళ మీద నేరం మోపుతారు."
\s5
\p
\v 33 "దీపం వెలిగించి దాన్ని బుట్ట క్రింద కప్పెట్టరు. దీప స్థంభం మీద పెట్టినపుడు ఆ గది అంతా వెలుగు నిండిపోతుంది.
\v 34 నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా ఆరోగ్యంగా ఉంటుంది. అలా కాక నీ కన్ను మసకబారితే నీ దేహమంతా చీకటే.
\v 35 కాబట్టి మరిన్ని అద్భుతాలు చూడడం ముఖ్యం కాదు. నేను ఇప్పటికే చెప్పినది జాగ్రత్తగా నెమరు వేసుకోండి. అలా చేస్తే వేరే వాళ్ళు మీకు చెప్పేవి మీలో అత్మసంబంధమైన చీకటి నింపవు.
\v 36 నీ శరీరమంతా వెలుగుతో నిండి ఎక్కడా చీకటి ఉండదు. దీపకాంతిలో అన్నీ స్పష్టంగా కనిపించినట్టు నీ శరీరమంతా వెలుగుమయంగా ఉంటుంది."
\s5
\p
\v 37 యేసు ఇదంతా చెప్పిన తరువాత తనను భోజనానికి పిలిచిన పరిసయ్యుడి ఇంట్లో భోజనం బల్ల దగ్గర కూర్చున్నాడు.
\v 38 భోజనానికి ముందు యేసు చేతులు కడుక్కోకపోవడం ఆ పరిసయ్యుడు గమనించి ఆశ్చర్యపోయాడు.
\s5
\v 39 యేసు అతనితో, "మీ పరిసయ్యులు భోజనం తినేముందు బయట మాత్రమే శుభ్రం చేస్తారు. మీలోపల మాత్రం అసూయ, కుళ్ళు ఉంటాయి.
\v 40 తెలివితక్కువ మనుషులారా, బయటి దాన్ని చేసిన దేవుడు లోపలి భాగం కూడా చేయలేదా?"
\p
\v 41 "ఆచార బద్ధంగా గిన్నెలు శుభ్రం చెయ్యడం గురించి చాదస్తంగా ఉండడమేనా? పాత్ర లోపలి భాగం కూడా శుభ్రంగా ఉందో లేదో చూసుకోవద్దా? జాలి గుండెగలవారై మీ గిన్నె లో ఉన్నది అవసరంలో ఉన్నవాళ్ళకి ఇవ్వండి. అప్పుడు మీరు లోపలా బయటా కూడా బాగుంటారు."
\s5
\p
\v 42 "అయ్యో పరిసయ్యులారా, ఇదెంత ఘోరం! మీ తోటలో పెరిగే ఆకు కూరల్లో కూడా మీరు పదవ భాగం చెల్లిస్తారు. దేవుణ్ణి మాత్రం ప్రేమించరు. ఇతరుల పట్ల న్యాయంగా ప్రవర్తించరు. దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు. ఇతరుల పట్ల న్యాయంగా ఉండాలి."
\s5
\p
\v 43 "పరిసయ్యులారా ఇదెంత ఘోరం! సమాజమందిరాల్లో కూర్చోడానికి మీరు ఉన్నత స్థానం కోరుకుంటారు. వీధుల్లో ప్రజలు మిమ్మల్ని గౌరవించాలని, మీకు వందనాలు చెబుతూ ఉండాలని కోరుకుంటారు."
\p
\v 44 "ఇదెంత ఘోరం! మీరు కనిపించని సమాధుల్లా ఉన్నారు. అవి కనిపించక మనుషులు వాటిపై నడిచి మైల బడతారు" అన్నాడు.
\s5
\p
\v 45 వాళ్ళలో ఉన్న యూదీయ బోధకులలో ఒకడు, "బోధకా! ఇలా చెప్పి మమ్మల్ని విమర్శిస్తున్నావు కదా" అన్నాడు.
\p
\v 46 దానికి యేసు, "ధర్మశాస్త్రాన్ని బోధించే మీ స్థితి ఎంత ఘోరమో! మీరు మనుషులపై పెను భారాలు మోపుతారు. మీరు మాత్రం వాళ్ళ బరువులు మోయడానికి చిటికెన వేలైనా కదపరు.
\s5
\v 47 ప్రవక్తల సమాధులపై రమ్యమైన కట్టడాలు నిర్మిస్తారు. కానీ వాళ్ళని చంపింది మీ పూర్వికులే. మీకు ఎంత యాతన!"
\p
\v 48 మీరు ఈ సమాధులు కట్టడం ద్వారా ప్రవక్తలను చంపడంలో మీ పితరులు చేసింది ఆమోదిస్తూ ప్రకటిస్తున్నారు.
\s5
\v 49 కాబట్టి అత్యంత జ్ఞాని అయిన దేవుడు అంటున్నాడు. "నా ప్రవక్తలనూ, అపోస్తలులనూ మిమ్మల్ని నడిపించడానికి పంపుతాను. కాని మీరు వాళ్ళని హింసిస్తారు. కొందరిని చంపుతారు కూడా.
\v 50 దీని ఫలితంగా సృష్టి ఆరంభం నుండి దేవుని ప్రవక్తలను చంపిన వాళ్ళ నేరం ఇప్పటి ప్రజలైన మీపై పడుతుంది.
\v 51 ఈ ధోరణి అన్న చేతిలో హతమైన హేబెలు మొదలుకుని పరిశుద్ధ స్థలానికీ, బలిపీఠం ఉన్న చోటికీ మధ్యన వాళ్ళు చంపిన జెకర్యా ప్రవక్త వరకూ కొనసాగింది. ఆ ప్రవక్తల హత్యల నేరం ఈ కాలం వాళ్ళపై పడుతుంది."
\s5
\p
\v 52 "ధర్మ శాస్త్ర బోధకులకి ఎంత యాతన! మీ కారణంగా దేవుడు తమను పాలించడం అంటే ఏమిటో ప్రజలకి తెలియడం లేదు. మీరు దేవుణ్ణి మీపై ప్రభుత్వం చేయనివ్వరు. తమ జీవితాలపై దేవుని పరిపాలన ఇష్టపడే వాళ్ళకీ మీరు అడ్డుపడతారు."
\s5
\p
\v 53 యేసు ఈ విషయాలు చెప్పిన తరువాత అక్కడినుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులూ, పరిసయ్యులు కక్షగట్టి ఆయనకు వ్యతిరేకమయ్యారు. చాలా విషయాల గురించి ఆయనను పదే పదే ప్రశ్నించే వారు.
\v 54 ఆయనతో ఏదైనా పొరపాటు మాట పలికించి నింద మోపాలని కాచుక్కూర్చున్నారు.
\s5
\c 12
\p
\v 1 ఈలోగా ఇసకేస్తే రాలనంతమంది జనం యేసు చుట్టూ పోగయ్యారు. తొక్కిసలాట జరుగుతూ ఉంది. ఆయన శిష్యగణంతో "మీరూ పరిసయ్యుల్లాగా అయిపోతారేమో జాగ్రత్త సుమా! వాళ్ళు వీధిలో భక్తులూ, ఇంట్లో దుష్టులూనూ. కొద్దిగా ఈస్టు పదార్థం గోదుమ పిండి ముద్ద మొత్తాన్నీ పొంగేలా చేస్తుంది గదా. అలానే వాళ్ళ చెడునడత వేరే వాళ్ళని కూడా వాళ్ళలాగే చెడగొడుతుంది."
\s5
\p
\v 2 "ఎవరూ తమ పాపాలను కప్పిపుచ్చుకోలేరు. మనుషులు దాచిపెట్టాలని చూసే వాటన్నిటినీ ఒకానొక రోజు దేవుడు బట్టబయలు చేస్తాడు.
\v 3 మీరు చీకట్లో చెప్పుకునే మాటల్ని ఒక దినాన పట్టపగలు మనుషులంతా వింటారు. గదుల్లో గుసగుసలాడుకునే మాటలు రాబోయే రోజుల్లో కోడి ఇల్లెక్కి కూసినట్టే ఉంటాయి."
\s5
\p
\v 4 "మిత్రులారా, జాగ్రత్తగా వినండి. మనుషులకు భయపడొద్దు. వాళ్ళు మహా అయితే ఏం చేస్తారు? చంపుతారు అంతేగా, అంతకన్నా ఏం చేస్తారు?
\v 5 మీరు నిజంగా ఎవరికి భయపడాలో చెబుతా వినండి. దేవుడికి భయపడాలి, ఎందుకంటే ఆయన మనుషుల్ని చంపగలగడమే కాకుండా ఆపైన వాళ్ళని నరకకూపంలో కూడా పడెయ్యగలడు. అవును మరి, మనం భయపడాల్సింది ఆయనకే."
\s5
\p
\v 6 "పిచ్చుకలు చూడండి. వాటి విలువెంత? రెండు పైసలకు ఐదు పిచ్చుకలు వస్తాయి గదా? కానీ దేవుడు వాటిని ఒక్కొక్క దాన్నీ గుర్తు పెట్టుకుంటాడు.
\v 7 నీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకి తెలుసు. భయమెందుకు? ఎన్నో పిచ్చుకలకంటే మీరు దేవుడి దృష్టిలో ఎన్నో రెట్లు ఎక్కువ కాదా?"
\s5
\p
\v 8 "ఇంకోటి, "మేము యేసు శిష్యులం" అని చెప్పుకునే వాళ్ళ గురించి నేను కూడా దేవదూతలతో "వాళ్ళు నా శిష్యులు" అని చెబుతాను,
\v 9 కానీ "మేము ఆయన శిష్యులం కాదు" అని చెప్పే వాళ్ళ గురించి దేవదూతలతో నేను కూడా "వాళ్ళు నా శిష్యులు కాదు" అని చెబుతాను."
\p
\v 10 "మరో మాట, ఎవరైనా మానవ పుత్రుడు అయిన నా గురించి కాని మాటలు మాట్లాడితే దేవుడు దాన్ని క్షమిస్తాడు. కానీ ఎవరన్నా పరిశుద్ధాత్మ గురించి అవాకులూ చెవాకులూ పేలితే దేవుడు అలాటి వాళ్ళని ఎంత మాత్రం క్షమించడు."
\s5
\p
\v 11 "కాబట్టి మనుషులు మిమ్మల్ని న్యాయస్థానాల్లో మతనాయకుల ఎదుటా అధికారుల ఎదుటా విచారణ కోసం నిలబెడితే ఎలా జవాబివ్వాలో ఏమి చెప్పాలో అని కంగారు పడకండి.
\v 12 ఎందుకంటే సరిగ్గా ఆ సమయానికి ఏం చెప్పాలో పరిశుద్ధాత్మే మీకు చెప్తాడు."
\s5
\p
\v 13 ఆ గుంపులో ఉన్న ఒక శిష్యుడు యేసుతో, "గురువుగారూ, మా నాన్న ఆస్తిలో నా భాగం నాకిమ్మని మా అన్నతో చెప్పు" అన్నాడు.
\v 14 అతనితో యేసు, "మీ ఆస్తుల పంపకాల విషయాల్లో నాకు మధ్యవర్తి ఉద్యోగం ఎవరిచ్చారయ్యా?"అన్నాడు.
\v 15 జనంతో ఆయన "జాగ్రత్త, ఏ రకంగా కూడా పేరాశలో పడకుండా చూసుకోండి. ఒక మనిషి విలువ అతనికి ఎంత ఆస్తి ఉంది, అనే దాన్ని బట్టి లెక్కగట్టకండి" అని చెప్పాడు.
\s5
\p
\v 16 ఆయన వాళ్ళకి ఈ చిన్న కథ చెప్పాడు. "ఒక ధనవంతుడి పొలాల్లో ఆ యేడు విపరీతమైన పంట పండింది.
\v 17 అతడు "అబ్బా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ ధాన్యమంతా నిలవజేయడానికి గోదాములు లేవే" అనుకుని
\v 18 బాగా ఆలోచించి "సరే, పాత గోదాములు పడగొట్టి పెద్దవి కట్టిస్తే పోతుంది. అప్పుడు నా పంటంతా, మిగిలినవి కూడా వాటిల్లో నింపుకోవచ్చు.
\v 19 ఆహా, ఎన్నేళ్ళు తిన్నా తరగని తిండిగింజలు ఉన్నాయి. ఇక హాయిగా కాలు మీద కాలేసుకుని కడుపారా తినొచ్చు, తాగొచ్చు, కులాసాగా ఉండొచ్చు!" అనుకున్నాడు."
\s5
\p
\v 20 "అయితే దేవుడు అతనితో, "బుర్ర లేని వాడా, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతావు. నీ కోసం కూడబెట్టుకున్న దంతా నీకు ప్రాప్తం లేదు. అవన్నీ పరుల పాలౌతాయి" అన్నాడు."
\p
\v 21 యేసు తన ఉదాహరణ ముగిస్తూ "దేవుడు దేన్ని విలువైనవిగా ఎంచుతాడో వాటిని పట్టించుకోకుండా తమకోసమే కూడబెట్టుకునే వాళ్ళ సంగతి ఇలానే ఉంటుంది" అన్నాడు.
\s5
\p
\v 22 యేసు తన శిష్యులతో "మీతో ఒకటి చెప్పాలి. బతకడానికి అవసరమైన వాటి గురించి హైరానా పడకండి. తినడానికి చాలినంత తిండి, కట్టుకోడానికి బట్టలూ ఉంటాయో లేదోనని దిగులు పెట్టుకోకండి.
\v 23 మీరు తినే భోజనం కన్నా మీ జీవం గొప్పది. కట్టుకునే బట్టలకన్నా మీ శరీరం గొప్పది.
\s5
\v 24 పక్షులను చూడండి, అవి విత్తనాలు చల్లవు. పంట కోసుకోవు. ధాన్యం నిలవ చేసుకోడానికి వాటికి ఇళ్ళు, గోదాములు లేవు. అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటే తప్పని సరిగా గొప్పవాళ్ళే.
\v 25 మీరు దిగులు పెట్టుకుంటే ఏమి లాభం? దిగులు పడడం వల్ల జీవితాన్ని ఒక్క నిమిషమైనా పొడిగించగలరా?
\v 26 దానివల్ల ప్రయోజనం లేదు గనక దేని విషయంలోనూ దిగులు పెట్టుకోవద్దు."
\s5
\p
\v 27 "పువ్వులెలా పూస్తున్నాయో చూడండి. డబ్బు సంపాదనకై అవి పని చెయ్యవు. తమ బట్టలు తయారు చేసుకోవు. అయితే నేను అనేదేమిటంటే పూర్వకాలం సోలోమోను రాజు అందమైన బట్టలు ధరించే వాడు గదా, అతని బట్టలు సైతం ఈ గడ్డి పువ్వుల ఎదుట దిగదుడుపే.
\v 28 మొక్కలు కొంచెం కాలమే ఉంటాయి. వాడిపోయాక వాటిని తగలబెట్టేస్తారు. దేవుడు వాటిని భలే ముస్తాబు చెయ్యడా! అయితే మీరంటే దేవునికి చాలా ఇష్టం. గడ్డి మొక్కలకంటే మిమ్మల్నే ఆయన ఎక్కువగా పట్టించుకుంటాడు. మీకు ఆ పాటి నమ్మకం కూడా లేదు."
\s5
\p
\v 29 "ఏమి తింటాం, ఏమి తాగుతాం, అని బెంగ పెట్టుకోకండి.
\v 30 దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఇలాటి వాటికోసం దిగులు పడుతుంటారు. అయితే పరలోకంలో ఉండే మీ తండ్రికి మీకేది అవసరమో తెలుసు.
\s5
\v 31 కాబట్టి మీ ఆలనా పాలనా చూసే దేవుణ్ణి అంగీకరించడం అనే దాన్ని మీ జీవితాల్లో అతి ప్రాముఖ్యంగా ఎంచండి. అప్పుడు ఆయన కూడా మీకు కావలసినవన్నీ ఇస్తాడు."
\p
\v 32 "చిన్న మందా, భయం వద్దు. పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకోసం దాచి ఉంచిన అన్ని మేళ్ళు మీకివ్వాలని చూస్తున్నాడు.
\s5
\v 33 కాబట్టి ఇక మీకున్నవన్నీ అమ్మేయండి. తిండీ బట్టా ఉండడానికి గూడు లేనివాళ్ళకి ఇవ్వండి. పాతబడిపోని డబ్బు సంచులు సంపాదించుకోండి. అప్పుడు మీకు పరలోకంలో సంపదలు ఉంటాయి. అక్కడ అవి ఎప్పుడూ భద్రంగా ఉంటాయి. అక్కడ ఏ దొంగా ఉండడు. ఏ చెదపురుగూ మీ బట్టలు పాడు చెయ్యదు.
\v 34 మీరు దేన్ని విలువైనదిగా భావిస్తారో దాన్నే మనసులో స్మరించుకుంటూ ఉంటారు."
\s5
\p
\v 35 "దేవుడి పనికోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. పని చేసేటప్పుడు వేసుకునే బట్టలతో ఉండండి. మీ దీపాలు వెలిగించి ఉంచుకోండి.
\v 36 అయ్యగారు పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తున్నాడని కనిపెట్టుకుని చూసే పనివాళ్ళలాగా నేను రావడం కోసం ఎదురు చూస్తూ ఉండండి. అయ్యగారు వచ్చి తలుపు కొట్టగానే తలుపు తీసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉంటారు.
\s5
\v 37 ఆయన వచ్చినప్పుడు ఈ పనివాళ్ళు మెలకువగా ఉంటే ఆయన వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు. మీతో చెబుతున్నాను వినండి. అతడు వడ్డించే బట్టలు వేసుకుని వాళ్ళని కూర్చోమని తానే వాళ్ళకి భోజనం వడ్డిస్తాడు.
\v 38 తాను అర్ధరాత్రివేళ, తెల్లవారిపోతుండగా వచ్చినా తన సేవకులు మెలకువగా తన కోసం సిద్ధంగా ఉంటే అతడు చాలా ఆనందపడతాడు."
\s5
\p
\v 39 "అయితే మీరు ఇది కూడా గుర్తుంచుకోవాలి. దొంగ వచ్చే సమయం ఇంటి యజమానికి తెలిస్తే అతడు నిద్రపోకుండా కాచుకుని ఉండి దొంగను చొరబడనియ్యడు.
\v 40 కాబట్టి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మానవ పుత్రుడినైన నేను మీరు అస్సలు ఉహించని సమయంలో వస్తాను."
\s5
\v 41 పేతురు ఆయన్ని అడిగాడు, "స్వామీ, ఈ ఉదాహరణ మాకే చెబుతున్నావా, అందరికీనా?"
\v 42 అందుకు ఆయన "నమ్మకంగా వివేకంతో యజమాని ఇంటిని చూసుకునే ప్రతి ఒక్కరితోనూ చెబుతున్నాను. అతని యజమాని అతనికి ఇంటి మీద పెత్తనం ఇస్తాడు. సేవకులందరికీ సరిగా భోజనం అందుతుందో లేదో చూసుకునే బాధ్యత ఇస్తాడు.
\v 43 యజమాని తిరిగి వచ్చినప్పుడు ఆ సేవకుడు ఇలాటి బాధ్యతలు చక్కగా చూసుకుంటూ కనిపిస్తే యజమాని అతనికి బహుమతి ఇస్తాడు.
\v 44 మీకు చెబుతున్నాను, యజమాని తన ఆస్తి అంతటిమీదా అతణ్ణి నియమిస్తాడు."
\s5
\p
\v 45 "అయితే సేవకులను అజమాయిషీ చేసే ఆ నిర్వాహకుడు "అయ్యగారు వెళ్లి చాలాకాలం అయిందిలే" అనుకుని తక్కిన ఆడ, మగ సేవకులను కొడుతూ పీకలదాకా మెక్కుతూ తాగి తందనాలాడుతూ ఉన్నాడనుకోండి.
\v 46 వాడు అస్సలు ఉహించని సమయంలో యజమాని తిరిగి వస్తాడు. అతణ్ణి కఠినంగా శిక్షించి తన మాట లెక్క చెయ్యని వాళ్ల దగ్గర పడేస్తాడు.
\s5
\v 47 యజమానికి ఏది ఇష్టమో తెలిసి కూడా చెయ్యడానికి సిద్ధపడని వాడికి పెద్ద శిక్ష పడుతుంది.
\v 48 యజమాని ఏమి చెయ్యాలని కోరుతున్నాడో గ్రహించక పొరపాట్లు చేస్తే ఆ సేవకుడికీ పడేది తక్కువ శిక్షే. ఎక్కువ పొందినవాడి దగ్గర నుండి ఎవరైనా ఎక్కువే ఆశిస్తారు. మొత్తం ఒకడి చేతుల్లో పెడితే అలాటి వాడు ఎంతో బాధ్యత తీసుకోవాలని చూస్తారు."
\s5
\p
\v 49 "నేను భూమిని తగలబెట్టడానికి వచ్చాను. అసలు అది ఇప్పటికే తగలబడి పోతూ ఉంటే బావుణ్ణు.
\v 50 త్వరలోనే నేను చిత్ర హింసలు అనే బాప్తిసం తీసుకోవాలి. నా హింసలు పూర్తి అయ్యే వరకూ నాకు నెమ్మది లేదు.
\s5
\v 51 నేను ఈ లోకంలోకి రావడం వల్ల మనుషులు శాంతిసమాధానాలతో జీవిస్తారనుకుంటున్నారా? కాదు. మనుషులు వేరువేరు గుంపులుగా విడిపోతారని చెబుతున్నాను.
\v 52 ఎందుకో తెలుసా? ఒక ఇంట్లో కొందరు నాపై విశ్వాసం పెట్టుకుంటారు. కొందరు అలా చెయ్యరు. కుటుంబం చీలిపోతుంది. ఒక ఇంట్లో నన్ను నమ్మని ముగ్గురు నమ్మే ముగ్గురిని ఎదిరిస్తారు.
\v 53 ఒకడికి తన కొడుకే శత్రువౌతాడు. కొడుకు తండ్రికి ఎదురు తిరుగుతాడు. ఒక స్త్రీ తన కూతురితో విభేదిస్తుంది. కూతురు తల్లి మాట వినదు. అత్త తన కోడలికీ, కోడలు తన అత్తకీ విరోధులౌతారు."
\s5
\p
\v 54 యేసు ప్రజానీకంతో కూడా చెప్పాడు, "పశ్చిమ దిక్కున కారుమబ్బు కనిపిస్తే మీరు వెంటనే "వర్షం వస్తుంది" అంటారు గదా.
\v 55 దక్షిణం నుండి గాలి వీస్తే "అబ్బో, ఈ రోజు బాగా వడగాలి ఉంటుంది" అంటారు గదా. నిజమే.
\v 56 మేకవన్నె పులుల్లారా, మబ్బులు, గాలి వాటు చూసినంత మాత్రాన వాతావరణం ఎలా ఉండబోతుందో చెప్పగలుగుతున్నారు గదా. ప్రస్తుతం దేవుడు ఏమి చేస్తున్నాడో ఆమాత్రం గ్రహించలేరా?"
\s5
\p
\v 57 "మీలో ప్రతివాడు, కాలం మించిపోక ముందే చేయవలసినది చెయ్యాలని నిర్ణయించుకోవాలి.
\v 58 సమయం మించిపోక ముందే కోర్టుకు వెళ్ళే దారిలోనే మీపై కేసు వేసిన వాడితో రాజీ పడాలి. జడ్జీ ఎదుట నిలబడ్డాక ఇక లాభం లేదు. జడ్జీ నిన్ను దోషిగా నిర్ణయించి అధికారుల వశం చేస్తాడు. వాళ్ళు నిన్ను జైల్లో పెడతారు.
\v 59 నిజం చెబుతున్నాను. నువ్వు గనక జైలుకి వెళితే నీవు ఎంత పరిహారం చెల్లించాలని జడ్జీ చెప్పాడో అణాపైసలతో సహా అంత మొత్తం కడితే తప్ప బయటికి రావు."
\s5
\c 13
\p
\v 1 ఆ మధ్య రోమ్ సైనికులు కొందరు గలిలయ ప్రజలను ఊచకోత కోసిన సంగతి కొందరు యేసుకు చెప్పారు. ఈ గలిలయులు గుడిలో బలులు అర్పిస్తుండగా రోమ్ గవర్నర్ పిలాతు వాళ్ళని చంపమని సైనికుల్ని పంపించాడు.
\p
\v 2 యేసు అక్కడున్న వాళ్ళతో, "ఇలాటి ఘోరం ఈ గలిలయ వాళ్ళకు జరిగిందని వీళ్ళు మిగతా గలిలయుల కన్నా పాపాత్ములని మీరు అనుకుంటున్నారా?
\v 3 సందేహం లేకుండా చెబుతున్నాను. కారణం అది కాదు. మీ చెడుమార్గం నుండి బయటికి రాక పొతే ఆయన మిమ్మల్ని కూడా అలానే శిక్షిస్తాడని గుర్తుంచుకోండి.
\s5
\v 4 మరొకటి. యెరూషలేము శివార్లలో సిలోయం గోపురం కూలి 18 మంది చనిపోయారే, వాళ్ళ సంగతో? వీళ్ళు యెరూషలేము మొత్తంలోకీ పాపాత్ములు గనక ఇది వాళ్ళకి జరిగిందనుకుంటున్నారా?
\v 5 మీకు గట్టిగా చెబుతున్నాను. కారణం అది కాదు. మీ చెడు ప్రవర్తన నుండి మీరు మళ్ళుకోక పొతే దేవుడు మిమ్మల్ని కూడా అలానే దండిస్తాడు."
\s5
\p
\v 6 అప్పుడు యేసు వాళ్ళకి ఈ కథ చెప్పాడు, "ఒక వ్యక్తి తన తోటలో అంజూరు చెట్టు పెంచాడు. ఏటేటా అంజూరు కాయలు కోసుకోడానికి వస్తుండేవాడు. కానీ అది ఎప్పుడూ కాయలు కాయలేదు.
\v 7 అప్పుడు అతడు తోటమాలితో "ఈ చెట్టు చూడు, మూడేళ్ళ నుండి ఈ చెట్టు కాస్తుందేమోనని చూసాను. లాభం లేదు. దీన్ని నరికెయ్యి. అనవసరంగా నేలలోని సారాన్ని ఇది పీల్చుకుంటూ ఉంది గదా" అన్నాడు.
\s5
\v 8 అందుకు తోటమాలి "అయ్యగారూ, మరొక్క ఏడు ఉండనిద్దాం. దీనికి పాదు తవ్వి ఎరువు వేస్తాను.
\v 9 వచ్చే ఏడు కాస్తే కాస్తుంది. అప్పటికీ కాయకపోతే నరికేద్దాం" అన్నాడు."
\s5
\p
\v 10 యూదుల విశ్రాంతి దినం నాడు వాళ్ళ సమాజ కేంద్రంలో యేసు బోధిస్తూ ఉన్నాడు.
\v 11 పద్దెనిమిది ఏళ్లుగా దయ్యం పట్టి అవిటిదైపోయిన ఒకామె అక్కడ ఉంది. ఆమె వంగిపోయి ఉండేది. నిటారుగా నిలబడం కుదిరేది కాదు.
\s5
\v 12 యేసు ఆమెను చూసి, దగ్గరికి పిలిచాడు. ఆమెతో, "అమ్మా, నీ రోగం పోయి ఆరోగ్యం పొందు" అన్నాడు.
\v 13 ఆమె మీద చేతులు పెట్టగానే ఆమె నిటారుగా నిలబడి దేవుణ్ణి స్తుతించసాగింది.
\p
\v 14 కానీ అది చూసి సమాజకేంద్రం పెద్ద మండిపడ్డాడు. ఎందుకంటే యేసు ఆమెను యూదుల విశ్రాంతి రోజున బాగు చేశాడు. అతడు అక్కడున్న వాళ్ళతో, "వారంలో ఆరు రోజులున్నాయి గదా. ఆ ఆరు రోజులు పని చేసుకోవచ్చని మన ధర్మశాస్త్రం అనుమతి ఇచ్చింది. మీకు రోగాలు నయం కావాలంటే సమాజకేంద్రానికి రావలసింది ఆ ఆరు రోజులు. విశ్రాంతి దినాన రావద్దు!"
\s5
\p
\v 15 అప్పుడు ప్రభువు అతనికి "నువ్వూ, తక్కిన మతనాయకులంతా కపట భక్తులు. కొన్ని సార్లు మీరు కూడా విశ్రాంతి రోజున పని చెయ్యరా? విశ్రాంతి రోజున మీ ఎద్దుని, గాడిదని విప్పి మేత గాటి దగ్గరికీ, నీళ్ళు తాగడానికీ తీసుకుపోరా?
\v 16 ఈమె యూదురాలు. అబ్రాహాము వంశస్తురాలు. సాతాను ఈమెను 18 ఏళ్ళు అవిటితనంతో కట్టి పడేశాడు. ఆమెను నేను సాతాను గొలుసుల నుండి విడిపించడం తగదా, అది విశ్రాంతి రోజైతే ఏంటి."
\s5
\v 17 ఆయన ఇలా అన్నపుడు ఆయన శత్రువులు సిగ్గు పడ్డారు. తక్కిన వారంతా ఆయన చేస్తున్న అద్భుతాలను చూసి ఎంతో ఆనందించారు.
\s5
\p
\v 18 "దేవుని రాజ్యం ఎలా ఉంటుందని చెప్పను? ఇలా ఉంటుంది.
\v 19 ఒక మనిషి తన పొలంలో ఒక చిన్న ఆవ గింజ పాతాడు. అది పెరిగి పెద్దదై, చెట్టు అవుతుంది. దాని కొమ్మల్లో పిట్టలు గూళ్ళు పెట్టుకుంటాయి."
\s5
\p
\v 20 ఆయన ఇంకా అన్నాడు, "దేవుడు రాజుగా ఉండే స్థితి ఎలా ఉంటుందో చెబుతా వినండి.
\v 21 ఇరవై ఐదు కిలోల గోదుమ పిండి ముద్దలో ఒకామె కొద్దిగా ఈస్టు పదార్థం కలిపినట్టు ఆ రాజ్యం ఉంటుంది. ఆ కొంచెం ఈస్టు పిండి ముద్ద మొత్తాన్నీ పొంగేలా చేస్తుంది."
\s5
\v 22 యేసు యెరూషలేముకు సాగిపోతూ దారిలో అన్ని ఊళ్ళలో, గ్రామాల్లో ఆగుతూ ప్రజలకు దైవోపదేశం చేస్తూ ఉన్నాడు.
\p
\v 23 ఒక వ్యక్తి ఆయన్నిలా అడిగాడు, "ప్రభూ, దేవుడు రక్షించేది కొద్దిమందినేనా?"
\v 24 అందుకు యేసు "ఇరుకు దారి గుండా పోవడానికి మీరు మరింత కష్టపడాలి. చాలామంది వేరే దారిన రావడానికి ప్రయత్నిస్తారు. కానీ అలాటి వాళ్ళు లోపలి రాలేరు."
\s5
\p
\v 25 "ఇంటి యజమాని తలుపు తాళం వేసుకున్నాక నువ్వు బయట నిలబడి తలుపు కొడతావు. ఆ యజమానిని "ప్రభూ, తలుపు తెరవండి" అని బతిమాలుతావు. కానీ అతడు "కుదరదు. నువ్వెవరో, ఎక్కడినుండి వచ్చావో నాకేం తెలుసు?" అంటాడు.
\v 26 అప్పుడు మీరంటారు. "ప్రభూ, మర్చిపోయారా? మేము మీతో కలిసి భోజనం చేశాము. మా ఊళ్ళలో మీరు మాకు బోధించారు."
\v 27 కానీ అతడు "మళ్ళీ చెబుతున్నాను. మీరెవరో ఎక్కడినుంచి వచ్చారో నాకు తెలియదు. దుర్మార్గులారా, అవతలికి పొండి" అంటాడు."
\s5
\p
\v 28 యేసు ఇంకా అన్నాడు, "మీరు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను దూరం నుండి చూస్తారు. పూర్వకాలం నాటి ప్రవక్తలు కూడా అక్కడ ఉంటారు. దానంతటిమీదా దేవుడే రాజుగా పరిపాలిస్తుంటాడు. కానీ మీరు మాత్రం బయటే ఉంటారు. ఏడుస్తూ, బాధతో పళ్ళు కొరుకుతూ ఉంటారు.
\v 29 అంతేకాదు, యూదులు కాని వాళ్ళు చాలా మంది అక్కడ ఉంటారు. తూర్పూ పడమరా ఉత్తరం, దక్షిణం నుండి వచ్చిన వాళ్ళు చాలామంది అక్కడ ఉంటారు. దేవుడి రాజ్యంలో విందువినోదాలలో మునిగితేలుతూ ఉంటారు.
\v 30 ఇది ఆలోచించండి. ఇప్పుడు అనామకులుగా కనిపించేవాళ్ళు అప్పుడు ప్రముఖులుగా ఉంటారు. ఇప్పుడు గొప్పవాళ్ళుగా కనిపించేవాళ్ళు అక్కడ అనామకులుగా ఉంటారు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలౌతాయి."
\s5
\p
\v 31 అదే రోజు కొందరు పరిసయ్యులు వచ్చి యేసుతో అన్నారు, "ఇక్కడి నుంచి వెళ్లిపో, హేరోదు అంతిపా నిన్ను చంపాలని చూస్తున్నాడు" అన్నారు.
\v 32 ఆయన వాళ్లతో "హేరోదు జిత్తులమారి నక్క. అదే సమయంలో నక్కలాగా అల్పుడు. అతడంటే నాకేమీ లెక్క లేదు. అయితే దేవుడు రాసిపెట్టిన సమయం, ప్రదేశం వచ్చేదాకా ఎవరూ నన్ను ముట్టుకోలేరు అని అతనికి అర్థం కావాలి గనక, పోయి ఈ మాట అతనికి చెప్పండి. చూడు, నేను ఈ రోజు దయ్యాలు వెళ్ళగొడుతున్నాను. మహిమలు ప్రదర్శిస్తున్నాను. ఇంకా కొంతకాలం చేస్తాను. ఆపైన నా పని పూర్తి అవుతుంది.
\v 33 కానీ రాబోయే రోజుల్లో నేను యెరూషలేముకు నా ప్రయాణం కొనసాగించాలి. యెరూషలేములో గాక ప్రవక్తను చంపేది మరెక్కడ?
\s5
\v 34 యెరూషలేము ప్రజలారా, గతకాలంలో ప్రవక్తలను మీరు చంపారు. దేవుడు మీ దగ్గరికి పంపిన వాళ్ళను రాళ్ళతో కొట్టి చంపారు. తల్లి కోడి తన పిల్లల్ని తన రెక్కల కిందకి తెచ్చుకుని కాపాడినట్టు నేను మిమ్మల్ని కాపాడాలని ఎన్ని సార్లు ప్రయత్నం చేశానో! కానీ మీకది ఇష్టం లేక పోయింది.
\v 35 యెరూషలేము ప్రజలారా, ఇప్పుడు చూడండి. దేవుడు ఇకపై మిమ్మల్ని కాపాడడు. ఇంకోటి కూడా చెబుతున్నా. మీ పట్టణానికి మరొక్క సారి మాత్రం వస్తాను. ఆ తరువాత నేను మళ్ళీ వచ్చేదాకా నన్నిక చూడవు. ఆ సమయంలో నా గురించి "దేవుని అధికారంతో వచ్చే ఇతన్ని దేవుడు దీవించుగాక" అంటావు."
\s5
\c 14
\p
\v 1 మళ్ళీ ఒక విశ్రాంతి రోజున యేసు పరిసయ్యుల నాయకుల్లో ఒకడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వారంతా ఆయన్ని కనిపెట్టి చూస్తున్నారు.
\v 2 యేసు ఎదురుగుండా వ్యాధి వల్ల చేతులూ కాళ్ళు వాచిపోయిన మనిషి ఒకడు ఉన్నాడు.
\v 3 యూదుల ధర్మశాస్త్రం బాగా తెలిసిన అక్కడున్న వాళ్ళని యేసు అడిగాడు, "విశ్రాంతి రోజున మనిషి రోగం నయం చేయడం ధర్మ సమ్మతమేనా, కాదా."
\s5
\v 4 వారేమీ మాట్లాడలేదు. యేసు ఆ మనిషిపై చేతులు వేసి అతణ్ణి బాగు చేసి "ఇక వెళ్ళు" అన్నాడు.
\v 5 ఆయన అక్కడున్న వాళ్ళతో, విశ్రాంతి రోజున మీ పిల్లవాడు గానీ ఎద్దు గానీ బావిలో పడితే పోయి వెంటనే బయటికి తీస్తారా, తియ్యరా.
\v 6 దీనిక్కూడా వాళ్ళేమీ చెప్పలేదు.
\s5
\p
\v 7 భోజనానికి పిలిచిన కొందరు ఎక్కువ గౌరవనీయులు కూర్చునే చోటే కూర్చోవాలని వెంపర్లాడడం యేసు చూశాడు. వాళ్ళకి ఈ సలహా ఇచ్చాడు.
\v 8 "మిమ్మల్ని ఎవరన్నా పెళ్లి భోజనాలకు పిలిస్తే ముఖ్యులు కూర్చునే చోట కూర్చోవద్దు. ఏమో, నీకన్నా ముఖ్యమైన మరొకణ్ణి పిలిచారేమో.
\v 9 అతడు వచ్చినప్పుడు నిన్నూ అతణ్ణి కూడా ఆహ్వానించిన వాడు వచ్చి, "ఈ కుర్చీ ఆయనికి ఇచ్చి ఈ వెనక వరసలో కూర్చో" అని నీతో అంటే ఏంటి పరిస్థితి?
\s5
\v 10 భోజనానికి వెళ్ళినప్పుడు తక్కువ ప్రాముఖ్యమైన చోట కూర్చో. అందరినీ ఆహ్వానించిన వాడు వచ్చి "మిత్రమా, ఇక్కడ కూర్చున్నావేమిటి? రా, ముందు వరసలో కూర్చో" అని నీతో అంటాడు. నీతో భోజనానికి కూర్చున్న వారందరికీ అతడు నిన్ను గౌరవిస్తున్నాడని అర్థమౌతుంది.
\v 11 తనని గొప్ప చేసుకునే వాణ్ణి దేవుడు తోక కత్తిరిస్తాడు. నమ్రతగా ఉండే వాళ్ళని గొప్ప చేస్తాడు."
\s5
\p
\v 12 యేసు తనని ఆహ్వానించిన పరిసయ్యుడితో మళ్ళీ ఇలా అన్నాడు, "మీరు మధ్యాహ్న భోజనానికి గానీ, రాత్రి భోజనానికి గానీ ఎవరినన్నా పిలవదలుచుకుంటే వాళ్ళు నిన్ను మళ్ళీ పిలుస్తారు గనక కేవలం నీ బంధుమిత్రులను, బాగా డబ్బున్న వాళ్ళని మాత్రమే పిలవకండి.
\s5
\v 13 మీరేం చెయ్యాలంటే విందు చేసేటప్పుడు పేదవాళ్ళనీ అంగవైకల్యం గల వాళ్ళనీ, కుంటి, గుడ్డి వాళ్ళనీ పిలవండి.
\v 14 అలాటి వాళ్ళు నువ్వు చేసిన దానికి బదులుగా ఏమీ చెయ్యలేరు గదా. అందుకని దేవుడు న్యాయవంతులందరినీ మళ్ళీ బతికించే సమయంలో నీకు ప్రతిఫలం ఇస్తాడు."
\s5
\p
\v 15 యేసుతో కూర్చుని భోంచేస్తున్న వాళ్ళలో ఒకడు ఈ మాట విని ఆయనతో, "దేవుడు అన్నిటిమీదా రాజ్య పరిపాలన చేసే కాలంలో ఆ విందు భోజనంలో కూర్చునే వారందరినీ దేవుడు దీవించాడు" అన్నాడు.
\v 16 దానికి జవాబుగా యేసు అతనితో, "ఒక సారి ఒక మనిషి చాలా పెద్ద విందు భోజనం ఏర్పాటు చేశాడు. దానికి చాలా మందిని పిలిచాడు.
\v 17 విందు రోజున అతడు తాను పిలిచిన వాళ్ళందరికీ జ్ఞాపకం చెయ్యాలని సేవకులను పంపి "విందుకి అంతా సిద్ధంగా ఉంది, రండి" అని చెప్పించాడు.
\s5
\v 18 కానీ సేవకులు వెళ్ళినప్పుడు విందుకి పిలిచిన వారంతా "మేము రాలేము" అనడం మొదలు పెట్టారు. మొదటి వాడు "ఈ మధ్యనే పొలం కొన్నాను. వెళ్లి దాన్ని చూడాలి. రాలేనందుకు మీ అయ్యగారిని క్షమించమన్నానని చెప్పు" అని సేవకుడితో అన్నాడు.
\v 19 మరొకడు "ఐదు జతల ఎద్దులు కొన్నాను. వాటిని చూసుకోడానికి వెళ్తున్నాను. రానందుకు ఏమనుకోవద్దని మీ అయ్యగారితో చెప్పు" అన్నాడు.
\v 20 ఇంకొకడు నాకీమధ్యనే పెళ్లయింది. రాలేను" అన్నాడు.
\s5
\v 21 సేవకులు తిరిగి వచ్చి పిలిచిన వారంతా చెప్పిన మాటలు యజమానికి చెప్పారు. అతనికి చాలా కోపం వచ్చింది. సేవకులతో, "తొందరగా వీధివీధికీ సందుసందుకీ వెళ్లి బీదాబిక్కీ, అవిటి, కుంటి, గుడ్డి అందర్నీ నా ఇంటికి తీసుకురండి" అన్నాడు.
\p
\v 22 సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి "అయ్యగారూ, మీరు చెప్పినట్టే చేశాం. కానీ ఇంకా చోటు ఉంది" అన్నాడు.
\s5
\v 23 అప్పుడు యజమాని "అలాగైతే ఊరి బయటికి వెళ్ళండి. రహదారుల్లో వెదకండి. కాలిబాటల్లో, కంచెల్లో కూడా వెదకండి. అలాటి చోట్ల కనిపించే వాళ్ళని నా ఇంటికి రమ్మని బలవంతం చెయ్యండి. నా ఇల్లు నిండిపోవాలి.
\v 24 పైగా నేను చెప్పేదేమిటంటే పిలిచిన వాళ్ళకి విందులో కూర్చునే ప్రాప్తం లేదు. ఎందుకంటే వాళ్ళు రాము అన్నారు."
\s5
\p
\v 25 యేసుతో కలిసి చాలా మంది నడుస్తున్నారు. యేసు వాళ్ళతో అన్నాడు.
\v 26 "ఎవరన్నా నా దగ్గరకి వచ్చి కూడా తన తల్లిదండ్రుల్ని భార్యాబిడ్డల్ని, తోబుట్టువుల్ని నన్ను ఇష్టపడిన దానికంటే ఎక్కువగా ఇష్టపడితే అలాటి వాడు నా శిష్యుడు కాలేడు. తన ప్రాణం కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించాలి.
\v 27 తన సిలువను మోసుకుంటూ నా మాట వినే వాడు కాకపోతే నా శిష్యుడు కాలేడు.
\s5
\v 28 మీరెవరైనా ఏదో ఒక గోపురం కట్టించాలనుకుంటే మొదట కూర్చుని దానికి ఎంత అవుతుంది అని లెక్కలు వేసుకోరా? అప్పుడు దాన్ని పూర్తి చేయడానికి సరిపోయిన డబ్బు ఉందో లేదో అంచనా వేసుకోగలుగుతారు.
\v 29 అలా కాకుండా పునాది వేసి మిగతా కట్టడం పూర్తి చెయ్యలేకపొతే చూసినవారంతా నవ్వరా?
\v 30 "ఇతడు గోపురం మొదలు పెట్టాడు, పూర్తి చెయ్యలేక పోయాడు" అంటారు గదా.
\s5
\v 31 లేకపోతే ఒక రాజు వేరొక రాజుపైకి యుద్ధానికి సైన్యాన్ని పంపాడనుకోండి. అతడు తప్పకుండా తన మంత్రులతో కూర్చుని, తన పది వేలమంది సైన్యం ఇరవై వేలమంది శత్రు సైన్యాన్ని ఓడించగలదా, అని లెక్క చూసుకోడా?
\v 32 తన సైన్యం శత్రుసైన్యంపై గెలవలేదనుకుంటే శత్రు సైన్యం ఇంకా దూరంలో ఉన్నప్పుడే రాయబారిని పంపి "సంధి చేసుకోవాలంటే మీ షరతులు ఏమిటి?" అని ఆ శత్రు రాజుని అడుగుతాడు గదా.
\v 33 అలానే మీలో ఎవరికైనా ఉన్నదంతా మొదట వదులుకోడానికి ఇష్టం లేకపోతే మీరు నా శిష్యులు కాలేరు."
\s5
\p
\v 34 మళ్ళీ యేసు చెప్పాడు, "మీరు ఉప్పులాంటివాళ్ళు. ఉప్పు చాలా ఉపయోగం. అయితే ఉప్పులోని ఉప్పదనం పోతే దాన్ని మళ్ళీ ఉప్పగా చేయడం ఎలా?
\v 35 ఉప్పు ఉప్పగా లేకపోతే అది బయట పారెయ్యడానికి తప్ప దేనికీ పనికిరాదు. మనుషులు దాన్ని చెత్త కుప్పలో విసిరేస్తారు. నేనిప్పుడు మీకు చెప్పినది ప్రతివాడు జాగ్రత్తగా ఆలోచించాలి."
\s5
\c 15
\p
\v 1 ఒకసారి చాలామంది పన్నువసూలుదారులు, అస్తమానం పాపం చేస్తూ ఉంటారని అందరూ అనుకునే ఇతరులూ యేసు మాటలు వినడానికి వచ్చారు.
\v 2 పరిసయ్యులూ, ధర్మశాస్త్ర పండితులూ అది చూసి "ఈ మనిషి పాపులను దగ్గరికి రానిస్తూ వాళ్ళతో కలసి భోజనం చేస్తున్నాడు" అని గుసగుసలాడుకున్నారు.
\s5
\p
\v 3 కాబట్టి యేసు వాళ్ళకి ఒక కథ చెప్పాడు.
\v 4 మీలో ఎవరికైనా వంద గొర్రెలు ఉన్నాయనుకోండి. వాటిల్లో ఒకటి పోయింది. నువు తప్పకుండా 99 గొర్రెలను అడివిలో వదిలి ఆ పోయిన గొర్రె దొరికేదాకా వెతుకుతావు గదా?
\v 5 మీకు అది దొరికినప్పుడు సంతోషంగా దాన్ని భుజాలపై వేసుకుని ఇంటికి తెస్తారు గదా.
\s5
\v 6 ఇల్లు చేరాక స్నేహితుల్నీ ఇరుగుపొరుగు వాళ్ళనీ పిలిచి "నాతోబాటు సంతోషంగా ఉండండి. పోయిన నా గొర్రె దొరికింది" అంటారు గదా.
\v 7 ఇది వినండి. అదే విధంగా ఒక్క పాపి తన పాపాల విషయం పశ్చాత్తాప పడితే పరలోకంలో ఎంత సంతోషమో! దేవుడితో సరైన సంబంధంలో ఉండి, పశ్చాత్తాపపడే అవసరం లేని వాళ్ళందరికన్నా అదే ఎక్కువ సంతోషం.
\s5
\p
\v 8 "లేకపోతే ఒకామె దగ్గర పది ఖరీదైన వెండి నాణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి పొతే, ఆమె తప్పకుండా దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకూ దేవులాడదా?
\v 9 అది కనిపించగానే తన స్నేహితురాళ్ళనూ ఇరుగుపొరుగు వాళ్ళనీ పిలిచి, "నాతో కలిసి సంతోషించండి. పోయిన నాణెం దొరికింది" అనదా?
\v 10 అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి దేవుని దూతలు సంబరాలు చేసుకుంటారని మీకు చెబుతున్నాను" అన్నాడు.
\s5
\p
\v 11 ఆయన ఇంకా ఇలా అన్నాడు, "ఒక మనిషికి ఇద్దరు కొడుకులున్నారు
\v 12 ఒకరోజు చిన్నకొడుకు "నాన్నా, నీ తదనంతరం నీ ఆస్తిలో నాకు వచ్చే వాటా నాకు ఇచ్చెయ్యి" అన్నాడు. అతడు తన ఇద్దరు కొడుకులకు ఆస్తి పంపకాలు చేశాడు.
\s5
\v 13 కొన్ని రోజులకు చిన్న కొడుకు తనకున్నదంతా చేతబట్టుకుని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అక్కడ సుఖభోగాలకు డబ్బంతా విచ్చలవిడిగా చేజేతులా నాశనం చేశాడు."
\p
\v 14 అంతా ఖర్చయిపోయాక ఆ దేశంలో తీవ్రమైన దుర్భిక్షం నెలకొంది. తింటానికి తిండి కరువైంది.
\s5
\v 15 దాంతో అతడు అక్కడ ఒకడి దగ్గర కూలికి చేరాడు. ఆ వ్యక్తి అతణ్ణి పందులు మేపడానికి తన పొలానికి పంపాడు.
\v 16 ఆకలి మంటలకు తాళలేక పందులు తినే ఆ చిక్కుడు గింజల పైపొట్టన్నా తినాలని చూశాడు. కానీ అతనికేమీ దొరకలేదు.
\s5
\p
\v 17 మొత్తానికి తాను చేసింది ఎంత బుద్ధితక్కువ పనో అతనికి అర్థం కాసాగింది, "మా నాన్న దగ్గర ఎందరో కూలి వాళ్ళు కడుపారా తింటున్నారు. నాకేమో ఇక్కడ తినడానికి ఏమీ లేక ఆకలికి చచ్చిపోతున్నాను
\v 18 మరేం చెయ్యాలి? నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి. నాన్నా, నేను దేవునికీ నీకూ విరోధంగా పాపం చేశాను.
\v 19 ఇక నుండి నీ కొడుకు అనిపించు కోడానికి తగను. నన్ను నీ కూలీల్లో ఒకడిగా పెట్టుకో అని చెబుతాను."
\s5
\p
\v 20 ఇలా అనుకుని అతడు కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటి ముఖం పట్టాడు. అతడింకా దూరంగా ఉండగానే వాళ్ళ నాన్న చూశాడు. అతనికి కొడుకుపై వల్లమాలిన జాలి పుట్టుకొచ్చింది. పరుగెత్తుకుంటూ వెళ్ళి వాటేసుకుని బుగ్గలపై ముద్దు పెట్టుకున్నాడు.
\v 21 అప్పుడు ఆ కొడుకు "నాన్నా, నేను నీకూ దేవుడికీ వ్యతిరేకంగా పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోడానికి తగను" అన్నాడు.
\s5
\p
\v 22 కానీ ఆ తండ్రి తన పనివాళ్ళతో "తొందరగా పోయి నా కొడుక్కి శ్రేష్ఠమైన బట్టలు తెచ్చి తొడగండి. వేలికి ఉంగరం పెట్టండి. కాళ్ళకు చెప్పులు తొడగండి.
\v 23 బాగా కొవ్వు పట్టిన దూడను కోసి వండండి. మనం తిని సంబరాలు చేసుకుందాం.
\v 24 నా కొడుకు చచ్చి బతికాడు. తప్పిపోయి దొరికాడు" అని చెప్పాడు. అప్పుడు వారంతా వేడుక చేసుకోవడం మొదలు పెట్టారు.
\s5
\p
\v 25 ఇదిలా ఉండగా ఆ మనిషి పెద్దకొడుకు పొలంలో పనిచేస్తున్నాడు. పని అయిపోయాక ఇంటి దరిదాపులకు వచ్చేసరికి వాయిద్యాల, నాట్యాల చప్పుడు వినిపించింది.
\v 26 అతడు ఒక పనివాణ్ణి "ఏంటి సంగతి?" అని అడిగాడు.
\v 27 ఆ పనివాడు అతనితో, "నీ తమ్ముడొచ్చాడు. అతడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు మీ నాన్నగారు కొవ్విన దూడను వండించాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 28 పెద్ద కొడుక్కి కోపం వచ్చింది. ఇంట్లోకి పోలేదు. వాళ్ళ నాన్న బయటికి వచ్చి అతణ్ణి లోపలికి రమ్మని బతిమాలాడు.
\v 29 కాని అతడు, "ఇన్నేళ్ళ నుండి నీకు బానిసలాగా ఊడిగం చేస్తున్నాను. ఏనాడూ నీ మాట జవదాట లేదు. అయినా నా స్నేహితులతో కలసి విందు చేసుకోడానికి నువ్వు నాకు ఒక్క మేకపిల్లను కూడా ఇవ్వలేదు
\v 30 కానీ ఇదుగో, నీ ఆస్తిని వేశ్యలకు తగలేసిన చిన్నకొడుకు వచ్చాడే, వాడు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వండి వార్చమని పనివాళ్ళతో చెప్పావు" అంటూ నిష్టూరంగా మాట్లాడాడు."
\s5
\p
\v 31 "అందుకతని తండ్రి, "నాయనా, నువ్వెప్పుడూ నా దగ్గరే ఉన్నావు. నావన్నీ నీవే గదా.
\v 32 కానీ ఇప్పుడు మనం సంతోషంగా పండగ చేసుకోవాల్సిందే. ఎందుకంటే నీ తమ్ముడు చచ్చి బతికాడు. తప్పిపోయి దొరికాడు" అని చెప్పాడు."
\s5
\c 16
\p
\v 1 మళ్ళీ యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు, "ఒక ధనవంతుడి దగ్గర ఒక మేనేజర్ పనిచేసేవాడు. అంటే ఆ ధనవంతుని ఆర్థిక లావాదేవీలు చూసుకునేవాడు. ఒక సారి ఆ ధనికుడికి ఒక సంగతి వినబడింది. తన మేనేజర్ తన ఆస్తిని పాడు చేస్తూ తనకు నష్టం కలిగిస్తున్నాడు.
\v 2 అతడు మేనేజర్ని పిలిచి "నువ్వు చేస్తున్నది ఏమిటి? నీ పనికి సంబంధించిన లెక్క అంతా రాసి ఇవ్వు. ఇక పైన నువ్వు మేనేజర్ గా ఉండడానికి వీల్లేదు" అన్నాడు.
\s5
\p
\v 3 అప్పుడు ఆ మేనేజర్ ఏమనుకున్నాడంటే "యజమాని నన్ను డిస్మిస్ చేస్తున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? తవ్వకం వంటి కాయకష్టం చెయ్యలేను. ఇంతా బతుకు బతికి అడుక్కు తినగలనా!
\v 4 ఆ అర్థమయింది! డిస్మిస్ అయ్యాక నలుగురూ తమ ఇళ్ళలోకి నన్ను ఆహ్వానించి నన్ను ఆదుకోవాలంటే ఏంచేయాలో నాకు తెలుసులే" అనుకున్నాడు.
\s5
\v 5 కాబట్టి ఒక్కొక్కరిగా అతడు యజమానికి బాకీ ఉన్న వాళ్ళందరినీ పిలిచాడు. ఒకడితో, "మా అయ్యగారికి నువ్వు ఎంత బాకీ ఉన్నావు? అని అడిగాడు
\v 6 ‘మూడు వేల లీటర్ల ఆలివ్ నూనె" అని అతడన్నాడు. మేనేజర్ "నీ బిల్లులో పదిహేను వందల లీటర్లని రాసుకో" అన్నాడు.
\v 7 మరొకణ్ణి "నువ్వెంత బాకీ?" అని అడిగితే అతడు, "వంద మానికల గోదుమలు" అన్నాడు. మేనేజర్ "నీ బిల్లులో ఎనభై మానికలని రాసుకో" అన్నాడు.
\s5
\v 8 మేనేజర్ చేసిన పని యజమానికి తెలిసింది. ఆ నిజాయితీ లేని మేనేజర్ తెలివైన పని చేశాడని ఆ యజమాని మెచ్చుకున్నాడు. లౌక్యం తెలిసిన వాళ్ళు ఎంతో తెలివిగా తమ పనులు చక్కబెట్టుకుంటారు. ఇలాటి విషయాల్లో వాళ్ళు దేవునికి చెందిన వాళ్ళ కంటే తెలివైన వాళ్ళు."
\p
\v 9 "మీతో చెబుతున్నాను, లోకంలో మీ డబ్బుతో అయిన వాళ్ళను సంపాదించుకోండి. ఎందుకంటే ఆ డబ్బంతా పోయినప్పుడు వాళ్ళు తమ శాశ్వత గృహాల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తారు.
\s5
\v 10 చిన్న మొత్తాల విషయంలో నమ్మకంగా ఉన్నవాళ్ళని పెద్ద మొత్తాల విషయంలో కూడా నమ్మవచ్చు. చిన్న చిన్న బాధ్యతల విషయంలో మనుషులు నిజాయితీ చూపకపోతే అలాటివాళ్ళు ముఖ్యమైన వాటిల్లో కూడా అలానే ఉంటారు.
\v 11 కాబట్టి లోకంలో దేవుడు మీకిచ్చిన డబ్బును నిజాయితీగా వాడలేక పోతే ఇక పరలోకంలో ఉన్న నిజమైన ధనం దేవుడు మీకు ఎందుకు ఇస్తాడు?
\v 12 ఇతరుల ఆస్తిని మీరు జాగ్రత్తగా కాపాడలేక పోతే మీ సొంత ఆస్తి మీకు ఎవరిస్తారు?
\s5
\p
\v 13 ఏ సేవకుడైనా ఒకేసారి ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలాచేయడానికి ప్రయత్నిస్తే అతడు ఒక యజమానిని ద్వేషించి రెండవ యజమానిని ప్రేమిస్తాడు. లేదా ఒకడికి కట్టుబడి ఉండి రెండవ వాణ్ణి చిన్న చూపు చూస్తాడు. మీరు పొద్దస్తమానమూ డబ్బు సంపాదనలో మునిగి తేలుతూ ఉంటే దేవుణ్ణి సేవించడం కుదరదు."
\s5
\p
\v 14 యేసు ఇలా అనడం పరిసయ్యులు విని ఆయన్ని ఎగతాళి చెయ్యసాగారు. ఎందుకంటే డబ్బు సంపాదన వాళ్ళకి ఎంతో ఇష్టం.
\v 15 యేసు వాళ్ళతో, "మీరేదో నీతిపరులని అందరూ అనుకోవాలని మీరు చూస్తారు. కానీ లోపల ఏముందో దేవుడికి తెలుసు. ఒకటి గుర్తు పెట్టుకోండి. చాలామంది ఏది ప్రాముఖ్యం అనుకుంటారో అది దేవుడికి పరమ అసహ్యం."
\s5
\p
\v 16 "దేవుడు మోషేకు ఇచ్చిన న్యాయ చట్టాలూ ప్రవక్తల రాతలూ బాప్తిసం ఇచ్చే యోహాను కాలం దాకా ఉన్నాయి. అప్పటి నుండి దేవుడే రాజుగా పాలించే కాలాన్ని గురించిన సందేశం ప్రకటన జరుగుతూనే ఉంది. చాలామంది ఆ సందేశం అంగీకరించి దేవుణ్ణి తమ జీవితాలపై రాజుగా నిలుపుకోవాలని ఆత్రుతగా ఉన్నారు.
\v 17 దేవుని చట్టాలన్నీ అవి ఎంత చిన్నవైనా సరే అకాశాలకన్నా భూమి కన్నా అవే శాశ్వతం."
\s5
\p
\v 18 "ఎవరన్నా భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్ళి చేసుకుంటే వాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే భర్త నుండి విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్ళి చేసుకొనేవాడు కూడా వ్యభిచారం చేస్తున్నాడు."
\s5
\p
\v 19 యేసు ఇంకా ఇలా చెప్పాడు, "ఒక ధనికుడు ఉండేవాడు. అతడు ఖరీదైన ఊదారంగు పట్టు బట్టలు ధరించేవాడు. ప్రతి రోజూ సుఖ విలాసాలతో పొద్దు పుచ్చేవాడు.
\v 20 లాజరు అనే నిరుపేద కూడా ఆ ధనికుని ఇంటి గుమ్మం ఎదుట పడి ఉండేవాడు. అతని ఒంటినిండా కురుపులు.
\v 21 ఆకలేసి ధనవంతుని భోజన బల్ల పైనుంచి కింద పడే మెతుకులు తిని ఆకలిమంట చల్లార్చుకోవాలని చూసేవాడు. వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి.
\s5
\v 22 కొంతకాలానికి ఆ పేదవాడు చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి వాళ్ళ పూర్వీకుడు అబ్రాహాముకు సన్నిహితంగా ఉండడానికి తీసుకు వెళ్ళారు. తరువాత ధనికుడు కూడా చనిపోయాడు. అతణ్ణి పాతిపెట్టారు.
\p
\v 23 చనిపోయిన వాళ్ళుండే చోట ఆ ధనికుడు ఘోర యాతన పడుతున్నాడు. పైకి చూసి దూరాన అబ్రాహామునీ, అతని సరసన లాజరునీ చూశాడు.
\s5
\v 24 తండ్రీ అబ్రాహామూ, నీకు జాలి లేదా. నేను ఈ మంటల్లో అల్లాడిపోతున్నాను. లాజరు తన వేలిని నీళ్ళలో ముంచి నా నాలుకను తాకి చల్లబరచడానికి అతణ్ణి పంపవా! అని కేకలు పెట్టాడు.
\s5
\v 25 అందుకు అబ్రాహాము, "నాయనా, గుర్తుందా? నువ్వు బతికి ఉన్న రోజుల్లో ఎన్నో సుఖాలు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో బాధలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతడు ఆనందంగా ఉన్నాడు. నువ్వు యాతన పడుతున్నావు.
\v 26 అదీగాక మీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఉంది. మా దగ్గరనుండి మీ దగ్గరికి రావాలంటే కుదరదు. అక్కడి వాళ్ళు మా దగ్గరికి రావడమూ అసాధ్యం" అన్నాడు.
\s5
\v 27 అప్పుడా ధనికుడు, "తండ్రీ, అలాగైతే ఆ లాజరుని ఒక్కసారి మా ఇంటికి పంపించు.
\v 28 నాకు ఐదుగురు సోదరులున్నారు. వాళ్ళు కూడా ఈ భయానకమైన యాతన స్థలానికి రాకుండా వాళ్ళని హెచ్చరించడానికి లాజరును పంపించమని నిన్ను వేడుకుంటున్నాను" అన్నాడు.
\s5
\v 29 అందుకు అబ్రాహాము, "అలా కుదరదు. ఎందుకంటే పూర్వకాలం మోషే, ప్రవక్తలూ రాసినవన్నీ వాళ్ళకి తెలుసు. నీ సోదరులు వాళ్ళ మాటలు వినాలి" అన్నాడు
\v 30 కానీ ధనికుడు, "అలాకాదు తండ్రీ, అబ్రాహామూ, చనిపోయిన వారెవరన్నా వెళ్లి హెచ్చరిస్తే వాళ్ళు తప్పక తమ పాపపు ప్రవర్తన విడిచిపెడతారు" అన్నాడు.
\v 31 అబ్రాహాము, "మోషే, ప్రవక్తలూ రాసిన మాటలు వాళ్ళు వినకపోతే ఎవరైనా చనిపోయి బ్రతికి వెళ్ళినా నమ్మరు. పాపాలు చెయ్యడం మానుకోరు" అన్నాడు."
\s5
\c 17
\p
\v 1 యేసు తన శిష్యులతో, "మనుషులు పాపం చేసేలా పరీక్షలు తప్పకుండా వస్తాయి. కాని, అవి జరగడానికి కారణమైన వాడి పరిస్థితి ఎంత ఘోరం!
\v 2 ఎవరైనా విశ్వాసంలో బలహీనంగా ఉన్నవాడు పాపం చేసేందుకు కారణమయ్యే ఆ వ్యక్తి మెడకి పెద్ద బండ కట్టి, సముద్రంలోకి విసిరేస్తే అతనికి మంచిది.
\s5
\v 3 నీ ప్రవర్తన జాగ్రత్త. నీ సోదరుల్లో ఒకడు పాపం చేస్తే నువ్వు అతన్ని గద్దించు. అతడు పాపం చేసినందుకు విచారించి, తనను క్షమించమని అడిగితే, అప్పుడు నువ్వు వాణ్ణి క్షమించాలి.
\v 4 నీకు విరోధంగా రోజుకి ఏడుసార్లు తప్పు చేసినప్పటికీ, తప్పు చేసిన ప్రతిసారీ, "నేను చేసిన దానికి బాధపడుతున్నాను" అంటే క్షమిస్తూ ఉండాల్సిందే."
\s5
\p
\v 5 అప్పుడు అపొస్తలులు ప్రభువుతో," మాకు ఎక్కువ విశ్వాసాన్ని పెంచు" అని అడిగారు.
\v 6 అందుకు ప్రభువు, "మీకు విశ్వాసం ఉంటే అది ఈ ఆవ గింజ కంటే పెద్దదేమీ కాదు. అయినా మీరు ఈ మల్బరీ చెట్టుతో, "వేళ్ళతో సహా నువ్వు భూమి నుండి పెకలించుకు పోయి సముద్రంలో నాటుకో" అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది" అన్నాడు.
\s5
\p
\v 7 యేసు మళ్ళీ చెప్తూ, "మీ గొర్రెల్ని కాసేవాడో మీ పొలం దున్నే పాలేరో ఉన్నాడనుకోండి. అతడు పొలం నుండి ఇంటికి వచ్చాక, "రావోయ్, ఇలా కూర్చో. వెంటనే భోజనం చెయ్యి" అనవు గదా.
\v 8 అతనితో, "నాకు భోజనం వండు, వడ్డించడానికి పైబట్ట కట్టుకొని నాకు భోజనం వడ్డించి, నేను తినే దాకా ఉండు. ఆ తరువాత నువ్వు భోజనం చేయవచ్చు" అంటావు.
\s5
\v 9 తనకు చెప్పిన పనులు చేసినందుకు నీ పనివాడికి నువ్వు కృతజ్ఞతలు చెప్పవు.
\v 10 అలాగే, దేవుడు చెప్పిందంతా మీరు చేసినప్పుడు, "మనం దేవుని పనివాళ్ళం మాత్రమే. ఆయన మనకు కృతజ్ఞతలు చెప్పడానికి మనం అర్హులం కాదు. ఆయన మనకు చెప్పిన పనులను మాత్రమే మనం చేసాం" అనాలి."
\s5
\p
\v 11 యేసు, ఆయన శిష్యులు యెరూషలేము దారిలో పోతూ సమరయ, గలిలయ ప్రాంతాల మధ్య ప్రాంతం చేరుకున్నారు.
\v 12 యేసు ఒక గ్రామంలోకి వెళ్తుండగా పదిమంది కుష్ఠు రోగులు ఆయన దగ్గరికి వచ్చి, కొంత ఎడంగా నిల్చున్నారు.
\v 13 వాళ్ళు, "యేసయ్యా, మాపై జాలి చూపించు" అన్నారు.
\s5
\v 14 ఆయన వాళ్ళతో "మీరు పోయి యాజకునికి కనపడండి" అని వాళ్ళతో చెప్పాడు. వాళ్ళు వెళుతుండగా బాగుపడ్డారు.
\v 15 వాళ్ళలో ఒకడు తాను స్వస్థపడడం చూసుకొని, వెనక్కి తిరిగి వచ్చి ఎలుగెత్తి దేవుణ్ణి స్తుతించాడు.
\v 16 అతడు యేసు దగ్గరికి వచ్చి, నేలపై పడి, యేసు పాదాలపై తల ఆనించి ఆయనకి ధన్యవాదాలు తెలిపాడు. ఆ వ్యక్తి సమరయ జాతివాడు.
\s5
\v 17 అప్పుడాయన, "నేను పదిమంది కుష్ఠు రోగుల్ని బాగు చేసాను. మిగిలిన తొమ్మిదిమంది ఏమయ్యారు?
\v 18 ఈ పరదేశి ఒక్కడు మాత్రమే దేవునికి వందనాలు చెప్పడానికి తిరిగి వచ్చాడేమిటి? మిగిలినవాళ్ళు వెనక్కి రాలేదేం" అన్నాడు.
\v 19 అప్పుడు ఆయన అతనితో, "లేచి, నీ దారిన వెళ్ళు. నువ్వు నాపై నమ్మకం ఉంచినందుకు దేవుడు నిన్ను స్వస్థపరిచాడు" అన్నాడు.
\s5
\p
\v 20 ఒక రోజు యేసును కొందరు పరిసయ్యులు, "దేవుడు అందరినీ ఏలడం ఎప్పుడు?" అని అడిగారు. ఆయన, "అది మనుషులు కళ్ళతో చూడగలిగే సూచనల్లా కాదు.
\v 21 "ఆయన ఇక్కడ పాలిస్తున్నాడు, అక్కడ పాలిస్తున్నాడు" అని మనుషులు చెప్పలేరు. ఎందుకంటే నీవు ఆలోచించే దానికి భిన్నంగా దేవుడు పరిపాలించడం ఎప్పుడో ప్రారంభించాడు.
\s5
\p
\v 22 యేసు తన శిష్యులతో, "మనుష్య కుమారుడైన నేను శక్తివంతంగా ఏలుతుండగా మేము చూడాలి అని మీరు అనుకునే సమయం ఒకటి వస్తుంది. కాని మీరు నన్ను చూడలేరు.
\v 23 మనుషులు మీతో, "క్రీస్తు అక్కడ ఉన్నాడు చూడండి, ఇక్కడ ఉన్నాడు చూడండి" అన్నప్పుడు మీరు ఆ మాటలు నమ్మకండి.
\v 24 ఆకాశంలో మెరుపు మెరిసి ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెలుగు కనిపించినట్టు ప్రతి ఒక్కరూ నన్ను చూడగలుగుతారు. అలాగే మనుష్యకుమారుడైన నేను, తిరిగి రావడం ప్రతి ఒక్కరూ చూస్తారు.
\s5
\v 25 కానీ అది జరగడానికి ముందు నేను ఎన్నో హింసల పాలౌతాను."
\p
\v 26 "నోవహు బ్రతికిన కాలంలోని ప్రజలు చేసినట్టు ఇప్పటి ప్రజలూ చేస్తారు.
\v 27 నోవహు తన భార్యాబిడ్డలతో ఓడలోకి ప్రవేశించేంత వరకూ ఆ కాలం ప్రజలు యదాలాపంగా తింటూ తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. తరువాత వరద వచ్చింది, ఓడలో లేని వాళ్ళందర్నీ నాశనం చేసింది.
\s5
\v 28 అదే విధంగా సొదొమ పట్టణంలో లోతు నివసిస్తున్నప్పుడు ప్రజలు తిని, తాగుతూ ఉండేవారు. వాళ్ళు వస్తువులు కొంటూ, అమ్ముతూ ఉన్నారు, పంటలు పండించారు, ఇల్లు కట్టుకున్నారు.
\v 29 కాని లోతు సొదొమ వదిలి వెళ్ళిపోయాక ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందర్నీ నాశనం చేసింది.
