te_ulb/67-REV.usfm

991 lines
162 KiB
Plaintext

\id REV Revelation
\s5
\c 1
\s ముందు మాటలు
\p
\v 1 ఇది త్వరలో జరగాల్సిన సంగతుల్ని యేసుక్రీస్తు తన దాసులకు చూపించడం కోసం దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దేవదూతను పంపి తన దాసుడైన యోహానుకు ఈ సంగతుల్ని తెలియజేశాడు.
\v 2 యోహాను దేవుని వాక్కును గురించీ యేసు క్రీస్తు సాక్ష్యాన్ని గురించీ తాను చూసిన దానంతటికీ సాక్షిగా ఉన్నాడు.
\v 3 ఈ ప్రవచన వాక్యాల్ని బిగ్గరగా చదివేవాడూ, వాటిని వినే వారూ, వాటి ప్రకారం నడచుకునే వారూ ధన్య జీవులు. ఎందుకంటే సమయం దగ్గర పడింది.
\s5
\p
\v 4 ఆసియాలో ఉన్న ఏడు సంఘాలకు శుభాకాంక్షలతో యోహాను రాస్తున్న సంగతులు. పూర్వం ఉండి, ప్రస్తుతం ఉంటూ, భవిష్యత్తులో వచ్చే వాని నుండీ, ఆయన సింహాసనం ముందు నిలబడే ఏడు ఆత్మల నుండీ,
\v 5 నమ్మకమైన సాక్షీ, చనిపోయిన వారిలో నుండి ప్రథముడిగా లేచిన వాడూ, భూరాజులందరి పరిపాలకుడూ అయిన యేసు క్రీస్తు నుండీ కృపా, శాంతీ మీకు కలుగుతాయి గాక.
\v 6 ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం వల్ల మనల్ని మన పాపాల నుండి విడిపించాడు. మనల్ని తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగానూ, యాజకులుగానూ చేశాడు. ఆయనకు కీర్తియశస్సులూ, అధికారమూ కలకాలం ఉంటాయి గాక!
\s5
\v 7 చూడండి! ఆయన మేఘం పై ఎక్కి వస్తున్నాడు. ఆయన్ని ప్రతి కన్నూ చూస్తుంది. ఆయన్ని పొడిచిన వారు కూడా చూస్తారు. భూమిపై ఉన్న జనాలందరూ ఆయన్ని చూసి గుండెలు బాదుకుంటారు.
\p
\v 8 "ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండీ, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. అమిత శక్తి గలవాణ్ణి" అని ప్రభువు అంటున్నాడు.
\s పత్మస్ లో యోహానుకు క్రీస్తు విశ్వరూపం
\s5
\p
\v 9 మీ సోదరుణ్నీ, యేసు క్రీస్తు కోసం కలిగే హింసలోనూ, రాజ్యంలోనూ, ఓర్పు లోనూ మీలో ఒకడినీ అయిన యోహాను అనే నేను దేవుని వాక్కు కోసం, యేసు క్రీస్తు సాక్ష్యం కోసం పత్మసు ద్వీపంలో ఉన్నాను.
\v 10 ప్రభువు దినాన నేను దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు భేరీ నాదం లాంటి ఒక పెద్ద స్వరం
\v 11 నా వెనక వినిపించింది, "నువ్వు చూస్తున్నది ఒక పుస్తకంలో రాయి. దానిని ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్‌, ఫిలదెల్ఫియ, లవొదికయలలో ఉన్న ఏడు సంఘాలకు పంపు" అని చెప్పడం విన్నాను.
\s5
\v 12 అది వింటూనే 'ఎవరిదీ స్వరం?' అని చూడడానికి వెనక్కి తిరిగాను. అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను.
\v 13 ఆ ఏడు బంగారు దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుని లాంటి వ్యక్తిని చూశాను. పాదాలను తాకుతున్న ఒక పొడవాటి అంగీని ఆయన ధరించాడు. రొమ్ముకు బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు.
\s5
\v 14 ఆయన తలా, తల వెంట్రుకలూ ఉన్ని లాగా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి.
\v 15 ఆయన పాదాలు కొలిమిలో కాలి తళతళ మెరుస్తున్న కంచులా ఉన్నాయి. ఆయన కంఠ స్వరం వేగంగా పడుతున్న మహా జలపాతం ధ్వనిలా ఉంది.
\v 16 ఆయన కుడిచేతిలో ఏడు నక్షత్రాలున్నాయి. ఆయన నోటినుండి పదునైన రెండు అంచుల కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితోనూ, గొప్ప వెలుగుతోనూ ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది.
\s5
\v 17 నేను ఆయన్ను చూడగానే నిశ్చేష్టుడనై ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడిచేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు. "భయపడకు, మొదటి వాణ్ణీ చివరి వాణ్ణీ నేనే.
\v 18 జీవిస్తున్న వాణ్ణీ నేనే. చనిపోయాను కానీ కలకాలం జీవించే ఉన్నాను. మరణానికీ, పాతాళ లోకానికీ తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి.
\s5
\v 19 ఇప్పుడు నువ్వు చూసిన సంగతుల్నీ, ప్రస్తుతమున్న సంగతుల్నీ, వీటి తర్వాత జరుగబోయే సంగతుల్నీ రాయి.
\v 20 నా కుడిచేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రాలు, ఆ ఏడు బంగారు దీపస్తంభాల రహస్యం ఇది, ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతలు, ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.
\s5
\c 2
\s ఎఫెసులో ఉన్న సంఘానికి లేఖ
\p
\v 1 ఎఫెసులో ఉన్న సంఘం దూతకు ఇలా రాయి. 'తన కుడిచేతిలో ఏడు నక్షత్రాల్ని పట్టుకుని ఏడు దీపస్తంభాల మధ్య తిరిగేవాడు చెప్పే విషయాలు ఏవంటే,
\v 2 నువ్వు చేస్తున్న పనులూ, నువ్వు పడుతున్న కష్టమూ, నీ ఓర్పూ నాకు తెలుసు. నువ్వు దుర్మార్గుల్ని సహించలేవనీ, అపోస్తలులు కాకుండానే మేము అపోస్తలులం అని చెప్పుకుంటూ తిరిగే వారిని పరీక్షించి వారు మోసగాళ్ళని పసిగట్టావనీ నాకు తెలుసు.
\s5
\v 3 ఎంతో ఓర్పుతో నువ్వు నా నామం కోసం ప్రయాస పడుతూ అలసి పోలేదనీ నాకు తెలుసు.
\v 4 అయినా నీకు వ్యతిరేకంగా ఒక నింద వేయాలి. మొదట్లో నీకున్న ప్రేమను నువ్వు వదిలి వేశావు.
\v 5 కాబట్టి ఎంత ఉన్నత స్థాయి నుండి నువ్వు పడిపోయావో గుర్తు చేసుకో. పశ్చాత్తాప పడి ప్రారంభంలో చేసిన పనులు చెయ్యి. అలా చేసి నువ్వు మారితే సరి. లేకపోతే నేను వచ్చి నీ దీప స్తంభాన్ని అక్కడ నుండి తీసివేస్తాను.
\s5
\v 6 అయితే నీలో ఈ విషయం ఉంది. నీకొలాయితులు అనే వారి పనుల్ని నువ్వు అసహ్యించుకుంటున్నావు. ఆ పనులంటే నాకూ అసహ్యమే.
\v 7 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక! జయించే వాణ్ణి దేవుని పరమ నివాసంలో ఉన్న జీవవృక్ష ఫలాల్ని తిననిస్తాను'.
\s స్ముర్నలో ఉన్న సంఘానికి లేఖ
\s5
\p
\v 8 స్ముర్నలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి, 'మొదటివాడూ, చివరివాడూ, చనిపోయి తిరిగి బతికిన వాడు చెప్తున్నదేమిటంటే
\v 9 నువ్వు పడుతున్న హింసలూ, నీ పేదరికమూ నాకు తెలుసు. కానీ నువ్వు ధనవంతుడివే. మేము యూదులమే అని పైకి అంటున్నా నిజానికి సాతాను సమాజానికి చెందినవారు నిన్నెలా అపనిందల పాలు చేస్తున్నారో నాకు తెలుసు.
\s5
\v 10 నీకు కలగబోయే కష్టాలను గురించి భయపడవద్దు. విను, మిమ్మల్ని పరీక్షించడానికి సాతాను మీలో కొందరిని చెరసాలలో వేయించ బోతున్నాడు. పది రోజులు హింస ఉంటుంది. చనిపోయేంత వరకూ నమ్మకంగా ఉండు. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను.
\v 11 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక!. జయించే వాడికి రెండో మరణం ఏ హానీ చేయలేదు'.
\s పెర్గములో ఉన్న సంఘానికి లేఖ
\s5
\p
\v 12 పెర్గములో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. రెండు వైపులా పదునున్న కత్తి కలవాడు చెప్తున్న సంగతులు
\v 13 నీ నివాసం సాతాను సింహాసనం ఉన్న చోట ఉంది అని నాకు తెలుసు. అయినా నా పేరును నువ్వు గట్టిగా పట్టుకున్నావు. సాతాను నివసించే ఆ స్థలంలో నా కోసం సాక్ష్యం చెప్పిన అంతిపా అనే నా విశ్వాసిని చంపిన రోజుల్లో కూడా నువ్వు నీ విశ్వాసాన్ని వదల్లేదు.
\s5
\v 14 అయినా నువ్వు చేస్తున్న కొన్ని తప్పుల్ని నేను ఎత్తి చూపాల్సిందే. అవేవంటే ఇశ్రాయేలీయులు విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేలా, వ్యభిచారం చేసేలా వారిని తప్పుదారి పట్టించమని బాలాకుకు నూరిపోసిన బిలాము బోధను తు.చ. తప్పకుండా పాటించేవాళ్ళు నీలో ఉన్నారు.
\v 15 అలాగే నీకొలాయితుల బోధను అనుసరించే వాళ్ళు కూడా నీలో ఉన్నారు.
\s5
\v 16 కాబట్టి పశ్చాత్తాపపడు. లేకపోతే నీ దగ్గరకు త్వరగా వస్తాను. నా నోటి నుండి బయటకు వస్తున్న కత్తితో వాళ్ళతో యుద్ధం చేస్తాను.
\v 17 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక!. జయించే వాడిని దాచి ఉంచిన మన్నాను తిననిస్తాను. అంతే కాకుండా అతనికి తెల్ల రాయిని ఇస్తాను. ఆ రాతిమీద ఒక కొత్త పేరు రాసి ఉంటుంది. ఆ పేరు పొందిన వాడికే అది తెలుస్తుంది, గానీ ఇంకెవరికీ తెలియదు.
\s తుయతైరలో ఉన్న సంఘానికి లేఖ
\s5
\p
\v 18 తుయతైరలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. అగ్నిజ్వాలల్లాటి కళ్ళూ, మెరుస్తున్న కంచు లాంటి పాదాలూ కలిగిన దైవ పుత్రుడు చెప్పే సంగతులు ఏమిటంటే
\v 19 నీ పనులూ, నీ ప్రేమా, నీ విశ్వాసమూ, నీ సేవా, నీ ఓర్పూ అన్నీ నాకు తెలుసు. ప్రారంభంలో నువ్వు చేసిన పనుల కంటే ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులు ఎక్కువని నాకు తెలుసు.
\s5
\v 20 అయినా నీ మీద ఒక తప్పు ఎత్తి చూపాలి. అదేమిటంటే 'నేను ప్రవక్తని' అని చెప్పుకుంటున్న యెజెబెల్ అనే స్త్రీని నువ్వు సహిస్తున్నావు. ఆమె తన బోధతో నా దాసులకు వ్యభిచారం చేయడం, విగ్రహాలకు అర్పించిన వాటిని తినడం నేర్పిస్తూ వారిని మోసం చేస్తూ ఉంది.
\v 21 పశ్చాత్తాప పడడానికి నేను ఆమెకు సమయమిచ్చాను కానీ ఆమె వ్యభిచారం విడిచి పశ్చాత్తాప పడటానికి ఇష్టపడలేదు.
\s5
\v 22 ఇదిగో విను, నేను ఆమెను జబ్బుపడి మంచం ఎక్కేలా చేస్తాను. ఆమెతో వ్యభిచారం చేసిన వాళ్ళు పశ్చాత్తాప పడాల్సిందే. లేకపోతే వారు తీవ్రమైన హింసలు పడేలా చేస్తాను.
\v 23 ఆమె పిల్లల్ని కచ్చితంగా చంపుతాను. దాని వల్ల అంతరంగాలనూ, హృదయాలనూ పరిశీలించే వాణ్ణి నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. మీలో ప్రతి ఒక్కరికీ వారు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాను.
\s5
\v 24 అయితే తుయతైరలో మిగిలినవారు, అంటే ఈ బోధను అంగీకరించకుండా, సాతాను లోతైన విషయాలు మాకు తెలియదని చెప్పే వారందరితో 'ఇక మరే భారమూ మీ మీద పెట్టను' అని చెప్తున్నాను.
\v 25 నా రాక వరకూ మీకు ఉన్నదాన్నే గట్టిగా పట్టుకోండి.
\s5
\v 26 జయిస్తూ, నేను చేసిన పనుల్ని చివరి వరకూ చేసేవాడికి జాతులపై అధికారం ఇస్తాను.
\v 27 అతడు ఇనుప దండంతో వారిని పరిపాలిస్తాడు. వారిని మట్టి కుండను పగలగొట్టినట్లుగా ముక్కలుచెక్కలు చేస్తాడు.
\v 28 తండ్రి నాకు ఇచ్చినట్లుగా నేనూ అతనికి ఉదయ తారను ఇస్తాను.
\v 29 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక!.
\s5
\c 3
\s సార్దీస్‌లో ఉన్న సంఘానికి లేఖ
\p
\v 1 సార్దీస్‌లో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. ఏడు నక్షత్రాలూ దేవుని ఏడు ఆత్మలూ ఉన్నవాడు చెప్పే విషయాలు, నీ పనులు నాకు తెలుసు. బ్రతికి ఉన్నావనే పేరుమాత్రం నీకుంది గానీ నువ్వు చచ్చినవాడివే .
\v 2 జాగ్రత్త పడు. చావడానికి సిద్ధంగా ఉన్న మిగిలిన వాటిని బలపడేలా చెయ్యి. ఎందుకంటే నీ పనులు నా దేవుని ముందు నాకు సంపూర్ణంగా కన్పించడం లేదు.
