te_ulb/43-LUK.usfm

2492 lines
349 KiB
Plaintext
Raw Blame History

This file contains ambiguous Unicode characters

This file contains Unicode characters that might be confused with other characters. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

\id LUK Luke
\s5
\c 1
\s పరిచయం
\p
\v 1 ఘనులైన తియొఫిలా,
\v 2 మొదటినుంచీ కళ్ళారా చూసిన వాక్యసేవకులు మనకు అప్పగించినట్టు మన మధ్య నెరవేరిన కార్యాలను గురించి వివరంగా రాయడానికి చాలా మంది పూనుకున్నారు.
\v 3 కాబట్టి నీకు ఉపదేశించిన సంగతులు ఖచ్చితంగా జరిగాయని నువ్వు తెలుసుకోవాలని వాటన్నిటినీ మొదటినుండి పరిశోధించి పరిష్కారంగా తెలుసుకున్న నేను కూడా నీ కోసం వాటి గురించి
\v 4 క్రమపద్ధతిలో రాయడం మంచిదని అనుకుంటున్నాను.
\s బాప్తిసమిచ్చే యోహాను జనన ప్రకటన
\s5
\p
\v 5 యూదా దేశానికి హేరోదు రాజుగా ఉన్న రోజుల్లో అబీయా యాజక శాఖకు చెందిన జెకర్యా అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య అహరోను వంశీకురాలు. ఆమె పేరు ఎలీసబెతు.
\v 6 వీరిద్దరూ ప్రభువు ఇచ్చిన అన్ని ఆజ్ఞల, న్యాయవిధుల విషయంలో నిరపరాధులుగా నడుచుకొంటూ దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండేవారు.
\v 7 ఎలీసబెతు గొడ్రాలు. వారికి పిల్లలు లేరు. అంతేకాదు, వారిద్దరూ వయసు మళ్ళిన వృద్ధులు.
\s5
\v 8 జెకర్యా ఒక రోజు తన శాఖ వారి వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో యాజకుడుగా సేవ చేస్తూ ఉండగా
\v 9 యాజక ధర్మం ప్రకారం ప్రభువు ఆలయం లోపలికి వెళ్లి ధూపం వేయడానికి చీట్లు వేస్తే అతనికి వంతు వచ్చింది .
\v 10 ధూపం వేసే సమయంలో జనమంతా బయట ప్రార్థన చేస్తుండగా
\s5
\v 11 ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనిపించాడు.
\v 12 జెకర్యా అతనిని చూచి, కంగారుపడి భయపడ్డాడు.
\v 13 అప్పుడా దూత అతనితో "జెకర్యా, భయపడకు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలీసబెతు నీకు కొడుకును కంటుంది. అతనికి యోహాను అని పేరు పెడతావు.
\s5
\v 14 అతని మూలంగా నీకు హర్షం, మహదానందం కలుగుతుంది.
\v 15 అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసంగానీ సారాయిగానీ తాగడు. తల్లి గర్భాన పుట్టింది మొదలు దేవుని పరిశుద్ధాత్మతో నిండి ఉంటాడు.
\s5
\v 16 ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు.
\v 17 తండ్రుల హృదయాలను పిల్లల వైపుకీ, అవిధేయులను నీతిమంతుల జ్ఞానానికీ మళ్ళించడానికీ, తద్వారా ప్రభువు కోసం సిద్ధపడిన ప్రజానీకాన్ని తయారు చేయడానికి అతడు ఏలియా మనసుతో బలప్రభావాలతో ప్రభువు కంటే ముందుగా వస్తాడు" అన్నాడు.
\s5
\v 18 దేవదూతతో జెకర్యా "ఇది నాకు ఎలా తెలుస్తుంది? నేను ముసలివాణ్ణి, నా భార్య కూడా వయసు మళ్ళిన వృద్ధురాలు," అన్నాడు
\v 19 దూత "నేను దేవుని సముఖంలో నిలిచే గబ్రియేలును. నీతో మాట్లాడడానికి, ఈ శుభవార్త నీకు తెలియజేయడానికి దేవుడు నన్ను పంపించాడు.
\v 20 నా మాటలు తగిన కాలంలో నెరవేరతాయి. నువ్వు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరిగే వరకూ నువ్వు మాటలు లేక మౌనంగా ఉంటావ"ని అతనితో అన్నాడు .
\s5
\v 21 ప్రజలు జెకర్యా కోసం ఎదురు చూస్తూ, ఆలయంలో అతడు ఆలస్యం చేస్తున్నాడెందుకో అనుకుంటూ ఉన్నారు.
\v 22 అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేక పోయాడు. ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అప్పుడతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు.
\v 23 అతడు సేవ చేసే రోజులు పూర్తి అయిన తరువాత యింటికి వెళ్లి పోయాడు.
\s5
\v 24 కొన్ని రోజులకు అతని భార్య ఎలీసబెతు గర్భవతి అయింది. ఆమె అయిదు నెలల పాటు ఇతరుల కంట బడలేదు.
\v 25 ఆమె "దేవుడు నన్ను కనికరించి మనుష్యులలో నా అవమానాన్ని తొలగించడానికి ఇలా చేశాడు" అనుకొంది.
\s క్రీస్తు జనన ప్రకటన
\s5
\p
\v 26 ఎలీసబెతు ఆరవ నెల గర్భవతిగా ఉండగా దేవుడు గబ్రియేలు అనే దేవదూతను గలిలయలోని నజరేతు అనే ఊరిలో
\v 27 దావీదు వంశీకుడైన యోసేపు అనే వ్యక్తితో నిశ్చితార్థం అయిన కన్య దగ్గరికి పంపించాడు. ఆ కన్య పేరు మరియ.
\v 28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెతో "దయ పొందిన దానా, నీకు శుభం. ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు" అని పలికాడు.
\v 29 ఆమె ఆ మాటకు కంగారు పడిపోయి ఈ అభివందనం ఏమిటి అని ఆలోచించుకొంటుండగా,
\s5
\v 30 దూత "మరియా, భయపడకు. నీకు దేవుని అనుగ్రహం లభించింది.