\s5
\v 30 అలాగే నేను మనుష్యకుమారుణ్ణి, ప్రజలు సిద్ధంగా లేనప్పుడు భూమికి తిరిగివస్తాను.'
\p
\v 31 "ఆ రోజు బయట ఉన్న వాళ్ళందరూ తమ వస్తువులు ఇళ్ళల్లో ఉన్నాకూడా వాటిని తీసుకోడానికి ఇంట్లోకి వెళ్ళకూడదు. అలాగే పొలంలో పని చేసే వాళ్ళు దేన్నైనా తెచ్చుకోడానికి వెనక్కి వెళ్ళకూడదు. తొందరగా పారిపోవాలి."
\s5
\p
\v 32 "లోతు భార్యకు సంభవించింది గుర్తు తెచ్చుకోండి.
\v 33 తన సొంత దారిలో బ్రతకడం కొనసాగించే ప్రతి వాడు చస్తాడు. కాని నా కారణంగా తన పద్ధతి మార్చుకున్నవాడు శాశ్వతకాలం బ్రతుకుతాడు."
\s5
\p
\v 34 "నేను తిరిగి వచ్చిన రాత్రి ఒక మంచం మీద ఇద్దరు నిద్రపోతుంటే, నాలో విశ్వాసం ఉంచినవాణ్ణి దేవుడు పరలోకానికి తీసుకు పోతాడు, ఇంకొకడు ఉండిపోతాడని నేను మీకు చెప్తున్నాను.
\v 35 ఇద్దరు ఆడవాళ్లు తిరగలి విసురుతుంటే, ఒకామె వెళ్ళిపోతుంది. మరొకామె ఉండిపోతుంది" అన్నాడు.
\p
\v 36 ఆయన శిష్యులు ఆయనతో, "స్వామీ, ఇవి ఎక్కడ జరుగుతాయి?"
\s5
\v 37 అని అడిగారు. ఆయన జవాబిస్తూ, "శవం ఎక్కడ ఉంటే అక్కడ రాబందులు దాన్ని తినడానికి పోగవుతాయి" అన్నాడు.
\s5
\c 18
\p
\v 1 యేసు వెంటనే జవాబు రాని ప్రార్థనలకు నిరుత్సాహ పడకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలని తన శిష్యులకు చెప్పడానికి ఇంకొక కథ వాళ్ళకి చెప్పాడు.
\v 2 "ఒక ఊరిలో దేవుడంటే గౌరవించని, ప్రజల్ని పట్టించుకోని పొగరుబోతు న్యాయాధిపతి ఉన్నాడు.
\s5
\v 3 ఆ ఉళ్ళో ఒక వితంతువు ఆ న్యాయాధిపతి దగ్గరికి మాటిమాటికీ వస్తూ, "న్యాయస్థానంలో నామీద కేసు వేసిన మనిషి నుండి నాకు న్యాయం తీర్చండి" అని అడుగుతూ ఉండేది.
\v 4 చాలా కాలం ఈ న్యాయాధిపతి ఆమెను పట్టించుకోలేదు. కాని తరువాత అతడు తనలో, "నేను దేవుణ్ణి లెక్కచెయ్యను, మనుషులను పట్టించుకోను.
\v 5 మరయితే ఈ వితంతువు నా ప్రాణాలు తోడేస్తున్నది. ఏం జేస్తాం, ఆమెకి న్యాయంగా తీర్పు చెప్పేస్తే, పీడ విరగడ అవుతుంది, మాటిమాటికీ ఆమె నా దగ్గరకు రాకుండా, విసిగించకుండా ఉంటుంది గదా" అనుకున్నాడు."
\s5
\p
\v 6 యేసు ఇలా చెప్పి, "ఈ అన్యాయమైన న్యాయాధిపతి ఏమన్నాడో జాగ్రత్తగా ఆలోచించండి.
\v 7 న్యాయం తీర్చే దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలు రాత్రింబవళ్ళు తనను ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి మరింత ఖాయంగా న్యాయం తీర్చడా? వాళ్ళ విషయంలో ఆయన ఎప్పుడూ సహనంతో ఉంటాడు.
\v 8 దేవుడు తాను ఏర్పరచుకున్న వాళ్ళకి ఇంకా తొందరగా న్యాయం చేస్తాడని నేను చెప్తున్నాను. మనుష్య కుమారుణ్ణి అయిన నేను తిరిగి భూమికి వచ్చినప్పుడు ఇంకా నన్ను నమ్మనివాళ్ళు చాలామంది ఉంటారు" అన్నాడు.
\s5
\p
\v 9 తరువాత తామే నీతిమంతులమనుకుని, ఇతరుల్ని చిన్నచూపు చూసే వాళ్ళ గురించి కూడా యేసు ఈ కథ చెప్పాడు.
\v 10 "ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసుకోవడానికి యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. ఒక వ్యక్తి పరిసయ్యుడు, ఇంకొక వ్యక్తి రోమన్ ప్రభుత్వం తరుపున ప్రజల నుండి పన్నులు వసూళ్లు చేసేవాడు.
\s5
\v 11 ఆ పరిసయ్యుడు నిలబడి తన గురించి ఇలా ప్రార్థన చేసుకున్నాడు, "ఓ దేవా, ఇతరుల్లా నేను లేనందుకు వందనాలు. కొందరు దొంగతనం చేస్తారు. కొందరు అన్యాయం చేస్తారు. కొందరు వ్యభిచారం చేస్తారు. నేను అవేవీ చేయను. ప్రజల్ని మోసగించే పాపాత్ములైన పన్ను వసూలుదారుల వంటి వాణ్ణి కాదు నేను.
\x -
\xo 18.11
\xt
\x*
\v 12 నేను వారంలో రెండు రోజులు ఉపవాసం ఉంటాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు దేవాలయంలో చెల్లిస్తాను."
\s5
\p
\v 13 "మరోవైపు ఒక పన్ను వసూలుదారుడు దేవాలయ ప్రాంగణంలో తక్కిన వాళ్లకి దూరంగా నిలబడ్డాడు. అతడు ఆకాశం వైపు కూడా చూడడానికి సాహసించలేదు. గుండెలు బాదుకుంటూ, "దేవా, నాపై జాలి చూపి నన్ను క్షమించు. నేను భయంకరమైన పాపిని" అని ప్రార్థన చేసాడు."
\v 14 ఇలా చెప్పి యేసు, "పన్ను వసూలుదారుడు క్షమాపణ పొంది ఇంటికి పోయాడు. పరిసయ్యుడికి క్షమాపణ దొరకలేదు. ఇది ఎందుకు చెప్పానంటే తనను గొప్ప చేసుకొనే వాణ్ణి దేవుడు తగ్గిస్తాడు. తనను తగ్గించుకొనేవాణ్ణి ఘనపరుస్తాడు."
\s5
\p
\v 15 ఒక రోజు యేసు తమ చిన్న పిల్లలపై చెయ్యి వేసి దీవించాలని ప్రజలు వాళ్ళ బిడ్డల్ని తెచ్చారు. శిష్యులు చూసి, వాళ్ళను ఆపారు.
\v 16 కాని యేసు చిన్న పిల్లలను తన దగ్గరికి తెమ్మన్నాడు. ఆయన, "చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానీయండి. వాళ్ళని ఆపకండి! ఈ పిల్లల్లా నమ్రతగా ఉండి, నమ్మిక ఉంచిన వాళ్ళని దేవుడు పాలించడానికి ఇష్టపడతాడు.
\v 17 నిజానికి చిన్న బిడ్డలా తగ్గింపుతో తమపై దేవుడు ప్రభుత్వం చెయ్యడానికి అంగీకరించకపోతే అలాటి వ్యక్తిని దేవుడు అంగీకరించడు. నేను మీకు చెప్తున్నాను వినండి" అన్నాడు.
\s5
\p
\v 18 ఒకసారి ఒక యూదీయ నాయకుడు యేసును, "సద్బోధకా, నిత్య జీవం పొందాలంటే నేను ఏమి చెయ్యాలి?" అని అడిగాడు.
\v 19 యేసు అతనితో, "నన్ను మంచివాడు అని ఎందుకంటున్నావు? నిజంగా మంచివాడు దేవుడు ఒక్కడే.
\v 20 ఇక నీ ప్రశ్నకు జవాబు. దేవుడు మోషే ద్వారా మనకు ఇచ్చిన ఆజ్ఞలు నీకు బాగా తెలుసుగా. వ్యభిచారం చెయ్యొద్దు, హత్య చెయ్యొద్దు, దొంగిలించొద్దు, తప్పుడు సమాచారం ఇవ్వొద్దు, నీ తలిదండ్రుల్ని గౌరవించాలి, అనేవి."
\v 21 అతడు, "తెలుసు. చిన్నప్పటి నుండి నేను ఆ ఆజ్ఞలన్నీ పాటిస్తూనే ఉన్నాను" అన్నాడు.
\s5
\v 22 అది విని యేసు "నువ్వు మరొక్కటి చెయ్యాలి. నీకు ఉన్నదంతా అమ్మి, ఆ డబ్బు పేదలకు ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు ధనం వస్తుంది. తరువాత నా శిష్యుడిగా వచ్చెయ్యి" అన్నాడు.
\p
\v 23 అతడు చాలా ధనవంతుడు గనక అది విని హతాశుడయ్యాడు.
\s5
\v 24 అతడలా మొహం మాడ్చుకోవడం చూసి యేసు కూడా చాలా బాధపడ్డాడు. ఆయన, "దేవుని పరిపాలన కిందికి ఐశ్వర్య వంతులు రావడం చాలా కష్టం,
\v 25 నిజానికి ధనికుల జీవితాలు దేవుని ఏలుబడి క్రిందికి రావడం కంటే సూది కన్నంలో ఒంటె దూరడం సులువు."
\s5
\p
\v 26 యేసు చెప్పిన ఈ మాటలు విన్నవాళ్ళు, "అలాగైతే ఇక రక్షణ పొందేది ఎవరు మరీ?" అన్నారు.
\v 27 కాని యేసు, "మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే"అన్నాడు.
\s5
\v 28 అప్పుడు పేతురు, "చూడు, మేము అన్నీ వదిలి నీ శిష్యులుగా ఉండడానికి వచ్చాము" అన్నాడు.
\v 29 యేసు వాళ్ళతో, "ఔను. నేను కూడా చెప్తున్నాను. తమ ఇల్లూవాకిలీ వదులుకున్న వాళ్ళు, భార్యాబిడ్డలనూ, సోదరులనూ తలిదండ్రులనూ వదులుకున్న వాళ్ళు, తమను దేవుని ఇష్టానికి సమర్పించుకున్న వాళ్ళు,
\v 30 వీళ్ళంతా వదులుకున్న దాని కంటే ఎన్నో రెట్లు తమ జీవితాల్లో పొందుతారు. తరువాతి కాలంలో నిత్య జీవం పొందుతారు.
\s5
\p
\v 31 యేసు పన్నెండు మంది శిష్యుల్ని ఒక పక్కకి పిలిచి, "జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు యెరూషలేము వెళ్తున్నాం. మనం అక్కడ ఉండగా నా గురించి అంటే మనుష్య కుమారుణ్ణి గురించి చాలా కాలం క్రితం ప్రవక్తలు రాసినవి నెరవేరబోతున్నాయి.
\v 32 నా శత్రువులు నన్ను యూదేతరులకు పట్టిస్తారు. వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తారు, నా పట్ల అసహ్యంగా ప్రవర్తిస్తారు, నా మీద ఉమ్మి వేస్తారు.
\v 33 వాళ్ళు నన్ను కొరడాలతో కొట్టి, నన్ను చంపుతారు. తరువాత మూడవ రోజు నేను తిరిగి సజీవంగా లేస్తాను" అని చెప్పాడు.
\s5
\v 34 కాని ఆయన చెప్పిన సంగతులేవీ శిష్యులకు అర్థం కాలేదు. ఆయన చెప్పినవి వాళ్లకు అర్థం కాకుండా దేవుడు చేసాడు.
\s5
\p
\v 35 యేసు, ఆయన శిష్యులు యెరికో పట్టణం దగ్గరికి వచ్చినప్పుడు ఒక గుడ్డి వాడు దారి ప్రక్కన కూర్చునీ ఉన్నాడు. అతడు దారి పక్కన కూర్చుని అడుక్కుంటున్నాడు.
\v 36 అతడు దారిన పోయే జనం సందడి విని, వాళ్ళను "ఏం జరుగుతోంది బాబయ్యా?" అని అడిగాడు.
\v 37 వాళ్ళు, "నజరేతు ఊరివాడు యేసు వస్తున్నాడు" అని చెప్పారు.
\s5
\v 38 అతడు వెంటనే "దావీదు కుమారా యేసయ్యా, నాపై జాలి చూపించు" అని గొంతు చించుకుని అరవసాగాడు.
\v 39 ఆ గుంపులో నడిచేవాళ్ళు అతన్ని నోరు మూసుకోమని తిట్టారు. కాని అతడు అంతకంటే గట్టిగా అరుస్తూ, "దావీదు రాజు సంతతి వాడా, నాపై జాలి చూపించు" అని గగ్గోలు పెట్టాడు.
\s5
\p
\v 40 యేసు ఆగి, అతన్ని తన దగ్గరికి తెమ్మని ఆజ్ఞాపించాడు.
\v 41 ఆ గుడ్డ్డివాడు దగ్గరికి వచ్చినప్పుడు యేసు అతన్ని, "ఏం కావాలి?" అని అడిగాడు. అతడు, "స్వామీ, నేను చూడగలిగేలా చెయ్యి" అన్నాడు.
\s5
\v 42 యేసు అతనితో, "నువ్వు నాలో విశ్వాసం ఉంచావు గాబట్టి నేను నిన్ను స్వస్థపరిచాను" అన్నాడు.
\v 43 వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసుతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా ఇది చూసి వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించారు.
\s5
\c 19
\p
\v 1 యేసు యెరికో అనే ఊరు చేరి దారి వెంట నడుస్తున్నాడు.
\v 2 అక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతడు పన్నుల వసూలుదారు, చాలా ధనవంతుడు.
\s5
\v 3 జక్కయ్య పొట్టివాడు. అతనికి యేసును చూడాలని ఉంది కాని జనం చుట్టూ మూగి ఉండడంతో చూడలేకపోయాడు. యేసు చుట్టూ చాలామంది గుమికూడి ఉన్నారు.
\v 4 కాబట్టి దారిలో కొంచెం ముందుకు వెళ్ళి, యేసు అక్కడికి వచ్చే సరికల్లా తనకు కనిపించేలా ఒక మేడి చెట్టు ఎక్కాడు.
\s5
\v 5 యేసు అక్కడికి వచ్చినప్పుడు, ఆగి కి చూసి, "జక్కయ్యా, త్వరగా చెట్టు దిగిరా, ఈ రాత్రికి నేను నీ ఇంట్లో ఉంటాను" అన్నాడు.
\v 6 కాబట్టి అతడు వెంటనే చెట్టు దిగాడు. సంబరపడుతూ యేసును ఇంటికి తీసుకుపోయాడు.
\v 7 కాని ఆయన్ని అక్కడ చూసిన వాళ్ళందరూ,"ఆయన ఒక పాపాత్ముడి ఇంటికి అతిథిగా వెళ్ళాడు!" అని సణుక్కున్నారు
\s5
\p
\v 8 వాళ్ళు భోజనం చేస్తూండగా జక్కయ్య నిలబడి యేసుతో, "ప్రభూ! నాకు ఉన్న దానిలో సగభాగం బీద వాళ్ళకి ఇచ్చేస్తాను. నేను మోసంగా డబ్బు గుంజిన వాళ్ళకి నాలుగు రెట్లు మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాను" అన్నాడు.
\v 9 యేసు అతనితో, "ఇతడు తాను నిఖార్సైన అబ్రాహాము సంతానం వాడని చూపించుకున్నందుకు ఈ రోజు దేవుడు ఈ ఇంటిల్లిపాదినీ రక్షించాడు.
\v 10 ఇది గుర్తుంచుకో. నేను మనుష కుమారుణ్ణి, దేవుని నుండి దారి తప్పిన నీలాంటి వాళ్ళని కనిపెట్టి రక్షించడానికే వచ్చాను."
\s5
\p
\v 11 యేసు చెప్పిందంతా ప్రజలు వింటున్నారు. యెరూషలేము పరిసరాల్లోకి వస్తుండగా యేసు వాళ్ళకి ఇంకొక కథ చెప్పాలనుకున్నాడు. యెరూషలేము చేరిన వెంటనే దేవుని ప్రజల పై ఆయన రాజుగా ఏలుతాడు అనుకొనే వాళ్ళ ఉద్దేశం సరిచేయడానికి ఈ కథ చెప్పాలని ఆయన ఉద్దేశం.
\p
\v 12 "ఒక యువరాజు తను నివసించే దేశ ప్రజలను రాజుగా పరిపాలించే అధికారం కోసం దూర దేశంలో తన పైన అధికారిగా ఉన్న రాజు నుండి హక్కును అడిగి సంపాదించుకోడానికి వెళ్ళాడు.
\s5
\v 13 వెళ్ళే ముందు తన సేవకుల్లో పదిమందిని పిలిచాడు. వాళ్ళందరికీ సమానంగా డబ్బు ఇచ్చి, "నేను వచ్చేంత వరకు ఈ డబ్బుతో వ్యాపారం చెయ్యండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.
\v 14 కాని అతని దేశ ప్రజలు చాలామందికి అతడంటే ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు అతని పై అధికారిగా ఉన్న రాజుకు, "ఇతడు మాకు రాజుగా ఉండడం మాకు ఇష్టం లేదు" అని చెప్పడానికి రాయబారుల్ని పంపారు.
\p
\v 15 కాని ఎలా అయితేనే అతడు రాజయ్యాడు. తిరిగి కొత్త రాజుగా అతడు స్వదేశం వెళ్ళాడు. తాను డబ్బు ఇచ్చిన సేవకుల్ని పిలిచాడు. తను ఇచ్చిన డబ్బుతో ఎంత వ్యాపారం చేసారో తెలుసుకోడానికి వారిని పిలిచాడు.
\s5
\p
\v 16 మొదటి వ్యక్తి అతని దగ్గరికి వచ్చి, "అయ్యగారూ, మీరిచ్చిన డబ్బుతో అంతకు పది రెట్లు సంపాదించాను" అన్నాడు.
\v 17 ఆ రాజు అతనితో, "సెభాష్, నువ్వు మంచి సేవకుడివి. చాలా బాగా చేసావు. నీకిచ్చిన కొద్ది డబ్బు జాగ్రత్త చేసి, నమ్మకంగా పనిచేసావు. నువ్వు పరిపాలించడానికి పది ఉర్లు ఇస్తాను" అన్నాడు.
\s5
\p
\v 18 తరువాత రెండవ సేవకుడు వచ్చి, "అయ్యగారూ, మీరు ఇచ్చిన డబ్బు ఇప్పుడు ఐదు రెట్లు అయ్యింది" అన్నాడు.
\v 19 అతడు ఆ సేవకుడితో, "బాగా చేసావు. నిన్ను ఐదు ఊర్లపై నియమిస్తాను" అన్నాడు.
\s5
\p
\v 20 అప్పుడు ఇంకొక సేవకుడు వచ్చి, "అయ్యగారూ, ఇదుగో మీ డబ్బు. గుడ్డలో చుట్టి భద్రంగా దాచిపెట్టాను.
\v 21 వ్యాపారం సాగకపోతే నువ్వు నన్ను ఏం చేస్తావో అని భయపడ్డాను. నువ్వు నీది కానిది ఇతరుల నుండి లాక్కొనేంత కఠినాత్ముడివనీ, ఇంకొకళ్ళు నాటిన పంటను కోసుకునే వాడివనీ నాకు తెలుసు" అన్నాడు.
\s5
\v 22 ఆ రాజు వాడితో, "ఓరీ దుష్టుడా, నీ మాటల మీదనే నిన్ను శిక్షిస్తాను. నేను కఠినాత్ముడినని నీకు తెలుసు. నాది కానిది నేను తీసుకుంటాననీ, నేను నాటని పంటను కోస్తాననీ నీకు తెలుసు.
\v 23 మరి అలాంటప్పుడు నా డబ్బును వడ్డీకి ఇవ్వొచ్చు గదా. నేను వచ్చి అసలూ వడ్డీ కూడా పుచ్చుకునే వాణ్ణి గదా" అన్నాడు.
\s5
\v 24 తన దగ్గర నిలబడిఉన్న వాళ్ళతో, "వీడి దగ్గరున్న డబ్బు తీసేసుకుని పది రెట్లు సంపాదించిన వాడికి ఇవ్వండి" అన్నాడు.
\p
\v 25 వాళ్ళు, "అయ్యా, సరేగానీ అతనికి ఇప్పటికే చాలా డబ్బు ఉంది కదా?" అన్నారు.
\s5
\v 26 అప్పుడు రాజు, "తన దగ్గరున్న దాన్ని బాగా వినియోగించే వాళ్ళకి నేను ఇంకా ఇస్తాను. కానీ ఉన్నది ఉపయోగించని వాళ్ళ దగ్గర నుండి వాళ్ళకి ఉన్నది కూడా తీసేస్తాను.
\v 27 నా అధికారం ఇష్టం లేదని పై రాజుకు కబురు పంపిన నా శత్రువులను ఇప్పుడు నా దగ్గరికి తీసుకువచ్చి, నేను చూస్తుండగా వాళ్ళని వధించండి" అన్నాడు."
\s5
\p
\v 28 ఈ విషయాలు యేసు చెప్పాక, ఆయన యెరూషలేము వెళ్ళే దారిలో శిష్యులకు ముందుగా నడక కొనసాగించాడు.
\s5
\v 29 ఒలీవల కొండ దగ్గర బేత్పగే, బేతనీ గ్రామాల దగ్గరికి వెళ్తూండగా
\v 30 ఆయన తన శిష్యులలో ఇద్దరితో, "మీ ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే ఎవరూ ఎక్కని ఒక గాడిద పిల్ల కట్టి ఉంటుంది. దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకురండి.
\v 31 ఎవరైనా మిమ్మల్ని "గాడిదను ఎందుకు విప్పుతున్నారు?" అని అడిగితే, "ప్రభువుకు కావాలి" అని చెప్పండి" అన్నాడు.
\s5
\v 32 ఆ ఇద్దరు శిష్యులు ఆ గ్రామానికి వెళ్లారు. యేసు చెప్పినట్టే ఆ గాడిద కనిపించింది.
\v 33 వాళ్ళు దాన్ని విప్పుతుండగా ఆ గాడిద సొంతదారు "మా గాడిదను ఎందుకు విప్పుతున్నారు?" అని అడిగాడు.
\v 34 వాళ్ళు, "ఇది ప్రభువుకు అవసరం" అన్నారు.
\p
\v 35 అప్పుడు శిష్యులు గాడిదను యేసు దగ్గరికి తెచ్చారు. వాళ్ళ పైబట్టల్ని గాడిద మీద వేసి, యేసును దానిపై ఎక్కించారు.
\v 36 అప్పుడు ఆయన దానిపై స్వారీ చేస్తూ వెళ్తూండగా ప్రజలు వాళ్ళ పైబట్టలు దారి పొడవునా గౌరవార్ధంగా ఆయన ఎదుట రోడ్డు మీద పరిచారు.
\s5
\p
\v 37 ఒలీవల కొండ పైనుండి దిగి వెళ్ళే దారిలో వాళ్ళు వస్తూండగా ఆయన శిష్యుల సమూహమంతా ఉత్సాహంతో యేసు చేసిన అద్భుతాలు తాము చూసినందుకు దేవునికి బిగ్గరగా స్తుతి చెల్లించారు.
\v 38 "దేవుని అధికారంతో వచ్చిన మన రాజును దేవుడు దీవించును గాక! దేవునికి, ఆయన ప్రజలైన మనకు మధ్య శాంతి ఉండును గాక! ప్రతి వారూ దేవుని స్తుతించండి!" అని చెప్పారు.
\s5
\p
\v 39 ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు ఆయనతో, "బోధకా, అలా చెప్పకుండా నీ శిష్యుల్ని ఆపు" అన్నారు.
\v 40 ఆయన, "నేను మీతో చెప్తున్నాను. ఈ ప్రజలు మౌనంగా ఉంటే రాళ్ళు వాటికవే నన్ను స్తుతిస్తూ హర్షధ్వానాలు చేస్తాయి" అన్నాడు.
\s5
\p
\v 41 యేసు యెరూషలేము పట్టణానికి దగ్గరలో ఉండగా ఆయన ఆ ప్రజల విషయంలో విలపించాడు.
\v 42 "దేవుని శాంతిని ఎలా పొందాలో నేటికి మీకు తెలుస్తుందనుకున్నాను. కాని ఇప్పుడు మీకు తెలియలేదు.
\s5
\v 43 త్వరలో మీ శత్రువులు వచ్చి, మీ పట్టణం చుట్టూ ముట్టడి వేస్తారు. పట్టణాన్ని చుట్టుముట్టి, అన్ని వైపుల నుండి దాడి చేస్తారు.
\v 44 కోట గోడలు పడగొట్టి, సమస్తం నాశనం చేస్తారు. మిమ్మల్ని, మీ పిల్లల్ని హతమారుస్తారు. వాళ్ళు అంతా నాశనం చేయడం పూర్తయ్యాక అక్కడ ఒక్క రాయి కూడా ఒక దానిపై ఒకటి మిగలదు. మరి దేవుడు మిమ్మల్ని రక్షించడానికి వచ్చినప్పుడు మీరు గ్రహించలేదు కదా."
\s5
\p
\v 45 యేసు యెరూషలేములోకి ప్రవేశించాక దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళాడు. అక్కడ సరుకులు అమ్మే వాళ్ళను వెళ్ళగొట్టడం మొదలుపెట్టాడు.
\v 46 ఆయన,
\q1 "నా ఇల్లు జనులు ప్రార్థన చేసేదిగా ఉండాలి అని రాసి ఉంది. కాని మీరు దాన్ని దొంగలు దాక్కునే స్థావరంగా మార్చేసారు" అన్నాడు.
\s5
\p
\v 47 ఆ వారం అంతా యేసు దేవాలయ ప్రాంగణంలో బోధించాడు. ప్రధాన యాజకులు, మతాధికారులు, ఇతర యూదీయ నాయకులు ఆయన్ని చంపడానికి ఉపాయం కోసం చూస్తున్నారు.
\v 48 కాని సామాన్య ప్రజలు ఆయన చెప్పేది వినడానికి వేగిర పడుతుండడంతో వాళ్ళకి దారీ తెన్నూ తోచలేదు.
\s5
\c 20
\p
\v 1 యేసు ఒక రోజు దేవుని సువార్త చెప్తూ, దేవాలయ ప్రాంగణంలో ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రధాన యాజకులు, యూదీయ నాయకులు, ఇతర పెద్దలూ ఆయన దగ్గరికి వచ్చారు.
\v 2 వాళ్ళు ఆయనతో, "ఈ పనులు చేయడానికి నీకు హక్కు ఉందా? ఈ హక్కు ఎవరిచ్చారు?" అని అడిగారు.
\s5
\p
\v 3 ఆయన జవాబిస్తూ, "నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను.
\v 4 యోహానుకు బాప్తిసం ఇమ్మని దేవుడు ఆజ్ఞాపించాడా, మనుషులు ఆజ్ఞాపించారా? చెప్పండి" అన్నాడు.
\s5
\v 5 అప్పుడు వాళ్ళు తమలోతాము కూడబలుక్కున్నారు. దేవుడు ఆజ్ఞాపించాడు అంటే మరి మీరు యోహానును ఎందుకు నమ్మలేదు? అంటాడు.
\v 6 యోహాను బాప్తిసం మనుషులు సృష్టించుకున్నది అంటే ప్రజలంతా యోహానును దేవుడు పంపిన మనిషిగా చూస్తున్నారు కాబట్టి మనల్ని రాళ్ళతో కొట్టి చంపుతారు.
\s5
\v 7 కాబట్టి వాళ్ళు "యోహానుకు బాప్తిసం ఇమ్మని ఎవరు చెప్పారో మాకు తెలియదు," అన్నారు.
\v 8 అప్పుడు యేసు, "అలాగైతే ఈ పనులు నన్ను ఎవరు చెయ్యమన్నారో నేను కూడా చెప్పను" అన్నాడు.
\s5
\p
\v 9 తరువాత యేసు ప్రజలతో ఈ కథ చెప్పాడు. "ఒక వ్యక్తి ద్రాక్ష తోట నాటించాడు. దాన్ని కౌలుకు ఇచ్చి, అతడు వేరే దేశం వెళ్ళి చాలా కాలం ఉన్నాడు.
\v 10 ద్రాక్ష పంట కోత కాలం వచ్చింది. ద్రాక్ష పంటలో తన వాటా ఇమ్మని కౌలు తీసుకున్న వాళ్ళ దగ్గరికి అతడు తన పనివాణ్ణి పంపాడు. కాని వాళ్ళు ద్రాక్షపళ్ళు ఇవ్వకుండా ఆ సేవకుణ్ణి కొట్టి పంపేశారు."
\s5
\p
\v 11 "తరువాత యజమాని మరొక పనివాణ్ణి పంపాడు. వాళ్ళు అతన్ని కూడా కొట్టి అవమానించారు. ద్రాక్ష పళ్ళు ఇవ్వకుండానే పంపేశారు.
\v 12 అయినాసరే, యజమాని ఇంకొక పనివాణ్ణి పంపాడు. వాళ్ళు ఈ మూడవ పనివాణ్ణి కూడా గాయపరచి, ద్రాక్ష తోట బయటికి తన్నితగలేసారు."
\s5
\p
\v 13 "అప్పుడు ద్రాక్ష తోట యజమాని తనలో, "ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నాకు ఎంతో ప్రియమైన నా కొడుకుని పంపుతాను. అప్పుడు వాళ్లు అతన్ని గౌరవించొచ్చు" అనుకున్నాడు.
\v 14 అలా అనుకుని అతడు తన కొడుకుని పంపాడు. యజమాని కొడుకు రావడం చూసి కౌలుదార్లు ఒకడితో ఒకడు, "ద్రాక్ష తోట వారసుడు. వాణ్ణి చంపితే ఈ ద్రాక్ష తోట మన సొంతమై పోతుంది." అనుకున్నారు.
\s5
\v 15 కాబట్టి వాళ్ళు యజమాని కొడుకుని ద్రాక్ష తోట బయటికి ఈడ్చుకుపోయి, చంపేశారు. ఇప్పుడు ద్రాక్ష తోట యజమాని ఏమి చేస్తాడో చెప్పనా?
\v 16 అతడు వెళ్ళి ద్రాక్ష తోట కౌలుదార్లను చంపేస్తాడు. వేరే వాళ్ళను ద్రాక్ష తోటను చూసుకోవడానికి నియమిస్తాడు." యేసు చెప్పింది విని ప్రజలు, "ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు" అన్నారు.
\s5
\v 17 యేసు వాళ్ళనే చూస్తూ, "మీరు అలా అనొచ్చు కానీ లేఖనాల్లో రాసిన ఈ మాటలు ఆలోచించండి.
\q1 ఇల్లు కట్టే మేస్త్రీలు వద్దని వదిలేసిన రాయి
\q1 మొత్తం నిర్మాణానికే కీలకమైన రాయి అయింది.
\q1
\v 18 ఈ రాయిమీద పడేవాళ్ళు ముక్కలు ముక్కలు అవుతారు,
\q1 అది ఎవరి మీద పడుతుందో వాళ్ళని తుత్తునియలు చేస్తుంది" అన్నాడు.
\s5
\p
\v 19 యేసు తమను నిందించడం కోసమే ఆ చెడ్డ కౌలు దారుల గురించిన కథ చెప్పాడని ప్రధాన యాజకులు, యూదీయ బోధకులు గ్రహించారు. అయితే ఆయన్ని పట్టుకుంటే ప్రజలు తమను ఏమి చేస్తారోనని భయపడి, ఆయన్ని ఎలాగైనా చెరపట్టే ఉపాయం వెదుకుతున్నారు.
\p
\v 20 వాళ్ళు ఆయనపై నిఘా ఉంచారు. నిజాయితీపరుల్లా నటించే మనుషుల్ని పంపారు. వాళ్లకు కావలసింది వాళ్ళు యేసును నిందించడానికి ఏదో ఒక వంక, ఆయన తప్పు మాట్లాడేలా చేసి నేరం మోపి ప్రాంతీయ అధిపతి దగ్గరికి తీసుకుపోవడం.
\s5
\v 21 వాళ్ళల్లో ఒక గూఢచారి, ఒకసారి ఆయనతో "నువ్వు ఎప్పుడూ చాలా న్యాయంగా మాట్లాడుతూ బోధిస్తావని మాకు తెలుసు. పై వాళ్ళకి నచ్చకపోయినా నువ్వు నిజమే చెప్తావు. మనం ఏమి చెయ్యాలని దేవుడు అనుకుంటాడో, అది నువ్వు న్యాయంగా బోధిస్తావు.
\v 22 కాబట్టి ఈ విషయంలో నువ్వు ఏమి అనుకుంటున్నావో చెప్పు. రోమన్ ప్రభుత్వానికి మనం పన్ను చెల్లించడం సరైనదేనా కాదా?" అని అడిగాడు.
\s5
\v 23 కాని పన్ను కట్టడానికి ఇష్టపడని యూదుల తరుపున మాట్లాడాలో, లేక రోమన్ ప్రభుత్వం తరుపున మాట్లాడాలో తేల్చుకోలేక తాను ఇరుకున పడాలనే వాళ్ళు అలా అడిగారని యేసుకు తెలుసు. కాబట్టి ఆయన వాళ్ళతో,
\v 24 "నాకు రోమన్ నాణెం ఒకటి చూపించి, దానిపై ఎవరి బొమ్మ ఉందో ఎవరి పేరు ఉందో చెప్పండి" అన్నాడు. వాళ్ళు ఆయనకి ఒక నాణెం చూపించి, "రోమన్ ప్రభుత్వ అధిపతి సీజర్ బొమ్మ, పేరు ఉన్నాయి" అని చెప్పారు.
\s5
\v 25 ఆయన వాళ్ళతో, "ప్రభుత్వానికి చెందింది ప్రభుత్వానికీ, దేవునికి చెందింది దేవునికీ ఇవ్వండి" అన్నాడు.
\v 26 ఆ గూఢచారి ఆయన జవాబుకు ఆశ్చర్యపోయాడు. మళ్ళీ నోరెత్తలేక పోయాడు. వాళ్ళు తప్పు పట్టగలిగే మాటలు ఏమీ తన చుట్టూ ఉన్న ప్రజల ఎదుట యేసు అనలేదు.
\s5
\p
\v 27 ఆ తరువాత కొందరు సద్దూకయులు యేసు దగ్గరికి వచ్చారు. వీళ్ళు చనిపోయినవాళ్ళు తిరిగి బతకరు అనీ నమ్మే వర్గం.
\v 28 వీళ్ళు కూడా యేసును ఒక ప్రశ్న అడగాలనుకున్నారు. వాళ్ళల్లో ఒకడు "బోధకా, ఎవరైనా పిల్లలు లేకుండా చనిపోతే , అతని సోదరుడు అతని భార్యను అంటే ఆ వితంతువును పెళ్ళి చేసుకోవాలి. అప్పుడు అతని ద్వారా ఆమె పిల్లల్ని కనవచ్చు. ఈ విధంగా ఆ పిల్లవాడు చనిపోయిన వ్యక్తి సంతానమని ప్రజలు పరిగణిస్తారు, అని మోషే రాసాడు గదా.
\s5
\v 29 ఒక కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములున్నారు. పెద్దవాడు ఒకామెను పెళ్ళి చేసుకొన్నాడు, కాని పిల్లలు కలగకుండానే చనిపోయాడు. ఆమెను విధవరాలు అయిపోయింది.
\v 30 అతని మొదటి తమ్ముడు ఈ ఆజ్ఞ ప్రకారం ఆ వితంతువును పెళ్ళి చేసుకున్నాడు. కాని అతడు కూడా అలాగే చనిపోయాడు.
\v 31 అప్పుడు రెండవ తమ్ముడు ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. అతడు కూడా చనిపోయాడు. అలాగే ఏడుగురు అన్నదమ్ములు ఒకరి తరువాత ఒకరు ఆ స్త్రీని పెళ్ళిచేసుకున్నారు. కాని పిల్లలు కలగలేదు. ఒకరి తరువాత ఒకరు చనిపోయారు.
\v 32 ఆ తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది.
\v 33 ఒకానొక సమయంలో చనిపోయినవాళ్ళు తిరిగి బ్రతుకుతారనేది నిజమైతే చనిపోయి బ్రతికిన తరువాత ఆమె ఎవరి భార్యగా ఉంటుంది? అన్నదమ్ములందర్నీ ఆమె పెళ్ళి చేసుకుందని మనస్సులో పెట్టుకో" అని ప్రశ్నించారు.
\s5
\p
\v 34 యేసు వాళ్ళకు జవాబిస్తూ, "ఈ లోకంలో తండ్రులు తమ కూతుళ్ళకు వివాహం చేస్తారు. పురుషులకు భార్యలు ఉంటారు.
\v 35 కాని దేవుడు ఎవరినైతే పరలోకంలో ఉండడానికి అర్హులుగా పరిగణిస్తాడో, చనిపోయి తిరిగి లేచాక వాళ్ళు పెళ్ళి చేసుకోరు.
\v 36 వాళ్ళు చనిపోరు కూడా. దేవుని దేవదూతల్లా ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు. వాళ్ళు దేవుని పిల్లలు. నూతన జీవంతో దేవుడు ఎవరినైతే లేపుతాడో వాళ్ళు దేవుని పిల్లలు."
\s5
\p
\v 37 "మండుతున్న పొద దగ్గర జరిగిన సంభాషణలో మోషే కూడా చనిపోయిన వాళ్ళని దేవుడు ఎలా బ్రతికిస్తాడో రాసాడు. అక్కడ దేవుణ్ణి, "అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు" అని పిలిచాడు. దేవుని ప్రజల నాయకులు చనిపోయాక ఇంకా వాళ్ళు ఇంకా దేవుణ్ణి కొనియాడుతూ ఆరాధిస్తూ ఉన్నారని మోషే తెలియచేసాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని సన్నిధిలో సజీవంగానే ఉన్నారు. దీన్ని బట్టి చనిపోయిన వాళ్ళను దేవుడు బ్రతికిస్తాడని తెలుస్తున్నది.
\v 38 ఆయన సజీవులకే దేవుడు, మృతులకు కాదు. మనందరం దేవునితో ఉండగలిగేలా మళ్ళీ ప్రాణం పొందుతాము. ఆయన సన్నిధిలో ఉండి ఆయన్ని సన్నుతిస్తాము" అని వారికి జవాబిచ్చాడు.
\s5
\p
\v 39 యూదీయ బోధకులు కొంతమంది "బోధకా, నువ్వు చాలా బాగా జవాబిచ్చావు" అన్నారు.
\v 40 ఆ తరువాత ఆయన్ని చిక్కుల్లో పెట్టాలని ప్రశ్నించే ధైర్యం ఎవరూ చెయ్యలేదు.
\s5
\v 41 తరువాత యేసు వాళ్లతో "క్రీస్తు దావీదు రాజు సంతతి వాడు మాత్రమే అని ప్రజలు చెప్పేది తప్పు అని నేను మీకు చూపిస్తాను."
\p
\v 42 "దావీదు కీర్తనల గ్రంథంలో క్రీస్తును గురించి,
\q1 "నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకూ,
\q1
\v 43 నీవు నా కుడి వైపున, అంటే నీకు ఘనతనిచ్చే చోట కూర్చోమని
\q1 ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు" అని రాశాడు."
\p
\v 44 "దావీదు రాజు క్రీస్తును "నా ప్రభువు" అంటున్నాడు. కాబట్టి క్రీస్తు కేవలం దావీదు రాజు సంతతికి చెందినవాడు మాత్రమే కాదు. నేను చెప్పినట్టు ఆయన దావీదు కంటే ఎంతో గొప్పవాడని రుజువౌతున్నది గదా" అన్నాడు.
\s5
\p
\v 45 అంతా వింటుండగా యేసు తన శిష్యులతో, "యూదీయ పండితుల్లా ఉండకుండా జాగ్రత్త పడండి. ప్రజలు తమను పెద్దమనుషులుగా అనుకోవాలని, పొడవాటి అంగీలు వేసుకొని తిరుగుతారు.
\v 46 వ్యాపార స్థలాల్లో ప్రజలు తమకు మర్యాదగా దండాలు పెట్టాలని చూస్తారు. వాళ్ళు సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థలం ఆశిస్తారు. విందుల్లో ఘనతగలవాళ్ళు కూర్చొనే చోట కూర్చోవాలని చూస్తారు.
\v 47 వాళ్ళు విధవరాళ్ళ ఆస్తులను కూడా కబ్జా చేస్తారు. బహిరంగంగా పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తారు. దేవుడు కచ్చితంగా వాళ్ళని కఠినంగా శిక్షిస్తాడు."
\s5
\c 21
\p
\v 1 యేసు తాను కూర్చున్న చోట నుండి ధనవంతులు దేవాలయం హుండీలో కానుకలు వేయడం గమనిస్తున్నాడు.
\v 2 ఒక పేదవితంతువు చాలా తక్కువ విలువున్న రెండు నాణాలు హుండీలో వేయడం చూసాడు.
\v 3 ఆయన తన శిష్యులతో "నిజం చెప్పమంటారా, ఈ ధనవంతులందరి కంటే ఈ పేద వితంతువు ఎక్కువ వేసింది.
\v 4 వాళ్ళందరికీ చాలా డబ్బుంది. కాని వాళ్ళకి ఉన్నదానిలో చాలా కొద్దిగా మాత్రమే ఇచ్చారు. కాని ఈమె పేదది ఐనా తన అవసరాలకు దాచుకున్నదంతా ఇచ్చేసింది."
\s5
\p
\v 5 "దేవాలయాన్ని అందమైన రాళ్ళతో, భక్తులు ఇచ్చిన కానుకలతో ఎంత బాగా అలంకరించారో గదా" అని యేసు శిష్యుల్లో కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.
\v 6 అది విని యేసు వాళ్ళతో "మీరు చూసే ఈ కట్టడాలు పూర్తిగా ధ్వంసమైపోతాయి. ఆ సమయం వచ్చినప్పుడు ఇక్కడ ఒకదాని మీద ఒకటిగా పెట్టిన ఒక్క రాయి కూడా ఉండదు" అన్నాడు.
\s5
\p
\v 7 అప్పుడు వాళ్ళు ఆయన్ని "బోధకా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇవి జరుగుతాయని ఎలా తెలుస్తుంది?" అని అడిగారు.
\v 8 యేసు జవాబిస్తూ, "మిమ్మల్ని ఎవరూ మోసం చేయకుండా చూసుకోండి. చాలామంది వచ్చి, "నేనే ఆయన్ని" అంటారు. ప్రతి వాళ్ళూ "నేనే క్రీస్తును" అంటారు. వాళ్ళు, "దేవుడు రాజుగా ఏలే కాలం వచ్చేసింది" అంటారు. అలాటి వారికి శిష్యులుగా వాళ్ళను వెంబడించొద్దు.
\v 9 జాతులు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. యుద్ధాల గురించి కూడా మీరు వింటారు, భయపడొద్దు. యుగాంతంలో ఇవన్నీ జరుగుతాయి.
\s5
\v 10 వివిధ వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. వివిధ దేశాల రాజులు ఒకరితో ఒకరు పోరాడతారు."
\p
\v 11 "కొన్ని చోట్ల పెను భూకంపాలు, కరువులు, ఘోరమైన తెగుళ్ళు వస్తాయి. ప్రజలను భయభ్రాంతుల్ని చేసే అరిష్టాలు కలుగుతాయి. ఏదో అనుహ్యమైనది జరగబోతుందని సూచించే విధంగా ఆకాశంలో ఉత్పాతాలు మీరు చూస్తారు."
\s5
\p
\v 12 "కానీ ఇవన్నీ జరగక ముందు మిమ్మల్ని బంధిస్తారు. హింసిస్తారు. మిమ్మల్ని పరీక్షించడానికి సమాజ మందిరాలలో అప్పగించి, జైల్లో పెట్టిస్తారు. నన్ను వెంబడిస్తూ ఉన్నారు కాబట్టి రాజులూ ఉన్నత ప్రభుత్వ అధికారుల సమక్షంలో మీపై విచారణ జరుగుతుంది.
\v 13 మీరు నా గురించి నిజం చెప్పే సమయం అదే."
\s5
\p
\v 14 "అలాటి సమయంలో మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో అని కంగారు పడకండి.
\v 15 మీకు జ్ఞానమిచ్చి, మీరు ఏమి చెప్పాలో సరైన మాటలు అందిస్తాను. దాని ఫలితంగా తప్పు చేసారని మిమ్మల్ని ఎవ్వరూ నిందించరు.
\s5
\v 16 మీలో కొందరికీ మీ స్వంత తలిదండ్రులు, సోదరులు, ఇతర బంధువులు నమ్మక ద్రోహం చేస్తారు.
\v 17 మొత్తం మీద నాపై విశ్వాసం ఉంచి నందుకు ప్రతివాళ్ళు మిమ్మల్ని ద్వేషిస్తారు.
\v 18 కాని మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు.
\v 19 మీరు కష్ట సమయాల్లో ఉన్నపుడు దేవుడిపై మీ విశ్వాసాన్ని నిరూపించుకుంటే మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు."
\s5
\p
\v 20 "యెరూషలేమును సైన్యం చుట్టుముట్టడం మీరు చూసినప్పుడు వాళ్ళు పట్టణాన్ని ధ్వంసం చేస్తారని మీకు తెలుస్తుంది.
\v 21 ఆ సమయంలో యూదయ ప్రాంతంలో ఉన్నవాళ్ళు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవాళ్ళు పట్టణాన్ని విడిచిపెట్టాలి. దగ్గర ప్రాంతంలో ఉన్నవాళ్ళు తిరిగి పట్టణంలోకి రాకూడదు.
\v 22 అది దేవుడు పట్టణాన్ని శిక్షించే కాలం. ఆయన అలా చేసినప్పుడు లేఖనాలు నెరవేరతాయి.
\s5
\v 23 దేవుని ఉగ్రత వాళ్ళపై ఉంటుంది కాబట్టి గొప్ప వేదన కలుగుతుంది. కాబట్టి ఆ రోజుల్లో గర్భవతుల, బాలింతల పరిస్థితి ఎంత ఘోరమో!"
\p
\v 24 "సాయుధ సైనికుల దాడుల్లో చాలామంది ప్రాణాలు పోతాయి. కొందర్ని బందీలుగా ప్రపంచమంతటా తరలిస్తారు. యూదేతరులను దేవుడు అనుమతించినంత కాలం వాళ్ళు తమ దళాలతో యెరూషలేము వీధులన్నీ తిరుగుతారు."
\s5
\p
\v 25 "ఈ కాలంలో సూర్య, చంద్ర నక్షత్రాల్లో విచిత్రమైన పోకడలు కనిపిస్తాయి. భూప్రజల గుండెలు అవిసిపోతాయి. సముద్ర ఘోషకి, ఉవ్వెత్తున లేచే తరంగాలకీ మనుషులు జడిసిపోయి చెల్లాచెదరు అవుతారు.
\v 26 తరువాత లోకంపైకి ఏమి ముంచుకు వస్తుందోనని వేచి చూస్తూ ప్రజలు గుండె చెదరి మూర్చపోతారు. ఆకాశంలో నక్షత్రాలు స్థానాలు తప్పుతాయి."
\s5
\p
\v 27 "అప్పుడు మనుష్య కుమారుడైన నేను కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగుతో, మేఘాల్లో బలప్రభావాలతో రావడం ప్రజలు చూస్తారు.
\v 28 కాబట్టి ఆ భయంకర సంఘటనలు జరిగినప్పుడు దేవుడు తొందరలో మిమ్మల్ని రక్షిస్తాడు కాబట్టి ధైర్యంగా నిలబడి ముందుకి సాగాలి."
\s5
\p
\v 29 అప్పుడు యేసు ఒక ఉపమానం చెప్పాడు. "అంజూరం చెట్లు, ఇతర చెట్లు చూడండి.
\v 30 వాటి ఆకులు చిగురించినప్పుడు ఎండాకాలం దగ్గరపడిందని మీకు తెలుస్తుంది.
\v 31 అదే విధంగా నేను వివరించినవి జరగడం చూసి, దేవుడు తొందరలో తనను రాజుగా కనుపరచుకుంటాడని మీకు తెలుస్తుంది.
\s5
\v 32 నేను మీకు నిజం చెప్తున్నాను, నేను మీకు వివరించినవన్నీ జరగక ముందు అంతం రాదు.
\v 33 నేను చెప్పిన సంగతులన్నీ కచ్చితంగా జరుగుతాయి. భూమి, ఆకాశం ఎప్పుడూ ఉంటాయని చెప్పలేం కాని, నేను చెప్పినవి మాత్రం జరిగి తీరుతాయి."
\s5
\p
\v 34 "మిమ్మల్ని మీరు హద్దుల్లో ఉంచుకోవాలి. తాగి తందనాలాడుతూ, విచ్చలవిడిగా ఉండే విందులకు వెళ్లొద్దు. మీ జీవితం గురించి చింతపడొద్దు. ఇలా జీవిస్తుంటే, నేను తిరిగి రావడానికి మీరు కనిపెడుతూ ఉండరు. ఆ సమయంలో నేను వచ్చి మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాను. ఒక జంతువు ఉచ్చులో ఇరుక్కున్నట్టు హెచ్చరిక లేకుండా నేను అకస్మాత్తుగా వస్తాను.
\v 35 నిజానికి నన్ను చూడడానికి మీరు సిద్ధంగా లేనప్పుడు నేను ఎలాటి హెచ్చరికా లేకుండా వస్తాను.
\s5
\v 36 కాబట్టి మీరు నా రాక కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈ కష్టాలగుండా సురక్షితంగా ముందుకు సాగాలన్నా, మనుష్య కుమారుడైన నేను లోకానికి తీర్పు ఇవ్వడానికి వచ్చినప్పుడు నిన్నునిరపరాధిగా ప్రకటించాలన్నా ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి."
\s5
\p
\v 37 ప్రతి రోజూ యేసు పగలు దేవాలయంలో బోధిస్తూ ఉండే వాడు. ప్రతి సాయంత్రం పట్టణం బయటికి వెళ్ళి ఒలీవల కొండపైన రాత్రంతా ఉండేవాడు.
\v 38 ప్రతి రోజూ ఉదయాన్నే ప్రజలందరూ ఆయన బోధ వినడానికి దేవాలయానికి వచ్చేవాళ్ళు.
\s5
\c 22
\p
\v 1 పస్కా అనే పొంగని రొట్టెల పండగ దగ్గర పడింది.
\v 2 యేసును ప్రజలు వెంబడించడం చూసి భయపడి ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు యేసును చంపడానికి కుట్రలు పన్నుతున్నారు.
\s5
\p
\v 3 పన్నెండు మంది శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు అనే యూదాలోకి సాతాను చొరబడ్డాడు.
\v 4 యేసును వాళ్లకు అప్పగించడం గురించి అతడు ప్రధాన యాజకుల, దేవాలయ సంరక్షణ అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు.
\s5
\v 5 అందుకు అతణ్ణి వాళ్ళు మెచ్చుకుని, డబ్బిస్తామన్నారు.
\v 6 యూదా దానికి అంగీకరించి, ఆయన చుట్టూ ప్రజల సమూహం లేనప్పుడు యేసును వాళ్ళు బంధించేలా సాయం చేయడానికి దారి వెదుకుతున్నాడు.
\s5
\p
\v 7 పొంగని రొట్టెల పండగ వచ్చింది. అది పస్కా గొర్రెలను వధించాల్సిన రోజు.
\v 8 కాబట్టి యేసు పేతురు, యోహానులతో, "అందరం కలిసి పస్కా పండగ భోజనం చెయ్యడానికి ఏర్పాట్లు చెయ్యండి." అన్నాడు.
\v 9 వాళ్ళు "భోజనం ఎక్కడ సిద్ధపరచాలి?" అని అడిగారు.
\s5
\v 10 ఆయన, "జాగ్రత్తగా వినండి. ఊర్లోకి వెళ్ళినప్పుడు నీటి కుండ ఎత్తుకుని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు ఎదురౌతాడు. అతడు వెళ్ళే ఇంట్లోకి మీరు కూడా వెళ్ళండి.
\v 11 ఆ ఇంటి యజమానితో, "మా గురువు గారు ఆయన శిష్యులమైన మాతో కలసి పస్కా భోజనం చేయడానికి గది చూపించమని అడుగుతున్నాడు" అని చెప్పండి.
\s5
\v 12 అతడు ఇంటి మిద్దె పై ఉన్న విశాలమైన గది చూపిస్తాడు. అతిథులకి కావలసినవి అన్నీఅక్కడ అమర్చి ఉంటాయి. అక్కడ మనకు భోజనం సిద్ధపరచండి" అన్నాడు.
\p
\v 13 ఇద్దరు శిష్యులు ఊర్లోకి వెళ్ళారు. యేసు చెప్పినట్టే వాళ్ళకి అన్నీ సమకూరాయి. పస్కా పండుగ భోజనాన్ని వాళ్ళు అక్కడ సిద్ధపరిచారు.
\s5
\p
\v 14 భోజన సమయం అయినప్పుడు యేసు అపొస్తలులతో కలిసి కూర్చున్నాడు.
\v 15 ఆయన వాళ్ళతో, "నేను హింస పొంది, చనిపోకముందు మీతో కలిసి ఈ భోజనం చెయ్యాలని ఎంతగానో అనుకున్నాను.
\v 16 దేవుడు పస్కాలో చేయడానికి మొదలుపెట్టింది ముగించాక, ప్రతి ఒక్కరినీ ప్రతి చోటా ఏలే సమయం వచ్చే వరకూ మళ్ళీ నేను ఈ భోజనం చేయనని మీతో చెప్తున్నాను" అన్నాడు. భోజనం అయ్యాక
\s5
\p
\v 17 ఆయన ఒక గిన్నెలో ద్రాక్షరసం తీసుకొని, దేవునికి వందనాలు చెప్పాడు. శిష్యులతో ఆయన, "ఇది తీసుకొని, మీరందరూ తాగండి.
\v 18 దేవుడు అందర్నీ అన్ని చోట్లా ఏలే కాలం వచ్చే దాకా నేను ద్రాక్షరసం తాగనని మీతో చెప్తున్నాను.
\s5
\v 19 తరువాత ఆయన రొట్టె తీసుకొని దేవునికి వందనాలు చెప్పాడు. ఆయన దాన్ని ముక్కలు చేసి, వాళ్ళకి తినడానికి ఇచ్చాడు. ఇలా చేసి ఆయన, "ఈ రొట్టె మీ కోసం అర్పించే నా శరీరం. తరువాత కూడా నన్ను ఘనపరచడానికి ఇది చేయండి.
\v 20 వాళ్ళు భోజనం తిన్నాక, ఆయన ద్రాక్షరసం గిన్నె తీసుకొని," ఇది మీ కోసం నేను చిందించే నా రక్తంతో చేసే కొత్త నిబంధన" అన్నాడు.
\s5
\p
\v 21 "కానీ చూడండి! నన్ను నా శత్రువులకి అప్పగించే వాడు నాతో కలిసి తింటున్నాడు.
\v 22 నిజానికి, మనుష్య కుమారుడైన నేను దేవుని ఏర్పాటు ప్రకారం చనిపోతాను. కానీ, నా శత్రువుల చేతికి నన్ను అప్పగించే వాడికి ఘోరమైన గతి పడుతుంది" అన్నాడు.
\p
\v 23 తరువాత అపొస్తలులు ఒకరినొకరు, "మనలో ఎవరు అలా చేస్తున్నారు?" అని అడగడం మొదలుపెట్టారు.
\s5
\v 24 ఆ తరువాత అపొస్తలులు ఒకరితో ఒకరు వాదించుకోవడం మొదలుపెట్టారు. "యేసు రాజు అయినప్పుడు మనలో ఎవరికి పెద్ద పదవి దక్కుతుంది?" అని మాట్లాడుకున్నారు.
\p
\v 25 యేసు వాళ్ళకి జవాబిస్తూ, "యూదేతర దేశాల రాజులు మేమే బలవంతులమని ప్రజలకి చూపించుకోవడానికి తమకు తాము "ధర్మదాతలు" అని బిరుదులు ఇచ్చుకుంటారు.
\s5
\v 26 కాని మీరు వాళ్ళలా ఉండకూడదు. మీలో ఎక్కువ ఘనత ఉన్న వాళ్ళు తక్కువవాడిలా ఉండాలి. నాయకుడు సేవకుడిలా ఉండాలి."
\p
\v 27 ప్రాముఖ్యమైన వ్యక్తి భోజనం బల్ల దగ్గర తింటాడుగానీ భోజనం వడ్డించే సేవకుడు తినడు. కాని నేను మీ సేవకుణ్ణి.
\s5
\v 28 నా బాధలన్నిటిలో నాతో ఉన్నది మీరే.
\v 29 కాబట్టి దేవుడు అందరినీ ఏలడం మొదలుపెట్టాక, రాజుగా ఏలడానికి దేవుడు నన్ను నియమించినట్టు నేను మిమ్మల్ని శక్తివంతులైన అధిపతులుగా నియమిస్తాను.
\v 30 నేను రాజునయ్యాక మీరు నాతో కూర్చొని భోజనం చేస్తారు. నిజానికి మీరు సింహాసనాలపైన కూర్చొని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాల ప్రజలకు తీర్పు చెప్పుతారు.
\s5
\p
\v 31 సీమోనూ! సీమోనూ! విను. ధాన్యాన్ని జల్లెడ పట్టినట్టు నిన్ను పరీక్ష చేయడానికి సాతాను దేవుణ్ణి అనుమతి కోరాడు. దేవుడు అనుమతించాడు కూడా.
\v 32 కాని నేను నీ కోసం ప్రార్థన చేసాను. సీమోనూ, నాపై విశ్వాసం కొంచెమైనా నీలో నిలిచే ఉంటుంది. కాబట్టి నువ్వు నా వైపుకు తిరిగినప్పుడు నీ సోదరులైన వీళ్ళకి నువ్వు ధైర్యం చెప్పు.
\s5
\v 33 పేతురు ఆయనతో," ప్రభూ, నేను నీతో చెరసాలకైనా సరే, వెళ్ళడానికి సిద్ధం. నీతో చనిపోవడానికి సైతం సిద్ధమే." అన్నాడు.
\v 34 యేసు, "పేతురూ, నీకు ఒకటి చెప్పాలి. ఈ రాత్రి కోడి కూయక ముందు నీకు నేను తెలియదని మూడు సార్లు అబద్ధమాడతావు" అని జవాబిచ్చాడు.
\s5
\p
\v 35 తరువాత యేసు శిష్యులను "నేను మిమ్మల్నిగ్రామాలకు పంపినప్పుడు మీరు డబ్బు తీసుకెళ్ళలేదు. ఆహారం, చెప్పులు కూడా. అయినా మీ అవసరాలు తీరనివి ఏవైనా ఉన్నాయా?" అని అడిగాడు. వాళ్ళు "లేదు" అని చెప్పారు.
\v 36 ఆయన, "కానీ ఇప్పుడు మీలో ఎవరిదగ్గరైనా కొంచెం డబ్బు ఉంటే అతడు దాన్ని తనతో తీసుకువెళ్ళాలి. ఎవరిదగ్గరైనా ఆహారం ఉంటే మీతో తీసుకెళ్ళాలి. ఎవరికి కత్తి లేదో వాళ్ళు పై బట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి.
\s5
\v 37 నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే లేఖనాల్లో ప్రవక్త నా గురించి రాసింది జరుగుతుంది. "ప్రజలు అతన్ని నేరస్తుడిగా చూస్తారు" అనేదే ఆ లేఖనం. లేఖనాల్లో నా గురించి రాసినది అంతా నెరవేరుతుంది." అన్నాడు.
\v 38 శిష్యులు, "ప్రభూ, చూడు, మా దగ్గర రెండు కత్తులున్నాయి" అన్నారు. ఆయన "చాలు. ఇక ముందు ఇలా మాట్లాడ వద్దు" అన్నాడు.
\s5
\p
\v 39 యేసు పట్టణం వదిలి ఎప్పటిలా ఒలీవల కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు ఆయన కూడా వెళ్లారు.
\v 40 ఆయన వెళ్ళాలనుకున్న చోటికి వచ్చినప్పుడు వాళ్ళతో, "పాపం చేసే శోధనలో పడకుండా దేవుని సాయం కోసం ప్రార్థన చేయండి" అన్నాడు.
\s5
\v 41 తరువాత ఆయన వాళ్ళ నుండి దాదాపు ముప్పై మీటర్ల దూరం వెళ్ళి, మోకరించి ప్రార్థన చేసాడు.
\v 42 ఆయన," తండ్రీ, నాకు సంభవించే భయంకర సంఘటనలు నీ ఇష్ట ప్రకారం జరగాల్సి ఉంటే జరగనివ్వు. నాకు ఇష్టం కాదు, నీకు ఇష్టమే జరగాలి" అన్నాడు.
\s5
\v 43 అప్పుడు పరలోకం నుండి దేవదూత వచ్చి ఆయన్ని ధైర్య పరచాడు.
\v 44 ఆయన చాలా వేదన పడ్డాడు. చాలా బలంగా ప్రార్థన చేసాడు. ఆయన చెమట రక్తంలా బొట్లు బొట్లుగా కారింది.
\s5
\p
\v 45 ఆయన ప్రార్థన నుండి లేచి తన శిష్యుల దగ్గరికి తిరిగి వెళ్ళాడు. వాళ్ళు విచారంతో అలసిపోయి నిద్రపోతూ ఆయనకు కనిపించారు.
\v 46 ఆయన వాళ్ళను లేపి, "మీరు నిద్రపోకూడదు. లేవండి. ఏదీ మిమ్మల్ని పాపం చేయనివ్వకుండా దేవుని సహాయం కోసం ప్రార్థన చేయండి" అన్నాడు.
\s5
\p
\v 47 యేసు అలా మాట్లాడుతుండగానే ఒక గుంపు ఆయన దగ్గరికి వచ్చింది. వాళ్ళను పన్నెండుమంది శిష్యులలో ఒకడైన యూదా తీసుకొచ్చాడు. అతడు యేసు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు.
\v 48 యేసు అతన్ని, "యూదా! నన్ను శత్రువులకు అప్పగించే క్రమంలో నిజంగానే మనుష్య కుమారుని ముద్దు పెట్టుకున్నావా?" అని అడిగాడు.
\s5
\v 49 జరుగుతున్నది శిష్యులు గ్రహించి, "ప్రభూ, మన కత్తులతో వాళ్ళని నరుకుదామా?" అన్నారు.
\v 50 వాళ్ళల్లో ఒకడు ప్రధాన యాజకుని సేవకుడి కుడి చెవి నరికేసాడు.
\v 51 కాని, యేసు "అలాంటిదేమీ చెయ్యొద్దు" అని, ఆ సేవకుడి చెవిని స్వస్థపరిచాడు.
\s5
\p
\v 52 అప్పుడు యేసు తనను బంధించడానికి వచ్చిన ప్రధాన యాజకులతో, దేవాలయ సంరక్షణ అధికారులతో, యూదీయ పెద్దలతో, "మీరు నన్ను పట్టుకోడానికి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతో , దుడ్డు కర్రలతో బయల్దేరి వచ్చారా.
\v 53 ప్రతి రోజూ నేను దేవాలయంలో మీతో ఉన్నాను. కాని అప్పుడు నన్ను పట్టుకోడానికి మీరు ప్రయత్నం చెయ్యలేదు. ఈ సమయంలోనే మీకు కావలసింది చేస్తున్నారు. ఇది సాతాను చేయాలనుకొనే చెడ్డ పనులు చేసే చీకటి సమయం కూడా" అన్నాడు.
\s5
\p
\v 54 వాళ్ళు యేసును బంధించి తీసుకుపోయారు. ఆయన్ని వాళ్ళు ప్రధాన యాజకుని ఇంటికి తెచ్చారు. పేతురు కొంత దూరంతో వాళ్ళని వెంబడించాడు.
\v 55 అక్కడ లోగిట్లో కొందరు చలిమంట వేసుకుని కూర్చుని ఉన్నారు. పేతురు వాళ్ళతో కూర్చున్నాడు.
\s5
\p
\v 56 మంట వెలుగులో పేతురును అక్కడి పనిపిల్ల చూసింది. ఆమె అతన్ని జాగ్రత్తగా పరిశీలించి, "ఈ మనిషి కూడా బందీగా వచ్చిన వాడితో ఉన్నవాడే" అంది.
\v 57 పేతురు, "అమ్మాయ్, అతడెవరో నాకు తెలియదు" అన్నాడు.
\v 58 కాసేపు అయ్యాక మరొకడు పేతుర్ని చూసి, "వాళ్ళు బంధించిన వాడితో నువ్వు కూడా ఉన్నావు గదా?" అని అడిగాడు. పేతురు "ఇదిగో చెప్తున్నాను. నేను వాళ్ళల్లో ఒకడిని కాదు" అన్నాడు.
\s5
\v 59 ఒక గంట తరువాత ఒకడు గట్టిగా "ఇతని యాస చూస్తుంటే గలిలయ ప్రాంతం వాడిలానే ఉంది. కచ్చితంగా వాళ్ళు బంధించిన వాడితో ఉన్నవాడే అనుకుంటా" అన్నాడు.
\v 60 కాని, పేతురు, "ఏమయ్యా, ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు" అన్నాడు. అతడు అలా అంటుండగానే కోడి కూసింది.
\s5
\v 61 యేసు వెనక్కి తిరిగి పేతురు వైపు చూసాడు. అప్పుడు పేతురు, "ఈ రాత్రి కోడి కూయక ముందు మూడు సార్లు నేను నీకు తెలియదని చెప్తావు" అని ప్రభువు తనతో చెప్పింది జ్ఞాపకం చేసుకున్నాడు.
\v 62 వాకిలి బయటికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు.
\s5
\p
\v 63 యేసుకు కాపలా ఉన్నవాళ్ళు ఆయన్ని హేళన చేసి కొట్టారు.
\v 64 వాళ్ళు ఆయన కళ్ళకు గంతలు కట్టి "నువ్వు ప్రవక్త అని నిరూపించుకో వచ్చుగా! నిన్ను కొట్టింది ఎవ్వరో చెప్పు" అన్నారు.
\v 65 వాళ్ళు ఆయన్ని చాలా దుర్భాషలాడారు. ఆయన్ని అవమానించారు.
\s5
\p
\v 66 ఉదయం చాలామంది యూదీయ నాయకులు గుమికూడారు. ఈ గుంపులో ప్రధాన యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఉన్నారు. వాళ్ళు యేసును యూదీయ పాలకుల గదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళు ఆయనతో,
\v 67 "నువ్వు క్రీస్తువైతే చెప్పు" అన్నారు. కాని ఆయన, "నేనే ఆయననని చెప్తే మీరు నమ్మరు.
\v 68 క్రీస్తు గురించి మీరు ఏమనుకుంటున్నారని నేను అడిగితే మీరు జవాబు చెప్పరు.
\s5
\v 69 కాని ఇప్పటి నుండి మనుష్య కుమారుడైన నేను సర్వోన్నతుడైన దేవుని పక్కన కూర్చొని పరిపాలిస్తాను" అన్నాడు.
\v 70 వారందరూ ఆయన్ని, "అలాగైతే నువ్వు దేవుని కుమారుడినని చెప్తున్నావా?" అని అడిగారు. ఆయన," ఔను. మీరు చెప్పినట్టే" అన్నాడు.
\p
\v 71 అప్పుడు వాళ్ళు "ఇక సాక్షులతో పనేముంది? ఇతడు తనను దేవునితో సమానం చేసుకోవడం స్వయంగా విన్నాం గదా" అన్నారు.
\s5
\c 23
\p
\v 1 అప్పుడు వాళ్ళంతా లేచి యేసును రోమ్ గవర్నర్ పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళారు.
\v 2 గవర్నర్ ఎదుట ఆయనపై నేరాలు మోపసాగారు. "వీడు కల్లబొల్లి మాటలు చెబుతూ మా ప్రజల్లో అలజడి రేపడం మేము చూసాము. రోమ్ చక్రవర్తి సీజరుకు పన్నులు కట్టవద్దని ఇతడు చెబుతున్నాడు. అంతేకాక తాను మెస్సీయను, అంటే రాజును అని చెప్పుకుంటున్నాడు" అన్నారు.
\s5
\p
\v 3 అప్పుడు పిలాతు "నువ్వు యూదుల రాజువా?" అని అడిగాడు. యేసు "నువ్వే అంటున్నావు కదా" అన్నాడు.
\v 4 అప్పుడు పిలాతు ప్రధాన యాజకులతో జనంతో "ఈ మనిషి ఏ నేరం చెయ్యలేదు" అని చెప్పాడు.
\v 5 కానీ వాళ్ళు మాత్రం అదే పనిగా యేసుపై నేరాలు మోపారు. "ఇతడు ప్రజలను విప్లవానికి ప్రేరేపిస్తున్నాడు. యూదయ ప్రాంతమంతా తన ఆలోచనలు ప్రచారం చేస్తున్నాడు. గలిలయలో మొదలు పెట్టి ఇక్కడిదాకా ఈ ప్రచారం సాగిస్తున్నాడు" అన్నారు.
\s5
\p
\v 6 పిలాతు వాళ్ళ మాటలు విని "ఈ మనిషి గలిలయ జిల్లా వాడా?" అన్నాడు.
\v 7 గలిలయ హేరోదు పాలన కింద ఉంది. యేసు గలిలయ వాడని తెలిసి పిలాతు ఆయన్ను హేరోదు దగ్గరికి పంపాడు. ఆ సమయంలో హేరోదు యెరూషలేములోనే ఉన్నాడు.
\s5
\p
\v 8 హేరోదు యేసును చూసి ఎంతో సంతోషించాడు. ఆయనను గురించి అతడు ఎన్నో విషయాలు విని ఉన్నాడు. చాలా కాలంగా యేసును చూడాలనుకుంటున్నాడు. ఆయన ఏదైనా అద్భుతం చేస్తే చూడాలని కూడా ఆశిస్తున్నాడు
\v 9 హేరోదు ఆయనను ఎన్నో ప్రశ్నలు వేశాడు కానీ ఆయన దేనికీ జవాబు చెప్పలేదు.
\v 10 ముఖ్య యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ అక్కడే నిలబడి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు.
\s5
\v 11 హేరోదు, అతని సైనికులు ఆయనను గేలి చేశారు. ఆయనకు రాజవస్త్రాలు తొడిగి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించాడు.
\v 12 అప్పటిదాకా హేరోదూ పిలాతూ శత్రువులు. కానీ ఆ రోజు వాళ్ళద్దరూ మిత్రులయ్యారు.
\s5
\p
\v 13 అప్పుడు పిలాతు ముఖ్య యాజకులనూ అధికారులనూ ప్రజలనూ మళ్లీ పిలిపించాడు. వాళ్ళు అక్కడే ఉన్నారు.