\s5
\v 3 కాబట్టి నీవు ఉపదేశం ఎలా పొందావో, ఎలా విన్నావో జ్ఞాపకం చేసుకో. దానినే స్వీకరించి పశ్చాత్తాప పడు. నువ్వు మేలుకొనక పోతే, నేను దొంగలా వస్తాను. ఏ సమయంలో వస్తానో నీకు ఎంతమాత్రం తెలియదు.
\v 4 అయితే సార్దీస్ లో నీ దగ్గర ఉన్నవారిలో కొందరు తమ బట్టలు మురికి చేసుకోలేదు. వాళ్ళు యోగ్యులు. కాబట్టి వాళ్ళు తెల్లటి బట్టలు వేసుకుని నాతో కలసి నడుస్తారు.
\s5
\v 5 జయించే వాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలోనుండి అతని పేరుని నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ముందూ, ఆయన దూతల ముందూ అతడి పేరు ఒప్పుకుంటాను.
\v 6 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక!.
\s ఫిలదెల్ఫియలో ఉన్న సంఘానికి లేఖ
\s5
\p
\v 7 ఫిలదెల్ఫియలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. సత్యం మూర్తీభవించిన వాడూ, పరిశుద్ధుడూ, దావీదు తాళం చెవులుని చేత పట్టుకున్న వాడు, తెరిచాడంటే ఎవరూ మూయలేరు, మూశాడంటే ఎవరూ తీయలేరు. అలాటి ఈయన చెప్పే విషయాలేమిటంటే
\v 8 నీ పనులు నాకు తెలుసు. చూడు, నీ ఎదుట తలుపు తీసి ఉంచాను. దానిని ఎవరూ మూయలేరు. నీ బలం స్వల్పమే అయినా నా వాక్కుకు విధేయత చూపావు. నా నామాన్ని తిరస్కరించలేదు.
\s5
\v 9 సాతాను సమాజానికి చెందినవారై ఉండి మేము యూదులమే అని అబద్దమాడే వారిని రప్పిస్తాను. వాళ్ళు వచ్చి నీ కాళ్లపై పడి నీకు నమస్కారం చేస్తారు. నేను నిన్ను ప్రేమించానని వారికి అర్థం అయేలా చేస్తాను.
\v 10 ఓర్పుతో సహించాలన్న నా ఆదేశానికి నువ్వు కట్టుబడి ఉన్నావు. కాబట్టి భూమిపై నివసించే వారిని పరిశోధించడానికి లోకం మీదికి రాబోయే పరీక్షా కాలంలో నేను నిన్ను కాపాడుతాను.
\v 11 నేను త్వరగా వస్తున్నాను. నీ కిరీటాన్ని ఎవరూ తీసుకోకుండా నీకున్న దాన్ని గట్టిగా పట్టుకో.
\s5
\v 12 జయించే వాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. అందులోనుండి అతడు ఇక ఎప్పటికీ బయటకు వెళ్ళడు. నా దేవుని పేరునీ, పరలోకంలో నా దేవుని దగ్గరనుండి వస్తున్న నా దేవుని పట్టణమైన కొత్త యెరూషలేము పేరునీ, నా కొత్త పేరునీ అతనిపై రాస్తాను.
\v 13 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక!.
\s లవొదికయలో ఉన్న సంఘానికి లేఖ
\s5
\p
\v 14 లవొదికయలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. ఆమేన్‌ అనే పేరున్న వాడూ, నమ్మకమైన సత్యసాక్షీ, దేవుని సృష్టికి మూలం అయిన వాడూ చేసే ప్రకటన ఏమిటంటే
\v 15 నీ పనులు నాకు తెలుసు. నువ్వు చల్లగా లేవు, వేడిగా కూడా లేవు. నువ్వు చల్లగానో, వేడిగానో ఉంటే మంచిది.
\v 16 నువ్వు చల్లగానైనా వేడిగానైనా ఉండకుండా గోరువెచ్చగా ఉన్నావు. కాబట్టి నేను నిన్ను నా నోటినుండి ఉమ్మిలా ఊసేద్దామనుకుంటున్నాను.
\s5
\v 17 'నేను ఆస్తిపరుణ్ణి, నా డబ్బు పెరిగిపోతూ ఉంది, నాకే లోటూ లేదు' అని నువ్వు చెప్పుకుంటున్నావు. కానీ నీకు తెలియనిదేమిటంటే నువ్వో నిర్భాగ్యుడివి, దీనావస్థలో ఉన్నావు, దరిద్రుడివి, గుడ్డివాడివి. బట్టలు లేవు.
\v 18 నా సలహా విను, నీకు సంపద పెరగడానికై కొలిమిలో కరగబెట్టిన బంగారాన్నీ, నీ నగ్నత్వం కన్పించి నీ సిగ్గు పోకుండా ఉండటానికై తెల్లని వస్త్రాలనూ, నీఉ చూడగలిగేలా కళ్ళకు మందు నా దగ్గర కొనుక్కో.
\s5
\v 19 నేను ప్రేమించే వారిని మందలిస్తాను. శిక్షణనిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.
\v 20 చూడండి, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు కొడుతున్నాను. ఎవరైనా నా మాట విని తలుపు తీస్తే నేను ఇంట్లోకి వస్తాను. నేను అతనితో కలసి భోజనం చేస్తాను. అతడూ నాతో కలసి భోజనం చేస్తాడు.
\s5
\v 21 నేను విజయం సాధించి నా తండ్రితో కలసి ఆయన సింహాసనం మీద కూర్చున్నట్లే జయించేవాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోనిస్తాను.
\v 22 చెవులు ఉన్నవాడు దేవుని ఆత్మ సంఘాలతో చెప్పే మాట వింటాడు గాక!.
\s5
\c 4
\s పరలోక దర్శనం: దేవుని సింహాసనం
\p
\v 1 ఇదంతా జరిగాక నేను చూస్తూ ఉన్నాను. అప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరచుకుని ఉంది. నేను ఇంతకు ముందు విన్న స్వరం భేరీ నాదంలా నాతో మాట్లాడుతుంటే విన్నాను. ఆ స్వరం "పైకి రా. తర్వాత జరగాల్సినవి నీకు చూపిస్తాను" అని వినిపించింది.
\v 2 వెంటనే నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్లాను. అప్పుడు పరలోకంలో వేసి ఉన్న ఒక సింహాసనాన్నీ, ఆ సింహాసనంపై కూర్చున్న ఒక వ్యక్తినీ చూశాను.
\v 3 అలా కూర్చున్న వ్యక్తి చూడటానికి సూర్యకాంత మణిలా, కెంపులా ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తూ ఒక రంగుల విల్లు ఆవరించి ఉంది.
\s ఇరవై నలుగురు పెద్దలూ, నాలుగు జీవులూ
\s5
\p
\v 4 ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు వేరే సింహాసనాలున్నాయి. వాటిమీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి.
\v 5 ఆ సింహాసనం నుండి మెరుపులు, ఏవో శబ్దాలు, ఉరుములూ వస్తున్నాయి. సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.
\s5
\v 6 ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికం లాటి సముద్రంలా ఉంది. ముందూ వెనుకా కన్నులు ఉన్న నాలుగు ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి.
\s5
\v 7 మొదటి ప్రాణి సింహంలా ఉంది. రెండోది దూడలా ఉంది. మూడో ప్రాణికి మనిషి ముఖం లాటి ముఖం ఉంది. నాల్గో ప్రాణి ఎగురుతూ ఉన్న డేగలా ఉంది.
\s పెద్దల, జీవుల ఆరాధన
\p
\v 8 ఈ నాలుగు ప్రాణులలో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెప్తున్నాయి, "పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ భవిష్యత్తులో వచ్చేవాడూ, సర్వాన్నీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!"
\s5
\v 9 ఆ ప్రాణులు సింహాసనం పై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వానికి యశస్సూ, కీర్తీ, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు
\v 10 ఆ ఇరవై నాలుగు మంది పెద్దలూ సింహాసనం పై కూర్చున్న వాని ముందు సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ శాశ్వతంగా జీవిస్తున్న వాని ముందు సాష్టాంగ పడి
\v 11 "మా ప్రభూ, మా దేవా! నువ్వు యశస్సూ, కీర్తీ, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి" అని చెప్తూ తమ కిరీటాల్ని ఆ సింహాసనం ముందు వేశారు.
\s5
\c 5
\s ఏడు సీళ్లు వేసి ఉన్న గ్రంథం
\p
\v 1 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన చేతిలో ఏడు ముద్రలతో గట్టిగా మూసి ఉన్న ఒక గ్రంథాన్ని చూశాను. ఆ గ్రంథం బయటా లోపలా రాసి ఉంది.
\v 2 దృఢమైన ఒక దేవదూత "ఆ గ్రంథం ముద్రలు తీసి దాన్ని తెరవగలిగే యోగ్యుడు ఎవరు?" అని బిగ్గరగా ప్రకటన చేస్తుంటే చూశాను.
\s5
\v 3 కానీ ఆ గ్రంథాన్ని తెరవడానికైనా, చూడటానికైనా భూమి మీదా భూమి కిందా ఎవరికీ సామర్థ్యం లేకపోయింది.
\v 4 ఆ గ్రంథాన్ని తెరవడానికైనా చూడటానికైనా సామర్థ్యం కలవాళ్ళు ఎవరూ కనబడక పోవడంతో నేను వెక్కి వెక్కి ఏడ్చాను.
\v 5 అప్పుడు ఆ పెద్దలలో ఒకడు నాతో, "ఏడవకు, చూడు, ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథాన్ని తెరవడానికి యూదా గోత్ర సింహమూ , దావీదు వేరూ అయిన వ్యక్తి జయించాడు" అన్నాడు.
\s క్రీస్తు ఆ గ్రంథం విప్పడం
\s5
\p
\v 6 సింహాసనానికీ ఆ నాలుగు ప్రాణులకూ పెద్దలకూ మధ్యలో గొర్రెపిల్ల నిలబడి ఉండటం నేను చూశాను. ఆ గొర్రెపిల్ల వధ అయిన గొర్రెపిల్లలా ఉంది. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములూ, ఏడు కళ్ళూ ఉన్నాయి. ఆ కళ్ళు భూమి అంతటికీ వెళ్ళిన దేవుని ఏడు ఆత్మలు.
\v 7 గొర్రెపిల్ల వచ్చి సింహాసనంపై కూర్చున్న ఆయన కుడిచేతిలో నుండి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు.
\s మనుషుల విమోచనకై పెద్దల ఆరాధన
\s5
\p
\v 8 ఆ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు ప్రాణులూ, ఇరవై నలుగురు పెద్దలూ ఆ గొర్రెపిల్ల ముందు సాష్టాంగపడ్డారు. ఆ ఇరవై నలుగురు పెద్దల చేతుల్లో తీగ వాయిద్యం, ధూపంతో నిండి ఉన్న బంగారు పాత్రలూ ఉన్నాయి. ఆ ధూపం పరిశుద్ధుల ప్రార్థనలు.
\s5
\v 9 ఆ పెద్దలు " ఆ గ్రంథాన్ని పట్టుకుని దాని ముద్రలు తెరవడానికి నువ్వు సమర్థుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతీ భాష మాట్లాడేవారి నుండీ, ప్రతీ జాతి నుండీ, ప్రతీ జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషుల్ని కొన్నావు.
\v 10 మా దేవుడికి సేవ చేయడానికి వారిని ఒక రాజ్యంగానూ, యాజకులుగానూ చేశావు. కాబట్టి వాళ్ళు భూలోకాన్ని పరిపాలిస్తారు" అంటూ ఒక కొత్త పాట పాడారు.
\s5
\v 11 ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణుల్నీ, పెద్దలనీ ఆవరించి ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య కోట్లకొలదిగా ఉంది.
\v 12 వారు "వధ అయిన గొర్రెపిల్ల ప్రభావమూ, ఐశ్వర్యమూ, జ్ఞానమూ, బలమూ, ఘనతా, యశస్సూ, ప్రశంసా పొందడానికి యోగ్యుడు" అని పెద్ద స్వరంతో చెప్తూ ఉన్నారు.
\s5
\v 13 అప్పుడు పరలోకంలోనూ, భూమి పైనా, భూమి కిందా, సముద్రం లోనూ సృష్టి అయిన ప్రతి ప్రాణీ, వాటిలోనిదంతా "సింహాసనంపై కూర్చున్న ఆయనకూ, గొర్రెపిల్లకూ ప్రశంసా, ఘనతా, యశస్సూ, పరిపాలించడానికి అధికారమూ కలకాలం కలుగుతాయి గాక!" అనడం నేను విన్నాను.
\v 14 ఆ నాలుగు ప్రాణులూ "ఆమేన్‌" అని చెప్పాయి. ఆ పెద్దలు సాగిలపడి పూజించారు.
\s5
\c 6
\s సీళ్లు విప్పడం. మొదటిది.
\p
\v 1 ఆ గొర్రెపిల్ల ఆ ఏడింటిలో మొదటి ముద్ర తెరవడం చూశాను. అప్పుడు ఆ నాలుగు ప్రాణులలో ఒకటి గర్జిస్తున్నట్లుగా "ఇలా రా" అనడం విన్నాను.
\v 2 నేను అటు చూస్తుంటే అక్కడ ఒక తెల్లని గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న ఆశ్వికుని చేతిలో ఒక విల్లు ఉంది. అతనికి ఒక కిరీటం ఇచ్చారు. అతడు జయిస్తూ ఇంకా జయించడానికి బయలుదేరాడు.
\s రెండో సీలు: యుద్ధాలు
\s5
\p
\v 3 గొర్రెపిల్ల రెండో ముద్ర తెరచినప్పుడు రెండో ప్రాణి "ఇలా రా" అనడం విన్నాను.
\v 4 అప్పుడు ఎర్రగా ఉన్న మరో గుర్రం బయల్దేరింది. దాని పైన కూర్చున్న ఆశ్వికుడికి పెద్ద కత్తి ఇచ్చారు. మనుషులు ఒకరినొకరు హతం చేసుకునేలా భూమి పైన శాంతిని తీసివేయడానికి అతనికి అనుమతి ఉంది.