\v 31 ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు.
\v 32 ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని "సర్వోన్నతుని కుమారుడు" అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు.
\v 33 ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు" ఆని ఆమెతో చెప్పాడు.
\s5
\v 34 మరియ "నేను కన్యని గదా, ఇదెలా జరుగుతుంది?" అంది.
\v 35 అ దూత "పరిశుద్ధాత్మ నిన్ను అవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు.
\s5
\v 36 పైగా నీ బంధువు ఎలీసబెతు కూడా ముసలితనంలో గర్భవతిగా ఉంది, కొడుకును కనబోతూ ఉంది. గొడ్రాలనిపించుకున్న ఆమెకు ఇది ఆరవ నెల.
\v 37 దేవుడు చెప్పిన ఏ మాటా వ్యర్థంగా పోదు" అని ఆమెతో చెప్పాడు.
\v 38 అందుకు మరియ "నేను ప్రభువు పాదదాసిని. నీ మాట ప్రకారం నాకు జరుగు గాక" అంది. అప్పుడు దూత వెళ్ళిపోయాడు.
\s మరియ ఎలీసబెతును సందర్శించడం
\s5
\p
\v 39 ఇది జరిగిన కొద్దికాలానికే మరియ సిద్ధపడి యూదయ మన్యంలో జెకర్యా ఉండే ఊరికి త్వరగా చేరుకుని
\v 40 ఇంట్లోకి వెళ్లి, ఎలీసబెతుకు వందనం చేసింది.
\v 41 ఎలీసబెతు ఆ అభివందనం వినగానే, ఆమె గర్భంలో బిడ్డ ఉల్లాసంగా కదిలాడు. అప్పుడు ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండి గొంతెత్తి ఇలా అంది.
\s5
\v 42 "స్త్రీలలో నీవు ధన్యురాలివి. నీ గర్భఫలం దీవెన పొందిన వాడు.
\v 43 నా ప్రభువు తల్లి నా ఇంటికి రావడం నాకెంత భాగ్యం!
\v 44 నీ అభివందనం నా చెవిని పడగానే నా గర్భంలోని బిడ్డ ఆనందంగా గంతులు వేశాడు.
\v 45 ప్రభువు ఆమెకు వెల్లడి చేసినది తప్పక జరుగుతుంది గనక నమ్మిన ఆమె ధన్యురాలు" అంది.
\s మరియ స్తోత్ర పాఠము (1 సమూ 2:1-10)
\s5
\p
\v 46 అప్పుడు మరియ ఇలా అంది, "నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది.
\p
\v 47 ఆయన తన దాసి దీనస్థితిని చూసి దయ చూపించాడు.
\s5
\p
\v 48 నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది.
\p
\v 49 సర్వశక్తిమంతుడు నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం.
\s5
\p
\v 50 ఆయన పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కరుణ కలకాలం ఉంటుంది.
\p
\v 51 ఆయన తన బాహువుతో ప్రతాపం కనపరిచాడు. గర్విష్ఠులను, వారి అంతరంగాల ఆలోచనలను బట్టి చెదరగొట్టివేశాడు.
\s5
\p
\v 52 బలవంతులను గద్దెల పైనుంచి పడద్రోసి దీనులను ఎక్కించాడు
\p
\v 53 ఆకలితో ఉన్న వాళ్ళను మంచి ఆహారంతో కడుపు నింపి ధనికులను వట్టి చేతులతో పంపివేశాడు.
\s5
\p
\v 54 అబ్రాహామునూ అతని సంతానాన్నీ శాశ్వతంగా కరుణతో చూసి వారిని జ్ఞాపకం చేసికొంటానని మన పితరులకు మాట ఇచ్చినట్టు
\v 55 ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు."
\s5
\p
\v 56 మరియ దాదాపు మూడు నెలలు ఆమెతో ఉండి, అ పైన తన యింటికి వెళ్లి పోయింది.
\s బాప్తిసమిచ్చే యోహాను జననం
\p
\v 57 ఎలీసబెతు నెలలు నిండి కొడుకుని కన్నది.
\v 58 అప్పుడు ప్రభువు ఆమెపై ఇంత గొప్ప జాలి చూపాడని ఆమె ఇరుగుపొరుగు, బంధువులు విని ఆమెతో కూడా సంతోషించారు.
\s5
\v 59 వారు ఎనిమిదవ రోజున ఆ బిడ్డకు సున్నతి చేయడానికి వచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అని నామకరణం చేయ బోతుండగా
\v 60 తల్లి "అలా కాదు. అ బాబుకు యోహాను అని పేరు పెట్టాలి" అంది.
\v 61 అందుకు వారు "నీ బంధువుల్లో ఆ పేరు గలవారెవరూ లేరు గదా" అని,
\s5
\v 62 "వాడికి ఏ పేరు పెట్టాలి?" అని తండ్రిని సైగలతో అడిగారు.
\v 63 అతడు పలక తెమ్మని "బాబు పేరు యోహాను" అని రాశాడు; అందుకు వారంతా ఆశ్చర్యపడ్డారు.
\s5
\v 64 వెంటనే అతని నోరు తెరుచుకుంది, నాలుక సడలి, అతడు దేవుణ్ణి స్తుతించ సాగాడు.
\v 65 అది చూసి చుట్టుపట్ల కాపురం ఉన్న వారికందరికీ భయమేసింది. ఈ సమాచారమంతా యూదయ మన్యం అందరూ చెప్పుకోసాగారు.
\v 66 జరిగిన సంగతులు విన్నవారంతా "ఈ బిడ్డ ఎలాటివాడవుతాడో!" అనుకొన్నారు. ఎందుకంటే ప్రభువు హస్తం అతనికి తోడుగా ఉంది
\s5
\v 67 అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండిపోయి ఇలా పలికాడు
\p
\v 68 "ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతి పొందు గాక.
\s5
\p
\v 69 ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, వారికి విమోచన కలిగించాడు
\p
\v 70 తన సేవకుడైన దావీదు వంశంలో మనకోసం రక్షణ శృంగాన్ని నిలిపాడు.