\v 14 అతడు వాళ్ళతో "ప్రజలు తిరగబడేలా చేస్తున్నాడంటూ మీరు ఈ వ్యక్తిని నా దగ్గరికి తీసుకువచ్చారు కదా. మీరు వింటుండగానే నేను ఇతణ్ణి ప్రశ్నించాను. మీరితని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా నాకు నిజమనిపించడం లేదు.
\s5
\v 15 హేరోదు కూడా ఇతడు దోషి కాదు అంటున్నాడు. హేరోదు మళ్లీ నా దగ్గరకే తిప్పి పంపాడు కదా. మరణ శిక్షకు తగిన నేరమేదీ ఇతడు చేయలేదన్నది స్పష్టం.
\v 16 కాబట్టి ఇతన్ని కొరడా దెబ్బలు కొట్టి విడుదల చెయ్యమని నా సైనికులతో చెబుతాను" అన్నాడు.
\v 17 (పండగ సమయంలో పిలాతు ప్రజల కోసం ఒక ఖైదీని విడుదల చేయడం వాడుక కాబట్టి అతడిలా చెప్పాడు).
\s5
\p
\v 18 అయితే జనమంతా "వీణ్ణి చంపి మాకు బరబ్బను విడుదల చెయ్యండి" అని ఒక్కపెట్టున కేకలు వేశారు.
\v 19 ఈ బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటుకు నాయకుడు. అతడు హంతకుడు కూడా. ఈ నేరాలకై మరణశిక్ష అమలు కోసం ఎదురు చూస్తూ చెరసాలలో ఉన్నాడు.
\s5
\p
\v 20 కానీ పిలాతు యేసును విడుదల చేయాలని ఆశించి జనంతో మళ్ళీ మాట్లాడాడు
\v 21 కాని వాళ్ళంతా "వీణ్ణి సిలువ వేయాలి, సిలువ వేయాలి" అని మరింతగా కేకలు వేశారు
\v 22 మూడవ సారి అతడు, "ఎందుకు? ఇతడేమి నేరం చేశాడు? ఇతడు మరణ శిక్షకు తగిన నేరమేదీ చెయ్యలేదు. అందుచేత ఇతణ్ణి కొరడాలతో కొట్టించి వదిలేస్తాను" అన్నాడు.
\s5
\v 23 కాని వారంతా పట్టుబట్టి పెద్దగా కేకలు వేస్తూ యేసును సిలువ వేయాల్సిందేనన్నారు. చివరికి వాళ్ళ కేకల వల్ల పిలాతుకు ఇక గత్యంతరం లేకపోయింది.
\v 24 వాళ్ళు కోరినట్టే జరగాలని అతడు నిర్ణయించాడు.
\v 25 ప్రభుత్వంపై తిరుగుబాటు, హత్యలు చేసి చెరసాలలో ఉన్నవాణ్ణి విడుదలచేశాడు. యేసును జనం కోరిన విధంగా చెయ్యమని సైనికులకు అప్పగించాడు.
\s5
\p
\v 26 ఆఫ్రికాలో కురేనే అనే ప్రాంతానికి చెందిన సీమోను అక్కడ ఉన్నాడు. అతడు పల్లెప్రాంతం నుండి యెరూషలేముకు వస్తున్నాడు. సైనికులు ఆయన్ని తీసుకు పోతూ సీమోనును పట్టుకుని, సిలువ మోయమని దాన్ని అతని భుజం మీద పెట్టారు.
\s5
\p
\v 27 పెద్ద జనసమూహం, ఆయనను గురించి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్న చాలమంది స్త్రీలూ ఆయనను వెంబడించారు.
\v 28 యేసు వాళ్ళను చూసి "యెరూషలేము స్త్రీలారా, నా కోసం ఏడవవద్దు. మీకు దాపురించబోతున్న విపత్తును బట్టి మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి.
\s5
\v 29 మీరు ఈ సంగతి తెలుసుకోవాలి. ఒక రోజు రాబోతోంది, గొడ్రాళ్ళు ఎంత ధన్యులు! కానుపు ఎరుగని గర్భాలూ బిడ్డలకు పాలియ్యని స్తనాలూ ఎంత ధన్యం! అని ఆ రోజున అంటారు.
\p
\v 30 అప్పుడు ఈ నగర ప్రజలు "ఈ కొండల మామీద పడి, ఈ పర్వతాలు మమ్మల్ని కప్పివేస్తే ఎంత బావుణ్ణు!" అంటారు.
\v 31 నేను ఏ తప్పూ చెయ్యకపోయినా నేను చావ వలసి వస్తున్నదంటే, అసలు చావుకు అర్హులైన వాళ్ళకి మరి ఇంకెన్ని ఘోర శిక్షలు వస్తాయో!"
\s5
\p
\v 32 ఇద్దరు ఖూనీకోరులను ఆయనతో బాటు చంపడానికి తీసుకు వచ్చారు.
\s5
\v 33 వాళ్ళు "పుర్రె" అనే చోటికి వచ్చినప్పుడు ఆయన్ని సిలువకు మేకులతో కొట్టారు. ఆ నేరస్తుల్లో ఒకణ్ణి ఆయనకు కుడి వైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతోబాటు సిలువ వేశారు.
\p
\v 34 అప్పుడు యేసు, "తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళను క్షమించు" అన్నాడు. వాళ్ళు ఆయన బట్టలు ఎవరికేది రావాలో పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు.
\s5
\v 35 ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. యూదు అధికారులు సైతం, "వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి" అంటూ ఎగతాళి చేశారు.
\s5
\v 36 ఇక సైనికులు కూడా ఆయన్ని ఎగతాళి చేశారు. ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు పులిసిన ద్రాక్షారసం ఇవ్వబోతూ,
\v 37 "నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో" అన్నారు.
\v 38 "ఇతడు యూదుల రాజు" అని ఒక చెక్కపై రాసి ఆయన తలకు పైగా సిలువ కొయ్యకు కొట్టారు.
\s5
\p
\v 39 సిలువకు వేలాడుతున్న ఆ నేరస్థుల్లో ఒకడు ఆయనను దుర్భాషలాడుతూ, "నువ్వు నిజంగా క్రీస్తువైతే మరింకేం? నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు" అన్నాడు.
\v 40 కాని వాణ్ణి రెండోవాడు చీవాట్లు పెట్టాడు. "ఒరే, దేవుడికి భయపడరా. అతనికి వేసిన శిక్షే వాళ్ళు నీకూ నాకూ వేస్తున్నారు గదా?
\v 41 మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన శాస్తి జరిగింది. కానీ ఈ మనిషి నిర్దోషి" అన్నాడు.
\s5
\v 42 తరవాత ఆయనతో "యేసూ, నువ్వు రాజుగా వచ్చినప్పుడు నన్ను రక్షించాలని గుర్తు పెట్టుకో" అన్నాడు.
\v 43 అందుకాయన, "ఈ రోజు నువ్వు నాతో పరలోకంలో ఉంటావని నీతో కచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు.
\s5
\p
\v 44 అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకూ ఆ దేశమంతటి మీదా చీకటి అలుముకుంది
\v 45 సూర్యుడు వెలుతురు ఇవ్వలేదు. దేవాలయంలో మందమైన గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది.
\s5
\v 46 అది జరగగానే యేసు "తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను" అని గావుకేక పెట్టాడు. ఆయన ఇలా కేక వేసి ప్రాణం విడిచాడు.
\p
\v 47 జరిగిందంతా అక్కడున్న సైనికుల శతాధిపతి చూసి, "ఈ వ్యక్తి నిజంగా ఏ తప్పూ చెయ్యలేదు" అన్నాడు. అతడు అన్న మాట వల్ల దేవునికి కీర్తి కలిగింది.
\s5
\v 48 ఈ దృశ్యం చూడడానికి సమకూడిన ప్రజలు జరిగిందంతా చూసి దుఖంతో గుండెలు బాదుకుంటూ తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళారు.
\v 49 ఆయనతో పరిచయమున్న వారూ, గలిలయ నుండి ఆయనవెంట వచ్చిన ఆడవాళ్లు దూరంగా నిలబడి జరిగినదంతా చూస్తున్నారు.
\s5
\p
\v 50 అక్కడికి వచ్చినవాళ్ళలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు యూదయలో ఉన్న అరిమతయి గ్రామం వాడు. అతడు మంచిమనిషి, నీతిపరుడు. యూదుల చట్ట సభలో సభ్యుడు.
\v 51 యేసును చంపాలని చట్ట సభ నిర్ణయించినప్పుడు, అదెలా చెయ్యాలో పథకం వేసినప్పుడు వాటికి ఇతడు అంగీకరించలేదు. చేసిన తీర్మానాలకూ ఇతడు సమ్మతించనూలేదు. ఇతడు దేవుడు మనుషులను పరిపాలించడానికి రాజును పంపేది ఎప్పుడెప్పుడా అని ఎదురుతెన్నుల్లో ఉన్నాడు.
\s5
\p
\v 52 అతడు పిలాతు దగ్గరికి వెళ్ళి, యేసు శరీరాన్ని సమాధి చెయ్యడానికి తనకు అనుమతి ఇమ్మని అడిగాడు. పిలాతు అనుమతి ఇచ్చాడు.
\v 53 తరువాత వాళ్ళు ఆయన శరీరాన్ని సిలువపైనుండి దించి, సన్నని నారబట్టతో చుట్టి, తొలిచిన ఒక రాతి సమాధిలో ఉంచాడు. ఆ సమాధిలో ఎవరి దేహాన్నీ అంతకు ముందు ఎప్పుడూ ఉంచలేదు.
\s5
\v 54 అది యూదులు వాళ్ళ విశ్రాంతి దినం కోసం సిద్ధపడే రోజు. ఇంకాసేపటికి సూర్యాస్తమయం కాబోతున్నది. అది విశ్రాంతి దినానికి మొదలు.
\p
\v 55 అప్పుడు గలిలయ నుండి యేసుతో వచ్చిన స్త్రీలు కూడా యోసేపు, అతని మనుషుల వెంట వెళ్ళి ఆ సమాధిని చూశారు. యేసు దేహాన్ని ఆ మనుషులు ఎలా ఉంచారో చూశారు.
\v 56 తామున్న చోటికి తిరిగి వెళ్ళి, యేసు శరీరానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలూ, పరిమళ తైలాలూ సిద్ధం చేసుకున్నారు. తరువాత యూదు ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినం ఏ పనీ లేకుండా ఉన్నారు.
\s5
\c 24
\p
\v 1 ఆదివారం తెల్లవారక ముందే ఆ స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చారు. యేసు దేహానికి పూయడానికి తాము సిద్ధం చేసుకున్న సుగంధ ద్రవ్యాలను తీసుకుని వచ్చారు.
\p
\v 2 వాళ్ళు అక్కడికి చేరుకోగానే సమాధిని మూసిన రాయి దొర్లించి ఉండడం కనిపించింది.
\v 3 వాళ్ళు సమాధి లోపలికి వెళ్ళారు. యేసు దేహం అక్కడ లేదు.
\s5
\v 4 దాంతో వాళ్ళకేమీ తోచలేదు. ఉన్నట్టుండి ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షం అయ్యారు.
\v 5 వాళ్ళని చూసి ఈ స్త్రీలు వణికిపోయారు. ముఖాలు నేలకు దించుకుని ఉండగా ఆ ఇద్దరూ వాళ్ళతో "బ్రతికి ఉన్నవాణ్ణి మీరు చనిపోయిన వాళ్ళుండే చోట ఎందుకు వెదుకుతున్నారు?
\s5
\v 6 ఆయన ఇక్కడ లేడు, ఆయన మళ్ళీ బ్రతికాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు ఆయన మీతో,
\v 7 "మానవ పుత్రుడినైన నన్ను వాళ్ళు పాపాత్ములైన మనుషుల చేతికి అప్పజెపుతారు. వాళ్ళు ఆయన్ని సిలువ వేసి చంపుతారు. మూడవ రోజున నేను మళ్ళీ బ్రతుకుతాను" అన్నాడు గదా" అన్నారు.
\s5
\v 8 అప్పుడు ఆ ఆడవాళ్లు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు.
\p
\v 9 సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్ళి జరిగిన విషయాన్ని పదకొండుమంది శిష్యులకూ మిగిలిన వాళ్ళకందరికీ చెప్పారు.
\v 10 ఇలా ఈ సంగతులను అపొస్తలులకు చెప్పిన ఆడవాళ్లు మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ, వాళ్ళతో ఉన్న ఇతర స్త్రీలూ.
\s5
\v 11 అయితే అపోస్తలులు వాళ్ళ మాటలను అర్థం లేనివిగా కొట్టిపారేసారు.
\v 12 కానీ పేతురు లేచి, సమాధి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వంగి సమాధిలోకి తొంగి చూశాడు. యేసును చుట్టిన నారబట్టలు కనిపించాయి. యేసు మాత్రం లేడు. అతడు జరిగిన దాన్ని గురించి తబ్బిబ్బులౌతూ ఇంటికి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 13 అదే రోజు యేసు శిష్యులు ఇద్దరు యెరూషలేముకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు
\v 14 యేసుకు జరిగిన ఈ విషయాలన్నిటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.
\s5
\v 15 అలా వాళ్ళు మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉండగా యేసు తానే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో కూడా నడుస్తూ ఉన్నాడు.
\v 16 కానీ వాళ్ళు ఆయన్ను గుర్తు పట్టలేకుండా దేవుడు చేశాడు.
\s5
\v 17 ఆయన, "మీరు నడుస్తూ చర్చించుకుంటున్న విషయాలు ఏమిటి?" అని వాళ్ళని అడిగాడు. దాంతో వాళ్ళు దుఃఖంతో నిండిపోయి నిలబడిపోయారు.
\v 18 వాళ్ళలో క్లెయొపా అనేవాడు, "యెరూషలేముకు వచ్చి కూడా ఈ రోజుల్లో అక్కడ జరుగుతున్న విషయాలు తెలియని వాడివి నువ్వు ఒక్కడివే అనుకుంటా" అన్నాడు.
\s5
\v 19 ఆయన, "ఏ విషయాలు?" అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, "నజరేతు వాడైన యేసును గురించిన విషయాలయ్యా. ఆయన ప్రవక్త. చాలా అద్భుతాలు, ఆశ్చర్యకరమైన బోధలు చేసే సామర్థ్యం దేవుడు ఆయనకు ఇచ్చాడు.
\v 20 కానీ మన ముఖ్య యాజకులూ అధికారులూ ఆయనను రోమ్ అధికారుల వశం చేసి మరణశిక్షకు అప్పగించి, సిలువ వేయించిన వైనం నీకు తెలియదా?
\s5
\v 21 ఇశ్రాయేలు ప్రజను శత్రువుల బారి నుండి విడుదల చేసేవాడు ఈయనే అని మేము ఆశించాం. కానీ ఇది ఇప్పుడిక అసాధ్యం. ఆయన చనిపోయి ఇప్పటికి మూడు రోజులైపోయింది.
\s5
\v 22 అయినా మాలో కొందరు అడ వాళ్ళు చెప్పినది మాకు ఆశ్చర్యం కలిగించింది. వాళ్ళు తెల్లవారి సమాధి దగ్గరికి వెళ్ళి,
\v 23 అక్కడ ఆయన దేహం కనిపించక తిరిగి వచ్చారు. అక్కడ దేవదూతల దర్శనం చూసామని చెప్పారు. ఆ దూతలు యేసు బతికే ఉన్నాడని చెప్పారంట.
\v 24 మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు" అని ఆయనకు చెప్పారు.
\s5
\v 25 అందుకాయన, "తెలివి తక్కువ మనుషులారా, క్రీస్తును గురించి ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మడంలో మీరు చురుకుగా లేరు.
\v 26 క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి చనిపోయి తన పరలోక మహిమ గృహానికి పోవడం తప్పనిసరి అని మీకు తెలిసి ఉండాలి కదా" అని వాళ్ళతో అన్నాడు.
\p
\v 27 ఆపైన ఆయన ప్రవక్తలందరూ లేఖనాలన్నిటిలో తనను గురించి రాసిన మాటల అర్థాన్ని వాళ్ళకి తెలియజేశాడు. మోషేతో మొదలు పెట్టి ప్రవక్తలంతా రాసిన మాటలు వివరించాడు.
\s5
\v 28 ఇంతలో వాళ్ళ గ్రామం వచ్చింది. ఆయన ఇంకా ముందుకు ప్రయాణం చేస్తున్నట్టు కనిపించింది.
\v 29 దాంతో వాళ్ళు, "పొద్దు వాలుతున్నది. చీకటి కమ్ముతున్నది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు" అంటూ ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వాళ్ళతో కూడా ఇంట్లోకి వెళ్ళాడు.
\s5
\v 30 ఆయన వాళ్ళతో భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకుని దానికోసం దేవుడికి కృతజ్ఞతలు చెప్పి, తుంచి కొన్ని ముక్కలు తినడానికి వాళ్ళకిచ్చాడు.
\v 31 వాళ్ళు ఆయన్ను గుర్తు పట్టేలా దేవుడు చేశాడు. కానీ ఆయన వెంటనే అదృశ్యమయ్యాడు.
\p
\v 32 అప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు, "దారిలో నడుస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను మనకు అర్థం అయ్యేలా చెబుతున్నప్పుడు అదేమిటో అర్థం కాకపోయినా మంచి భావన మనలో నిండి పోయినట్టు అనిపించ లేదూ" అనుకున్నారు.
\s5
\v 33 అప్పుడే వాళ్ళు బయలుదేరి మళ్ళీ యెరూషలేము వెళ్ళారు. అక్కడ పదకొండు మంది శిష్యులనూ, వాళ్ళతో ఉన్నవాళ్ళనీ కలుసుకున్నారు.
\v 34 వాళ్ళు ఆ ఇద్దరితో "ప్రభువు మళ్ళీ బ్రతికిన సంగతి నిజమే. ఆయన సీమోనుకు కనిపించాడు" అని చెప్పారు.
\v 35 అప్పుడు ఆ ఇద్దరూ దారిలో తాము నడుస్తున్నప్పుడు జరిగిన సంగతులూ, ఆయన రొట్టె విరిచిన వెంటనే తాము ఆయన్ని గుర్తు పట్టిన విషయం తెలియజేశారు.
\s5
\p
\v 36 వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా హటాత్తుగా యేసే వాళ్ళ మధ్య నిలబడి, "దేవుడు మీకు శాంతినిచ్చు గాక" అన్నాడు.
\v 37 అయితే వాళ్ళు తమకేదో ఆత్మ కనిపించిందనుకుని భయంతో హడలిపోయారు.
\s5
\v 38 అప్పుడాయన, "మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో నేను బ్రతికానా లేదా అని ఎందుకు సందేహపడుతున్నారు?
\v 39 నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులకూ పాదాలకూ ఉన్న గాయాలు చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నేను నేనేనని గుర్తిస్తారు. నాకు ఉన్నట్టుగా ఆత్మకు శరీరం ఉండదు గదా" అని చెప్పాడు.
\v 40 అలా చెప్పి తన చేతులకూ, కాళ్ళకూ ఉన్న గాయాలు వాళ్ళకి చూపించాడు.
\s5
\v 41 అయితే వాళ్ళు సంతోషంతో తలమునకలైపోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, "మీ దగ్గర తినడానికి ఏదైనా ఉందా?" అని అడిగాడు.
\v 42 వాళ్ళు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు.
\v 43 ఆయన దాన్ని తీసుకుని వాళ్ళ కళ్ళ ఎదుటే తిన్నాడు.
\s5
\p
\v 44 తరువాత ఆయన, "నేను మీతో ఉన్నప్పుడు చెప్పినది మళ్ళీ చెబుతున్నాను. మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనల్లోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలి."
\s5
\v 45 అప్పుడు లేఖనాల్లో తన గురించి రాసిన వాటిని గ్రహించగలిగేలా ఆయన వాళ్ళ మనసులు తెరిచాడు.
\v 46 ఆయన వాళ్ళతో "మీరు లేఖనాల్లో చదివింది ఇదే, క్రీస్తు హింసల పాలై చనిపోతాడు. కానీ మూడవ రోజున మళ్ళీ బ్రతుకుతాడు.
\v 47 లేఖనాల్లో ఇంకా ఇలా రాసి ఉంది. నమ్మిన వాళ్ళు అన్ని చోట్లా మనుషులు పాపాలు చెయ్యడం మానుకుని దేవుని వైపు తిరగాలని ప్రకటించాలి. అప్పుడు ఆయన వాళ్ళ పాపాలు క్షమిస్తాడు. క్రీస్తును నమ్మిన వాళ్ళు ఈ సందేశాన్ని ప్రచారం చెయ్యాలి. దేవుడు అందుకే వాళ్ళని పంపించాడు. వాళ్ళు యెరూషలేములో మొదలు పెట్టి బయలుదేరి పోయి అన్ని జాతులకూ దీన్ని ప్రకటించాలి.
\s5
\v 48 ఇక్కడ జరిగినవన్నీ నిజమేనని మీకు తెలిసిన వాటిని మీరు అందరికీ చెప్పాలి.
\v 49 నా తండ్రి వాగ్దానం చేసినట్టుగా మీకోసం పరిశుద్ధాత్మను పంపుతాను. కానీ మీరు మాత్రం దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపే దాకా ఈ పట్టణం లోనే ఉండాలి" అని చెప్పాడు.
\s5
\p
\v 50 ఆయన బేతనియ గ్రామం వరకూ వాళ్ళని తీసుకు పోయి చేతులెత్తి వాళ్ళని ఆశీర్వదించాడు
\v 51 అలా వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వాళ్ళలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు.
\s5
\v 52 వాళ్ళు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు.
\p
\v 53 అనుదినం దేవాలయం ఆవరణలో దేవుణ్ణి కీర్తించడంలో నిమగ్నమయ్యారు.

2012
45-ACT.usfm Normal file
View File

@ -0,0 +1,2012 @@
\id ACT - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h అపోస్తలుల కార్యములు
\toc1 అపోస్తలుల కార్యములు
\toc2 అపోస్తలుల కార్యములు
\toc3 act
\mt1 అపోస్తలుల కార్యములు
\s5
\c 1
\p
\v 1 ప్రియమైన తియోఫిల్ గారికి, నేను నా మొదటి పుస్తకంలో యేసు చేసిన పనులు, ఆయన బోధించిన సంగతులు మొదలుకొని, ఆయన పరలోకానికి ఎక్కిపోయిన విషయం వరకు రాసాను.
\v 2 పరలోకానికి వెళ్ళిపోక ముందు ఆయన తాను ఎన్నుకున్న అపొస్తలులకు పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళు జరిగించవలసిన పనులను గురించి చెప్పాడు.
\v 3 ఆయన సిలువపై హింసలు పడి మరణించి మళ్ళీ తిరిగి లేచి నలభై రోజులపాటు తరచుగా వాళ్లకు కనిపించాడు. తాను తిరిగి బ్రతికానని అనేక విధాలుగా రుజువులు చూపించాడు. దేవుడు తన ప్రజలను తన రాజ్యంలో పరిపాలిస్తాడని వాళ్లకు బోధించాడు.
\s5
\p
\v 4 యేసు తన శిష్యులతో కలసి ఉన్న సమయంలో వాళ్ళతో ఇలా చెప్పాడు, "నా తండ్రి మీ కోసం ఆత్మను పంపేదాకా ఎదురు చూస్తూ ఉండండి, అప్పటివరకు మీరు యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళకండి. ఈ సంగతి నేను మీకు ముందుగానే చెప్పాను.
\v 5 బాప్తిసమిచ్చే యోహాను ప్రజలకు నీళ్ళలో బాప్తిసమిచ్చాడు. అయితే కొన్ని రోజుల తర్వాత దేవుడు మీకు పరిశుద్ధాత్మతో బాప్తిసమిస్తాడు."
\s5
\p
\v 6 ఒకరోజు అపొస్తలులు యేసును కలిసినప్పుడు ఆయనను ఇలా అడిగారు, "ప్రభూ, గతంలో ఇశ్రాయేలీయులను పాలించిన దావీదు రాజువలె నువ్వు మాకు రాజువు అవుతావా?"
\v 7 అందుకాయన ఇలా బదులిచ్చాడు, "అది జరగబోయే సమయం మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు. నా తండ్రి మాత్రమే నన్ను రాజుగా నియమించే రోజును, సమయాన్ని నిర్ణయిస్తాడు."
\p
\v 8 "అయితే పరిశుద్ధాత్మ దిగి వచ్చి మీకు శక్తి ప్రసాదిస్తాడు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ ప్రాంతాలలోను, ఇంకా ప్రపంచమంతటా నా గురించి ప్రకటించగలుగుతారు."
\s5
\p
\v 9 ఆయన ఇలా చెప్పిన తరువాత ఆకాశంలోకి ఆరోహణం అయ్యాడు. ఒక మేఘం ఆయన వాళ్లకు కనబడకుండా అడ్డు వచ్చింది.
\p
\v 10 ఆయన ఆకాశంలోకి వెళ్తూ ఉండడం ఆసక్తిగా చూస్తూ ఉన్న అపొస్తలుల ఎదుట ఆకస్మాత్తుగా ఇద్దరు దేవదూతలు ప్రత్యక్షమయ్యారు.
\v 11 ఆ దూతలు, "గలిలయ మనుషులారా, మీరు ఇక్కడే నిలబడి పైకి చూడాల్సిన అవసరం లేదు. దేవుడు పరలోకానికి తీసుకువెళ్తున్న ఈ యేసు తిరిగి ఒకరోజున భూలోకానికి తిరిగి వస్తాడు. పరలోకానికి వెళ్ళిన విధంగానే ఆయన తిరిగి రావడం మీరు చూస్తారు" అని చెప్పారు.
\s5
\p
\v 12 దేవదూతలు వెళ్ళిపోయిన తరువాత అపాస్తలులు యెరూషలేముకు సమీపాన ఉన్న ఒలీవ కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
\p
\v 13 పట్టణంలోకి ప్రవేశించి తాము నివసిస్తున్న ఇంటి మేడగదికి చేరుకున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరెవరంటే, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తోలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుల వర్గానికి చెందిన సీమోను, యాకోబు కొడుకు యూదా అనేవాళ్ళు.
\v 14 ఈ అపోస్తలులంతా కలిసి అస్తమానం ప్రార్థిస్తూ ఉన్నారు. యేసుతో కలిసి ఉన్న స్త్రీలు, యేసు తల్లి మరియ, ఆయన తమ్ముళ్ళూ వారితో ఉన్నారు.
\s5
\p
\v 15 ఆ రోజుల్లో పేతురు వాళ్ళకు ఆసరాగా నిలబడ్డాడు. కనీసం 120 మంది యేసు అనుచరులు అక్కడ సమావేశమయ్యారు.
\p
\v 16 పేతురు వాళ్ళందరినీ ఉద్దేశించి ఇలా మాట్లాడాడు, "నా సాటి విశ్వాసులారా, పూర్వ కాలంలో రాజైన దావీదు పలికిన విధంగా లేఖనాల్లో రాసినట్టు ఏమి జరగాలో అదంతా జరిగింది. దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికినట్టుగా యూదా ద్వారా ఆ ప్రవచనం నేరవేరింది."
\s5
\p
\v 17 "యూదాను మాతో కలసి అపోస్తలుడుగా సేవ చేయడానికి యేసు నియమించినప్పటికీ అతడు యేసును బంధించడానికి శత్రువులకు ఉపాయం చెప్పాడు."
\p
\v 18 "యూదా యేసుకు చేసిన నమ్మకద్రోహానికి ప్రతిఫలంగా యూదు నాయకులనుంచి అతనికి డబ్బు ముట్టింది. తరువాత అతడు ఆ డబ్బును వాళ్లకు ఇచ్చేసి, ఉరి వేసుకుని మరణించాడు. అతని శవం నేలపై పడి అతని పొట్ట పగిలి పేగులు బయటపడ్డాయి. అప్పుడు యూదు నాయకులు అతనికి ఇచ్చిన సొమ్ముతో ఒక పొలం కొన్నారు."
\p
\v 19 "యెరూషలేము పరిసర ప్రాంతాల ప్రజలు ఈ విషయం విన్నారు. ఆ పొలాన్ని తమ మాతృ భాష అరమెయిక్ లో "అకెల్డమ" అని పిలిచారు. దీని అర్థం "నెత్తురు నేల." ఎందుకంటే అక్కడ ఒక మనిషి చనిపోయాడు."
\s5
\p
\v 20 పేతురు ఇంకా ఇలా చెప్పాడు, "కీర్తనల గ్రంథంలో రాసి ఉన్నట్టుగా యూదా విషయంలో ఇదంతా జరిగింది."
\q1 "అతని కుటుంబం నశించిపోతుంది, అక్కడ ఎవ్వరూ మిగలరు."
\q1 "అతని స్థానంలో మరొకరు నాయకునిగా ఎంపిక అవుతారు"
\q1 అని దావీదు రాసినట్టు యూదా విషయంలో అంతా జరిగింది."
\s5
\p
\v 21 "కాబట్టి యూదా స్థానంలో మరొక అపొస్తలుని ఎంపిక చేయవలసిన అవసరత ఏర్పడింది. ఎన్నిక కాబోయే వ్యక్తి యేసు ప్రారంభ దినాలనుంచి మనతో ఉన్నవాడై ఉండాలి.
\v 22 అంటే బాప్తిసమిచ్చే యోహాను దగ్గర యేసు బాప్తిసం పొందిన సమయం నుంచి పరలోకానికి వెళ్ళిపోయిన రోజు దాకానన్నమాట. యూదా స్థానంలో వచ్చేవాడు యేసు గురించి బోధిస్తూ, ఆయన మరణించి తిరిగి లేచాడని మాతో కలసి ప్రకటించేవాడై ఉండాలి."
\p
\v 23 మిగిలిన అపోస్తలులు, ఇతర విశ్వాసులు కలిసి ఇద్దరి పేర్లు ఎంపిక చేశారు. వాళ్ళలో ఒకడు యోసేపు బర్సబ్బా. ఇతణ్ణి యూస్తు అని కూడా పిలుస్తారు. మరొకడు మత్తీయ.
\s5
\p
\v 24 తరువాత వాళ్ళంతా కలసి, "యేసు ప్రభూ, అపోస్తలుడుగా యూదా తన స్థానం విడిచి పాపం చేసి తనకు కేటాయించిన చోటికి చేరుకున్నాడు. ప్రతి ఒక్కరి హృదయాలోచనలు నీకు తెలుసు.
\v 25 కనుక ఈ ఇద్దరిలో యూదా స్థానంలో ఎన్నుకోదగ్గ వ్యక్తిని మాకు చూపించు" అని ప్రార్ధించారు.
\v 26 తరువాత వాళ్ళు ఇద్దరి పేర్లు రాసి చీట్లు వేసారు. చీటీ మత్తీయ పేరున వచ్చింది. ఇక అప్పటినుండి అతడు మిగిలిన పదకొండుమందితో కలసి అపోస్తలుడుగా కొనసాగాడు.
\s5
\c 2
\p
\v 1 పెంతెకొస్తు పండగనాడు యూదులు, విశ్వాసులందరూ పండగ జరుపుకోవడానికి యెరూషలేముకు చేరుకున్నారు.
\p
\v 2 ఆ రోజు ఉదయం అకస్మాత్తుగాఈదురు గాలి లాంటి శబ్దం వాళ్ళకి వినిపించింది. ఇంట్లో కూర్చుని ఉన్న వాళ్ళంతా ఆ శబ్దం విన్నారు.
\v 3 కొద్దిసేపటికి వాళ్ళు పైనుండి వస్తున్న అగ్ని జ్వాలలను చూసారు. అవి నాలుకలుగా చీలిపోయి విశ్వాసులందరి మీదా వాలాయి.
\v 4 అప్పుడు విశ్వాసులంతా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఆ ఆత్మ ఇచ్చిన శక్తి కొద్దీ వేరు వేరు భాషల్లో మాట్లాడడం మొదలుపెట్టారు.
\s5
\p
\v 5 ఆ సమయంలో పెంతెకొస్తు పండగ ఆచరించడానికి యూదులంతా అక్కడ ఉన్నారు. వాళ్ళంతా దేవుణ్ణి ఆరాధించడానికి వివిధ దేశాలనుంచి వచ్చిన నిష్ఠ గల యూదులు.
\v 6 పెను గాలిలాంటి శబ్దం విని వాళ్ళంతా విశ్వాసులు కూడి ఉన్న చోటికి గుంపులుగా చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ విశ్వాసులు తమ తమ సొంత భాషలో మాట్లాడడం విని ఆశ్చర్యపడ్డారు.
\v 7 వాళ్ళు పూర్తిగా గందరగోళానికి లోనయ్యారు, "ఇలా మాట్లాతున్న వాళ్ళంతా గలిలయ నుంచి వచ్చినవాళ్ళే కదా, వీళ్ళు మన భాషలు ఎలా మాట్లాడగలుగుతున్నారు?" అనుకున్నారు.
\s5
\v 8 "మనం వింటున్నది పుట్టినప్పటి నుండి మనం మాట్లాతున్న భాష.
\v 9 మనలో కొందరం పార్తీయ, మాదీయ, ఎలామీయ ప్రాంతాలకు చెందిన వాళ్ళం. కొందరం మెసపోటేమియా, యూదయ, కప్పదోకియ, పొంతు, ఆసియా ప్రాంతాల వాళ్ళం."
\p
\v 10 అక్కడ చేరిన మరి కొందరు ఫ్రుగియ, పంపూలియ, ఈజిప్టు, ఇంకా ఇతర ప్రాంతాలైన కురేనేలో భాగమైన లిబియ, రోమ్ నుంచి యెరూషలేముకు వచ్చినవాళ్ళు.
\p
\v 11 వాళ్ళు "యూదులూ, యూదేతరులూ, యూదా మతంలోనికి మారిన వాళ్ళూ, క్రేతు ప్రజలు, అరబ్బు జాతివారు మొదలైన మనమంతా వీళ్ళు మన భాషల్లో దేవుడు చేసిన గొప్ప పనులను గురించి వీళ్ళు చెబుతుంటే వింటున్నాము" అనుకున్నారు.
\s5
\p
\v 12 జరుగుతున్న దాన్నిబట్టి విస్మయం చెంది "ఏమి జరుగుతున్నదో, ఇదేమిటో" అని ఒకళ్ళతో ఒకరు చెప్పుకున్నారు.
\v 13 కొందరైతే "వీళ్ళు విపరీతంగా కొత్త సారా తాగి ఇలా మాట్లాడుతున్నారు" అన్నారు.
\s5
\p
\v 14 అయితే పేతురు ఆ పదకొండుమంది అపొస్తలులతో సహా లేచి నిలబడి ఆ జనసమూహంతో గట్టిగా ఇలా చెప్పాడు, "యూదయ ప్రజలారా, యెరూషలేము నివాసులారా, మీరంతా నేను చెప్పేది వినండి. జరుగుతున్నదంతా నేను మీకు వివరిస్తాను."
\p
\v 15 "మీలో కొందరు మేము సారాయి తాగామని అనుకుంటున్నారు. ఇప్పుడు ఉదయం తొమ్మిది గంటలే అయింది. ఈ సమయంలో ఎవ్వరూ మద్యపానం చెయ్యరు."
\s5
\p
\v 16 "అయితే, పూర్వ కాలంలో యోవేలు ప్రవక్త రాసినట్టుగా ఒక అద్భుత కార్యం ఇక్కడ జరిగింది."
\p
\v 17 "యోవేలు ప్రవక్త ఇలా రాసాడు,
\q1 "చివరి రోజుల్లో నేను ప్రజలందరికీ నా ఆత్మ అనుగ్రహిస్తాను.
\q1 మీ కొడుకులు, కూతుళ్ళు నన్ను గురించి ప్రకటిస్తారు.
\q1 మీ యువకులకు నా దర్శనాలు, మీ ముసలివాళ్ళకు కలలు అనుగ్రహిస్తాను.
\s5
\q1
\v 18 ఆ రోజుల్లో నా దాసుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
\q1 వాళ్ళు ప్రజలకు నా గురించి ప్రకటిస్తారు."
\p
\v 19 "పైన ఆకాశంలో, కింద భూమిపై అనేకమైన అద్భుత, ఆశ్చర్య కార్యాలు జరగడం ప్రజలు చూస్తారు."
\q1 "రక్తం, అగ్ని, పొగ భూమి అంతటా వ్యాపించడం ప్రజలు చూస్తారు.
\s5
\q1
\v 20 ప్రభువును, దేవుడినైన నేను ప్రతి ఒక్కరికీ తీర్పు తీర్చేందుకు రాకముందు
\q1 సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంగా మారతారు.
\q1
\v 21 ఆ సమయానికి ముందు తమ పాపాల భారం నుండి విడుదల కోరుకున్నవాళ్ళు
\q1 విమోచన పొందుతారు అని దేవుడు చెబుతున్నాడు."
\s5
\p
\v 22 పేతురు ఇంకా మాట్లాడుతూ "ఇశ్రాయేలు ప్రజలారా, నేను చెప్పేది వినండి. నజరేతు వాడైన యేసు మీ మధ్య నివసించాడు. అప్పుడు దేవుడు ఆయనచే బోలెడన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుత క్రియలు చేయించి ఆయన తన కుమారుడని కనపరచుకున్నాడు. ఇది నిజమని మీకు తెలుసు."
\p
\v 23 "అయినప్పటికీ మీరు ఆయనను శత్రువుల చేతికి అప్పగించారు. అయితే దేవుడు ముందుగానే సిద్ధపరచిన ప్రణాళిక ప్రకారం ఇది జరిగింది. ఆయనను మీరు దుష్టులకు అప్పగించి సిలువ వేయించి చంపారు.
\v 24 ఆయన చనిపోయాడు. అయితే దేవుడు ఆయనను తిరిగి లేపాడు. ఆయనను చనిపోయిన స్థితిలో ఉంచడం అసాధ్యం కనుక దేవుడు ఆయనను తిరిగి బతికించాడు.
\s5
\v 25 రాజైన దావీదు క్రీస్తును గురించి ఇలా అన్నాడు."
\q1 "ప్రభువైన దేవుడు నా మాట ఎల్లప్పుడూ ఆలకిస్తాడని నాకు తెలుసు.
\q1 నువ్వు నా కుడిపక్కన ఉన్నావు, నాకు హాని చేసే వాళ్ళకి నేను భయపడను.
\q1
\v 26 ఓ దేవా, అందుకే నేను ఉల్లాసంతో నిన్ను స్తుతిస్తాను.
\q1 మరణం నుండి నువ్వు నా శరీరాన్ని సజీవంగా లేపుతావని నేను పూర్తిగా నమ్ముతున్నాను.
\s5
\q1
\v 27 నన్ను నీకు సమర్పించుకున్నాను, ఎప్పుడూ నీకు లోబడే ఉంటాను
\q1 కాబట్టి నువ్వు నన్ను పాతాళంలో విడిచిపెట్టవు, నా శరీరాన్ని కుళ్ళిపోనియ్యవు.
\q1
\v 28 ఏవిధంగా మృత్యుంజయుణ్ణి ఎలా కాగలనో చూపించావు.
\q1 నాతో సదాకాలం ఉంటావు గనుక నన్ను చాలా సంతోషంగా ఉంచుతావు."
\s5
\p
\v 29 పేతురు ఇంకా ఇలా చెప్పాడు, "నా తోటి యూదులారా, మన పూర్వికుడైన దావీదు చనిపోయాడు, సమాధి అయ్యాడు. అతని సమాధి నేటికీ ఇక్కడ ఉంది.
\v 30 దావీదు మహారాజు ప్రవక్త కాబట్టి తన వంశంలో నుండి రాజు వస్తాడని దేవుడు చేసిన వాగ్దానం ఉందని అతనికి తెలుసు.
\v 31 చాలాకాలం క్రితమే దేవుడు చేసిన ఆ వాగ్దానం నెరవేరుతుందని అతనికి తెలుసు. మెస్సీయ అయిన క్రీస్తు పాతాళంలో ఉండిపోలేదనీ, ఆయన శరీరం కుళ్ళిపోలేదనీ ముందే తెలుసుకుని ఆయన పునరుత్థానాన్నిగూర్చి చెప్పాడు."
\s5
\p
\v 32 "యేసు మరణించాడు, దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు. ఆయన శిష్యులంగా మేమంతా దీనికి సాక్షులం. ఎందుకంటే మేము ఆయనను చూసాం.
\v 33 దేవుడు ఆయనను హెచ్చించి తనతో కలసి పరిపాలించడానికి పరలోకానికి కొనిపోయాడు. దేవుడు వాగ్దానం చేసినట్టుగా యేసు పరిశుద్ధాత్మను పొందాడు. మీరు చూస్తున్న, వింటున్న ఆ ఆత్మను ఆయన మాపై కుమ్మరించాడు.
\s5
\v 34 దావీదు తనను గురించి మాట్లాడడం లేదు, ఎందుకంటే అతడు యేసు వలె పరలోకానికి వెళ్ళలేదు. అయితే, మెస్సీయ గురించి ఇలా చెప్పాడు."
\q1 "నేను నీ శత్రువులను పూర్తిగా ఓడించే వరకు
\q1
\v 35 నీవు నా కుడి పక్కన కూర్చోమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు."
\p
\v 36 "మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. ఇది మీరంతా ఇశ్రాయేలు జాతి అంతా కచ్చితంగా తెలుసుకోవాలి" అని చెప్పి పేతురు తన మాటలు ముగించాడు.
\s5
\p
\v 37 పేతురు, ఇతర అపొస్తలుల మాటలు విన్న ప్రజలు తాము చేసిన తప్పు గ్రహించారు. "మేమేమి చెయ్యాలి?" అని వాళ్ళని అడిగారు.
\v 38 అందుకు పేతురు, "మీలో ప్రతి ఒక్కడూ మీ పాప స్వభావం విడిచిపెట్టండి. మెస్సీయ అయిన యేసును నమ్మి, ఆయన మీకోసం ఏమి చేశాడో గ్రహించినప్పుడు, మీ పాపాలకు క్షమాపణ దొరికింది అనడానికి సూచనగా మేము మీకు బాప్తిసం ఇస్తాము. దేవుడు మీకే పరిశుద్ధాత్మను ఇస్తాడు.
\v 39 ఈ వాగ్దానం మీకూ, మీ పిల్లలకూ, యేసును నమ్మిన వాళ్ళందరికీ, దూరంగా నివసించేవాళ్ళకీ చెందుతుంది. అంటే మన ప్రభువైన దేవుడు తన దగ్గరకు పిలుచుకున్న వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ లభిస్తాడు."
\s5
\p
\v 40 పేతురు ఇంకా గట్టిగా కొన్ని విషయాలు బోధించి వాళ్ళని హెచ్చరించాడు. "యేసును తృణీకరించే ఈ చెడ్డ తరం వారిని శిక్షించినట్టు దేవుడు మిమ్మల్ని శిక్షించకుండా ఉండేలా రక్షణ కోసం దేవుణ్ణి వేడుకోండి" అని చెప్పాడు.
\p
\v 41 పేతురు బోధ విన్న వాళ్ళు చాలామంది బాప్తిసం పొందారు. ఆ రోజు దాదాపు 3,000 మంది కంటే పైగా విశ్వాసుల గుంపులో చేరారు.
\v 42 వాళ్ళు ప్రతిరోజూ ఇతర విశ్వాసులతో క్రమంగా కలుసుకుంటూ అపొస్తలుల బోధలో, రొట్టె విరవడంలో, సహవాసంలో, ప్రార్థనలో కొనసాగారు.
\s5
\p
\v 43 అప్పుడు అపొస్తలులు చేస్తున్న అనేకమైన అద్భుత కార్యాల వల్ల యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరికీ దేవునిపట్ల గౌరవ మర్యాదలు పెరిగాయి.
\v 44 యేసును నమ్మిన విశ్వాసులంతా ఒకే విశ్వాసం పై నిలిచి క్రమంగా సమావేశం అవుతూ వచ్చారు. ప్రతిరోజూ తమకున్న దానిని ఉమ్మడిగా పంచుకున్నారు.
\v 45 క్రమేణా కొందరు తమ పొలాలను, ఆస్తిపాస్తులను అమ్మివేసి ఇతర విశ్వాసుల అవసరాలు తీర్చడానికి ఆ ధనం ఉపయోగించారు.
\s5
\v 46 ప్రతిరోజూ దేవాలయంలో కలుస్తూ, ఇళ్ళలో భోజనం చేస్తూ తమకున్నది ఇతరులతో పంచుకుంటూ, ఆనందంగా కలసి ఉన్నారు.
\p
\v 47 వాళ్ళు ఇలా చేస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ కొనసాగుతూ యెరూషలేములోని ప్రజల మన్నన పొందారు. ఇలా కొనసాగుతూ ఉండగా యేసు ప్రభువు ప్రతిరోజూ తమ పాపపు శిక్ష నుండి రక్షణ పొందిన వాళ్ళని సంఘంలో చేర్చుతూ వచ్చాడు. క్రమంగా సంఘ సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
\s5
\c 3
\p
\v 1 ఒకరోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పేతురు, యోహానులు దేవాలయానికి వెళ్తున్నారు. ఆ సమయంలో అక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి.
\p
\v 2 అక్కడ పుట్టినప్పటి నుండి నడవలేని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవాలయనికి ఉన్న "సౌందర్య ద్వారం" అనే పేరుగల గేటు పరిసరాల్లో కూర్చుని ఉన్నాడు. ప్రతిరోజూ కొందరు మనుషులు అతణ్ణి అక్కడికి మోసుకువచ్చి కూర్చోబెడతారు. అతడు దేవాలయానికి వస్తూ ఉండేవాళ్ళ దగ్గర అడుక్కుంటూ ఉంటాడు.
\p
\v 3 పేతురు, యోహానులు దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉండగా వాడు వాళ్ళను భిక్షం వేయమని అడగడం మొదలుపెట్టాడు.
\s5
\v 4 పేతురు, యోహానులు అతని వైపు సూటిగా చూసారు. పేతురు అతనితో, "మా వైపు చూడు" అన్నాడు.
\v 5 ఏదైనా సహాయం చేస్తారని అతడు వాళ్ళవైపు చూసాడు.
\v 6 అప్పుడు పేతురు అతనితో, "నా దగ్గర డబ్బు ఏమీ లేదు, అయితే నా దగ్గర ఉన్నదే నీకిస్తున్నాను. నజరేతు వాడైన యేసు నామంలో నువ్వు స్వస్థత పొందావు. లేచి నడువు" అని చెప్పాడు.
\s5
\v 7 అప్పుడు పేతురు అతని కుడి చెయ్యి పట్టుకుని అతడు నిలబడడానికి సహాయం చేసాడు. వెంటనే అతని కాళ్ళకు, చీలమండలకు శక్తి వచ్చింది.
\v 8 వాడు లేచి గంతులు వేసి నడవసాగాడు. వాడు నడుస్తూ గంతులు వేస్తూ పేతురు యోహానుతో కలిసి దేవాలయంలోకి వెళ్ళాడు.
\s5
\v 9 వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తించడం ప్రజలందరూ చూసారు.
\p
\v 10 "సౌందర్య ద్వారం దగ్గర అడుక్కునేవాడు వీడే" అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంలో, గందరగోళంలో మునిగిపోయారు.
\s5
\p
\v 11 వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకొని ఉండడాన్ని చూసిన జనమంతా ఆశ్చర్యపడి, సోలోమోను మండపంలో వాళ్ళ దగ్గరికి పరుగెత్తుకు వచ్చారు.
\p
\v 12 దీన్ని చూసిన పేతురు ప్రజలతో ఇలా అన్నాడు "ఇశ్రాయేలీయులారా, దీని గురించి మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తితో అతడు నడిచేలా చేేేశామన్నట్లు ఎందుకలా చూస్తున్నారు?"
\s5
\p
\v 13 "ఇప్పుడు నేను నిజంగా జరుగుతున్నది చెప్తాను. మన పూర్వికులు అబ్రాహాము, ఇస్సాకు, యకోబులు దేవుణ్ణి మహిమ పరిచారు, ఇప్పుడు దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరిచాడు. అయితే మీరు ఆయన్ని పిలాతుకు అప్పగించారు, ఆయన్ని విడుదల చెయ్యడానికి పిలాతు నిశ్చయించుకున్నప్పడు మీరు దాన్ని అడ్డుకున్నారు."
\p
\v 14 "దేవుని కుమారుడు, ఇశ్రాయేలీయుల మెస్సీయ, నీతిమంతుడు అయిన యేసుని మీరు తిరస్కరించి, ఒక హంతకుణ్ణి విడుదల చేయాలని అడిగారు."
\s5
\p
\v 15 "నిత్యజీవం ఇచ్చే యేసుని మీరు చంపించారు, కాని దేవుడు ఆయనను చావు నుండి తిరిగి లేపాడు. అందుకు సాక్షులం మేమే."
\p
\v 16 "యేసు జరిగించిన కార్యాలపై ఉంచిన విశ్వాసమే ఇతనిని బలపరిచింది. యేసుపై ఉన్న విశ్వాసమే మీ అందరి ఎదుట ఇతనికి ఈ సంపూర్ణ స్వస్థత కలిగించింది.
\s5
\v 17 "సోదరులారా, మీరు, మీ నాయకులు యేసు మెస్సీయ అని తెలియక తప్పు చేసారని నాకు తెలుసు."
\p
\v 18 "ప్రజల చేతుల్లో యేసు మరణిస్తాడని ప్రవక్తల ముందే చెప్పిన విధంగానే ఇదంతా జరిగింది.
\s5
\v 19 కాబట్టి మీ పాపాల నుంచి మళ్లుకొని దేవునికి ఇష్టులుగా నడుచుకోండి. కాగా ఆయన మీ పాపాలను క్షమించి మిమ్మల్ని బలపరుస్తాడు.
\v 20 అలా చేసినప్పుడు దేవుడు అభిషిక్తుడైన యేసును మీ కోసం మళ్ళీ పంపుతాడు.
\s5
\v 21 అన్నిటికీ పునరుద్ధరణ సమయం వస్తుందని దేవుడు ముందే వాగ్దానం చేశాడు. అంతవరకు యేసు పరలోకంలో ఉండటం అవసరం.
\v 22 మోషే మెస్సీయ గురించి ఇలా అన్నాడు, "ప్రభువైన దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను మీ సొంత ప్రజల్లో నుంచి మీ కోసం పంపుతాడు, మీరు తప్పకుండా ఆయన చెప్పింది వినాలి."
\v 23 ఆ ప్రవక్త చెప్పిన దాన్నివినని వాడు, ఆయనకు లోబడనివాడు దేవుని ప్రజల్లో ఉండకుండా నాశనమైపోతారు అన్నాడు."
\s5
\p
\v 24 పేతురు ఇంకా "ఈ రోజుల్లో ఏమి జరుగుతుందో ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. సమూయేలుతో సహా మిగిలిన ప్రవక్తలు ఈ రోజుల గురించి ముందుగానే చెప్పారు.
\v 25 "నీ సంతానం ద్వారా భూమిపై ఉన్న కుటుంబాలన్నీ దీవెనలు పొందుతాయని దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది.
\v 26 "ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని దుష్టత్వం నుండి తప్పించి మిమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు మెస్సీయగా యేసును ఈ లోకానికి మొదట పంపించాడు" అని చెప్పాడు.
\s5
\c 4
\p
\v 1 దేవాలయం ఆవరణలో పేతురు, యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆలయ కాపలాదారుల అధికారి, కొందరు సద్దూకయ్యులు వాళ్ళ దగ్గరికి వచ్చారు.
\v 2 యేసు చనిపోయిన తరువాత దేవుడు ఆయన్ను మళ్ళీ బతికించాడని ఈ ఇద్దరు అపొస్తలులు బోధిస్తూ ఉండడం వాళ్లకు కోపం తెప్పించింది.
\v 3 అందువల్ల ఇద్దరినీ బంధించి చెరసాలలో పడేసారు. అప్పటికే సాయంత్రం కావడంవల్ల యూదు సభ ఎదుట హాజరు పరచడం కోసం మరుసటి రోజు వరకు వేచి ఉన్నారు.
\v 4 పేతురు బోధ విన్న అనేకులు యేసుపై విశ్వాసముంచారు. వాళ్ళలో మగవాళ్ళ సంఖ్య అయిదు వేలకు మించిపోయింది.
\s5
\p
\v 5 తరువాతి రోజు ఆలయ అధికారి ప్రధాన గురువులకూ, యూదా మత పెద్దలకూ, యూదు సభ సభ్యులకూ కబురుపెట్టాడు. అందరూ యెరూషలేములో సమావేశమయ్యారు.
\v 6 ఒకప్పటి ప్రధాన యాజకుడు అన్నతోపాటు కయప, యోహాను అలెగ్జాండర్, ఇంకా ఇతర అధికారులు హాజరయ్యారు.
\p
\v 7 పేతురు, యోహానులను తీసుకురమ్మని కాపలాదారులకు ఆజ్ఞాపించారు. "కుంటివాణ్ణి నడవగలిగేలా చేసే ప్రభావం మీకు ఎవరిచ్చారు?" అని వారిని ప్రశ్నించారు.
\s5
\v 8 పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వడంతో పేతురు వాళ్ళతో ఇలా చెప్పాడు, "నాతోటి ఇశ్రాయేలు అధికారులారా, ఇతర పెద్దలారా, నేను చెప్పేది వినండి.
\v 9 మేము ఆ కుంటివాణ్ణి బాగు చేసిన మంచి పని గురించి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మీరూ, ఇశ్రాయేలు ప్రజలూ అందరూ వినండి."
\p
\v 10 "నాతోటి ఇశ్రాయేలు ప్రజలంతా దీన్ని తెలుసుకోవాలి. నజరేయుడైన యేసును మీరు సిలువకు వేలాడదీసి చంపారు, తండ్రి ఆయనను సజీవుడుగా తిరిగి లేపాడు. ఆ కుంటివాడికి యేసు నామంలో స్వస్థత కలిగింది."
\s5
\p
\v 11 "ఎవరిగురించి "ఇల్లు కట్టే వాళ్ళు వదిలేసిన రాయి భవనానికి మూలరాయి అవుతుంది" అని లేఖనాల్లో చెప్పారో ఆ మూల రాయి నజరేతు వాడైన యేసే."
\p
\v 12 "కేవలం యేసు మాత్రమే మనల్ని రక్షించగలడు. మన పాపాల నుండి మనల్ని రక్షించగల శక్తిని దేవుడు లోకంలో ఇంకెవ్వరికీ ఇవ్వలేదు."
\s5
\p
\v 13 తమకు పేతురు యోహానులు భయపడడం లేదని యూదా అధికారులు గ్రహించారు. ఈ ఇద్దరూ సామాన్యులని ఎలాంటి చదువు సంధ్యలు లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారు. ఈ ఇద్దరూ యేసుతో కలసి ఉన్నవారని గుర్తించారు.
\p
\v 14 బాగుపడిన వ్యక్తి పేతురు, యోహానులతో ఉండడం వల్ల వాళ్లకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేకపోయారు.
\s5
\p
\v 15 యూదా అధికారులు కాపలాదారుల్ని పిలిచి పేతురు యోహానులను, స్వస్థత పొందిన వ్యక్తినీ బయటకు తీసుకువెళ్ళమని చెప్పారు. తరువాత ఆ నాయకులు ఆ ఇద్దరి గురించి ఒకళ్ళతో ఒకరు మాట్లాడుకున్నారు.
\p
\v 16 "ఈ ఇద్దరినీ శిక్షించడానికి ఏమీ లేదు. యెరూషలేములో ప్రతి ఒక్కరూ ఈ అద్భుత కార్యం జరగడం చూశారు. కాబట్టి మనం ప్రజలకు ఏమీ జరగలేదని చెప్పలేము."
\p
\v 17 "అయితే ఇకనుండి యేసు గురించి వీళ్ళు చెప్పేది ఎవ్వరూ వినవద్దని ప్రజలను హెచ్చరిద్దాం, కుంటివాణ్ణి బాగుచేయగల శక్తిగల యేసు గురించి ఇకపై బోధిస్తే శిక్ష తప్పదని వీరిని బెదిరిద్దాం" అని చెప్పుకున్నారు.
\p
\v 18 యూదు నాయకులు ఇద్దరు అపొస్తలులను లోపలకి పిలిపించారు. ఇక నుంచి యేసు గురించి ఎవ్వరికీ ఏమీ బోధించకూడదని ఆజ్ఞాపించారు.
\s5
\p
\v 19 అందుకు పేతురు యోహానులు, "మేము దేవుని మాట కంటే మీ మాటకు లోబడడం సరియైనదా, మీరే చెప్పండి.
\v 20 మాకు సంబంధించినంత వరకు మేము మీకు లోబడము. మేము యేసును గురించి ఏమి చూశామో, ఏది విన్నామో ప్రజలకు చెప్పకుండా ఉండలేము" అని జవాబిచ్చారు.
\s5
\p
\v 21 యూదు పెద్దలు మరొకసారి తమ మాట వినక తప్పదని పేతురు యోహానులకు చెప్పారు. వాళ్ళను శిక్షించకుండా వదిలెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే, యెరూషలేములోని ప్రజలు జరిగిన అద్భుత కార్యాన్ని బట్టి దేవుణ్ణి కొనియాడుతున్నారు.
\v 22 అద్భుతరీతిగా స్వస్థత పొందిన వాడి వయస్సు 40 ఏళ్ళు పైమాటే.
\s5
\v 23 పేతురు యోహనులు అక్కడినుంచి వచ్చి ప్రధాన యాజకులూ, యూదీయ పెద్దలు తమతో చెప్పిన మాటలన్నీ ఇతర విశ్వాసులకు చెప్పారు.
\p
\v 24 వాళ్ళు ఆ మాటలు విని అందరూ కలిసి ఏక మనస్సుతో దేవుడికి ఇలా ప్రార్థన చేశారు, "ప్రభూ, నువ్వు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్ని కలుగజేసావు."
\v 25 మన పూర్వీకుడైన దావీదు మహారాజు పరిశుద్ధాత్మ పూర్ణుడై
\q "ప్రజల సమూహాలు ఎందుకు కోపం తెచ్చుకుని,
\q ఇశ్రాయేలు ప్రజలు దేవునిపై వ్యర్ధమైన ఆలోచనలు పెట్టుకుంటున్నారు?
\s5
\q
\v 26 దేవుని మీదా, ఆయన ఎన్నుకున్న మెస్సీయ మీదా
\q భూలోకంలోని రాజులు, అధికారులు ఏకమై తిరుగుబాటు చేసారు" అని రాశాడు."
\s5
\p
\v 27 "ఇది నిజం. హేరోదు, పొంతి పిలాతు, యూదేతరులు, ఇశ్రాయేలు ప్రజలు నువ్వు ఎన్నుకున్న నీ సేవకుడి మీద ఈ పట్టణంలో వ్యతిరేకంగా లేచారు.
\v 28 పూర్వ కాలంలో ఇలా జరగాలని నిర్ణయించావు గనుక దీనిని అనుమతించావు."
\s5
\p
\v 29 "ప్రభూ, వాళ్ళు మా గురించి పలికే మాటలను, మాకు కలుగజేసే హింసను గమనించు. ప్రతిచోటా యేసు నామాన్ని ప్రకటించే వాళ్ళకి సహాయం చెయ్యి.
\v 30 నీ పవిత్ర సేవకుడైన యేసు నామంలో గొప్ప అద్భుత కార్యాలు, స్వస్థతలు, సూచక క్రియలు చేసేలా నీ హస్తం చాపు."
\p
\v 31 విశ్వాసులు ప్రార్థన ముగించగానే వాళ్ళున్న స్థలమంతా కంపించింది. దేవుని వాక్యం ధైర్యంగా ప్రకటించడానికి తగిన శక్తి పరిశుద్ధాత్మ వాళ్ళకి ప్రసాదించాడు.
\s5
\v 32 యేసును విశ్వసించిన ప్రజలంతా తమ ఆలోచనల్లో, అవసరాల్లో పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. వాళ్ళలో ఎవరికీ సొంతంగా ఏమీ లేదు. వాళ్లకు ఉన్నదంతా ఒకరితో ఒకరు సమానంగా పంచుకున్నారు.
\p
\v 33 అపొస్తలులు ప్రభువైన యేసును సజీవంగా తిరిగి లేపాడన్న సత్యాన్ని స్థిరంగా బోధించసాగారు. విశ్వాసులందరికీ దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు.
\s5
\v 34 కొందరు విశ్వాసులు తమ భూములు, ఇళ్ళు, మరికొందరు తమ ఆస్తిలో కొంత భాగం అమ్మి, అమ్మగా వచ్చిన సొమ్మును అపొస్తలులకు అప్పగించారు.
\v 35 అపొస్తలులు దాన్ని అవసరంలో ఉన్న విశ్వాసులకు పంచిపెట్టారు. విశ్వాసుల్లో ఎవరికీ ఎలాంటి కొదువా లేకుండా పోయింది.
\s5
\p
\v 36 ఆ ప్రాంతంలో సైప్రస్ ద్వీప నివాసి, లేవి గోత్రానికి చెందిన యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. అపొస్తలులు అతన్ని "బర్నబా"అని పిలిచారు. యూదుల భాషలో ఆ పేరుకు అందరినీ అన్నివేళలా ఆదుకొనేవాడు అని అర్థం.
\v 37 అతడు తనకున్న పొలం అమ్మివేసి వచ్చిన సొమ్మును ఇతర విశ్వాసుల అవసరాల కోసం అపొస్తలులకు అప్పగించాడు.
\s5
\c 5
\p
\v 1 ఆనాటి విశ్వాసుల్లో అననీయ అనే వ్యక్తి ఉన్నాడు. అతని భార్య పేరు సప్పీర. అతడు కూడా తన పొలం అమ్మాడు.
\v 2 వచ్చిన పైకంలో కొంత తన కోసం దాచుకొని మిగిలినది అపోస్తలుల దగ్గరికి తెచ్చి వాళ్ళ ఎదుట పెట్టాడు. అతడు కొంత డబ్బు దాచుకున్న సంగతి అతని భార్యకు కూడా తెలుసు.
\s5
\p
\v 3 అప్పుడు పేతురు, "అననీయా, పరిశుద్ధాత్మను మోసగించడానికి నువ్వెందుకు సాతానుకు లొంగిపోయావు? ఇంత భయంకరమైన పని నువ్వు చేయకుండా ఉండవలసింది. పొలం అమ్మగా వచ్చిన డబ్బులో నువ్వు కొంత దాచుకున్నావు. మొత్తం మాకు ఇవ్వలేదు.
\v 4 పొలం అమ్మకముందు అది నీదే, అమ్మిన తరువాత కూడా ఆ సొమ్ము నీదే. నీ మనసులో ఇలాంటి చెడ్డ పని ఎందుకు ఆలోచించావు? నువ్వు మోసం చేయాలని చూసింది మమ్మల్ని మాత్రమే కాదు, దేవుణ్ణి కూడా."
\p
\v 5 ఈ మాటలు విన్న వెంటనే అతడు నేలపై పడి చచ్చిపోయాడు.
\v 6 కొందరు యువకులు ముందుకు వచ్చి అతణ్ణి బట్టతో చుట్టి పాతిపెట్టడానికి మోసుకుపోయారు.
\s5
\p
\v 7 మూడు గంటలు గడచిన తరువాత, జరిగినదేమీ తెలియని అతని భార్య లోపలి వచ్చింది.
\v 8 అప్పుడు పేతురు అననీయ తెచ్చిన సొమ్ము చూపించి, "మీరిద్దరూ పొలం అమ్మగా వచ్చిన సొమ్ము ఇదేనా?" అని అడిగాడు. అందుకామె, "అవును, మాకు వచ్చిన మొత్తం సొమ్ము ఇదే" అని చెప్పింది.
\s5
\p
\v 9 అందుకు పేతురు, "మీరిద్దరూ భయంకరమైన తప్పు చేసారు. ప్రభువు ఆత్మను మోసగించడానికి ఇద్దరూ ఏకమయ్యారు. చూడు, నీ భర్తను పాతిపెట్టడానికి వెళ్ళినవాళ్ళు ఇప్పుడే లోపలికి వస్తున్నారు. ఇదుగో తలుపు దగ్గరికి వచ్చేసారు. వాళ్ళు నిన్ను కూడా తీసుకుపోతారు" అన్నాడు.
\v 10 వెంటనే ఆమె పేతురు కాళ్ళ దగ్గర పడి చచ్చిపోయింది. ఆ యువకులు లోపలికి వచ్చి, చచ్చి పడి ఉన్న ఆమెను మోసుకుపోయి ఆమె భర్త సమాధి పక్కన పాతిపెట్టారు.
\p
\v 11 అననీయ సప్పీరాల విషయంలో దేవుడు చేసిన దాన్ని చూసి యెరూషలేములోని విశ్వాసులకూ చాలా భయమేసింది. ఈ విషయాలు విన్న ప్రతి ఒక్కరికీ భయం కలిగింది.
\s5
\p
\v 12 ప్రజల మధ్య బోధించడానికి, నిజమైన దేవుని శక్తి కనపరచేలా అనేకమైన సూచక క్రియలు చెయ్యడానికి దేవుడు అపొస్తలులకు తోడుగా ఉన్నాడు. విశ్వాసులంతా దేవాలయ ప్రాంగణంలోని సోలోమోను మండపం దగ్గర క్రమంగా కలుసుకుంటున్నారు.
\p
\v 13 యేసును నమ్మని ప్రజలు విశ్వాసులతో కలవడానికి భయపడుతున్నారు. అయితే వాళ్ళు విశ్వాసుల పట్ల గౌరవ మర్యాదలు చూపిస్తున్నారు.
\s5
\p
\v 14 స్త్రీ పురుషులలో అనేకులు ప్రభువును నమ్మి విశ్వాసుల గుంపులో చేరుతున్నారు.
\p
\v 15 ఫలితంగా, పేతురు నడుస్తూ ఉన్నప్పుడు అతని నీడ అయినా సోకి బాగుపడాలని అనేకులు రోగులను వీధుల్లోకి మంచాలపైనా, పరుపులపైనా తీసుకువచ్చేవారు.
\v 16 యెరూషలేము చుట్టుపక్కల నుండి జనం రోగులను, దయ్యాలు పట్టిన వాళ్ళను అపొస్తలుల దగ్గరికి తీసుకువచ్చారు. దేవుడు వాళ్లకు స్వస్థత అనుగ్రహిస్తున్నాడు.
\s5
\p
\v 17 ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు అంటే సద్దూకయ్యులు తదితరులు అపొస్తలులపై అసూయ పెంచుకున్నారు.
\v 18 దేవాలయ ద్వారపాలకులకు ఆజ్ఞాపించి అపొస్తలులను పట్టణ చెరసాలలో వేయించారు.
\s5
\p
\v 19 అయితే రాత్రి వేళ ప్రభువు దూత చెరసాల తలుపులు తెరిచి అపొస్తలులను బయటకు తెచ్చాడు.
\v 20 తరువాత దూత అపొస్తలులతో, "మీరు వెళ్లి దేవాలయం దగ్గర నిలబడి నిత్యజీవాన్ని గురించిన సందేశం ప్రజలందరికీ చెప్పండి" అని చెప్పాడు.
\p
\v 21 ఈ మాటలు విని అపొస్తలులు దేవాలయం దగ్గరికి వచ్చి యేసు గురించి బోధించడం మొదలుపెట్టారు. ఇంతలో ప్రధాన యాజకుడు, అపొస్తలులను చెరసాలలో పెట్టించిన దేవాలయ నాయకులు, యూదీయ సభ పెద్దలు సమావేశమై అపొస్తలులను విచారణకు తీసుకు రమ్మని కాపలాదారుల్ని పంపించారు.
\s5
\v 22 కాపలాదారులు చెరసాలకు పోయి అపొస్తలులు అక్కడ లేకపోవడం గమనించి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సంగతి పెద్దలకు చెప్పారు.
\v 23 "చెరసాల తలుపులు భద్రంగా మూసి ఉన్నాయి. కాపలాదారులు గస్తీ తిరుగుతున్నారు. మేము తలుపులు తీసి చూస్తే మాకు ఎవరూ కనబడలేదు" అని వాళ్ళు చెప్పారు.
\s5
\p
\v 24 ఈ సంగతి విన్న కాపలదారుల అధికారి, ప్రధాన యాజకుడు ఆశ్చర్యానికి, అయోమయానికి గురయ్యారు. "ఇది ఏమవుతుందో" అని బెంబేలెత్తి పోయారు.
\p
\v 25 అప్పుడు ఒకడు అక్కడకు వచ్చి "విన్నారా, మీరు జైల్లో పెట్టిన మనుషులు ఇప్పుడు దేవాలయంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు" అని చెప్పాడు.
\s5
\v 26 అప్పుడు ఆ దేవాలయ అధికారి తన అనుచరులతో వెళ్లి అపొస్తలులను తీసుకువచ్చి సభ జరిగే గదిలో నిలబెట్టాడు. వాళ్ళను చాలా మర్యాదగా వెంటబెట్టుకు వచ్చారు. ఎందుకంటే అక్కడ గుమి గూడి ఉన్న ప్రజలు తమను రాళ్ళతో కొడతారేమోనని భయపడ్డారు.
\p
\v 27 ఆ అధికారి తన అనుచరులతో అపొస్తలులను సభ జరిగే గదిలోకి తీసుకు వచ్చినప్పుడు సభ సభ్యులఎదుట నిలబడమని వాళ్ళను ఆజ్ఞాపించారు. ప్రధాన యాజకుడు వాళ్ళను ఇలా ప్రశ్నించాడు.
\v 28 "యేసును గురించి బోధించవద్దని మీకు ఆజ్ఞాపించాము. మీరు మా మాట నిర్లక్ష్యం చేసి, యెరూషలేము అంతటా బోధిస్తున్నారు. అంతేకాక, ఆ మనిషి హత్యానేరాన్ని మామీదికి తేవాలని చూస్తున్నారు" అన్నాడు.
\s5
\p
\v 29 అప్పుడు పేతురు, మిగిలిన అపోస్తలులు, "మేము దేవుని ఆజ్ఞలకు లోబడాలి గానీ మీకు కాదు.
\v 30 మీరు యేసును సిలువకు వేలాడేసి చంపారు. మన పూర్వీకులు ఆరాధించిన దేవుడు ఆయనను చావు నుండి తిరిగి బ్రతికించాడు,
\v 31 దేవుడు ఆయన స్థాయిని హెచ్చించాడు. మనల్ని రక్షించడానికి, పరిపాలించడానికి దేవుడు ఆయనను నియమించాడు. ఇశ్రాయేలు ప్రజలకు మారుమనస్సు, పాప క్షమాపణ దయచేయడానికి ఆయనను అధికారిగా నియమించాడు.
\v 32 యేసు విషయంలో జరిగిన సంగతులకు మేము, దేవుడు తన విధేయులకు తోడుగా పంపిన పరిశుద్ధాత్మ సాక్షులం. అందుకే ఈ విషయాలన్నీ మేము బోధిస్తున్నాం" అన్నారు.