\s మూడవ సీలు: కరువుకాటకాలు
\s5
\p
\v 5 ఆ తర్వాత గొర్రెపిల్ల మూడో ముద్ర తెరిచాడు. అప్పుడు "ఇలా రా" అని మూడవ ప్రాణి పిలవడం విన్నాను. నేను అప్పుడు ఒక నల్లని గుర్రం చూశాను. దానిమీద కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు పట్టుకుని ఉన్నాడు.
\v 6 నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం "రోజు కూలికి ఒక కిలో గోధుమలూ, రోజు కూలికి మూడు కిలోల బార్లీ గింజలు, ఇక నూనెనీ, ద్రాక్షారసాన్నీ పాడు చేయవద్దు" అని పలకడం విన్నాను.
\s నాలుగో సీలు: మరణం
\s5
\p
\v 7 గొర్రెపిల్ల నాల్గో ముద్ర తెరచినప్పుడు "ఇలా రా" అని నాల్గో ప్రాణి చెప్పడం విన్నాను.
\v 8 అప్పుడు బూడిద రంగులో పాలిపోయినట్లు ఉన్న ఒక గుర్రం కనిపించింది. దాని మీద కూర్చున్న వాడి పేరు మరణం. పాతాళం వాడి వెనుకే వస్తూ ఉంది. కత్తితో, కరువుతో, వ్యాధులతో, క్రూరమృగాలతో చంపడానికి భూమి మీద నాలుగో భాగంపై అతనికి అధికారం ఇవ్వడం జరిగింది.
\s ఐదవ సీలు: హతసాక్షులు
\s5
\p
\v 9 ఆయన అయిదో ముద్రను తెరచినప్పుడు దేవుని వాక్కు కోసమూ, తమ సాక్ష్యం కారణంగానూ హతమైన వారి ఆత్మలను ఒక బలి పీఠం కింద చూశాను.
\v 10 వారు బిగ్గరగా ఇలా అరుస్తున్నారు, " సర్వాధికారీ, పరిశుద్ధుడా, సత్యవంతుడా, ఎంతకాలం ఇలా తీర్పు తీర్చకుండా ఉంటావు? మా రక్తానికి ప్రతిగా భూమిపై ఉన్న వారిని శిక్షించకుండా ఎంతకాలం ఉంటావు?"
\v 11 అప్పుడు వారిలో ప్రతి ఒక్కరికీ తెల్లని దుస్తులు ఇచ్చారు. "మీలాగే హతం కావాల్సిన మీ తోటి సేవకుల, సోదర సోదరీల లెక్క మొత్తం పూర్తి అయేంతవరకూ ఇంకా కొంత సమయం వేచి ఉండాలి" ని వారికి చెప్పడం జరిగింది.
\s అరవ సీలు: ఆకాశం లో ఉత్పాతాలు
\s5
\p
\v 12 ఆయన ఆరవ ముద్ర తెరచినప్పుడు నేను చూస్తూ ఉండగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు గొంగళిలాగా నల్లగా మారిపోయాడు. చంద్రబింబం రక్తంలా ఎర్రగా అయింది.
\v 13 పెనుగాలి వీచినప్పుడు అంజూరు చెట్టునుండి పచ్చి కాయలు రాలినట్టుగా ఆకాశం లోని నక్షత్రాలు భూమి పైన రాలాయి.
\v 14 ఆకాశమంతా చుట్టిన కాగితంలా అదృశ్యమై పోయింది. పర్వతాలూ, ద్వీపాలూ అన్నీ వాటి వాటి స్థానాల నుండి కదిలిపోయాయి.
\s5
\v 15 ఇంకా భూమి మీద ఉన్న రాజులూ, ప్రముఖులూ, సేనాధిపతులూ, సంపన్నులూ, శక్తిమంతులూ, ఇంకా బానిసలూ, స్వేచ్ఛాజీవులూ అంతా పర్వతాలమీదా రాళ్ళ సందుల్లోనూ, గుహల్లోనూ దాక్కున్నారు.
\v 16 వాళ్ళు ఆ రాళ్ళతోనూ పర్వతాలతోనూ ఇలా అన్నారు, "మీరు మా మీద పడండి! సింహాసనం పై కూర్చున్న ఆయన ముఖ కాంతి నుండీ గొర్రెపిల్ల తీవ్ర ఆగ్రహం నుండీ మమ్మల్ని దాచిపెట్టండి.
\v 17 వారి మహా ఉగ్రత దినం వచ్చేసింది. వారికి ఎదురుగా ఎవరు నిలబడగలరు?" అంటూ పర్వతాలనూ, రాళ్ళనూ బతిమాలుకున్నారు.
\s5
\c 7
\s అదనపు వివరణ
\p
\v 1 ఈ సంగతులు జరిగిన తర్వాత భూమి నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలబడి ఉండటం నేను చూశాను. వాళ్ళు భూమి మీద నాలుగు వైపుల్నించి వీయాల్సిన గాలి వీయకుండా బలంగా అడ్డుకున్నారు. దాంతో భూమిమీద గానీ, సముద్రం మీద గానీ, ఏ చెట్టు మీద గానీ గాలి వీయడం లేదు.
\v 2 మరొక దూత తూర్పు దిక్కు నుండి పైకి లేవడం నేను చూశాను. అతనికి సజీవ దేవుని ముద్ర ఉంది. భూమికీ సముద్రానికీ హాని చేయడానికి అనుమతి ఉన్న మొదటి నలుగురు దూతలతో అతడు బిగ్గరగా
\v 3 "మేము మా దేవుని దాసుల నుదిటిపై ముద్ర వేసేంత వరకూ భూమికీ, సముద్రానికీ, చెట్లకూ ఎలాంటి హానీ చేయవద్దు" అన్నాడు.
\s ఇశ్రాయేలు లో శేషించిన వారి లెక్క
\s5
\p
\v 4 ముద్ర పొందిన వారి సంఖ్య చెప్తుంటే నేను విన్నాను. ఇశ్రాయేల్ వారి గోత్రాలన్నిటిలో ముద్ర పొందినవారి సంఖ్య 1,44,000.
\p
\v 5 గోత్రాల వారీగా ముద్ర పొందిన వారి సంఖ్య.యూదా గోత్రంలో 12,000, రూబేను గోత్రంలో 12,000, గాదు గోత్రంలో 12,000,
\p
\v 6 ఆషేరు గోత్రంలో 12,000, నఫ్తాలి గోత్రంలో 12,000, మనష్షే గోత్రంలో 12,000,
\s5
\p
\v 7 షిమ్యోను గోత్రంలో 12,000, లేవి గోత్రంలో 12,000, ఇశ్శాఖారు గోత్రంలో 12,000,
\p
\v 8 జెబూలూను గోత్రంలో 12,000, యోసేపు గోత్రంలో 12,000, బెన్యామీను గోత్రంలో 12,000.
\s మహా బాధల కాలంలో నుండి వచ్చిన యూదేతరులు
\s5
\p
\v 9 ఆ తర్వాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండటం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వారిలో ప్రతీ జాతినుండీ, ప్రతీ వంశం నుండీ, ప్రతీ గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషలలో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు.
\v 10 వీళ్ళంతా కలసి " రక్షణ సింహాసనం పై కూర్చున్న మా దేవునికీ, గొర్రెపిల్లకీ చెందేది," అంటూ దిక్కులు పిక్కటిల్లేలా చెప్పారు.
\s5
\p
\v 11 దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ముందు సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి
\p
\v 12 "ఆమేన్! మా దేవునికి కీర్తీ, యశస్సూ, జ్ఞానమూ, కృతజ్ఞతలూ, ఘనతా, అధికారమూ, మహా బలమూ కలకాలం కలుగుతాయి గాక" అని చెప్తూ దేవుణ్ణి పూజించారు.
\s5
\p
\v 13 అప్పుడు ఆ పెద్దలలో ఒకతను "తెల్లటి వస్త్రాలు వేసుకున్న వీళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?" అని నన్ను అడిగాడు.
\v 14 అందుకు నేను "అయ్యా, నీకే తెలుసు" అని జవాబిచ్చాను. అప్పుడు అతను నాతో ఇలా చెప్పాడు, "వీళ్ళంతా మహా బాధలలో నుండి వచ్చినవారే. వీళ్ళు గొర్రెపిల్ల రక్తంలో తమ బట్టలు ఉతుక్కున్నారు. వాటిని తెల్లగా చేసుకున్నారు.
\s5
\v 15 అందుకే వాళ్ళు దేవుని సింహాసనం ఎదుట ఉండి పగలూ రాత్రీ తేడా లేకుండా ఆయన ఆలయంలో ఆయనకు సేవలు చేస్తూ ఉన్నారు. సింహాసనంపై కూర్చున్న ఆయన వారి మీద తన గుడారాన్ని కప్పుతాడు.
\v 16 వారికి ఇకముందు ఆకలి గానీ దాహం గానీ వేయదు. ఎండ గానీ వడగాలి గానీ వారికి తగలదు.
\v 17 ఎందుకంటే సింహాసనం మధ్యలో కూర్చున్న గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉంటాడు. జీవమిచ్చే నీటి ఊటల వద్దకు వారిని నడిపిస్తాడు. వారి కళ్ళలో నుండి కారే ప్రతీ కన్నీటి చుక్కనూ ఆయనే తుడిచివేస్తాడు".
\s5
\c 8
\s ఏడవ సీలు, అందులో ఉన్న ఏడు బాకా నాదాలు
\p
\v 1 ఆయన ఏడో ముద్ర తెరచినప్పుడు పరలోకంలో దాదాపు అరగంట సేపు నిశ్శబ్దం అలుముకుంది.
\s ఏడు బాకాలు
\p
\v 2 అప్పుడు నేను దేవుని సమక్షంలో నిలబడే ఏడుగురు దేవదూతల్ని చూశాను. వారికి ఏడు బాకాలు ఇచ్చారు.
\s5
\v 3 మరో దూత ధూపం వేసే బంగారు పాత్ర చేత్తో పట్టుకుని వచ్చి బలిపీఠం ముందు నిల్చున్నాడు. సింహాసనం ఎదుట ఉన్న బంగారు బలిపీఠం పై పరిశుద్ధుల ప్రార్ధనలతో కలపడానికి చాలా పరిమళ సాంబ్రాణి అతనికి ఇచ్చారు.
\v 4 అప్పుడు ఆ దూత చేతిలోనుండి పరిమళ వాసనలు, సాంబ్రాణి పొగ పరిశుద్ధుల ప్రార్ధనలతో కలసి పైకి లేచి దేవుని సమక్షంలోకి వెళ్ళాయి.
\v 5 ఆ దూత ధూపం వేసే పాత్రను తీసుకుని, బలిపీఠం పైన ఉన్న నిప్పు కణికలతో దాన్ని నింపి భూమి మీదకు విసిరి వేశాడు. అప్పుడు గర్జనలాంటి శబ్దాలూ, ఉరుములూ, మెరుపులూ, భూకంపమూ కలిగాయి.
\s5
\v 6 అప్పుడు ఏడు బాకాలు పట్టుకొన్న ఆ ఏడుగురు దూతలు వాటిని ఊదడానికి సిద్ధం అయ్యారు.
\s బాకానాదాల తీర్పులు. మొదటిది
\p
\v 7 మొదటి దూత బాకా ఊదినప్పుడు రక్తంతో కలసిన వడగళ్ళూ నిప్పూ భూమి మీద కురిశాయి. దాని మూలంగా భూమి మీద మూడో భాగం, చెట్లలో మూడో భాగం తగలబడి పోయాయి. పచ్చగడ్డి అంతా తగలబడిపోయింది.
\s రెండవ బాకా
\s5
\p
\v 8 రెండో దూత బాకా ఊదినప్పుడు భగభగ మండుతూ ఉన్న ఒక పెద్ద కొండ లాంటిది సముద్రంలో పడింది. దాని మూలంగా సముద్రంలో మూడో భాగం రక్తం అయిపోయింది.
\v 9 సముద్రం లోని ప్రాణులలో మూడో భాగం చచ్చిపోయాయి. ఓడలలో మూడోభాగం నాశనం అయ్యాయి.
\s మూడవ బాకా
\s5
\p
\v 10 మూడో దూత బాకా ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రం అగ్నిగోళంలా మండిపోతూ ఆకాశం నుండి రాలి పోయింది. అది భూమి మీద ఉన్న నదుల్లో మూడో భాగం పైనా, నీటి ఊటల పైనా పడింది.
\v 11 ఆ నక్షత్రం పేరు "చేదు." కాబట్టి నీళ్ళలో మూడో భాగం చేదై పోయాయి. నీళ్ళు చేదై పోవడం వల్ల చాలా మంది చచ్చిపోయారు.
\s నాలుగవ బాకా
\s5
\p
\v 12 నాలుగో దూత బాకా ఊదినప్పుడు సూర్యుడిలో మూడో భాగం, చంద్రుడిలో మూడోభాగం, నక్షత్రాలలో మూడోభాగం దెబ్బ తిన్నాయి. కాబట్టి వాటిలో మూడోభాగం కాంతి విహీనం అయ్యాయి, చీకటిగా మారాయి. దాంతో పగలు మూడో భాగం, రాత్రి మూడో భాగం వెలుగు లేకుండా పోయింది.
\s5
\v 13 తర్వాత గాలిలో ఎత్తుగా ఎగిరిపోతున్న ఒక పెద్ద డేగను నేను చూశాను. అది ఎగురుతూ "ఇంకా బాకాలు ఊదబోతున్న మిగిలిన ముగ్గురు దేవదూతల బాకా శబ్దాలను బట్టి భూమిపై నివసించే వారికి అయ్యో, ఎంత యాతన, ఎంత యాతన, ఎంత యాతన!" అంటూ బిగ్గరగా అరుస్తుంటే విన్నాను.
\s5
\c 9
\s ఐదవ బాకా: మొదటి యాతన
\p
\v 1 ఇక ఐదవ దూత బాకా ఊదాడు. అప్పుడు ఆకాశం నుండి భూమిమీద పడిన ఒక నక్షత్రాన్ని చూశాను. అడుగు లేని అగాధం తాళం చెవులు ఆ నక్షత్రానికి ఇవ్వడం జరిగింది.