\p
\v 71 మన శత్రువులబారి నుండీ మనల్ని ద్వేషించే వారందరి చేతినుండీ తప్పించి రక్షణనిచ్చాడు.
\s5
\p
\v 72 దీన్ని గురించి ఆయన ఆదినుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిస్తూ వచ్చాడు.
\p
\v 73 ఆయన మన పూర్వీకులను కరుణించడానికీ తన పవిత్ర ఒడంబడికను, అంటే మన తండ్రి అయిన
\v 74 అబ్రాహాముకు తాను ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికోవడానికి ఈ విధంగా జరిగించాడు.
\p
\v 75 మనం శత్రువుల చేతినుండి విడుదల పొంది, మన జీవిత కాలమంతా నిర్భయంగా, ఆయన సన్నిధిలో
\s5
\v 76 పవిత్రంగా నిర్దోషంగా ఆయన్ని సేవించేలా అనుగ్రహించడానికి ఈ రక్షణ కలుగజేశాడు.
\p
\v 77 ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు. మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి
\s5
\v 78 వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు.
\p
\v 79 మన పాదాలను శాంతి మార్గంలో నడిపించేలా చీకటిలోను చావునీడలోను కూర్చున్న వారిపై వెలుగు ప్రకాశిస్తుంది. ఆ మహా వాత్సల్యాన్ని బట్టి పైనుండి ఆయన మనపై ఉదయ కాంతి ప్రసరింపజేసాడు."
\s5
\p
\v 80 ఆ బాలుడు ఎదిగి, ఆత్మలో బలం పుంజుకుంటూ, ఇశ్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు.
\s5
\c 2
\s యేసు జననం (మత్తయి 1:18-25; 2:1)
\p
\v 1 ఆ రోజుల్లో రోమా పాలనలో ఉన్న ప్రపంచమంతటా జనసంఖ్య నిర్వహించాలని సీజర్ అగష్టస్ ఆజ్ఞాపించాడు.
\v 2 ఇది కురేనియస్ సిరియా దేశానికి గవర్నర్ గా ఉండగా జరిగిన మొదటి జనసంఖ్య.
\v 3 అందులో పేరు నమోదు చేయించుకోవడానికి అంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళారు.
\s5
\v 4 యోసేపు కూడా ఆ సంఖ్యలో నమోదు కావడానికి గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనే పేరుగల దావీదు ఊరికి వెళ్ళాడు. ఎందుకంటే అతడు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు.
\v 5 తనకు భార్యగా ప్రదానం జరిగి గర్భవతిగా ఉన్న మరియతో సహా వెళ్ళాడు
\s5
\v 6 వారక్కడ ఉండగా ఆమె నెలలు నిండాయి.
\v 7 ఆమె తన తొలిచూలు బిడ్డను కని, మెత్తని గుడ్డలతో చుట్టి, ఆయనను పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. సత్రంలో వారికి స్థలం దొరకలేదు.
\s గొర్రెల కాపరుల ఆరాధన
\s5
\p
\v 8 ఆ పరిసరాలలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో రాత్రివేళ తమ మందను కాచుకొంటూ ఉన్నారు
\v 9 ప్రభువు దూత వారి దగ్గరకు వచ్చాడు. ప్రభువు తేజస్సు వారి చుట్టూ ప్రకాశించింది. వారు హడలిపోయారు.
\s5
\v 10 అయితే ఆ దూత "భయపడకండి. ఇదిగో మనుషులందరి కోసం మహానందకరమైన శుభవార్త నేను మీకు తెచ్చాను.
\v 11 దావీదు ఊరిలో మీకోసం రక్షకుడు పుట్టాడు, ఈయన ప్రభువు, అభిషిక్తుడు
\v 12 మీకు కొండ గుర్తు ఒకటే. ఒక శిశువు మెత్తని గుడ్డలతో చుట్టి తొట్టిలో పండుకొని ఉండగా మీరు చూస్తారు" అని వారితో చెప్పాడు.
\s5
\v 13 వెంటనే పరలోక సేనావాహిని ఆ దూతతోబాటు ఉండి దేవుని స్తుతిస్తూ
\p
\v 14 "సర్వోన్నత స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద శాంతిసమాధానాలు!" అన్నారు.
\s5
\p
\v 15 ఆ దూతలు తమ దగ్గర నుండి పరలోకానికి వెళ్లిపోయిన తరువాత ఆ గొర్రెల కాపరులు "జరిగిన యీ విషయం ప్రభువు మనకు తెలియజేశాడు. మనం బేత్లెహేముకు వెళ్లి చూద్దాం పదండి," అని ఒకడితో ఒకడు చెప్పుకొని
\v 16 త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పడుకుని ఉన్న శిశువును చూశారు.
\s5
\v 17 చూసి, ఆ శిశువును గురించి తమతో చెప్పిన మాటలు ప్రచారం చేశారు.
\v 18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు విన్న వారంతా ఎంతో ఆశ్చర్యపోయారు.
\v 19 మరియ మాత్రం ఆ విషయాలన్నీ హృదయంలో మననం చేసుకుంటూ పదిలపరచుకుంది.
\v 20 ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గురించి దేవుని మహిమ పరుస్తూ కీర్తిస్తూ వెళ్లిపోయారు.
\s యేసు సున్నతి ఆచారం (లూకా 1:59)
\s5
\p
\v 21 ఆ బిడ్డకి సున్నతి ఆచారం జరిగించవలసిన ఎనిమిదవ రోజున, ఆయన గర్భంలో పడక మునుపు దేవదూత పెట్టిన యేసు అనే పేరు వారు ఆయనకు పెట్టారు.
\s5
\v 22 మోషే ధర్మశాస్త్రం ప్రకారం శుద్ధీకరణ దినాలు పూర్తి అయిన తరువాత
\v 23 'ప్రతి తొలిచూలు మగబిడ్డను ప్రభువుకు ప్రతిష్ఠ చేయాలి' అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉంది గనక ఆయన్ని ప్రభువుకు ప్రతిష్ఠించడానికి,
\v 24 ప్రభువు ధర్మశాస్త్రంలో రాసి ఉన్నట్టు గువ్వల జతనుగానీ రెండు పావురం పిల్లల్ని గానీ బలిగా సమర్పించడానికి, వారు ఆయన్ని యెరూషలేముకు తీసుకుపోయారు.