\s5
\p
\v 33 వాళ్ళు ఈ మాటలు విని, కోపంతో ఊగిపోతూ అపొస్తలులను చంపెయ్యాలని చూశారు.
\v 34 అయితే గమలియేలు అనే పరిసయ్యుడు మాట్లాడడానికి లేచి నిలబడ్డాడు. ఇతడు ధర్మశాస్త బోధకుడు, సంఘంలో అందరిచే గౌరవ మర్యాదలు చూరగొన్నవాడు. అతడు భటులతో అపొస్తలులను కొంచెం సేపు బయటకు తీసుకువెళ్ళమని చెప్పాడు.
\s5
\p
\v 35 వాళ్ళు అపొస్తలులను బయటకు తీసుకు వెళ్ళిన తరువాత సభలోని ఇతర సభ్యులతో ఇలా చెప్పాడు, "నా సాటి ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
\v 36 కొన్ని ఏళ్ల క్రితం తుదాస్ అనే వాడు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశాడు. తానొక గొప్ప నాయకుడినని చెప్పుకున్నాడు. 400 కంటే ఎక్కువ మంది అతనితో చేతులు కలిపారు. అయితే అతడు హతమయ్యాడు. అతని అనుచరులు చెల్లాచెదరై పోయారు. కనుక వాళ్ళు ఆశించినది ఏమీ సాధించ లేకపోయారు.
\v 37 ఆ తరువాత, పన్నులు విధించడం కోసం జనాభా లెక్కల సేకరణ సమయంలో గలిలయ వాడైన యూదా తిరుగుబాటు చేసి చాలామందిని తనవైపు తిప్పుకున్నాడు. అతడు కూడా హతమయ్యాడు. అతని అనుచరులు కూడా చెదిరిపోయారు.
\s5
\v 38 కాబట్టి నేను చెప్పేదేమంటే, ఈ మనుషులకు ఎలాంటి హానీ తలపెట్టవద్దు. వాళ్ళ మానాన వాళ్ళను వదిలెయ్యండి. నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇది మనుషుల ఆలోచనల వల్ల అయినదైతే అది ఎలానూ కుప్పగూలుతుంది.
\v 39 అయితే ఇది గనక దేవుడు నియమించినదైతే మీరు వాళ్ళను ఆపలేరు. అప్పుడు మీరు దేవునికి వ్యతిరేకంగా పోరాడినవారౌతారు." అతడు చెప్పిన మాటలు సభ సభ్యులు అంగీకరించారు.
\s5
\p
\v 40 ఆలయ సైనికులను పిలిచి అపొస్తలులను బయటకు తెచ్చి వాళ్ళను కొరడాలతో కొట్టమని చెప్పారు. సైనికులు అపొస్తలులను కొరడా దెబ్బలు కొట్టారు. ఇకపై యేసును గురించి ఎన్నడూ బోధించవద్దని హెచ్చరించి విడుదల చేశారు.
\v 41 అపొస్తలులు ఆ సభ దగ్గరనుండి బయలుదేరారు. యేసు అనుచరులుగా అవమానం పొందడానికి తాము పాత్రులమని దేవుడు తమను ఎంచినందుకు సంతోషిస్తూ వెళ్ళిపోయారు.
\p
\v 42 తరువాత, ప్రతిరోజూ అపొస్తలులు దేవాలయంలో, ఇళ్ళలో క్రమం తప్పకుండా బోధిస్తూ, యేసే మెస్సీయ అని ప్రకటిస్తూ వచ్చారు.
\s5
\c 6
\p
\v 1 ఆ రోజుల్లో విశ్వాసులుగా మారుతున్నవాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. యూదులు కాని విశ్వాసులు ప్రతిరోజూ భోజనం అందించే విషయంలో తమలోని వితంతువులను చిన్నచూపు చూస్తున్నారని యూదులైన ఇశ్రాయేలు విశ్వాసులపై పిర్యాదు చేశారు.
\s5
\p
\v 2 ఇది తెలుసుకున్న అపొస్తలులు యెరూషలేములోని విశ్వాసులందరినీ సమావేశపరిచారు. వాళ్ళతో ఇలా అన్నారు, "మేము బోధించడం, సువార్త అందించడం మానుకుని ప్రజలకు భోజనాలు వడ్డిస్తూ ఉండడం మంచిది కాదు.
\v 3 కాబట్టి మీరు మీలో నుండి ఆత్మతో, జ్ఞానంతో నిండిన ఏడుగురు మనుషులను ఎంపిక చేసుకోండి. వాళ్ళు చేయవలసిన పనులను మేము కేటాయిస్తాం.
\v 4 మేము మాత్రం ప్రార్థనలో, సువార్త ప్రకటనలో మా సమయం గడుపుతాం."
\s5
\p
\v 5 ఈ మాటలు విశ్వాసులకు నచ్చాయి. అందువల్ల వాళ్ళు విశ్వాసంలో స్థిరుడై, పరిశుద్దాత్మతో నిండి ఉన్న స్తెఫనును ఎంపిక చేసుకున్నారు. ఇంకా అతనితోపాటు ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు, సీమోను, పర్మినాసు, యూదా మతం స్వీకరించిన అంతియొకయ నివాసి నీకోలాసు అనే వాళ్ళను ఈ పనుల నిమిత్తం ఎన్నుకున్నారు.
\v 6 విశ్వాసులు తాము ఎన్నుకొన్న ఏడుగురిని అపొస్తలుల చెంతకు తీసుకువచ్చారు. అపొస్తలులు వాళ్ళలో ప్రతి ఒక్కరి మీదా చేతులుంచి ప్రార్థన చేసి వారి వారి పనులు పురమాయించారు.
\s5
\p
\v 7 విశ్వాసులు అనేకులకు దేవుని సువార్త ప్రకటిస్తూ వచ్చారు. దేవుని వార్త అంతటా వ్యాపించి యెరూషలేములో యేసుని నమ్మినవాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. సువార్త విని యేసును నమ్మిన యూదా మత బోధకులు కూడా వీరితో కలిశారు.
\s5
\p
\v 8 స్తెఫను దేవుని శక్తితో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు చేస్తూ యేసు సువార్త ప్రకటిస్తున్నాడు.
\v 9 అయితే యూదుల సమాజమందిరాల్లో క్రమంగా కలుస్తూ ఉండే "స్వతంత్రులు" అనే వర్గం, కురేనీయులు, అలెగ్జాండ్రియా వాళ్ళు, కిలికియ, ఆసియా ప్రాంతాలవాళ్ళు స్తెఫనుకు వ్యతిరేకంగా గుమిగూడి, అతనితో వాదులాటకు దిగారు.
\s5
\p
\v 10 దేవుని ఆత్మ ప్రభావంతో జ్ఞానంతో మాట్లాడుతున్న స్తెఫను ఎదుట వాళ్ళ వాదనలు నిలవ లేకపోయాయి.
\p
\v 11 అందువల్ల వాళ్ళు కొందరు మనుషులను రహస్యంగా పోగుచేసి, వాళ్ళతో "ఈ వ్యక్తి మోషేను, దేవుణ్ణి దూషిస్తున్నాడు" అని స్తెఫనుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం చెప్పించారు.
\s5
\p
\v 12 ఇది విన్న యూదా పెద్దలకు, మత గురువులకు స్తెఫనుపై కోపం వచ్చింది. అతణ్ణి బంధించి యూదా మత సభ ఎదుట నిలబెట్టారు.
\v 13 అతనిపై తప్పుడు సాక్ష్యం చెప్పేందుకు కొందరికి డబ్బు ముట్టజెప్పి వాళ్ళను కూడా అక్కడకు తీసుకువచ్చారు. వాళ్ళు, "ఇతడు పవిత్ర దేవాలయం గురించీ, దేవుని ధర్మశాస్త్రం గురించీ చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు."
\p
\v 14 "నజరేతు వాడైన యేసు దేవాలయాన్ని ధ్వంసం చేసి, మోషే మన పూర్వీకులకు ఇచ్చిన ఆచారాలకు మార్చివేస్తాడని వీడు చెబుతుండగా మేము విన్నాము" అని చెప్పారు.
\p
\v 15 సభలో కూర్చున్న వాళ్ళంతా అతనివైపు చూసినప్పుడు అతని ముఖం దేవదూత ముఖం లాగా వెలిగిపోతున్నట్టు కనబడింది.
\s5
\c 7
\p
\v 1 ప్రధాన యాజకుడు స్తెఫనుతో "ప్రజలు నీ గురించి చెప్పుకునే మాటలు నిజమేనా?" అని అడిగాడు.
\p
\v 2 అందుకు స్తెఫను "సాటి యూదులారా, నాయకులారా, వినండి. మన పూర్వికుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసపోటేమియాలో ఉన్నప్పుడు మహిమగల మన దేవుడు అతనికి ప్రత్యక్షమై,
\v 3 "నువ్వు, నీ మనుషులూ మీరు నివసిస్తున్న ప్రాంతం విడిచి, నేను నీకు చూపించబోయే ప్రదేశానికి వెళ్ళు" అని చెప్పాడు."
\s5
\p
\v 4 "అప్పుడు అబ్రాహాము కల్దీయ దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మనం ఉంటున్న ఈ దేశంలో ఉండటానికి దేవుడు అతణ్ణి తీసుకొచ్చాడు.
\v 5 ఆ సమయంలో దేవుడు అబ్రాహాముకి కొంచెం భూమి కూడా ఇవ్వకుండా, అతనికి సంతానం లేని సమయంలో అతనికీ, అతని తర్వాత అతని సంతానానికీ దాన్ని స్వాధీనం చేస్తానని వాగ్దానం చేశాడు."
\s5
\p
\v 6 "తర్వాత దేవుడు అబ్రాహాముతో "నీ సంతానం పరాయి దేశంలో కొంతకాలం ఉంటారు, అక్కడి నాయకులు వాళ్ళని 400 ఏళ్ళు బానిసలుగా బాధపెడతారు.
\v 7 కాని నేను మిమ్మల్ని బానిసలుగా చేసిన ఆ ప్రాంత ప్రజలను శిక్షిస్తాను. ఆ తర్వాత మీ వారసులు బయటకి వచ్చి ఈ స్థలంలో నన్ను ఆరాధిస్తారు," అని దేవుడు చెప్పాడు."
\p
\v 8 "అప్పుడు దేవుడు అబ్రాహాముకు, అతని మరుసటి తరం వాళ్ళకీ సున్నతితో కూడిన ఒక ఆజ్ఞ నియమించాడు. అతడు ఇస్సాకును కని ఎనిమిదవ రోజున అతనికి సున్నతి చేశాడు. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 మంది గోత్ర మూలపురుషులను కని వాళ్ళకి సున్నతి చేసాడు."
\s5
\p
\v 9 "యాకోబు 12 మంది కుమారులు యోసేపుపై తమ తండ్రి చూపుతున్న అతి ప్రేమకు అసూయపడి, అతణ్ణి ఈజిప్టు వాళ్ళకి అమ్మేశారు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి,
\v 10 అతని బాధలన్నిటి నుండి తప్పించాడు. ఈజిప్టుకు రాజైన ఫరో ఎదుట అతనికి దయను, జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఫరో ఈజిప్టు మీద, తన ఆస్థానం అంతటి మీద అతణ్ణి అధికారిగా నియమించాడు."
\s5
\p
\v 11 "యోసేపు అధికారిగా ఉండగా, ఈజిప్టులో, కనాను దేశమంతటిలో తీవ్రమైన కరువు వచ్చింది. ప్రజలందరు బాధలు పడ్డారు. ఆ సమయంలో కనానులోని యాకోబు అతని కుమారులకు కూడా ఆహారం దొరకలేదు.
\v 12 ఈజిప్టులో తిండి గింజలు ఉన్నాయని యాకోబు తెలుసుకుని ధాన్యం కొనుక్కు రమ్మని అక్కడికి తన కొడుకులను పంపాడు. వాళ్ళు యోసేపు దగ్గర ధాన్యం కొనుక్కుని వెళ్ళిపోయారు కాని అతణ్ణి గుర్తుపట్టలేదు."
\p
\v 13 "యోసేపు అన్నలు రెండోసారి అక్కడికి వెళ్ళినప్పుడు, యోసేపు తాను ఎవరో వాళ్ళకి చెప్పాడు. అప్పుడు యోసేపు కుటుంబం గురించి ఫరోకు తెలిసింది.
\s5
\v 14 అప్పుడు యోసేపు తన అన్నలను వెనక్కి పంపించి తన తండ్రి యాకోబును, తన మొత్తం కుటుంబాన్ని ఈజిప్టుకు తీసుకు రమ్మని చెప్పాడు. వాళ్ళు మొత్తం 75 మంది.
\v 15 అది విన్న యాకోబు తన కుటుంబంతో ఈజిప్టులో జీవించడానికి వెళ్ళాడు. తర్వాత యాకోబు, మన పితరులూ అక్కడే చనిపోయారు.
\v 16 వాళ్ళని షెకెము అనే ఊరికి తెచ్చి హమోరు వంశం వాళ్ళ దగ్గర అబ్రాహాము వెల ఇచ్చి కొన్న సమాధిలో ఉంచారు."
\s5
\p
\v 17 "దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసినట్టుగా, తామరతంపరగా వృద్ధి చెందిన జాతిని ఈజిప్టు నుంచి విడిపించే సమయం దగ్గర పడింది.
\v 18 ఈజిప్టు ప్రజలకు మేలు చేసిన యోసేపు గురించి తెలియని వేరొక రాజు ఈజిప్టులో అధికారంలోకి వచ్చాడు.
\v 19 ఆ రాజు మన పూర్వికులను మట్టుపెట్టాలని ప్రయత్నించాడు. వాళ్ళకి పుట్టిన పిల్లలు బతక్కుండా వాళ్ళని బయట పారేయాలని వాళ్ళని బాధించాడు."
\s5
\p
\v 20 "ఆ రోజుల్లో మోషే పుట్టాడు. అతడు చాలా అందంగా ఉండటంతో, అతని తల్లితండ్రులు రహస్యంగా మూడు నెలలు వాళ్ళ ఇంట్లో పెంచారు.
\v 21 వాళ్ళు అతణ్ణి ఇక దాచిపెట్టలేని సమయం వచ్చినప్పుడు ఫరో కుమార్తె ఆ బిడ్డను తన సొంత కుమారుడిగా పెంచుకుంది.
\s5
\v 22 మోషే ఐగుప్తీయుల అన్ని విద్యలూ నేర్చుకుని, తాను ఎదిగిన తర్వాత మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం పొందాడు.
\v 23 మోషేకు సుమారు 40 ఏళ్ళ వయసప్పుడు, ఇశ్రాయేలీయులైన తన బంధువులను చూడాలని అనుకున్నాడు.
\v 24 అక్కడ ఒక ఈజిప్టు వాడి వల్ల ఒక ఇశ్రాయేలీయుడు దౌర్జన్యానికి గురి కావడం చూసి, అతన్ని కాపాడి ఆ ఈజిప్టువాణ్ణి చంపి ప్రతికారం తీర్చుకున్నాడు.
\v 25 తన ద్వారా తన ప్రజలను దేవుడు విడుదల చేస్తున్నాడనే విషయం తన ప్రజలు గ్రహిస్తారని అనుకున్నాడు. కాని వాళ్ళు గ్రహించలేదు."
\s5
\p
\v 26 "ఆ తర్వాత రోజు ఇద్దరు పోట్లాడుకుంటుంటే అతడు వాళ్ళను చూసి, "ఏమయ్యా, మీరు ఒకే జాతి వాళ్ళు కదా, ఎందుకు పోట్లాడుకుంటున్నారు?" అని వాళ్ళకి సర్దిచెప్పాలని చూసాడు.
\v 27 అయితే అవతల వ్యక్తిని గాయపరిచినవాడు, మోషేను పక్కకు నెట్టి "మా మీద అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్నెవరు నియమించారు?
\v 28 నిన్న ఈజిప్టువాణ్ణి చంపినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా?" అని అడిగాడు."
\s5
\p
\v 29 "ఆ మాట విన్న మోషే ఈజిప్టు నుండి మిద్యాను దేశం పారిపోయి, అక్కడే పెళ్ళిచేసుకుని, ఇద్దరు కొడుకులను కని అక్కడే కొన్ని ఏళ్ళు ఉన్నాడు.
\v 30 నలభై ఏళ్ళ తర్వాత ఒక రోజు సీనాయి పర్వతారణ్యంలో, దేవుడు ఒక పొదలోని మంటల్లో దేవదూత వలె కనిపించాడు.
\s5
\v 31 పొదలో మంటలు లేకపోయినా మండుతున్న దాన్ని చూసి ఆశ్యర్యపడిన మోషే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు. ప్రభువు మాటలు అతనికి వినపడ్డాయి.,
\v 32 "నేను నీ పూర్వీకుల దేవుణ్ణి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి." ప్రభువు మాటలు విన్న మోషే వణికిపోతూ, అటు చూడటానికి సాహసించ లేకపోయాడు."
\s5
\p
\v 33 "అప్పుడు ప్రభువు అతనితో ఇలా అన్నాడు, "నన్ను ఘనపరచాలంటే నీ చెప్పులు తీసివెయ్యి. నీవు నిలుచున్న చోటు పవిత్ర స్థలం, నీవు నా ఎదుట నిల్చున్నావు.
\v 34 ఈజిప్టులో ఉన్న నా ప్రజలు అక్కడి వాళ్ళచేతుల్లో పడుతున్న బాధలను చూసాను. వాళ్ళ మూలుగులు నేను విన్నాను. వాళ్ళని విడిపించడానికే దిగి వచ్చాను. రా, నిన్ను ఇప్పుడు ఈజిప్టుకు పంపబోతున్నాను."
\s5
\v 35 మాపై అధికారిగా, న్యాయనిర్ణేతగా నిన్ను నియమించినవాడు ఎవడు? అని వాళ్ళు నిరాకరించిన మోషేను, ప్రభువు తానే దూత ద్వారా అతనికి పొదలో కనబడి, అధికారిగా విమోచకుడిగా నియమించి పంపాడు."
\p
\v 36 "మోషే ఈజిప్టులో, ఎర్ర సముద్రంలో, అరణ్యంలో 40 ఏళ్ళు అనేక అద్బుత కార్యాలను చేసి, ఇశ్రాయేలీయులను ఈజిప్టునుండి బయటకు తోడుకుని వచ్చాడు."
\q1
\v 37 "నా లాంటి ఒక ప్రవక్తను దేవుడు మీ ప్రజలనుండి లేవనెత్తుతాడు." "ఈ విధంగా ఇశ్రాయేలీయులతో చెప్పింది ఈ మోషేనే."
\s5
\p
\v 38 "సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దూతతోను మన పూర్వికులతోను అరణ్యంలోని సంఘంలో ఉండి మనకు ఇవ్వడానికి దేవుని ఆజ్ఞలను తీసుకున్నది ఈ మోషేనే."
\p
\v 39 "మన పూర్వికులు లోబడకుండా తిరస్కరించిన వ్యక్తి ఇతడే. వాళ్ళు అతణ్ణి నాయకుడిగా ఒప్పుకోకుండా ఈజిప్టుకు తిరిగి వెళ్ళాలనుకున్నారు.
\v 40 అప్పుడు వాళ్ళు "మమ్మల్ని ముందుకు నడిపించే దేవుళ్ళను మా కోసం తయారు చెయ్యి. ఈజిప్టు నుంచి మమ్మల్ని తీసుకువచ్చిన ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు" అని అహరోనుతో అన్నారు.
\s5
\v 41 అప్పుడు వాళ్ళు దూడ ఆకారంలో ఒక విగ్రహం చేసుకుని, దానికి బలి అర్పించి, ఆడి పాడి, తాము చేసిన పనిలో ఆనందించారు.
\v 42 అందుకని దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను పూజించే ఆ జనాన్ని విడిచిపెట్టాడు. ఒక ప్రవక్త ఇలా రాసాడు."
\q1 "ఇశ్రాయేలీయులారా, 40 ఏళ్ళు మీరు అరణ్యంలో వధించిన పశువులనూ, బలులనూ నాకు అర్పించారా?
\s5
\q1
\v 43 మీరు చేసుకున్న విగ్రహాలు మీతోపాటు తీసుకెళ్ళి పూజించిన మొలెకు గుడారాన్ని,
\q1 నక్షత్రం ఆకారంలో ఉండే రెఫాను అనే శని దేవుడిని పూజించడం కోసం మోసుకుపోయారు.
\q1 కాబట్టి బబులోను అవతలకి మిమ్మల్ని తీసుకుపోతాను."
\s5
\p
\v 44 "మన పూర్వికులు అరణ్యంలో ఉన్నప్పుడు, దేవుడు మోషేకి కొండపైన చూపిన నమూనా లాగా ప్రత్యక్ష గుడారం తయారు చేసుకుని దానిని పూజించడం మొదలుపెట్టారు.
\v 45 తర్వాత మన పూర్వికులు దాన్ని తీసుకుని యెహోషువతో పాటు ఈ దేశంలోకి వచ్చారు. దేవుడు తమ ఎదుట నుంచి వెళ్ళగొట్టిన జనాలను వాళ్ళు ఓడించి స్వాధీనపర్చుకున్నారు. తర్వాత అది దావీదు కాలం వరకు ఉంది.
\v 46 దావీదు దేవుని అనుగ్రహం పొంది, ఆయన్ను పూజించడానికి నివాస స్థలాన్ని నిర్మించాలని ఆశించాడు."
\s5
\p
\v 47 "అయితే దావీదు కుమారుడు సొలోమోనుద్వారా దేవుడు ఆ మందిరం కట్టించాడు.
\v 48 కానీ యెషయా ప్రవక్త చెప్పినట్టుగా, "సర్వోన్నతుడైన దేవుడు, మనుషుల చేతులతో చేసిన ఇళ్ళలో నివసించడు."
\q1
\v 49 "ఆకాశం నా సింహాసనం, భూమి నేను కాలు మోపే స్థలం.
\q1 మీరు నాకోసం ఎలాంటి ఇల్లు కడతారు?
\q1 నా విశ్రాంతి స్థలమేది?
\q1
\v 50 ఇవన్నీ నా చేతిపనులు కావా?" అని ప్రభువు అడుగుతున్నాడు."
\s5
\p
\v 51 "మీరు దేవుని పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మీ పూర్వీకుల లాగే మీరు కూడా ఎప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు.
\v 52 మీ పూర్వికులు ప్రతి ప్రవక్తనూ హింసించారు. మెస్సీయ రాక గురించి ముందే చెప్పిన వాళ్ళని చంపేశారు. ఆయనను కూడా మీరు ఇప్పుడు అప్పగించి హత్యానేరం మూటగట్టుకున్నారు.
\v 53 దూతలు అందించిన ధర్మశాస్త్రాన్ని పొందారు కాని దానిని మీరే పాటించలేదు."
\s5
\p
\v 54 యూదుల సభలోని వాళ్ళు ఈ మాటలు విని తోక తొక్కిన తాచుల్లా లేచారు. స్తెఫనును చూసి పళ్ళు పటపట కొరికారు.
\p
\v 55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశంలోకి చూస్తూ, దేవుని వెలుగును చూసాడు. దేవుడు కుడి పక్కన యేసు నిలబడి ఉండటం చూసాడు.
\v 56 "అదుగో ఆకాశం తెరుచుకోవడం, మనుష్యకుమారుడు దేవుని కుడి పక్కన నిలిచి ఉండటం చూస్తున్నాను" అని చెప్పాడు.
\s5
\v 57 అప్పుడు అతని మాటలు వింటున్న వారంతా గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకుని అతని మీదకు వచ్చారు.
\v 58 అతణ్ణి యెరూషలేము పట్టణం బయటకి ఈడ్చుకుపోయి, రాళ్ళతో కొట్టారు. రాళ్ళు బలంగా విసరడానికి వీలుగా తమ పైదుస్తులు తీసివేశారు. తీసివేసిన తమ బట్టలకు కాపలాగా సౌలు అనే యువకుణ్ణి ఉంచారు.
\s5
\p
\v 59 వాళ్ళు స్తెఫనును రాళ్ళతో కొడుతున్నపుడు, అతడు ప్రభువును ప్రార్ధిస్తూ, "యేసు ప్రభూ, నా ఆత్మను చేర్చుకో" అన్నాడు.
\p
\v 60 అప్పుడు స్తెఫను మోకరించి గట్టిగా కేక వేశాడు, "ప్రభూ, వీరి మీద ఈ పాపం మోపవద్దు." ఈ మాట పలికి అతడు చచ్చిపోయాడు.
\s5
\c 8
\p
\v 1 అప్పుడు దేవుణ్ణి నమ్మిన కొందరు స్తెఫను శవాన్ని సమాధి చేసి, అతణ్ణి గురించి ఎంతగానో విలపించారు.
\v 2 ఆ రోజు నుంచి యెరూషలేములో విశ్వాసులకు తీవ్రమైన హింస మొదలైంది.
\v 3 స్తెఫను మరణాన్ని సౌలు అధికారికంగా ఆమోదించాడు. ఇక అప్పటినుండి అతడు కూడా విశ్వాసుల సమూహాలను హింసించడం మొదలుపెట్టాడు. ప్రతి ఇంట్లోకీ చొరబడి స్త్రీ పురుషులని తేడా లేకుండా యేసును నమ్మే అందిరినీ బయటకు ఈడ్చుకు వచ్చి చెరసాలలో వేయడం మొదలుపెట్టాడు.
\s5
\p
\v 4 యెరూషలేములోని విశ్వాసులంతా వేరు వేరు ప్రాంతాలకు చెదరిపోయి అక్కడ యేసు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు.
\v 5 యేసు శిష్యుల్లో ఒకడైన ఫిలిప్పు సమరయ నగరానికి వెళ్లి అక్కడ యేసు సందేశాన్ని ప్రకటించాడు.
\s5
\v 6 అతడు చెబుతున్న బోధలు, చేస్తున్న అద్భుత క్రియల గురించి విన్న అనేకులు అతనిపై దృష్టి నిలిపారు.
\v 7 ఫిలిప్పు చాలా మందికి పట్టిన దురాత్మలను వెళ్ళగొట్టాడు. పక్షవాతం వచ్చినవాళ్ళను, కుంటివాళ్ళను బాగుచేశాడు.
\v 8 అందువల్ల ఆ పట్టణంలో అందరూ ఆనందించారు.
\s5
\p
\v 9 అదే నగరంలో నేనే గొప్పవాడినని చెప్పుకుంటూ కొంతకాలంగా తన మంత్ర విద్యలచే ప్రజలను ఆకట్టుకొంటున్న సీమోను అనే వాడు ఉన్నాడు.
\p
\v 10 పట్టణంలో సామాన్యులు, గొప్పవాళ్ళు "అతడు దేవుని మహా శక్తి" అని భావిస్తూ అతని మాట వినేవాళ్ళు.
\p
\v 11 అతడు చాలాకాలంగా మంత్రవిద్యలు చూపుతూ ఉండడం వల్ల అనేకులు అతని మాటలు శ్రద్ధగా వినేవాళ్ళు.
\s5
\p
\v 12 అయితే ఫిలిప్పు దేవుణ్ణి గురించీ, యేసును గురించీ సువార్త బోధించినప్పుడు నగర ప్రజలు యేసుపై విశ్వాసముంచి స్త్రీ పురుషులు అనేకులు బాప్తిసం తీసుకున్నారు.
\p
\v 13 సీమోను కూడా ఫిలిప్పు బోధను నమ్మి బాప్తిసం పొందాడు. అతడు ఫిలిప్పుతో కలసి ఉంటూ జరుగుతున్న సూచక క్రియలూ, అద్భుతాల చూసి ఆశ్చర్యపడ్డాడు.
\s5
\p
\v 14 సమరయ ప్రజలు దేవుని సువార్తను నమ్ముతూ కొనసాగుతున్నారన్న సమాచారం విని, యెరూషలేములో ఉన్న అపొస్తలులు పేతురు, యోహానులను అక్కడికి పంపారు.
\p
\v 15 వాళ్ళు అక్కడకు వచ్చి అక్కడి విశ్వాసులపై పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోసం ప్రార్ధించారు.
\p
\v 16 అంతకుముందు అక్కడి వాళ్ళు యేసు నామంలో బాప్తిసం పొందారు కానీ పరిశుద్దాత్మను పొందలేదు.
\p
\v 17 పేతురు, యోహానులువాళ్ళ తలలపై చేతులుంచి ప్రార్ధించినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు.
\s5
\p
\v 18 అపొస్తలులు చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ దిగి రావడం చూసిన సీమోను, తనపై కూడా ఆత్మ వచ్చేలా చేయమని అపొస్తలులకు డబ్బు ఆశ చూపించాడు.
\p
\v 19 "నేను ఎవరి మీదైతే చేతులుంచుతానో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందేలా నాకు అధికారం ఇవ్వండి" అని అడిగాడు.
\s5
\p
\v 20 అందుకు పేతురు, "నువ్వు దేవుడిచ్చే వరాన్ని డబ్బుతోకొనాలని చూస్తున్నావు. కాబట్టి నీ డబ్బు నీతోపాటు నశిస్తుంది.
\v 21 నీ హృదయం దేవునితో కలవలేదు. కనుక మా పనిలో నీకు పాలు లేదు.
\v 22 నీ చెడ్డ ఆలోచన బట్టి పశ్చాత్తాపపడి ఆయనను వేడుకో. నీ దురాశను ఆయన క్షమించవచ్చు.
\v 23 నువ్వు కటిక చీకటిలో ఉన్నావు. నీలో నిలువెల్లా దుష్టత్వమే నాకు కనిపిస్తున్నది" అన్నాడు.
\s5
\v 24 అప్పుడు సీమోను "మీరు చెప్పిన ఏ కీడూ నాకు కలగకుండా నా కోసం ప్రార్ధించండి" అని కోరుకున్నాడు.
\s5
\p
\v 25 ఆ తరువాత పేతురు, యోహానులు సాక్ష్యమిస్తూ, యేసు ప్రభువని ప్రకటిస్తూ సమరయ గ్రామాల్లో అంతటా పర్యటించి యెరూషలేముకు చేరుకున్నారు.
\s5
\p
\v 26 ఒకనాడు దేవుడు పంపిన దూత ఫిలిప్పుకు కనిపించి, "నువ్వు బయలుదేరి దక్షిణ దిశగా అరణ్య మార్గంలో ప్రయాణించి యెరూషలేము నుండి గాజాకు వైపుకు వెళ్ళు" అని చెప్పాడు. ఆప్రకారమే అతడు బయలుదేరాడు.
\v 27 ఫిలిప్పు దారి వెంట నడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఇతియోపియా దేశపు రాణి కందాకే ఖజానా లావాదేవీలు నిర్వహించే ఇతియోపీయుడు దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడు.
\v 28 తన తిరుగు ప్రయాణంలో తన రథం పై కూర్చుని యెషయా ప్రవక్త గ్రంథం చదువుతున్నాడు.
\s5
\p
\v 29 దేవుని ఆత్మ ఫిలిప్పుతో, నువ్వు బయలుదేరి ఆ రథం దగ్గరుకు చేరుకో" అని చెప్పాడు.
\v 30 ఫిలిప్పు ఆ రథం దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి, ఆ అధికారి యెషయా గ్రంథం చదువుతూ ఉండడం చూసి, "నువ్వు చదువుతున్నది నీకు అర్ధమౌతుందా? అని అడిగాడు.
\v 31 అందుకతడు "నాకెవరైనా దీనిని వివరించేవాళ్ళు లేకపోతే ఎలా అర్థం అవుతుంది? దయచేసి రథమెక్కి నా పక్కన కూర్చో" అన్నాడు.
\s5
\v 32 ఆ సమయంలో అతడు చదువుతున్న భాగం,
\q1 ఆయనను గొర్రెలా వధకు తెచ్చారు.
\q1 ఉన్ని కత్తిరించే వాడి దగ్గర
\q1 గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టే,
\q1 ఆయన నోరు తెరవలేదు.
\q1
\v 33 ఆయన దీనత్వాన్ని బట్టి ఆయనకు న్యాయం దొరకలేదు.
\q1 ఆయన సంతతి గురించి ఎవరు వివరిస్తారు?
\q1 ఎందుకంటే ఆయన ప్రాణాన్ని లోకం నుండి తీసేసారు.
\s5
\p
\v 34 వాళ్ళు ప్రయాణిస్తూ నీళ్ళు ఉన్న చోట ఆగారు. అప్పుడు ఆ అధికారి "చూడు, అక్కడ నీళ్ళు ఉన్నాయి. నేను బాప్తిసం తీసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు బాప్తిసం ఇవ్వు" అని కోరాడు.
\v 35 అతడు రథం ఆపమని చెప్పి ఇద్దరూ నీళ్ళలోకి దిగారు. ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాడు.
\s5
\v 36 వాళ్లిద్దరూ బయటకు వచ్చారు.
\v 37 ప్రభువు ఆత్మ ఉన్నట్టుండి ఫిలిప్పును తీసుకుపోయాడు.
\v 38 ఆ అధికారికి ఫిలిప్పు అక్కడ కనబడలేదు.
\s5
\v 39 ఫిలిప్పు కనిపించకుండా పోయినప్పటికీ అతడు ఆ దారి వెంట సంతోషంగా వెళ్ళిపోయాడు.
\p
\v 40 పరిశుద్ధాత్మ తనను అజోతు అనే చోటికి అద్భుత రీతిగా తీసుకువచ్చాడని ఫిలిప్పు గ్రహించాడు. అతడు అజోతు ప్రాంతం అంతా సంచరిస్తూ, అజోతు, కైసరయల మధ్య సువార్త ప్రకటన కొనసాగిస్తూ, చివరకు కైసరయకు చేరుకునేదాకా ప్రకటిస్తూనే ఉన్నాడు.
\s5
\c 9
\p
\v 1 ఆ సమయంలో సౌలు కోపంతో బుస కొడుతూ ప్రభువును వెంబడించే వాళ్ళని చంపుతానని బెదిరిస్తూ ఉన్నాడు. అతడు యెరూషలేములోని ప్రధాన యాజకుడి దగ్గరకి వెళ్లి,
\v 2 యేసు బోధించిన మార్గాన్ని అనుసరించే మగవాళ్ళు గానీ ఆడవాళ్లు గానీ దొరికితే, వాళ్ళని బంధించి యెరూషలేముకు తీసుకుని వస్తాననీ అప్పుడు యూదీయ నాయకులు న్యాయం తీర్చి వాళ్ళని శిక్షించ వచ్చనీ ఉత్తరం రాశాడు. దమస్కు ఊరి యూదీయ సమాజ మందిరాల నాయకులకు తన గురించి పరిచయ పత్రాలు రాసి ఇమ్మని అడిగాడు.
\s5
\p
\v 3 అతడు వాళ్ళతో ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గరకు వచ్చేసరికి, హటాత్తుగా ఆకాశo నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది.
\p
\v 4 వెంటనే అతడు నేల మీద పడిపోయాడు, "సౌలూ, సౌలూ నీవెందుకు నన్ను హింసిస్తున్నావు?" అనే ఒక స్వరం విన్నాడు.
\s5
\p
\v 5 "ప్రభూ, నీవెవరు?" అని అతడు అడిగాడు. ప్రభువు, "నువ్వు హింసిస్తున్న యేసును.
\v 6 లేచి ఉళ్ళోకి వెళ్ళు. అక్కడ నీవేం చెయ్యాలో అది నీకు తెలుస్తుoది" అని చెప్పాడు.
\v 7 సౌలుతో పాటు ప్రయాణిస్తున్న వాళ్ళు ఆ శబ్దం విని, ఏమీ మాట్లాడలేక నిలబడిపోయారు. వాళ్ళకి ఏమీ కనబడలేదు.
\s5
\p
\v 8 సౌలు నేల మీద నుంచి లేచి కళ్ళు తెరిచి ఏమీ చూడలేకపోయాడు. అప్పుడు వాళ్ళు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోకి నడిపించారు.
\v 9 అతడు మూడు రోజులపాటు చూపు లేకుండా ఉన్నాడు. ఏమీ తినలేదు, తాగలేదు.
\s5
\p
\v 10 దమస్కులో అననీయ అనే ఒక యేసు శిష్యుడున్నాడు. అతనికి ప్రభువు దర్శనమిచ్చి, "అననీయా" అని పిలిచాడు. దానికి అతడు, "ప్రభూ వింటున్నాను, చెప్పండి" అన్నాడు.
\p
\v 11 అందుకు ప్రభువు, "నీవు వెంటనే "వంకర లేనిది" అనే పేరున్న వీధికి వెళ్ళు. అక్కడ యూదా అనే అతని ఇంట్లో తార్సు ఊరి వాడైన సౌలు అనే మనిషి కోసం వాకబు చెయ్యి. అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు.
\v 12 అతడు దర్శనంలో, అననీయ అనే పేరు గల వ్యక్తి తన ఇంటి లోపలికి వచ్చి తాను చూపు పొందేలా తన తల మీద చేతులు వెయ్యడం చూసాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 13 అయితే అననీయ, "ప్రభూ, ఈ వ్యక్తి యెరుషలేములోని నీ ప్రజలకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గురించి చాలామంది చెప్పారు.
\v 14 దమస్కులో నిన్ను నమ్మిన వాళ్ళని బంధించడానికి అతడు ప్రధాన యాజకులు పంపితే వచ్చాడు" అన్నాడు.
\p
\v 15 అందుకు ప్రభువు, "నువ్వు సౌలు దగ్గరికి పోయి నేను చెప్పింది చెయ్యి. ఎందుకంటే ఇతన్ని యూదులు కానివాళ్ళ ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుటా నన్ను సేవించడానికి నేను ఏర్పరచుకున్నాను.
\v 16 నాకు నేనుగా అతడు నా నామం కోసం ఎన్ని బాధలు భరించాలో చూపిస్తాను" అని అతనితో చెప్పాడు.
\s5
\p
\v 17 అననీయ ఆ ఇంట్లోకి వెళ్లి, అతని మీద చేతులు వేసి, "సోదరా, సౌలూ, ప్రభువు తానే నాకు ఆజ్ఞాపించాడు, నువ్వు వచ్చిన దారిలో నీకు కనబడిన యేసు ప్రభువు, నీవు చూపు పొంది, పరిశుద్ధాత్మతో నిండేలా నన్ను నీ దగ్గరికి పంపాడు" అని చెప్పాడు.
\p
\v 18 వెంటనే సౌలు కళ్ళ నుండి పొరల్లాంటివి రాలిపోయి అతడికి చూపు వచ్చింది. అతడు లేచి బాప్తిసం పొందాడు.
\v 19 తర్వాత సౌలు భోజనం చేసి బలం పుంజుకుని, దమస్కులో ఉన్న శిష్యులతో చాలా రోజులు గడిపాడు.
\s5
\v 20 వెంటనే అతడు సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడని ప్రకటించడం మొదలు పెట్టాడు.
\v 21 అది విన్న జనమంతా ఆశ్చర్యపడి, "యెరూషలేములోఈ పేరుతో ప్రార్థన చేసే వాళ్ళని నాశనం చేసింది ఇతడే గదా? వాళ్ళని బందీలుగా ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుపోవడానికి గదా ఇతడు ఇక్కడికి వచ్చింది?" అనుకున్నారు.
\v 22 కాని దేవుడు సౌలును మరింత బలపరిచాడు. సౌలు మాత్రం యేసే క్రీస్తు అని రుజువు పరుస్తూ దమస్కులో ఉంటున్న యూదుల్ని కలవరపరిచాడు.
\s5
\p
\v 23 కొన్ని రోజుల తర్వాత యూదీయ నాయకులు అతణ్ణి చంపాలని ఆలోచించారు.
\v 24 వాళ్ళు అతణ్ణి చంపాలని రాత్రింబగళ్ళు ఆ పట్టణ సింహద్వారం దగ్గర మాటు వేశారు. వాళ్ళ కుట్ర సౌలుకు తెలిసింది.
\v 25 అయితే యేసును నమ్ముకున్న ఒకడు రాత్రివేళ అతణ్ణి ఆ నగరప్రకారం మీదకు తీసుకెళ్ళాడు. అక్కడ అతణ్ణి ఒక బుట్టలో కూర్చోబెట్టి గోడ మీద నుంచి అతణ్ణి కిందకు దింపి దమస్కు నుంచి తప్పించాడు.
\s5
\p
\v 26 అతడు యెరూషలేము వచ్చి శిష్యులను కలవాలని చూసాడు, కాని అతడు కూడా శిష్యుడేనని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు.
\p
\v 27 కానీ బర్నబా అతణ్ణి చేరదీసి అపొస్తలుల దగ్గరికి తీసుకు వచ్చి, "ఇతడు దారిలో ప్రభువుని చూశాడు. ప్రభువు ఇతనితో మాట్లాడాడు. ఇతడు దమస్కులో యేసు గురించి ధైర్యంగా బోధించాడు" అని వాళ్ళకి వివరించాడు.
\s5
\v 28 అప్పటినుంచి సౌలు యెరూషలేములోని శిష్యులను కలిసి యేసు గురించి ధైర్యంగా బోధించనారంభించాడు.
\p
\v 29 అతడు యేసు గురించి మాట్లాడుతూ, గ్రీకు యూదులతో కూడా చర్చించాడు. అయితే వాళ్ళు సౌలును చంపాలని ప్రయత్నం చేసారు.
\v 30 ఇతర శిష్యులు ఆ ప్రయత్నం గురించి విని అతణ్ణి కైసరయకు తీసుకువచ్చి అతని సొంత ఊరు తార్సుకు పంపేసారు.
\s5
\p
\v 31 కాబట్టి యూదయ, గలిలయ, సమరయ ప్రాంతంలోని సంఘాలు ప్రశాంతంగా ఉన్నారు. పరిశుద్దాత్మ ఇచ్చే ఆదరణతో, బలంతో అక్కడి సంఘాలు అభివృద్ధి చెంది శాఖోపశాఖలుగా విస్తరించాయి.
\p
\v 32 పేతురు ఆ ప్రాంతమంతా తిరుగుతున్నపుడు, లుద్ద అనే ఊరిలో ఉంటున్న దేవుని ప్రజల దగ్గరికి వచ్చాడు.
\s5
\v 33 అక్కడ పక్షవాతంతో ఎనిమిది సంవత్సరాల నుండి మంచాన ఉన్న ఐనెయ అనే వ్యక్తిని చూసి,
\v 34 "ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను బాగుచేసాడు, లేచి నీ పడక సర్దుకో" అని అతనితో చెప్పగానే అతడు లేచి నిలబడ్డాడు.
\v 35 లుద్ద, షారోను పట్టణాల్లో ఉంటున్న వారంతా అతణ్ణి చూసి ప్రభువుని విశ్వసించారు.
\s5
\p
\v 36 యొప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉంది. గ్రీకు భాషలో ఆమె పేరు దొర్కా. ఆమె పేదల పాలిట కల్పవల్లి.
\v 37 పేతురు లుద్దలో ఉన్నప్పుడు ఆమె జబ్బు పడి మరణించింది. అక్కడి స్త్రీలు ఆమె శరీరానికి స్నానం చేయించి మేడగదిలో ఉంచారు.
\s5
\p
\v 38 లుద్ద అనే ఊరు యొప్పేకు దగ్గరగా ఉండటం వల్ల పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, ఆలస్యం చేయకుండా తమ దగ్గరికి రమ్మని అతణ్ణి బ్రతిమలాడటానికి ఇద్దర్ని అతని దగ్గరకి పంపారు.
\p
\v 39 పేతురు లేచి వాళ్ళతో కూడా యొప్పెలోని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు మేడ గదిలోకి అతణ్ణి తీసుకెళ్ళారు. అక్కడ ఉన్న వితంతువులందరూ ఏడుస్తూ, దొర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలు, బట్టలు చూపిస్తూ అక్కడే నిలబడ్డారు.
\s5
\p
\v 40 పేతురు అందరిని బయటకి పంపించి మోకరించి ప్రార్థన చేసాడు, తర్వాత ఆ శవం వైపు తిరిగి, "తబితా, లేమ్మా" అనగానే ఆమె కళ్ళు తెరచి పేతురును చూసి లేచి కూర్చుంది.
\v 41 ఆతడు ఆమె చెయ్యి పట్టుకుని పైకి లేపాడు. అక్కడ చేరిన విశ్వాసులనూ, వితంతువులనూ పిలిచి ఆమెను సజీవంగా వాళ్ళకి అప్పగించాడు.
\v 42 ఈ అద్భుత కార్యం యొప్పే ప్రాంతమంతా తెలిసి, చాలామంది ప్రభువులో విశ్వాసముంచారు.
\v 43 యొప్పేలో జంతువుల తోళ్ళు బాగుచేసే సీమోను ఇంట్లో పేతురు చాలా రోజులు గడిపాడు.
\s5
\c 10
\p
\v 1 కైసరయ పట్టణంలో కొర్నేలి అనే వ్యక్తి ఉండేవాడు. ఇతడు ఇటలీ దేశపు సైన్యాధికారి.
\v 2 అతడు యూదుడు కాకపోయినా కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించేవాడు. యూదు ప్రజలకు దానధర్మాలు చేస్తూ ఎప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు.
\s5
\p
\v 3 మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు అతనికి ఒక దర్శనంలో దేవుడు పంపిన దూత అతని దగ్గరికి వచ్చి "కొర్నేలీ" అని పిలవడం స్పష్టంగా విన్నాడు.
\v 4 అతడు ఆ దూతను స్పష్టంగా చూసి ఎంతగానో భయపడ్డాడు, "ప్రభూ, ఏమిటి?" అని అడిగాడు. అందుకు ఆ దూత, "నీ ప్రార్థనలూ, పేదలకు నువ్వు చేసే సాయాలు దేవునికి జ్ఞాపకం ఉన్నాయి.
\v 5 కనుక ఇప్పుడు నువ్వు యొప్పేకు మనుషుల్ని పంపించు. అక్కడ పేతురు అనే మారుపేరున్న సీమోను ఉంటాడు. అతణ్ణి నీ దగ్గరకు పిలిపించుకో.
\v 6 అతడు సముద్రం పక్కనే ఉన్న సీమోను అనే చర్మకారుడి ఇంట్లో ఉన్నాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 7 దూత ఇలా చెప్పి వెళ్ళిన తరువాత కొర్నేలి తన పనివాళ్ళలో ఇద్దరిని పిలిచాడు. ఈ ఇద్దరు కాక, మరొక సైనికుణ్ణి పిలిచి
\v 8 దూత తనకు చెప్పిన విషయం వాళ్లకు వివరించి పేతురును కైసరయకు వెంటబెట్టుకు రమ్మని చెప్పి యొప్పేకు పంపించాడు.
\s5
\p
\v 9 తరువాతి రోజు మధ్యాహ్నం వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు యొప్పేకు చేరుకునే సమయానికి పేతురు ప్రార్థన చేసుకోవడానికి డాబా పైకి వెళ్ళాడు.
\p
\v 10 పేతురుకు ఆకలి వేసింది. ఏమైనా తినాలని చూశాడు. ఇంట్లోనివాళ్ళు వంట సిద్ధం చేస్తున్నారు. అప్పుడు పేతురుకి ఒక దర్శనం వచ్చింది.
\p
\v 11 ఆకాశం తెరుచుకుని ఒక పెద్ద దుప్పటి వంటిది కిందికి దిగి వచ్చింది. దాని నాలుగు మూలలు పైకి లేపి ఉన్నాయి.
\v 12 దానిలో భూమిపై ఉన్న అన్నిరకాల నాలుగు కాళ్ళ జంతువులు, పాకే పురుగులు, పక్షులు ఉన్నాయి.
\s5
\p
\v 13 అప్పుడు "పేతురూ, లేచి వాటిని చంపి తిను" అనే శబ్దం వినిపించింది.
\v 14 అందుకు పేతురు, "నువ్వు చెయ్యమన్న ఈ పని నేను చేయలేను. యూదుల చట్టంలో నిషేధమైన అపవిత్రమైన వాటిని నేను తినలేను" అని జవాబిచ్చాడు.
\p
\v 15 పేతురు రెండవసారి కూడా అలాగే దేవుడు చెప్పడం విన్నాడు.
\v 16 ఇలా మూడుసార్లు జరిగింది. వెంటనే జంతువులు, పక్షులు ఉన్న దుప్పటి వంటిది ఆకాశంలోకి తిరిగి వెళ్ళిపోయింది.
\s5
\p
\v 17 పేతురు తనకు కలిగిన దర్శనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇంటిని కనుక్కొని అతని ఇంటి దగ్గరకు వచ్చారు. ఇంటి గుమ్మం దగ్గర నిలబడి,
\v 18 పేతురు అనే పేరున్న సీమోను ఉండేది ఇక్కడేనా? అని అడిగారు.
\s5
\p
\v 19 పేతురు తనకు కలిగిన దర్శనం గురించి ఆలోచిస్తూ ఉండగా, దేవుని ఆత్మ ఇలా చెప్పాడు, "పేతురూ, విను. ముగ్గురు వ్యక్తులు నిన్ను కలిసేందుకు వచ్చారు.
\v 20 నువ్వు లేచి కిందకు దిగి వాళ్ళతో వెళ్ళు. వాళ్ళతో వెళ్లేందుకు వెనకాడవద్దు. ఎందుకంటే నేనే వాళ్ళను పంపించాను.
\v 21 పేతురు కిందికి దిగివచ్చాడు. "వందనాలు. మీరు వెదుకుతున్నది నా కోసమే. ఏం పని మీద వచ్చారు?" అని అడిగాడు.
\s5
\v 22 అందుకు వాళ్ళు "కొర్నేలి అనే రోమా సైనికాధికారి మమ్మల్ని పంపించాడు. అతడు మంచివాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, యూదులందరిచేతా మంచివాడని పేరు పొందిన వ్యక్తి. యొప్పే నుంచి నిన్ను తన ఇంటికి పిలిపించుకుని నువ్వు చెప్పే మాటలు వినాలని ఒక దూత అతనికి చెప్పాడు" అని చెప్పారు.
\v 23 పేతురు వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి ఆ రాత్రి గడిచిన తర్వాత బయలు దేరదామని చెప్పాడు. తెల్లవారాక పేతురు వాళ్ళతో కలసి బయలుదేరాడు. మరికొందరు విశ్వాసులు కూడా వాళ్ళతో వెళ్లారు.
\s5
\p
\v 24 తరువాతి రోజు వాళ్ళు కైసరయ చేరుకునే సమయానికి కొర్నేలీ తన బంధువులను, స్నేహితులను, ఇంట్లోని వాళ్ళను సమకూర్చి పేతురు కోసం ఎదురుచూస్తున్నాడు.
\s5
\v 25 పేతురు లోపలి వచ్చినప్పుడు కొర్నేలి పేతురుకు పాదాభివందనం చేశాడు.
\v 26 పేతురు అతణ్ణి వారించి, "లే, నన్ను పూజించవద్దు. నేనూ నీలాంటి మనిషినే" అన్నాడు.
\s5
\p
\v 27 పేతురు కోర్నేలితో మాట్లాడుతూ లోపలికి వెళ్లి అక్కడ చాలామంది కూర్చుని ఉండడం చూసాడు.
\v 28 అప్పుడు పేతురు, "యూదులమైన మేము యూదులు కాని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళతో సాంగత్యం చేయడం నిషిద్ధమని మీకందరికీ తెలుసు. అయినప్పటికీ ఏ వ్యక్తినీ అపవిత్రుడుగా, నిషిద్ధమైన వాడుగా ఎంచకూడదని దేవుడు నాకు దర్శనం చూపించాడు.
\v 29 కనుక ఎలాంటి అభ్యంతరం లేకుండా మీరు పంపిన మనుషులతో కలసి నేను ఇక్కడకు వచ్చాను. నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి" అన్నాడు.
\s5
\p
\v 30 కొర్నేలి, "మూడు రోజుల క్రితం నేను రోజూ క్రమంగా చేస్తున్నట్టు దేవునికి ప్రార్ధిస్తున్నాను. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మెరిసిపోతున్న దుస్తులు ధరించిన ఒక వ్యక్తి నా ఎదుట నిలబడ్డాడు.
\v 31 అతడు నాతో, "కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థనలు విన్నాడు. పేదవాళ్ళకి నువ్వు చేస్తున్న సహాయాల పట్ల దేవుడు సంతోస్తున్నాడు.
\v 32 నువ్వు నీ సేవకులను యొప్పేకు పంపి పేతురు అనే పేరుగల సీమోనును నీ దగ్గరకు రప్పించుకో. అతడు సముద్రం పక్కన నివసించే సీమోను అనే చర్మకారుని ఇంట్లో ఉంటున్నాడు" అని చెప్పాడు.
\v 33 నేను వెంటనే మనుషులను మీ కోసం పంపించాను. మీరు రావడం మంచిది అయ్యింది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినదంతా వినడానికి మేమంతా ఇక్కడ సమకూడాము. దయచేసి మాతో మాట్లాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 34 పేతురు వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు, "దేవుడు ఎవరిపట్లా పక్షపాతం చూపడని నేను గ్రహించాను.
\v 35 తనపట్ల భయభక్తులు కలిగి ఆయనను సంతోషపరిచే అన్ని రకాల జాతుల ప్రజలనూ ఆయన అంగీకరిస్తాడు."
\s5
\p
\v 36 "ఇశ్రాయేలీయులమైన మాకు దేవుడు సందేశం పంపించాడని మీకు తెలుసు. మెస్సీయ అయిన యేసు జరిగించిన కార్యం ద్వారా కలిగిన సువార్తను ప్రపంచమంతటా ప్రకటించమని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించాడు. ఈ యేసు ఇశ్రాయేలీయులమైన మాకు మాత్రమే ప్రభువు కాదు, ఆయన పాలించే ప్రజలందరికీ ఆయన దేవుడు.
\v 37 యూదయ నుండి గలిలయ వరకు యోహాను ప్రజలను మారుమనస్సు పొంది బాప్తిసం పొందమని ప్రకటించిన సంగతి మొదలుకుని మిగిలిన విషయాలు మీకందరికీ తెలుసు."
\p
\v 38 "నజరేయుడైన యేసు దేవుని ఆత్మ అనుగ్రహించిన శక్తితో అనేక అద్భుత కార్యాలు చేశాడు. ఆయన అనేక ప్రాంతాలు సంచరించి ప్రతిచోటా మనుషులను స్వస్థపరిచాడు. దయ్యాలు పట్టిన వాళ్ళను బాగుచేసాడు. ఈ పనులన్నీ చేయడానికి దేవుడు అన్ని సమయాల్లో ఆయనకు సహాయం చేశాడు. ఈ సంగతులన్నీ మీకు తెలుసు."
\s5
\p
\v 39 "ఆయన ఇశ్రాయేలు దేశమంతటా, యెరూషలేము చుట్టు పక్కల గ్రామాల్లో జరిగించిన పనులకు మేము సాక్షులం. శత్రువులు ఆయనను కొయ్య సిలువకు వేలాడదీసి చంపారు.
\v 40 ఆయన చనిపోయిన మూడవ రోజున దేవుడు ఆయనను తిరిగి లేపాడు. అనేకులు తిరిగి బ్రతికిన ఆయనను చూసారు. ఆయన చనిపోవడం చూసిన అనేకులు తమ కళ్ళతో సజీవుడైన యేసును చూసి ఆయన లేచాడని నిర్ధారించుకున్నారు.
\v 41 ప్రజలందరికీ కాకుండా ఆయన ఏర్పరచుకున్న ఆయనతో కలసి భోజనం చేసి కాలం గడిపిన కొద్దిమందికే కనిపించేలా దేవుడు అనుగ్రహించాడు."
\s5
\p
\v 42 "తప్పక రాబోతున్న ఒక రోజున ఈయన న్యాయాధిపతిగా జీవిస్తున్న వాళ్లకు, చనిపోయిన వాళ్లకు తీర్పు తీరుస్తాడని ప్రకటించమని దేవుడు మాకు ఆజ్ఞాపించాడు.
\v 43 ఆయనను విశ్వసించే వాళ్ళ పాపాలన్నిటినీ క్షమిస్తాడని పూర్వం ప్రవక్తలు ప్రవచించారు."
\s5
\p
\v 44 పేతురు ఈ మాటలు చెప్తూ ఉండగానే వింటూ ఉన్న వారందరి మీదకూ పరిశుద్ధాత్మ దిగివచ్చాడు.
\v 45 యూదు విశ్వాసులు, పేతురుతో కలసి వచ్చినవాళ్ళు యూదులు కాని వాళ్ళ మీద ఆత్మ దిగిరావడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.
\s5
\v 46 వాళ్ళు భాషల్లో మాట్లాడడం, దేవుని గొప్పదనం గురించి చెప్పడం దేవుడు చేసిన పని అని వాళ్ళు అంతకు ముందే చూసారు.
\p
\v 47 అప్పుడు పేతురు అక్కడ ఉన్న యూదు విశ్వాసులతో "మనలాగానే దేవుని ఆత్మ వీళ్లకు లభించింది. ఇక వీళ్ళకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏమిటి" అన్నాడు.
\v 48 మెస్సియ అయిన యేసు నామంలో బాప్తిసం తీసుకోవాలని అతడు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళంతా బాప్తిసం పొందారు. తరువాత వాళ్ళు పేతురును తమతో కొన్ని రోజులు ఉండమని కోరారు. అందుకు పేతురు, అతనితో కలసి వచ్చిన విశ్వాసులు అంగీకరించారు.
\s5
\c 11
\p
\v 1 యూదులు కానివాళ్ళు కూడా దేవుని వాక్యం అంగీకరించారని యుదా ప్రాంతంలో నివసించే అపొస్తలులు, విశ్వాసులు విన్నారు.
\v 2 యెరూషలేములోని యూదా విశ్వాసులు దేవుణ్ణి విశ్వసించే వాళ్ళందరూ సున్నతి పొందాలని చెప్పారు. కైసరయ నుండి పేతురు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు అతణ్ణి విమర్శించారు,
\v 3 "నువ్వు సున్నతి లేనివాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కాక వాళ్ళతో భోజనం కూడా చేసావు."
\s5
\p
\v 4 అందుకు పేతురు ఇలా వివరించాడు.
\v 5 "నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక దర్శనం చూసాను. దానిలో నాలుగు వైపుల నుంచి పట్టి దింపిన పెద్ద దుప్పటి లాంటిది ఒకటి ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది,
\v 6 దానిలోకి జాగ్రత్తగా చూస్తే, భూమి మీద ఉండే వివిధ రకాల జంతువులూ, అడవి జంతువులూ, పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనపడ్డాయి.
\s5
\v 7 అప్పుడు నాకు, "పేతురూ, నీవు లేచి వాటిని చంపుకుని తిను" అని దేవుని ఆజ్ఞ వినబడింది."
\p
\v 8 "అందుకు నేను "ప్రభూ, మన ధర్మాలలో తినకూడదు అని చెప్పినవేవీ నేను ఇంతవరకూ తినలేదు" అన్నాను.
\v 9 ఆకాశం నుండి ఆ శబ్దం రెండవసారి, "నేను దేవుణ్ణి, నేను పవిత్రమైనవిగా చేసిన వాటిని తినమంటే, నీవు వాటిని అపవిత్రమైనవి అనకూడదు" అని వినిపించింది."
\p
\v 10 "ఇదే విధంగా ఇంకా రెండు సార్లు జరిగింది. తరువాత ఆ జంతువులూ, పక్షులూ ఉన్న దుప్పటి అంతా ఆకాశానికి తిరిగి వెళ్లిపోయింది."
\s5
\p
\v 11 "అదే సమయంలో కైసరయ నుండి నేను ఉంటున్న ఇంటికి ముగ్గురు మనుషులు వచ్చారు.
\v 12 అప్పుడు దేవుని ఆత్మ, "నీవు వాళ్ళు యూదులు కారు అని సంకోచించకుండా, వాళ్ళతో పాటు వెళ్ళు" అని ఆజ్ఞాపించాడు. కైసరియకు నాతోపాటు ఆరుగురు యూదా సోదరులు కూడా కొర్నేలి ఇంటికి వెళ్లాము."
\p
\v 13 "అతడు తాను ఒక దూతని చూశానని ఆ దూత, "నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు.
\v 14 నీవు, నీ ఇంటివారంతా రక్షణ ఎలా పొందాలో అతడు నీతో చెప్తాడు" అని ఆ దూత చెప్పాడని అతడు మాతో చెప్పాడు."
\s5
\p
\v 15 "నేను మాట్లాడటం మొదలుపెట్టాక, పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదకు దిగివచ్చినట్లుగానే వాళ్ళ మీదకి దిగాడు."
\p
\v 16 "అప్పుడు, "యోహాను నీళ్ళతో బాప్తిసమిచ్చాడు కాని మీరు పరిశుద్దాత్మలో బాప్తిసం పొందుతారు" అని దేవుడు చెప్పిన మాటలు నేను గుర్తుచేసుకున్నాను."
\s5
\p
\v 17 "ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినదే, దేవుడు వాళ్ళకి కూడా అనుగ్రహిస్తే, దేవుడు చేసింది తప్పు, అని నేనెలా అన గలను?" అని వాళ్ళతో అన్నాడు.
\p
\v 18 యూదా విశ్వాసులు పేతురు చెప్పింది విని, అతణ్ణి తప్పు పట్టడం మాని దేవుణ్ణి కీర్తిస్తూ, "అలాగైతే యూదులు కాని వాళ్ళకి కూడా దేవుడు నిత్యజీవాన్ని, మారుమనసును దయచేశాడు" అని చెప్పుకుంటూ దేవుణ్ణి ఘనపరిచారు.
\s5
\p
\v 19 స్తెఫను చనిపోయిన తర్వాత, హింసలను తట్టుకోలేక అక్కడి విశ్వాసులు యెరూషలేము విడిచి, ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకు వెళ్లి దేవుని మాట యూదులకు తప్ప ఇంక ఎవ్వరికీ చెప్పకుండా సంచరించారు.
\v 20 వాళ్ళలో కొంతమంది సైప్రస్, కురేనీ వాళ్ళు అంతియొకయ వచ్చి అక్కడి యూదులు కాని వాళ్ళకి కూడా యేసు ప్రభువని ప్రకటించారు.
\v 21 ఆ విశ్వాసులు ప్రకటించడానికి ప్రభువు శక్తి తోడ్పడింది. దాని వలన అక్కడి వాళ్ళు అది నమ్మి ప్రభువు వైపు తిరిగారు.
\s5
\v 22 ఆ విషయం విన్న యెరుషలేములో ఉన్న సంఘం బర్నబాను అంతియోకయకు పంపించారు.
\p
\v 23 అతడు అక్కడికి వచ్చి, దేవుడు అక్కడివాళ్ళకి చూపిన అనుగ్రహాన్ని బట్టి సంతోషించి, ప్రభువులో పూర్తి నమ్మకం ఉంచాలని వాళ్ళని ప్రోత్సాహపరిచాడు.
\v 24 పరిశుద్దాత్మ అదుపులో ఉండే బర్నబా సజ్జనుడు. అతనిని బట్టి చాల మంది ప్రభువును నమ్మారు.
\s5
\v 25 బర్నబా సౌలును వెతకడానికి తార్సు ఊరికి వెళ్ళాడు.
\v 26 సౌలు దొరికాక, బర్నబా అతణ్ణి అంతియొకయకు బోధించడానికి పంపాడు. వాళ్ళద్దరూ కలిసి ఒక సంవత్సరమంతా సంఘంలో ఉండి చాలామందికి బోధించారు, మొట్టమొదటిసారిగా అంతియొకయలోనే శిష్యులను "క్రైస్తవులు" అన్నారు.
\s5
\p
\v 27 ఆ రోజుల్లో బర్నబా, సౌలు అంతియొకయలో ఉన్నప్పుడు, కొంతమంది ప్రవక్తలు అక్కడికి వచ్చారు.
\v 28 వాళ్ళలో అగబు అనే ఒకడు మాట్లాడటానికి నిలబడి, లోకమంతా కరువు రాబోతుందని ఆత్మ ద్వారా ప్రవచనం పలికాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి పాలన రోజుల్లో జరిగింది.
\s5
\p
\v 29 అది విన్న శిష్యులు యూదయలోని సోదరులకు సహాయం పంపడానికి వాళ్ళ శక్తి కొద్దీ డబ్బు ఇచ్చారు.
\v 30 వాళ్ళు ఆ డబ్బును బర్నబా, సౌలుల ద్వారా యెరూషలేములోని పెద్దలకు పంపించారు.
\s5
\c 12
\p
\v 1 ఆ సమయంలో హేరోదు రాజు యెరూషలేములోని విశ్వాసులను హింసించడానికి పంపిన సైనికులు వాళ్ళని పట్టుకుని చెరసాలలో పెట్టారు.
\v 2 యోహాను సోదరుడైన యాకోబు తల నరకమని ఆజ్ఞాపించగా, ఆ సైనికుడు అలా చేశాడు.
\s5
\v 3 ఇది యూదా నాయకులకు ఇష్టంగా ఉండటం గమనించిన హేరోదు, పేతురును కూడా బంధించాడు. అవి పొంగని రొట్టెల పండగ రోజులు.
\v 4 అతణ్ణి బంధించి చెరసాలలో వేసి, కాపలాగా నలుగురు చొప్పున ఉండే నాలుగు సైనిక దళాలను పెట్టాడు. పస్కా పండగైన తరువాత అతణ్ణి ప్రజల ఎదుటకు తీసుకుని వచ్చి విచారించాలని అనుకున్నాడు.
\s5
\p
\v 5 పేతురును చాలా రోజులు చెరసాలలో ఉంచారు. అయితే సంఘం అతని కోసం శ్రద్ధతో దేవునికి ప్రార్థన చేసారు.
\v 6 హేరోదు పేతురును విచారణకు తీసుకురావాలని అనుకున్న రాత్రి, పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. ఇద్దరు కాపలా వాళ్ళు తలుపు ఎదుట కాపలా ఉన్నారు.
\s5
\v 7 ఉన్నట్టుండి ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఆ గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుండి సంకెళ్ళు ఊడిపడ్డాయి. అక్కడి సైనికులకు అక్కడ జరుగుతున్నదేమీ తెలియదు.
\p
\v 8 దూత అతనితో, "నీ నడుం కట్టుకుని, చెప్పులు వేసుకో" అని చెప్పగా పేతురు అలాగే చేశాడు. తర్వాత ఆ దూత "పై బట్ట వేసుకుని నాతో రా" అన్నాడు.
\s5
\v 9 అతడు పై బట్ట, చెప్పులు వేసుకుని ఆ దూత వెనక వెళ్ళాడు, కాని అతనికి ఇదంతా నిజంగా జరుగుతుందని నమ్మలేకపోయాడు, ఇది ఒక కల అనుకున్నాడు.
\p
\v 10 ద్వారం దగ్గరి సైనికులను దాటి ఆ దూత, పట్టణంలోకి వెళ్ళే ఇనప తలుపు దానంతట అదే తెరచుకున్నప్పుడు, వాళ్ళు బయటకు వెళ్లి ఒక వీధి దాటిన తరువాత దూత అక్కడినుంచి మాయమై పోయాడు.
\s5
\p
\v 11 పేతురు జరిగినది అంతా కల కాదు అని గుర్తించిన తర్వాత, "ప్రభువు తన దూతను పంపి హేరోదు నుంచి, యూదా నాయకులు అనుకున్న దాని నుంచి నిజంగా నన్ను తప్పించాడు" అని గ్రహించాడు.
\p
\v 12 అప్పుడు పేతురు తర్వాత మార్కు అనే పేరున్న యోహాను యొక్క తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అక్కడ చాలా మంది విశ్వాసులు పేతురు గురించి ప్రార్థన చేస్తున్నారు.
\s5
\p
\v 13 పేతురు అక్కడి తలుపు తట్టినప్పుడు, రొదే అనే ఒక పని పిల్ల తలుపు కొడుతున్నది ఎవరో తెలుసుకోవడానికి వచ్చింది.
\p
\v 14 పేతురు గొంతు విని, గుర్తుపట్టి, సంతోషంలో తలుపు తెరవకుండానే లోపలికి పరుగెత్తుకుంటూ వెళ్లి, పేతురు తలుపు బయట ఉన్నాడని అక్కడి వాళ్ళకి చెప్పింది.
\p
\v 15 అందులో ఒకరు ఆమెను "నువ్వు పిచ్చిదానివి" అన్నారు. అయితే తాను చెప్పింది ముమ్మాటికి నిజమని ఆమె చెప్పినప్పుడు వాళ్ళు, "అది అతని దూత అయి ఉండవచ్చు కదా" అన్నారు.
\s5
\p
\v 16 పేతురు ఇంకా తలుపు కొడుతూ ఉంటే వాళ్ళు చివరికి తలుపు తీసి పేతురును చూసి ఆశ్చర్యపోయారు.
\p
\v 17 పేతురు అక్కడి వాళ్ళకి నిశబ్దంగా ఉండమని చేతితో సైగ చేసి, ప్రభువు అతణ్ణి చెరసాల నుంచి ఎలా బయటకి తెచ్చాడో వాళ్ళకి చెప్పి, యాకోబుకు, ఇతర సోదరులకు జరిగిన విషయాలు తెలియజేయమని చెప్పి అక్కడినుంచి వేరొక చోటికి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 18 మరుసటి రోజు ఉదయం అక్కడి సైనికులు పేతురు ఏమయ్యాడో, అసలు ఏమి జరిగిందో తెలియక ఎంతో గాభరాపడ్డారు.
\p
\v 19 ఆ విషయం తెలుసుకున్న హేరోదు, సైనికులందరికీ పేతురును వెదకమని ఆజ్ఞాపించాడు. కాని వాళ్ళకి అతడు దొరకలేదు. హేరోదు అక్కడి కాపలా వాళ్ళని ప్రశ్నించి వాళ్ళకి మరణ శిక్ష విధించాడు. ఆ పైన హేరోదు యూదయ నుండి కైసరయ వెళ్లి అక్కడ కొంత కాలం ఉన్నాడు.
\s5
\p
\v 20 తూరు, సీదోను ప్రజలపై హేరోదుకు చాలా కోపం వచ్చింది. వారంతా కలిసి ఒక రోజు రాజు దగ్గరికి వెళ్లారు. వారంతా హేరోదు రాజు ముఖ్య అధికారి అయిన బ్లాస్తును కలిసి రాజుకు నచ్చజెప్పి అతణ్ణి తమ పట్ల ప్రసన్నంగా చెయ్యాలని వేడుకున్నారు. ఎందుకంటే రాజు దేశం నుండి వాళ్ళ దేశాలకు ఆహారం వస్తూ ఉండేది.
\p
\v 21 ఒక రోజు, హేరోదు వాళ్ళని కలవాలని నిర్ణయించి రాజవస్త్రాలు ధరించి, సింహాసనం మీద కూర్చుని వాళ్ళందరి ఎదుటా ప్రసంగించాడు.
\s5
\v 22 అది వింటున్న ప్రజలు, "మాట్లాడుతున్నది దేవుడే గాని, మనిషి కాదు" అని గట్టిగా కేకలు వేసారు.