\v 2 అతడు అంతు లేని ఆ అగాథాన్ని తెరిచాడు. బ్రహ్మాండమైన కొలిమిలో నుండి లేచినట్లుగా దట్టమైన పొగ ఆ అగాథంలోనుండి లేచింది. ఆ పొగ వల్ల సూర్యగోళం నల్లబడి చీకటి కమ్మింది. గాలి కూడా నల్లబడింది.
\s5
\v 3 ఆ పొగలో నుండి మిడతల దండు భూమి మీదకు వచ్చి పడింది. భూమిపైన ఉండే తేళ్ళకు ఉన్న శక్తి లాంటి శక్తి వాటికి ఇవ్వడం జరిగింది.
\v 4 నుదిటి మీద దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన గడ్డికి గానీ, మొక్కలకు గానీ, చెట్లకు గానీ ఎలాంటి హానీ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఉంది.
\s5
\v 5 ఆ మిడతలకు ఐదు నెలల వరకూ వేధించడానికి అధికారం ఇచ్చారు. కానీ చంపడానికి మాత్రం వాటికి అధికారం లేదు. వాటి వల్ల కలిగే వేదన తేలు కుట్టినపుడు కలిగే వేదనలా ఉంటుంది.
\v 6 ఆ రోజుల్లో మనుషులు చావుని వెదుకుతారు కానీ అది వారికి దొరకదు. చావాలని కోరుకుంటారు కానీ మరణం వారి దగ్గర్నుంచి పారిపోతుంది.
\s5
\v 7 ఆ మిడతలు చూడటానికి యుద్ధానికి సిద్ధం చేసిన గుర్రాల్లా ఉన్నాయి. వాటి తలల పై బంగారు కిరీటాల్లాంటివి మెరుస్తూ ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల్లాంటివి.
\v 8 వాటికి వెంట్రుకలున్నాయి. అవి స్త్రీల తలవెండ్రుకల్లా ఉన్నాయి. వాటి పళ్ళు సింహం కోరల్లా ఉన్నాయి.
\v 9 ఇనుప కవచం లాంటి ఛాతీ కవచాలు వాటికి ఉన్నాయి. అసంఖ్యాకమైన గుర్రాలూ, రథాలూ యుద్ధానికి పరిగెడుతుంటే విన్పించే ధ్వనిలా వాటి రెక్కల చప్పుడు వినిపిస్తుంది.
\s5
\v 10 ప్రతీదానికీ తేళ్ళలా తోకా, కొండీ ఉన్నాయి. తమ తోకలతో ఐదు నెలల వరకూ మనుషులకు హాని చేయడానికి వాటికి అధికారం ఉంది.
\v 11 వాటి పైన ఒక రాజు ఉన్నాడు. వాడు అగాధ దూత. వాడి పేరు హీబ్రూ భాషలో అబద్దోను. గ్రీకు భాషలో అపోల్యోను ('విధ్వంసకుడు' అని ఈ పేరుకి అర్థం).
\v 12 మొదటి యాతన ముగిసింది. ఈ విషయాలు జరిగిన తర్వాత మరో రెండు యాతనలు కలుగుతాయి.
\s ఆరవ బాకా
\s5
\p
\v 13 ఆరవ దూత బాకా ఊదాడు. అప్పుడు దేవుని ముందు ఉన్న బంగారు బలిపీఠం కొమ్ముల నుండి ఒక స్వరం వినిపించింది.
\v 14 ఆ స్వరం "మహా నది యూఫ్రటీసు దగ్గర బంధించిన నలుగురు దూతలను విడిచి పెట్టు" అని బాకా పట్టుకొని ఉన్న ఆరో దూతతో చెప్పడం విన్నాను.
\v 15 మనుష్యులలో మూడో భాగాన్ని చంపివేయడానికి ఆ గంట కోసం, అ రోజు కోసం, ఆ నెల కోసం, ఆ సంవత్సరం కోసం సిద్ధపరచిన ఆ నలుగురు దూతల్ని విడిచిపెట్టారు.
\s5
\v 16 సైన్యంలో అశ్విక దళం సంఖ్య ఇరవై కోట్లు. వారి సంఖ్య ఇది అని నేను విన్నాను.
\v 17 నా దర్శనంలో ఈ గుర్రాలను గూర్చీ, వాటిపైన ఉన్న సైనిక దళం గూర్చీ నేనేం చూశానంటే, గుర్రాలూ, సైనికులూ ధరించిన కవచాలు నిప్పులాటి ఎరుపూ, చిక్కటి నీలం, గంధకంలాటి పసుపు రంగుల్లో ఉన్నాయి. ర్రాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. అవి తమ నోళ్ళలో నుండి అగ్నీ, పొగా, గంధకమూ వెళ్ళగక్కుతున్నాయి.
\s5
\v 18 వాటి నోళ్లలోనుండి బయటకు వస్తున్న అగ్నీ, పొగా, గంధకమూ అనే మూడు అనర్థాల వలన మనుషులలో మూడో వంతు జనాభా చనిపోయారు.
\v 19 ఆ గుర్రాల బలం వాటి నోళ్ళలోనూ తోకలలోనూ ఉంది. ఎందుకంటే ఆ తోకలు పాముల్లా ఉన్నాయి. అవి తమ తలలతో మనుషుల్ని గాయపరుస్తాయి.
\s5
\v 20 ఈ కీడుల చేత చావకుండా మిగిలిన మానవాళి పశ్చాత్తాప పడ లేదు. తమ చేతులతో చేసిన, చూడటానికీ, వినడానికీ, నడవడానికీ శక్తి లేని బంగారంతో, వెండితో, కంచుతో, రాయితో, కర్రతో చేసిన విగ్రహాలనూ, దయ్యాలనూ పూజించడం వారు మానలేదు.
\v 21 అలాగే వారు సాగిస్తున్న నరహత్యల్నీ, మాయమంత్రాల్నీ, వ్యభిచారాలనూ, దొంగతనాలనూ విడిచిపెట్టి పశ్చాత్తాప పడలేదు.
\s5
\c 10
\s అదనపు వివరణ దర్శనాలు: మహా ప్రతాపశాలి, చిన్న పుస్తకం
\p
\v 1 మహా బలవంతుడైన మరో దూత పరలోకం నుండి రావడం నేను చూశాను. ఆయన మేఘాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు. ఆయన తలపై రంగుల విల్లు ఉంది. ఆయన వదనం సూర్యబింబంలా ఉంది. ఆయన కాళ్ళు అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.
\v 2 ఆయన చేతిలో చుట్టిన ఒక చిన్న పత్రం ఉంది. అది తెరచి ఉంది. ఆయన తన కుడికాలు సముద్రం పైనా ఎడమకాలు భూమి పైనా ఉంచాడు.
\s5
\v 3 తర్వాత ఆయన ఒక పెద్ద కేక వేసాడు. ఆ కేక సింహం గర్జించినట్లుగా ఉంది. ఆయన వేసిన కేక వెనుకే ఏడు ఉరుముల శబ్దాలు పలికాయి.
\v 4 ఆ ఏడు ఉరుముల శబ్దాలు పలికిన తర్వాత నేను రాయడానికి మొదలుపెట్టాను. కానీ పరలోకం నుండి "ఏడు ఉరుములు పలికిన విషయాల్ని రహస్యంగా ఉంచు. వాటిని రాయవద్దు" అంటూ నాకో స్వరం వినిపించింది.
\s5
\v 5 అప్పుడు సముద్రం పైనా, భూమి పైనా నిలబడి ఉన్న ఆ దూత తన కుడి చేతిని ఆకాశం వైపు ఎత్తాడు.
\v 6 పరలోకాన్నీ, భూమినీ, సముద్రాన్నీ, వాటిలో ఉన్నవాటినన్నిటినీ సృష్టించి శాశ్వతంగా జీవిస్తున్న దేవుని పేరున ఇలా శపథం చేశాడు.
\v 7 "ఇక ఆలస్యం ఉండదు. ఏడో దూత బాకా ఊదబోయే రోజున బాకా ఊదబోతుండగా దేవుడు తన దాసులకూ, ప్రవక్తలకూ ప్రకటించిన దైవ మర్మం నెరవేరుతుంది."
\s5
\v 8 అప్పుడు పరలోకం నుండి నేను విన్న ఆ స్వరం తిరిగి, "సముద్రం పైనా భూమిపైనా నిలిచిన ఆ దూత చేతి నుండి తెరచి ఉన్న పత్రాన్ని తీసుకో" అని నాకు చెప్పాడు.
\v 9 నేను ఆ దూత దగ్గరకు వెళ్లి ఆ చిన్న పత్రాన్ని నాకిమ్మని అడిగాను. దానికాయన "ఈ పత్రం తీసుకుని తిను. అది నీ కడుపుకు చేదుగా ఉంటుంది. నీ నోటికి మాత్రం అది తేనెలా తియ్యగా ఉంటుంది" అన్నాడు.
\s యోహాను చిన్న పుస్తకాన్ని తినడం
\s5
\p
\v 10 అప్పుడు నేను దూత చేతిలోనుండి ఆ చిన్న పత్రాన్ని తీసుకుని తినేశాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది కానీ అది కడుపులోకి వెళ్ళాక కడుపంతా చేదు అయింది.
\v 11 అప్పుడు కొన్ని స్వరాలు నాకిలా చెప్పాయి, "నువ్వు అనేకమంది ప్రజలనుగూర్చీ, జాతులను గూర్చీ, వివిధ భాషలు మాట్లాడే వారిని గూర్చీ, రాజులను గూర్చీ మళ్ళీ ప్రవచించాలి."
\s5
\c 11
\s యూదేతరుల కాలం
\p
\v 1 కొలబద్దలా ఉపయోగించడానికి ఒక చేతి కర్రను నాకిచ్చారు. అప్పుడు దేవదూత నాతో ఇలా అన్నాడు. "నువ్వు లే. దేవుని ఆలయం, బలిపీఠం కొలతలు తీసుకో. ఆలయంలో ఎంతమంది ఆరాధిస్తున్నారో లెక్క పెట్టు.
\v 2 ఆలయం బయటి ఆవరణం మాత్రం కొలవకు. అది యూదేతరులది. వాళ్ళు నలభై రెండు నెలల పాటు ఈ పరిశుద్ధ పట్టణాన్ని తమ కాళ్ళ కింద తొక్కుతారు.
\s ఇద్దరు సాక్షులు 42 నెలల కార్యకలాపాలు
\s5
\p
\v 3 నా యిద్దరు సాక్షులు గోనెపట్ట కట్టుకుని 1260 రోజులు దేవుని మాటలు ప్రకటించడానికి వారికి అధికారం ఇస్తాను."
\v 4 భూమికి ప్రభువైన దేవుని సన్నిధిలో ఉండే రెండు అలీవ్ చెట్లు, రెండు దీపస్తంభాలు వీరే.
\v 5 ఎవరైనా వీరికి హాని చేయాలని చూస్తే, వారి నోటినుండి అగ్ని జ్వాలలు బయల్దేరి వారి శత్రువులను దహించి వేస్తాయి. కాబట్టి ఎవరైనా హాని చేయాలని చూస్తే వారికి అలాంటి మరణమే కలగాలి.
\s5
\v 6 తాము ప్రవచించే రోజుల్లో వాన కురవకుండా ఆకాశాన్ని మూసి ఉంచే అధికారం వారికి ఉంటుంది. అలాగే తాము తలచుకున్నపుడల్లా నీటిని రక్తంగా చేయడానికీ అన్ని రకాల పీడలతో భూమిని వేధించడానికీ వారికి అధికారం ఉంది.
\v 7 వారు తమ సాక్ష్యాన్ని ప్రకటించి ముగించగానే అగాధంలో నుండి వచ్చే కౄర మృగం వారితో యుద్ధం చేస్తుంది. వారిని ఓడించి చంపుతుంది.
\s5
\v 8 వారి మృత దేహాలు ఆ మహా పట్టణం వీధుల్లో పడి ఉంటాయి. ఆ పట్టణానికి ఉపమాన రూపకంగా ఈజిప్టు, సోదొమ అనే పేర్లు ఉన్నాయి. ఇక్కడే వారి ప్రభువును కూడా సిలువ వేసి చంపారు.
\v 9 మనుషులలో, అన్ని జాతుల వాళ్ళలో, రకరకాల భాషలు మాట్లాడే వాళ్ళలో, తెగల వాళ్ళలో కొందరు వీరి మృత దేహాల్ని చూస్తూ మూడున్నర రోజులు వీరిని సమాధిలో పెట్టనివ్వరు.
\s5
\v 10 ఈ ఇద్దరు ప్రవక్తలు భూమిపై నివసించే వారిని వేధించారు కనుక వారికి పట్టిన గతిని చూసి వాళ్ళంతా సంతోషిస్తారు. సంబరాలు చేసుకుంటారు. ఒకరికొకరు బహుమానాలు పంపుకుంటారు.
\v 11 కాని మూడున్నర రోజులైన తర్వాత దేవుని దగ్గర నుండి జీవాన్నిచ్చే ఊపిరి వచ్చి వారిలో ప్రవేశిస్తుంది. వారు తమ కాళ్ళపై లేచి నిలబడతారు. ఇది చూసిన వారికి విపరీతమైన భయం కలుగుతుంది.
\v 12 అప్పుడు "ఇక్కడికి పైకి రండి" అని ఒక స్వరం బిగ్గరగా తమకు చెప్పడం వారు విని మేఘాలపై ఎక్కి పరలోకానికి వెళ్ళిపోతారు. వారు వెళ్తుండగా వారి శత్రువులు వారిని చూస్తారు.
\s రెండవ యాతన
\s5
\p
\v 13 సరిగ్గా ఆ గంటలోనే ఒక మహా భూకంపం వస్తుంది. దాని మూలంగా పట్టణంలో పదో భాగం కూలిపోతుంది. ఆ భూకంపం లో ఏడు వేలమంది చచ్చిపోతారు. చావకుండా మిగిలి ఉన్న వారు భయకంపితులై పరలోకంలో ఉన్న దేవుణ్ణి కీర్తిస్తారు.
\v 14 రెండో యాతన ముగిసింది. ఇప్పుడు మూడో యాతన త్వరలో ప్రారంభం కానుంది.
\s రెండవ వివరణ దర్శనం సమాప్తం. ఏడవ బాకా
\s5
\p
\v 15 ఏడో దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి. "ఈ లోక రాజ్యం మన దేవుని రాజ్యమూ , ఆయన అభిషిక్తుడైన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన కలకాలం పరిపాలన చేస్తాడు."
