Door43-Catalog_te_tn/mat/08/04.md

2.4 KiB

యేసు కుష్టురోగిని బాగు చేసిన సంఘటన వివరాలు కొనసాగుతున్నాయి.

● వాని

కుష్ఠురోగం ఉన్న మనిషి.

● ఎవరితోనూ ఏమియూ చెప్పకు

ఆ మనిషి తాను కానుకలు ఇచ్చే సమయంలో యాజకునితో మాట్లాడాలి, అయితే యేసు జరిగిన సంగతిని ఎవరితోనూ చెప్పవద్దని అంటున్నాడు. దీన్ని ఇలా అనువదించ వచ్చు "ఎవరికీ ఏమీ చెప్పొద్దు" లేక "నేను నిన్ను బాగు చేసానని ఎవరికీ చెప్పొద్దు" అని రాయొచ్చు. (అతిశయ వాక్యాలు చూడండి.).

● నీ దేహాన్ని యాజకునికి కనపరచుకుని

యూదుల ఆచారం ప్రకారం ఒక మనిషి తన శరీరం (చర్మం). బాగైన విషయాన్ని యాజకునికి తెలిపిన తర్వాత అతడిని ఇతరులతో కలిసి జీవించడానికి అనుమతిస్తారు.

● వారికి సాక్ష్యార్దమై కనపరచుకుని మోషే నియమించిన కానుకలను సమర్పించుమని

మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక మనిషికి కుష్టు రోగం బాగైన తర్వాత అతడు తన కృతజ్ఞతార్పణలను యాజకుడికి ఇవ్వాలి. యాజకుడు వాటిని తీసుకుంటే ఆ మనిషి బాగైనట్టు అందరికి తెలుస్తుంది.

● వారికి

దీనర్ధం 1). యాజకులు లేక 2). ప్రజలు లేక 3). యేసును విమర్శించేవారు. అవకాశముంటే ఈ ముగ్గురిని ఉద్దేశించే సర్వనామాన్ని రాయండి.(సందిగ్దత చూడండి).