\v 23 హేరోదు దేవుణ్ణి మహిమ పరచడానికి బదులు ప్రజలు తనను దేవుడంతటి వాడుగా ఎంచి పొగడాలని భావించినందుకు వెంటనే ప్రభువు దూత అతణ్ణి ఘోర వ్యాధికి గురిచేశాడు. అతడి కడుపులో పురుగులు పడి, భయంకరమైన నొప్పితో గిలగిల్లాడుతూ అతడు చనిపోయాడు.
\s5
\p
\v 24 దేవుని వాక్యం అన్ని చోట్లా విస్తరించింది, యేసుని నమ్ముకున్న వాళ్ళ సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ ఉంది.
\p
\v 25 బర్నబా, సౌలు యెరూషలేములోని యూదా విశ్వాసులకి సహాయం అందించిన తర్వాత మార్కు అనే పేరున్న యోహానును తమతో వెంటబెట్టుకుని తిరిగి వచ్చారు.
\s5
\c 13
\p
\v 1 సిరియా దేశంలోని అంతియొకయలో విశ్వాసుల గుంపుతోపాటు సంఘంలో బర్న బా, నీగెర్ అనే మారు పేరున్న సుమియోను, కురేని నివాసి లూకియ, రాజైన హేరోదు అంతిపతో పాటు కలసి పెరిగిన మనయేను, సౌలు అనే ప్రవక్తలు, బోధకులు ఉన్నారు.
\v 2 వాళ్ళంతా ఉపవాసముండి ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళతో, "నేను బర్నబాను, సౌలును అనుకున్న పని కోసం వాళ్ళను నాకు కేటాయించండి" అని చెప్పాడు.
\v 3 విశ్వాసులు ఉపవాసముండి ప్రార్ధించి బర్నబా, సౌలులపై చేతులుంచి దేవుని సహాయం కోసం ప్రార్ధించారు. తరువాత పరిశుద్ధాత్మ ఆదేశించినట్టు ఇద్దరినీ పంపించారు.
\s5
\p
\v 4 బర్నబా, సౌలు బయలుదేరి అంతియొకయ నుండి సెలూకియకు సముద్ర ప్రయాణం చేయడానికి పరిశుద్ధాత్మ నడిపించాడు. అక్కడినుంచి ఓడలో ప్రయాణించి సైప్రస్ ద్వీపంలోని సలమీకు చేరుకున్నారు.
\v 5 వాళ్ళు సలమీలో ఉన్నప్పుడు యూదుల సమావేశమయ్యే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ యేసును గురించి సువార్త ప్రకటించారు. మార్కు అనే యోహాను వాళ్లకు సహాయం చేశాడు.
\s5
\p
\v 6 ఈ ముగ్గురూ కలిసి పాఫు ద్వీపమంతా సంచరించారు. అక్కడ వాళ్లకు, తనను తాను ప్రవక్తగా ప్రకటించుకొంటూ గారడీ విద్యలు చేస్తున్న ఒక అబద్ద బోధకుడు తారసపడ్డాడు. అతడి పేరు బర్ యేసు.
\v 7 అతడు వివేకం గల సెర్గియ పౌలు అనే అధిపతి దగ్గర ఉండేవాడు. ఆ అధిపతి దేవుని వాక్యం వినడానికి పౌలును, బర్నబాను పిలిపించాడు.
\p
\v 8 అయితే ఎలుమ (ఈ పేరుకు మాంత్రికుడు అని అర్థం) ఆ అధిపతిని యేసులో విశ్వాసం నుండి తొలగించడానికి చాలా సార్లు అడ్డుపడ్డాడు.
\s5
\v 9 అందుకు పౌలు అని పేరు మారిన సౌలు పరిశుద్దాత్మతో నిండి ఆ మాంత్రికునీ కేసి తీక్షణం గా చూశాడు.
\p
\v 10 "నీవు సాతానును సేవిస్తున్నావు. మంచికి విరోధివి. ప్రజలకి అబద్ధాలు చెప్పి వాళ్ళకి కీడు కలిగిస్తున్నావు. ప్రభువైన దేవుని గురించి నిజాన్ని మసిబూసి మారేడుకాయ చేయడం నువ్వు మానుకోవాలి.
\s5
\v 11 ఇప్పుడు దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు. నీవు గుడ్డివాడివి అవుతావు. నీవు ఇకమీదట ఏమీ చూడలేవు" అన్నాడు. ఒక్కసారిగా అతడు గుడ్డివాడయ్యాడు, చీకట్లో ఉన్నట్టు తడుములాడుతూ తనని చెయ్యి పట్టి ఎవరు నడిపిస్తారా అని వెతకసాగాడు.
\p
\v 12 ఎలమకు జరిగిన విషయాన్నిచూసిన ఆ అధికారి దేవుణ్ణి నమ్మాడు. యేసు ప్రభు గురించి పౌలు, బర్నబాలు చెప్పే విషయాలకి ఆశ్చర్యపోయాడు.
\s5
\p
\v 13 తరువాత పౌలు అతని సహచరులు ఓడ ఎక్కి పాఫు నుండి బయలుదేరి పంఫూలియలోని పెర్గేకు వచ్చారు. అక్కడ మార్కు వాళ్ళని విడిచిపెట్టి యెరూషలేము తిరిగి వెళ్ళిపోయాడు.
\p
\v 14 అప్పుడు పౌలు, బర్నబా కాలిబాట ద్వారా పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోని అంతియొకయ వచ్చారు. విశ్రాంతి దినాన సమాజ మందిరంలోకి వెళ్లి కూర్చున్నారు.
\p
\v 15 అక్కడ కొంతమంది మోషే చట్టాలు గట్టిగా చదివాళ్ళు, ఇంకొంతమంది ప్రవక్తలు రాసినవి చదివారు. అప్పుడు అక్కడి నాయకులు పౌలు, బర్నబాలతో "సహోదరులారా, ప్రజలకి మీరు ఏదైనా ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలంటే చెప్పండి" అని అడిగారు.
\s5
\p
\v 16 అప్పుడు పౌలు నిలబడి ప్రజలు వినాలని చేతితో సైగ చేశాడు. అప్పుడు అతడు "ఇశ్రాయేలీయులారా, దేవుణ్ణి పూజించే ప్రజలారా, నా మాట వినండి.
\v 17 ఇశ్రాయేలు ప్రజల దేవుడు మన పూర్వికులను ఏర్పరచుకొని, వాళ్ళు ఈజిప్టు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళని లెక్కించలేనంత జనంగా చేసి, తన శక్తివంతమైన కార్యాలతో వాళ్ళని బానిసత్వం నుండి విడిపించి ఇక్కడకు తీసుకు వచ్చాడు.
\v 18 వాళ్ళు దేవుని మాట తిరస్కరించినా 40 ఏళ్ళు వాళ్ళని అరణ్యంలో భరించాడు.
\s5
\v 19 కనాను దేశంలోని ఏడు జాతుల వాళ్ళని నాశనం చేసి, ఆ భూమిని ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చాడు.
\v 20 ఇదంతా వాళ్ళ పూర్వికులు సుమారు ఈజిప్టుకు వెళ్ళిన 450 ఏళ్ళ తర్వాత జరిగింది. దాని తర్వాత ఇశ్రాయేలీయులను పాలించడానికి ప్రజల్లో నుండి న్యాయాధిపతులను నాయకులను ఎన్నుకున్నాడు, వాళ్ళలో చిట్టచివరి న్యాయాధిపతిగా సమూయేలు ప్రవక్తను ఇచ్చాడు."
\s5
\p
\v 21 "సమూయేలు నాయకుడిగా ఉన్నప్పుడే ఆ ప్రజలు తమకు రాజు కావాలని కోరితే దేవుడు బెన్యామీను గోత్రికుడు, కీషు కుమారుడు అయిన సౌలును వాళ్ళకి 40 ఏళ్ళ పాటు రాజుగా ఇచ్చాడు.
\v 22 తరువాత దేవుడు సౌలుని రాజుగా తొలగించి, యెష్షయి కుమారుడైన దావీదును వాళ్ళకి రాజుగా చేశాడు. ఆయన దావీదు గురించి "యెష్షయి కుమారుడైన దావీదు నేను కోరుకున్నదాన్నే కోరుకుంటాడు. అతడు ఏమి చెయ్యాలని నేను అనుకుంటానో అదే చేస్తాడు" అన్నాడు."
\s5
\p
\v 23 "దావీదు సంతానం నుండి దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఇశ్రాయేలీయులను కాపాడటానికి రక్షకుడైన యేసుని పుట్టించాడు.
\v 24 యేసు రాక ముందు, బాప్తిసమిచ్చే యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ తమ పాపపు జీవితాన్ని విడిచి దేవుని క్షమాపణ కోరమని, అప్పుడు వాళ్ళకి బాప్తిసం ఇస్తానని చెప్పాడు.
\v 25 యోహాను దేవుడు ఇచ్చిన పనిని నేరవేరుస్తుండగా, "మీరు నన్ను దేవుడు పంపిన మెస్సీయ అని అనుకుంటున్నారా? కానే కాదు. ఆయన వెనక వస్తున్నాడు. ఆయన కాళ్ళ చెప్పులు విప్పడానికి కూడా నేను అర్హుడిని కాను" అని చెప్పాడు."
\s5
\p
\v 26 "సోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవుణ్ణి పూజించే ప్రజలారా, వినండి! ఈ రక్షణ సందేశం మనందరికీ వచ్చింది.
\v 27 యెరూషలేములో నివసిస్తున్నవారూ వాళ్ళ అధికారులూ యేసుని గుర్తించలేదు. ప్రతి విశ్రాంతి దినాన చదివే ప్రవక్తల మాటలను నిజంగా గ్రహించక, ఆ ప్రవచనాలలో ముందే చెప్పిన విధంగా యేసుకు మరణ శిక్ష విధించారు.
\s5
\v 28 చాలా మంది యేసు చెడ్డ పనులు చేసాడని నేరం మోపారు. కాని వాళ్ళు మరణానికి తగిన కారణాలు ఏమీ రుజువు చెయ్యలేకపోయినా ఆయన్ని చంపాలని పిలాతును కోరారు.
\v 29 ప్రవక్తలు ముందే రాసిన విధంగానే అన్నీ నెరవేరిన తరువాత, ఆయనను సిలువకు మేకులతో కొట్టి చంపారు. ఆయన చనిపోయిన తర్వాత సిలువ మీద నుండి దింపి సమాధిలో పెట్టారు."
\s5
\p
\v 30 అయితే దేవుడు ఆయన్ను చావు నుండి తిరిగిలేపాడు.
\v 31 చాల రోజులపాటు ఆయన తనతో గలిలయ నుండి యెరూషలేముకు వచ్చిన వాళ్ళకి చాలసార్లు కనిపించారు. ఇప్పుడు ఆయన్ని చూసిన వాళ్ళు ఆయనకు సాక్షులుగా ఉన్నారు.
\s5
\v 32 మేము మీకు సువార్త ప్రకటిస్తున్నాము. మన పూర్వీకులకు చేసిన వాగ్దానాలను ఆయన నెరవేర్చాడు.
\v 33 దేవుడు యేసును చనిపోయిన వాళ్ళలో నుండి లేపడం ద్వారా వాళ్ళ సంతానమైన మన కోసం, యూదులు కానివాళ్ళ కోసం దీనిని నెరవేర్చాడు. దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపడం గురించిన వాగ్దానం దావీదు రాసిన రెండవ కీర్తనలో ఇలా ఉంది. "నువ్వు నా కుమారుడివి, నేడు నేను నీ తండ్రిని."
\v 34 దేవుడు చనిపోయిన మెస్సీయను ఇకపై కలకాలం జీవించి ఉండేలా చావు నుండి లేపాడు. యూదులైన మన పూర్వికులతో ఆయన ఇలా చెప్పాడు, "దావీదు విషయంలో నేను వాగ్దానం చేసినట్టు నేను మీకు సహాయం చేస్తాను."
\s5
\v 35 దావీదు రాసిన మరో కీర్తనలో "నీ పరిశుద్ధుని శరీరాన్ని కుళ్ళిపోయేలా చేయవు" అని ఉంది.
\v 36 దావీదు దేవునికి ఇష్టమైన రీతిలో జీవించి చనిపోయాడు. అతని శరీరం సమాధిలో కుళ్ళిపోయింది. కనుక ఈ కీర్తనలో దావీదు తన గురించి చెప్పుకోవడం లేదు.
\v 37 యేసును మాత్రమే దేవుడు చనిపోయిన వాళ్ళలో నుండి లేపాడు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు."
\s5
\p
\v 38 "కాబట్టి నా సాటి ఇశ్రాయేలీయులారా, ఇతర స్నేహితులారా, యేసు చేసిన ఈ కార్యం వల్లనే మీ పాపాలకు క్షమాపణ ఉందని తెలుసుకోవడం ప్రాముఖ్యమైన విషయం. మోషే చట్టాలు ఏ విషయాల్లో మిమ్మల్ని పాపం లేనివాళ్ళుగా తీర్చలేకపోయాయో ఆ విషయాల్లో ఆయన ఇచ్చే క్షమాపణ ద్వారా దేవుడు మిమ్మల్ని పాపం లేనివాళ్ళుగా చేస్తాడు.
\v 39 దేవుని వ్యతిరేకంగా ప్రవర్తించినవాళ్ళు యేసులో విశ్వాసం ఉంచినప్పుడు వాళ్ళు చేసిన పనులన్నిటికీ క్షమాపణ దొరుకుతుంది. ఇకపై పాపాలకు శిక్ష ఎన్నడూ ఉండదు.
\s5
\v 40 కాబట్టి ప్రవక్తలు చెప్పినట్టు దేవుని న్యాయతీర్పుకు గురికావద్దు.
\q
\v 41 "మీరు నన్ను తిరస్కరించారు.
\q మీ చెడ్డ పనులనుబట్టి నేను మిమ్మల్ని నాశనం చేయడం చూసి మీరు ఆశ్చర్యపడతారు.
\q మీరు బ్రతికి ఉన్న కాలంలో నేను జరిగించే ఈ భయంకరమైన కార్యాలు చూస్తారు.
\q ఈ విషయాలు ఎవరైనా మీకు చెప్పినా మీరు నమ్మరు" అని ఆయన తన ప్రవక్త ద్వారా పలికించాడు."
\s5
\p
\v 42 ఈ మాటలు చెప్పి పౌలు వెళ్ళిపోతూ ఉంటే, అనేకులు వాళ్ళ దగ్గరకు వచ్చి, తరువాతి విశ్రాంతి దినాన కూడా వచ్చి మరిన్ని విషయాలు చెప్పాలని కోరారు.
\p
\v 43 సమావేశం ముగిసిన తరువాత దేవుణ్ణి ఆరాధించే యూదులు, యూదులు కానివాళ్ళు పౌలు బర్నబాలను వెంబడించారు. పౌలు, బర్నబాలు మాట్లాడుతూ, దేవుని ఉచిత కృప వలన యేసు చేసిన కార్యాన్నిబట్టి ఆయన్ను నమ్ముకొని పాప క్షమాపణ పొందాలని బోధించారు.
\s5
\p
\v 44 తరువాతి విశ్రాంతి దినాన ప్రభువైన యేసును గురించి పౌలు, బర్నబాల బోధలు వినడానికి అంతియొకయ నుండి యూదులు తండోపతండాలుగా సమావేశ స్థలానికి రుకున్నారు.
\v 45 అయితే జనసమూహాలు పౌలు బర్నబాల బోధలు వినేందుకు విరివిగా రావడం చూసి యూదు నాయకులకు ఈర్ష్య కలిగింది. పౌలు చెబుతున్న మాటలకు అడ్డుపడుతూ అతణ్ణి గేలిచేయడం మొదలుపెట్టారు.
\s5
\v 46 అప్పుడు పౌలు బర్నబాలు ధైర్యంగా యూదు నాయకులతో ఇలా చెప్పారు, "దేవుడు పంపిన యేసు సువార్త మేము మొదట యూదులు కానివాళ్ళకు కాక, యూదులైన మీకు బోధించాలని దేవుని ఆజ్ఞ. అయితే యూదులైన మీరు సువార్తను తోసిపుచ్చి నిత్యజీవాన్ని కోల్పోతున్నారు. అందువల్ల మేము మిమ్మల్ని విడిచిపెట్టి యూదులు కాని వాళ్ళకు సువార్త బోధిస్తున్నాము.
\v 47 దేవుడు ఈ విధంగా చేయమని చెప్పాడు కనుక మేము చేస్తున్నాము. ఆయన తన లేఖనాల్లో ఇలా చెప్పాడు."
\q "యూదులు కాని ప్రజలకు వెలుగుగా ఉండేందుకు నేను నిన్ను ఎన్నుకున్నాను.
\q ప్రపంచమంతటా రక్షణ వార్త బోధించేవానిగా నిన్ను నియమించుకున్నాను."
\s5
\p
\v 48 ఈ మాటలు విన్న యూదులు కానివాళ్ళు ఎంతో సంతోషించి, యేసుని గురించిన వార్తను బట్టి దేవుణ్ణి కొనియాడారు. యూదులు కానివాళ్ళు అయిన తమను నిత్యజీవానికి వారసులుగా చేసిన యేసు వార్తను విశ్వసించారు.
\p
\v 49 ఆ రోజుల్లో సువార్త ఆ పరిసర ప్రాంతాలన్నిటికీ వ్యాపించింది. విశ్వాసులు అనేకులు తాము ప్రయాణించిన ప్రతి చోటా సువార్త ప్రచురించారు.
\s5
\v 50 అయితే యూదు పెద్దలు కొందరు నగరంలోని తమతో కలసి ఆరాధించే ముఖ్యమైన స్త్రీలను, పేరుప్రఖ్యాతులు గల పురుషులను రెచ్చగొట్టి తమవైపు తిప్పుకున్నారు. వాళ్ళు పౌలు బర్నబాలను హింసించి వాళ్ళను తమ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టారు.
\v 51 ఇద్దరు అపొస్తలులు దేవుడు వాళ్ళను తిరస్కరించాడని, వాళ్ళను శిక్షిస్తాడని చూపేందుకు గుర్తుగా తమ కాళ్ళ దుమ్మును దులిపివేసి అంతియొకయ నుంచి ఈకోనియ ప్రాంతానికి బయలుదేరారు.
\v 52 అయితే విశ్వాసులు పరిశుద్ధాత్మ శక్తితో నిండి ఆనందంగా ఉన్నారు.
\s5
\c 14
\p
\v 1 ఈకొనియలో పౌలు, బర్నబాలు యూదుల సమాజ మందిరంలోకి వెళ్లి, ఎంత బాగా మాట్లాడారంటే చాలా మంది యూదులూ గ్రీకులూ యేసులో విశ్వాసముంచారు.
\v 2 అయితే కొంత మంది యూదులు ఆ మాటలు నమ్మకుండా, యూదులు కానివాళ్ళని రెచ్చగొట్టి అక్కడి విశ్వాసుల మీద ద్వేషం పుట్టించారు.
\s5
\p
\v 3 పౌలు బర్నబాలు ప్రభువు శక్తితో ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాల కాలం గడిపారు. వాళ్ళ ద్వారా యేసు ప్రభు ఎన్నో అద్భుత కార్యాలను చేయించాడు. ఈ విధంగా మనం అర్హులం కాకపోయినప్పటికీ ప్రభువు రక్షిస్తాడు అనే వాక్య సత్యాన్ని ప్రజలకు బోధించారు.
\p
\v 4 ఈకొనియలో ఉండే ప్రజలకి రెండు వేరు వేరు అభిప్రాయాలు ఉండేవి. కొందరు యూదులతో మరికొందరు అపొస్తులతో ఏకీభవించారు.
\s5
\p
\v 5 పౌలు బర్నబాను వ్యతిరేకించే యూదులు, యూదులు కానివాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూసారు. వాళ్ళందరూ తమ అధికారులతో కలిసి పౌలు బర్నబాను రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు.
\v 6 వాళ్ళు ఆ సంగతి తెలుసుకుని లుకయోనియా ప్రాంతంలోని లుస్త్ర, దెర్బే పట్టణాలకు, ఆ చుట్టుపక్కల ప్రాంతలకు వెళ్లిపోయారు.
\p
\v 7 వాళ్ళు ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు, అక్కడివాళ్ళకి ఎప్పుడూ ప్రభుని వాక్యమే చెప్పారు.
\s5
\v 8 లుస్త్రలో కాళ్ళు పనిచెయ్యని వికలాంగుడు ఒకడున్నాడు. అతడు పుట్టినప్పటి నుంచీ కుంటివాడు, ఎప్పుడూ నడవలేదు.
\v 9 అతడు పౌలు మాట్లాడుతుంటే విన్నాడు, పౌలు సూటిగా అతని వైపు చూసి, అతని ముఖంలో యేసు తనను బాగు చెయ్యగలడు అనే విశ్వాసం గమనించి,
\v 10 "లేచి నిలబడు" అని గట్టిగా అనగానే, అతడు చటుక్కున లేచి గంతులేస్తూ నడవడం మొదలుపెట్టాడు.
\s5
\p
\v 11 ప్రజలు పౌలు చేసిన దాన్ని చూసి, పౌలు బర్నబాలు తమ కులదైవాలుగా భావించారు. లుకయోనియ భాషలో, "దేవుళ్ళు మానవ రూపంలో ఆకాశం నుండి మన దగ్గరికి వచ్చారు" అని కేకలు వేశారు.
\p
\v 12 బర్నబాను ప్రధాన దేవుడు అనుకుని అతనికి జూస్ అనీ, పౌలు ప్రసంగిస్తున్నాడు కాబట్టి అతనికి హెర్మే, అంటే ఇతర దేవుళ్ళ పక్షంగా మాట్లాడే వాడు అని అర్థం వచ్చేలా పేర్లు పెట్టారు.
\p
\v 13 పట్టణానికి బయట ఉన్న గుడిలో జూస్ దేవుడి పూజారి ప్రజలు అనుకునేది విని, పట్టణ ముఖద్వారం దగ్గర జన సమూహంతో కలిసి రెండు ఎడ్ల మెడలకు పూల దండలు వేసి వాళ్ళకి బలి అర్పించడానికి తీసుకొచ్చారు.
\s5
\p
\v 14 అది చూసి అపొస్తలులు పౌలు బర్నబాలు తీవ్ర ఉద్వేగంతో బట్టలు చింపుకొని, గట్టిగా అరుచుకుంటూ గుంపులోకి పరుగెత్తారు.
\p
\v 15 "అయ్యలారా, మీరు చేస్తున్నదేమిటి? మాకోసం ఆ ఎద్దులను బలి ఇవ్వకండి. మేము దేవుళ్ళo కాదు, మీలానే మనుషులం. సర్వశక్తివంతుడైన దేవుణ్ణి గురించి చెప్పడానికి మేము ఇక్కడికి వచ్చాము, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్నీవాటిలో ఉండే సమస్త జీవరాసులను సృష్టించిన దేవుడు ఇతర దేవుళ్ళను పూజించడం మానుకోమని మీకు చెబుతున్నాడు."
\p
\v 16 "గతంలో మీరందరూ మీకు ఇష్టం వచ్చిన దేవుళ్ళని పూజించారు. ఎందుకంటే అప్పుడు మీకు నిజ దేవుడు తెలియదు.
\s5
\v 17 ఆయన తన కార్యాల ద్వారా మనకి వర్షం కురిసేలా, దాని ద్వారా మంచి పంటలు పండేలా, పుష్కలంగా ఆహారం ఉండేలా, మన హృదయం నిండా ఆనందం నిండేలా అనుగ్రహం చూపాడు."
\p
\v 18 పౌలు చెప్పింది వింటున్న జనం, పౌలు బర్నబాలు అలా చెబుతున్నప్పటికీ వారికి బలులు అర్పిద్దాం అనుకుని, కొంత సేపటికి చివరికి విరమించుకున్నారు.
\s5
\p
\v 19 అంతియొకయ, ఈకొనియ నుండి వచ్చిన యూదులు జనాన్ని తమవైపు తిప్పుకుని, పౌలు చెప్పేది నిజం కాదని చెప్పారు. వాళ్ళ మాటలు నమ్మిన జనం కోపంతో పౌలు మీద రాళ్ళు విసిరి, అతడు చనిపోయాడనుకుని ఊరి బయటకి ఈడ్చివేసారు.
\v 20 అయితే కొంత మంది శిష్యులు అతని చుట్టూ నిలబడి ఉండగా, పౌలు లేచి శిష్యులతో తిరిగి పట్టణంలోకి వెళ్ళాడు. మరుసటి రోజు బర్నబాతో కలిసి దెర్బేకు వెళ్ళిపోయారు.
\s5
\p
\v 21 అక్కడ చాల రోజులు సువార్త ప్రకటించి చాలా మందిని శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకూ ఈకొనియకూ అంతియొకయకూ తిరిగి వచ్చారు.
\v 22 ప్రతి చోటా వాళ్ళు విశ్వాసులతో దేవునిపై విశ్వాసం ఉంచమని, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేక బాధలు పడాలని చెప్పి వాళ్ళని బలపరిచారు.
\s5
\p
\v 23 పౌలు, బర్నబాలు ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పరచి వాళ్ళతో కలిసి ఉపవాసముండి ప్రార్థన చేసి, వాళ్ళు నమ్మిన ప్రభువుకు వాళ్ళని అప్పగించారు.
\p
\v 24 తర్వాత పౌలు బర్నబా పిసిదియ ప్రాంతమంతా తిరిగి, పంఫూలియకు వచ్చారు.
\v 25 అక్కడ పెర్గేలో వాక్యం బోధించి, అత్తాలియ పట్టణంలో తీరం ప్రాంతానికి వెళ్లారు.
\v 26 అక్కడ నుంచి ఒక ఓడ ఎక్కి సిరియా లోని అంతియొకయ చేరుకున్నారు. మొదట్లో తాము నెరవేర్చిన పని నిమిత్తం దేవుని కృపకు అప్పగించుకుని వారు బయలు దేరింది ఇక్కడే. మళ్ళీ అక్కడికే తిరిగి వచ్చారు.
\s5
\v 27 వాళ్ళు అంతియొకయ వచ్చి సంఘాన్ని సమకూర్చి, దేవుడు తమకు తోడుగా ఉండి చేసి పనులన్నిటినీ, యూదులు కానివాళ్ళు యేసులో నమ్మకముంచడానికి దేవుడు చేసిన కార్యాలనూ వివరించారు.
\v 28 ఆ తర్వాత పౌలు, బర్నబాలు శిష్యుల దగ్గరే చాలా కాలం గడిపారు.
\s5
\c 15
\p
\v 1 యూదయ ప్రాంతం నుండి కొందరు విశ్వాసులు అంతియొకయకు వెళ్లారు. వాళ్ళు అక్కడి యూదేతర విశ్వాసులకు, "మీరు దేవునికి చెందిన వారని నిరూపించుకోవాలంటే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా సున్నతి పొందాలి, అలా చేయకపోతే మీకు రక్షణ లేదు" అని బోధించడం మొదలుపెట్టారు.
\v 2 పౌలు, బర్నబాలు ఆ బోధను తీవ్రంగా వ్యతిరేకించి వాదనకు దిగారు. కాబట్టి అంతియొకయ విశ్వాసులు ఈ సమస్య విషయమై యెరూషలేము వెళ్లి అపొస్తలులతో, ఇతర నాయకులతో చర్చించవచ్చని పౌలును, బర్నబాను, ఇంకా కొంతమందిని యెరూషలేము పంపడానికి తీర్మానించారు.
\s5
\p
\v 3 అంతియొకయ విశ్వాసులు పంపిన పౌలు, బర్నబా, మరికొందరు ఫెనీకే, సమరయ ప్రాంతాల ద్వారా ప్రయాణించారు. మార్గంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళు ఆగినప్పుడు అనేకమంది యూదేతరులు దేవునిలో విశ్వాసముంచారనే సంగతిని విశ్వాసులకు వాళ్ళు తెలియచేశారు. దాని ఫలితంగా ఆ ప్రాంతంలోని విశ్వాసులందరూ ఎంతో ఆనందించారు.
\p
\v 4 పౌలు, బర్నబా, మిగిలినవాళ్ళు యెరూషలేము చేరుకోగానే, అక్కడి సంఘంలోని అపొస్తలులూ, పెద్దలూ, ఇతర విశ్వాసులూ వాళ్ళకి స్వాగతం పలికారు. అప్పుడు పౌలు, బర్నబాలు దేవుడు తమకు తోడై, యూదేతరుల మధ్య జరిగించిన సంగతులను వాళ్ళకి వివరించారు.
\s5
\p
\v 5 అయితే పరిసయ్యుల తెగలోని కొంతమంది యూదు విశ్వాసులు లేచి వాళ్ళతో, "యేసులో విశ్వాసముంచిన యూదేతరులకు సున్నతి చేయించి, దేవుడు అనుగ్రహించిన మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేలా వాళ్ళకి ఆజ్ఞాపించాలి" అని చెప్పారు.
\p
\v 6 అప్పుడు అపొస్తలులూ, పెద్దలూ ఈ సంగతి గురించి చర్చించడానికి సమావేశం అయ్యారు.
\s5
\v 7 చాలా సేపు చర్చ జరిగిన తరవాత పేతురు లేచి వాళ్ళతో ఇలా అన్నాడు, "సాటి విశ్వాసులారా, యూదేతరులు కూడా దేవుని ప్రేమను గురించి నా నోట విని ఆయనను విశ్వసించేలా ప్రారంభంలో మీలోనుండి నన్ను దేవుడు ఎన్నుకున్నాడని మీకందరికీ తెలుసు.
\v 8 దేవుడు మనుషుల హృదయాలను ఎరిగినవాడు. నాకు, ఇతరులకు ఇచ్చినట్టే యూదేతరులకు కూడా పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా వాళ్ళని తన ప్రజలుగా అంగీకరించినట్టు కనపరచుకున్నాడు. ఆ విధంగానే మనపట్ల కూడా జరిగించాడు.
\v 9 ప్రభువైన యేసులో వాళ్ళ విశ్వాసానికి ఫలితంగా దేవుడు వాళ్ళని కూడా పవిత్రపరిచి, మనకీ వాళ్ళకీ ఏ వ్యత్యాసమూ చూపలేదు. కచ్చితంగా మనల్ని ఎలా క్షమించాడో వాళ్ళని కూడా అలాగే క్షమించాడు."
\s5
\p
\v 10 "మన యూదు ఆచార నియమాలను పాటించాలని యూదేతర విశ్వాసులను ఎందుకు మీరు బలవంతం చేస్తారు? మన పూర్వికులు కూడా చేయలేక అతిక్రమించిన వాటినీ, యూదులమైన మనం కూడా ఈ రోజుల్లో పాటించలేని వాటినీ చేయమనడం మోయలేని బరువును వాళ్ళ మీద మోపినట్టే గదా. కాబట్టి అలా చేసి దేవుని కోపానికి గురికావద్దు.
\v 11 ప్రభువైన యేసు మనకోసం చేసిన కార్యం వలన యూదులమైన మనం మన పాపాలనుండి రక్షణ పొందుతామని నమ్ముతున్నాం గదా. యూదులమైన మనల్ని దేవుడు ఎలా రక్షిస్తాడో అదే విధంగా కచ్చితంగా యూదేతరులను కూడా రక్షిస్తాడు."
\s5
\p
\v 12 పేతురు మాట్లాడిన తరవాత అక్కడ ఉన్న వారంతా నిశ్శబ్దమైపోయారు. అప్పుడు పౌలు, బర్నబా దేవుడు తమకు తోడై ఉండి, యూదేతరులను ఆయన అంగీకరించిన దానికి సూచనగా తమ ద్వారా వాళ్ళ మధ్య చేసిన అనేక సూచక క్రియలనూ, అద్భుతాలనూ వివరిస్తుంటే వారంతా ఆలకించారు.
\s5
\p
\v 13 పౌలు, బర్నబాలు చెప్పడం ముగించిన తరవాత, యెరూషలేములోని విశ్వాసుల సంఘ నాయకుడైన యాకోబు వాళ్ళతో మాట్లాడాడు. అతడు ఇలా అన్నాడు.
\p
\v 14 "సోదరులారా, నా మాట వినండి. దేవుడు యూదేతరులను ఎలా ఆశీర్వదించాడో సీమోను పేతురు ఇంతకు ముందే మీకు తెలిపాడు. దేవుడు వాళ్ళలోనుండి తన ప్రజలుగా ఉండడానికి ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు.
\s5
\v 15 "అనాది కాలంలో దేవుడు పలికిన మాటలూ, ప్రవక్తలలో ఒకరు రాసిన మాటలతో సరిపోతున్నాయి.
\q1
\v 16 ఆ తరవాత నేను తిరిగి వస్తాను,
\q1 దావీదు వంశం వారిలో నుండి ఒక రాజును ఎంపిక చేసి
\q1 దావీదు రాజ్యాన్ని పునరుద్ధరిస్తాను.
\q1 అది పడిపోయిన ఇంటిని మళ్ళీ కట్టినట్టుగా ఉంటుంది."
\p
\v 17 "నేనే ప్రభువైన దేవుడని మిగిలిన వారంతా తెలుసుకోడానికి ప్రయత్నించేలా నేను దీనిని చేస్తాను. ఎవరినైతే నాకు చెందినవారని నేను ఏర్పరచుకున్నానో వాళ్ళలో ఆ యూదేతరులు కూడా భాగం అవుతారు.
\v 18 అనాది కాలం నుండీ ఈ సంగతులను జరిగిస్తున్నాను. దీనిని నా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను."
\s5
\p
\v 19 యాకోబు తన మాటలు కొనసాగిస్తూ, "కాబట్టి తమ పాపాలను విడిచిపెట్టి దేవునివైపు తిరిగే వాళ్ళని కష్టపెట్టకూడదని నా అభిప్రాయం. అంతేకాదు, వాళ్ళు మన ఆచార నియమాలను పాటించాలని వత్తిడి చేయకూడదు.
\v 20 వాటికంటే, వాళ్ళు పాటించాల్సిన నాలుగు విషయాలు తెలుపుతూ వాళ్ళకి ఉత్తరం రాసి పంపాలి. విగ్రహాలకు అర్పించిన మాంసం తినకూడదు. జారత్వానికి దూరంగా ఉండాలి, గొంతు నులిమి చంపిన జంతువు మాంసాన్ని తినకూడదు, జంతు రక్తం తినకూడదు.
\v 21 ప్రతి పట్టణంలో తరతరాలుగా మోషే రాసిన లేఖనాలను ప్రజలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ విషయాలను లేఖనాలు నిషేధిస్తున్నాయి. ప్రతి విశ్రాంతి దినాన సమాజ మందిరాలలో ఈ సంగతులు చదువుతున్నారు. కాబట్టి యూదేతరులు ఒకవేళ ఈ నియమాలను మరింతగా తెలుసుకోవాలి అనుకుంటే, వాళ్ళు సమాజ మందిరాలలో తెలుసుకోవచ్చు" అని చెప్పాడు.
\s5
\p
\v 22 యాకోబు చెప్పిన వాటిని అపొస్తలులూ, మిగిలిన పెద్దలూ, యెరూషలేములోని విశ్వాసులంతా అంగీకరించారు. అప్పుడు సోదరులలో కొందరిని ఎంపిక చేసి, పౌలు బర్నబాలతో బాటు అంతియొకయకు పంపడం మంచిదని, యెరూషలేము పెద్దల నిర్ణయాన్ని అక్కడి యూదేతర పెద్దలకు వాళ్ళు తెలియజేయాలని నిర్ణయించారు. ఆ విధంగా వాళ్ళు బర్సబ్బ అనే పేరున్న యూదానూ, సీలనూ ఎన్నుకున్నారు. వీరిద్దరూ యెరూషలేము విశ్వాసులలో నాయకులు.
\p
\v 23 అప్పుడు యూదా, సీల అనే వీరిద్దరినీ అంతియొకయ విశ్వాసులు చేర్చుకోవలసిందిగా కోరుతూ, ఈ విధంగా ఉత్తరం రాశారు. "అపొస్తలులూ, పెద్దలూ అయిన మేము అంతియొకయ, సిరియా, కిలికియ ప్రాంతాల్లో నివసిస్తున్న యూదేతరులకు శుభాకాంక్షలు తెలుపుతూ రాస్తున్నాం.
\s5
\v 24 కొందరు మేము పంపకపోయినప్పటికీ మా నుండి మీ దగ్గరకు వచ్చారని మాకు తెలిసింది. వాళ్ళు తమ బోధతో మిమ్మల్ని గాభరా పెట్టి మీ మనసులు పాడుచేశారని మేము విన్నాం.
\v 25 కాబట్టి మేమందరం సమావేశమై కొందరిని ఎంపిక చేసి మేము బాగా ఇష్టపడే పౌలు, బర్నబాలతో కూడా మీ దగ్గరకు పంపాలని నిర్ణయించాం.
\v 26 పౌలు, బర్నబాలిద్దరూ, మన ప్రభువైన యేసును సేవించడంలో ప్రాణాలను ఫణంగా పెట్టినవాళ్ళు.
\s5
\v 27 యూదా, సీలలను మీ దగ్గరకు పంపుతున్నాం. మేము రాసిన విషయాలనే వాళ్ళు మళ్ళీ మీకు చెబుతారు.
\v 28 తలబరువుగా ఉండే యూదు ఆచార నియమాలను మీరు పాటించవలసిన అవసరం లేదని పరిశుద్ధాత్మకు, మాకు అనిపించింది. వీటికి బదులుగా మీరు కొన్ని సూచనలు మాత్రమే పాటించాల్సిన అవసరం ఉంది."
\p
\v 29 "మీరు విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినకూడదు. జంతువుల రక్తం, గొంతు పిసికి చంపిన జంతువుల మాంసం తినకూడదు. వ్యభిచారం జరిగించకూడదు. వీటికి దూరంగా ఉండి జాగ్రత్త పడితే మేలు."
\s5
\p
\v 30 ఆ నలుగురూ యెరూషలేము నుండి అంతియొకయకు వచ్చారు. విశ్వాసులంతా సమావేశమైనప్పుడు వాళ్ళకి ఆ ఉత్తరం ఇచ్చారు.
\v 31 వాళ్ళు ఆ ఉత్తరం చదువుకొని సంతోషించారు, ఎందుకంటే ఆ ఉత్తరం వాళ్ళకి ఎంతో ప్రోత్సాహం కలిగించింది.
\v 32 ప్రవక్తలుగా ఉన్న యూదా, సీలలు అక్కడి విశ్వాసులతో చాలాసేపు మాట్లాడి, ప్రోత్సహించి ప్రభువైన యేసులో మరింత బలంగా విశ్వసించడానికి వాళ్ళకి సహాయం చేశారు.
\s5
\p
\v 33 యూదా, సీల కొంతకాలం వాళ్ళతో గడిపిన తరవాత తిరిగి యెరూషలేము వెళ్ళడానికి అక్కడి విశ్వాసులు వాళ్ళకి సాదరంగా వీడ్కోలు పలికారు. తరవాత యూదా, సీల యెరూషలేము వెళ్ళిపోయారు.
\v 34-35 అయితే పౌలు, బర్నబా అంతియొకయలోనే ఉన్నారు. వాళ్ళు అక్కడ అనేకమందితో కలిసి యేసు ప్రభువు సువార్త బోధిస్తూ ఉన్నారు.
\s5
\p
\v 36 కొంతకాలం తరవాత పౌలు, బర్నబాతో "ఇంతకు ముందు యేసుప్రభువు ప్రకటించిన ప్రతి పట్టణానికీ వెళ్లి తోటి విశ్వాసులను మళ్ళీ కలుద్దాము, ఆ విధంగా వాళ్ళు ప్రభువులో ఎలా ముందుకు కొనసాగుతున్నారో తెలుసుకుందాం" అన్నాడు.
\v 37 బర్నబా దానికి అంగీకరించి తనతోబాటు మార్కు అనే మారు పేరు ఉన్న యోహానును తీసుకు రావడానికి ఇష్టపడ్డాడు.
\p
\v 38 అయితే అతణ్ణి వెంటబెట్టుకు వెళ్ళడం సబబు కాడని పౌలు అన్నాడు. ఎందుకంటే పంఫులియ ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు తమను విడిచిపెట్టి వెళ్ళిపోయదు. పని కొనసాగించలేదు. అందుకే అతణ్ణి మళ్ళీ తీసుకువెళ్ళడం భావ్యం కాదని పౌలు తలంచాడు.
\s5
\v 39 పౌలు, బర్నబా ఈ విషయంలో ఒకరితో ఒకరు తీవ్రమైన భేదాభిప్రాయం తలెత్తింది. వాళ్ళు వేరైపోయారు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్ర దీవికి వెళ్ళాడు.
\p
\v 40 పౌలు అంతియొకయకు వచ్చిన సీలతో కలిసి పనిచేయడానికి పూనుకున్నాడు. అక్కడి విశ్వాసులు పౌలు సీలలకు కృపతో సహాయం అందించమని ప్రభువును వేడుకున్నారు. అప్పుడు వారిద్దరూ అంతియొకయ విడిచి వెళ్ళారు.
\v 41 పౌలు సీలతో కలిసి సిరియా, కిలికియ దేశాలగుండా తన ప్రయాణం కొనసాగించాడు. ఆయా స్థలాల్లో ఉన్న విశ్వాసుల గుంపులను ప్రభువైన యేసు విశ్వాసంలో బలపడేలా వాళ్ళకి సహాయం చేస్తూ ప్రయాణించారు.
\s5
\c 16
\p
\v 1 పౌలు దేర్బే, లుస్త్ర పట్టణాలకు వెళ్లి అక్కడి విశ్వాసులను కలుసుకున్నాడు. దీన్ని గమనించండి: లుస్త్రలో తిమోతి అనే ఒక విశ్వాసి ఉన్నాడు. అతని తల్లి విశ్వసించిన యూదురాలు. అతని తండ్రి మాత్రం గ్రీకు జాతి వాడు.
\v 2 లుస్త్ర, ఈకొనియలోని విశ్వాసులు అతని గురించి మంచి విషయాలు చెప్పారు.
\v 3 పౌలు తనతోబాటు తిమోతిని తీసుకెళ్లాలని ఆశించాడు. దానికోసం అతనికి సున్నతి చేయించాడు. ఎందుకంటే అతని తండ్రి యూదేతరుడనీ, అతనికి సున్నతి చేయించలేదనీ అక్కడి యూదులందరికీ తెలుసు. అదీ గాక తాను వెళ్లబోయే ప్రాంతాలన్నీ యూదులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు కాబట్టి సున్నతి జరిగితే వాళ్ళు అతణ్ణి తేలికగా అంగీకరిస్తారని పౌలు భావించాడు.
\s5
\p
\v 4 తిమోతి, పౌలు, సీల కలిసి అనేక పట్టణాలు తిరిగారు. ప్రతి చోటా విశ్వాసులకు యెరూషలేములోని అపొస్తలులూ, పెద్దలూ నిర్ణయించిన నియమాలను బోధించారు.
\p
\v 5 కాబట్టి ఆయా పట్టణాల్లోని విశ్వాసులు యేసుప్రభువులో విశ్వాసంలో అంతకంతకు బలపడడానికి వాళ్ళు సహాయపడ్డారు. రోజురోజుకీ అనేకమంది విశ్వాసులుగా మారుతున్నారు.
\s5
\p
\v 6 పౌలు, అతని సహచరులను ఆసియా ప్రాంతంలో వాక్యం బోధించవద్దని పరిశుద్ధాత్మ వారించడం వలన వాళ్ళు ఫ్రుగియ, గలతీయ ప్రాంతాల గుండా వెళ్ళారు.
\v 7 వాళ్ళు ముసియ ప్రాంతానికి వచ్చి ఉత్తరాన బితూనియ గుండా వెళ్ళడానికి ప్రయత్నించారు గానీ యేసు ఆత్మ వాళ్ళని అడ్డగించాడు.
\v 8 కాబట్టి వాళ్ళు ముసియ గుండా సముద్రతీరాన ఉన్న త్రోయకు చేరుకున్నారు.
\s5
\v 9 ఆ రాత్రి పౌలుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. దానిలో మాసిదోనియ ప్రాంతానికి చెందిన ఒకతనిని చూశాడు. అతడు పౌలును, "మాసిదోనియ వచ్చి మాకు సహాయం చెయ్యండి" అని పిలిచాడు.
\p
\v 10 ఆ దర్శనం చూసిన తర్వాత అక్కడి ప్రజలకు సువార్త ప్రకటించమని దేవుడు మమ్మల్ని పిలిచాడని గ్రహించి మేము మాసిదోనియకు బయలుదేరాం.
\s5
\p
\v 11 మేము త్రోయ నుండి ఓడలో నేరుగా సమోత్రకే కు, మరుసటి రోజు నెయపోలికి వెళ్లాం.
\p
\v 12 తరవాత, నెయపోలినుండి ఫిలిప్పికి వెళ్లాం. మాసిదోనియలో ఫిలిప్పీ చాల ప్రాముఖ్యమైన పట్టణం. అక్కడ అనేకమంది రోమా పౌరులు నివాసం ఉన్నారు. ఫిలిప్పిలో మేము చాలా రోజులు గడిపాం.
\p
\v 13 విశ్రాంతి దినాన ఊరిబయట ద్వారం దాటి నదీ తీరానికి వెళ్ళాం. అక్కడ యూదులు ప్రార్థన కోసం సమావేశం అవుతారని ఎవరో చెప్పగా విన్నాం. మేము అక్కడికి చేరగానే, ప్రార్థనకు సమావేశమైన కొందరు స్త్రీలను చూశాం. అక్కడ కూర్చుని యేసు గురించి వాళ్ళతో మాట్లాడడం మొదలెట్టాం.
\s5
\p
\v 14 పౌలు మాటలు వింటున్న స్త్రీలలో తుయతైర నుండి వచ్చిన లూదియ అనే ఆమె ఉంది. ఆమె ఊదా రంగు వస్త్రాల వ్యాపారి. ఆమె దేవుణ్ణి ఆరాధించేది. పౌలు చెప్పిన మాటలు శ్రద్ధగా వినేలా ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె విశ్వసించింది.
\p
\v 15 లూదియకు, ఆమె ఇంటివాళ్ళకి పౌలు సీలలు బాప్తీసం ఇచ్చిన తరవాత ఆమె వాళ్ళతో, "నేను ప్రభువులో విశ్వాసిని అని మీరు భావిస్తే మీరు మా ఇంటికి వచ్చి ఉండాలి" అని కోరింది. ఆమె అలా అన్న తరవాత మేం ఆమె ఇంటికి వెళ్లాం.
\s5
\p
\v 16 మరొక రోజు, ప్రజలు ప్రార్థనకు సమావేశమయ్యే చోటకి వెళ్తూ ఉండగా, ఒక బానిస పిల్ల మాకు ఎదురైంది. ఆమె దయ్యాల శక్తితో సోది చెబుతూ ఉంది. భవిష్యత్తులో జరగబోయే దాన్ని అక్కడి మనుషులు ఆమెతో సోది చెప్పించుకొని దానికి ప్రతిఫలంగా ఆమె యజమానులకు డబ్బులు చెల్లించేవాళ్ళు.
\p
\v 17 ఈ యువతి పౌలును, మమ్మల్ని వెంబడిస్తూ, "వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు! వీరు రక్షణ మార్గం ప్రకటిస్తున్నారు" అని కేకలు వేసేది.
\p
\v 18 ఆమె చాలా రోజులు ఈ విధంగానే చేసింది. ఆఖరికి పౌలుకి చిరాకు వేసి ఆమె వైపు తిరిగి ఆమెలోని భూతంతో, "యేసుక్రీస్తు నామంలో ఈమెను వదిలి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను" అన్నాడు. ఆ వెంటనే దయ్యం ఆమెని వదిలిపోయింది.
\s5
\p
\v 19 అప్పుడు ఆమె యజమానులు ఆమె తమకు ఇంక డబ్బు సంపాదించి పెట్టడం కుదరదని, ఎందుకంటే ఆమె సోది చెప్పలేదనీ గ్రహించి కోపంతో ఊగిపోయారు. వాళ్ళు పౌలునూ, సీలనూ పట్టణంలోని న్యాయాధికారులు ఉండే రచ్చబండ దగ్గరికి ఈడ్చుకెళ్ళారు.
\v 20 వాళ్ళని న్యాయాధికారుల దగ్గరకు తీసుకొచ్చి, "ఈ మనుషులు యూదులు. మన పట్టణంలో ఉన్నవాళ్ళని అల్లకల్లోలం చేస్తున్నారు,
\v 21 రోమీయులమైన మనం అంగీకరించని, పాటించని ఆచారాలు ప్రకటిస్తున్నారు" అన్నారు.
\s5
\p
\v 22 అప్పుడు, జనసమూహం అంతా దుర్భాషలాడుతూ దొమ్మీగా పౌలు, సీలల మీదకి వచ్చి వాళ్ళని కొట్టడం ప్రారంభించారు. అప్పుడు రోమా న్యాయాధికారులు వాళ్ళ బట్టలు లాగేసి, బెత్తాలతో కొట్టమని సైనికులకు ఆజ్ఞాపించారు.
\v 23 సైనికులు, పౌలు సీలలను బెత్తాలతో భయంకరంగా కొట్టారు. ఆ తరవాత వాళ్ళని జైలులో పడేశారు. వాళ్ళు బయటికి రాకుండా భద్రంగా కాయమని జైలు అధికారికి ఆజ్ఞాపించారు.
\v 24 వాళ్ళ ఆజ్ఞ ప్రకారం జైలు అధికారి పౌలునూ, సీలనూ జైల్లోని లోపలి గదిలోకి తోసి నేలమీద కూర్చోబెట్టి కాళ్ళు రెంటినీ చాపి పాదాలను రెండు కొయ్య దుంగల మధ్య పెట్టి, వాళ్ళు తమ కాళ్ళు కదపడానికి వీలు లేకుండా బిగించాడు.
\s5
\p
\v 25 మధ్యరాత్రిలో పౌలు, సీలలు ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇతర ఖైదీలు అందరూ వింటూ ఉన్నారు.
\v 26 అకస్మాత్తుగా పెద్ద భూకంపం జైలును కదిలించింది. ఆ భూకంపం కారణంగా జైలు తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఖైదీల సంకెళ్లన్నీ ఊడిపోయాయి.
\s5
\p
\v 27 జైలు అధికారి నిద్ర లేచి జైలు తలుపులన్నీ తెరచి ఉండడం చూశాడు. ఖైదీలంతా పారిపోయారని భావించి కత్తి తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎందుకంటే, ఖైదీలు పారిపోతే పట్టణ న్యాయాధికారులు తనను చంపేస్తారని అతనికి తెలుసు.
\v 28 అయితే పౌలు అతణ్ణి చూసి గట్టిగా, "నువ్వు ఏ హానీ చేసుకోవద్దు. ఖైదీలందరం ఇక్కడే ఉన్నాం!" అని అరిచాడు.
\s5
\p
\v 29 జైలు అధికారి ఎవరెవరు ఇంకా జైలులో ఉన్నారో చూడడానికి దీపం తెమ్మని గట్టిగా అరిచి, త్వరత్వరగా లోపలి వచ్చి భయంతో వణికిపోతూ పౌలు సీలలకు సాష్టాంగపడ్డాడు.
\v 30 అప్పుడు అతడు పౌలు సీలల్ని బయటికి తెచ్చి, "అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేం చెయ్యాలి?" అని వాళ్ళని అడిగాడు.
\v 31 అందుకు వాళ్ళు, "యేసుప్రభువులో విశ్వాసముంచు. అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు" అని చెప్పారు.
\s5
\p
\v 32 తరవాత పౌలు, సీలలు అతనికీ, అతని ఇంటివాళ్ళకీ, ప్రభువైన యేసు గురించి బోధించారు.
\v 33 ఆ రాత్రి సమయంలోనే ఆ చెరసాల అధికారి వాళ్ళ గాయాలన్నిటినీ కడిగాడు. వెంటనే అతనికీ, అతని ఇంటివాళ్ళకీ పౌలు సీలలు బాప్తిసమిచ్చారు.
\v 34 తర్వాత జైలు అధికారి, పౌలు సీలలను అతని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. యేసుప్రభువులో విశ్వాసముంచినందుకు జైలు అధికారీ, అతని ఇంటివారూ ఎంతగానో సంతోషించారు.
\s5
\p
\v 35 మరుసటి ఉదయం, "ఆ ఇద్దరు ఖైదీలను విడిచిపెట్టమని "జైలు అధికారికి తెలియజేయమని పట్టణ న్యాయాధికారులు సైనికుల్ని పంపారు.
\v 36 జైలు అధికారి ఇది విని, పౌలు దగ్గరకు వెళ్లి "పట్టణ న్యాయాధికారులు మిమ్మల్ని విడిచిపెట్టమని కబురు పంపారు, కాబట్టి మీరిప్పుడు క్షేమంగా వెళ్ళండి" అని చెప్పాడు.
\s5
\v 37 అయితే పౌలు, జైలు అధికారితో, "మేము రోమా పౌరులం అయినప్పటికీ మమ్మల్ని అందరి ముందూ బహిరంగంగా సైనికులతో కొట్టించి జైలులో వేశారు, ఇప్పుడేమో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా బయటికి పంపాలని చూస్తున్నారు, దీనికి మేము అంగీకరించం. ఆ న్యాయాధికారులే వచ్చి మమ్మల్ని విడుదల చేయాలి" అని చెప్పాడు.
\v 38 కాబట్టి సైనికులు వెళ్ళి న్యాయాధికారులకు ఈ మాట తెలియజేశారు. పౌలు సీలలు రోమీయులని తెలుసుకొని ఆ న్యాయాధికారులు ఎంతో భయపడి తప్పు చేశామని గ్రహించారు.
\v 39 వాళ్ళు పౌలు సీలల దగ్గరకు వచ్చి తాము చేసిన పనికి క్షమాపణ అడిగారు. వాళ్ళు పౌలు సీలలను బయటికి తీసుకొచ్చి పట్టణం విడిచి వెళ్ళమని వాళ్ళని బతిమిలాడారు.
\s5
\p
\v 40 పౌలు సీలలు జైలునుండి విడుదల పొంది లూదియ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆమెనూ విశ్వాసులనూ చూసి వాళ్ళని విశ్వాసంలో కొనసాగమని ప్రోత్సహించి ఫిలిప్పీ పట్టణం నుండి వెళ్ళిపోయారు.
\s5
\c 17
\p
\v 1 వాళ్ళు అంఫిపోలి, అపొల్లోనియ పట్టణాల మీదుగా తెస్సలోనికకు వచ్చారు. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉంది.
\v 2 పౌలు తన అలవాటు ప్రకారం అక్కడికి వెళ్ళాడు. ఆ విధంగా మూడు వారాలు ప్రతి విశ్రాంతి దినాన అక్కడికి వెళ్ళాడు. లేఖనాలు యేసే మెస్సీయ అని ఎలా తెలియజేస్తున్నాయో విడమర్చి అక్కడి వాళ్ళకి వివరించాడు.
\s5
\p
\v 3 క్రీస్తు చనిపోయి తిరిగి లేవడం తప్పనిసరి అని ప్రవక్తలు రాసిన లేఖన భాగాలను వాళ్ళకి చూపిచాడు. "యేసు అనే ఈ వ్యక్తే మెస్సీయ. ప్రవక్తలు చెప్పినట్టు ఆయన మరణించి తిరిగి లేచాడు" అని అతడు వాళ్ళకి వివరించాడు.
\v 4 యూదులలో కొందరు పౌలు చెప్పిన మాటలు విశ్వసించి పౌలునూ సీలనూ కలవడం మొదలుపెట్టారు. అక్కడ దేవుని ఆరాధించే, యేసు సువార్తను విశ్వసించిన అనేకమంది యూదేతరులు, ప్రముఖులైన స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పౌలు సీలతో కలవడం మొదలుపెట్టారు.
\s5
\p
\v 5 అయితే అనేకమంది పౌలు చెప్పిన దానిని నమ్మడంతో, కొందరు యూదు నాయకులకు కన్ను కుట్టి రచ్చబండకు వెళ్లి కొంతమంది పనీపాటా లేక తిరుగుతున్న అలగా జనాన్ని తమ వెంట రమ్మని ప్రేరేపించారు. ఆ విధంగా యూదు నాయకులు గుంపు కూడి గొప్ప అల్లరి సృష్టించారు. ఆ యూదులూ, ఇంకా ఇతరులూ, పౌలు సీలలు నివాసముంటున్న యాసోను ఇంట్లో చొరబడ్డారు. వాళ్ళు పౌలునూ, సీలనూ బహిరంగంగా జనం మధ్యలోకి తీసుకు రావాలనుకున్నారు.
\v 6 పౌలు సీలలు ఆ ఇంట్లో కనబడక పోయేసరికి, యాసోనును, పట్టుకుని బయటికి ఈడ్చుకు వచ్చారు. అతన్నీ, మరి కొందరు సోదరులనూ పట్టుకున్నారు. వాళ్ళు "భూలోకాన్ని తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చారు.
\v 7 ఈ యాసోను వీరిని తన ఇంట్లో పెట్టుకున్నాడు. వాళ్ళు కైసరు చట్టాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. వీరు యేసు అనే వ్యక్తి నిజమైన రాజు అని చెబుతున్నారు" అని కేకలు వేశారు.
\s5
\v 8 పట్టణ అధికారులు, జన సమూహం ఈ మాటలు విని కలవరపడి, కోపంతో మండిపడ్డారు.
\v 9 పట్టణ అధికారులు యాసోనుకు, కొందరు విశ్వాసులకు జరిమానా విధించి పౌలు సీలల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటేనే వాళ్ళకి ఆ సొమ్ము తిరిగి ఇస్తామని చెప్పారు. తరవాత పట్టణ అధికారులు యాసోనును, మిగిలిన విశ్వాసులను విడిచిపెట్టారు.
\s5
\p
\v 10 అదే రాత్రి, విశ్వాసులు పౌలును సీలను తెస్సలోనిక నుండి బెరయ అనే ఊరికి పంపించారు. వాళ్ళు బెరయలో ప్రవేశించి అక్కడి యూదుల సమాజమందిరంలోకి వెళ్ళారు.
\p
\v 11 తెస్సలోనిక లోని యూదులలో ఎక్కువమంది దేవుని సందేశాన్ని వినడానికి ఇష్టపడలేదు. అయితే బెరయలో నివసించే యూదులు మాత్రం యేసును గురించిన సువార్తను శ్రద్ధగా వినడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు చాల శ్రద్ధగా యేసును గురించి విన్నారు. ప్రతి రోజూ వాళ్ళు లేఖనాలను చదువుతూ యేసును గురించి పౌలు చెప్పిన మాటలు నిజమో కాదో అని పరిశీలిస్తూ వచ్చారు.
\p
\v 12 పౌలు బోధవల్ల, అనేకమంది యూదులూ, ప్రముఖులైన యూదేతర స్త్రీ పురుషులు యేసులో విశ్వాసముంచారు.
\s5
\p
\v 13 అయితే పౌలు బెరయలో యేసును ప్రకటిస్తున్నాడని తెస్సలోనికలోని యూదులు తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళు బెరయకు వెళ్లి అక్కడి ప్రజలకు అతనికి వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళని కూడా రెచ్చగొట్టి అల్లరి రేపారు.
\p
\v 14 బెరయలోని కొందరు విశ్వాసులు వెంటనే పౌలును వేరే పట్టణం వెళ్ళడానికి సముద్రం వరకు సాగనంపారు. అయితే సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు.
\p
\v 15 పౌలు, అతన్ని సాగనంపడానికి వెళ్ళినవాళ్ళు సముద్ర తీరం చేరుకొని ఒక నావ మీద ఏతెన్స్ నగరానికి చేరుకున్నారు. అప్పుడు పౌలు వాళ్ళతో, "సీలను, తిమోతిని సాధ్యమైనంత తొందరగా ఏతెన్స్ నగరానికి రమ్మని చెప్పమని" చెప్పాడు. ఆ విశ్వాసులు ఏతెన్స్ విడిచిపెట్టి బెరయకు వెళ్ళిపోయారు.
\s5
\p
\v 16 ఏతెన్సు లో పౌలు, సీల, తిమోతిల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య సమయంలో పట్టణం అంతా తిరిగాడు. ఆ పట్టణంలో ఎన్నో విగ్రహాలు ఉండడం చూసి చాలా కలత పడ్డాడు.
\p
\v 17 అందుచేత యూదుల సమాజ మందిరానికి వెళ్లి అక్కడి యూదులతో, దేవుణ్ణి ఆరాధించే గ్రీకులతో యేసును గురించి మాట్లాడాడు. అతడు ప్రతి రోజూ బహిరంగ స్థలంలోని రచ్చబండకు వెళ్లి, వచ్చే పోయే జనంతో మాట్లాడుతూ వచ్చాడు.
\s5
\p
\v 18 పౌలు అక్కడి ప్రజల నమ్మకాల గురించి మాట్లాడడానికి ఇష్టపడే కొందరు బోధకులతో మాట్లాడాడు. ఎపీకూరీయులు, స్తోయికులు అని పిలవబడే కొందరు తత్వవేత్తలు వాళ్ళు ఏమి నమ్ముతున్నారో పౌలుతో చెప్పారు. పౌలును కూడా తన నమ్మకం ఏమిటని అడిగారు. యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడని పౌలు వాళ్ళకి చెప్పాడు. అప్పుడు వాళ్ళు "ఇతడు కొత్త దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\s5
\p
\v 19 అందుచేత వాళ్ళు పౌలును పట్టణ నాయకులు సమావేశమయ్యే చోటికి తీసుకెళ్ళారు. వారక్కడికి చేరుకోగానే "నువ్వు ప్రజలకు ప్రకటిస్తున్న సమాచారం ఏమిటి? దయచేసి మాక్కూడా చెప్పు.
\v 20 నువ్వు చెబుతున్న వింత విషయాలు మాకర్ధం కావడం లేదు. కాబట్టి వాటిని మేము తెలుసుకోగోరుతున్నాం" అని వాళ్ళు పౌలును అడిగారు.
\v 21 ఏతెన్స్ ప్రజలకూ, ఇతర ప్రాంతాలనుండి వచ్చి అక్కడ నివసించే విదేశీయులకూ కొత్త విషయాలు వినడం, మాట్లాడడం ఒక సరదా.
\s5
\p
\v 22 పౌలు వాళ్ళ ఎదుట నిలబడి ఇలా చెప్పాడు, "ఏతెన్స్ ప్రజలారా, మీరు చాల భక్తిపరులని నాకు అర్థం అవుతున్నది.
\v 23 ఇలా ఎందుకు చెబుతున్నానంటే, నేను దారిన పోతున్నప్పుడు మీరు పూజించే విగ్రహాలను చూశాను. ఒక బలిపీఠాన్ని దానిమీద చెక్కిన మాటలు కూడా చూశాను. దానిమీద "తెలియని దేవునికి" అని రాసి ఉంది. ఇప్పుడు నేను మీరు తెలియకుండా పూజిస్తున్న ఆ తెలియని దేవుని గురించి చెబుతాను.
\s5
\v 24 ఆ దేవుడే విశ్వాన్ని అందులోని సమస్తాన్నీ చేశాడు. పరలోకంలో, భూమి మీదా ఉన్న సమస్తాన్నీ పరిపాలిస్తున్న ఆ దేవుడు మనుషులు కట్టిన మందిరాలలో నివసించడు.
\v 25 ఆయన అందరికీ జీవాన్నీ, ఊపిరినీ, వాళ్ళకవసరమైన సమస్తాన్నీ దయచేసేవాడు. కాబట్టి ఆయన తనకు ఏదో అవసరం అన్నట్టు మనుషులు చేతులతో చేసే సేవలు ఆయనకు అక్కర లేదు."
\s5
\p
\v 26 "ఆదిలో ఒక్క జంటను సృష్టించి వాళ్ళనుండి లోకమంతా నివసించే అన్ని జాతులనూ చేశాడు. వాళ్ళకోసం కాలాలను, వాళ్ళు నివసించడానికి సరిహద్దులనూ ఏర్పరచాడు.
\v 27 వాళ్ళు తన అవసరాన్ని గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడే వాళ్ళు తమకు తాము ఆయనను వెదికి కనుగొనాలని ఆయన అభిమతం. వాస్తవానికి ఆయన మనకెంతో సమీపంగా ఉన్నప్పటికీ మనమే ఆయనను వెదకి కనుక్కోవాలని దేవుడు కోరుతున్నాడు.
\s5
\q1
\v 28 ఆ దేవుని వల్లే మనం జీవిస్తున్నాం, తిరుగుతున్నాం, ఉనికి కలిగి ఉన్నాం.
\q1 మీలో ఒకరు చెప్పినట్టుగా, మనం ఆయన సంతానం."
\p
\v 29 "కాబట్టి మనం దేవుని సంతానం, దేవుడు బంగారం, వెండి, రాతితో మనుషులు చెక్కిన బొమ్మలాటివాడని మనం భావించకూడదు.
\s5
\v 30 దేవుడు మనుషులు ఏమి చేయాలని కోరుతున్నాడో తెలుసుకోలేని అజ్ఞాన కాలాలను ఆయన చూసీ చూడనట్టుగా ఉండి వాళ్ళు చేసినదానికి వాళ్ళని శిక్షించలేదు. అయితే ఇప్పుడు మాత్రం అందరు తమ పాప క్రియలు విడిచిపెట్టి పశ్చాత్తాపపడి ఆయనవైపు తిరగాలని ఆజ్ఞాపిస్తున్నాడు.
\v 31 ఎందుకంటే, తాను నియమించిన వ్యక్తి ద్వారా మనందరినీ తీర్పు తీర్చే ఒక రోజు ఆయన నిర్ణయించాడు. మృతులలోనుండి ఆయనను లేపాడు కాబట్టి దీనిని నమ్మడానికి ఆయన అందరికీ ఆస్కారం కలిగించాడు."
\s5
\p
\v 32 ఒక మనిషి చనిపోయి మళ్ళీ బతికాడు అని చెప్పినప్పుడు వాళ్ళలో కొందరు అతణ్ణి ఎగతాళి చేశారు. అయితే కొంతమంది "మళ్ళీ ఇంకొక రోజు వచ్చి దీనిని గురించి చెప్పు. తీరికగా వింటాం" అన్నారు.
\p
\v 33 ఆ తరవాత పౌలు వాళ్ళ దగ్గర నుండి వెళ్ళిపోయాడు.
\v 34 అయితే కొంతమంది పౌలుతో కూడా వెళ్లి యేసు సువార్తను విశ్వసించారు. వాళ్ళలో మహాసభ సభ్యుడు అరెయోపగీతు వాడైన దియోనూసియ, దమరి అనే ఒక స్త్రీ, వీరితో బాటు మరికొందరు ఉన్నారు.
\s5
\c 18
\p
\v 1 ఆ తరవాత పౌలు ఏతెన్స్ నగరం విడిచి కొరింతు పట్టణం వచ్చాడు.
\v 2 అక్కడ పొంతు వంశానికి చెందిన అకుల గురించి తెలుసుకున్నాడు. ఆకుల, అతని భార్య ప్రిస్కిల్ల కొంతకాలం క్రితమే ఇటలీలో ఉన్న రోమా పట్టణం నుండి వచ్చారు. యూదులంతా రోమ్ నగరం వదిలి వెళ్ళిపోవాలని రోమా చక్రవర్తి క్లౌదియ ఆజ్ఞాపించడం వల్ల వీరు రోమ్ నగరాన్ని వదిలి వచ్చేశారు. పౌలు ఆకులనూ, ప్రిస్కిల్లనూ కలుసుకోడానికి వెళ్ళాడు.
\v 3 ఆకుల, ప్రిస్కిల్లలు పోషణ కోసం డబ్బు సంపాదనకు డేరాలు కుట్టేవాళ్ళు. పౌలు వృత్తి కూడా అదే కాబట్టి అతడు వాళ్ళతో నివసిస్తూ కలిసి పని చేశాడు.
\s5
\v 4 ప్రతి విశ్రాంతి దినాన పౌలు యూదుల సమాజ మందిరానికి వెళ్లి అక్కడ ఉన్న యూదులు, యూదేతరులతో యేసును గురించి బోధిస్తూ వచ్చాడు.
\p
\v 5 సీల, తిమోతిలు మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చినప్పుడు పౌలు ఆత్మచేత బలంగా ప్రేరేపింపబడుతూ యూదులకు యేసే మెస్సీయ అని ప్రకటించడంలో నిమగ్నమయ్యాడు.
\v 6 అయితే యూదులు పౌలుకు వ్యతిరేకంగా తిరగబడి అతణ్ణి దూషించారు. అందుచేత పౌలు తన బట్టల దుమ్మును దులుపుకొని వాళ్ళతో ఇలా చెప్పాడు, "ఒకవేళ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తే అది మీ బాధ్యతే, ఇంక అది నా బాధ్యత కాదు. ఇక ఇప్పటినుండి యూదేతరులతోనే మాట్లాడతాను" అని
\s5
\v 7 వెంటనే యూదుల సమాజ మందిరంలోనుండి బయలుదేరి దానికి ఆనుకొని ఉన్న ఇంటికి వెళ్లి అక్కడ బోధించాడు. ఆ ఇంటి యజమాని దైవభక్తి గల యూదేతరుడు. అతని పేరు తీతియు యూస్తు.
\v 8 ఆ తరవాత ఆ సమాజ మందిర అధికారి క్రిస్పు అతని కుటుంబంతో సహా ప్రభువులో విశ్వాసముంచాడు. కొరింతులోని అనేకమంది క్రిస్పు గురించి అతని కుటుంబం గురించి విని వాళ్ళు కూడా ప్రభువును విశ్వసించి బాప్తిసం పొందారు.
\s5
\p
\v 9 ఒక రాత్రి వేళ పౌలుకు కలిగిన ఒక దర్శనంలో ప్రభువు, "నీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళ గురించి నువ్వు భయపడవద్దు. మాట్లాడుతూనే ఉండు. మౌనంగా ఉండవద్దు.
\v 10 నేను నీకు తోడుగా ఉన్నాను, హాని చేయడానికి ఎవడూ నీ మీదికి రాదు. నాగురించి బోధిస్తూ ఉండు. ఎందుకంటే ఈ పట్టణంలో నాకు చెందినవాళ్ళు ఇంకా అనేకమంది ఉన్నారు" అని చెప్పాడు.
\p
\v 11 కాబట్టి పౌలు ఒకటిన్నర సంవత్సరాలు కొరింతులోనే ఉండి యేసును గురించి ప్రకటిస్తూ ఉన్నాడు.
\s5
\p
\v 12 గల్లియో అకయకు గవర్నర్ గా ఉన్న రోజుల్లో యూదు నాయకులంతా ఏకమై పౌలు మీదికి వచ్చి అతణ్ణి ముట్టడి వేశారు. వారతన్ని గవర్నర్ ఎదుటకు తీసుకెళ్ళి అతని మీద నేరారోపణ చేశారు.