\s5
\v 16 అప్పుడు దేవుని ముందు సింహాసనాలపై కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలూ దేవునికి సాష్టాంగ పడి నమస్కారం చేశారు.
\v 17 "ప్రభువైన దేవా, అన్నిటి పైన పరిపాలకుడా! పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా, నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు.
\s5
\v 18 జనాలకు క్రోధం పెరిగిపోయింది. కాని నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. చనిపోయిన వారికి తీర్పు చెప్పడానికీ, నీ సేవకులైన ప్రవక్తలకీ పరిశుద్ధులకీ గొప్పవారైనా అనామకులైనా నీ పేరు అంటే భయభక్తులు ఉన్న వారికి పారితోషికాలు ఇవ్వడానికీ, భూమిని నాశనం చేసే వారిని లేకుండా చేయడానికీ సమయం వచ్చింది" అన్నారు.
\s5
\v 19 అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరుచుకుంది. దేవుని నిబంధన పెట్టె అందులో కనిపించింది. అప్పుడు మెరుపులూ, గొప్ప శబ్దాలూ, ఉరుములూ, భూకంపమూ కలిగాయి. పెద్ద వడగళ్ళు పడ్డాయి.
\s5
\c 12
\s ఏడుగురు వ్యక్తులు. 1. స్త్రీ - ఇశ్రాయేలు
\p
\v 1 అప్పుడు పరలోకంలో ఒక గొప్ప సంకేతం కనిపించింది. సూర్యుణ్ణి ధరించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్ర బింబం ఉంది. ఆమె తలపై ఉన్న కిరీటంలో పన్నెండు నక్షత్రాలున్నాయి.
\v 2 ఆమె నిండు చూలాలు. పురిటి నొప్పులకు తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది.
\s 2. సాతాను
\s5
\p
\v 3 ఇంతలో పరలోకంలో మరో సంకేతం కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి.
\v 4 వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాలలో మూడో భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదకు విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగి వేయాలన్నది వాడి ఉద్దేశం.
\s 3. మగ బిడ్డ- క్రీస్తు
\s5
\p
\v 5 ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఇనుప దండం పట్టుకుని జాతులన్నిటిపై పరిపాలన చేయాల్సి ఉంది. ఆమె బిడ్డను ఆమె దగ్గర్నుంచి లాక్కుని దేవుని దగ్గరకూ, ఆయన సింహాసనం దగ్గరకూ తీసుకు వెళ్ళారు.
\v 6 ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది. అక్కడ ఆమెను 1260 రోజులు ఉంచి పోషించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.
\s 4. ప్రధాన దూత- మిఖాయేలు
\s5
\p
\v 7 అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేసారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి పోరాటం చేసాడు.
\v 8 కానీ గెలవడానికి వాడి బలం చాలలేదు. కాబట్టి పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర దూతలకీ స్థానం లేకపోయింది.
\v 9 ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వీడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. వీణ్ణీ వీడితో పాటు వీడి అనుచర గణాన్నీ భూమి మీదకు తోసి వేశారు.
\s5
\v 10 అప్పుడు పరలోకం నుండి బిగ్గరగా ఒక స్వరం వినపడింది. "మన సోదరుల్ని నిందించే వాడూ, పగలనీ రాత్రనీ లేకుండా దేవుని ముందు మన సోదరులపై నేరం మోపే వాడైన అపవాదిని భూమి మీదికి తోసేశారు. కాబట్టి ఇక మన దేవుని రక్షణా, శక్తీ, రాజ్యమూ వచ్చేశాయి. ఆయన అభిషిక్తుడైన క్రీస్తు అధికారమూ వచ్చింది.
\s5
\v 11 వారు గొర్రెపిల్ల రక్తం తోనూ, తమ సాక్ష్యాలతోనూ వాణ్ణి జయించారు. మరణం వచ్చినా సరే, తమ ప్రాణాలను ప్రేమించలేదు.
\v 12 కాబట్టి పరలోకమూ, పరలోకంలో నివసించే వారూ, సంబరాలు చేసుకోండి. భూమీ, సముద్రమా, మీకు యాతన. ఎందుకంటే అపవాది మీ వద్దకు దిగి వచ్చాడు. వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. ఎందుకంటే తన సమయం కొంచెమే అని వాడు తెలుసుకున్నాడు.
\s మహా బాధల కాలంలో సాతాను, ఇశ్రాయేలు
\s5
\p
\v 13 తనను భూమి పైకి తోసివేయడాన్ని చూసి ఆ మహాసర్పం, మగబిడ్డను ప్రసవించిన ఆ స్త్రీని హింసించాలని చూశాడు .
\v 14 కానీ అరణ్యంలో తనకు సిద్ధం చేసిన చోటుకు వెళ్ళడానికి ఆమె డేగ రెక్కల్లాంటి రెక్కలు పొందింది. అక్కడ సర్పానికి అందుబాటులో లేకుండా ఒక కాలం, కాలాలు, ఒక అర్థకాలం ఆమెకు పోషణ ఏర్పాటయింది.
\s5
\v 15 కాబట్టి ఆ స్త్రీ నీళ్ళల్లో కొట్టుకుపోవాలని ఆ సర్పం తన నోటి నుండి నీటిని నదీ ప్రవాహంగా వెళ్ళగక్కాడు.
\v 16 కానీ భూమి ఆ స్త్రీకి సహాయం చేసింది. అది నోరు తెరచి ఆ మహాసర్పం నోటినుండి వచ్చిన నదీ ప్రవాహాన్ని మింగి వేసింది.
\s 5. ఇశ్రాయేలులో శేషించిన వారు
\p
\v 17 అందుచేత తీవ్రమైన ఆగ్రహం తెచ్చుకున్న ఆ మహా సర్పం, దేవుని ఆదేశాలు పాటిస్తూ యేసును గురించి ప్రకటిస్తూ ఉన్న ఆమె సంతానంలో మిగిలిన వారితో యుద్ధం చేయడానికి బయల్దేరాడు.
\v 18 దానికోసం ఆ మహా సర్పం సముద్ర తీరంలో ఇసుక తిన్నెలపై నిలబడింది.
\s5
\c 13
\s 6. సముద్రంలో నుండి వచ్చిన మృగం- క్రీస్తువిరోధి
\p
\v 1 తర్వాత క్రూర మృగం ఒకటి సముద్రం లోనుండి బయటకు రావడం చూశాను. దానికి పది కొమ్ములూ, ఏడు తలలూ ఉన్నాయి. దాని కొమ్ములపై పది కిరీటాలున్నాయి. దాని తలల మీద దేవుణ్ణి అవమానపరిచే పేర్లు ఉన్నాయి.
\v 2 నేను చూసిన ఆ మృగం చిరుత పులిలా ఉంది. దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలాగానూ దాని నోరు సింహం నోరులాగానూ ఉన్నాయి. ఆ మహాసర్పం ఈ మృగానికి తన శక్తినీ, తన సింహాసనాన్నీ, పాలించే అధికారాన్నీ ఇచ్చాడు.
\s5
\v 3 దాని తలలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుగా కనిపించింది. అయితే ఆ గాయం మానిపోయింది. భూమిపైన మనుషులందరూ ఆశ్చర్యచకితులై ఆ మృగం వెంటపడి వెళ్ళారు.
\v 4 ఆ మృగానికి అధికారమిచ్చాడని వారంతా మహాసర్పానికి కూడా పూజలు చేశారు. "ఈ మృగంలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఇతనితో యుద్ధం చేయగలవారెవరు?" అని చెప్పుకుంటూ వారంతా మృగానికి కూడా పూజలు చేశారు.
\s5
\v 5 బడాయి మాటలూ దైవ దూషణలూ చేసే నోరూ వాడికి ఉంది. నలభై రెండు నెలలు అధికారం చలాయించడానికి వాడికి అనుమతి ఉంది.
\v 6 కాబట్టి దేవుణ్ణి దూషించడానికీ, ఆయన పేరునీ, ఆయన నివాస స్థలాన్నీ, పరలోకంలో నివసించే వారినందరినీ దూషించడానికి వాడు నోరు తెరిచాడు.
\s5
\v 7 ఇంకా పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని జయించడానికి వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. ప్రతీ వంశం పైనా, ప్రజల పైనా, భిన్నమైన భాషలు మాట్లాడేవారిపైనా, ప్రతీ జాతి పైనా అధికారం వాడికివ్వడం జరిగింది.
\v 8 భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధ అయిన గొ ర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో పేర్లు లేని వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు.
\s5
\v 9 చెవులు ఉన్నవాడు వింటాడు గాక!
\v 10 బానిసత్వం లోకి తీసుకు వెళ్ళాలి అనుకునే వాడు బానిసగా వెళ్తాడు, కత్తితో చంపే వాణ్ణి కత్తితోనే చంపాలి. పరిశుద్ధులైన వారు ఈ విషయంలో సహనమూ, విశ్వాసమూ కలిగి ఉండాలి.
\s భూమిలో నుండి వచ్చిన మృగం- అబద్ధ ప్రవక్త
\s5
\p
\v 11 అప్పుడు భూమిలో నుండి మరో క్రూరమైన మృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలా మాట్లాడుతూ ఉన్నాడు.
\v 12 వాడు మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని వాడి ముందే ప్రదర్శిస్తూ ఉన్నాడు. ప్రాణాంతకమైన దెబ్బ తగిలి పూర్తిగా నయమైన మొదటి మృగాన్ని భూమీ, దానిలో నివసించే వారంతా పూజించేలా చేశాడు.
\s5
\v 13 వాడు అనేకమైన చిత్రవిచిత్రాలు చేశాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేశాడు.
\v 14 తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమి మీద అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని పెట్టాలని వాడు అందరికీ చెప్తూ ఉన్నాడు.
\s5
\v 15 పైగా ఆ మృగం విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ వాడికి అధికారం ఇవ్వడం జరిగింది.
\v 16 వాడు ఇంకా తమ కుడిచేతిపై గానీ నుదుటిపై గానీ ముద్ర వేయించుకోవాలని ప్రముఖులనూ, అనామకులనూ, ధనవంతులనూ, నిరుపేదలనూ, స్వతంత్రులనూ, బానిసలనూ అందర్నీ బలవంతం చేశాడు.
\v 17 ఆ ముద్ర, అంటే ఆ మృగం పేరు గానీ వాడి సంఖ్య గానీ లేకుండా ఎవరికైనా అమ్మడం గానీ కొనడం గానీ అసాధ్యం చేశాడు.
\s5
\v 18 ఇందులో జ్ఞానం ఉంది. వివేకి అయినవాడు ఆ మృగం సంఖ్యను లెక్కించాలి. అది మనిషి సంఖ్య. వాడి సంఖ్య 666.
\s5
\c 14
\s అదనపు వివరణ దర్శనాలు- గొర్రెపిల్ల తో లక్షా నలభై నాలుగు వేల మంది
\p
\v 1 తర్వాత నేను చూస్తూ ఉన్నాను. నాకు ఎదురుగా సీయోను పర్వతం పైన గొర్రెపిల్ల నిలబడి ఉండటం నాకు కనిపించింది. ఆయనతో కూడా 1,44,000 మంది ఉన్నారు. వారందరి నొసళ్ళపై ఆయన పేరూ, ఆయన తండ్రి పేరూ రాసి ఉన్నాయి.
\v 2 అప్పుడు విస్తారమైన నీళ్ళు పడుతున్నట్టుగా, పెద్ద ఉరుము శబ్దంలా పరలోకం నుండి ఒక శబ్దం వస్తే విన్నాను. తీగ వాయిద్యాలు వాయించేవారు ఒక్కసారిగా వాయిస్తున్న శబ్దం వలే అది ఉంది.
\s5
\v 3 వాళ్ళంతా సింహాసనం ముందూ, ఆ నాలుగు ప్రాణుల ముందూ, పెద్దల ముందూ ఒక కొత్త పాట పాడారు. భూలోకంలో విమోచన జరిగిన 1,44,000 మంది తప్ప ఇంకెవ్వరూ ఆ పాటను నేర్చుకోలేరు.
\v 4 వీళ్ళు స్త్రీతో లైంగిక సంబంధం మూలంగా తమను అశుద్ధం చేసుకోని వారు. లైంగికంగా తమను పవిత్రంగా ఉంచుకున్న వాళ్ళు. వీళ్ళు గొర్రెపిల్ల వెళ్ళిన చోటికల్లా వెళ్తూ ఆయన్ను అనుసరిస్తూ ఉంటారు. మానవాళిలోనుండి దేవుని కొరకూ, గొర్రెపిల్ల కొరకూ మొదటి ఫలాలుగా విమోచన జరిగిన వారు.
\v 5 అబద్దమన్నది వీళ్ళ నోటినుండి రాదు. వీళ్ళు నిందా రహితులు.
\s శాశ్వత సువార్త గల దూత
\s5
\p
\v 6 అప్పుడు మరో దూతను చూశాను. అతడు ఆకాశంలో ఎగురుతున్నాడు. భూమిమీద నివసించే వారందరికీ ప్రతీ దేశానికీ, తెగకూ, ప్రతీ భాష మాట్లాడేవారికీ, ప్రతీ జాతికీ ప్రకటించడానికి అతని దగ్గర శాశ్వత శుభవార్త ఉంది.
\v 7 అతడు "మీరు దేవునికి భయపడండి. ఆయన్ను కీర్తించండి. ఆయన మనుషులకు తీర్పు చెప్పే సమయం వచ్చింది. కాబట్టి భూమి, ఆకాశాల్నీ, సముద్రాన్నీ, భూమి మీద నీటి ఊటల్నీ సృష్టించిన ఆయన్ను పూజించండి." అంటూ బిగ్గరగా చెప్పాడు.
\s బాబులోను పతనం ప్రకటన
\s5
\p
\v 8 వేరొక దూత, అంటే రెండో దూత అతని వెనకే వచ్చాడు. "నాశనమైంది! తన లైంగిక విచ్చలవిడితనమనే సారాయిని భూమిమీద జనాలందరికీ తాగించిన మహా బబులోను నాశనమైంది! ఆ మద్యమే దానిపై తీవ్ర ఆగ్రహాన్ని తెచ్చిపెట్టింది." అని చెప్పాడు.