\s సుమెయోను ఆరాధనం, ప్రవచనం
\s5
\p
\v 25 యెరూషలేము లో సుమెయోను అనే ఒక వృద్ధుడు ఉన్నాడు. అతడు న్యాయవంతుడు, భక్తిపరుడు. ఇశ్రాయేలుకు కలగబోయే ఆదరణ కోసం ఎదురు చూసేవాడు. పరిశుద్ధాత్మ అతనిపై ఉన్నాడు.
\v 26 అతడు ప్రభువు అభిషిక్తుణ్ణి చూడకుండా చనిపోడని అతనికి పరిశుద్ధాత్మ వెల్లడించాడు. ఆ రోజు అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు.
\s5
\v 27 ధర్మశాస్త్ర పద్ధతి ప్రకారం ఆయన విషయంలో జరిగించడానికి తల్లిదండ్రులు బాల యేసును దేవాలయం లోకి తెచ్చారు.
\v 28 సుమెయోను తన చేతుల్లో ఆయన్ని ఎత్తుకుని దేవుణ్ణి స్తుతిస్తూ ఇలా అన్నాడు.
\p
\v 29 "ప్రభూ, ఇప్పుడు నీ మాట చొప్పున శాంతితో నీ సేవకుణ్ణి కడతేరి పోనిస్తున్నావు గదా!
\s5
\p
\v 30 అన్యజనులకు నిన్ను వెల్లడించే వెలుగుగా, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా
\v 31 నీవు ప్రజలందరి ఎదుట సిద్ధం చేసిన
\v 32 నీ రక్షణ నేను కళ్ళారా చూశాను."
\s5
\p
\v 33 యోసేపు, ఆయన తల్లీ ఆయనను గురించి సుమెయోను చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయారు.
\v 34 అతడు వారిని దీవించి, "అనేకమంది హృదయాలోచనలు బయట పడేలా, ఇశ్రాయేలులో అనేకులు పడడానికీ లేవడానికీ వివాదాస్పదమైన చిహ్నంగా దేవుడు ఈయనను నియమించాడు" అన్నాడు.
\v 35 ఆయన తల్లి మరియతో "నీ హృదయం లోకి కత్తి దూసుకు పోతుంది" అని చెప్పాడు.
\s అన్నా ఆరాధనం
\s5
\p
\v 36 దేవుని మూలంగా పలికే అన్నా అనే ఆమె ఉంది. అమెది ఆషేరు గోత్రం, ఆమె పనూయేలు కుమార్తె . ఆమె పెళ్ళయి ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసి వృద్ధాప్యంలో,
\v 37 ఎనభై నాలుగేళ్ళ పాటు విధవరాలుగా ఉండిపోయింది. ఆమె దేవాలయం లోనే ఉంటూ ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్లు సేవ చేస్తూ ఉండేది.
\v 38 ఆమె కూడా ఆ సమయంలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి, యెరూషలేములో విముక్తి కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ బిడ్డను గురించి మాట్లాడుతూ ఉంది.
\s నజరేతుకు తిరిగి రాక
\s5
\p
\v 39 అ విధంగా యోసేపు, మరియ ప్రభువు ధర్మశాస్త్రం చొప్పున కర్మకాండలు పూర్తి చేసుకుని గలిలయ లోని తమ స్వగ్రామం నజరేతుకు వెళ్లిపోయారు.
\v 40 పసివాడు జ్ఞానంతో నిండిపోతూ, ఎదుగుతూ, బలపడుతూ ఉన్నాడు. దేవుని దయ ఆయన మీద ఉంది.
\s యేసు యెరూషలేము యాత్ర
\s5
\p
\v 41 పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్లడం కద్దు.
\v 42 ఆయన పన్నెండేళ్ళప్రాయంలో వాడుక చొప్పున వారు ఆ పండుగకు యెరూషలేము వెళ్ళారు.
\v 43 ఆ రోజులు తీరిన తరువాత వారు తిరిగి వెళుతుండగా బాల యేసు యెరూషలేములో ఉండిపోయాడు.
\v 44 ఆయన తల్లి దండ్రులు ఆ సంగతి తెలియక ఆయన గుంపులో ఉన్నాడనుకుని, ఒక రోజు ప్రయాణం చేసి, తమ బంధువుల్లో, అయిన వారిలో ఆయన్ని వెతకసాగారు.
\s5
\v 45 ఆయన కనబడక పోవడంతో ఆయన్ని వెతుక్కుంటూ యెరూషలేముకు తిరిగి వచ్చారు.
\v 46 అప్పటికి మూడు రోజులైంది. ఆయన అలయంలో ఉపదేశకుల మధ్య కూర్చుని, వారి మాటలు వింటూ వారిని ప్రశ్నలడుగుతూ ఉండగా చూశారు.
\v 47 ఆయన మాటలు విన్నవారందరూ ఆయన ప్రజ్ఞకు, ప్రత్యుత్తరాలకు అబ్బురపడ్డారు.
\s5
\v 48 ఆయన తలిదండ్రులు ఆయన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ఆయన తల్లి "కుమారా, మా విషయంలో ఎందుకిలా చేశావు? మీ నాన్న, నేను అందోళనగా నిన్ను వెతుకుతున్నాం" అంది.
\v 49 అందుకు ఆయన "మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా?" అన్నాడు.
\v 50 కానీ ఆయన తమతో చెప్పిందేమిటో వారికి అర్థం కాలేదు.
\s5
\v 51 అప్పుడు ఆయన వారితో కలిసి బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉన్నాడు. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకొంది.
\v 52 యేసు జ్ఞానంలోనూ, వయస్సులోనూ, దేవుని దయలోనూ, మనుషుల దయలోనూ దినదిన ప్రవర్థమానమవుతూ ఉన్నాడు.