\p
\v 13 వాళ్ళు, "వీడు మన యూదు చట్టాలకు వ్యతిరేకంగా దేవుణ్ణి ఆరాధించాలని ప్రజల్ని ప్రేరేపిస్తున్నాడు" అని ఆరోపించారు.
\s5
\p
\v 14 పౌలు మాట్లాడబోతుండగా, గల్లియో యూదులతో, "ఈ మనిషి మన రోమా చట్టాలను మీరి ఉంటే మీరేం చెప్పినా నేను వినేవాణ్ణి.
\v 15 అయితే మీరు ఏదో మతబోధ గురించో, పేరులు గురించో, ధర్మశాస్త్రం గురించో వాదన అయితే ఆ విషయం మీరే చూసుకొని అతనితో మాట్లాడండి. ఇలాంటి వాటిని గురించి న్యాయం చెప్పడానికి నాకు మనసు లేదు" అని చెప్పాడు.
\s5
\p
\v 16 గల్లియో ఇలా చెప్పగానే అక్కడి కొందరు సైనికులు యూదు నాయకులను న్యాయపీఠం దగ్గరనుండి పంపివేశారు.
\p
\v 17 అప్పుడు అందరు యూదు నాయకుడైన సోస్తేనేసును పట్టుకుని న్యాయపీఠం దగ్గర కొట్టసాగారు. అయితే గల్లియో ఈ సంగతులేవీ పట్టించుకోలేదు.
\s5
\p
\v 18 పౌలు ఇంకా చాలా రోజులు అక్కడే ఉన్నాడు. తరవాత ప్రిస్కిల్ల, అకులతో బాటు కలిసి ఓడమీద సిరియాకు బయలుదేరాడు. అతనికి మొక్కుబడి ఉండడం వల్ల కేంక్రేయలో తన జుట్టు కత్తిరించుకున్నాడు.
\p
\v 19 వాళ్ళు ఎఫెసుకు చేరుకున్నారు. అక్కడ అకుల, ప్రిస్కిల్ల బస చేశారు. పౌలు మాత్రం యూదుల సమాజ మందిరంలోకి ప్రవేశించి యేసును గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
\s5
\v 20 వారింకా కొంతకాలం తమతో ఉండమని పౌలును బతిమిలాడారు. కానీ ఉండడానికి అతడు అంగీకరించలేదు.
\v 21 కానీ వాళ్ళ దగ్గర సెలవు తీసుకొనేటప్పుడు, "దేవుని చిత్తమైతే మరొకసారి వస్తాను" అని వాళ్ళతో చెప్పాడు. తరవాత ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాడు.
\s5
\p
\v 22 తరవాత ఓడ కైసరయకు చేరుకోగానే రేవులో దిగిపోయాడు. యెరూషలేము వెళ్లి అక్కడ సంఘ విశ్వాసులను పలకరించి సిరియా ప్రాంతంలో ఉన్న అంతియొకయ పట్టణానికి చేరుకున్నాడు.
\p
\v 23 పౌలు అక్కడి విశ్వాసులతో కొంత కాలం గడిపాడు. తరవాత అంతియొకయ వదిలి వరసగా గలిలయ ప్రాంతంలో, ఫ్రుగియలో సంచరించాడు. దేవుని వాక్కులో అంతకంతకు బలపడాలని వాళ్ళని బతిమిలాడాడు.
\s5
\p
\v 24 పౌలు గలతీయ, ఫ్రుగియ గుండా వెళుతూ ఉండగా అపొల్లో అనే ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. అతడు అలెగ్జాండ్రియ పట్టణస్తుడు. లేఖనాల్లో గొప్ప ప్రావీణ్యత కలిగినవాడు. అతడు లేఖనాల గురించి బాగా మాట్లాడాడు.
\v 25 ఇతర విశ్వాసులు యేసు ప్రభువు తానేర్పరచుకున్న ప్రజలు ఎలా జీవించాలి అని కోరుతున్నాడో అనే సంగతులను అపొల్లోకు బోధించారు. ఎందుకంటే యేసు గురించిన విషయాలు అతనికి తెలియదు. కేవలం యోహాను బాప్తిసమే అతనికి తెలుసు.
\v 26 అతడు ప్రభువు మార్గంలో వాళ్ళచేత ఉపదేశం పొంది ఆత్మలో తీవ్రత కలిగి యేసును గురించి స్పష్టంగా మాట్లాడుతూ సమాజ మందిరాలలో ధైర్యంగా బోధించడం మొదలుపెట్టాడు. ప్రిస్కిల్ల, అకుల అతడి బోధ విని తమ ఇంటికి రమ్మని పిలిచి అతనికి యేసును గురించి ఇంకా ఎక్కువగా తెలియజేసారు.
\s5
\p
\v 27 ఆ తరవాత అపొల్లో అకయ వెళ్ళాలని తలంచినప్పుడు అతని ఆలోచన ప్రకారమే చేయమని ఎఫెసు విశ్వాసులు అతణ్ణి ప్రోత్సహించారు. కాబట్టి వాళ్ళు అకయలో ఉన్న విశ్వాసులకు అపొల్లోను చేర్చుకోమని ఒక ఉత్తరం రాశారు. అతడు అక్కడికి వెళ్ళిన తరవాత, దైవ కృపచేత విశ్వసించిన వాళ్ళకి చాల సహాయం చేశాడు.
\v 28 అపొల్లో అనేకులు వింటూ ఉండగా బహిరంగంగా యూదు నాయకుల వాదనలను శక్తివంతంగా ఖండిస్తూ వచ్చాడు. లేఖనాల ఆధారంతో యేసే క్రీస్తు అనీ, మెస్సీయ అనీ వాళ్ళకి రుజువు పరుస్తూ వచ్చాడు.
\s5
\c 19
\p
\v 1 అపొల్లో కొరింతులో ఉన్నప్పుడు పౌలు ఫ్రుగియ, గలతియను వదలి ఆసియా గుండా ఎఫెసుకు తిరిగి వచ్చాడు. అతడు విశ్వాసులని చెప్పుకుంటున్న కొంతమందిని కలిశాడు.
\v 2 అతడు వాళ్ళతో, "దేవుని సువార్తను మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా?" అని అడిగాడు. వాళ్ళు, "లేదు, మేము పొందలేదు. పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతే మాకు తెలీదు" అని జవాబిచ్చారు.
\s5
\v 3 కాబట్టి పౌలు వాళ్ళతో, "మరి మీరు ఎప్పుడు బాప్తిసం పొందారు? మీకు ఏమి తెలుసు?" అని అడిగాడు. వాళ్ళు "బాప్తిసమిచ్చే యోహాను ఏది చెప్పాడో ఆ బోధనే మేము నమ్ముతున్నాం, యోహాను బాప్తిసం పొందాం" అన్నారు.
\v 4 అందుకు పౌలు, "ప్రజలు తమ పాపపు ఆలోచనలను, క్రియలను వదిలి మారుమనసు పొంది దేవునివైపు తిరిగిన దానికి గుర్తుగా యోహాను బాప్తిసం ఇవ్వబడింది. యోహాను, ‘నా వెనక వస్తున్న యేసులో విశ్వాసముంచండి’ అని కూడా చెప్పాడు" అని వాళ్ళతో చెప్పాడు.
\s5
\v 5 వాళ్ళు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామంలో బాప్తిసం పొందారు.
\v 6 తరవాత పౌలు వారి ఒక్కొక్కరి తల మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చాడు. వాళ్ళు ఎన్నడూ నేర్చుకోని భాషలు మాట్లాడే శక్తిని దయ చేశాడు. అంతే గాక పరిశుద్ధాత్మ వాళ్ళకి అందించిన ప్రవచనాలను పలకడం మొదలుపెట్టారు.
\v 7 పౌలు బాప్తిసమిచ్చిన వారూ, పరిశుద్ధాత్మను పొందినవారూ మొత్తం పన్నెండు మంది.
\s5
\p
\v 8 మూడు నెలల తరవాత ప్రతి విశ్రాంతి రోజున సమాజ మందిరాలలో ప్రవేశించి అక్కడివాళ్ళతో యేసును గురించి తర్కిస్తూ, ఒప్పింపజేస్తూ దేవుడు తనను తను రాజుగా ఏవిధంగా కనపరచుకున్నాడో వాళ్ళకి తెలియజేస్తూ వచ్చాడు.
\v 9 కానీ కొంతమంది యూదులు మాత్రం యేసు సందేశాన్ని విశ్వసించకపోగా ఇంకా వాళ్ళు ఎన్నటికీ వినదలచుకోలేదు. పౌలు బోధనూ, క్రీస్తు మార్గాన్నీ దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వాళ్ళని విడిచిపెట్టి విశ్వాసులను తనతోబాటు తీసుకెళ్ళి ప్రతి రోజూ తురన్ను అనే అతని బడిలో సమావేశం అవుతూ వచ్చారు.
\p
\v 10 ఈ విధంగా పౌలు రెండు సంవత్సరాలు అక్కడ బోధించాడు. దీనివల్ల ఆసియా ప్రాంతంలో నివసించే యూదులు, యూదేతరులు చాలామట్టుకు యేసు సువార్త విన్నారు.
\s5
\v 11 దేవుడు పౌలుకు అద్భుతాలు చేసే శక్తిని కుడా దయచేశాడు.
\v 12 రోగులు పౌలు దగ్గరికి రాలేకపోయినట్లైతే అతని శరీరానికి తాకించిన గుడ్డ ముక్కలు తీసుకెళ్ళి రోగులకు తాకిస్తే రోగాలు పోయేవి, దురాత్మలు కూడా వదలిపోయేవి.
\s5
\p
\v 13 అక్కడ ఉన్న కొందరు యూదు మాంత్రికులు కూడా ఊరూరా తిరుగుతూ ఆ ప్రాంతాల్లో ఉన్న దురాత్మలను వదలిపొమ్మని ఆజ్ఞాపించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు "పౌలు ప్రకటించే యేసు తోడు, బయటికి రమ్మని మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాము" అని చెప్పి దురాత్మలు పట్టినవాళ్ళ మీద యేసు ప్రభువు పేరు ఉచ్చరించడానికి పూనుకున్నారు.
\p
\v 14 అక్కడ ఏడుగురు వ్యక్తులు ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళు తనను తాను ప్రధాన యాజకునిగా పిలుచుకునే స్కెవ అనే యూదుని కొడుకులు.
\s5
\p
\v 15 ఒక రోజు వాళ్ళు ఆ విధంగా చేస్తుండగా దురాత్మ ఆ వ్యక్తిలోనుండి బయటికి రాకపోగా, వాళ్ళతో, "నాకు యేసు తెలుసు, పౌలు కూడా తెలుసు గానీ ఈ విధంగా చేయడానికి అధికారం మీకు ఎవరిచ్చారు?" అని అంది.
\p
\v 16 అలా చెప్పి అకస్మాతుగా ఆ దురాత్మ పట్టిన వ్యక్తి స్కెవ కుమారుల మీద ఎగిరి దూకి అందరినీ లొంగదీసుకొని వాళ్ళ బట్టలు చింపి వాళ్ళని గాయపరిచాడు. వాళ్ళు భయపడి ఆ ఇంటినుండి పారిపోయారు.
\p
\v 17 ఎఫెసులో నివసిస్తున్న యూదులూ, యూదేతరులూ అందరూ జరిగిన సంగతి గురించి విన్నారు. వారంతా చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆ దురాత్మ పట్టిన వ్యక్తిని వాళ్ళు చూశారు. అతడు చాలా బలవంతుడు. అదే సమయంలో యేసు ప్రభువు నామానికి ఘనత కలిగింది.
\s5
\p
\v 18 ఆ సమయంలో విశ్వసించిన అనేకమంది, వాళ్ళు చేసిన దుర్మార్గ క్రియలను విశ్వాసులందరూ వింటుండగా ఒప్పుకున్నారు.
\p
\v 19 అంతే కాదు, మాంత్రిక విద్యను అభ్యసించే కొంతమంది తమ పుస్తకాల చుట్టలను అందరూ చూస్తుండగా బహిరంగంగా కాల్చివేశారు. ఆ విధంగా కాల్చిన పుస్తకాల వెల లెక్కబెడితే అది యాభై వేల వెండి రూపాయలు అయ్యింది.
\v 20 ఈ విధంగా అనేకమంది యేసు ప్రభువు సువార్త విని ఆయనలో విశ్వాసముంచారు.
\s5
\p
\v 21 ఎఫెసులో తన పని ముగిసిన తరవాత, ఆత్మ అతణ్ణి యెరూషలేము వెళ్ళడానికి నిర్ణయించాడు. కాని, పౌలు మొదట మాసిదోనియ, అకయ ప్రాంతాలలోని విశ్వాసులను చూడాలని ఉద్దేశించి, "నేను యెరూషలేము వెళ్ళిన తరవాత రోమ్ నగరానికి కూడా వెళ్ళాలి" అని నిర్ణయించుకున్నాడు.
\v 22 అతడు తన సహచరులు తిమోతి, ఎరస్తు అనే ఇద్దరిని మాసిదోనియకు పంపాడు. పౌలు మాత్రం ఆసియా ప్రాంతంలోని ఎఫెసులోనే కొంతకాలం ఉండిపోయాడు.
\s5
\p
\v 23 ఇది జరిగిన వెంటనే యేసు గురించీ, ఆయన బోధల గురించీ ఎఫెసు ప్రజల్లో గొప్ప అల్లరి చెలరేగింది.
\v 24 అక్కడ దేమేత్రి అనే వ్యక్తి ఉన్నాడు. అతడు అర్తెమిదేవికి (డయానా) వెండితో విగ్రహాలు చేయిస్తూ అక్కడి పనివాళ్ళకి గొప్ప ఆదాయం కల్పించేవాడు.
\p
\v 25 దేమేత్రి విగ్రహాలు చేసే పనివారందరినీ పిలిచాడు. వాళ్ళతో అతడు, "ఈ పని చేయడం వలన మనం చాల డబ్బు సంపాదిస్తున్నాం.
\s5
\v 26 పౌలు ఎఫెసులో ఉన్నవారందరికీ మనం చేసే విగ్రహాలను కొనకూడదని చెబుతూ అందరినీ పెడదోవ పట్టిస్తున్నాడని మీకు తెలుసు. ఆఖరికి ఈ ప్రాంతంలో, ఈ చుట్టు పక్కల ఊర్లలో కూడా మనం చేసే విగ్రహాలు ఎవరూ కొనరు. మనం పూజించే దేవతను నిజమైన దేవుడు కాదనీ, విగ్రహాలను పూజించకూడదనీ పౌలు బోధిస్తున్నాడు.
\v 27 ప్రజలు అతని మాటలు వింటే మాత్రం మన వ్యాపారం నట్టేట్లో మునిగినట్ట్లే, వాళ్ళు ఇంకా అర్తెమీ దేవికి (డయానా) పూజించడానికి గుడికి రాకపోవచ్చు. అర్తెమీ దేవి గొప్ప మహిమలు కలిగినదని ఇంకా ప్రజలు నమ్మరు. గానీ ఆసియా ప్రాంతమంతా, లోకమంతా ఆమెను పూజిస్తుంది" అని చెప్పాడు.
\s5
\p
\v 28 దేమేత్రి చెప్పిన మాటలు విన్న పనివారంతా పౌలు మీద కోపంతో ఊగిపోయారు. వాళ్ళు, "ఎఫెసీయుల అర్తెమీ దేవి మహా దేవి, గొప్ప మహిమలు గలది!" అని గట్టిగా అరిచారు.
\v 29 పట్టణంలో చాలామంది పౌలు మీద కోపంతో గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. పట్టణం గందరగోళంగా తయారైంది. వెంటనే వాళ్ళలో కొందరు గుంపులు గుంపులుగా పరిగెడుతూ పౌలుతో బాటు ప్రయాణమై వచ్చిన మాసిదోనియకు చెందిన గాయి, అరిస్తార్కులను పట్టుకుని పట్టణ నాటకశాలకు ఈడ్చుకుపోయారు.
\s5
\v 30 పౌలు ఆ జన సమూహం పోగైన నాటకశాలకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అనుకున్నాడు గాని తోటి విశ్వాసులు అతణ్ణి వెళ్ళనివ్వలేదు.
\v 31 పౌలు స్నేహితులైన కొందరు పట్టణ అధికారులు అక్కడి పరిస్థితులను గురించి విన్నారు. వాళ్ళు పౌలును ఆ రంగస్థలానికి వెళ్ళవద్దని కొంతమందితో కబురుపెట్టారు.
\p
\v 32 ఆ రంగస్థలంలో జనాలు అరుస్తూ ఉన్నారు. గందరగోళంగా ఏదేదో కేకలు వేస్తున్నారు. అయితే అక్కడ గుమిగూడిన వాళ్ళలో చాలామందికి అక్కడ ఏం జరుగుతుందో తెలియనే తెలియదు!
\s5
\v 33 అక్కడ ఉన్న యూదులలో అలెగ్జాండర్ అనే పేరున్న ఒకడిని కొంతమంది యూదులు గుంపులోనుండి జనంతో మాట్లాడ్డం కోసం ముందుకు తోశారు. అలెగ్జాండర్ తన చేతులు పైకెత్తి గుంపు అరుపులను ఆపడానికి సైగ చేసి ప్రజలకు సమాధానం చెప్పాలని చూశాడు. ఈ గందరగోళానికి యూదులు కారణం కాదని చెప్ప ప్రయత్నించాడు.
\v 34 అయితే అక్కడ ఉన్న యూదేతరులకు అలెగ్జాండర్ యూదుడని తెలుసు. యూదులు అర్తెమీ దేవిని పూజించరు. కాబట్టి యూదేతరులు రెండు గంటలు ఏకధాటిగా, "ఎఫెసీయుల అర్తెమీ దేవి మహాదేవి!" అని నినాదాలు చేశారు.
\s5
\p
\v 35 అప్పుడు పట్టణ అధికారులు ఆ జన సమూహాన్ని సముదాయించి ఇలా అన్నారు, "సాటి పౌరులారా, అర్తెమీ దేవి మహాదేవి అనీ, మన అర్తెమీ దేవి విగ్రహం పవిత్రమనీ, ఆకాశం నుండి పడిందనీ ఈ లోకంలోని వారందరికీ తెలుసు.
\v 36 ఈ విషయాలు అసత్యమని ఎవరూ చెప్పలేరు. కాబట్టి మీరిప్పుడు శాంతం వహించండి. మూర్ఖంగా ప్రవర్తించ వద్దు.
\v 37 మీరు ఈ వ్యక్తులను ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. ఎందుకంటే వీరు ఎలాంటి దుర్మార్గం చేయలేదు. వీరు మన గుడిలోకి వెళ్లి అక్కడ ఏమీ దోచుకుపోలేదు. మన దేవత గురించి చెడుగా ఏమీ మాట్లాడలేదు కూడా."
\s5
\p
\v 38 "కాబట్టి దేమేత్రికి, అతని పనివాళ్ళకీ ఎవరిమీదైనా ఆరోపణలు ఉంటే వాళ్ళు దాన్ని సరైన మార్గంలో చేయాలి. అలాంటిది ఏదైనా ఉంటే కోర్టులు ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన న్యాయాధికారులూ ఉన్నారు. అక్కడ మీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవచ్చు.
\v 39 మీరు ఏవైనా విషయాల గురించి ఆరోపణ చేయాలనుకుంటే మీ అధికారులకు చెప్పాలి. అలా అది క్రమమైన సభలోనే పరిష్కారం అవుతాయి.
\v 40 ఇలా గుంపుగూడటం బాగా లేదు. ఇలాంటి అల్లర్లను గురించి మనపై విచారణ జరుపుతారేమో, మనం ప్రభుత్వానికి వ్యతిరేకం అయిపోతాం. ఒకవేళ అధికారులు ఈ రోజు జరిగిన అల్లరి ఏమిటి? మీరెందుకు అరుచుకున్నారు అని అడిగితే మనం వాళ్ళకి తగిన కారణం ఏం చెప్తాం?" అన్నారు.
\v 41 ఈ విధంగా ఆ గుంపుతో పట్టణ అధికారి చెబుతూ వాళ్ళని ఎవరింటికి వాళ్ళని వెళ్ళమని చెప్పాడు. వారంతా తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
\s5
\c 20
\p
\v 1 ఆ అల్లరి సద్దుమణిగిన తరవాత పౌలు విశ్వాసులను సమావేశపరచి ప్రభువైన యేసులో విశ్వాసాన్ని కొనసాగించమని వాళ్ళని ప్రోత్సహించాడు. ఇలా చెప్పిన తరవాత వాళ్ళ దగ్గర సెలవు తీసికొని మాసిదోనియ కు బయలు దేరాడు.
\v 2 అక్కడికి చేరుకొని యేసులో విశ్వాసంలో కొనసాగమని వాళ్ళని హెచ్చరించి అక్కడినుండి గ్రీసు చేరుకున్నాడు.
\v 3 గ్రీసులో అతడు మూడు నెలలు గడిపాడు. తరవాత ఓడమీద సిరియాకు వెళ్ళాలని అనుకున్నాడు గానీ కొందరు యూదులు అతడు ప్రయాణంలో ఉండగా అతణ్ణి చంపాలని కుట్ర చేస్తున్నారని తెలిసి భూమార్గంలో తిరిగి మళ్ళీ మాసిదోనియ గుండా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.
\s5
\p
\v 4 పౌలుతో బాటు యెరూషలేముకు ప్రయాణించేవాళ్ళు ఎవరంటే బెరయ ఊరికి చెందిన పుర్రు కుమారుడు సోపత్రు, తెస్సలోనికకు చెందిన అరిస్తార్కు సెకుందు, దెర్బే పట్టణానికి చెందిన గాయి, గలతీ ప్రాంతానికి చెందిన తిమోతి, ఆసియా ప్రాంతానికి చెందిన తుపికు, త్రోఫిము.
\v 5 ఈ ఏడుగురు మాకంటే (పౌలు, లూకా) ముందుగా మాసిదోనియ నుండి ఓడ ఎక్కి త్రోయ పట్టణంలో దిగి మాకోసం కనిపెడుతూ ఉన్నారు.
\v 6 యూదుల పండగ అయిన పులియని పిండితో చేసే రొట్టెల పండుగ దినాలు అయిన తరవాత మేము త్రోయకు వెళ్ళే ఓడ ఎక్కాము. ఐదు రోజుల తరవాత త్రోయకు చేరి మాకు ముందుగా వెళ్లి కనిపెడుతున్న వాళ్ళని కలుసుకున్నాం. అక్కడ ఏడు దినాలు వాళ్ళ దగ్గర గడిపాం.
\s5
\p
\v 7 వారంలో మొదటి రోజైన ఆదివారం నాడు మేమంతా ఇతర విశ్వాసులతో కలిసి భోజనం చేయడానికి సమావేశం అయ్యాం. అప్పుడు పౌలు అర్థ రాత్రి వరకు వాళ్ళతో మాట్లాడాడు. మరుసటి రోజే అతడు త్రోయను విడిచి వెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళతో విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు.
\v 8 మేము సమావేశమైన మేడగదిలో చాలా దీపాలు వెలుగుతున్నాయి.
\s5
\v 9 ఐతుకు అనే ఒక యువకుడు అక్కడ ఉన్నాడు. అతడు మూడో అంతస్తులో కిటికీ దగ్గర కూర్చున్నాడు. పౌలు విస్తరించి మాట్లాడుతూ ఉండగా అతడు నిద్రలోకి జారుకున్నాడు. అలా గాడనిద్రలోకి జోగి, కిటికీ నుండి కింద పడిపోయాడు. వెంటనే కొందరు విశ్వాసులు అతణ్ణి పైకి లేపారు గానీ అతడు చనిపోయాడు.
\p
\v 10 పౌలు కిందికి దిగి అతని మీద పడుకొని, కౌగలించుకొని తన చుట్టూ నిలబడి చూస్తున్న వాళ్ళతో, "మీరిక గాబరా పడాల్సిన పని లేదు. ఇతడు మళ్ళీ బతికాడు!" అని చెప్పాడు.
\s5
\p
\v 11 అతడు మళ్ళీ పైకి వచ్చి రొట్టె విరిచి తిని, తెల్లవారే వరకు ఎన్నో విషయాలు వాళ్ళతో మాట్లాడి, తరవాత బయలుదేరి వెళ్ళిపోయాడు.
\v 12 సజీవంగా లేచిన ఆ యువకుణ్ణి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఎంతో గొప్ప ఆదరణ వాళ్ళకి కలిగింది.
\s5
\p
\v 13 మేము ఓడ ఎక్కి త్రోయలో పౌలును ఎక్కించుకోవాలని ముందుగా అక్కడికి వెళ్ళాం. కాని పౌలు అక్కడివరకు భూమార్గంలో కాలినడకను వెళ్ళితే ఇంకా తొందరగా అస్సు అనే ప్రాంతానికి వెళ్ళవచ్చని అతడు ఓడ ఎక్కలేదు. కాబట్టి మిగిలిన వారమంతా అస్సుకు ఓడలో ప్రయాణించాం.
\p
\v 14 అస్సులో మేము పౌలును కలుసుకున్నాం. మాతోబాటు అతడు అక్కడ ఓడలోకి ఎక్కాడు. మేమంతా కలిసి మితులేనే అనే పట్టణానికి బయలుదేరాం.
\s5
\p
\v 15 ఒక రోజు తరవాత మేము మితులేనే కి చేరుకున్నాం. అక్కడినుండి బయలుదేరి కియోసు అనే దీవికి దగ్గరగా వచ్చాం. తరవాతి రోజు సమోసు అనే దీవికి ప్రయాణించాం. ఆ తరవాత సమోసు వదిలి మిలేతు పట్టణానికి బయలుదేరాం.
\p
\v 16 మిలేతు ఎఫెసు పట్టణానికి దక్షిణాన కొద్ది దూరంలో ఉంది. పౌలుకు ఎఫెసు పట్టణంలో ఆగడానికి మనసు లేదు. ఎందుకంటే ఆసియలో కాలయాపన చేయడం అతనికి ఇష్టం లేదు. పెంతెకోస్తు పండగ దగ్గర పడుతుండడం వలన సాధ్యమైతే ఆ పండగ సమయానికి యెరూషలేము చేరుకోవాలనే తొందరలో ఉన్నాడు.
\s5
\p
\v 17 వాళ్ళు మిలేతుకు చేరుకొన్నప్పుడు పౌలు ఎఫెసులోని విశ్వాసులైన పెద్దలతో మాట్లాడడానికి వాళ్ళని రమ్మని కబురు పెట్టాడు.
\p
\v 18 ఆ పెద్దలు వచ్చినప్పుడు వాళ్ళతో ఇలా అన్నాడు, "నేను ఆసియాలో కాలుపెట్టిన రోజు నుండి వెళ్ళిపోయే వరకు ఈ మధ్య ఎలా ఉన్నానో మీకే తెలుసు.
\v 19 నేను సంపూర్ణ వినయంతో కొన్నిసార్లు కన్నీళ్ళతో ప్రభువుకు ఎలా సేవ చేశానో మీకు తెలుసు. విశ్వాసులు కాని యూదులు చాలాసార్లు నాకు హాని తలపెట్టినప్పుడు నేను ఎంతగా శ్రమ పడ్డానో కూడా మీకు తెలుసు.
\v 20 నేను ప్రభువు సందేశాన్ని బోధించేటప్పుడు మీకు ప్రయోజనకరమైనది ఏదీ చెప్పకుండా దాచుకోలేదని మీకు తెలుసు. దేవుని సందేశాన్ని అనేకమంది హాజరైన బహిరంగ సమావేశాలలోను, ఇంటింటికీ తిరిగి వ్యక్తిగతంగానూ మీకు బోధించానని కూడా మీకు తెలుసు.
\v 21 యూదులకు, యూదేతరులకు ఇద్దరికీ ప్రభువు వైపు తిరిగి పాపపు జీవితాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాలని బోధించాను."
\s5
\p
\v 22 "పరిశుద్ధాత్మ స్పష్టంగా తెలియజేశాడు కాబట్టి ఇదిగో, ఇప్పుడు నేను యెరూషలేముకు తప్పక వెళ్ళాలి. నేను దానికి తప్పక లోబడాలి. అక్కడ నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు.
\v 23 కానీ నేను దర్శించే ప్రతి పట్టణంలో సంకెళ్ళు, హింసలు నాకోసం వేచి ఉన్నాయని యెరూషలేము ప్రజలు నన్ను సంకెళ్లకు, హింసలకు గురి చేస్తారని పరిశుద్ధాత్మ నాకు ముందుగానే తెలిపాడు.
\v 24 అయితే ప్రజలు నన్ను చంపినా నేనేమీ లెక్కచేయను. ముందు యేసు ప్రభువు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేయగలిగితే చాలు. మనకి ఏమాత్రం అర్హత లేని గొప్ప కార్యాలు మనకోసం చేయడం ద్వారా ఆయన మనల్ని రక్షించాడనే దేవుని కృపా సువార్తను ప్రజలందరికీ తెలిపే పని కోసం ఆయన నన్ను పిలిచాడు. దీనికోసం నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు.
\s5
\v 25 ఇదిగో నేను దేవుని రాజ్యం గురించీ దేవుడెలా రాజుగా తనను తాను కనపరచుకున్నాడో అనే సందేశాన్నీ మీ మధ్య ఉండి మీకు ప్రకటించాను. అయితే ఇకమీదట మీరు నా ముఖం చూడరు. ఇదే ఆఖరి సారి.
\v 26 కాబట్టి ఎవరైనా నేను ప్రకటించిన యేసును గురించి విని నమ్మకుండా చనిపోయినట్లయితే వారందరి రక్తం విషయంలో నేను నిర్దోషిని అని మిమ్మల్నే సాక్ష్యంగా పెడుతున్నాను.
\v 27 ఎందుకంటే దేవుని సంకల్పాన్ని మీకు పూర్తిగా ప్రకటించాను. నేనేమీ దాచలేదు.
\s5
\v 28 నాయకులైన మీరు దేవుని సందేశాన్ని విశ్వసిస్తూ, విధేయత చూపుతూ దానిలోనే కొనసాగాలి. పరిశుద్ధాత్మ మీకు ఇచ్చిన విశ్వాసులందరికీ సహాయపడుతూ వాళ్ళని సంరక్షించాలి. మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తపడుతూ ప్రభువు యొక్క విశ్వాసుల గుంపును గొర్రెల మందను కాచినట్టుగా కాయాలి. సిలువపై చిందించిన తన కుమారుని రక్తం ద్వారా ఆయన వాళ్ళని కొన్నాడు.
\v 29 నాకు తెలుసు, నేను వెళ్ళిపోయిన వెంటనే, క్రూరమైన తోడేళ్ళ వంటివాళ్ళు మీలో ప్రవేశిస్తారు. వాళ్ళు అబద్ధబోధలు చేస్తారు. విశ్వాసులకు గొప్ప హాని కలిగిస్తారు. వాళ్ళు క్రూరమైన తోడేళ్ళలాగా ప్రవేశించి గొర్రెలను చంపుతారు. వాళ్ళు మంద మీద జాలి చూపరు.
\v 30 అంతేకాక మీ స్వంత విశ్వాసుల గుంపులోని నాయకులే దారిమళ్ళించే అబద్ద బోధలు చేస్తారు. మీలోనుండే వాళ్ళు బయలుదేరతారు. కొంతమంది వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళ అనుచరులుగా మారతారు.
\s5
\v 31 కాబట్టి మన ప్రభువైన యేసును గురించిన సత్యమైన సువార్తను విశ్వసించనీయకుండా మిమ్మల్ని ఎవరూ అడ్డుకోకుండా మెలకువగా ఉండండి. మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీటితో ఎడతెగక మీలో ప్రతి ఒక్కరికీ బుద్ధి చెబుతూ ఉన్నానని గుర్తు చేసుకొని మెలకువగా ఉండండి."
\p
\v 32 "ఇప్పుడు నేను వెళ్ళిపోతూ మిమ్మల్ని కాపాడమనీ, రక్షణ పొందడానికి అర్హత లేకపోయినా ఆయన మనల్ని రక్షించాడనే సందేశాన్ని మీరు ఎప్పుడూ విశ్వసించాలనీ నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. మీరు గనక నేను చెప్పిన కృపా సందేశాన్ని నమ్ముతూ కొనసాగితే మీరు శక్తి గలవాళ్ళు అవుతారు. ఆయన తనకు చెందిన వాళ్ళకి వాగ్దానం చేసినవన్నీ అనుగ్రహించి మనకు క్షేమాభివృద్ధి కలిగిస్తాడు."
\s5
\p
\v 33 "నా అవసరాల నిమిత్తం నేను ఎవ్వరి ఆర్ధిక సహాయం గానీ బట్టలు గానీ ఆశించలేదు.
\v 34 నేను నా చేతులతో కష్టపడి పని చేసి నాకోసం నా స్నేహితుల అవసరాల కోసం సంపాదించానని మీకు తెలుసు.
\v 35 మనం కష్టపడి పని చేసి డబ్బు సంపాదించి బలహీనులను సంరక్షించాలనీ, ‘పుచ్చుకోవడం కంటే ఇవ్వడం ధన్యకరమైంది’ అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోవాలనీ, అన్ని విషయాల్లో మీకు ఆదర్శంగా నిలవాలనీ నేను అలా చేశాను."
\s5
\p
\v 36 పౌలు ఈ విధంగా చెప్పి మోకరించి వారందరితో కలిసి ప్రార్థించాడు.
\v 37 అప్పుడు వారంతా చాల ఏడ్చి పౌలును కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నారు.
\v 38 మరి ముఖ్యంగా, "మీరు ఇక మీదట నా ముఖం చూడరు" అని అతడు చెప్పిన మాటకు ఎంతో దుఖించారు. అప్పుడు వారందరూ అతణ్ణి ఓడ వరకూ సాగనంపారు.
\s5
\c 21
\p
\v 1 ఎఫెసులో ఉన్న పెద్దలకు వీడుకోలు చెప్పిన తరవాత మేము ఓడ ఎక్కి కోసు ద్వీపం దాకా సముద్రం మీద ప్రయాణించాం. అక్కడ రాత్రి కావడం చేత ఆ ఓడ నిలిపివేశారు. ఆ మరునాడు మేము ఓడలో కోసు నుండి రొదు ద్వీపానికి చేరుకున్నాం. అక్కడ ఓడ మళ్ళీ ఆగింది. ఆ తరవాతి రోజు మేము మళ్ళీ ప్రయాణించి పతర పట్టణం చేరుకున్నాం.
\v 2 పతరలో మేము ఓడను విడిచిపెట్టాము. అక్కడనుండి ఫోనికయకు వెళుతున్న ఓడ ఒకటి ఉన్నదని ఎవరో చెప్పారు. కాబట్టి మేమంతా ఆ ఓడ ఎక్కి బయలుదేరాం.
\s5
\v 3 కుప్ర ద్వీపం కనిపించేదాకా మేము సముద్రం మీద ప్రయాణిస్తూ వెళ్లాం. ఆ ద్వీపం దక్షిణం వరకూ వెళ్లి సిరియా రాష్ట్రంలోని తూరు నగరం దగ్గర ఫోనికయ ప్రాంతం చేరుకునే దాకా ముందుకు సాగాం. ఆ ఓడ పనివాళ్ళు ఓడ లోని సరుకులు అక్కడ దించవలసి ఉండడం చేత అది అక్కడే కొన్ని రోజులు నిలిచి ఉంటుంది.
\p
\v 4 తూరు నగరంలో విశ్వాసులు ఎక్కడ ఉంటారో ఎవరో చెబితే మేము వెళ్లి వాళ్ళ దగ్గర ఏడురోజులు గడిపాము. పౌలు యెరూషలేము వెళ్తే అక్కడి ప్రజలు అతనికి హాని తలపెడతారని దేవుని ఆత్మ వాళ్ళకి వెల్లడి చేయడం వలన వాళ్ళు అతణ్ణి యెరూషలేముకు వెళ్ళవద్దని హెచ్చరించారు.
\s5
\v 5 ఇక ఆ ఓడ బయలుదేరే సమయం కావడం చేత మేము సిద్ధపడి యెరూషలేముకు మా ప్రయాణం కొనసాగించాం. మేము తూరు నగరం వదిలి వెళ్తుండగా అక్కడి విశ్వాసుల్లో పురుషులు, వాళ్ళ భార్యలు, పిల్లలతో సహా మమ్మల్ని సాగనంపడానికి సముద్ర తీరం దాకా వచ్చారు. ఆ తీరంలో ఇసుకలో మేమంతా మోకరించి ప్రార్థన చేశాం.
\v 6 వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని, పౌలు, అతని అనుచరులం అయిన మేము ఓడలో ఎక్కాం. వారంతా తమ ఇళ్ళకి తిరిగి వెళ్ళారు.
\s5
\p
\v 7 మేము తూరు వదలిపెట్టి ఆ ఓడలో తొలిమాయి అనే నగరానికి వచ్చాం. అక్కడ కొందరు విశ్వాసులు ఉన్నారు. మేము వాళ్ళని పలకరించి వాళ్ళతో ఆ రాత్రి గడిపాం.
\v 8 తరవాతి రోజు మేము కైసరయ నగరానికి ప్రయాణించాం. అక్కడ తన చుట్టూ ఉన్న ప్రజలకు యేసును వెంబడించడం ఎలాగో బోధిస్తున్న ఫిలిప్పు ఇంట్లో విడిది చేశాం. యెరూషలేములోని విధవరాళ్ళకు పరిచర్య చేయడానికి అక్కడి విశ్వాసులు ఎన్నుకొన్న ఏడుగురు వ్యక్తుల్లో అతడు ఒకడు.
\v 9 అతనికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. వాళ్ళకి వివాహం కాలేదు. వాళ్ళలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ తమకు బయలుపరచిన విషయాలను ప్రవచన రూపంలో పలికే వరం ఉన్నవాళ్ళు.
\s5
\p
\v 10 మేము చాలా రోజులు ఫిలిప్పు ఇంట్లో గడిపిన తరవాత యూదయ పరగణా నుండి అగబు అనే విశ్వాసి కైసరయకు వచ్చాడు. అతడు తరచుగా పరిశుద్ధాత్మ పలికించే ప్రవచనాలు చెప్పేవాడు.
\p
\v 11 అతడు మేమున్న చోటికి వచ్చి పౌలు నడికట్టు విప్పి దానితో తన స్వంత కాళ్ళు చేతులు కట్టేసుకుని, "పరిశుద్ధాత్మ చెబుతున్న దేమిటంటే ఈ నడికట్టు ఎవరిదో అతని చేతులనూ, కాళ్ళనూ యెరూషలేములోని యూదు నాయకులు ఈవిధంగా కట్టేసి ఖైదీగా యూదేతరులకు అప్పగిస్తారు" అన్నాడు.
\s5
\p
\v 12 ఆ మాటలు విన్న మేము, అక్కడ ఉన్న ఇతరులూ "దయచేసి యెరూషలేముకు వెళ్ళవద్దు" అని పౌలును వేడుకున్నాం.
\p
\v 13 అయితే పౌలు మాతో, "మీరు చేస్తున్నదేమిటి? దయచేసి మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తున్నరేంటి?వెళ్ళ నీయకుండా నన్ను నిరుత్సాహపరచవద్దు. నేను సేవిస్తున్న యేసు ప్రభువు కోసం నేను జైలుకు వెళ్ళడానికీ ఆఖరికి యెరూషలేములో చనిపోడానికీ సిద్ధంగా ఉన్నాను" అన్నాడు.
\p
\v 14 అతడు యెరూషలేము వెళ్ళడానికి స్థిరంగా నిర్ణయించుకున్నాడని మేము గ్రహించి ఇక అతణ్ణి ఆపడానికి మరే ప్రయత్నమూ చేయలేదు. అతడు, "ప్రభువు చిత్తమే జరుగుతుంది గాక" అన్నాడు.
\s5
\p
\v 15 కైసరయలో కొన్ని రోజులు గడిపిన తరవాత మేము మా వస్తువులు సిద్ధం చేసుకొని యెరూషలేము వరకు భూమార్గంలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం.
\p
\v 16 కైసరయలోని కొందరు విశ్వాసులు కూడా మాతో వచ్చారు. వాళ్ళు మమ్మల్ని మ్నాసోను అనే అతని ఇంట్లో ఉండడానికి తీసుకెళ్ళారు. అతడు కుప్ర దీవికి చెందినవాడు. ప్రారంభంలో ప్రజలు యేసుప్రభువు గురించి విన్నప్పుడు విశ్వసించిన వాళ్ళలో అతడు ఒకడు.
\s5
\p
\v 17 మేము యెరూషలేము చేరుకున్నప్పుడు ఒక విశ్వాసుల గుంపు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించింది.
\p
\v 18 తరవాతి రోజు పౌలు, మేమంతా కలిసి అక్కడి సంఘ నాయకుడైన యాకోబుతో మాట్లాడడానికి వెళ్లాం. యెరూషలేము సంఘ ఇతర నాయకులు కూడా అక్కడ ఉన్నారు.
\p
\v 19 అప్పుడు పౌలు వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి యూదేతరుల మధ్య దేవుడు తనద్వారా జరిగించిన పరిచర్య గురించి వాళ్ళకి వివరించాడు.
\s5
\p
\v 20 వాళ్ళు అతని మాటలు విన్నప్పుడు, యాకోబు, ఇతర నాయకులు దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళలో ఒకరు, "సోదరుడా, ఇక్కడ యేసు ప్రభువును నమ్మిన అనేక వేలమంది యూదులు ఉన్నారని నీకు తెలుసు. అలాగే మేమంతా మోషే ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పాటిస్తామని కూడా నీకు తెలుసు.
\v 21 అయితే మా సాటి యూదు విశ్వాసులు విన్నదేమిటంటే నువ్వు యూదేతరుల మధ్య ఉన్నప్పుడు అక్కడ నివసించే యూదు విశ్వాసులకు వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని మానివేయాలని చెబుతున్నావట. ఆ యూదు విశ్వాసులు సున్నతి తీసుకోకూడదనీ, వాళ్ళ సంతానం మన ఇతర ఆచారాలను పాటించకూడదనీ బోధిస్తున్నావని వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటలు మేము నమ్మలేదు.
\s5
\p
\v 22 "అయినా ఇక్కడున్న యూదులకు నువ్వు వచ్చావని తెలిసిపోతుంది. వాళ్ళకి నీపై కోపం వస్తుంది. కాబట్టి నీ గురించి వాళ్ళు విన్నది నిజం కాదని చెప్పడానికి రుజువుగా నువ్వు ఒక పని చేయాలి.
\v 23 ఇక్కడ దేవునికి తమను ప్రతిష్టించుకున్న నలుగురు మనుషులు ఉన్నారు.
\v 24 వాళ్ళతో కలిసి దేవాలయానికి వెళ్లి మీరు ఆరాధించ గలిగేలా నీకు, వాళ్ళకి సరిపడిన విధంగా కర్మకాండలు జరిగించు. వాళ్ళు బలులు అర్పించాల్సిన సమయానికి వాళ్ళు మొక్కుబడి చేసుకున్న దాన్ని నీవే చెల్లించు. ఆ తరవాత వాళ్ళు జుట్టు గొరిగించుకొని తాము మొక్కుబడి నెరవేర్చామని చూపించుకుంటారు. నువ్వు వాళ్ళతో ఉండడం చూసి యూదులు నీ గురించి విన్నది సత్యం కాదు అని గ్రహిస్తారు. అంటే, నువ్వు యూదా సంప్రదాయాలను తు చ తప్పకుండా పాటించే వాడివని వారంతా తెలుసుకుంటారు.
\s5
\p
\v 25 "ఇక యూదేతర విశ్వాసుల విషయంలో యెరూషలేములో ఉన్న మా పెద్దలంతా వాళ్ళు ధర్మశాస్త్రంలో ఏయే నియమాలను పాటించాలో అనే దాని గురించి ఇప్పటికే మాట్లాడాము. మేము చేసిన తీర్మానాలు వాళ్ళకి ఉత్తరం ద్వారా తెలియజేశాము. వాళ్ళు విగ్రహాలకు అర్పించిన మాంసాన్ని గొంతు పిసికి చంపిన జంతువుల మాంసాన్ని తినకూడదనీ మేము వాళ్ళకి రాశాం. అలాగే జారత్వానికి దూరంగా ఉండాలని కూడా మేము వాళ్ళకి చెప్పాం" అన్నాడు.
\v 26 పౌలు వాళ్ళు చెప్పిన దానికి అంగీకరించి, ఆ తరవాతి రోజు ఆ నలుగురు మనుషులను దేవాలయానికి తీసుకెళ్ళి వాళ్ళతో కలిసి శుద్దీకరణాచారాల్లో పాల్గొన్నాడు. ఆ తరవాత అతడు దేవాలయంలోకి వెళ్ళి యాజకులతో తమను ఎప్పటికి శుద్ధి పరచుకుంటారో, వాళ్ళలో ఒక్కొక్కని కోసం జంతువులను బలి అర్పణ ఎప్పుడు చేస్తారో వాళ్ళకి చెప్పాడు.
\s5
\p
\v 27 తమను శుద్ధి చేసుకొనే ఏడురోజుల కాలం ముగిసినప్పుడు పౌలు మళ్ళీ దేవాలయం ఆవరణలోకి వచ్చాడు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు అతణ్ణి అక్కడ చూశారు. అతని మీద వాళ్ళకి కోపం వచ్చింది. వాళ్ళు పౌలుని పట్టుకోడానికి ఇంకా మరి కొందరు యూదులను సహాయం కోసం ఆ మందిర ఆవరణలోకి పిలిచారు.
\p
\v 28 వాళ్ళు, "సాటి ఇశ్రాయేలీయులారా, రండి, ఈ మనిషిని శిక్షించడానికి సహాయం చెయ్యండి. తాను ఎక్కడికి వెళ్ళినా అక్కడ యూదులను లెక్క చేయవద్దని అక్కడి ప్రజలకు ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించనక్కర లేదనీ, ఈ పవిత్ర దేవాలయాన్ని గౌరవించాల్సిన పని లేదనీ బోధిస్తున్నాడు. ఇదిగో ఈ యూదేతరులైన మనుషుల్ని దేవాలయంలోకి తీసుకువచ్చి దీనిని అపవిత్రం చేశాడు!" అని కేకలు వేశారు.
\v 29 పౌలు ఎఫెసుకు చెందిన యూదేతరుడు త్రోఫింతో కలిసి యెరూషలేములో తిరగటం వలన వాళ్ళు ఈవిధంగా వ్యవహరించారు. వాళ్ళ చట్టం ప్రకారం యూదేతరులు దేవాలయంలో ప్రవేశించడానికి వీలు లేదు. ఆ రోజున త్రోఫిమును పౌలు తనతోబాటు దేవాలయంలోకి తోడుకొని వచ్చాడని వాళ్ళు భావించారు.
\s5
\p
\v 30 దేవాలయం ఆవరణంలో ఏదో గొడవ జరుగుతున్నదని తెలిసి ఆ ఊరి ప్రజలంతా అక్కడికి పరుగెత్తుకు వచ్చారు. వాళ్ళు పౌలును పట్టుకుని అతణ్ణి దేవాలయం బయటికి ఈడ్చుకెళ్లారు. ప్రజలు దేవాలయం మధ్యలో అల్లరి చేయకుండా దేవాలయం ప్రధాన ద్వారం మూసివేశారు.
\p
\v 31 వాళ్ళు పౌలును చంపడానికి ప్రయత్నిస్తుండగా ఒకడు పరుగెత్తుకుంటూ దేవాలయం దగ్గరలో ఉన్న కోటలోకి వెళ్లి యెరూషలేములో చాలా మంది దేవాలయంలో చేరి అల్లరి చేస్తున్నారని అక్కడి రోమా సైనిక ఆధిపతికి చెప్పాడు.
\s5
\p
\v 32 ఆ అధిపతి ఆలస్యం చెయ్యకుండా మరి కొందరు అధికారులను, చాల మంది సైనికులను తీసికొని దేవాలయం దగ్గర ప్రజలు గుమి కూడిన చోటికి వెళ్ళాడు. పౌలుని కొడుతున్న ఆ గుంపు ఆ అధిపతిని చూసి పౌలును కొట్టడం ఆపారు.
\p
\v 33 ఆ అధిపతి పౌలు ఉన్న చోటికి వచ్చి అతణ్ణి అదుపులోకి తీసుకున్నాడు. పౌలు చేతులు రెండింటినీ సంకెళ్ళతో బంధించమని అతడు సైనికులకు ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ జన సమూహాన్ని చూసి, "ఇతడెవరు? ఏం చేశాడు?" అని ప్రశ్నించాడు.
\s5
\p
\v 34 అక్కడ ఉన్నవాళ్ళలో కొందరు ఒక రకంగా మరికొందరు మరొక రకంగా కేకలు వేస్తున్నారు. వారంతా పెద్దగా కేకలు వేస్తూ ఉండడం చేత వారేం చెబుతున్నారో ఆ సైన్యాధికారికి అర్థం కాలేదు. కాబట్టి పౌలును ప్రశ్నించేటందుకు వీలుగా అతణ్ణి కోటలోకి తీసుకెళ్ళమని సైనికులకు ఆజ్ఞాపించాడు.
\v 35 సైనికులు పౌలుని ఆ కోట మెట్ల దగ్గరకి తీసుకెళ్ళారు. అయితే చాలామంది పౌలుని చంపడానికి వాళ్ళ వెంటబడుతూనే ఉన్నారు. అప్పుడు పౌలుని మోసికొని కోటలోకి తీసుకెళ్ళమని ఆ అధిపతి సైనికులకు ఆజ్ఞాపించాడు.
\v 36 వాళ్ళని వెంబడిస్తున్న ఆ గుంపు, "అతణ్ణి చంపండి! చంపండి!" అని అరుస్తూనే ఉంది.
\s5
\p
\v 37 పౌలుని ఆ కోటలోకి తీసుకెళ్తూ ఉండగా, ఆ సైన్యాధికారితో పౌలు గ్రీకు భాషలో "నేను మీతో మాట్లాడవచ్చా?" అన్నాడు. అప్పుడా అధిపతి, "నువ్వు గ్రీకు భాష మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది.
\v 38 నువ్వు కొంత కాలం క్రితం ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడానికి చూసి నాలుగు వేలమంది దురాక్రమణ దారులతో కలిసి మాకు దొరక్కుండా అరణ్యంలోకి పారిపోయిన ఈజిప్టుకు చెందిన మనిషివి గదా?" అన్నాడు.
\s5
\p
\v 39 అందుకు పౌలు, "కాదు, నేనా వ్యక్తిని కాదు. నేనొక యూదుణ్ణి. నేను కిలికియ లోని ప్రాముఖ్య పట్టణమైన తార్సుకి చెందినవాణ్ణి. దయచేసి నన్ను ఈ ప్రజలతో మాట్లాడనియ్యండి" అన్నాడు.
\v 40 ఆ అధిపతి పౌలుకు మాట్లాడటానికి అనుమతించాడు. అప్పుడు పౌలు ఆ మెట్ల మీద నిలబడి ఆ గుంపును నిశ్సబ్దంగా ఉండమని చేతితో సైగ చేశాడు. సద్దుమణిగినప్పుడు, పౌలు వాళ్ళ స్వంత భాష అయిన హీబ్రూ లో మాట్లాడడం మొదలెట్టాడు.
\s5
\c 22
\p
\v 1 పౌలు, "యూదు పెద్దలారా, తోటి సహోదరులారా, నన్ను నిందిస్తున్న వాళ్ళతో నేను చెప్పే మాటలు వినండి" అన్నాడు.
\v 2 పౌలు తమ స్వంత హెబ్రీ భాషలో మాట్లాడటం విని జనసమూహం అంతా నిశ్సబ్దంగా వినడం ప్రారంభించారు. అప్పుడు పౌలు వాళ్ళతో ఇలా అన్నాడు.
\s5
\p
\v 3 "నేనూ మీలాగే ఒక యూదుణ్ణి. నేను కిలికియ ప్రాంతంలో ఉన్న తార్సు పట్టణంలో పుట్టాను. అయితే పెరగటం అంతా యెరూషలేములోనే పెరిగాను. నేను చిన్నతనం నుండి మోషే మన పితరులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో శిక్షణ పొందాను. గమలియేలు నా గురువు. నేను దేవునికి విధేయత చూపాలనే ఆసక్తితో ధర్మశాస్త్రానికి కట్టుబడ్డాను. మీకు కూడా ఇలాంటి ఆసక్తే ఉంది అని అనుకుంటున్నాను.
\v 4 ఆ కారణం చేత యేసును గురించిన దేవుని సువార్తను ఎవరైతే నమ్ముతారో, వారందరినీ బంధించాలని ప్రయత్నించాను. వాళ్ళని చంపడం కోసం మార్గాలు వెదికాను. ఆ సువార్తను నమ్మిన వాళ్ళు ఎవరు ఎదురైనా, స్త్రీలు గానీ పురుషులు గానీ వాళ్ళని బంధించి ఈడ్చుకు పోయి కారాగారంలో పడేసేవాణ్ని.
\v 5 ఈ విషయం ప్రధాన యాజకునికీ, యూదు సమాజ పెద్దలందరికీ తెలుసు. నేను వాళ్ళ దగ్గర దమస్కు పట్టణంలోని మన యూదులకు లేఖలు తీసుకున్నాను. ఈ లేఖలు యేసును నమ్మినవాళ్ళని బంధించడానికి నాకు అధికారం ఇచ్చాయి. అప్పుడు వాళ్ళని నేను బంధించి ఖైదీలుగా యెరూషలేముకు తీసుకువస్తే పెద్దల సభ వాళ్ళకి శిక్ష విధిస్తారు."
\s5
\p
\v 6 "ఆ విధంగా నేను దమస్కుకు బయలుదేరాను. మధ్యాహ్న సమయంలో దమస్కును సమీపిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద వెలుగు ఆకాశంనుండి నా చుట్టూ ప్రకాశించింది.
\v 7 ఆ వెలుగు చాలా ప్రకాశంగా ఉండడం వలన నేను నేలమీద పడిపోయాను. అప్పుడు ఆకాశం నుండి ఒకరు నాతో ఇలా అన్నారు, "సౌలూ, ఎందుకయ్యా నన్ను హింస పెడుతున్నావు?"
\v 8 అందుకు నేను, "ప్రభూ! నీవెవరివి?" అని అడగగా ఆయన, "నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసును" అని నాతో చెప్పాడు.
\s5
\v 9 నాతోబాటు ఉన్నవాళ్ళు, గొప్ప వెలుగు చూశారు గానీ ఆ స్వరం చెప్పింది మాత్రం వాళ్ళకి అర్థం కాలేదు."
\p
\v 10 "అప్పుడు నేను "ప్రభూ, నీవు నేనేం చెయ్యాలి?" అని అడిగాను. ప్రభువు నాతో, "నీవు లేచి దమస్కుకు వెళ్ళు. అక్కడ నీవేం చేయాలని నిర్ణయించానో ఒక వ్యక్తి నీకు తెలియజేస్తాడు" అన్నాడు."
\p
\v 11 "కళ్ళు బైర్లు కమ్మించే ఆ వెలుగు ప్రభావం వల్ల నేను చూడలేక పోయాను. దానితో నాతో ఉన్నవాళ్ళు నన్ను నడిపించుకుంటూ దమస్కు పట్టణంలోకి తీసుకెళ్ళారు.
\s5
\v 12 అక్కడ అననీయ అనే ఒకాయన నన్ను చూడటానికి వచ్చాడు. అతడు భక్తిపరుడు, ధర్మశాస్త్రం విషయంలో నిష్ఠ కలిగినవాడు, అక్కడి యూదుల చేత మంచి పేరు పొందినవాడు."
\p
\v 13 "అతడు వచ్చి నా పక్కన నిలబడి నాతో, "సోదరుడా సౌలూ, చూపు పొందు!" అన్నాడు. అలా చెప్పగానే నేను చూపు పొంది అతణ్ణి చూశాను.
\s5
\v 14 అప్పుడు అతడు నాతో, "మనమూ, మన పూర్వికులూ ఆరాధించే దేవుడు నిన్ను నియమించాడు, ఆయన నీ చేత ఏం చేయించాలని అనుకుంటున్నాడో నీకు తెలియజేస్తాడు. ఆయన సంకల్పాన్ని తెలుసుకోడానికీ, ఆ నీతిమంతుణ్ణి చూడడానికీ, ఆయన నోటి మాట వినడానికీ నిన్ను నియమించాడు."
\p
\v 15 "నీవు చూసిన వాటి గురించీ, విన్నవాటి గురించీ ప్రజలందరి ఎదుట ఆయనకు సాక్షిగా ఉంటావు.
\v 16 కాబట్టి ఇంకా ఆలస్యం చేయకు. లేచి నిలబడు, నేను నీకు బాప్తిసం ఇస్తాను, ఆయన నామంలో ప్రార్థన చేసి నీ పాపాలను కడిగివేసుకో" అన్నాడు. తరవాత నేను యెరూషలేము తిరిగి వచ్చేశాను."
\s5
\p
\v 17 "ఒకరోజు నేను దేవాలయ ఆవరణంలో ప్రార్థన చేస్తుండగా ఒక దర్శనం చూశాను.
\v 18 ఆ దర్శనంలో ప్రభువును చూశాను. ఆయన నాతో, "నీవు వెంటనే యెరూషలేము విడిచి వెళ్ళు! ఇప్పుడు ఇక్కడ నా గురించి చెప్పేవాటిని ఇక్కడి ప్రజలు నమ్మరు" అని చెప్పాడు.
\s5
\v 19 అయితే నేను ఆయనతో, "ప్రభూ, ప్రతి సమాజ మందిరంలో నీపై నమ్మకం ఉంచినవాళ్ళని నేను కొడుతూ, జైలులో వేయిస్తూ ఉన్నానని వాళ్ళకి తెలుసు.
\v 20 స్తెఫను నీగురించి ప్రజలకు ప్రకటించినందుకు నేను కూడా అక్కడ నిలబడి వాళ్ళు చేస్తున్నదానికి సమ్మతించాను. ఆఖరికి అతని చంపినవాళ్ళ పైవస్త్రాలకు కూడా కాపలా ఉన్నాను!" అన్నాను.
\v 21 అయితే ప్రభువు నాతో, "వద్దు, నీవు ఇక్కడ ఉండవద్దు. యెరూషలేమును వదలివెళ్ళిపో. ఎందుకంటే నేను నిన్ను దూరంగా, యూదేతరుల దగ్గరికి పంపుతాను" అని చెప్పాడు."
\s5
\p
\v 22 ప్రజలు అంతవరకు పౌలు చెప్పేది అంతా చక్కగా వింటూ ఉన్నారు. కానీ, ఎప్పుడైతే అతడు యూదేతరుల దగ్గరికి దేవుడు తనను పంపాడని చెప్పాడో, వెంటనే వాళ్ళు, "ఇతన్ని చంపండి! ఇతడు బతకడానికి వీల్లేదు!" అని కేకలు వేశారు.
\v 23 వాళ్ళు అలా అరుస్తూ వాళ్ళ పై వస్త్రాలు తీసివేసి విదిలించుకుంటూ ఆకాశం వైపు దుమ్మెత్తి పోశారు. ఇది వారెంత కోపోద్రిక్తులయ్యారో తెలియజేస్తుంది.
\v 24 కాబట్టి సైనిక అధికారి అతణ్ణి జైలులోకి తీసుకెళ్ళమని ఆజ్ఞాపించాడు. యూదులకు అంత కోపం తెప్పించిన కారణం ఏమిటో పౌలునుండి రాబట్టడానికి కొరడా దెబ్బలు కొట్టి విచారణ చేయమని సైనికులకు ఆజ్ఞాపించాడు.
\s5
\p
\v 25 అప్పుడు వాళ్ళు అతని చేతులు చాపి కొరడా దెబ్బలు కొట్టడానికి అనువుగా తాళ్ళతో కడుతున్న సైనికునితో పౌలు, "శిక్ష విధించకుండానే ఒక రోమా పౌరుణ్ణి కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా?" అని అడిగాడు.
\v 26 ఆ అధికారి ఆ మాట వినగానే సేనాపతి దగ్గరకి వెళ్లి, "నీవేం చేస్తున్నావు? అతడు రోమా పౌరుడు, తెలుసా?" అన్నాడు.
\s5
\p
\v 27 ఈ మాటలు విన్నప్పుడు సేనాపతి ఆశ్చర్యపోయాడు. స్వయంగా అతడే జైలు దగ్గరకు వెళ్లి పౌలుతో, "నీవు నిజంగా రోమా పౌరుడివా?" అని అడిగాడు. దానికి పౌలు, "అవును," అన్నాడు.
\v 28 అప్పుడు ఆ సేనాపతి, "నేను కూడా రోమా పౌరుడినే. అలా కావడానికి చాలా డబ్బు చెల్లించాను" అన్నాడు. దానికి పౌలు, "కానీ నేను పుట్టుకతోనే రోమా పౌరుణ్ణి" అన్నాడు.
\v 29 సైనికులు అతణ్ణి కొరడాలతో కొట్టడానికి సిద్ధపడుతున్న సమయంలోనే పౌలును ఈ ప్రశ్నలు అడిగాడు. అయితే అతని జవాబులు విని వాళ్ళు అతణ్ణి వదిలి వెళ్ళిపోయారు. పౌలు రోమా పౌరుడని తెలియక అతని చేతులు తాళ్ళతో కట్టించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆ సేనాపతి చాలా భయపడ్డాడు.
\s5
\p
\v 30 అయినా సరే, పౌలు మీద యూదులు ఎందుకు నేరం మోపారో కచ్చితంగా తెలుసుకోవాలని సేనాపతి అనుకున్నాడు. తరవాతి రోజు అతడు పౌలు సంకెళ్ళను తీసివేయమని సైనికులకు ఆదేశించాడు. ప్రధాన యాజకుణ్ణి, మహా సభ పెద్దలందరినీ రావాలని ఆజ్ఞాపించి, పౌలును తెచ్చి వాళ్ళ ఎదుట నిలబెట్టాడు.
\s5
\c 23
\p
\v 1 పౌలు మహాసభ వాళ్ళని సూటిగా చూసి, "యూదు సోదరులారా, నేను ఈ రోజు వరకూ దేవుని ఎదుట స్వచ్చమైన మనస్సాక్షితో నడుచుకొంటున్నాను. నేను ఏ తప్పూ చేశానని అనుకోవడం లేదు" అని చెప్పాడు.
\v 2 ప్రధాన యాజకుడు అననీయ, పౌలు చెప్పింది విని, అతని దగ్గర నిలబడిన వాళ్ళతో, "అతణ్ణి నోటిమీద కొట్టండి" అని ఆజ్ఞాపించాడు.
\v 3 అప్పుడు పౌలు అతణ్ణి చూసి, "సున్నం కొట్టిన గోడా! కపట వేషదారీ! దేవుడు నిన్ను కొడతాడు. దేవుడు ఇచ్చిన మోషే ధర్మశాస్త్రం ప్రకారం అక్కడ కూర్చుని నన్ను విచారణ చేస్తూ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నన్ను కొట్టమని చెప్పి నువ్వే దానిని అతిక్రమిస్తున్నావు. ఎందుకంటే నేను తప్పు చేశానని నిరూపించకుండానే నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావు" అన్నాడు.
\s5
\p
\v 4 పౌలు దగ్గర నిలబడి ఉన్న మనుషులు అతనితో, "దేవుని పరిచారకుడైన మన ప్రధాన యాజకుని అలా దూషించ కూడదు" అన్నారు.
\v 5 అప్పుడు పౌలు, "సోదరులారా, నన్ను కొట్టమని మీతో చెప్పిన ఈ వ్యక్తి ప్రధాన యాజకుడని నాకు తెలీదు. ఒకవేళ నాకు తెలిసి ఉంటే ప్రధాన యాజకుని దూషించే వాణ్ణి కాదు, ఎందుకంటే, ‘నీ ప్రజల అధికారిని నిందించవద్దు! అని మన ధర్మశాస్త్రంలో రాసి ఉంది" అన్నాడు.
\s5
\p
\v 6 అక్కడ ఉన్నవాళ్ళలో ఒకభాగం పరిసయ్యులూ, మరొక భాగం సద్దూకయ్యులూ ఉన్నట్టు పౌలు గ్రహించి, "సోదరులారా, నేను పరిసయ్యుణ్ణి, మా వంశమంతా పరిసయ్యులే, మనకున్న నిరీక్షణను బట్టి, చనిపోయినవాళ్ళు తిరిగి లేవడం గురించీ నేను ఇప్పుడు విచారణను ఎదుర్కొంటున్నాను" అని ఆ సభలో గొంతెత్తి చెప్పాడు.
\p
\v 7 అతడు అలా చెప్పగానే పరిసయ్యులకూ, సద్దూకయ్యులకూ మధ్య కలహం రేగింది. అందువల్ల ఆ సమూహం రెండు పక్షాలుగా చీలిపోయింది. వాళ్ళు ఒకరితో ఒకరు వాదనలకు దిగారు.
\v 8 మనుషులు మరణించిన తరవాత తిరిగి పునరుత్థానం చెందుతారు అని సద్దూకయ్యులు నమ్మరు. అంతేకాదు, వాళ్ళు దేవదూతలు ఉన్నారనీ, ఆత్మలు ఉన్నాయనీ కూడా నమ్మరు. అయితే పరిసయ్యులు వీటన్నిటినీ నమ్ముతారు.
\s5
\p
\v 9 వాళ్ళు వాదించుకుంటూ ఒకరి మీద ఒకరు అరుచుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది ధర్మశాస్త్ర బోధకులైన పరిసయ్యులు లేచి నిలబడ్డారు. వాళ్ళలో ఒకడు, "ఈ మనిషి ఏ తప్పూ చెయ్యలేదని మేము అనుకుంటున్నాం. ఒక దేవదూత గానీ, ఒక ఆత్మ గానీ ఇతనితో మాట్లాడి ఉండవచ్చు. అతడు చెప్పినదంతా సత్యమే" అని వాదించారు.
\p
\v 10 అప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యుల మధ్య పరిస్థితి విషమించింది. కాబట్టి వాళ్ళు పౌలును రెండుగా చీల్చేస్తారేమో అని సేనాధిపతి భయపడి, "వాళ్ళ మధ్యనుండి అతడిని బలవంతంగా పట్టుకుని కోటలోకి తీసుకురండి" అని సైనికులకు ఆజ్ఞాపించాడు.
\s5
\p
\v 11 ఆ రాత్రి, ప్రభువు తన పక్కన నిలబడి ఉండడం పౌలు చూశాడు. ఆయన అతనితో, "ధైర్యంగా ఉండు! యెరూషలేములో ఇప్పుడు నా గురించి నువ్వెలా సాక్ష్యం చెప్పావో రోమ్ లో కూడా సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది" అని చెప్పాడు.
\s5
\p
\v 12 తెల్లవారిన తరవాత పౌలును ద్వేషించే కొంతమంది యూదులు సమావేశమై అతణ్ణి ఎలా చంపాలా అని మంతనాలు జరిపారు. వాళ్ళు తమలో తాము అతణ్ణి చంపేటంతవరకు అన్నపానాలు ముట్టుకోకూడదని ఒట్టు పెట్టుకున్నారు. వాళ్ళు చేసుకున్న ప్రమాణం ప్రకారం గనక చేయలేకపోతే తమను శపించమని దేవుణ్ణి వేడుకున్నారు.
\p
\v 13 ఆ విధంగా పౌలును చంపాలి అనుకొన్న వాళ్ళు మొత్తం 40 మంది దాకా ఉన్నారు.
\s5
\v 14 వాళ్ళు ప్రధాన యాజకుని దగ్గరకూ, యూదా పెద్దల దగ్గరకూ వెళ్లి "మేము పౌలును చంపేటంతవరకూ అన్నపానాలు ముట్టమని దేవుని దగ్గర ఒట్టు పెట్టుకున్నాం.
\v 15 కాబట్టి మీరు మహాసభ అంతటి తరపున వెళ్లి పౌలును క్షుణ్ణంగా విచారణ చేయాలనే వంకతో అతణ్ణి మీ దగ్గరకు తీసుకురమ్మని సేనాధిపతికి మనవి చేయండి. అతడు మీ దగ్గరకు రాకముందే దారిలోనే మేము అతణ్ణి చంపడానికి సిద్ధంగా ఉన్నాం" అని చెప్పారు.
\s5
\p
\v 16 అయితే పౌలు మేనల్లుడు వాళ్ళ కుట్రను విని వెంటనే కోటలోకి వెళ్లి ఈ విషయం పౌలుకు తెలియజేశాడు.
\p
\v 17 ఇది విన్న పౌలు ఒక అధికారిని పిలిచి అతనితో, "దయచేసి ఈ యువకుణ్ణి సేనాధిపతి దగ్గరకి తీసుకెళ్ళు. ఇతడు ఆయనకు ఏదో ఒక విషయం చెప్పాలి" అని చెప్పాడు.
\s5
\p
\v 18 అప్పుడు ఆ అధికారి ఆ యువకుణ్ణి సేనాధిపతి దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆ అధికారి సేనాధిపతితో, "ఖైదీగా ఉన్న పౌలు ఈ యువకుణ్ణి మీ దగ్గరకు తీసుకువెళ్ల మన్నాడు. ఇతడు మీకు ఏదో విషయం చెప్పాలంట" అన్నాడు.
\p
\v 19 ఆ సేనాధిపతి ఆ యువకుడి చేయి పట్టుకుని అవతలికి తీసుకుపోయి, "నీవు నాతో చెప్పాలనుకొన్న సంగతి ఏంటి?" అని ఒంటరిగా అడిగాడు.
\s5
\v 20 అప్పుడా యువకుడు, "కొంతమంది యూదులు రేపు పౌలును మహాసభ ఎదుటకు తీసుకురావాలి అనుకుంటున్నారు. వాళ్ళు అతణ్ణి క్షుణ్ణంగా విచారణ చేయాలి అని చెప్తారు. కాని అది నిజం కాదు.
\v 21 వాళ్ళు అడిగినదానిని మీరు అంగీకరించవద్దు. ఎందుకంటే, అక్కడ 40 కంటే ఎక్కువ మంది యూదులు మహాసభకు తీసుకువెళ్ళే దారిలో దాక్కొని అతణ్ణి చంపాలని కనిపెడుతున్నారు. పౌలును చంపేటంత వరకు తాము అన్నపానాలు ముట్టుకోమని వాళ్ళు దేవుని ఎదుట ఒట్టుపెట్టుకున్నారు. వాళ్ళు అలా చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ విన్నపానికి మీరు ఒప్పుకోవద్దు" అని చెప్పాడు.
\s5
\p
\v 22 అప్పుడు ఆ సేనాధిపతి ఆ యువకుడితో, "నువ్వు ఈ సంగతి నాతో చెప్పినట్టు ఎవరికీ తెలియనీయవద్దు" అని హెచ్చరించి పంపేశాడు.