\s మృగాన్ని పూజించే వారి వినాశం
\s5
\p
\v 9 తర్వాత మూడో దూత వీరి వెనకే వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు. "ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించినా దాని ముద్రను తన నుదుటి పైనో చేతి పైనో వేయించుకున్నా
\v 10 వాడు దేవుని ఆగ్రహ పాత్రలో కల్తీ ఏమీ లేకుండా తయారు చేసి పోసిన దేవుని ఆగ్రహ మద్యాన్ని తాగుతాడు. పరిశుద్ధ దేవదూతల ముందూ, గొర్రెపిల్ల ముందూ అగ్ని గంధకాలు వాణ్ణి బాధిస్తాయి.
\s5
\v 11 వారి యాతనకి సంబంధించిన పొగ కలకాలం లేస్తూనే ఉంటుంది. ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించిన వారూ, దాని ముద్ర వేయించుకున్న వారూ రేయింబవళ్ళు అశాంతితో కొట్టుమిట్టాడుతూ ఉంటారు.
\v 12 దేవుని ఆదేశాలు పాటించేవారూ, యేసును విశ్వసించిన వారూ, అయిన పరిశుద్ధులు సహనంతో కొనసాగాలి అని ఇదే వారికి పిలుపు."
\s పవిత్రులైన మృతుల ధన్యత
\s5
\p
\v 13 అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాకిలా వినిపించింది "ఇలా రాయి. 'ఇక నుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు దీవెన పొందినవారు.'" నిజమే, వాళ్ళు తమ శ్రమ ప్రయాసలన్నీ విడిచి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు వాళ్ళ వెనకే వెళ్తాయి.
\s మనుష్య కుమారుని పంట కోత
\s5
\p
\v 14 మళ్ళీ నేను చూసినప్పుడు ఒక తెల్లని మేఘం కనిపించింది. ఆ మేఘం పైన మనుష్య కుమారుడి లాంటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది.
\v 15 అప్పుడు మరో దూత దేవాలయంలోనుండి బయటకు వచ్చి మేఘంపై కూర్చున్న వ్యక్తితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు, "పంట కోసే సమయం వచ్చింది. భూమి పంట పండింది. నీ కొడవలితో కోయడం మొదలుపెట్టు"
\v 16 అపుడు మేఘంపై కూర్చున్న వ్యక్తి భూమి మీదకు కొడవలి విసిరాడు. వెంటనే భూమి మీద కోత జరిగింది.
\s దుర్మార్గుల పంటకోత
\s5
\p
\v 17 అంతలోనే పరలోకంలోని ఆలయంలో నుండి మరో దూత బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా ఒక పదునైన కొడవలి ఉంది.
\v 18 మరో దూత బలిపీఠంలో నుండి బయటకు వచ్చాడు. ఇతనికి అగ్నిపై అధికారం ఉంది. ఇతడు పదునైన కొడవలి చేతిలో పట్టుకున్న దూతను పెద్ద కేక పెట్టి పిలిచాడు, "భూమి మీద ద్రాక్ష పళ్ళు పండాయి. పదునైన నీ కొడవలితో ద్రాక్ష గుత్తులు కోయి" అన్నాడు.
\s5
\v 19 అప్పుడు ఆ దూత తన కొడవలిని భూమి మీదకు విసిరి భూమిమీద ఉన్న ద్రాక్షగుత్తులను కోసాడు. వాటిని దేవుని ఆగ్రహమనే గొప్ప ద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు.
\v 20 పట్టణానికి బయట ఆ ద్రాక్ష గానుగ తొట్టిలో ద్రాక్షలు తొక్కడం జరిగింది. దానిలో నుండి రక్తం గుర్రం కళ్ళెం అంత ఎత్తున సుమారు రెండు వందల మైళ్ళ వరకూ ప్రవహించింది.
\s5
\c 15
\s ఏడు పాత్రలు పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు
\p
\v 1 పరలోకంలో మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం నేను చూశాను. అదేమిటంటే ఏడుగురు దేవదూతలు తమ చేతుల్లో ఏడు తెగుళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇవి చివరి కీడులు. వీటితో దేవుని ఆగ్రహం తీరిపోతుంది.
\s5
\v 2 తర్వాత నేను ఒక గాజు సముద్రం లాంటిది చూశాను. దానితో అగ్ని కలసి ఉంది. క్రూర మృగాన్నీ, దాని విగ్రహాన్నీ, దాని పేరును సూచించే సంఖ్యనూ జయించిన వారు ఆ గాజు సముద్ర్రం దగ్గర నిలబడి ఉండడం నేను చూశాను. వారి చేతుల్లో దేవుడు ఇచ్చిన తీగ వాయిద్యాలు ఉన్నాయి.
\s5
\v 3 వాళ్ళు దేవుని సేవకుడైన మోషే పాటా, గొర్రెపిల్ల పాటా పాడుతూ, "ప్రభువైన దేవా, అన్నిటిపై పరిపాలన చేసేవాడా, నువ్వు చేసే పనులన్నీ గొప్పవి, అద్భుతమైనవి, జనాలకు రాజా, నీ విధానాలు న్యాయయమైనవి, సత్యమైనవి.
\v 4 ప్రభువా, నువ్వు మాత్రమే పరిశుద్దుడివి, నీకు భయపడనిదెవరు? నీ పేరుని కీర్తించనిదెవరు? నీ న్యాయ తీర్పులు అందరికీ తెలిశాయి. కాబట్టి అన్ని జాతుల వారూ నీ సన్నిధికి వచ్చి నిన్ను పూజిస్తారు."
\s5
\v 5 ఆ తర్వాత నేను చూస్తున్నప్పుడు పరలోకంలో సాక్ష్యపు గుడారం ఉన్న అతి పరిశుద్ధ స్థలం తెరచుకుంది.
\v 6 అప్పుడు ఏడు తెగుళ్ళు చేతిలో పట్టుకుని ఏడుగురు దూతలు ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చారు. వాళ్ళంతా పవిత్రమైన, ప్రకాశవంతమైన బట్టలు వేసుకుని ఉన్నారు. రొమ్ముకు బంగారు దట్టీ కట్టుకుని ఉన్నారు.
\s5
\v 7 అప్పుడు ఆ నాలుగు ప్రాణులలో ఒకరు ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాడు. ఆ పాత్రలలో నిత్యం జీవించే దేవుని ఆగ్రహం నిండి ఉంది.
\v 8 దేవుని యశస్సు నుండీ, బలం నుండీ లేచిన పొగతో అతి పరిశుద్ధ స్థలం నిండిపోయింది. కాబట్టి ఆ ఏడుగురు దూతలకిచ్చిన కీడులన్నీ జరిగే వరకూ అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు.
\s5
\c 16
\s దేవుని ఉగ్రత పాత్రలు
\p
\v 1 అప్పుడు ఒక పెద్ద స్వరం అతి పరిశుద్ధ స్థలంలోనుంచి "మీరు వెళ్లి ఏడు పాత్రలలో నిండి ఉన్న దేవుని ఆగ్రహాన్ని భూమి మీద కుమ్మరించండి" అని ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పడం విన్నాను.
\s మొదటి పాత్ర
\s5
\p
\v 2 అప్పుడు మొదటి దూత బయటకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించాడు. అప్పుడు ఆ క్రూరమృగం యొక్క ముద్ర వేసుకున్న వారికీ, వాడి ప్రతిమను పూజించే వారికీ ఒంటిపై అసహ్యమైన, బాధాకరమైన కురుపు పుట్టింది.
\s రెండవ పాత్ర
\s5
\p
\v 3 రెండో దూత తన పాత్రని సముద్రంలో కుమ్మరించాడు. సముద్రమంతా చచ్చిన మనిషి రక్తంలా మారిపోయింది. దాంతో సముద్రంలోని ప్రాణులన్నీ చచ్చాయి.
\s మూడవ పాత్ర
\s5
\p
\v 4 మూడో దూత తన పాత్రను నదుల్లోనూ నీటి ఊటల్లోనూ కుమ్మరించాడు. అప్పుడు ఆ నీళ్లన్నీ రక్తం అయ్యాయి.
\v 5 అప్పుడు నీటికి అధిపతిగా ఉన్న దూత "పూర్వముండి ప్రస్తుతమున్న దేవా, పరిశుద్ధుడా,
\v 6 నీ పరిశుద్ధుల రక్తాన్నీ, ప్రవక్తల రక్తాన్నీ వాళ్ళు ఒలికించారు. అందుకే నువ్వు వాళ్ళకి తాగడానికి రక్తం ఇచ్చావు. ఈ విధమైన తీర్పు చెప్పావు కనుక నువ్వు న్యాయవంతుడివి. దీనికి వాళ్ళు అర్హులే." అని చెప్పాడు.
\v 7 అప్పుడు బలిపీఠం " అవును, ప్రభువైన దేవా, అన్నిటినీ పరిపాలించేవాడా, నువ్వు చెప్పే తీర్పులు సత్యమైనవిగానూ, న్యాయమైనవిగానూ ఉన్నాయి" అంది.
\s నాలుగవ పాత్ర
\s5
\p
\v 8 నాలుగో దూత తన పాత్రను సూర్యుడిపై కుమ్మరించాడు. అప్పుడు మనుషుల్ని తన వేడితో మాడ్చివేయడానికి సూర్యుడికి అధికారం కలిగింది.
\v 9 మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు. అయితే ఈ కీడులపై అధికారం కలిగిన దేవుని పేరును తిట్టారుగానీ పశ్చాత్తాపపడి ఆయనను కీర్తించలేదు.
\s ఐదవ పాత్ర
\s5
\p
\v 10 అయిదో దూత తన పాత్రను క్రూరమృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరచుకున్నారు.
\v 11 తమకు కలిగిన వేదనలను బట్టీ, కురుపులను బట్టీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి తిట్టారే తప్ప పశ్చాత్తాప పడలేదు.
\s అరవ పాత్ర
\s5
\p
\v 12 ఆరో దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో తూర్పు దిక్కు నున్న రాజులకు మార్గం సిద్ధం చేయడానికి ఆ నది నీళ్ళు ఎండిపోయాయి.
\s అదనపు వివరణ
\p
\v 13 అప్పుడు ఆ మహాసర్పం నోటినుండీ, క్రూరమృగం నోటినుండీ, అబద్ధ ప్రవక్త నోటినుండీ కప్పల్లా కనిపిస్తున్న మూడు అపవిత్ర ఆత్మలు బయటకు రావడం చూశాను.
\v 14 అవి ఆశ్చర్యకరమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. అన్నిటి పైనా పరిపాలన చేసే దేవుని మహాదినాన జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందర్నీ కూడగట్టడానికి వారి దగ్గరకు వెళ్తున్న ఆత్మలు అవి.
\s5
\v 15 హీబ్రూ భాషలో 'హర్ మేగిద్దోన్' అనే పేరున్న స్థలానికి ఆ రాజులందర్నీ పోగు చేశారు.
\v 16 "వినండి! నేను దొంగలా వస్తున్నాను. పదిమందిలో సిగ్గుపడాల్సిన అవసరం లేకుండా, బయటకు వెళ్ళినప్పుడు తన నగ్నత్వం కనిపించకుండా జాగ్రత్తతో ఉండి దుస్తులు ధరించి ఉండేవాడు దీవెన పొందుతాడు."
\s ఏడవ పాత్ర
\s5
\p
\v 17 ఏడో దూత తన పాత్రను గాలిలో కుమ్మరించాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుండీ సింహాసనం నుండీ "ఇక ముగిసింది" అని ఒక పెద్ద శబ్దం వినిపించింది.
\v 18 అప్పుడు వివిధ శబ్దాలూ, మెరుపులూ, భారీ ఉరుములూ కలిగాయి. భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషుల సృష్టి జరిగిన దగ్గర్నుండీ అలాంటి భూకంపం కలగలేదు. అంత పెద్ద భూకంపం ఇది.
\v 19 ప్రసిద్ధమైన ఆ మహా నగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లోని నగరాలన్నీ నాశనమయ్యాయి. అప్పుడు దేవుడు మహా బబులోను నగరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తీవ్ర ఆగ్రహంతో తయారైన మద్యంతో నిండిన పాత్రను ఆ నగరానికిచ్చాడు.
\s5
\v 20 ప్రతి ద్వీపమూ అదృశ్యమైంది. ప్రతి పర్వతమూ కనిపించకుండా పోయింది.
\v 21 ఆకాశం నుండి మనుషుల మీద సుమారు నలభై ఐదు కిలోల బరువున్న భీకరమైన వడగళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళ దెబ్బ భయంకరంగా ఉంది కాబట్టి మనుషులు దేవుణ్ణి దూషించారు.
\s5
\c 17
\s ఏడు విధ్వంసాలు- 1. బబులోను పతనం
\p
\v 1 ఏడు పాత్రలు చేతబట్టుకున్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో "అనేక జలాలపై కూర్చున్న మహావేశ్యకు శిక్ష విధించడాన్ని నీకు చూపిస్తాను.
\v 2 ఆమెతో భూమి మీద రాజులు వ్యభిచారం చేశారు. భూమిపై నివసించే వారు ఆమె లైంగిక విశృంఖలతా మద్యాన్ని, విచ్చలవిడితనమనే సారాయిని తాగి మత్తులో మునిగారు." అన్నాడు.
\s5
\v 3 నేను అప్పుడు ఆత్మ స్వాధీనంలోకి వెళ్లాను. ఆ దూత నన్ను ఒక అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీని నేను చూశాను. ఆమె ఒక ఎర్రని మృగం మీద కూర్చుని ఉంది. ఆ మృగానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి. దాని ఒళ్ళంతా దేవునికి అవమానకరమైన పేర్లు రాసి ఉన్నాయి.
\v 4 ఆ స్త్రీ ఊదారంగు, ఎర్రని రంగు వస్త్రాలు కట్టుకుని ఉంది. బంగారం, రత్నాలూ, ముత్యాలతో అలంకరించుకుంది. ఆమె చేతిలోఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రలో తాను చేస్తున్న అతి జుగుప్సాకరమైన పనులూ, లైంగిక అవినీతికి సంబంధించిన అపవిత్రపు పనులూ ఉన్నాయి.