\s5
\c 3
\s బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య (మత్తయి 3:1-12; మార్కు 1:1-8; యోహాను 1:6-8, 15-36)
\p
\v 1 కైసరు తిబెరియస్ పాలించిన పదిహేనవ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయకు అధిపతి. హేరోదు గలలీ రాష్ట్రాధికారి. అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయకూ, త్రకోనీతి ప్రాంతాలకూ పాలకుడు. లుసానియ అబిలేనే పరగణాకు రాష్ట్రాధికారి.
\v 2 అన్న, కయప ప్రధాన యాజకులుగా ఉన్నప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కుమారుడు యోహాను దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది.
\s5
\v 3 పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని యొర్దాను నదీ ప్రాంతమంతా తిరిగి అతడు ప్రకటించాడు.
\s5
\v 4 యెషయా ప్రవక్త గ్రంథంలో ఇలా రాసి ఉంది. "ఎడారిలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయనకు తిన్నని బాటలు వేయండి.
\s5
\v 5 ప్రతి లోయనూ పూడ్చాలి. ప్రతి పర్వతాన్నీ, మెరకనూ పల్లం చేయాలి. వంకర దారులు సరి అవుతాయి. గరుకు బాటలు నునుపు అవుతాయి.
\v 6 ప్రజలందరూ దేవుని రక్షణ చూస్తారు."
\s5
\v 7 అతడు తన దగ్గర బాప్తిసం పొందడానికి గుంపులు గుంపులుగా వచ్చిన వారితో "విష సర్పసంతానమా, రాబోయే ఉగ్రత తప్పించుకొనేలా మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
\s5
\v 8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలు చూపండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడని మీతో చెప్తున్నాను.
\s5
\v 9 ఇప్పటికే , చెట్ల వేరుకు గొడ్డలి ఆనించి ఉంది. కాబట్టి మంచి పళ్ళు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తాడు" అని చెప్పాడు.
\s5
\v 10 అప్పుడు గుంపులో కొంతమంది, "అయితే మేమేం చేయాలి?" అని అతన్ని అడిగారు.
\v 11 అతడు "రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేనివాడికి ఒకటివ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి" అని చెప్పాడు.
\s5
\v 12 పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి "బోధకా, మేమేం చేయాలి" అని అతన్ని అడిగారు.
\v 13 అతడు "మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసికోవద్దు" అని వారితో చెప్పాడు.
\s5
\v 14 "మా సంగతేంటి? మేమేం చేయాలి?"అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. "ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి" అని వారితో చెప్పాడు. .
\s5
\v 15 క్రీస్తు కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ, యోహానే క్రీస్తు అని అందరూ లోలోపల అనుకుంటున్నారు.
\v 16 వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు. "నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను . ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.
\s5
\v 17 తన కళ్ళం బాగు చేయడానికి తూర్పార పట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోధుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చి వేస్తాడు."
\s5
\v 18 అతడు ఇంకా చాలా మాటలు చెప్పి ప్రజలను హెచ్చరిస్తూ సువార్త ప్రకటించాడు.
\v 19 అయితే రాష్ట్రాధికారి హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం, అతని సోదరుని భార్య హేరోదియ విషయం, యోహాను అతన్ని మందలించాడు.
\v 20 హేరోదు అంతవరకు తాను చేసినవన్నీ చాలవన్నట్టు యోహానును చెరసాలలో పెట్టాడు.
\s యేసు బాప్తిసం (మత్తయి 3:13-17; మార్కు 1:9-11)
\s5
\p
\v 21 ప్రజలంతా బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నపుడు ఆకాశం తెరుచుకుంది.
\v 22 పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. "నీవు నా కిష్టమైన కుమారుడివి, నీ వంటే నాకెంతో ఆనందం."
\s యేసు తల్లి మరియ వంశ వృక్షం
\s5
\p
\v 23 యేసు తన పని మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు సుమారు ముప్ఫై సంవత్సరాలు. ఆయన యోసేపు కొడుకు (అని ప్రజలు ఎంచారు). యోసేపు హేలీ కుమారుడు,
\v 24 హేలీ మత్తతు కుమారుడు, మత్తతు లేవి కుమారుడు, లేవి మెల్కీ కుమారుడు,
\s5
\v 25 మెల్కీ యన్న కుమారుడు, యన్న యోసేపు కుమారుడు, యోసేపు మత్తతీయ కుమారుడు, మత్తతీయ ఆమోసు కుమారుడు, ఆమోసు నాహోము కుమారుడు, నాహోము ఎస్లి కుమారుడు, ఎస్లి నగ్గయి కుమారుడు,
\v 26 నగ్గయి మయతు కుమారుడు, మయతు మత్తతీయ కుమారుడు, మత్తతీయ సిమియ కుమారుడు, సిమియ యోశేఖు కుమారుడు, యోశేఖు యోదా కుమారుడు,
\s5
\v 27 యోదా యోహన్న కుమారుడు, యోహన్న రేసా కుమారుడు, రేసా జెరుబ్బాబెలు కుమారుడు, జెరుబ్బాబెలు షయల్తీయేలు కుమారుడు, షయల్తీయేలు నేరి కుమారుడు,