\p
\v 23 సేనాధిపతి తన అధికారులలో ఇద్దరినీ పిలిచి, "రెండు వందల మంది సైనికులను ప్రయాణానికి సిద్ధం చెయ్యండి. వాళ్ళతోబాటు డెబ్భైమంది గుర్రపు రౌతులూ, రెండు వందల మంది ఈటెలు విసిరేవాళ్ళనీ ప్రయాణానికి సిద్ధం చేయండి. మీరంతా రాత్రి తొమ్మిది గంటలకు కైసరయ పట్టణానికి బయలుదేరి పోవాలి.
\v 24 గుర్రాల మీద పౌలును ఎక్కించి భద్రంగా గవర్నర్ ఫేలిక్స్ మందిరానికి అతణ్ణి తీసుకు వెళ్ళండి" అని ఆదేశించాడు.
\s5
\p
\v 25 అతడు ఈ కింది విధంగా గవర్నర్ కి ఉత్తరం కూడా రాశాడు,
\v 26 "గౌరవనీయులైన గవర్నర్ కు, సేనాపతి క్లౌదియ లూసియ శుభాకాంక్షలతో రాస్తున్నది.
\v 27 పౌలు అనే వ్యక్తిని పంపుతున్నాను, ఇతనిని కొంతమంది యూదులు చుట్టుముట్టి చంపబోతున్నారు. ఇతడు రోమా పౌరుడని చెప్పారు. కాబట్టి నేను, మా సైనికులు వెళ్లి అతణ్ణి కాపాడాం.
\s5
\v 28 ఇతడు నేరం చేశాడని యూదులు చెప్తున్నారు. ఇతడు ఏమి నేరం చేశాడో క్షుణ్ణంగా విచారణ చేయాలనుకొని యూదు మహా సభకు ఇతన్ని తీసుకువెళ్ళాను.
\v 29 వాళ్ళు ఇతనికి ప్రశ్నలు వేస్తూ ఉండగా ఇతడు జవాబిస్తూ ఉన్నాడు. వాళ్ళు యూదా ధర్మశాస్త్రం విషయం గురించి అతని మీద ఏవో ఆరోపణలు చేస్తున్నారు తప్ప మరణానికి గానీ, జైలులో పెట్టడానికి గానీ తగిన నేరం ఏమీ ఇతను చేయలేదు. రోమా చట్టాలను ఎప్పుడూ మీరలేదు కూడా. కాబట్టి మా అధికారులు ఇతని నేరాన్ని అమలు చేయడం గానీ జైలులో పెట్టడం గానీ చేయకూడదు.
\v 30 కొంతమంది యూదులు ఇతన్ని చంపాలని కుట్ర చేశారని కొంతమంది ద్వారా తెలిసింది. మీరు ఒక న్యాయమైన విచారణ చేస్తారని మీ దగ్గరకు పంపిస్తున్నాను. ఇతని మీద నేరారోపణ చేసిన యూదులను కూడా కైసరయకు వెళ్లి మీ ముందే అతనిపై ఉన్న ఆరోపణలను చెప్పుకోమని వాళ్ళకి ఆజ్ఞాపించాను."
\s5
\p
\v 31 కాబట్టి సేనాధిపతి ఆజ్ఞాపించినట్టుగానే సైనికులు పౌలును ఆ రాత్రి అంతిపత్రికి తీసుకువెళ్ళారు.
\v 32 మరుసటి రోజు ఆ సైనికులు గుర్రపు రౌతులను పౌలుతో పంపి వెనక్కి తిరిగి యెరూషలేముకు వెళ్ళిపోయారు.
\v 33 వాళ్ళు కైసరయ పట్టణానికి చేరుకొని, గవర్నర్ కి ఉత్తరం చదివి వినిపించి, పౌలును అతని ఎదుట నిలబెట్టారు.
\s5
\v 34 గవర్నర్ ఉత్తరం చదివి పౌలును, "నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడివి?" అని అడిగాడు. పౌలు, "నేను కిలికియ నుండి వచ్చాను" అని జవాబిచ్చాడు.
\v 35 "నీ మీద నేరం మోపినవాళ్ళు కూడా వచ్చిన తరవాత మీ వ్యాజ్యం విని అప్పుడు విచారణ చేస్తాను" అని చెప్పి హేరోదు రాజమందిరంలో అతణ్ణి కావలిలో ఉంచమని ఆజ్ఞాపించాడు.
\s5
\c 24
\p
\v 1 ఐదు రోజుల తరవాత యెరూషలేము నుండి ప్రధాన యాజకుడు అననీయ, కొందరు పెద్దలు, తెర్తుల్లు అనే ఒక న్యాయవాది వచ్చారు. పౌలు మీద వాళ్ళు మోపిన ఫిర్యాదును గవర్నర్ కి తెలియజేశారు.
\v 2 గవర్నర్ పౌలును తీసుకొని రమ్మని సైనికులకు ఆజ్ఞాపించాడు. పౌలు రాగానే, తెర్తుల్లు అతని మీద నేరం మోపుతూ గవర్నర్ తో, "గౌరవనీయులైన ఫేలిక్స్ గారూ, చాలా కాలం నుండి మీరు మమ్మల్ని పరిపాలిస్తున్నారు. మీ పాలనలో మేము ఎంతో నెమ్మది అనుభవిస్తున్నాం. మీ తెలివైన నిర్ణయాల వలన ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది.
\v 3 అందువల్ల మేము అన్ని విధాలా మీ పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాం."
\s5
\p
\v 4 "నేను మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోను. దయచేసి నేను చెప్పే మాటలు విసుక్కోకుండా సహనంతో వినాలని వేడుకుంటున్నాను.
\v 5 ఈ మనిషి ఎక్కడికి వెళ్ళినా, యూదులకు ఇబ్బంది కలిగిస్తున్నాడని మేము గ్రహించాం. ఇతడు ఒక చీడపురుగు లాంటివాడు. ఇతడు నజరేయులనే మతశాఖకు నాయకుడు.
\v 6 ఆఖరికి యెరూషలేము దేవాలయాన్ని కూడా అపవిత్రం చేయాలని ప్రయత్నించాడు. కాబట్టి మేము అతణ్ణి నిర్బంధించాము.
\s5
\v 7 కానీ రోమ్ సేనాధిపతి లూసియ సైనికులతో వచ్చి అతణ్ణి మా దగ్గర నుండి తీసుకెళ్ళాడు.
\v 8 మీరు స్వయంగా అతణ్ణి విచారణ చేస్తే మేము చేసిన ఆరోపణలన్నీ నిజమని మీకే తెలుస్తుంది."
\v 9 యూదు పెద్దలంతా తెర్తుల్లు మాటలకు సమ్మతించి ఆ మాటలు నిజమే అని గవర్నర్ కు చెప్పారు.
\s5
\p
\v 10 అప్పుడు గవర్నర్ పౌలును మాట్లాడమని సైగ చేశాడు. అప్పుడు పౌలు ఇలా అన్నాడు, "గవర్నర్ ఫేలిక్స్, మీరు అనేక సంవత్సరాల నుండి ఈ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నారని తెలుసు. కాబట్టి సంతోషంగా నా పక్షంగా నేను వాదించుకుంటాను. మీరు విని న్యాయంగా తీర్పు తీరుస్తారని నమ్ముతున్నాను."
\p
\v 11 "నేను యెరూషలేములో ఆరాధించడానికి వెళ్లి కేవలం పన్నెండు రోజులు మాత్రమే అయ్యిందని మీరు విచారించి తెలుసుకోవచ్చు.
\v 12 దేవాలయంలోగానీ సమాజ మందిరంలోగానీ పట్టణంలోగానీ నేను తర్కించడం, అల్లరి రేపడం, ఎవ్వరూ చూడలేదు. ఎందుకంటే నేను అలా చెయ్యను.
\v 13 నామీద ఇప్పుడు వాళ్ళు మోపిన నేరాలను ససేమిరా రుజువు చేయలేరు."
\s5
\p
\v 14 "అయితే ఒకటి మాత్రం నిజం. మా పూర్వికులు ఆరాధించిన దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. యేసు మాకు ఏవిధంగా బోధించాడో వాటిని అనుసరిస్తున్న మాట వాస్తవమే. దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో మోషే రాసిన నియమాలన్నిటినీ నేను నమ్ముతాను. అంతే కాక, ప్రవక్తల గ్రంథాల్లో రాసి ఉన్నవన్నీ నేను నమ్ముతాను.
\v 15 మంచివాళ్ళని గానీ చెడ్డవాళ్ళని గానీ చనిపోయిన ప్రతివాళ్ళనీ ఒకానొక రోజున దేవుడు తిరిగి బతికిస్తాడని వీరు నమ్మినట్టుగానే నేనూ నమ్ముతాను.
\v 16 ఆ రోజు వస్తుందని నమ్ముతున్నాను. నేను దేవుని విషయంలో మనుషుల విషయంలో ఎప్పుడూ నా మనసాక్షి యథార్ధంగా ఉండేలా చూసుకుంటున్నాను."
\s5
\p
\v 17 "చాలా సంవత్సరాలు నేను వేరు వేరు ప్రాంతాల్లో ఉండి పేదలైన నా స్వంత యూదు ప్రజలకు కొంత డబ్బు, కానుకలు ఇవ్వడానికి వచ్చాను."
\p
\v 18 "నేను దేవాలయంలో శుద్ధి చేసుకొని ఆరాధించి వస్తుండగా ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు నన్ను చూశారు. నాతోబాటు ఎలాంటి గుంపూ లేదు. నేనేమీ అక్కడ అల్లరి రేపలేదు.
\v 19 ఆ యూదులే ప్రజల్లో అల్లరి రేపారు. నేను నేరం చేశానని వాళ్ళు భావిస్తే వారే మీ దగ్గరకు వచ్చి నేరం మోపి ఉండాల్సింది.
\s5
\v 20 కానీ వాళ్ళు అలా చేయకూడదు అనుకుంటే వాళ్ళ మహాసభలో నేను నిలబడి నా పక్షంగా నా వాదనలు వినిపిస్తున్నప్పుడైనా ఏ నేరం కనిపెట్టారో చెప్పాల్సింది.
\v 21 నేను మహా సభలో నిలబడినప్పుడు "దేవుడు చనిపోయిన వాళ్ళని ఒకానొక రోజున తిరిగి జీవింప జేస్తాడనే మృతుల పునరుత్థానాన్ని నేను నమ్ముతున్నాను అని చెప్పిన మాటను బట్టి నేను మీ ఎదుట విచారణ పాలవుతున్నాను" అని నేను బిగ్గరగా చెప్పిన ఆ ఒక్క మాట విషయం తప్ప నాలో ఏ నేరమైనా వీరు కనిపెట్టి ఉంటే అది చెప్పవచ్చు."
\s5
\p
\v 22 ఫేలిక్స్ కు ప్రజలు ఈ "మార్గం" అని పిలిచే దాని గురించి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళతో, "సేనాపతి లూసియ వచ్చిన తరవాత మీ సంగతి నిర్ణయిస్తాను" అని చెప్పి విచారణ నిలిపివేశాడు.
\v 23 తరవాత పౌలును జైలుకు తీసుకువెళ్ళమనీ నిత్యం జాగ్రత్తగా కావలి కాయమనీ కావలి కాసే అధికారిని ఆదేశించాడు. అయితే అతనికి సంకెళ్ళు వేయకూడదనీ, అతని స్నేహితులు అతణ్ణి పరామర్శించడానికి వస్తే వాళ్ళని అనుమతించి ఏ విధంగా అతనికి సహాయం చేయాలనుకుంటే ఆ విధంగా వాళ్ళని చేయనిమ్మనీ ఆజ్ఞాపించాడు.
\s5
\p
\v 24 కొన్ని రోజుల తరవాత ఫేలిక్స్ తన భార్యతో కూడా వచ్చాడు. ఆమె పేరు దృసిల్ల. ఆమె యూదురాలు. అతడు పౌలుతో మాట్లాడాలని అతణ్ణి పిలిపించాడు. ఫేలిక్స్ పౌలు చెప్పినదంతా విన్నాడు. మెస్సీయ అయిన యేసులో విశ్వాస ముంచడం గురించి పౌలు చెప్పగా అతడు విన్నాడు.
\v 25 దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనుషులు ఏమి చేయాలని ఆయన కోరుతున్నాడో ఆ విషయం గురించి పౌలు అతనితో మాట్లాడాడు. మనుషులు తమ ప్రవర్తనను అదుపులో పెట్టుకొవాలనీ దేవుడు తీర్పు తీర్చే సమయం ఒకటి ఉంటుందనీ అతనికి వివరించాడు. ఫేలిక్స్ ఈ విషయాలు విన్నప్పుడు భయపడి, పౌలుతో, "ఇప్పటికి ఇంతవరకు చాలు, నాకు సమయం ఉన్నప్పుడు మళ్ళీ నిన్ను పిలిపిస్తాను" అని చెప్పాడు.
\s5
\v 26 పౌలు తనకేమైనా లంచం ఇస్తాడని ఆశతో అతణ్ణి మాటిమాటికీ పిలుస్తూ వచ్చాడు. పౌలు ఫేలిక్స్ తో ఎన్నోసార్లు మాట్లాడాడు గానే అతనికి డబ్బులు ఏమీ ఇవ్వలేదు. పౌలును విడిచిపెట్టమని సైనికులకు చెప్పకుండా ఫేలిక్స్ అతణ్ణి అలాగే జైలులో ఉంచేశాడు.
\p
\v 27 రెండు సంవత్సరాల తరవాత ఫేలిక్స్ స్థానంలో పోర్కియు ఫేస్తు గవర్నర్ గా వచ్చాడు. ఫేలిక్స్ యూదు నాయకులను సంతోషపెట్టడానికి పౌలు అలాగే జైలులో ఉంచేశాడు.
\s5
\c 25
\p
\v 1 ఫేస్తు గవర్నర్ గా కైసరయలో తన పరిపాలన ప్రారంభించాడు. మూడు రోజుల తరవాత యెరూషలేము వెళ్ళాడు.
\v 2 అక్కడ ప్రధాన యాజకులు, యూదు నాయకులు ఫేస్తు ఎదుట పౌలు మీద తాము చేసిన ఫిర్యాదు విషయం జ్ఞాపకం చేశారు.
\v 3 దయచేసి పౌలును విచారణ కోసం యెరూషలేముకు అత్యవసరంగా తెప్పించమని అతణ్ణి అడిగారు. అయితే వాళ్ళు మార్గమధ్యంలో పౌలుపై దాడిచేసి చంపాలని పథకం వేశారు.
\s5
\p
\v 4 ఫేస్తు, "పౌలు కైసరయ జైలులో ఉన్నాడు. అక్కడే ఉండనివ్వండి. నేను కూడా త్వరలో అక్కడికి వెళ్ళబోతున్నాను.
\v 5 అయితే, పౌలు మీద ఏదైనా నేరారోపణ చేయాలనుకుంటే మీలో సమర్ధులైన వాళ్ళు నాతో రండి" అన్నాడు.
\s5
\p
\v 6 ఫేస్తు యెరూషలేములో దేవాలయ నాయకులతో ఎనిమిది నుండి పది రోజులవరకు గడిపాడు. తరవాత ఎఫెసు పట్టణానికి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు ఫేస్తు న్యాయపీఠం మీద కూర్చొని పౌలును తన ఎదుటకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు.
\v 7 పౌలు న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు, యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ గుమిగూడి ఎన్నో తీవ్రమైన నేరాలు మోపారు గానీ వాటిని వాళ్ళు రుజువు చేయలేకపోయారు.
\v 8 అప్పుడు పౌలు తన వాదన వినిపిస్తూ, "నేను యూదుల ధర్మశాస్త్రానికి గానీ, దేవాలయానికి గానీ, కైసరుకు గానీ విరుద్ధంగా ఏపనీ చేయలేదని మీకు బాగా తెలుసు" అన్నాడు.
\s5
\p
\v 9 అయితే ఫేస్తు యూదు నాయకుల చేత మంచివాడనిపించుకోవాలని పౌలును, "నీవు యెరూషలేముకు వచ్చి అక్కడ నా న్యాయపీఠం ఎదుట విచారణకు నిలవడం నీకిష్టమేనా?" అని అడిగాడు.
\p
\v 10 పౌలు, "లేదు, నేను ఇప్పుడు నిలబడి ఉన్నది కైసరుకు ప్రతినిధిగా ఉన్న గవర్నర్ ఎదుట. నేనిక్కడే న్యాయం తీర్చబడాలి. ఇదే సరైన స్థలం. నేను యూదు ప్రజలకు వ్యతిరేకంగా ఏవిధమైన నేరం చేయలేదని మీకు బాగా తెలుసు.
\s5
\p
\v 11 "ఒకవేళ నేను మరణశిక్షకు తగిన నేరం చేసి ఉంటే మరణానికి నేనేమీ భయపడను; అయితే వీరు నామీద అరోపించేవి ఏవీ అలాంటి శిక్షకు తగినవి కావు. వాళ్ళని తృప్తిపరచడానికి ఎవరూ నాకు శిక్ష విధించలేరు, నన్ను ఎవరికీ అప్పగించడానికి వీలు లేదు. నేను కైసరు ముందే చెప్పుకుంటాను" అన్నాడు.
\p
\v 12 అప్పుడు ఫేస్తు తన సలహాదారులతో ఆలోచించి, "నీవు కైసరు ఎదుట చెప్పుకుంటానని అన్నావు కదా, కైసరు దగ్గరకే పంపిస్తాను!" అన్నాడు.
\s5
\p
\v 13 కొన్ని రోజుల తరవాత, రాజైన హేరోదు అగ్రిప్ప, అతని సోదరి బెర్నీకేతో కలిసి కైసరయకు వచ్చాడు. ఫేస్తును గౌరవపూర్వకంగా కలవడానికి వాళ్ళు వచ్చారు.
\v 14 వారిద్దరూ అక్కడ చాలా రోజులు ఉన్నారు. కొన్ని రోజుల తరవాత ఫేస్తు పౌలు గురించి అగ్రిప్పకు చెప్పాడు. అతడు, "ఫేలిక్స్ జైలులో పెట్టిన ఒకతను ఇక్కడ ఉన్నాడు.
\v 15 నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు ప్రధాన యాజకులు, యూదు నాయకులు నా దగ్గరకి వచ్చి అతనికి మరణశిక్ష విధించమని నన్ను అడిగారు.
\v 16 అయితే నేను వాళ్ళతో, "ఎవరైనా తీవ్రమైన ఆరోపణలు అతని మీద చేస్తేనే గానీ రోమ్ సంప్రదాయంలో ఒక వ్యక్తికి అప్పటికప్పుడు మరణశిక్ష విధించలేము. దానికి బదులు ఒకటి చేయవచ్చు. ఫిర్యాదు చేసిన వాళ్ళతో, అతడు ముఖాముఖిగా వాదించుకునే ఏర్పాటు చేయవచ్చు" అని అన్నాను."
\s5
\p
\v 17 "కాబట్టి ఆ యూదులు కైసరయకు వచ్చారు, నేను విచారణను తాత్సారం చేయలేదు. వాళ్ళు రాగానే నేను న్యాయపీఠం ఎదుట కూర్చొని ఖైదీని తెమ్మని చెప్పాను.
\v 18 అయితే యూదు నాయకులు అతని మీద చేసిన ఆరోపణలు నాతో చెప్పినప్పుడు, అవి అంత తీవ్రమైనవిగా లేవు.
\v 19 అంతే కాదు, వాళ్ళు చేసే ఆరోపణలన్నీ వాళ్ళ మతానికి చెందినవి. వాళ్ళు ఎవరో యేసు అనే వ్యక్తి చనిపోయాడు అంటుంటే ఈ పౌలు అనే వ్యక్తి ఆయన తిరిగి లేచాడు అంటున్నాడు.
\v 20 నాకీ విషయాలు ఏమీ అర్థం కాలేదు. నిజాన్ని ఎలా రాబట్టాలో తెలియలేదు. కాబట్టి నేను పౌలుతో, "నీవు యెరూషలేము వెళతావా? నేను అక్కడ న్యాయ విచారణ చేయవచ్చా" అని అడిగాను.
\s5
\v 21 అయితే, పౌలు మాత్రం కైసరు మాత్రమే న్యాయ విచారణ చేయాలని అన్నాడు. కాబట్టి నేను కైసరు దగ్గరికి పంపే వరకు గట్టి కాపలాలో అతణ్ణి ఉంచాను" అని చెప్పాడు.
\v 22 అప్పుడు అగ్రిప్ప ఫేస్తుతో, "అతడు చెప్తున్నదేమిటో నాక్కూడా వినాలని ఉంది" అన్నాడు. అప్పుడు ఫేస్తు, "రేపు వినవచ్చు" అన్నాడు.
\s5
\p
\v 23 మరుసటి రోజు అగ్రిప్ప, బెర్నీకే ఎంతో ఆడంబరంగా అధికార మందిరంలోకి ప్రవేశించి అక్కడి పుర ప్రముఖులందరి గౌరవాన్ని అందుకున్నారు. కైసరయ లోని కొంతమంది రోమా సేనాపతులు, ప్రముఖులు కూడా వాళ్ళతో వచ్చారు. అప్పుడు ఫేస్తు పౌలును తీసుకు రమ్మని సైనికులకు ఆజ్ఞాపించాడు.
\v 24 పౌలు వచ్చిన తరవాత ఫేస్తు, "రాజైన అగ్రిప్పా, ఇక్కడ ఉన్న ప్రముఖులారా, మీరు ఈ మనిషిని చూశారు. యెరూషలేము, ఎఫెసులో ఉన్న యూదు నాయకులందరూ ఇతడు ఇంకా బతకకూడదని ఆరోపిస్తున్నారు."
\s5
\p
\v 25 "అయితే ఇతనిలో మరణానికి తగిన కారణం ఏమీ నాకు కనిపించలేదు. అయినా సరే, ఇతడు కైసరు ఎదుట తన వాదన చెప్పుకుంటానని అడిగాడు కాబట్టి ఇతన్ని రోమ్ కు పంపాలని నిర్ణయించాను.
\v 26 అందుకే ఇతన్ని ఇక్కడికి తెప్పించాను. ఇతడు మీతో, మరి ముఖ్యంగా అగ్రిప్ప రాజుతో మాట్లాడతాడు! మీరేమైనా ప్రశ్నలు ఉంటే ఇతన్ని అడగవచ్చు. ఈ విచారణ తరవాత నాకు కైసరుకు ఏమని రాసి పంపాలో తెలుస్తుంది.
\v 27 ఖైదీ మీద మోపిన నేరాలను కచ్చితంగా వివరించకుండా కైసరు దగ్గరికి పంపడం సమంజసం కాదని నా ఉద్దేశం" అని వాళ్ళతో చెప్పాడు.
\s5
\c 26
\p
\v 1 అప్పుడు అగ్రిప్ప పౌలుతో, "ఇక నువ్వు నీ పక్షంగా ఏమైనా చెప్పుకోవచ్చు" అన్నాడు. అప్పుడు పౌలు తాను మాట్లాడబోతున్నట్టుగా తన చేతులు పైకి చాచి, ఇలా అన్నాడు,
\v 2 "అగ్రిప్ప రాజా, నేను దుష్ట కార్యాలు చేశానని చెప్పే ఈ యూదు నాయకుల ఆరోపణలు ఎందుకు సరైనవి కావో మీ ఎదుట వివరించగలిగే అవకాశాన్ని నాకొక ఆధిక్యతగా ఎంచుకొంటున్నాను.
\v 3 మరి ముఖ్యంగా మీకు మన యూదా సంప్రదాయాలు, మనం వాదిస్తున్న విషయాల గురించి బాగా తెలుసు కాబట్టి నేను మరీ సంతోషిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఓపికతో వినాల్సిందిగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను."
\s5
\p
\v 4 "నేను నా చిన్నతనం నుండి నా జీవితాన్ని ఎలా గడిపానో నా సాటి యూదులకు బాగా తెలుసు. నేను పుట్టిన ఊరిలోనూ, ఆ తరవాత యెరూషలేములోనూ నేను ఎలా జీవించానో వాళ్ళకి తెలుసు.
\v 5 నా ప్రారంభం నుండీ నేను వాళ్ళకి తెలుసు. వాళ్ళు కోరుకుంటే నా చిన్నతనం నుండీ నేను మన మత సంప్రదాయాలను ఎంత నిష్టగా పాటించానో వాళ్ళు చెప్పగలరు. ఇతర అందరు పరిసయ్యుల లాగానే నేను కూడా జీవించాను."
\s5
\p
\v 6 "మన పితరులకు దేవుడు దేనినైతే వాగ్దానం చేశాడో దానిని ఆయన నెరవేరుస్తాడని నమ్మకంగా ఎదురు చూడడం బట్టి నేను ఈ రోజు ఈ విచారణను ఎదుర్కొంటున్నాను.
\v 7 తాను వాగ్దానం చేసిన దానిని దేవుడు నెరవేరుస్తాడని దివారాత్రులు ఆయన్ని పూజిస్తూ, గౌరవించే మన పన్నెండు గోత్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఘనమైన రాజా, దేవుడు వాగ్దానం చేసిన దానిని ఆయన నెరవేరుస్తాడని నేను దృఢంగా నమ్ముతున్నాను. వాళ్ళు కూడా నమ్ముతున్నారు. అయితే నేను దేవుడు చేయబోతున్నాడని నమ్ముతున్నదానిని బట్టి వాళ్ళు నన్ను తప్పు పడుతున్నారు.
\v 8 దేవుడు మృతులను జీవింప జేయలేడని మీలో ఎవరైనా ఎందుకు భావిస్తారు?"
\s5
\p
\v 9 "నజరేతు గ్రామానికి చెందిన యేసును విశ్వసించకుండా ప్రజలను అడ్డుకోడానికి నేను చేయగలిగినంత మట్టుకు చేయాలని గతంలో నేను చూసిన మాట వాస్తవమే."
\p
\v 10 "నేను యెరూషలేములో ఉన్నప్పుడు చేసిన పని అదే. అక్కడి ప్రధాన యాజకులు నాకు ఇచ్చిన అధికారంతో విశ్వాసుల్లో అనేకమందిని నేను చెరసాలల్లో బంధించాను. వాళ్ళ మనుషులు విశ్వాసుల్ని చంపినప్పుడు వాళ్ళ పక్షంగా నిలబడ్డాను."
\p
\v 11 "ప్రతి సమాజమందిరం లోనూ నేను ఎదుర్కొన్న ఆ యూదుల్ని నేను శిక్షించాను. నా కోపాన్నంతా వాళ్ళపైన చూపించి వాళ్ళు దేవుణ్ణి అవమానించి, ఆయన పేరును దూషించేలా వాళ్ళపై వత్తిడి తెచ్చాను. పైగా వాళ్ళని వెదుకుతూ నేను దూర ప్రాంతపు నగరాలకు కూడా వెళ్లి వాళ్ళని అడ్డుకోడానికి నేను చేయగలిగినదంతా చేశాను."
\s5
\p
\v 12 "దమస్కులో ఉన్న విశ్వాసుల్ని బంధించి తేవడానికి ప్రధాన యాజకులు నాకు అధికారం ఇచ్చారు. నేను అక్కడికి వెళ్లాను. అయితే నేను వెళుతూ ఉండగా,
\v 13 రాజా, సుమారు మధ్యాహ్నం వేళ ఆ మార్గంలో ఆకాశంలో ఒక ప్రకాశించే వెలుగును చూశాను. అది సూర్యునికంటే ప్రకాశవంతంగా ఉంది. అది నా చుట్టూ, నాతోబాటు ప్రయాణిస్తున్న వాళ్ళ చుట్టూ ఆవరించింది.
\v 14 మేమంతా నేలమీద పడిపోయాం. అప్పుడు ఒకరు నాతో హెబ్రీ భాషలో మాట్లాడడం నేను విన్నాను. ఆయన నాతో, "సౌలూ, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? మునుకోలలకు ఎదురు తన్నడం నీకు అసాధ్యం" అన్నాడు."
\s5
\p
\v 15 "నేను ఆయన్ని "నువ్వు ఎవరివి ప్రభూ" అని అడిగాను. అప్పుడు ప్రభువు "నేను యేసుని! నువ్వు ఎవరితో పోరాడుతున్నావో అది నేనే.
\v 16 ఇక లేచి నీ కాళ్ళ మీద నిలబడు. నిన్ను ఒక సేవకునిగా, ఇప్పుడు నువ్వు చూసిన దానికీ, ఇంకా ముందు నేను చూపించబోయే దానికీ సాక్షిగా చేయడానికి నేను నీకు ప్రత్యక్షమయ్యాను.
\v 17 నేను నిన్ను ప్రజలనుండీ నేను నిన్ను పంపబోయే యూదేతరుల నుండీ నిన్ను కాపాడతాను.
\v 18 తద్వారా వాళ్ళ కన్నులు తెరిచేలా, వాళ్ళని చీకటి నుండి వెలుగులోకి, దేవుని శత్రువు ప్రభావం నుండీ తప్పిస్తాను. ఆ విధంగా దేవుడు వాళ్ళ పాపాలను క్షమించి, నా ప్రజలకు చెందిన శాశ్వతమైన వాటన్నిటినీ పొందగలిగేలా, విశ్వాసం ద్వారా నాకు చెందిన ప్రజలుగా చేస్తాను" అన్నాడు."
\s5
\p
\v 19 "కాబట్టి అగ్రిప్ప రాజా, దేవుడు నాకు ఆ దర్శనం ద్వారా దేనిని చేయమని చెప్పాడో అదే చేశాను.
\v 20 మొదట నేను దమస్కులో, యెరూషలేములో, యూదయ ప్రాంతమంతటిలో ఉన్న యూదులతో, యూదేతరులతో మాట్లాడాను. వారంతా పాపం చేయడం మాని, దేవుని సహాయం కోరాలని వాళ్ళని హెచ్చరించాను. అంతేగాక వాళ్ళు పాపం చేయడం మానుకున్నామని సూచించే పనులు జరిగించాలి అని కూడా వాళ్ళకి బోధించాను."
\p
\v 21 "నేను ఈ విషయాలు బోధించడం వలన కొందరు యూదులు నేను దేవాలయం ఆవరణలో ఉన్నప్పుడు నన్ను పట్టుకుని చంపాలని చూశారు.
\s5
\v 22 ఏదేమైనా, దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఈ రోజు వరకూ ఈ సంగతులను ప్రకటిస్తూ ఉన్నాను. ఏమి జరగబోతుంది అని ప్రవక్తలు, మోషే చెప్పిన మాటలనే నేను సాధారణ ప్రజలకు, గొప్పవాళ్ళకీ ప్రకటించడం మానలేదు.
\v 23 మెస్సీయ బాధలు అనుభవించి మరణిస్తాడనీ, మృతులలోనుండి మొదటిగా తిరిగి లేస్తాడనీ వాళ్ళు ప్రకటించారు. దేవుడు వాళ్ళని నిజంగా రక్షిస్తాడని ఆయన తన స్వంత ప్రజలకూ, యూదేతరులకూ ప్రకటిస్తాడని కూడా వాళ్ళు చెప్పారు."
\s5
\p
\v 24 పౌలు ఇంకా ముందుకు మాట్లాడబోతుండగా ఫేస్తు "పౌలూ, నీకు పిచ్చి పట్టింది! నువ్వు మరీ ఎక్కువగా చదువుకున్నావు, అది నీ మతి చెడగొట్టింది" అని అరిచాడు.
\v 25 కానీ, దానికి జవాబుగా పౌలు, "ఘనమైన ఫేస్తుగారూ, నాకేం మతి చలించలేదు! దానికి వ్యతిరేకంగా, నేను చెప్పేదంతా సత్యమైనదీ, తెలివితో కూడినదీ!
\v 26 అగ్రిప్ప రాజుకు నేను మాట్లాడే ఈ విషయాలన్నీ బాగా తెలుసు. నేను వాటి గురించి ఆయనతో స్వేచ్చగా మాట్లాడగలను. ఈ సంగతుల్లో కొన్ని వాళ్ళ దృష్టికి రాకపోయి ఉండవచ్చు, ఎందుకంటే అవి రహస్యంగా జరిగాయి" అన్నాడు.
\s5
\p
\v 27 "అగ్రిప్ప రాజా, ప్రవక్తలు రాసిన విషయాలు మీరు నమ్ముతున్నారా? అవును, ఆ విషయాలు మీరు నమ్ముతున్నారని నాకు తెలుసు" అన్నాడు.
\v 28 అప్పుడు అగ్రిప్ప పౌలుతో "ఇంత తేలికగా నన్ను క్రైస్తవుడుగా చేయాలని చూస్తున్నావే!" అన్నాడు.
\v 29 దానికి పౌలు జవాబిస్తూ, "అది సులభమా తేలికా అది ముఖ్యం కాదు. మీరు, నేను చెప్పిన మాటలు వింటున్న వీరంతా ఈ సంకెళ్ళు తప్ప నాలాగా ఉండాలని నేను దేవునికి ప్రార్థిస్తున్నాను!" అన్నాడు.
\s5
\p
\v 30 రాజు లేచి నిలబడ్డాడు. గవర్నర్, బెర్నీకే, ఇంకా మిగిలినవాళ్ళు కూడా లేచి
\v 31 బయటికి వెళ్లిపోయారు. బయటికి వెళ్ళిన తరవాత, "ఇతడు మరణానికి గానీ, బంధకాలకు గానీ తగిన నేరం ఏమీ చేయలేదు" అని తమలో తాము చెప్పుకున్నారు.
\v 32 అగ్రిప్ప ఫేస్తుతో, "ఇతడు కైసరుకు దరఖాస్తు చేసుకొని ఉండకపోతే ఇతడిని విడుదల చెయ్యొచ్చు" అన్నాడు.
\s5
\c 27
\p
\v 1 మేము ఓడలో ఇటలీకి వెళ్లాలని గవర్నర్ నిర్ణయించి పౌలునీ, ఇంకా కొంతమంది ఖైదీలనీ జూలియస్ అనే ఒక సైనికాధికారి పర్యవేక్షణకు అప్పగించాడు. అతడు శతాధిపతి. చక్రవర్తి నేరుగా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అతని అధికారం కింద ఇంకా అనేకమంది సైనికులు ఉన్నారు.
\v 2 ఆసియాలోని అద్రముత్తియ అనే రేవులో మేము ఓడ ఎక్కాం. ఆ ఓడ ఆసియా తీరం వెంబడి ఉన్న చాలా పట్టణాలను తాకుతూ ప్రయాణిస్తుంది. ఆ మార్గంలోనే మేము ఆసియాకు వెళ్లాం. మాసిదోనియలోని తెస్సలోనిక నుండి అరిస్తార్కు మాతో వచ్చాడు.
\s5
\p
\v 3 తరవాతి రోజు మేము సీదోను చేరుకున్నాం. జూలియస్ పౌలు పట్ల దయతో వ్యవహరించాడు. అతడు బయటికి వెళ్లి తన స్నేహితుల్నీ, తన విషయం శ్రద్ధ కలిగిన వాళ్ళనీ కలుసుకోడానికి అనుమతి ఇచ్చాడు.
\v 4 ఆ తరవాత అక్కడినుండి మళ్ళీ బయలుదేరాం. ఎదురుగాలి కొట్టడం చేత సైప్రస్ దీవి చాటుగా ఓడ నడిపించాము.
\v 5 తరవాత మేము కిలికియ, పంఫులియ తీరం దగ్గరగా సముద్రం దాటి అవతలికి చేరుకున్నాం. ఓడ లూసియ లో ఉన్న మైరా పట్టణానికి చేరింది. మేము అక్కడ ఓడ దిగిపోయాం.
\v 6 మైరాలో జూలియస్ అలెగ్జాండ్రియ నుండి వచ్చిన ఒక ఓడ ఉండడం చూశాడు. అది ఇటలీకి తిరిగి వెళ్తుంది. కాబట్టి అతడు మేము ఆ ఓడ ఎక్కి వెళ్ళే ఏర్పాట్లు చేయడంతో మేము దానిలో ఎక్కి ప్రయాణం కొనసాగించాం.
\s5
\p
\v 7 గాలి మాకు ఎదురుగా వీస్తూ ఉండడం వలన మేము చాలా నెమ్మదిగా ప్రయాణిస్తూ చాల కష్టంగా క్నీదుకు దగ్గరగా వచ్చాం. ఆ తరవాత గాలి మరీ బలంగా వీస్తుండడంతో ఓడ పడమరకు నేరుగా సాగనివ్వలేదు. దానితో మేము గాలి అంత ధాటిగా లేని క్రేతు ద్వీపం తీరాన్ని ఆనుకొని నెమ్మదిగా ప్రయాణం సాగించి నీటిలో ముందుకు చొచ్చుకువచ్చినట్టు ఉన్న సల్మోనే పక్కగా సాగాము.
\v 8 గాలి ఇంకా బలంగా వీస్తుండడం వలన వేగంగా కదలడానికి వీలు లేకపోయింది. కాబట్టి మేము క్రేతు తీరం వెంబడి నెమ్మదిగా ప్రయాణించి లాసియ దగ్గర ఉన్న మంచి రేవులు అనే పట్టణానికి చేరుకున్నాం.
\s5
\p
\v 9 అప్పటికే సమయం మించిపోయింది. యూదుల ఉపవాస కాలం తరవాత సముద్రం మరీ అల్లకల్లోలంగా మారుతుంది. మేము ప్రయాణం కొనసాగించడం ప్రమాదకరంగా మారింది. అప్పుడు పౌలు ఆ ఓడలోని వాళ్ళకు ఇలా చెప్పాడు.
\p
\v 10 "మనం గనక ఇప్పుడు ప్రయాణం కొనసాగిస్తే అది చాలా ప్రమాదకరం. ఓడలోని సరుకు నష్టపోవడమే కాకుండా మన ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది."
\p
\v 11 కానీ రోమా అధికారి పౌలు మాటలు నమ్మలేదు. ఆ ఓడ నావికుడు, యజమాని చెప్పిన మాటలపై నమ్మకముంచి వారేమి చెప్పారో దాని ప్రకారం ముందుకు వెళ్ళడానికి నిర్ణయించాడు.
\s5
\p
\v 12 చలికాలంలో ఆ రేవులో ఉండడం అంత మంచిది కాదు. కాబట్టి ఎక్కువమంది నావికులు సముద్రంలోకి వెళ్ళడానికే మొగ్గు చూపారు. వాళ్ళు ఫేనీకే చేరుకొని అక్కడ చలికాలం గడపవచ్చని ఆశించారు. ఫేనీకే క్రేతు ద్వీపంలో ఒక పట్టణం. నైరుతి, వాయువ్య దిక్కులనుండి గాలులు ఆ పట్టణం మీదుగా వీస్తాయి.
\p
\v 13 దక్షిణం నుండి మెల్లని గాలులు వీస్తుండడం చేత ఆ ఓడ సిబ్బంది తాము కోరుకున్న విధంగా ప్రయాణం కొనసాగించవచ్చని ఆశించారు. కాబట్టి వాళ్ళు లంగరు ఎత్తి క్రేతు తీరం పక్కగా ఓడ నడిపించారు.
\s5
\p
\v 14 కొద్ది సమయం గడిచిన తరవాత ఒడ్డువైపు నుండి తీవ్రమైన గాలులు వీయడం ప్రారంభించాయి. ఆ గాలులు ఉత్తర దిక్కునుండి ఆ ద్వీపం మీదుగా వచ్చి ఆ ఓడను డీకొన్నాయి. ఆ గాలుల్ని ఊరకులోను అని పిలుస్తారు, అంటే, "ఉత్తరపు గాలి" అని అర్థం.
\p
\v 15 అది ఓడ ముందు భాగానికి బలంగా తగలడం వలన మేము ముందుకు సాగలేకపోయాం. కాబట్టి ఓడ నావికులు గాలి ఎటు వీస్తుందో ఆ వైపుకు ఓడను వెళ్ళిపోనిచ్చారు.
\p
\v 16 కౌద అనే చిన్న ద్వీపం తీరం పక్కగా ఓడ ప్రయాణించింది. మేము అతి కష్టంతో మా పడవను ఓడనుండి విడిపోకుండా కాపాడుకోగలిగాం.
\s5
\p
\v 17 వాళ్ళు పడవను పైకెత్తి కట్టిన తరవాత దాని తాళ్ళను ఓడను బలంగా నిలిపి ఉండడం కోసం దాని చుట్టూ బిగించి కట్టారు. ఆ విధంగా వెళితే సూర్తిస్ అనే ఇసకతిప్పలో చిక్కుకొని పోతామేమో అని భయపడి ఓడ లంగరు కిందికి దింపి గాలి విసరుతున్న వైపుగా ఓడను కొట్టుకుపోనిచ్చారు. గాలి, అలలు ఓడను అటూ ఇటూ కొట్టుమిట్టాడేలా చేశాయి. అందువలన తరవాతి రోజు ఆ నావికులు ఓడలోని సరుకును సముద్రంలో పారెయ్యసాగారు.
\p
\v 18 పెనుగాలులు, అలలు ఓడను ఇంకా అటూ ఇటూ ఊపేస్తున్నాయి. కాబట్టి తరవాతి రోజు నావికులు ఆ ఓడలోని సామానంతటినీ సముద్రంలోకి పడెయ్యడం మొదలుపెట్టారు.
\s5
\p
\v 19 ఆ తుపాను మూడవ రోజున నావికులు ఆ ఓడపై ఉన్న త్రాళ్ళు, దుంగలు మొదలైన వస్తువులన్నిటినీ పారవేసి ఓడను తేలిక చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళు తమ చేతులారా వాటిని పారవేయాల్సి వచ్చింది.
\v 20 ఆ విధంగా చాలా రోజుల పాటు గాలి వీస్తూనే ఉంది. పగలనక రాత్రనక ఆకాశం దట్టమైన మేఘాలతో చీకటిగా ఉండడం వలన మాకు సూర్యుడు గానీ, నక్షత్రాలు గానీ కనిపించలేదు. మేము బతికి బట్ట కడతామన్న ఆశ మాలో లేకుండా పోయింది.
\s5
\p
\v 21 చాలా రోజుల పాటు ఓడలో ఉన్న మాలో ఎవరూ భోజనం చేయలేదు. చివరికి ఒక రోజు పౌలు లేచి మా అందరి ఎదుట నిలబడి, "స్నేహితులారా, మనం క్రేతు నుండి బయలుదేరడం మంచిది కాదు అని నేను చెప్పిన మాట మీరు విని ఉండాల్సింది. అలా చేసి ఉంటే మనకీ నష్టం, కష్టం కలిగి ఉండేవి కాదు.
\v 22 అయితే, ఇప్పుడు నేను చెప్పేదేమిటంటే, భయపడవద్దు, ఎందుకంటే మనలో ఎవ్వరం చనిపోము. ఈ తుపాను ఈ ఓడను ధ్వంసం చేస్తుందేమోగాని మనల్ని కాదు.
\s5
\v 23 నాకిది బాగా తెలుసు. ఎందుకంటే గత రాత్రి నేను ఎవరికి చెందిన వాడినో, ఎవరిని నేను పూజిస్తున్నానో ఆ దేవుడు నా దగ్గరకి తన దూతను పంపించాడు.
\v 24 ఆ దేవదూత నాతో, "పౌలా, భయపడకు. నువ్వు రోమ్ నగరానికి వెళ్లి చక్రవర్తి ఎదుట న్యాయవిచారణ లో నిలబడాలి. ఈ ఓడలో నీతోబాటు ప్రయాణిస్తున్న వారంతా తమ ప్రాణాలు దక్కించుకునేలా దేవుడు అనుగ్రహించాడు అని నీవు తెలుసుకోవాలి" అన్నాడు.
\v 25 కాబట్టి నా స్నేహితులారా, ధైర్యం తెచ్చుకోండి. ఆ దూత చెప్పిన విధంగా దేవుడు దీన్ని తప్పకుండా జరిగిస్తాడని నేను నమ్ముతున్నాను.
\v 26 అయితే ఈ ఓడ మాత్రం ఏదో ఒక ద్వీపానికి కొట్టుకొని ముక్కలైపోతుంది, మనం ఆ ఒడ్డుకు చేరుకుంటాం."
\s5
\p
\v 27 తుపాను ప్రారంభమైన పద్నాలుగో రోజుకి ఓడ ఇంకా అద్రియ సముద్రంలో కొట్టుకుపోతూనే ఉంది. అర్థరాత్రి సమయానికి ఆ ఓడ ఏదో ఒడ్డుకు సమీపంగా ఉన్నదని నావికులు గ్రహించారు.
\v 28 అప్పుడు వాళ్ళు ఒక తాడును నీటిలోకి వదిలి అక్కడ ఎంత లోతు ఉన్నదో కొలవడానికి చూశారు. వాళ్ళు దానిని పైకి లాగి చూసినప్పుడు అక్కడ 40 మీటర్లు లోతు ఉందని తెలిసింది. కొంత సమయం తరవాత వాళ్ళు మళ్ళీ చూసినప్పుడు అక్కడ 30 మీటర్లు లోతు ఉంది.
\v 29 ఓడ ఏదైనా శిలకు గుద్దుకుంటుందేమో అని వాళ్ళు భయపడ్డారు. కాబట్టి వాళ్ళు ఓడకున్న నాలుగు లంగరులను నీటిలోకి దింపారు. చేసేదేమీ లేక త్వరగా తెల్లవారితే ఓడ ఎక్కడికి వెళ్తున్నదో చూడవచ్చని వారంతా దేవుడిపై భారం వేసి ఉండిపోయారు.
\s5
\p
\v 30 వాళ్ళలో కొంతమంది నావికులు ఆ ఓడనుండి దూకి తప్పించుకు పోవాలని ఆలోచించారు. కాబట్టి వాళ్ళు సముద్రంలోకి పడవను దించారు. వాళ్ళు చేస్తున్న పని ఎవరూ తెలుసుకోకుండా ఉండేలా వాళ్ళు ఓడ ముందు భాగం నుండి లంగరులు దింపుతున్నట్టు నటించారు.
\v 31 అయితే పౌలు ఆ అధిపతితో, మిగిలిన సైనికులతో, "నావికులు ఓడలో నుండి తప్పించుకుంటే ఇక మనం ప్రాణాలతో ఉండడం అసాధ్యం" అని చెప్పాడు.
\v 32 ఆ వెంటనే సైనికులు ఆ పడవ తాళ్ళను కోసేసి అది నీళ్ళలో పడిపోయేలా చేశారు.
\s5
\p
\v 33 తెల్లవారుతూ ఉన్న సమయంలో పౌలు అందరూ ఎదో కొంత తినమని ఆ ఓడలోని వారందరినీ బతిమిలాడాడు. అతడు వాళ్ళతో, "గత పద్నాలుగు రోజులుగా మీరు పస్తులున్నారు.
\v 34 ఇప్పుడైనా లేచి కొంచెం ఆహారం తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నాను. మీరు ప్రాణాలు నిలుపుకోవాలంటే ఇది తప్పనిసరి. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలాడు అని నేను హామీ ఇస్తున్నాను" అన్నాడు.
\v 35 పౌలు ఆ మాటలు పలికిన తరవాత అందరూ చూస్తుండగా అతడు ఒక రొట్టె ముక్క తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. తరవాత దానిని విరిచి తినడం మొదలుపెట్టాడు.
\s5
\p
\v 36 దానితో వారంతా హుషారు తెచ్చుకుని కొంచెం ఆహారం తీసుకున్నారు.
\v 37 ఆ ఓడలో మొత్తం 276 మందిమి ఉన్నాం.
\v 38 ప్రతి ఒక్కరూ చాలినంత తిన్న తరవాత మిగిలిన గోదుమలన్నీ సముద్రంలో పారేసి ఓడను తేలిక చేశారు.
\s5
\p
\v 39 తెల్లారిన తరవాత మాకు భూభాగం కనిపించింది. అయితే అది ఏ దేశమో నావికులకి తెలియలేదు. అయితే అక్కడ ఒక సముద్రపు పాయ, నీటి అంచున విశాలమైన ఇసక మైదానం కనిపించింది. ఓడను ఆ తీరం మీదికి నడిపించడానికి చూశారు.
\v 40 కాబట్టి వాళ్ళు లంగరుల తాళ్ళు కోసి వాటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. అదే సమయంలో వాళ్ళు చుక్కానుల కట్లు విప్పి ఓడ ముందు భాగంలోని తెరచాపను పైకెత్తారు. అలా ఓడని ఒడ్డుకు నడిపించే ప్రయత్నం చేశారు.
\v 41 కానీ ఓడ అల్లకల్లోలంగా ఉన్న ఆ నీటిలోకి ప్రవేశించి ఆ అలల కింద ఉన్న ఇసక దిబ్బలపైకి కొట్టుకుపోయింది. ఓడ ముందుభాగం ఆ ఇసుకలో కూరుకుపోయి ముందుకు కదలలేదు. పెద్ద పెద్ద అలలు ఓడ వెనుక భాగంపై గట్టిగా తగలడంతో ఆ ఓడ పగిలిపోసాగింది.
\s5
\p
\v 42 ఖైదీలు సముద్రంలోకి దూకి ఒడ్డుకు ఈది తప్పించుకుంటారేమో అని అనుమానించిన సైనికులు వారందరినీ చంపాలని ఆలోచించారు.
\v 43 అయితే సైనికాధికారి పౌలును కాపాడాలని నిర్ణయించుకుని ఆ విధంగా చేయకుండా సైనికుల్ని వారించాడు.
\v 44 ఈత వచ్చిన వారంతా సముద్రంలోకి దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవాలనీ, మిగిలిన వాళ్ళు ఆ ఓడలో ఉన్న చెక్కలు, ఇతర వస్తువులు పట్టుకుని వాటి సహాయంతో ఒడ్డుకు చేరుకోవాలనీ ఆదేశించాడు. మేమంతా అతడు చెప్పినట్టు చేశాం. ఆ విధంగా ప్రతి ఒక్కరం ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నాం.
\s5
\c 28
\p
\v 1 మేము క్షేమంగా ఒడ్డుకు చేరుకున్న తరవాత అది మెలితే ద్వీపం అని మాకు తెలిసింది.
\v 2 ఆ ద్వీపం లోని అనాగరికులైన ప్రజలు మాకు చేసిన సపర్యలు అంత ఇంతా కాదు. అప్పుడు వర్షం కురుస్తూ చలిగా ఉండడం వలన వాళ్ళు చలిమంట వేసి మా అందరినీ చలికాసుకొమ్మని పిలిచారు.
\s5
\p
\v 3 అప్పుడు పౌలు కొన్ని పుల్లలు ఏరి నిప్పుల మీద వేస్తుండగా ఆ వేడికి ఒక పాము బయటికి వచ్చి పౌలు చేయి పట్టుకుంది.
\v 4 ఆ ప్రజలు ఆ పాము అతని చేతికి వేలాడడం చూసి, "ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రంలో మునిగిపోతూ తప్పించుకున్నప్పటికీ న్యాయం మాత్రం అతణ్ణి బ్రతకనీయదు" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\s5
\p
\v 5 కానీ పౌలు మామూలుగా ఆ పామును మంటల్లోకి విసిరేశాడు. అతనికి ఏ హానీ జరగలేదు.
\v 6 అయితే ప్రజలు ఇంకా అతనికి జ్వరం వచ్చి శరీరం అంతా వాచిపోతుందనీ లేకపోతే అకస్మాతుగా పడిపోయి చనిపోతాడనీ కనిపెడుతున్నారు. వాళ్ళు చాలా సేపు కనిపెట్టిన తరవాత కూడా అతనికి ఏమీ జరగలేదు. అప్పుడు వాళ్ళు తమ అభిప్రాయం మార్చుకొని, "ఇతడు హంతకుడు కాదు, ఒక దేవుడు!" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\s5
\p
\v 7 పొబ్లియస్ అనే అతడు ఆ ద్వీపంలో ముఖ్యమైన అధికారి. అక్కడికి దగ్గరలోనే అతనికి పొలాలు ఉన్నాయి. అతనితో మూడు రోజులు ఉండడానికి మమ్మల్ని ఆహ్వానించాడు. ఆ మూడు రోజులూ ఎంతో శ్రద్ధగా స్నేహభావంతో మాకు ఆతిధ్యమిచ్చాడు.
\v 8 ఆ సమయంలో పోప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాలుతో బాధ పడుతూ పండుకొని ఉన్నాడు. పౌలు అతని దగ్గరకు వెళ్లి ప్రార్థన చేశాడు. తరవాత అతనిపై చేతులుంచి అతణ్ణి స్వస్తపరిచాడు.
\v 9 పౌలు ఈవిధంగా చేయగానే ఆ ద్వీపంలోని మిగిలిన రోగులు కూడా అతని దగ్గరకు వచ్చాడు. అతడు వాళ్ళని కూడా స్వస్థపరిచాడు.
\p
\v 10 వాళ్ళు అనేక బహుమానాలతో మాకెంతో మర్యాద చేశారు. మేము మూడు నెలల తరవాత బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు మాకు ఓడలోకి కావలసిన వస్తువులు, ఆహారపదార్థాలు తెచ్చి ఓడలో పెట్టారు.
\s5
\p
\v 11 అలెగ్జాండ్రియా పట్టణం నుండి కవల దేవుళ్ళ చిహ్నంతో ఉన్న ఓడ ఒకటి ఆ ద్వీపంలో చలికాలం అంతా నిలిచిపోయింది. మూడు నెలలు అక్కడ ఉన్న తరవాత ఆ ఓడ ఎక్కి బయలుదేరాం. ఆ ఓడ ఇటలీ కి వెళ్తుంది.
\p
\v 12 మేము సురకూసై నగరానికి చేరి అక్కడ మూడు రోజులు గడిపాం.
\s5
\p
\v 13 అక్కడనుండి బయలుదేరి చుట్టూ తిరిగి ఇటలీ లోని రేగియుకు వచ్చాం. మరుసటి రోజు దక్షిణపు గాలి విసరడంతో రెండు రోజుల్లో పోతియోలికి వచ్చాం. అక్కడ మేము ఓడ దిగాం.
\p
\v 14 పోతియోలిలో కొందరు విశ్వాసులు మమ్మల్ని ఏడు రోజులు వాళ్ళతో ఉండమని కోరారు. ఆ తరవాత చివరిగా రోమ్ నగరానికి వచ్చాం.
\p
\v 15 రోమ్ లో కొందరు విశ్వాసులు మేము వచ్చామని విని మమ్మల్ని కలవడానికి వచ్చారు. కొంతమంది అప్పీయా సంతపేట దగ్గరికీ, ఇంకొందరు మూడు సత్రాలు అని పిలిచే ఊరి దగ్గరకు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు. పౌలు ఆ విశ్వాసులను చూసినప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఎంతో ధైర్యం తెచ్చుకొని ప్రోత్సాహం పొందాడు.
\s5
\p
\v 16 మేము రోమ్ చేరుకున్న తరవాత పౌలు తనకు కాపలాగా ఉన్న సైనికులతో కలిసి ప్రత్యేకంగా ఒక ఇంట్లో ఉండడానికి అనుమతించారు. అయితే సైనికులు మాత్రం ఎప్పుడూ అతణ్ణి కాపలా కాస్తూ ఉండాలి.
\p
\v 17 మూడు రోజుల తరవాత అక్కడి యూదు నాయకులు వచ్చి తనతో మాట్లాడమని పౌలు కబురుపెట్టాడు. వాళ్ళు అతని దగ్గరకు వచ్చినప్పుడు పౌలు వాళ్ళతో, "సోదరులారా, నేను మన ప్రజలకు పూర్వీకుల ఆచారాలకు వ్యతిరేకంగా ఏదీ చేయకపోయినా మన నాయకులు యెరూషలేములో నన్ను బంధించారు. వాళ్ళు నన్ను చంపబోతుండగా ఒక రోమా సేనాపతి నన్ను కాపాడి, కైసరయ ప్రాంతానికి రోమా అధికారుల విచారణకు పంపించాడు.
\v 18 వాళ్ళు నన్ను విచారించి నాలో మరణశిక్షకు తగిన కారణం ఏదీ లేకపోవడంతో నన్ను విడిచిపెట్టాలి అనుకున్నారు."
\s5
\p
\v 19 "అయితే రోమా అధికారులు నన్ను విడుదల చేయడం యూదు పెద్దలకు ఇష్టం లేక అడ్డు తగిలారు. ఇంకా చేసేది లేక నేను రోమ్ లో కైసరుకు నా వాదన వినిపిస్తాను అనాల్సి వచ్చింది. ఇలా అనడానికి కారణం మన యూదు నాయకులపై దేని గురించో ఫిర్యాదు చేయాలన్న ఉద్దేశం కాదు.
\v 20 నేనెందుకు ఖైదీని అయ్యానో దానికి కారణం మీతో చెప్పాలని మిమ్మల్ని పిలిపించాను. దేవుడు మనకు చేస్తానని చెప్పిన దానిని తప్పకుండా జరిగిస్తాడు అని నేను నమ్ముతున్నాను. ఇశ్రాయేలు ప్రజల ఆ నిరీక్షణ కోసం నేను ఈ గొలుసులతో కట్టబడ్డాను" అని చెప్పాడు.
\s5
\p
\v 21 అప్పుడు యూదు నాయకులు, "యూదయలో మన తోటి యూదులనుండి నీ గురించి మేము ఎలాంటి ఉత్తరాలు అందుకోలేదు. మన తోటి యూదులలో ఎవరూ నీ గురించి చెడ్డగా చెప్పుకోలేదు, ఎవ్వరూ దీని గురించి మాట్లాడుకోలేదు కూడా.
\v 22 ఈ విషయంలో నీ అభిప్రాయం నీ నోటినుండే వినాలని అనుకుంటున్నాం. ఈ మతభేదం గురించి అన్ని చోట్లా అభ్యంతరాలు ఉన్నాయని మాత్రం మాకు తెలుసు" అని జవాబిచ్చారు.
\s5
\p
\v 23 కాబట్టి వాళ్ళు ఇంకొక రొజు కూడా పౌలుతో మాట్లాడడానికి రావాలని నిర్ణయించుకున్నారు. తరవాత వాళ్ళు వచ్చిన రోజు చూస్తే ఇంతకు ముందుకంటే ఎక్కువమంది పౌలు నివాసానికి వచ్చారు. పౌలు దేవుని పరిపాలన ఎలా ఉంటుందో వాళ్ళకి చెబుతున్నాడు. మోషే ధర్మశాస్తం, ప్రవక్తలు, యేసును గురించి ముందుగా ఎలా ప్రవచించారో వాళ్ళతో మాట్లాడాడు. ఉదయం నుండీ సాయంత్రం వరకూ మాట్లాడుతూనే ఉన్నాడు.
\v 24 అతడు చెప్పిన యేసును గురించిన సంగతులు సత్యమని కొంతమంది నమ్మారు. కొంతమంది మాత్రం నమ్మలేదు.
\s5
\p
\v 25 వాళ్ళలో ఒకరితో ఒకరికి భేదాభిప్రాయాలు కలిగాయి. వాళ్ళు వెళ్లిపోతుండగా పౌలు వాళ్ళతో ఒక మాట చెప్పాడు. "పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మన పూర్వికులతో చెప్పిన మాట నిజమైంది.
\q
\v 26 మీరు ఈ మాటలు ప్రజలతో చెప్పండి:
\q మీరు వింటారుగానీ దేవుడేం చెప్తున్నాడో అర్థం చేసుకోరు.
\q మీరు కంటితో చూస్తారుగానీ దేవుడు చేసేదాన్ని నిజంగా చూడరు."
\s5
\p
\v 27 "ఈ ప్రజలు అర్థం చేసుకోరు, ఎందుకంటే వాళ్ళ హృదయాలు బండబారి పోయాయి. నా దగ్గరకు వచ్చి స్వస్థత పొందకుండా వాళ్ళ చెవులు పూర్తిగా ముసుకున్నాయి. వాళ్ళు కళ్ళు మూసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి చూడటం ఇష్టం లేదు. వాళ్ళు చెవులతో వినడానికి గానీ, హృదయంతో అర్థం చేసుకోడానికి గానీ వాళ్ళకిష్టం లేదు. వాళ్ళు గనుక నా దగ్గరకు వస్తే వాళ్ళని స్వస్తపరుస్తాను."
\s5
\p
\v 28 "కాబట్టి దేవుని వలన కలిగిన ఈ రక్షణ యూదేతరుల దగ్గరకు తరలిపోతున్నదని మీరు తెలుసుకుంటారు.
\v 29 దేవుడు యూదేతరులకు దీనిని అందుబాటులో ఉంచారు. వాళ్ళు దీనిని అంగీకరిస్తారు." ఈ మాటలు విని వారంతా వెళ్ళిపోయారు.
\s5
\p
\v 30 పౌలు రెండు సంవత్సరాలు ఆ అద్దె ఇంట్లో నివసించాడు. తన దగ్గరకు వచ్చిన వారందరినీ కుశల ప్రశ్నలు అడుగుతూ వాళ్ళకి బోధించేవాడు.
\v 31 దేవుడు తనను తాను రాజుగా కనపరచుకున్నాడు అనే విషయాలను, యేసు ప్రభువే మెస్సీయ అనే విషయాలను గొప్ప ధైర్యంతో, అధికారంతో బోధిస్తూ ఉన్నాడు. అతణ్ణి ఆపడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదు.

296
50-EPH.usfm Normal file
View File

@ -0,0 +1,296 @@
\id EPH - Indian Easy Version (IEV) Telugu 1
\ide UTF-8
\h ఎఫెసీయులకు రాసిన పత్రిక
\toc1 ఎఫెసీయులకు రాసిన పత్రిక
\toc2 ఎఫెసీయులకు రాసిన పత్రిక
\toc3 eph
\mt1 ఎఫెసీయులకు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 దేవుడు కోరుకున్న ప్రకారంగా యేసు క్రీస్తు అపోస్తలుడు అయిన నేను అంటే పౌలును, ఈ ఉత్తరం ఎఫెసు పట్టణంలో దేవుడు తనకోసం ప్రత్యేకించుకున్న వాళ్ళకి, అంటే యేసు క్రీస్తు భక్తులకు రాస్తున్నాను.
\v 2 మన తండ్రి అయిన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీ పట్ల కృప చూపి, శాంతి సమాధానాలు ఇవ్వాలని నా ప్రార్థన.
\s5
\p
\v 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు. మనం క్రీస్తుకు చెందిన వాళ్ళం కాబట్టి ఆయన పరలోక విషయాల్లో అన్ని రకాల ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు.
\v 4 దేవుడు ఈ లోకాన్ని చేయకముందే మనం క్రీస్తుకు చెంది ఉండాలని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో ఇతరులకంటే ప్రత్యేకంగా ఉండి ఎలాటి తప్పూ లేనివారంగా జీవించేలా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఇది ఆయనకి మన పట్ల ఉన్న ప్రేమే కారణం.
\s5
\v 5 ఎప్పుడో పూర్వకాలంలోనే యేసు క్రీస్తు ద్వారా మనల్ని తన సొంత కొడుకులుగా దత్తత చేసుకోడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. అది ఆయనకు ఎంతో ఆనందం. ఆయన అలా ఆశించాడు కాబట్టి అలా చేశాడు.
\v 6 ఇంత అద్భుతమైన దయను మన పట్ల చూపినందుకు ఆయనకు స్తుతులు. ఇది మనకున్న అర్హతకు ఎన్నో రెట్లు మించినది. ఆయన ప్రేమను చూరగొన్న ఆయన కుమారుడి ద్వారా ఆయన మనల్ని దీవించాడు.
\s5
\p
\v 7 యేసు మనకు బదులుగా చనిపోయి మన పాపాలకు వెల చెల్లించాడు. అంటే ఆయన చనిపోయినప్పుడు దేవుడు మన పాపాలు క్షమించాడు. దీనికి కారణం ఆయన మనపట్ల చూపిన ధారాళమైన కరుణ.
\v 8 ఆయన అపారమైన దయతో బాటు ఆయనకు పరిపూర్ణమైన జ్ఞానం ఉంది, ఆయనకు అన్నీ తెలుసు.
\s5
\v 9 ఇప్పుడు దేవుడు తన పథకం లోని రహస్యాన్ని వెల్లడించాడు. ఇది ఆయన క్రీస్తుతో కలిసి నిర్ణయించిన పథకం.
\v 10 సరిగ్గా ఆ సమయం వచ్చినప్పుడు క్రీస్తు మొత్తాన్నీ తన ఆధీనంలోకి తెచ్చుకుని అన్నిటినీ ఏకం చేస్తాడు. ఆ విధంగా పరలోకంలో, భూలోకంలో ఉన్నవన్నీ క్రీస్తువి అవుతాయి.
\s5
\v 11 క్రీస్తు ఏవైతే చేసాడో దాన్ని బట్టి దేవుడు కూడా మనల్ని తన సొంత మనుషులుగా చేసుకున్నాడు. ఇలా చెయ్యాలని ఆయన ఏనాడో నిశ్చయించుకున్నాడు. తాను ఏమి చెయ్యాలనుకున్నాడో అది ఆయన చేసి తీరుతాడు.
\v 12 దేవుడి ప్రణాళికలో మొట్టమొదటగా క్రీస్తును నమ్ముకున్న యూదులమైన మనం ఆయన్ని కొనియాడాలి. ఎందుకంటే ఆయనెంతో గొప్పవాడు.
\s5
\v 13 ఆపైన యూదులు కాని మీరు కూడా సత్య సందేశం విన్నారు. అంటే దేవుడు మిమ్మల్ని ఎలా రక్షిస్తున్నాడో మీరు ఆ క్రీస్తును ఎలా నమ్మారో ఆ సువార్త అన్నమాట. మీరది చేసినప్పుడు దేవుడు తాను మాట ఇచ్చినట్టు మీకు పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా మీరు క్రీస్తుకు చెందిన వాళ్ళని ముద్ర వేశాడు.
\p
\v 14 దేవుడు మాట ఇచ్చిన మిగతావన్నీ తప్పకుండా ఇస్తాడు అనడానికి ఆ ఆత్మ అడ్వాన్సు లాగా ఉంది. ఆ సమయంలో ఆయన మనకోసం దాచిపెట్టిన వాటన్నిటినీ ఇస్తాడు. దేవుడు గొప్పవాడు గనక ఆయనకు స్తుతి.
\s5
\p
\v 15 దేవుడు ఇదంతా మీకోసం చేశాడు గనక మీరు యేసు క్రీస్తును ఎంత బలంగా నమ్ముకున్నారో, విశ్వాసులందరినీ మీరెంతగా ప్రేమిస్తున్నారో నేను విన్నాను.
\v 16 మీ కోసం అస్తమానం నా ప్రార్థనల్లో దేవునికి కృతఙ్ఞతలు అర్పిస్తున్నాను.
\s5
\v 17 మన ప్రభువైన యేసు క్రీస్తుకు దేవుడు, తేజోమూర్తి అయిన తండ్రి, తనను మరింతగా తెలుసుకోడానికి మీకు తన ఆత్మను ఇవ్వడం ద్వారా, మీకు తెలివినిచ్చి దేవుణ్ణి మీకు వెల్లడి చెయ్యాలి అని ప్రార్థిస్తున్నాను.
\v 18 విషయాల్ని ఉన్నవి ఉన్నట్టుగా మీరు చూడగలిగేలా దేవునికి మన విషయంలో ఉన్న అద్భుత ప్రణాళిక మనం తెలుసుకోగలిగేలా దేవుడు చెయ్యాలని ప్రార్థన చేస్తున్నాను. మనకు, విశ్వాసులందరికీ దేవుడు వాగ్దానం చేసినవి ఎంత అద్భుతమైనవో, సౌభాగ్యవంతమైనవో మీకు తెలియాలని నా ప్రార్థన.
\s5
\v 19 క్రీస్తు లో విశ్వాసం ఉంచిన మనకోసం దేవుడు ఎంత శక్తివంతంగా పని చేస్తాడో మీరు గ్రహించాలని నా ప్రార్థన. ఆయన మన విషయంలో అంత అనంత ప్రభావం గలవాడు.
\p
\v 20 క్రీస్తు చనిపోయాక దేవుడు ఇదే శక్తితో ఆయన్ని తిరిగి బతికించి పరలోకంలో అత్యున్నత స్థానంలో ఉంచాడు.
\v 21 క్రీస్తు పాలకులందరికంటే అన్ని స్థాయిల్లో ఉండే శక్తులన్నిటికంటే మనుషులు పూజించే ప్రతిదానికంటే పైగా పరిపాలిస్తాడు, ఇప్పుడు మాత్రమే కాదు, శాశ్వతంగా.
\s5
\v 22 దేవుడు అన్నిటినీ క్రీస్తు పరిపాలన కింద ఉంచాడు. అన్నిటా అందరు విశ్వాసుల మధ్యా క్రీస్తును ఏలికగా నియమించాడు.
\v 23 విశ్వాసులమైన మనకు క్రీస్తుతో సంబంధం ఎలాటిదంటే, మనిషి శరీరానికి తలతో ఉన్న సంబంధం లాటిది. ఆయన అంతటా అన్నిటినీ నింపినట్టే విశ్వాసులందరిలోనూ నిండిపోతున్నాడు.
\s5
\c 2
\p
\v 1 మీరు క్రీస్తులో విశ్వాసం ఉంచకముందు అత్మసంబంధంగా చచ్చిన స్థితిలో ఉండి పాపం చెయ్యడం మానలేక పోయేవాళ్ళు.
\v 2 ఈ లోకం పోకడ, ఆత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉండగా పాపభూయిష్టమైన బ్రతుకులో ఉండేవాళ్ళు. ఈ లోకాధికారులను గుప్పెట్లో ఉంచుకున్న దురాత్మల అధికారి అదుపులో మీరు ఉండేవాళ్ళు. ఈ అధికారి సాతాను. దేవునికి ఎదురు తిరుగుతూ ఉండే మనుషుల ద్వారా అతడు ఇప్పుడు పని చేస్తూ ఉంటాడు.
\v 3 పూర్వం మనమంతా దేవునికి లోబడని వాళ్ళ లాగానే జీవించాము. మన మనసుకు నచ్చినవి చేస్తూ వచ్చాము. అవన్నీ శరీర సుఖాలే, మానసిక ఉల్లాసాలే. మనమంతా ఇతరుల్లాగా స్వభావసిద్ధంగా దేవుని ఉగ్రతకు అర్హులం.
\s5
\p
\v 4 కానీ దేవుడు కరుణానిధి. మనల్ని ఎంతో ప్రేమించాడు.
\v 5 ఎంతగా ప్రేమించాడంటే మనం అత్మసంబంధంగా చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ, ఎడతెరిపి లేకుండా పాపం చేస్తున్నప్పటికీ మనల్ని క్రీస్తుతో జోడించడం ద్వారా బ్రతికించాడు. గుర్తుంచుకోండి. మీకు ఏమాత్రం అర్హత లేకపోయినా దేవుడు మీపై దయ చూపి మీరు మీ అతిక్రమాల్లో చనిపోయి ఉన్నప్పటికీ, రక్షించాడు.
\v 6 దేవుడు మనల్ని రక్షించడం అంటే అది సమాధుల్లో నుండి మనల్ని క్రీస్తు యేసులో బయటికి తెచ్చి ఆయనతో బాటు మళ్లీ మనల్ని బ్రతికించి, పరలోకంలో ఆయనతో పాటు పరిపాలన చేసే గౌరవం కట్టబెట్టాడు.