\v 5 ఆమె నుదిటి మీద ఆమె పేరు ఇలా రాసి ఉంది. దానికో రహస్యమైన అర్థం ఉంది. \bd "ఇది మహా బబులోను. భూమి మీద ఉన్న వేశ్యలందరికీ, అసహ్యమైన వాటికీ ఇది తల్లి."\bd*
\s5
\v 6 ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తాన్నీ, యేసు హతసాక్షుల రక్తాన్నీ తాగి మత్తెక్కి ఉండటం చూశాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను.
\v 7 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, "నువ్వెందుకు ఆశ్చర్యపడ్డావు? ఈమెకు సంబంధించిన రహస్యాన్నీ, ఏడు తలలూ పది కొమ్ములూ ఉండి ఈ స్త్రీని మోస్తున్న క్రూరమృగానికి సంబంధించిన రహస్యాన్నీ నీకు తెలుపుతాను.
\s5
\v 8 నువ్వు చూసిన ఆ మృగం పూర్వం ఉంది కానీ ఇప్పుడు లేదు. కానీ అది లోతైన అగాధం లోనుండి పైకి రావడానికి సిద్ధంగా ఉంది. తర్వాత అది నాశనానికి పోతుంది. ఒకప్పుడు ఉండి, ఇప్పుడు లేని, ముందు రాబోయే మృగాన్ని చూసి భూమిమీద నివసించే వారు, అంటే సృష్టి ప్రారంభం నుండీ దేవుని జీవ గ్రంథంలో తమ పేర్లు లేని వారు ఆశ్చర్యపోతారు.
\s5
\v 9 దీనికి జ్ఞానం కలిగిన మనస్సు అవసరం. ఆ మృగానికున్న ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు.
\v 10 ఇంకా ఏడుగురు రాజులున్నారు. వారిలో అయిదుగురు నాశనమయ్యారు. ప్రస్తుతం ఒకడున్నాడు. చివరి వాడు ఇంకా రాలేదు. వాడు వచ్చినప్పుడు కొంత కాలం ఉండాలి.
\s5
\v 11 ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేనిదీ అయిన ఈ క్రూరమృగం ఆ ఏడుగురిలో ఒకడు. కానీ ఎనిమిదవ రాజు కూడా వాడే. నాశనానికి పోయేదీ వాడే.
\s5
\v 12 నీకు కనిపించిన ఆ పది కొమ్ములూ పదిమంది రాజులు. వారికి ఇంతకుముందు రాజ్యం లేదు. కానీ క్రూరమృగం ఏలేటప్పుడు వాళ్ళు ఒక గంటసేపు రాజుల్లా అధికారం చలాయిస్తారు.
\v 13 వీరికి ఒకే మనస్సు ఉంటుంది. వీళ్ళు తమ శక్తినీ అధికారాన్నీ మృగానికి అంకితం చేస్తారు.
\v 14 వీళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ ఆయన వారిని ఓడిస్తాడు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయనతో ఉన్నవారు పిలుపునందుకున్న వారు, ఎన్నిక అయినవారు, నమ్మకమైన వారు."
\s5
\v 15 ఆ దూత ఇంకా నాతో ఇలా చెప్పాడు. "ఆ వేశ్య కూర్చున్నచోట నువ్వు చూసిన జలాలు ప్రజల్నీ, జన సమూహాల్నీ, జనాల్నీ, వివిధ భాషలు మాట్లాడే వారినీ సూచిస్తాయి.
\s5
\v 16 నువ్వు చూసిన పది కొమ్ములు చూశావు గదా, వారూ ఆ మృగమూ ఆ వేశ్యను ద్వేషిస్తారు. ఆమె మాంసాన్ని తింటారు. మంట పెట్టి ఆమెను కాల్చివేస్తారు.
\v 17 ఎందుకంటే తన ఉద్దేశాలు వారు నెరవేర్చాలని దేవుడు వారి హృదయాలలో పెడతాడు. దానికోసం వారు ఏకీభవించి రాజ్యాన్ని మృగానికి ఇవ్వడానికి అనుమతించాడు.
\s5
\v 18 ఇక నువ్వు చూసిన ఆ స్త్రీ భూమిపై రాజుల్ని పరిపాలిస్తున్న మహా నగరమే.
\s5
\c 18
\s చివరి రోజుల్లో ఉండబోయే భ్రష్ఠక్రైస్తవ్యం
\p
\v 1 ఆ తర్వాత పరలోకం నుండి మరో దూత దిగి రావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతనికున్న యశస్సు చేత భూమి అంతా ప్రకాశించింది.
\v 2 అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు. "బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది. ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.
\v 3 ఎందుకంటే దైవాగ్రహాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనాలంతా తాగి మత్తెక్కి పడిపోయారు. భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల వల్ల సంపన్నులయ్యారు."
\s5
\v 4 తర్వాత మరో స్వరం పరలోకంనుండి వినిపించింది. ఆ స్వరం ఇలా చెప్పింది, "నా ప్రజలారా, మీరు ఆమె పాపాల్లో భాగం పంచుకోకుండా, ఆమెకు సంభవించబోయే కీడులలో ఏదీ మీకు సంభవించకుండా ఆమెను విడిచి వచ్చేయండి.
\v 5 ఆమె పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి. దేవుడు ఆమె నేరాలనన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు.
\v 6 ఆమె చెల్లించిన ప్రకారం ఆమెకు చెల్లించండి. ఆమె చేసిన దానికి ఆమెకు రెట్టింపు చేయండి. ఆమె కలిపిన పాత్రలోనే ఆమె కొరకు రెండొంతులు కలపండి.
\s5
\v 7 ఆమె తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది. అంతే మొత్తంలో ఆమెకు హింసనూ, వేదననూ కలుగజేయండి. ఎందుకంటే ఆమె తన మనస్సులో "నేను రాణిగా కూర్చుండేదాన్ని, విధవను కాను. సంతాపం చూడనే చూడను" అనుకుంది.
\v 8 కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్క రోజే కలుగుతాయి. మరణమూ, దుఖమూ, కరువూ వస్తాయి. దేవుడైన ప్రభువు మహా శక్తిమంతుడు. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే. ఆమె సంపూర్ణంగా అగ్నికి ఆహుతైపోతుంది.
\s బబులోను పతనం గురించి విలాపం
\s5
\p
\v 9 ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ భయంతో దూరంగా నిలబడతారు. ఆమె తగలబడి పోతుంటే వచ్చే పొగను చూస్తూ గుండెలు బాదుకుంటారు.
\v 10 "అయ్యో, అయ్యో, బబులోను మహానగరమా, శక్తిమంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చి పడిందా" అంటూ ఏడుస్తారు.
\s5
\v 11 లోకం లోని వ్యాపారులు కూడా ఆ నగరాన్ని చూసి ఏడుస్తూ విలపిస్తారు. 'మా సరుకులు ఎవరు కొనుగోలు చేస్తారు' అంటూ ఏడుస్తారు. వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నేత బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు, ఇంకా
\v 12 పరిమళాన్నిచ్చే ప్రతి రకమైన కలపా, దంతమూ, ఎంతో విలువైన చెక్కా, ఇత్తడీ, ఇనుమూ, చలువరాళ్ళూ మొదలైనవాటితో చేసిన ఎన్నో రకాల వస్తువులూ
\v 13 దాల్చిన చెక్క, వాము, ధూపం కోసం వాడే వస్తువులూ, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తనిపిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి, ఇంకా గుర్రాలూ, రథాలూ, బానిసలూ, మనుషుల ప్రాణాలు.
\s5
\v 14 "నీ శాయశక్తులా నువ్వు కోరుకున్న ఫలం నిన్ను విడిచి పోయింది. నీ విలాసమూ, వైభోగమూ మాయమయ్యాయి. అవి ఇక కనపడవు" అని చెప్తూ ఏడుస్తారు.
\s5
\v 15 ఆ నగరంలో ఈ వస్తువులతో వ్యాపారం చేసి సంపన్నులైన వ్యాపారులు ఆమె వేదన వల్ల భయంతో దూరంగా నిలిచి ఏడుస్తూ గట్టిగా రోదిస్తారు.
\v 16 " సన్నని నేత బట్టలు, ఊదారంగు, ఎర్రని బట్టలు కట్టుకుని బంగారం, రత్నాలూ, ముత్యాలతో అలంకరించుకున్న మహా నగరమా అయ్యో, అయ్యో, ఇంత ఐశ్వర్యమూ ఒక్క గంట లోనే మాయమయిందే!" అంటారు.
\v 17 ప్రతీ నౌకాధిపతీ, సముద్ర యాత్రికుడూ, ఓడ నావికుడూ, ఇలా సముద్రం మీద ఆధారపడి బతికే వాళ్ళంతా దూరంగా నిలబడి
\s5
\v 18 నగరం తగులబడి పోతుంటే రాజుకున్న పొగను చూసి "ఈ నగరానికి సమానమైనదేది?" అంటూ కేకలు పెడతారు.
\v 19 తమ తలల మీద దుమ్ము చల్లుకుని ఏడుస్తూ రోదనం చేస్తూ "అయ్యో, అయ్యో, ఆ మహా నగరం. సొంత నౌకలు ఉన్న వాళ్ళంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు. అలాంటిది ఒక్క గంటలోనే ఇలా నాశనమయిందే" అంటారు.
\s బబులోను పతనం గురించి భక్తుల హర్షం
\p
\v 20 "పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే మీ తరుపున దేవుడు ఆమెను శిక్షించాడు."
\s5
\v 21 ఆ తర్వాత బలవంతుడైన ఒక దూత పెద్ద తిరగలి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా అన్నాడు. "ఇలాగే మహా నగరమైన బబులోను కూడా హింసాత్మకంగా పడిపోతుంది. ఇక అది ఎన్నటికీ కనిపించదు.
\v 22 కాబట్టి తీగ వాయిద్యాల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవీ, బూరలు వూదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. తిరగలి శబ్దం ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడదు.
\s5
\v 23 దీపం వెలుతురు నీలో ఇక వెలగదు. పెళ్లి కొడుకు స్వరం, పెళ్లి కూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినపడవు. ఎందుకంటే నీ వర్తకులు భూమికి ప్రభువుల్లా ఉండేవారు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి."
\v 24 ప్రవక్తల రక్తం, హతసాక్షుల రక్తం, ఇంకా భూమిపై వధ అయిన వారి రక్తం ఆమెలో కనిపిస్తూ ఉంది.
\s5
\c 19
\s వివరణ దర్శనం. నాలుగు హల్లెలూయలు
\p
\v 1 ఈ విషయాలు జరిగిన తర్వాత అనేకమంది మాట్లాడుతున్నట్టు ఒక పెద్ద శబ్దం పరలోకంలో నుండి నాకు వినిపించింది. "హల్లెలూయ! రక్షణ, యశస్సు, బల ప్రభావాలు మన దేవునివే.
\v 2 ఆయన తీర్పులు సత్యంగానూ న్యాయమైనవిగానూ ఉన్నాయి. తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన మహా వేశ్యను ఆయన శిక్షించాడు. ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతీకారం తీర్చాడు."
\s5
\v 3 రెండోసారి వారంతా "హల్లెలూయ! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది" అన్నారు.
\v 4 అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి "ఆమెన్, హల్లెలూయ!" అని చెప్తూ ఆయనను పూజించారు.
\s5
\v 5 అప్పుడు తిరిగి "దేవుని దాసులు, ఆయనకు భయపడే వారు, గొప్పవారైనా అనామకులైనా అందరూ ఆయన్ను స్తుతించండి" అంటూ ఒక స్వరం వినిపించింది.
\s5
\v 6 తర్వాత అనేకమంది మాట్లాడుతున్నట్టుగా, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది. "హల్లెలూయ! అన్నిటి పైనా ఏలిక అయిన మన ప్రభువైన దేవుడు పరిపాలిస్తున్నాడు."
\s గొర్రెపిల్ల కళ్యాణం
\s5
\p
\v 7 "గొర్రెపిల్ల వివాహ ఉత్సవ సమయం వచ్చింది. పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది. కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం. ఆయనకే మహిమ ఆపాదించుదాం."
\v 8 ఆమెకు వెలుగుమయం, పవిత్రం అయిన అందమైన బట్టలు ధరించుకోడానికి ఇచ్చారు. అందమైన బట్టలు అంటే పరిశుద్ధుల నీతి కార్యాలు.
\s5
\v 9 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు. "గొర్రెపిల్ల పెళ్లి విందుకు ఆహ్వానం అందినవారు దీవెన పొందినవారు అని రాయి." అతడే ఇంకా "ఇవి నిజంగా దేవుని మాటలు" అన్నాడు.
\v 10 అందుకు నేను అతణ్ణి పూజించడానికి అతని ముందు సాష్టాంగ పడబోయాను. కానీ అతడు "అలా చేయకు! యేసుకు సాక్షులుగా ఉన్న నీకూ నీ సోదరులకీ నేను తోటి దాసుణ్ణి మాత్రమే." అన్నాడు.
\s మహిమలో క్రీస్తు రాక
\s5
\p
\v 11 తర్వాత పరలోకం తెరుచుకుని ఉండటం చూశాను. అప్పుడు చూడండి! తెల్లని గుర్రం ఒకటి నాకు కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు 'నమ్మకమైన వాడు, సత్యవంతుడు.' ఆయన న్యాయంగా తీర్పు చెప్తూ యుద్ధం చేస్తాడు.
\v 12 ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. అది ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు.
\v 13 ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. 'దేవుని వాక్కు' అనే పేరు ఆయనకుంది.
\s5
\v 14 ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నార బట్టలు వేసుకుని తెల్లని గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు.
\v 15 వివిధ జాతి ప్రజలను కొట్టడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుపలాఠీ తో వారిని పరిపాలిస్తాడు. సర్వాధికారియైన దేవుని తీక్షణమైన ఆగ్రహపు ద్రాక్ష గానుగ తొట్టిని ఆయనే తొక్కుతాడు.
\v 16 ఆయన బట్టల మీదా, తొడ మీదా 'రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు' అనే పేరు రాసి ఉంది.
\s హర్మేగిద్దోన్ యుద్ధం
\s5
\p
\v 17 అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండటం నేను చూశాను.