\v 28 నేరి మెల్కీ కుమారుడు, మెల్కీ అద్ది కుమారుడు, అద్ది కోసాము కుమారుడు, కోసాము ఎల్మదాము కుమారుడు, ఎల్మదాము ఏరు కుమారుడు,
\v 29 ఏరు యెహోషువ కుమారుడు, యెహోషువ ఎలీయెజెరు కుమారుడు, ఎలీయెజెరు యోరీము కుమారుడు, యోరీము మత్తతు కుమారుడు, మత్తతు లేవి కుమారుడు,
\s5
\v 30 లేవి షిమ్యోను కుమారుడు, షిమ్యోను యూదా కుమారుడు, యూదా యోసేపు కుమారుడు, యోసేపు యోనాము కుమారుడు, యోనాము ఎల్యాకీము కుమారుడు,
\v 31 ఎల్యాకీము మెలెయా కుమారుడు, మెలెయా మెన్నా కుమారుడు, మెన్నా మత్తతా కుమారుడు, మత్తతా నాతాను కుమారుడు, నాతాను దావీదు కుమారుడు,
\v 32 దావీదు యెష్షయి కుమారుడు, యెష్షయి ఓబేదు కుమారుడు, ఓబేదు బోయజు కుమారుడు, బోయజు శల్మాను కుమారుడు, శల్మాను నయస్సోను కుమారుడు,
\s5
\v 33 నయస్సోను అమ్మీనాదాబు కుమారుడు, అమ్మీనాదాబు అరాము కుమారుడు, అరాము ఎస్రోము కుమారుడు, ఎస్రోము పెరెసు కుమారుడు, పెరెసు యూదా కుమారుడు,
\v 34 యూదా యాకోబు కుమారుడు, యాకోబు ఇస్సాకు కుమారుడు, ఇస్సాకు అబ్రాహాము కుమారుడు, అబ్రాహాము తెరహు కుమారుడు, తెరహు నాహోరు కుమారుడు,
\v 35 నాహోరు సెరూగు కుమారుడు, సెరూగు రయూ కుమారుడు, రయూ పెలెగు కుమారుడు, పెలెగు హెబెరు కుమారుడు, హెబెరు షేలహు కుమారుడు,
\s5
\v 36 షేలహు కేయినాను కుమారుడు, కేయినాను అర్పక్షదు కుమారుడు, అర్పక్షదు షేము కుమారుడు, షేము నోవహు కుమారుడు, నోవహు లెమెకు కుమారుడు,
\v 37 లెమెకు మెతూషెల కుమారుడు, మెతూషెల హనోకు కుమారుడు, హనోకు యెరెదు కుమారుడు, యెరెదు మహలలేలు కుమారుడు, మహలలేలు కేయినాను కుమారుడు,
\v 38 కేయినాను ఎనోషు కుమారుడు, ఎనోషు షేతు కుమారుడు, షేతు ఆదాము కుమారుడు, ఆదాము దేవుని కుమారుడు.
\s5
\c 4
\s క్రీస్తు విషమ పరీక్ష(మత్తయి 4:1-11; మార్కు 1:12-13)
\p
\v 1 యేసు పరిశుద్ధాత్మతో నిండి యొర్దాను నది నుండి తిరిగి వచ్చాడు. ఆత్మ ఆయన్ని అరణ్యంలోకి నడిపించాడు.
\v 2 అక్కడ నలభై రోజులు సాతాను ఆయన్ని విషమ పరీక్షలకు గురి చేశాడు. ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.
\s5
\v 3 సాతాను ఆయనతో "నీవు దేవుని కుమారుడివైతే, ఈ రాయిని రొట్టె అయిపోమని ఆజ్ఞాపించు" అన్నాడు.
\v 4 యేసు "మనిషి రొట్టె వలన మాత్రమే బతకడు" అని రాసి ఉంది" అని జవాబిచ్చాడు.
\s5
\v 5 అప్పుడు సాతాను ఆయన్ని ఎత్తయిన కొండ మీదికి తీసుకు వెళ్లి, ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్క క్షణంలో ఆయనకు చూపించాడు.
\v 6 "ఈ రాజ్యాధికారమంతా వాటి వైభవాలతో పాటు నీకిస్తాను. దానిపై అధికారం నాదే. అది ఎవరికివ్వడం నా ఇష్టమో వారికిస్తాను.
\v 7 కాబట్టి నీవు నాకు మొక్కి నన్ను పూజిస్తే యిదంతా నీదే" అని ఆయనతో చెప్పాడు.
\s5
\v 8 అయితే యేసు "నీ దేవుడైన ప్రభువును పూజించి ఆయన్ని మాత్రమే సేవించాలి" అని రాసి ఉంది" అని వానికి జవాబిచ్చాడు.
\s5
\v 9 ఆ తర్వాత సాతాను యేసును యెరూషలేముకు తీసుకెళ్ళి దేవాలయ గోపురంపై ఉంచి "నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి కిందికి దూకు.
\v 10 "దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.
\v 11 నీ పాదాలకు రాయి తగలకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు" అని రాసి ఉంది గదా," అని ఆయనతో అన్నాడు.
\s5
\v 12 అయితే యేసు "నీ దేవుడైన ప్రభువును పరీక్షించకూడదు" అని రాసి ఉందని జవాబిచ్చాడు.
\v 13 సాతాను, యేసును పరీక్షించడం ముగించి మరొక అవకాశం వచ్చేవరకు ఆయనను విడిచి వెళ్ళిపోయాడు.
\s యేసు గలిలయ తిరిగి రావడం (మత్తయి 4:12-16; మార్కు 1:14)
\s5
\p
\v 14 అప్పుడు యేసు ఆత్మ శక్తి తో గలిలయకు తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనను గురించిన సమాచారం ఆ ప్రాంతమంతా పాకిపోయింది.
\v 15 ఆయన వారి సమాజ మందిరాలలో బోధిస్తుంటే అందరూ ఆయన్ని మెచ్చుకున్నారు.
\s నజరేతు సమాజ కేంద్రంలో
\s5
\p
\v 16 ఒక రోజు తాను పెరిగిన నజరేతుకు ఆయన వచ్చాడు. తన అలవాటు ప్రకారం విశ్రాంతి దినాన సమాజ మందిరానికి వెళ్లి చదవడానికి నిలబడ్డాడు.
\v 17 యెషయా ప్రవక్త గ్రంథం వారు ఆయనకు అందించారు. ఆయన గ్రంథం విప్పితే
\s5
\v 18 "ప్రభువు ఆత్మ నామీద ఉన్నాడు. పేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి స్వేచ్ఛ, గుడ్డివారికి చూపు ప్రకటించడానికీ అణగారిన వారిని విడిపించడానికీ
\v 19 ప్రభువు అనుగ్రహ సంవత్సరం ప్రకటించడానికీ ఆయన నన్ను పంపాడు" అని రాసిన చోటు ఆయనకు దొరికింది.
\s5
\v 20 ఆయన గ్రంథం మూసి సమాజ మందిర పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాడు.