\v 7 రాబోయే యుగాల్లో క్రీస్తు యేసులో దేవుడు చేసిన ఉపకారం ద్వారా తన అపరిమితమైన కృపా సమృద్ధిని అందరికీ కనపరచడానికి ఆయన ఇలా చేశాడు.
\s5
\p
\v 8 కాబట్టి మీకు అర్హత లేని విధంగా దేవుడు మీ పట్ల కృప చూపాడు. ఆత్మసంబంధమైన మరణం నుండి రక్షించడంలో ఇది బయట పడింది. మీరు క్రీస్తుపై నమ్మకం ఉంచారు గనక దేవుడు ఇలా చేశాడు. మిమ్మల్ని మీరే రక్షించుకోలేదు. ఇది దేవుని బహుమానం.
\v 9 దీన్ని ఎవరూ స్వంతగా సంపాదించుకోలేరు. కాబట్టి నన్ను నేనే రక్షించుకున్నానని గొప్పలు చెప్పుకోవడం ఇక్కడ కుదరదు.
\v 10 మనం ఎలా ఉండాలని దేవుడు కోరాడో అలా ఆయన మనల్ని తయారు చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసులో మనం మంచిపనులు చెయ్యడం కోసం ఆయన మనల్ని కొత్త మనుషులుగా మళ్ళీ సృష్టించాడు. అసలు అవి మనం చెయ్యాలని దేవుడు ముందుగా సిద్ధపరచినవే.
\s5
\p
\v 11 కాబట్టి వంశాన్ని బట్టి చూస్తే మీరు యూదులు కారు. దేవుని ప్రజలకు చెందినవాళ్ళు కాదు. యూదులు మిమ్మల్ని "సున్నతి లేనివాళ్ళు, సున్నతి లేని వాళ్ళు" అని ఆక్షేపించారు. తామేమో సున్నతి గల వారమని చెప్పుకునే వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం తామే దేవుని ప్రజలం, మీరు కాదు, అని. అసలు సున్నతి అనేది మనుషులు శరీరంలో ఒక చిన్న మార్పు. ఆత్మ లో దేవుడు చేసే మార్పు కాదు.
\v 12 గుర్తుంచుకోండి, ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు పరదేశులు. దేవుడు తన ప్రజలతో చేసుకున్న ఒడంబడికలోని వాగ్దానాలు మీకు లేవు. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని ఎలాటి నిబ్బరం, ఆశాభావం లేవు. అసలు ఈ లోకంలో దేవుడు లేనివాళ్ళుగా జీవించారు.
\s5
\v 13 అయితే ఇప్పుడు క్రీస్తు యేసులో నమ్మకం పెట్టుకున్నారు గనక మీరు చాలా దూరంలో ఉన్నప్పటికీ దేవుడు మిమ్మల్ని తనకు దగ్గర చేసుకున్నాడు. క్రీస్తు సిలువపై మీకోసం చనిపోయాడు గనక ఇది సాధ్యం అయింది.
\p
\v 14 యూదులు, యూదేతరులు కలిసి ప్రశాంతంగా జీవించడం ఇప్పుడు క్రీస్తు మూలానే సాధ్యం అయింది. రెండు వేరువేరు సమూహాలను ఆయన ఒకటిగా చేశాడు. ఈ రెండు గుంపులు ఇంతకుముందు ఒకరినొకరు ద్వేషించుకునే వాళ్ళు. అయితే క్రీస్తు మనకోసం మరణించడం ద్వారా ఇలాటి ద్వేషానికి ఉన్న కారణాన్ని తీసి పారేసాడు.
\v 15 ఒక యూదుడు మనల్ని ఆమోదించడానికి ఇకపై మనం యూదుల ధర్మశాస్త్రం లోని చట్టాలు, ఆజ్ఞలు పాటించే అవసరం లేకుండా చేశాడు. యూదులు, యూదేతరులు కలిసి ఒకే కొత్త జాతి అయ్యారు. క్రీస్తుకు జత కావడం వల్ల వాళ్ళద్దరూ కలిసిమెలిసి జీవించగలుగుతారు.
\v 16 సిలువపై మరణించడం ద్వారా వాళ్ళ మధ్య ఉన్న వైరాన్ని నిర్మూలించి ఇద్దరినీ దేవునితో ఏకం చేశాడు. తద్వారా ఒకరితో ఒకరికీ, తమతో దేవునికీ శాంతిసమాధానాలు ఉండాలని ఇలా చేశాడు
\s5
\v 17 యేసు వచ్చి మనకు దేవునితో శాంతియుతంగా జీవించడం వీలౌతుందనే శుభవార్త ప్రకటించాడు. దేవుడంటే తెలియని యూదేతరులైన మీకు, దేవుణ్ణి గురించి తెలిసిన యూదులమైన మాకు దీన్ని ప్రకటించాడు.
\v 18 యేసు మనకు చేసిన దాని కారణంగా యూదులు, యూదేతరులు ఇప్పుడు దేవుని ఆత్మ మూలంగా తండ్రి అయిన దేవుని చెంతకు రాగలరు.
\s5
\p
\v 19 కాబట్టి యూదేతరులైన మీరు దేవుని ప్రజల్లో చేరకుండా బయట ఉన్నవాళ్ళు కారు. దేవుని కుటుంబానికి చెంది ఉండేలా దేవుడు తనకోసం ప్రత్యేకంగా పెట్టుకున్న వాళ్ళతో కలిసి ఉన్నారు.
\v 20 దేవుడు ఒక కట్టడం నిర్మించడానికి తెచ్చుకున్న రాళ్లలాటి వాళ్ళు మీరు. ఆ భవనానికి అపోస్తలులు, ప్రవక్తలు పునాది లాంటివాళ్ళు. అంటే ఇల్లు కట్టడానికి వాడే రాళ్లు పునాదిపై ఎలా ఆధారపడతాయో అలానే వాళ్ళు నేర్పించిన దానిపై మీరు ఆధారపడి బలమైన గోడలుగా తయారు అవుతున్నారు. యేసు క్రీస్తు తానే ఆధారశిల. అది భవనం అంతటికీ అతి ప్రాముఖ్యమైన రాయి.
\v 21 ప్రతి ఒక్కడూ ఎక్కడ ఉండాలో యేసు నిర్ణయిస్తాడు. ఇదేలాగంటే ఏ రాయి ఎక్కడ అమరి ఉండాలో ఆధార శిలను బట్టే కదా తెలిసేది? ఇల్లు కట్టే వాళ్ళు రాతిమీద రాతిని పెట్టి ఎలా కడతారో ప్రభువును ఆరాధించడానికి ఒక పవిత్ర ఆలయంగా ఉండేందుకు యేసు ఈ కుటుంబాన్ని వృద్ధి చేస్తున్నాడు.
\v 22 మీరు యేసుకు చెందిన వాళ్ళు కాబట్టి ఆయన మిమ్మల్ని కడుతున్నాడు. యూదులనూ, యూదేతరులనూ కూడా ఒక భవనంలాగా ఒక కుటుంబంగా ఆయన కడుతున్నాడు. అందులో దేవుడు తన ఆత్మ మూలంగా కాపురముంటాడు.
\s5
\c 3
\p
\v 1 యూదేతర విశ్వాసులైన మీకోసం దేవుడు తన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడు. ఈ కారణాన మీకోసం క్రీస్తును సేవిస్తున్న నేను ఖైదీనయ్యాను.
\v 2 మీ విషయంలో దేవుడు నాకు అనుగ్రహించిన పనిని అంటే దేవుడు యూదేతరుల పట్ల దయ చూపుతాడనే సంగతిని మీకు తెలియజెప్పడం అనే పనిని గురించి మీరు వినే వుంటారు.
\s5
\v 3 అదేమంటే ఇంతకు ముందు మనుషులకు అర్థం కాని విషయాన్ని నేరుగా దేవుడు నాకు తెలిపాడు. దీన్ని గురించి మీకు ఇంతకు ముందు క్లుప్తంగా రాశాను.
\v 4 మీరు దాన్ని చదివితే ఆ క్రీస్తును గురించి ఇంతకు ముందు వెల్లడి చెయ్యని దాన్ని నేను స్పష్టంగా అర్థం చేసుకున్నానని మీరు గ్రహించగలరు.
\p
\v 5 గతంలో దేవుడు ఈ సందేశం పూర్తిగా మనుషులకు వెల్లడించలేదు. కానీ ఇప్పుడు ఆయన ఆత్మ ఈ సంగతిని తన పవిత్ర అపోస్తలులకు, ప్రవక్తలకు తెలియజెప్పాడు.
\s5
\v 6 సువార్త ద్వారా యూదులతో పాటు యూదేతరులు కూడా దేవుని ఆత్మసంబంధమైన సౌభాగ్యంలో భాగస్తులు. దేవుని ప్రజల సమూహానికి చెందిన వాళ్ళు. దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేసిన వాటన్నిటిలో వాళ్ళకీ భాగం ఉంది. ఇది ఎలానంటే సువార్తను నమ్మడం ద్వారా వాళ్ళు కూడా యేసు క్రీస్తులో కలిసిపోయారు.
\v 7 ఈ శుభవార్త మనుషులందరికీ చెప్పడం ద్వారా నేను దేవుణ్ణి సేవించే వాడినయ్యాను. నిజానికి నేను ఇందుకు తగిన వాణ్ణి కాకపోయినప్పటికీ దేవుడు నా పట్ల దయ చూపి ఈ పని నాకు అప్పజెప్పాడు. నాలో శక్తివంతంగా పనిచెయ్యడం ద్వారా నాకు ఆ సామర్థ్యం కలిగిస్తున్నాడు.
\s5
\p
\v 8 దేవునికి చెందిన వారందరిలోకీ నేను అత్యల్పుడిని అయినా దేవుడు తన దయ చొప్పున నాకు ఈ వరమిచ్చాడు. క్రీస్తు మనకోసం సిద్ధం చేసిన అనంతమైన ఆత్మసంబంధమైన దీవెనలు వాళ్ళవి అని యూదేతరులకు ప్రకటించమని నన్ను నియమించాడు.
\v 9 దేవుని ప్రణాళికను అందరూ అర్థం చేసుకునేలా చెయ్యమని నన్ను ఆదేశించాడు. ఈ ఉద్దేశం అన్నిటినీ చేసిన దేవుడు చాలా కాలం నుండీ దాచి ఉంచినది.
\s5
\v 10 దేవుడు దీన్ని ఎందుకు ఇప్పటిదాకా దాచి ఉంచాడంటే ఇప్పుడు తాను ఎన్నుకున్న ప్రజలకు దాన్ని వెల్లడి చెయ్యడం ద్వారా దాన్ని అత్యున్నత హోదాల్లో ఉన్న ఆత్మసంబంధమైన అధిపతులకు కూడా తెలియజేయాలనే, ఈ విధంగా వాళ్ళు తన జ్ఞానం ఎంత గంభీరమైనదో గ్రహించాలనే.
\p
\v 11 ఈ ప్రణాళిక ఇప్పటిది కాదు. ఎప్పటినుంచో ఆయన దగ్గర ఉంది. మన ప్రభు యేసుక్రీస్తు చేసిన పని ద్వారా ఆయన దీన్ని నెరవేర్చాడు.
\s5
\v 12 కాబట్టి ఇప్పుడు యేసు చేసిన దాన్ని బట్టి మనం స్వేచ్ఛగా, ఆత్మనిబ్బరంతో దేవుని చెంతకు రావచ్చు. ఎందుకంటే మనం యేసుపై విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని తనతో కలుపుకున్నాడు.
\v 13 కాబట్టి నేనిక్కడ మీ పక్షాన జైల్లో బాధలు పడుతుండడం చూసి దిగులు పడకండి. ఎందుకంటే ఇవి మీకు మహిమ కారకాలుగా ఉంటాయి.
\s5
\p
\v 14 దేవుడు మీకు ఇవన్నీ చేశాడు గనక మన తండ్రీ అయిన దేవుని ఎదుట నేను మోకరించి ప్రార్థిస్తున్నాను.
\v 15 ఆయన ఆదిమూల జనకుడు. పరలోకంలో, భూమి మీదా ప్రతి కుటుంబానికీ నమూనా ఆయనే.
\v 16 ఆయన ఎంత ఘనుడో ఆ మేరకు మిమ్మల్ని కూడా బలపరచడం కోసం ఆయన తన ఆత్మను మీకివ్వాలని నా ప్రార్థన.
\s5
\p
\v 17 మీరు ఆయనపై విశ్వాసం ఉంచిన కారణంగా క్రీస్తు మీ చెంతనే ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు చేసేదీ, చెప్పేదీ అంతా మీకోసం ఆయన ప్రేమ కారణంగానూ, ఇతరుల పట్ల మీ ప్రేమ కారణంగానూ ఉండాలి.
\v 18 ఫలితంగా మీరు దేవుని ప్రజలందరితో కూడా క్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో సంపూర్ణంగా గ్రహించగలగాలి.
\v 19 ఆయన మన అవగాహనకు అతీతంగా మనల్ని ప్రేమిస్తున్నప్పటికీ క్రీస్తు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు గ్రహించాలని నా కోరిక. తద్వారా దేవుడు తానేమిటో దానంతటినీ మీలో నింపాలి.
\s5
\p
\v 20 మనలో దేవుని శక్తి పనిజేస్తున్నది గనక మనం అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే దేవుడు ఎంతో ఎక్కువగా మనకోసం చెయ్యగలడు.
\v 21 ఆయన మహాత్మ్యాన్ని బట్టి విశ్వాసులు అందరూ ఆయన్ని కొనియాడుతారు గాక. క్రీస్తు యేసు ద్వారా ఆయన చేసిన మహత్కార్యం నిమిత్తం తరతరాలు శాశ్వతంగా అలా జరుగును గాక.
\s5
\c 4
\p
\v 1 దీనంతటి మూలంగా యేసు క్రీస్తును సేవిస్తున్న కారణంగా చెరసాలలో ఉన్న నేను మీకు చేసే విన్నపం. మిమ్మల్ని తనకోసం జీవించమని పిలుచుకున్న యేసు ప్రతిష్టకు తగినట్టు మీరు ప్రవర్తించాలి.
\v 2 ఎప్పుడూ వినయంగా మృదువుగా నడుచుకోండి. ఒకరితో ఒకరు ఓపికగా ఉండండి. మీలో ఉన్న ప్రేమను బట్టి. ఎదుటి మనిషి చేసే భారభారితమైన పనులను సహిస్తూ ఉండండి.
\v 3 దేవుని ఆత్మ మిమ్మల్ని ఐక్యం చేశాడు గనక ఒకరితో ఒకరు కలిసి ఉండడానికి శాయశక్తులా కృషి చెయ్యండి. ఒకరి పట్ల ఒకరు శాంతంగా ప్రవర్తించడం ద్వారా ఒకరికి ఒకరు కలిపి కట్టి వేసుకోండి.
\s5
\v 4 దేవునిది ఒకటే విశ్వాసుల కుటుంబం. ఒక్కడే ఆత్మ. మనుషులు ఆశించే ఏకైక విషయాన్ని అందుకోడానికి ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు ఒక్కటే. దేవుడు పిలిచిన మీకే అది సొంతం.
\v 5 ఒక్కడే ప్రభువు యేసుక్రీస్తు ఒక్కడే ప్రభువు. ఆయన్ని సేవించడానికి ఒక్కటే మార్గం. ఆయనపై సంపూర్ణంగా నమ్మకం ఉంచడం మూలంగా ఆయనకోసం మాత్రమే మనం బాప్తిసం పొందాము.
\v 6 ఒక్కడే దేవుడు ఉన్నాడు. యూదులైనా, కాని వారైనా అందరికీ ఆయనే తండ్రి. మనందరినీ ఆయనే ఏలుతున్నాడు. మనందరిలో ఆయనే పని చేస్తున్నాడు. మనందరిలో ఆయనే ఉన్నాడు.
\s5
\p
\v 7 మనలో ప్రతి ఒక్కరికీ క్రీస్తు నిర్ణయించిన రీతిగా దేవుడు ఆత్మ వరాలు పంచిపెట్టాడు.
\v 8 లేఖనం చెప్పినట్టుగా,
\q ఆయన ఉన్నత స్థలానికి ఎక్కిపోయి
\q తాను స్వాధీనం చేసుకున్న అనేకమందిని తనతో తీసుకొచ్చాడు.
\q తన ప్రజలకు ఇనాములిచ్చాడు.
\s5
\p
\v 9 "ఎక్కిపోయి" అనే మాటను చూస్తుంటే క్రీస్తు అంతకు ముందు భూమి అట్టడుగు భాగాల్లోకి దిగి పోయాడని మనకు అర్థం అవుతుంది గదా.
\v 10 దివి నుండి భువికి దిగివచ్చిన ఆ క్రీస్తే పైకి ఆరోహణం అయిపోయి విశ్వంభరునిగా మహోత్కృష్టమైన స్థానం ఆక్రమించాడు.
\s5
\v 11 ఇకపోతే తన వాళ్ళకి బహుమతులుగా ఆయన కొందరిని అపోస్తలులుగా కొందరిని ప్రవక్తలుగా కొందరిని మనుషుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి యేసును గురించి సువార్త చెప్పే వాళ్ళుగా, మరికొందరిని విశ్వాసుల సమూహాల విషయం శ్రద్ధ తీసుకుంటూ, వాళ్ళకి ఉపదేశించే వాళ్ళుగా చేశాడు.
\p
\v 12 వీరందరినీ దేవుడు తన ప్రజలను సేవించే పని కోసం నియమించాడు. ఆ విధంగా క్రీస్తుకు చెందిన వారంతా అత్మసంబంధంగా బలోపేతం ఔతారు.
\v 13 మనమంతా ఏమి కావాలని దేవుడు కోరుకున్నాడో అలా మారేంతవరకూ ఈ పని కొనసాగుతుంది. దైవ కుమారుణ్ణి సంపూర్ణంగా నమ్ముకుని ఐక్యంగా ఉంటూ, ఆయన మనలో చేస్తున్న పనిని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉండాలి. దేవుణ్ణి క్రీస్తు ఎరిగినంతగా మనమూ ఎరిగి విశ్వాసుల సంఘంగా ఆయనపై ఆధారపడడంలో పూర్తిగా పరిణతి చెందాలి.
\s5
\v 14 అప్పుడు మనం ఇక మీదట ఆత్మసంబంధంగా పసి పిల్లల్లాగా పరిణతి లేకుండా ఉండము. అప్పుడు ఇక మనకు ఎదురయ్యే ప్రతి కొత్త ఉపదేశాన్నీ మనం అనుసరించం. అంటే గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోయే నావ లాగా ఎటుబడితే అటు దారి మార్చుకుంటూ ఇకపై ఉండము. కొందరు తెలివి గల వాళ్ళు అబద్ధాలు చెప్పి మనల్ని మోసగించడానికి ఇకపై అవకాశం ఇవ్వము.
\p
\v 15 దానికి బదులుగా మనం ఒకరితో ఒకరం ప్రేమపూర్వకంగా నిజాలే చెప్పుకుంటూ అన్ని విషయాల్లోనూ మరింతగా క్రీస్తు పోలికలోకి మారుతూ ఉందాము. విశ్వాసులమైన మనం ఒక మనిషి శరీరంలోని భాగాల్లాటి వాళ్ళం. క్రీస్తు ఆ శరీరానికి తల.
\v 16 మనల్ని ఒకరితో ఒకరిని కలిపి ఉంచేది ఆయనే. ఒకరికి ఒకరం ఎలా సహాయం చేసుకుంటూ ఉండాలి సమన్వయంతో ఎలా పని చెయ్యాలి అనేవి ఆయన నేర్పిస్తున్నాడు. మనిషి తల ఆ శరీరానికి అంతటికీ ఆదేశాలు ఇచ్చినట్టే మనలో ప్రతి వాడికీ ఆయనే సామర్థ్యం ఇస్తున్నాడు. ఈ విధంగా మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు బలపరుస్తూ కలిసి ఎదుగుతాము.
\s5
\p
\v 17 ఈ కారణాన యేసు ప్రభువు అధికారాన్ని బట్టి నేను మీకీ మాట చెబుతున్నాను. ఇప్పటినుంచి మీరు తక్కిన యూదేతరుల్లాగా జీవించకూడదు. వాళ్ళ జీవితవిధానం శూన్య ఆలోచనలపై శుష్క ప్రియాలపై ఆధారపడి ఉంటుంది.
\v 18 వారికి మంచిచెడుల పట్ల సరైన అవగాహన లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా దేవుడికి దూరమైపోయారు. వాళ్ళు మొండిగా దేవుడికి లోబడడానికి ఒప్పుకోనందువల్ల తాము ఏది కోల్పోతున్నామో వాళ్ళకి తెలియదు.
\v 19 వాళ్ళకి యుక్తాయుక్త విచక్షణ లేకుండా పోయింది. అందువల్ల వాళ్ళు సిగ్గులేని తమ విషయవాంఛలకు లొంగిపోతున్నారు. అన్ని రకాల దిగజారిన పనులు చేస్తూ ఇంకా చేయడానికి చూస్తున్నారు.
\s5
\p
\v 20 కానీ మీరు మాత్రం క్రీస్తును గురించి విన్న కారణంగా మీరు మరింత శ్రేష్ఠ మార్గం గుర్తించారు.
\v 21 మీరు యేసును గురించిన సందేశం విని అర్థం చేసుకుని ఆయన దగ్గరనుండి నేర్చుకున్నారు. కాబట్టి ఆయన మార్గం సత్య మార్గం అని మీకు తెలుసు.
\v 22 మీరు ఇంతవరకూ జీవించిన పద్ధతి మార్చుకోవాలని మీకు ఉపదేశించిన వాళ్ళు చెప్పారుగదా. ఎందుకంటే మీరు కోరరానివి కోరారు. అవి మంచివి అనుకుంటూ మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు. అలాటి జీవన విధానం మిమ్మల్ని ఆత్మసంబంధంగా ధ్వంసం చేసింది.
\s5
\v 23 కాబట్టి దేవుడు మీకు ఒక సరికొత్త ఆత్మనూ, సరికొత్త ఆలోచనావిధానాన్నీ ఇవ్వాలి.
\v 24 మిమ్మల్ని దేవుడు కొత్త మనిషిగా సృష్టించిన దానికి అనుగుణంగా జీవించడం మొదలు పెట్టాలి. యేసు చూపిన ఋజు మార్గంలో ఒకరితో ఒకరూ అదేసమయంలో దేవునితో కూడా సరి అయిన విధానంలో మసులుకోవాలని ఆయన మిమ్మల్ని తిరిగి సృష్టించాడు.
\s5
\p
\v 25 కాబట్టి ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడవద్దు. నిజాలే పలకండి. ఎందుకంటే దేవుని కుటుంబ సభ్యులుగా మీరు ఒకరికొకరికి చెందిన వాళ్ళు.
\v 26 పాపభూయిష్టమైన ప్రవర్తన గురించి కోపం చూపవచ్చు. అయితే కోపం వచ్చింది గనక పాపం మాత్రం చెయ్యకండి. ప్రతి దినం చివర్లో మీకు కోపం తెప్పించిన విషయం పరిష్కారం చేసుకోండి.
\v 27 అలా చెయ్యడం ద్వారా సాతాను తన దుర్మార్గం మీ మధ్య చేయడానికి వీలు లేకుండా చేసిన వారౌతారు.
\s5
\p
\v 28 దొంగతనం చేసే వాడు ఇకపై అది మానెయ్యాలి. వాళ్ళు చెమటోడ్చి తమ స్వంతగా పని చేసుకోవాలి. తద్వారా వాళ్ళు అవసరంలో ఉన్నవాళ్ళని ఆదుకోగలుగుతారు.
\v 29 పరుషమైన మాటలు మానుకోండి. సహాయం కావలసిన వాళ్ళని ప్రోత్సహించే మాటలే పలకండి. తద్వారా దేవుడు మీ మాటల ద్వారా పనిచేసి వినేవాళ్ళకు మేలు చేస్తాడు.
\v 30 దేవుడు మీకు తన పరిశుద్ధాత్మను ఇవ్వడం ద్వారా మీరు తన సొంతమని ముద్ర వేశాడు. క్రీస్తు మిమ్మల్ని ఈ లోకం నుండి విడిపించే దాకా ఆ పరిశుద్ధాత్మ మీతోనే ఉంటాడు. అందుకని మీ జీవన విధానం ద్వారా మీలో నివసిస్తున్న దేవుని పరిశుద్ధాత్మకు విచారం కలిగించకండి.
\s5
\v 31 ఈ పద్ధతుల్లో ప్రవర్తించడం పూర్తిగా మానుకోడానికి మీ శాయశక్తులా ప్రయత్నించండి. సాటి మనిషి పట్ల అసహనంగా రౌద్రంగా ఉండకండి. అసలు ఎవరి విషయంలోనూ కోపంగా ఉండకండి. ఇతరులను తిట్టకండి. కోపంగా అరవడం, దూషించడం పూర్తిగా మానుకోండి. ఏ రకంగానూ ఎవరిపట్లా ద్రోహ చింతన కలిగి ఉండవద్దు.
\p
\v 32 ఒకరిపట్ల ఒకరు దయ చూపండి. సాటి మనిషి పట్ల సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండండి. క్రీస్తు మీకోసం చేసిన దాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ ఒకరినొకరు క్షమించుకోండి.
\s5
\c 5
\p
\v 1 మళ్లీ తండ్రి తమను ఇష్టంగా ప్రేమిస్తున్నాడు గనక పిల్లలు అతన్ని అనుకరించినట్టు దేవుడు మీకు చేసిన దాన్ని బట్టి ఆయన్ను అనుకరించండి.
\v 2 మీరు ఇతరులను ప్రేమిస్తున్నట్టు బయటికి కనబడేలా అన్నీ చెయ్యండి. మనల్ని ప్రేమించి ఇష్టపూర్తిగా సిలువపై మన స్థానంలో దేవునికి బలిగానూ అర్పణగానూ మరణించిన క్రీస్తు వలే ఉండండి. ఈ అర్పణ దేవునికి ఎంతో ఆమోదయోగ్యం అయింది.
\s5
\p
\v 3 మీలో ఎవరైనా సరే లైంగిక పాపంలో, లేదా ఏ విధమైన దుర్నీతిలో, ఉన్నారని, కామ వికారాలకు మరిగారని, ఎవరైనా చూచాయగానైనా సరే, అనడానికి ఏ ఆస్కారం ఉండకూడదు.
\v 4 మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు అశ్లీలమైన బూతు మాటలు చెప్పుకోవద్దు. బుద్ధిహీనంగా పాపాలు చెయ్యడం గురించిన హాస్యాలు మాట్లాడుకోవద్దు. దేవునికి చెందినవాళ్ళకి అలాటివి తగవు. మీకు వేటి విషయంలో కృతజ్ఞతాభావం ఉందో అవి మాట్లాడు కోండి.
\s5
\v 5 ఇలాటి మనుషులను దేవుడైన క్రీస్తు రాజ్యంలో చేరనివ్వరు అనేది స్పష్టం. లైంగిక అవినీతిపరులు, వెకిలి వాళ్ళు, కామవాంఛలతో వేగిపోయేవాళ్ళు, విగ్రహ పూజ చేస్తున్నట్టే లెక్క.
\v 6 ఇలాటివే మనం చూసీ చూడనట్టు వదిలెయ్యాలని ఎవరన్నా చెబితే మోసపోవద్దు. ఎందుకంటే సరిగ్గా ఇలాటి విషయాల్లోనే దేవుడు తన మాట వినని వాళ్ళను శిక్షిస్తాడు.
\p
\v 7 కాబట్టి ఇలాటి వాటిని చేసే వాళ్ళతో చేరవద్దు.
\s5
\v 8 యేసు ప్రభువును నమ్ముకోక ముందు సత్యమేదో మీకు తెలియదు, గుర్తుందా? చీకటిలో ఉన్నవాళ్ళకి చుట్టూ ఏముందో కనిపించదు కదా, ఇదీ అంతే. కానీ ఇప్పుడు ప్రభువు మీకు ఏది సత్యమో చూపించాడు గనక మీరు వెలుతురు లోకి వచ్చారు. కాబట్టి ప్రభువు చూపిన పద్ధతిలోనే నడుచుకోండి.
\v 9 వెలుతురులో ఉన్నవాళ్లు సరైన దారిలో నడిచినట్టే యేసును ఎరిగిన కారణంగా సన్మార్గంలో, సత్యమైన, రుజువైన దారిలో మీరు ఉండగలరు.
\v 10 మీరిలా జీవిస్తూ ప్రభువుకు ఏది ఇష్టమో నేర్చుకుంటూ ఉండండి.
\p
\v 11 కాబట్టి ఆత్మ సంబంధమైన అంధకారంలో ఉన్నవాళ్ళు చేసే పనికిమాలిన పనుల్లో పాల్గొనకండి. అవి ఎంత నీచమైన పనులో అందరికీ బట్టబయలు చెయ్యండి.
\v 12 మనుషులు రహస్యంలో చేసే తప్పుడు పనుల గురించి మాట్లాడడం కూడా సిగ్గుమాలినతనమే.
\s5
\p
\v 13 ఈ భాగోతాలను బట్టబయలు చెయ్యడం అవసరం. అప్పుడే ఈ పనులు దుర్మార్గమని మనుషులు తెలుసుకుంటారు. దేన్నైనా దాని నిజస్వరూపం చూపించడానికి వెలుతురు లోకి తెస్తాము కదా? అప్పుడే వెలుగులోకి వచ్చిన దాన్ని మనుషులు పరీక్షించి తెలుసుకోగలుగుతారు.
\p
\v 14 ఇలా అంటున్నప్పుడు విశ్వాసుల ఉద్దేశం ఇదే కదా.
\q1 నిద్ర పోతున్నావా, మేలుకో.
\q1 చనిపోయిన వాడా, చీకటిలో నుండి లేచి వచ్చి బ్రతుకు.
\q1 చీకటిలో ఉన్నవాళ్ళకి అక్కడ ఉన్నవేవో చూపించడానికి వెలుగు ప్రకాశించినట్టు క్రీస్తు నీకు ఏది సత్యమో తెలియజేస్తాడు.
\s5
\p
\v 15 కాబట్టి ఎలా జీవిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించాలి.
\v 16 మీకున్న సమయంలోనే సాధ్యమైనంత మేలు చెయ్యండి. ఎందుకంటే రోజురోజుకీ మనుషులు దుర్మార్గానికి తెగబడుతున్నారు.
\v 17 అందుకే జ్ఞానంగా నడుచుకోండి. యేసు ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకుని అలా చెయ్యండి.
\s5
\v 18 మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. ఎందుకంటే తాగిన వాడు తన అదుపులో తాను ఉండదు. దేవుని పరిశుద్ధాత్మమిమ్మల్ని అదుపు చెయ్యనివ్వండి.
\v 19 ఒకరికొకరు కీర్తనలు వినిపించుకోండి. క్రీస్తును గురించిన పాటలు, దేవుని ఆత్మ మీకిచ్చిన పాటలు పాడుకోండి. బయటికి వినిపించేలా కాకపోయినా మీలో మీరు ప్రభువుకు స్తుతి గీతాలను సమర్పించండి.
\v 20 అస్తమానం ప్రభు యేసు క్రీస్తు మీకు చేసినదాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కృతఙ్ఞతలు చెల్లించండి.
\p
\v 21 క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.
\s5
\v 22 భార్యలు యేసు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకూ లోబడాలి.
\v 23 ఎందుకంటే క్రీస్తు ప్రపంచ వ్యాప్త సంఘానికి ఏ విధంగా నాయకుడో అలాగే భర్త తన భార్యకు నాయకుడు. క్రీస్తే మానవ పాపాలకు శిక్ష పడకుండా అందరినీ రక్షించిన వాడు.
\v 24 మరి భార్యల విషయానికొస్తే విశ్వాసులు క్రీస్తు అధికారానికి లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలఅధికారానికి పూర్తిగా లోబడాలి.
\s5
\p
\v 25 భర్తలారా, సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీరు మీ భార్యలను ప్రేమించండి. క్రీస్తు తనను నమ్మిన వాళ్ళ కోసం సిలువపై తన ప్రాణమే పెట్టాడు.
\v 26 మనల్ని తనకోసం ప్రత్యేకించుకోడానికి ఆయనిలా చేశాడు. తన సందేశం మనకు వినిపించడం ద్వారా యేసు మనల్ని ప్రక్షాలణం చేశాడు. నీటితో కడిగితే మురికి పోయినట్టు ఆయన మన పాపాలను కడిగివేశాడు.
\v 27 అందరూ పాపరహితంగా, అనింద్యులుగా పూర్తిగా నిష్కళంకంగా పరిపూర్ణంగా ఉన్న విశ్వాసుల సమూహాన్ని వైభవోపేతమైన పెళ్లి కూతురుగా చేసి ఆమెను చేపట్టే వరునిగా తానుండాలని ఆయనిలా చేశాడు.
\s5
\p
\v 28 అలాగే ప్రతి పురుషుడు తన సొంత శరీరం లాగానే తన భార్యను ప్రేమించాలి. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే.
\v 29 ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు. ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు.
\v 30 క్రీస్తు కూడా లోకవ్యాప్తంగా ఉన్న విశ్వాసులమైన మనందరికోసం శ్రద్ధ వహిస్తున్నాడు. మనం సంఘమనే క్రీస్తు శరీరంలో భాగం అయ్యాము.
\s5
\p
\v 31 పెళ్లి అయిన వాళ్ళ గురించి లేఖనం ఇలా చెబుతున్నది.
\q "ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యతో మమేకం అవుతాడు. వారిద్దరూ ఒకే మనిషి అన్నట్టుగా అవుతారు."
\p
\v 32 ఈ మాటల్లో మనకి అర్థం కానిది ఎంతో ఉంది. అయితే ఈ భార్యాభర్తల ఉదాహరణ క్రీస్తు సార్వత్రిక విశ్వాస సమూహాన్ని ఎలా ప్రేమించాడో అర్థం చేసుకోడానికి ఉపకరిస్తుంది.
\v 33 మొత్తం మీద ప్రతి మగవాడు తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.
\s5
\c 6
\p
\v 1 పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడడం ద్వారా యేసు ప్రభువును సేవించండి. ఇలా చెయ్యడం మంచిది.
\v 2 దేవుడు తన లేఖనాల్లో అజ్ఞాపించాడు.
\p "నీ తల్లిదండ్రులను గౌరవించు, అది దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ. అందులో ఆయన ఒక వాగ్దానం కూడా కలిపాడు.
\v 3 అలా చేస్తే నీవు వర్థిల్లుతావు. భూమిపై చిరకాలం జీవిస్తావు."
\s5
\p
\v 4 తండ్రులారా, ఇక మీ విషయానికొస్తే మీ పిల్లలకు కోపం వచ్చేలా ప్రవర్తించవద్దు. వాళ్ళని యేసు ప్రభువు చెప్పిన ప్రకారం చక్కగా అన్నీ బోధిస్తూ అన్ని విధాలా క్రమశిక్షణలో పెంచండి.
\s5
\p
\v 5 సేవకులారా, మీరైతే ఈ లోకంలో మీ యజమానుల పట్ల క్రీస్తుకీ లాగానే గౌరవంగా నమ్మకంగా నడుచుకోండి.
\v 6 తాము కష్టపడి పనిచేస్తున్నట్టు అందరూ చూడాలని కొంతమంది ఇతరులు చూస్తున్నప్పుడు విధేయంగా ఉన్నట్టు కనిపిస్తారు. మీరైతే క్రీస్తు బానిసలు అయినట్టుగా దేవుని సంకల్పాన్ని హృదయపూర్వకంగా జరిగించండి.
\v 7 మనుషులకు గాక ప్రభువుకు చేసినట్టే యజమానులకు ఇష్టపూర్వకంగా సేవచేయండి.
\v 8 ఎవరూ చేసిన మంచి పనికైనా యేసు ప్రతి ఒక్కరికీ ప్రతిఫలం ఇస్తాడు గనక ఇలా చెయ్యండి. అలాటి వాడు బానిసైనా స్వతంత్రుడైనా, ఇదే జరుగుతుంది.
\s5
\p
\v 9 యజమానులారా, మీ బానిసలు మిమ్మల్ని చక్కగా సేవించాలని చెప్పాము గదా, అదే విధంగా మీరు వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళని బెదిరించడం మానుకోండి. పరలోకంలో మీ ప్రభువూ, వాళ్ళ ప్రభువూ ఒక్కడేననీ ఆయన రాజునీ పేదనీ అందరినీ సమభావంతో చూస్తున్నాడని మర్చిపోకండి.
\s5
\p
\v 10 చివరిగా, యేసు ప్రభువు మహాశక్తిమంతుడు గనక మిమ్మల్ని ఆత్మ సంబంధంగా బలపరచేలా ఆయనపై ఆధారపడండి.
\v 11 శత్రువుపై యుద్దమాడేందుకు సైనికుడు తన కవచం ధరిస్తాడుగదా. అలానే మీరు కూడా సాతాను మీకు విరోధంగా చేసే ప్రతి పన్నాగాన్నీ తిప్పికొట్టేటందుకు దేవుడిస్తున్న ప్రతి ఆధ్యాత్మిక వనరునూ వాడుకోవాలి.
\s5
\p
\v 12 గుర్తుంచుకోండి. మనం నరమాత్రులతో పోరాడడం లేదు. ఈ దుష్ట కాలంలో చెడ్డ పనులు చేసే మనుషులను ఏలే అధికారం గల దురాత్మలతో పోరాడుతున్నాము. అంటే గాలిలో ఉండే దయ్యాల గుంపులతో పోరాడుతున్నాము.
\p
\v 13 అందువల్ల సైనికుడు తన కవచమంతా ధరించినట్టు మీరు దేవుడిస్తున్న ప్రతి ఆధ్యాత్మిక వనరునూ మీరు ఉపయోగించుకోవాలి. అలా చేస్తే గనక దురాత్మలు మీపై దాడి చేసినప్పుడు వాళ్ళని ఎదిరించగలుగుతారు. ఎప్పుడూ దాడి చేసినా సిద్ధంగా ఉంటారు.
\s5
\p
\v 14 శత్రువును ఎదిరించడానికి ఎప్పుడూ సన్నద్ధంగా ఉండడం కోసం దేవుడు మీకు చూపించిన శ్రేష్ఠమైన విషయాలను తలపోసుకుంటూ ఉండండి. నీతిగా ప్రవర్తించండి. ఇది ఒక సైనికుడి రొమ్ము భాగాన్ని భద్రం చేసే కవచంలాగా పని చేస్తుంది.
\v 15 సైనికుడు ఎప్పుడూ బూట్లు వేసుకుని ఉన్నట్టే దేవునితో శాంతిసమాధానాలు చేకూర్చే సువార్త ప్రకటించడానికి ఎక్కడికైనా వెళ్ళేటందుకు సిద్ధంగా ఉండండి.
\v 16 సైనికుడు శత్రువు వదిలే అగ్ని బాణాలనుండి తనను కాపాడుకోడానికి డాలు పట్టుకున్నట్టుగానే ప్రభువుపై అన్నిసమయాల్లోనూ విశ్వాసం ఉంచాలి. మీ విరోధి దుష్టుడైన సాతాను ఆధ్యాత్మికంగా మీకు హాని కలిగించడానికి ప్రయోగించే ఎత్తుగడలన్నిటినుంచీ అది మిమ్మల్ని భద్రపరుస్తుంది.
\s5
\v 17 ఇంకా సైనికుడు తన తల భద్రత కోసం హెల్మెట్ పెట్టుకుంటాడు. అలానే దేవుడు మీకు రక్షణ ఇచ్చాడు అనే వాస్తవం పై ఆధారపడండి. శత్రువును ఓడించడానికీ సైనికుడు కత్తితో పోరాడినట్టు దేవుని ఆత్మ ఇచ్చే ఆయుధం ప్రయోగించండి. అది దేవుడి నుంచీ మీకు అందే సందేశమే.
\p
\v 18 దేవుడికి ప్రార్థన, విన్నపాలు చేసినప్పుడల్లా ఎలా ప్రార్థించాలో దేని కోసం ప్రార్థించాలో తెలియాలంటే ఎప్పుడూ దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపించనివ్వండి. ప్రార్థన ఫలితాలను ఇవ్వాలంటే దేవుడు ఏమి చేస్తున్నాడో కనిపెట్టుకుని చూస్తూ ఉండండి. దేవుని ప్రజల కోసం మీరు ప్రార్థన చెయ్యడంలో నిలకడగా ఉండండి.
\s5
\v 19 గతంలో ఇతరులకు తెలియని క్రీస్తు సువార్తను నేను ధైర్యంగా ప్రకటించేలా, నేను ఎక్కడ మాట్లాడినా ఏమి మాట్లాడాలో దేవుడు నాకు తెలిపేలా నా కోసం ప్రార్థన చెయ్యండి.
\v 20 నేను మనుషులకు క్రీస్తును గురించి అంతటా చెబుతున్న కారణంగానే నేనిక్కడ చెరసాలలో ఆయన నిమిత్తం ఉన్నాను. నేనీ పని కొనసాగించేలా ప్రార్థన చెయ్యండి. ఈ సువార్తను ఎలాంటి ధైర్యంతో ప్రకటించాలో అలాంటి ధైర్యంతో ప్రకటించాలి గదా.
\s5
\p
\v 21 నాకెంతో ఇష్టమైన నా సాటి విశ్వాసి తుకికు ప్రభువును ఎంతో నమ్మకంగా సేవిస్తున్నాడు. ఇక్కడ ఏమి జరుగుతున్నదో నేను ఎలా ఉన్నానో, ఏమి చేస్తున్నానో అన్నీ అతడు మీకు చెబుతాడు.
\v 22 ఈ కారణం తోనే నేను ఈ ఉత్తరం అతని చేతికిచ్చి పంపుతున్నాను. మేమెలా ఉన్నామో అతని వల్ల మీకు తెలుస్తుంది. అతడు మిమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తాడు.
\s5
\p
\v 23 తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు నా సాటి విశ్వాసులైన మీకు శాంతి అనుగ్రహించి మీరు ఆయనపై విశ్వాసంలో కొనసాగుతూ మీరు ఒకరినొకరు ప్రేమించుకునేలా చెయ్యాలని ప్రార్థన చేస్తున్నాను.
\v 24 దేవుడు మీ పట్ల, మన ప్రభు యేసు క్రీస్తుపై నిత్య ప్రేమను కనపరిచే వాళ్ళందరిపట్ల కనికరం చూపడం కొనసాగించాలని నా ప్రార్థన.

100
57-TIT.usfm Normal file
View File

@ -0,0 +1,100 @@
\id TIT - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h తీతుకు రాసిన పత్రిక
\toc1 తీతుకు రాసిన పత్రిక
\toc2 తీతుకు రాసిన పత్రిక
\toc3 tit
\mt1 తీతుకు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 తీతూ, యేసు అపోస్తలుణ్ణి, దేవుని సేవకుణ్ణి అయిన పౌలు అనే నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. తన వారినిగా దేవుడు ఎన్నిక చేసుకున్నవారు ఆయనను మరింతగా నమ్మేలా బోధించడానికి ఆయన నన్ను పంపాడు. ఆయన ప్రజలు సత్యం తెలుసుకునేలా సాయపడడమే నా పని. తద్వారా వారు దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించగలుగుతారు.
\v 2 ఇలా జీవించడం ఎలాగో ఆయన ప్రజలు నేర్చుకుంటారు. ఎందుకంటే దేవుడు వారిని నిత్యం జీవింప చేయగలడన్న నమ్మకం వారికి ఉంది. దేవుడు అబద్ధం ఆడడు. ఆయన భూమి పుట్టకమునుపే మనకు నిత్యజీవాన్ని గురించిన వాగ్దానం చేశాడు.
\v 3 తగిన సమయంలో ఆయన తన ఏర్పాటును నమ్మకంతో నాకప్పగించిన ఈ సువార్త సందేశం ద్వారా తెలియజేశాడు. మనల్ని రక్షించిన దేవుని అజ్ఞాపాలనలో భాగంగా నేను ఇది చేశాను.
\s5
\p
\v 4 తీతూ, నువ్వు నా కొడుకులాంటి వాడివి గనక నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వూ నేనూ యేసుక్రీస్తుపైనే నమ్మకం పెట్టుకున్నాం. మనల్ని రక్షించే తండ్రియైన దేవుడూ, యేసుక్రీస్తూ నీకు తన దయా, మనసులో నెమ్మదీ నిత్యమూ దయ చేస్తాడు గాక.
\v 5 ఈ కారణం చేతనే నిన్నుక్రేతు లంకలో విడిచి వచ్చాను. నేను నీతో చెప్పినట్టుగా ఇంకా మిగిలిపోయిన పని పూర్తి చేయడమే గాక ప్రతి పట్టణంలోనూ విశ్వాసుల సంఘాల్లో పెద్దలను నియమించు.
\s5
\p
\v 6 ఈ పెద్దలు ఎవ్వరి చేతా వేలెత్తి చూపించుకోని వారై వుండాలి. ఏకపత్నీవ్రతులై ఉండాలి. వారి పిల్లలకు దేవునిపై విశ్వాసం ఉండాలి. చుట్టుపక్కల వారితో పోకిరీ వాళ్ళనీ, మాట విననివాళ్ళనీ అనిపించుకోకూడదు.
\v 7 దేవుని ప్రజలను నడిపించే ప్రతివాడు దేవుని ఇంటి నిర్వాహకుడు వంటివాడు. అందువలన అలాటివాడు కచ్చితంగా మంచి పేరు తెచ్చుకున్న వాడై వుండాలి. అతడు పొగరుబోతులాగా, ముక్కోపిగా ఉండకూడదు. తాగుబోతుగా గానీ, గిల్లికజ్జాలు, వాదనలు పెట్టుకునే వాడిగా గానీ దురాశాపరుడిగా గానీ అస్సలు ఉండకూడదు.
\s5
\v 8 ముఖ్యంగా కొత్త వారిపట్ల మర్యాదగా, మంచి విషయాలను ఇష్టపడే వాడుగా ఉండాలి. ఇంగితజ్ఞానం గలిగి, ఇతరుల పట్ల నిజాయితీగా, న్యాయంగా నడుచుకోవాలి. అతడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటూ దైవభక్తుడు ప్రవర్తించాల్సిన సరైన విధానంలో ప్రవర్తిస్తూ వుండాలి.
\v 9 మనం నేర్పిన సత్యాలను ఎప్పుడూ నమ్మకంగా అనుసరిస్తూ ఉండాలి. ఇలా జీవించడం వల్ల ఇతరులను సైతం ఇలాంటి జీవిత క్రమాన్ని అనుసరించేలా సిద్ధం చేయగలుగుతాడు. పైగా ఎవరైనా దారి తప్పుతుంటే సరి చేయగలుగుతాడు.
\s5
\p
\v 10 ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, తమ పెద్దలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెబుతున్న మాటలు ఎందుకూ పనికిరానివి. పైగా వాళ్ళు తమతో ఉన్నవాళ్ళను తప్పుదారి పట్టిస్తారు. ఇలాటి వాళ్ళలో ఎక్కువమంది చెప్పేదేమిటంటే, క్రీస్తును వెంబడించే ప్రతీ ఒక్కరూ సున్నతి పొందాలని!
\v 11 నువ్వూ, నువ్వు నియమించిన పెద్దలూ ఇలాంటి వారిని విశ్వాసులకు బోధించకుండా కట్టడి చేయాలి. వారు బోధించకూడని విషయాలు బోధిస్తూ మొత్తంగా కుటుంబాలనే పాడు చేస్తున్నారు. విశ్వాసులిచ్చే కానుకల కోసమే వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు.
\s5
\p
\v 12 క్రేతీయుల ప్రవక్త ఒకడు తమ వాళ్ళని గురించి "క్రేతువాళ్ళు ఎంతసేపూ ఒకరితో ఒకరు అబద్ధాలాడుకుంటారు. వాళ్ళు ప్రమాదకరమైన అడవి జంతువుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు బద్దకస్తులు, తిండిబోతులు" అన్నాడు.
\v 13 అతడు చెప్పేది నిజమే. అందుకే బలవంతంగానైనా సరే, వాళ్ళను సరిదిద్దుతూ వారు దేవుని సత్యాలను నమ్ముతూ బోధించేలా చెయ్యి.
\v 14 వాళ్ళు యూదుల కాకమ్మ కథలపై ఆధారపడడం మానుకోవాలి. సత్యం నుండి తొలిగిపోయిన వాళ్ళు చెప్పుకొస్తున్న ఆజ్ఞలను అనుసరించడం మానెయ్యాలి.
\s5
\p
\v 15 ఎవరిలోనైతే చెడ్డ ఆలోచనలు, లేక కోరికలు ఉండవో ఆలాంటి వాళ్ళకు అంతా మంచే జరుగుతుంది. కానీ క్రీస్తు యేసును నమ్మకుండా అవినీతిలో ఉన్న వాళ్ళు చేస్తున్నది ఏదైనప్పటికీ అది వాళ్ళని అపవిత్రులుగా చేస్తుంది. వాళ్ళ ఆలోచనా విధానం చెడిపోయింది. వాళ్ళు చెడు చేసి కూడా కొంచెమైనా అపరాధ భావం లేకుండా ఉంటారు.
\v 16 దేవుడు మాకు తెలుసని వారు చెప్పుకున్నప్పటికీ వారి క్రియలే దేవుడు వారికి తెలియదని ఎత్తి చూపుతున్నాయి. వాళ్ళని చూస్తేనే చీదర. వాళ్ళు ఎప్పుడూ తిరగబడే స్వభావం గలవాళ్ళు. దేవుడి కోసం ఏ మంచి పనికీ వాళ్ళు పూనుకోరు.
\s5
\c 2
\p
\v 1 తీతూ, నువ్వు మాత్రం దేవుని గురించిన సత్యాన్ని నమ్మిన ప్రజలు ఎలాటి ప్రవర్తన కలిగి జీవించాలో తప్పక బోధించాలి.
\v 2 అన్ని సమయాల్లో తమని తాము అదుపులో పెట్టుకుంటూ ఉండాలని ముసలివాళ్లైన మగవాళ్ళకు చెప్పు. అలా తమ పొరుగు వారందరి గౌరవం పొందుతూ వాళ్ళు జీవించాలి. వాళ్ళు బుద్ధిగా ప్రవర్తించాలి. దేవుని సత్యానికి సంబంధించిన విషయాలను వాళ్ళు స్థిరంగా నమ్మాలనీ, కల్లాకపటం లేని ప్రేమ చూపుతూ ఉండాలనీ చెప్పు. ఇవన్నీ ఎంత కష్టమైనప్పటికీ తప్పక చేయాలని చెప్పు.
\s5
\p
\v 3 అలానే వృద్దురాళ్ళు కూడా దేవుని పట్ల తమ విధేయత అందరూ తెలుసుకొనేలా జీవించాలి. వారు ఇరుగుపొరుగుపై పుకార్లు పుట్టించే వాళ్ళు కాకూడదని చెప్పు, వాళ్ళకి తాగుడు అలవాటు ఉండకూడదు. దానికి బదులు మేలైన విషయాలను ఇతరులకు నేర్పించే వాళ్లుగా వాళ్ళు ఉండాలి.
\v 4 ఇలా ఉండడంవల్ల యువతులు తమ భర్తలను, పిల్లలను ఎలా ప్రేమించాలో దారి చూపగలుగుతారు.
\v 5 యువతులకు తమ మాటలు, చేతలు అదుపులో ఉంచుకోవడం ముసలివాళ్ళు నేర్పించాలి. మగవాళ్ళ విషయంలో తప్పుగా ప్రవర్తింపక శీలవతులుగా ఉండాలి. చక్కగా ఇంటిపని చక్కబెట్టుకుంటూ తమ భర్తలకు అనుకూలంగా నడుచుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల దేవుని సువార్తకు మనవల్ల చెడ్డపేరు రాకుండా ఉంటుంది.
\s5
\p
\v 6 యువకులు కూడా ఇలాగే తమను తాము అదుపులో ఉంచుకోవాలని ఆదేశించు.
\v 7 నీకు నువ్వుగా మంచి విషయాలను క్రమం తప్పకుండా చేయడం వలన ఇతరులు కూడా నిన్ను చూసి తాము ఏమి చేయాలో తెలుసుకుంటారు. నువ్వు విశ్వాసులకు బోధించేటప్పుడు ఎదుటివారు నిన్ను గౌరవించేలా నిజాలే మాట్లాడు.
\v 8 ఎవరూ విమర్శించడానికి వీలు లేనివిధంగా నీ బోధల ద్వారా సత్యం బోధించు, తద్వారా ఎవరైనా నిన్ను ఆపాలని ప్రయత్నిస్తే మిగిలినవాళ్ళు మనలో ఏ తప్పూ లేదని వాళ్ళని వారించడం ద్వారా వాళ్ళు సిగ్గు పడేలా చేస్తారు.
\s5
\p
\v 9 బానిస విశ్వాసులు ఎప్పుడూ తమ యజమానులకు లోబడి ఉండాలి. తమ యజమానులకు ఎదురు చెప్పకుండా ప్రతి విషయంలోనూ వారిని సంతోషపెడుతూ ఉండాలి వాళ్లతో తగాదాలు పెట్టుకోకూడదు.
\v 10 వాళ్ళు తమ యజమానులకు చెందిన చిన్న చిన్న వస్తువులు కూడా దొంగతనం చెయ్యకూడదు. యజమానులకు నమ్మకంగా పనిచేయాలి. మనల్ని రక్షించిన దేవుని గురించిన ప్రతి బోధా ప్రజల మెప్పు పొందేలా వారి ప్రవర్తన వుండాలి.
\s5
\p
\v 11 విశ్వాసులు ఈ మేలైన మార్గంలో నడుచుకోవాలి. ఎందుకంటే ఎవరికీ అర్హత లేకపోయినా దేవుడు రక్షణ అనే బహుమానాన్ని ప్రతి ఒక్కరికీ ఉచితంగా ఇస్తున్నాడు.
\v 12 దేవుడు ఉచితంగా యిచ్చే బహుమానంగా మనల్ని రక్షిస్తున్నప్పుడే దానితోపాటు ఆయన చెడు ప్రవర్తనలనూ లోకులు చెయ్యడానికి చూసే వాటినీ మానుకోవడం కూడా నేర్పిస్తాడు. మంచి చేసే ఇంగిత జ్ఞానాన్నీ, మనం జీవించి వున్నఈ ప్రస్తుత కాలమంతా ఆయనకు విధేయులై ఉండడాన్నీ ఆయన మనకు నేర్పిస్తాడు.
\v 13 అదే సమయంలో దేవుడు ఏదయితే భవిష్యత్తులో తప్పక చేయబోతున్నాడో ఆ మహా భాగ్యం కోసం మనం ఎదురు చూడాలని కూడా నేర్పిస్తున్నాడు. అదేమిటంటే యేసు క్రీస్తు మన రక్షకుడు, శక్తిశాలి అయిన దేవుడు మహా తేజస్సుతో మన కోసం తిరిగి వస్తాడన్నది.
\s5
\p
\v 14 మనలను విచ్చలవిడి స్వభావం నుండి విడిపించి, పరిశుభ్రపరిచి మనం తనకు ప్రత్యేకమైన ఆస్తిగా, చురుకుగా మంచి చేయడానికి ఆశపడే ప్రజలుగా మనల్ని మలచాలని చూస్తున్నాడు. అందుకోసం చెల్లించవలసిన మూల్యంగా తనకు తానుగా తన ప్రాణాన్ని ఫణంగా పెట్టాడు.
\s5
\v 15 తీతూ, ఈ విషయాలను గురించి చెబుతూ నేను చెప్పిన విధంగా ఉండేలా విశ్వాసులను కోరుతూ వాళ్ళు తప్పు చేసినప్పుడు సరిదిద్దుతూ అవసరమైనప్పుడు వాళ్ళని అదుపు చేయడానికి నీ అధికారాన్ని ఉపయోగించు. నువ్వు చెప్పే వాటిని అందరూ జాగ్రత్తగా వినేలా చూసుకో.
\s5
\c 3
\p
\v 1 తీతూ, మనవాళ్ళు ప్రభుత్వ అధికారుల నియమ నిబంధనలకు సాధ్యమైనంత వరకు లోబడుతూ ఉండాలని గుర్తు చెయ్యి. వాళ్ళు విధేయతగా నడుచుకుంటూ అవకాశం వచ్చినప్పుడల్లా మంచి పనులు చేయడం ఎంతైనా అవసరం.
\v 2 ఎవరి గురించైనా అగౌరవంగా మాట్లాడటం కానీ, వాదనలు పెట్టుకోవడం కానీ వారికి తగదు. ప్రతి ఒక్కరితోనూ మృదువుగా ప్రవర్తిస్తూ, వాళ్ళను తమకంటే ఎక్కువవారిగా చూడాలి.
\s5
\v 3 గతంలో ఈ విషయాలను మనం ఒప్పుకోకుండా మూర్ఖంగా ఉండేవాళ్ళం. మన కోరికలు, ఆనందాల కోసమైన అభిలాషలు, ఇష్టాలు మనలను తప్పుడు మార్గంలోకి నడిపించాయి. వాటికే మనం బానిసలుగా మారిపోయాం. మనం అస్తమానం ఒకరినొకరు ద్వేషించుకుంటూ, కీడు చేసుకున్నాం. అందరూ మనల్ని అసహ్యించుకునేలా చేసుకున్నాం. ఒకరినొకరు అసహ్యించుకున్నాం.
\s5
\p
\v 4 కానీ దేవుడు మన పట్ల ప్రేమ చూపించి ఎంతో ఉదారంగా మనల్ని రక్షించాడు.
\v 5 మన అంతరంగాలను కడిగి, కొత్త జన్మనివ్వడం ద్వారా, పరిశుద్దాత్మ ద్వారా నూతన వ్యక్తులుగా చెయ్యడం ద్వారా మనలను రక్షించాడు. మంచిపనులు చేస్తున్నామని కాదు గానీ ఆయన కనికర సంపన్నుడు గనకనే మనల్ని రక్షించాడు.
\s5
\v 6 యేసు క్రీస్తు మనల్ని రక్షించినప్పుడే దేవుడు తన పరిశుద్దాత్మను మనకు ధారాళంగా ఇచ్చాడు.
\v 7 ఈ బహుమతి ద్వారా మనకీ, ఆయనకీ మధ్య శాంతి సమాధానాలు ఉన్నాయని ప్రకటించాడు. యేసు ప్రభువు ఇచ్చేదాన్ని ముఖ్యంగా ఆయనతో మనకున్న నిత్యజీవాన్ని పంచుకోవడం కోసం ఆయన మనకు పరిశుద్దాత్మను ఇచ్చాడు.
\s5
\p
\v 8 ఈ మాట నమ్మదగినది. ఈ విషయాలను దేవుణ్ణి నమ్మిన వారికి నువ్వు అస్తమానం నొక్కి చెబుతూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఇతరులకు ఉపయోగపడే విధంగా మంచి పనులు అంకితభావంతో చేయగలుగుతారు. ఈ విషయాలు అత్యంత శ్రేష్ఠమైనవి, అందరికీ మేలు కలిగించేవి.
\s5
\p
\v 9 కానీ అర్థం పర్థం లేని వాదనలకూ, యూదు జాతి వంశావళులను గురించిన వాదోపవాదాలకూ, మతసంబంధమైన వివాదాలకు, దూరంగా వుండు. ఈ రకమైన చర్చలు పనికిమాలినవి, ఏ రకంగాను ఉపయోగం లేనివి.
\v 10 నువ్వు ఒకటికి రెండుసార్లు హెచ్చరించినా కూడా వాళ్ళు గొడవలకి దారితీసే వాటినే పదే పదే కోరుకుంటే ఇక వాళ్ళతో నీకు సంబంధం లేదు.
\v 11 ఎందుకంటే ఇలాటి వాళ్ళు సత్యం నుండి దూరంగా వెళ్లిపోయి పాపం చేస్తూ తమకు తామే శిక్ష విధించుకుంటున్నారని నీకు తెలుసు.
\s5
\p
\v 12 అర్తెమానుగాని, తుకికునుగాని నీ దగ్గరకి పంపుతాను. అప్పుడు నువ్వు నికొపొలికి రావడానికి ప్రయత్నం చెయ్యి. ఎందుకంటే నేను అక్కడే చలికాలం గడపాలనుకుంటున్నాను.
\v 13 న్యాయకోవిదుడు జేనాకు , అపోల్లోకు అవసరమైన వాటన్నిటినీ ఇచ్చి వారి ప్రయాణానికి చేయగల సహాయమంతా చెయ్యి.
\s5
\v 14 ఇలాగే మనవాళ్లు తమంతట తామే అవసరతలలో వున్న ప్రజలందరికి మేలు చేసేలా చూడు. ఇలా చేస్తే వాళ్ళ జీవితాలు దేవునికి ఉపయోగకరంగా ఉంటాయి.
\s5
\v 15 తీతూ, నాతో ఉన్నవారందరూ నీకు వందనాలు చెబుతున్నారు. విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని ప్రేమిస్తున్న మన స్నేహితులందరికీ మా నమస్కారాలు. దేవుడు తనదైన గొప్ప కరుణ మన అందరి యెడలా చూపును గాక.

52
58-PHM.usfm Normal file
View File

@ -0,0 +1,52 @@
\id PHM - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h ఫిలేమోనుకు రాసిన పత్రిక
\toc1 ఫిలేమోనుకు రాసిన పత్రిక
\toc2 ఫిలేమోనుకు రాసిన పత్రిక
\toc3 phm
\mt1 ఫిలేమోనుకు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 నేను పౌలును. యేసు క్రీస్తు దాసుడనైనందుకు ఇప్పుడు జైల్లో ఉన్నాను. నాతో మన సాటి విశ్వాసి అయిన తిమోతి కూడా ఉన్నాడు. ఫిలేమోనూ, మేము ప్రేమిస్తున్న క్రీస్తుని నువ్వు కూడా ప్రేమిస్తున్నావని నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను.
\v 2 మన సహ విశ్వాసి అయిన అప్ఫియాను, మనతో కలిసి సైనికుడిలా క్రీస్తుకు సేవ చేస్తున్న అర్ఖిప్పును కూడా మేము అడిగామని చెప్పండి. మీ ఇంట్లో సంఘంగా కలుస్తున్న విశ్వాసులందర్నీ కూడా అడిగినట్టు చెప్పండి.
\v 3 మన తండ్రి అయిన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు కృప మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలనీ, నిత్యమూ శాంతి కలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను.
\s5
\p
\v 4 ఫిలేమోనూ, నా దేవుడికి నేను ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నీ విషయమై కృతజ్ఞతలు చెప్తున్నాను.
\v 5 నువ్వు దేవుణ్ణి, ఆయన ప్రజల్నీఎంతగా ప్రేమిస్తున్నావో, యేసు ప్రభువులో నువ్వు ఎంతగా నమ్మిక ఉంచావో మనవాళ్ళు నాతో చెప్పారు.
\v 6 ఆయన సేవ చేయడం లో క్రీస్తు మాకు ఇస్తున్న మంచి విషయాలన్నీ మాలాగే లోతుగా నువ్వు కూడా పూర్తిగా నమ్మడం వల్ల నీకు బాగా అర్థం కావాలని ప్రార్దిస్తున్నాను.
\p
\v 7 చూడు మిత్రమా, నువ్వు దేవుని ప్రజల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు, ప్రోత్సహిస్తున్నావు అందుకే నేను చాలా సంతోషంగానూ, ఉత్సాహంగానూ ఉంటున్నాను.
\s5
\v 8 అలాగే నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. నేను క్రీస్తుకు అపోస్తులుణ్ణి కాబట్టి నువ్వేం చేయాలో చెప్పే అధికారం నాకు వుందని నమ్ముతున్నాను.
\v 9 కానీ మన ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. నాకా, వయసు పైబడింది. పైగా క్రీస్తుకు దాసుడుగా జైల్లో ఉన్నాను కాబట్టి ఆదేశించడానికి బదులుగా బతిమాలుతున్నాను.
\s5
\p
\v 10 ఇక్కడ జైల్లో ఒకతనికి నేను క్రీస్తుసువార్త చెప్పినప్పుడు అతడు నాకు కొడుకులాగా అయిపోయాడు. అతని పేరు ఒనేసిము. ఆ పేరుకు అర్థం "ఉపయోగకరం" అని నీకు తెలుసు. అతనికి ఎంతో కొంత సాయం చేయమని నిన్ను బతిమాలు తున్నాను.
\v 11 అతడు ఇంతకు ముందైతే నీకు నిష్ప్రయోజకుడు. ఇప్పుడైతే నీకూ నాకూ ఇద్దరికీ ప్రయోజనకారి.
\v 12 నా ఆరోప్రాణమైన అతణ్ణి నీ దగ్గరికి తిరిగి పంపుతున్నాను.
\v 13 సంకెళ్ళలో ఉండి క్రీస్తు సువార్త ప్రకటిస్తున్న నాకు ఈ సమయంలో సాయం చెయ్యడానికి నీకు బదులుగా అతణ్ణి ఉంచుకోవాలనుకున్నాను.
\s5
\v 14 అయినప్పటికీ నీ అనుమతి లేకుండా అలాటిది ఏదయినా చేయడం నాకిష్టం లేదు. ఎలాటి బలవంతం లేకుండా నీకై నువ్వు ఇష్టపూర్వకంగా నాకు సాయపడాలని నా అభిప్రాయం.
\v 15 బహుశా అతడు ఎప్పటికీ నీ దగ్గరే ఉండడానికి కాబోలు దేవుడు కొంతకాలం నీకు దూరంగా ఉండనిచ్చాడు.
\p
\v 16 చూడు ఫిలేమోనూ, అతడు ఇక బానిస కాదు. అంతకంటే ఎక్కువ. ఇప్పుడు అతణ్ణి సాటి విశ్వాసిగా నీవు ప్రేమించవచ్చు. అతడు నాకు చాలా ఇష్టమైన వాడు. నీక్కూడా ప్రియమైన సోదరుడు. ఎందుకంటే అతడిప్పుడు నీ బానిస మాత్రమే కాదు, ప్రభువుకు చెందిన వాడు.
\s5
\p
\v 17 అందుచేత దేవుడు మనకి అప్పజెప్పిన పని విషయంలో నన్ను నీ జత పనివానిగా ఎంచి నన్ను చేర్చుకున్నట్టే అతణ్ణి కూడా నీ ఇంట చేర్చుకో.
\v 18 ఒకవేళ అతడు నీపట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేకపోతే నీకు బాకీ ఉంటే దానికి నేను బాధ్యుణ్ణి, దాన్ని నా లెక్కలో వెయ్యి.
\v 19 పౌలు అనే నేను నా స్వహస్తాలతో ఈ మాట రాస్తున్నాను. ఆ బాకీ ఏదైనా వుంటే నేనే తీరుస్తాను. అయినా నీకు క్రీస్తు సువార్త చెప్పిన వాణ్ణి నేనే కదా. అలా నీ జీవం విషయంలో నువ్వే నాకు బాకీ ఉన్నావని నేను వేరే చెప్పనక్కరలేదు.
\p
\v 20 ఔను సోదరా, ప్రభువులో మన ఇద్దరం ఒక్కటే అని నాకు సంతోషం కలిగించు. క్రీస్తులో నా హృదయానికి సేద తీర్చు.
\s5
\v 21 నువ్వు నా మాట వింటావని నమ్మకంతో రాస్తున్నాను. నేను చెప్పినదాని కంటే నువ్వు ఎక్కువ చేస్తావని కూడా నాకు తెలుసు.
\p
\v 22 సరే. ఇది చేస్తూనే నీ ఇంట్లో ఉండడానికి నా కోసం ఏర్పాట్లు చెయ్యి. ఎందుకంటే మీ ప్రార్థనల ద్వారా దేవుడు నన్నుఈ జైల్లో నుండి విడుదల చేసి మీ దగ్గరికి పంపుతాడనే నమ్మకంతో ఉన్నాను.
\s5
\v 23 క్రీస్తు యేసు కోసం నాతో పాటు ఖైదీగా ఉన్న ఎపఫ్రా మీకు శుభం అని చెప్తున్నాడు.
\p
\v 24 అలానే నా జత పనివారు మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా నీకు సంతోషంతో నమస్కారాలు చెబుతున్నారు.
\v 25 మన ప్రభువైన యేసు క్రీస్తు ఎంత దయామయుడో తెలుసుకుని మీరందరూ నిత్యమూ ఆనందించాలని ప్రార్థిస్తాను. ఆమెన్.

View File

@ -1,3 +1,5 @@
# te_iev
# Telugu IEV
Telugu IEV
STR https://git.door43.org/unfoldingWord/SourceTextRequestForm/issues/349
STR https://git.door43.org/unfoldingWord/SourceTextRequestForm/issues/363

96
manifest.yaml Normal file
View File

@ -0,0 +1,96 @@
dublin_core:
conformsto: 'rc0.2'
contributor:
- 'Acsah Jacob'
- 'Cdr. Thomas Mathew'
- 'Dr. Bobby Chellappan'
- 'Hind Prakash'
- 'Jinu Jacob'
- 'Shojo John'
- 'Vipin Bhadran'
creator: 'Door43 World Missions Community'
description: "An open-licensed translation, intended to provide a 'functional' understanding of the Bible. It increases the translator's understanding of the text by translating theological terms as descriptive phrases."
format: 'text/usfm3'
identifier: 'ust'
issued: '2019-11-29'
language:
identifier: te
title: తెలుగు
direction: ltr
modified: '2019-11-29'
publisher: 'Door43'
relation:
- 'te/obs'
- 'te/obs-tq'
- 'te/ulb'
- 'te/tw'
- 'te/tq'
- 'te/tn'
rights: 'CC BY-SA 4.0'
source:
-
identifier: 'ust'
language: 'en'
version: '4'
subject: 'Bible'
title: 'Indian Easy Version (IEV) Telugu'
type: 'bundle'
version: '4.1'
checking:
checking_entity:
- 'BCS'
- 'Cdr. Thomas Mathew'
- 'Dr. Bobby Chellappan'
checking_level: '3'
projects:
-
title: 'అపోస్తలుల కార్యములు '
versification: ufw
identifier: act
sort: 44
path: ./45-ACT.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'ఎఫెసీయులకు రాసిన పత్రిక '
versification: ufw
identifier: eph
sort: 49
path: ./50-EPH.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'లూకా సువార్త '
versification: ufw
identifier: luk
sort: 42
path: ./43-LUK.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'ఫిలేమోనుకు రాసిన పత్రిక '
versification: ufw
identifier: phm
sort: 57
path: ./58-PHM.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'తీతుకు రాసిన పత్రిక '
versification: ufw
identifier: tit
sort: 56
path: ./57-TIT.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'మార్కు సువార్ '
versification: ufw
identifier: mrk
sort: 41
path: ./42-MRK.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'మత్తయి సువార్ '
versification: ufw
identifier: mat
sort: 40
path: ./41-MAT.usfm
categories: [ 'bible-nt' ]