3.9 KiB
అపొస్తలుల కార్యములు 04 సాధారణ విషయాలు
నిర్మాణము మరియు క్రమము
చదవడానికి సులభముగా ఉండునట్లు వాక్యభాగము ఉన్నట్లుగానే వ్రాయకుండ ప్రతి పంక్తిని పద్యభాగమువలె కొన్ని తర్జుమాలు అమర్చుతూ ఉంటారు. 4:25-26 వచన భాగములో పాతనిబంధననుండి తీసుకొనిన మాటలను యుఎల్.టి పద్యభాగమువలె వ్రాసియున్నది.
ఈ అధ్యాయములో విశేషమైన అంశాలు లేక ఉద్దేశాలు
ఐక్యత
ఆదిమ క్రైస్తవులు ఎక్కువ ఐక్యత కలిగియుండాలని కోరుకొనిరి. వారు ఏమి నమ్మిన ఒకే విధమైన విషయాలను నమ్మాలని మరియు వారి స్వంతవాటిని ఇతరులతో పంచుకోవాలని మరియు అవసరములోనున్నవారికి సహాయము చేయాలని ఆశను కలిగియుండిరి.
“సూచక క్రియలు మరియు మహత్కార్యములు”
ఈ మాట కేవలము దేవుడు మాత్రమే చేయగల కార్యములను సూచించుచున్నది. దేవుడు చేయగలిగిన వాటినే దేవుడు చేయాలని క్రైస్తవులు కోరుకొనిరి, తద్వారా యేసు నిజ దేవుడని చెప్పే విషయాలను ప్రజలు నమ్ముతారని విశ్వసించియుండిరి.
ఈ అధ్యాయములో చాలా ప్రాముఖ్యమైన అలంకారములు
మూలరాయి
ప్రజలు భవనమును కట్టుటకు ఆరంభించినప్పుడు మొట్ట మొదటిగా వేసే మొదటి రాయి మూల రాయియైయున్నది. ఏవైనా ఒక దాని మీద ఆధారపడే దేనికైనా చాలా ప్రాముఖ్యముగా ఎంచే రూపకఅలంకారమైయున్నది. సంఘమునకు మూల రాయి యేసు అని చెప్పడమన్నది యేసు కంటే మరి ఎక్కువ ప్రాముఖ్యమైనది సంఘములో మరి ఏదియు లేదని అర్థము మరియు సంఘమును గూర్చిన ప్రతియొక్క విషయం యేసు మీదనే ఆధారపడియుండును. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///tw/dict/bible/kt/faith]])
ఈ అధ్యాయములో ఇతర తర్జుమాపరమైన క్లిష్ట భాగములు
నామము
”మనము రక్షణ పొందుటకు ఆకాశము క్రింద మనుష్యులాలో ఏ నామము లేదు” ([అపొ.కార్య.4:12] (../../అపొ.కార్య./04/12.ఎం.డి.)). ఈ మాటలతో భూమి మీద ఇతర ఏ మనుష్యుడు ప్రజలను రక్షించలేడు లేక ఇతర ఏ మనుష్యుడు ప్రజలను రక్షించగలడా అని పేతురు చెప్పుచున్నాడు.