\v 21 సమాజ మందిరం లో ఉన్న వాళ్ళంతా ఆయనను తేరి చూశారు. "మీరు వింటూ ఉండగానే ఈ లేఖనం నెరవేరింది" అని ఆయన వారితో అన్నాడు.
\v 22 అందరూ ఆయనను గురించి గొప్పగా చెప్పుకున్నారు. ఆయన నోటి నుంచి వచ్చే దయాపూరితమైన మాటలకు ఆశ్చర్యపడ్డారు. "ఈయన యోసేపు కొడుకు గదా?" అని చెప్పుకున్నారు.
\s5
\v 23 ఆయన వాళ్ళతో "వైద్యుడా, నిన్ను నీవే బాగు చేసుకో" అనే సామెత నాకు చెప్పి, కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, వాటిని ఈ నీ సొంత ఊరులో కూడా చేయమని మీరు తప్పకుండా నాతో అంటారు.
\v 24 ఆయన ఇంకా ఇలా అన్నాడు, "ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వాళ్ళు అంగీకరించలేదు.
\s5
\v 25 ఏలీయా ప్రవక్త రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో చాలామంది విధవరాళ్ళు ఉన్నారు. మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూసుకుపోయి దేశమంతా తీవ్రమైన కరువు రాగా,
\v 26 దేవుడు ఏలీయాను ఎవరి దగ్గరికీ పంపలేదు, సీదోను పక్కనున్న సారెపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి దగ్గరికే పంపాడు.
\v 27 ఎలీషా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలులో ఎందరో కుష్ఠరోగులున్నా, సిరియా దేశస్థుడు నయమాను తప్ప ఎవరూ బాగుపడలేదు."
\s5
\v 28 సమాజ మందిరం లో ఉన్నవాళ్ళంతా ఆ మాటలు విని
\v 29 ఆగ్రహంతో నిండిపోయి, లేచి ఆయనను ఊరి బయటకు తోసుకుపోయి కొండకొమ్ము వరకూ తీసికెళ్ళారు. వాళ్ళ ఊరు కొండపైన ఉంది. ఆయనను అక్కడ నుండి పడదోయాలనుకున్నారు.
\v 30 అయితే ఆయన వారి మధ్యనుంచి తప్పుకుని తన దారిన వెళ్లిపోయాడు.
\s కపెర్నహూములో దయ్యాలు వెళ్ళగొట్టడం (మార్కు 1:23-26)
\s5
\p
\v 31 అప్పుడాయన గలలీ ప్రాంతంలోని కపెర్నహూము అనే ఊరు వచ్చి, విశ్రాంతి దినాన వారికి బోధించాడు.
\v 32 వారాయన బోధకు ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే ఆయన సాధికారికంగా మాట్లాడాడు .
\s5
\v 33 ఆ సమాజ మందిరం లో అపవిత్ర దయ్యపు ఆత్మ పట్టిన వాడొక డున్నాడు.
\v 34 అతడు బిగ్గరగా ఇలా కేకలు వేశాడు, "నజరేతు వాడా యేసూ, మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నీ వెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడివి."
\s5
\v 35 యేసు "ఊరుకో! ఇతనిలో నుండి బయటకు రా" అని దయ్యాన్ని మందలించాడు. దయ్యం అతణ్ణి వారి మధ్యలో కింద పడేసి అతనికి ఏ హానీ చేయకుండా అతనిలోనుండి బయటికి వచ్చేసింది.
\v 36 అందరూ ఆశ్చర్య పడ్డారు. "ఈయన అధికారంతో ప్రభావంతో దయ్యాలకు ఆజ్ఞాపిస్తుంటే అవి బయటికి వచ్చేస్తున్నాయి" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\v 37 అప్పుడు ఆయనను గురించిన సమాచారం ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా పాకిపోయింది.
\s పేతురు అత్తగారి స్వస్థత (మత్తయి 8:14-17; మార్కు 1:29-38)
\s5
\p
\v 38 ఆయన సమాజ మందిరం నుండి, సీమోను ఇంటికి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడుకొని ఉంది. ఆమెను బాగు చేయాలని వారాయన్ని బతిమాలారు.
\v 39 ఆయన ఆమె దగ్గర నిలబడి జ్వరాన్ని మందలించగానే జ్వరం ఆమెను విడిచింది. వెంటనే ఆమె లేచి వారికి సేవ చేయసాగింది.
\s5
\v 40 పొద్దుగుంకుతున్నపుడు అనేక రకాల జబ్బులున్న వాళ్ళని యేసు దగ్గరికి తెచ్చారు. వారిలో ప్రతి ఒక్కరి మీదా ఆయన చేతులుంచి బాగు చేశాడు.
\v 41 దయ్యాలు "నీవు దేవుని కుమారుడివి" అని కేకలు వేసి చాలా మందిని వదలి వెళ్ళిపోయాయి. ఆయన క్రీస్తు అని వాటికి తెలుసు కాబట్టి ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనివ్వలేదు.
\s5
\v 42 తెల్లారేసరికల్లా ఆయన బయలుదేరి ఏకాంత స్థలానికి వెళ్ళాడు. ప్రజలు గుంపుగా ఆయనను వెదుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. తమ దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఆయన్ని ఆపాలని చూశారు.
\v 43 అయితే ఆయన "నేనింకా చాలా ఊళ్ళలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. దీని కోసమే దేవుడు నన్ను పంపాదు" అని వారితో చెప్పాడు.
\v 44 ఆయన యూదయ ప్రాంతమంతటి లోని సమాజ మందిరాలలో ప్రకటిస్తూ వచ్చాడు.
\s5
\c 5
\s కోకొల్లలుగా చేపలు (యోహాను 21:6-8)
\p
\v 1 ఒకరోజు యేసు గెన్నేసరెతు సరస్సు తీరాన నిలబడి ఉన్నాడు. ప్రజలు గుంపుగా దేవుని వాక్యం వింటూ ఉన్నారు.
\v 2 ఆ సరస్సు తీరాన ఉన్న రెండు పడవలను ఆయన చూశాడు. చేపలు పట్టేవారు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు.