\v 18 అతడు బిగ్గరగా కేక వేసి పైన ఎగిరే పక్షుల్ని పిలిచాడు. "రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహా విందును ఆరగించండి. రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, బలవంతుల మాంసం, గుర్రాల మాంసం, వాటిపై స్వారీ చేసేవారి మాంసం, స్వతంత్రులూ, బానిసలూ, పలుకుబడిలేనివారూ, గొప్పవారూ అయిన మనుషులందరి మాంసం, వచ్చి తినండి" అన్నాడు.
\s5
\v 19 క్రూరమృగమూ, భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండటం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు.
\s 1. మృగం పతనం. 2. అబద్ధ ప్రవక్త పతనం
\p
\v 20 అప్పుడా మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా పట్టుబడ్డారు. ఈ అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారినీ ఆ విగ్రహాన్ని పూజించిన వారినీ మోసం చేశాడు. ఈ ఇద్దర్నీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు.
\s 3. వారిని అనుసరించిన రాజుల పతనం
\s5
\p
\v 21 మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు ఆరగించాయి.
\s5
\c 20
\s సాతానుకు అగాధంలో చెర
\p
\v 1 తర్వాత ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసూ, అగాధం తాళం చెవీ ఉన్నాయి.
\v 2 అతడు అపవాది, సాతాను అనే పేర్లున్న ఆది సర్పం అయిన మహా సర్పాన్ని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకూ అగాధంలో పడవేశాడు.
\v 3 వాణ్ణి అగాధంలో పడవేసి, దానిని మూసివేసి దానికి ముద్ర వేసాడు. ఆ వెయ్యి సంవత్సరాలయ్యే వరకూ ప్రజల్ని మోసం చేయకుండా వాడు అగాధంలోనే బందీగా ఉండాలి. ఆ తర్వాత కొద్ది సమయం వాణ్ణి వదిలి పెట్టాలి.
\s మొదటి పునరుత్థానం
\s5
\p
\v 4 అప్పుడు సింహాసనాలు చూశాను. వాటిపై కూర్చున్న వారికి తీర్పు చెప్పే అధికారం ఇచ్చారు. యేసును గురించి తాము చెప్పిన సాక్ష్యం కొరకూ, దేవుని వాక్కును ప్రకటన చేసినందుకూ తల నరికించుకున్న భక్తుల ఆత్మలు చూశాను. వారు క్రూర మృగాన్ని గానీ, వాడి విగ్రహాన్ని గానీ పూజించలేదు. వారి నుదుటి మీద గానీ చేతి మీద గానీ ముద్ర వేయనీయలేదు. వారిప్పుడు సజీవులై క్రీస్తుతో కలిసి వెయ్యేళ్ళు పరిపాలించారు.
\s5
\v 5 ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసే వరకూ చనిపోయిన మిగిలిన వారు సజీవులు కాలేదు. ఇదే మొదటి పునర్జీవితం.
\v 6 ఈ మొదటి పునర్జీవితంలో పాల్గొన్నవారు పరిశుద్ధులు దీవెన పొందిన వారు. వీళ్ళ పైన రెండో మరణానికి అధికారం లేదు. వీరు దేవునికీ, క్రీస్తుకీ యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు.
\s సాతాను విడుదల. 4. గోగు, మాగోగు పతనం
\s5
\p
\v 7 వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలోనుండి విడుదల అవుతాడు.
\v 8 వాడు బయల్దేరి నాలుగు దిక్కులలో ఉన్న గోగు, మాగోగు అనే దేశాల్ని మోసం చేసి యుద్ధానికై సమకూరుస్తాడు.
\s5
\v 9 వారు అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకంనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించి వేస్తుంది.
\s 5. సాతాను పతనం
\p
\v 10 వారిని మోసం చేసిన అపవాదిని గంధకం ఉన్న అగ్ని సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధలు పడతారు.
\s 6. అవిశ్వాసుల పతనం. అంతిమ తీర్పు
\s5
\p
\v 11 తర్వాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలు పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు.
\v 12 చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ముందు నిలబడి ఉండటం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దానిని బట్టి వారు తీర్పు పొందారు.
\s5
\v 13 సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు.
\v 14 మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండో మరణం.
\v 15 జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు.
\s5
\c 21
\s ఏడు కొత్త విషయాలు. 1. కొత్త భూమి, 2. కొత్త ఆకాశం
\p
\v 1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు.
\v 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్లికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుండి దిగి రావడం చూశాను.
\s 3. కొత్త ప్రజ
\s5
\p
\v 3 అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం "చూడండి, దేవుని నివాసం మనుష్యులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు.
\v 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడటం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి" అని చెప్తుండగా విన్నాను.
\s5
\v 5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన "చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను" అన్నాడు. "ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి" అని నాతో అన్నాడు.
\v 6 ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు. "ఈ విషయాలన్నీ సమాప్తం అయ్యాయి. ఆల్ఫా, ఒమేగా నేనే. అంటే ఆదీ అంతమూ నేనే. దాహం వేసిన వాడికి జీవ జలాల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.
\s5
\v 7 జయించే వాడు వీటిని వారసత్వంగా పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.
\v 8 పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండో మరణం.
\s గొర్రెపిల్ల భార్య. 4. కొత్త యెరూషలేము
\s5
\p
\v 9 అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రల్ని పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు నా దగ్గరకు వచ్చాడు. "ఇలా రా, పెళ్లి కూతురిని అంటే గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను" అన్నాడు.
\v 10 ఆత్మస్వాధీనంలో ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం పైకి తీసుకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం దేవుని కీర్తీ యశస్సులతో పరలోకంలోని దేవుని దగ్గర నుండి రావడం నాకు చూపించాడు.
\s5
\v 11 యెరూషలేము దేవుని మహిమ కలిగి ఉంది. అది ప్రశస్తమైన సూర్యకాంతం రాయిలా ధగ ధగ మెరుస్తూ ఉంది.
\v 12 ఆ పట్టణానికి ఎత్తయిన ప్రహరీ గోడా, ఆ ప్రహరీ గోడకు పన్నెండు ద్వారాలూ ఉన్నాయి. ఆ ద్వారాల దగ్గర పన్నెండు మంది దేవదూతలున్నారు. ఇశ్రాయేలు వారి పన్నెండు గోత్రాల పేర్లూ ఆ ద్వారాలపై రాసి ఉన్నాయి.
\v 13 తూర్పున మూడు ద్వారాలూ, ఉత్తరాన మూడు ద్వారాలూ, దక్షిణాన మూడు ద్వారాలూ, పశ్చిమాన మూడు ద్వారాలూ ఉన్నాయి.
\s5
\v 14 ఆ పట్టణపు ప్రహరీ గోడకు పన్నెండు పునాదులున్నాయి. ఆ పునాదుల పైన పన్నెండు మంది గొర్రెపిల్ల అపోస్తలుల పేర్లు కనిపిస్తున్నాయి.
\v 15 నాతో మాట్లాడే దూత దగ్గర ఆ పట్టణాన్నీ, దాని ద్వారాల్నీ, ప్రహరీ గోడనీ కొలవడానికి ఒక బంగారు కొలబద్ద ఉంది.
\s5
\v 16 ఆ పట్టణం చతురస్రాకారంగా ఉంది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలబద్దతో పట్టణాన్ని కొలిస్తే దాని కొలత సుమారు రెండు వేల రెండు వందల కిలో మీటర్లు ఉంది. దాని పొడుగూ, వెడల్పూ, ఎత్తూ అన్నీ సమానమే.
\v 17 తర్వాత అతడు ప్రహరీ గోడను కొలిచాడు. అది మనుషుల లెక్క ప్రకారం నూట నలభై నాలుగు మూరలుంది. ఆ కొలత దూత వేసిన కొలతే.
\s5
\v 18 ఆ పట్టణపు ప్రహరీ గోడను సూర్యకాంత మణులతో కట్టారు. పట్టణం చూస్తే నిర్మలమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారంలా ఉంది.
\v 19 ఆ పట్టణపు ప్రహరీ గోడ పునాదులు ప్రశస్తమైన రకరకాల విలువైన రాళ్ళతో అలంకరించారు. మొదటి పునాది సూర్యకాంతపురాయి, రెండోది ఇంద్ర నీలమణి, మూడోది యమునారాయి, నాలుగోది పచ్చ,
\v 20 అయిదోది కురువిందం, ఆరోది కెంపు, ఏడోది సువర్ణ రత్నం, ఎనిమిదోది గోమేధికం, తొమ్మిదోది పుష్యరాగం, పదోది సువర్ణల శునీయం, పదకొండోది పద్మరాగం, పన్నెండోది ఊదామణి.
\s5
\v 21 దాని పన్నెండు ద్వారాలూ పన్నెండు ముత్యాలు. ఒక్కో ద్వారాన్నీ ఒక్కో ముత్యంతో కట్టారు. పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారం.
\s 5. కొత్త ఆలయం
\p
\v 22 అక్కడ ఎలాంటి దేవాలయమూ నాకు కనిపించలేదు. అన్నిటినీ పాలించే ప్రభువైన దేవుడూ, గొర్రెపిల్లా దానికి దేవాలయంగా ఉన్నారు.
\s 6. కొత్త ప్రకాశం
\s5
\p
\v 23 ఆ పట్టణంలో వెలుగివ్వడానికి సూర్యుడూ చంద్రుడూ అక్కర్లేదు. దేవుని కీర్తీ యశస్సులే అక్కడ ప్రకాశిస్తాయి. గొర్రెపిల్ల దాని దీపం.
\v 24 వివిధ జాతి ప్రజలు ఆ వెలుగులో తిరుగుతారు. భూరాజులు తమ వైభవాన్ని దానిలోకి తెస్తారు.
\v 25 పగటి పూట దాని ద్వారాలు మూయరు. అక్కడ రాత్రి లేదు.
\s5
\v 26 వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు.
\v 27 పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ పుస్తకంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.
\s5
\c 22
\s పరలోకం, జీవజల నది
\p
\v 1 అప్పుడు జీవజల నదిని ఆ దూత నాకు చూపించాడు. అది స్ఫటికంలా నిర్మలంగా మెరుస్తూ ఉంది. అది దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం నుండీ,
\v 2 ఆ పట్టణం ప్రధాన వీధి మధ్యలో నుండీ ప్రవహిస్తుంది. ఆ నదికి రెండు పక్కలా జీవ వృక్షం ఉంది. అది నెల నెలా ఫలిస్తూ, ఏడాదికి పన్నెండు కాపులు ఇస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉపయోగపడతాయి.
\s5
\v 3 అక్కడ ఇక శాపం అనేది ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం అక్కడ ఉంటుంది. ఆయన సేవకులు ఆయనకు సేవ చేస్తారు.
\v 4 ఆయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళ పైన ఉంటుంది.
\v 5 రాత్రి ఇక ఎప్పటికీ కలగదు. దీపాల కాంతీ, సూర్యుడి వెలుగూ వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వెలుగై వారిమీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు కలకాలం పరిపాలిస్తారు.
\s5
\v 6 ఆ దూత నాతో ఇలా చెప్పాడు. "ఈ మాటలు నమ్మదగ్గవి, సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలో జరగాల్సిన వాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపాడు."
\v 7 "చూడండి! నేను త్వరగా వస్తున్నాను. ఈ పుస్తకం లోని ప్రవచన మాటల్ని స్వీకరించేవాడు ధన్యుడు."
\s5
\v 8 యోహాను అనే నేను ఈ సంగతులన్నీ విన్నాను, చూశాను. అలా నేను వింటూ చూస్తూ ఉన్నప్పుడు వాటిని నాకు చూపిస్తున్న దూతను పూజించడానికి అతని ముందు సాష్టాంగపడ్డాను.
\v 9 అప్పుడు అతడు "అలా చేయకు. నేను నీకూ, నీ సోదరులకూ, ప్రవక్తలకూ, ఈ పుస్తకంలో మాటల్ని స్వీకరించే వారందరికీ తోటి సేవకుణ్ణి. దేవుణ్ణి పూజించు" అని చెప్పాడు.
\s5
\v 10 అతడు నాతో ఇంకా ఇలా చెప్పాడు. "ఈ పుస్తకంలో ఉన్న ప్రవచన వాక్యాలను మూసి ముద్ర వేయవద్దు. ఎందుకంటే సమయం దగ్గర పడింది.
\v 11 అన్యాయం చేసేవాణ్ణి అన్యాయం చేస్తూ ఉండనీయి. అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనీయి. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడిగానే ఉండనీయి. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధుడిగా ఉండనీయి.
\s5
\v 12 "చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది.
\v 13 అల్ఫా ఓమెగా నేనే, మొదటి వాణ్ణి చివరి వాణ్ణి, ప్రారంభాన్నీ ముగింపునీ.
\s5
\v 14 జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణపు ద్వారాలనుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయేందుకై తమ వస్త్రాల్ని ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు.
\v 15 పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అసత్యాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు.
\s5
\v 16 యేసు అనే నేను సంఘాల కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్నీ.
\s5
\v 17 "రా" అంటూ ఆత్మా, పెళ్లికూతురూ చెప్తున్నారు. వింటున్నవాడూ "రా" అని చెప్పాలి. దాహం వేసిన వాడు రావాలి. ఇష్టమున్న వ్యక్తి జీవ జలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు."
\s5
\v 18 ఈ పుస్తకంలోని ప్రవచన మాటల్ని వినే ప్రతి వ్యక్తికీ నేను చెప్పేది ఏమిటంటే ఎవడైనా వీటిలో ఏదైనా కలిపితే దేవుడు ఈ పుస్తకంలో రాసి ఉన్న కీడులన్నీ వాడికి కలుగజేస్తాడు.
\v 19 ఎవడైనా దేనినైనా తీసి వేస్తే దేవుడు ఈ పుస్తకంలో వివరించిన జీవవృక్షం లోనూ, పరిశుద్ధ పట్టణం లోనూ వాడికి భాగం లేకుండా చేస్తాడు.
\s చివరి వాగ్దానం, చివరి ప్రార్థన
\s5
\p
\v 20 ఈ సంగతులను గురించి సాక్ష్యమిస్తున్న వాడు "అవును, త్వరగా వస్తున్నాను" అని అంటున్నాడు. ఆమేన్‌! ప్రభు యేసూ, త్వరగా రా.
\v 21 ప్రభు యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉంటుంది గాక! ఆమేన్‌.