\v 3 ఆయన ఆ పడవలలో సీమోను పడవ ఎక్కి ఒడ్డు నుండి కొద్ది దూరం తోయమని అతని నడిగాడు. అప్పుడాయన దానిలో కూర్చొని ప్రజలకు బోధించాడు.
\s5
\v 4 ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో "పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వేయ" మని అన్నాడు.
\v 5 సీమోను, "స్వామీ, రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను" అని ఆయనతో అన్నాడు.
\v 6 వారలా చేసినప్పుడు విస్తారంగా చేపలు పడ్డాయి. వారి వలలు పిగిలి పోతుంటే
\v 7 వారు వేరే పడవల్లోనున్న తమ సహచరులు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సైగలు చేసారు. వారు వచ్చి రెండు పడవల నిండా చేపలు నింపారు. పడవలు మునిగిపోసాగాయి.
\s5
\v 8 సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్ల ముందు పడి "ప్రభూ, నేను పాపాత్ముణ్ణి, నన్ను విడిచి వెళ్ళు." అన్నాడు.
\v 9 ఎందుకంటే అతడూ అతనితో ఉన్న వారంతా తాము పట్టిన చేపలు చూసి ఆశ్చర్యపోయారు.
\v 10 వీరిలో సీమోను జతగాళ్ళు జెబెదయి కుమారులు యాకోబు, యోహాను కూడా ఉన్నారు. అందుకు యేసు సీమోనుతో "భయపడకు! ఇప్పటి నుంచి నీవు మనుషుల్ని పట్టే వాడివవుతావు" అన్నాడు.
\v 11 వారు పడవల్ని ఒడ్డుకు చేర్చి అన్నీ వదిలేసి ఆయనను అనుసరించారు.
\s యేసు కుష్టురోగిని స్వస్థపరచడం (మత్తయి 8:2-4; మార్కు 1:40-44)
\s5
\p
\v 12 యేసు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒళ్లంతా కుష్టు రోగంతో ఒకడు వచ్చాడు. యేసును చూడగానే సాగిలపడి "ప్రభూ! మీరు దయ తలిస్తే నన్ను బాగు చేయగలరు" అని ఆయనను వేడుకున్నాడు.
\v 13 అప్పుడు యేసు తన చెయ్యి చాపి అతన్ని తాకి, "నాకిష్టమే. బాగు పడు," అన్నాడు. వెంటనే అతని కుష్టు పోయింది.
\s5
\v 14 "ఈ విషయం ఎవరికీ చెప్ప వద్దు. అయితే వెళ్లి యాజకునికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు శుద్ధి కోసం మోషే విధించిన దానిని అర్పించు" అని యేసు అతన్ని ఆదేశించాడు.
\s5
\v 15 అయితే ఆయనను గురించిన సమాచారం ఇంకా ఎక్కువగా వ్యాపించింది. ప్రజలు గుంపులు గుంపులుగా, ఆయన బోధ వినడానికీ తమ రోగాల్ని బాగుచేసుకోడానికీ వచ్చారు.
\v 16 అయితే ఆయన ప్రార్థన చేసుకోడానికి జన సంచారం లేని చోటులకు వెళ్ళిపోయేవాడు.
\s పక్షవాతరోగి స్వస్థత (మత్తయి 9:2-8; మార్కు 2:1-12)
\s5
\p
\v 17 ఒక రోజు ఆయన బోధిస్తున్నపుడు గలలీ, యూదయ ప్రాంతాలలోని చాలా ఊళ్ళ నుండీ యెరూషలేము నుండీ వచ్చిన పరిసయ్యులూ ధర్మశాస్త్రోపదేశకులూ అక్కడ కూర్చుని ఉన్నారు. స్వస్థపరచే ప్రభువు శక్తి ఆయనకుంది.
\s5
\v 18 కొందరు మనుషులు పక్షవాత రోగిని పరుపు మీద మోసుకుని వచ్చారు. అతణ్ణి లోపలికి తెచ్చి, ఆయన ముందు ఉంచాలని చూశారు గాని
\v 19 జనులు క్రిక్కిరిసి ఉండడం చేత అతణ్ణి లోపలికి తేవడానికి వీలు కాలేదు. కాబట్టి, ఇంటికప్పు మీది కెక్కి పెంకులు తీసి పరుపుతో పాటు రోగిని సరిగ్గా యేసు ముందే దింపారు.
\s5
\v 20 యేసు వారి విశ్వాసం చూచి "అయ్యా, నీ పాపాలకు క్షమాపణ దొరికింది" అన్నాడు.
\v 21 శాస్త్రులూ పరిసయ్యులూ "దేవదూషణ చేస్తున్న ఇతడు ఎవడు? దేవుడు తప్ప పాపాలు ఎవరు క్షమించగలరు?" అనుకున్నారు
\s5
\v 22 యేసు వారి ఆలోచన గ్రహించి "మీరు మీ హృదయాలలో అలా ఎందుకు ఆలోచిస్తున్నారు?
\v 23 ఏది సులభమంటారు? "నీ పాపాలు క్షమిస్తున్నాను" అనడమా, "లేచి నడువు" అనడమా?
\v 24 అయితే మనుష్యకుమారునికి భూమి మీద పాపాలు క్షమించే అధికారం ఉందని మీరు తెలిసికోవాలి" అన్నాడు. పక్షవాత రోగిని చూచి "నీవు లేచి, నీ పరుపు తీసుకొని ఇంటికి వెళ్ళు" అన్నాడు.
\s5
\v 25 వెంటనే వాడు వారి ఎదుటే లేచి నిలబడి, తాను పడుకొన్న పరుపు ఎత్తుకొని, దేవుని స్తుతిస్తూ తన ఇంటికి వెళ్ళాడు.
\v 26 అందరూ విస్మయం చెంది "ఈ రోజు వింత విషయాలు చూశాం" అని దేవుని స్తుతిస్తూ భయంతో నిండిపోయారు.
\s మత్తయికి పిలుపు (మత్తయి 9:9; మార్కు 2:13-14)
\s5
\p
\v 27 ఆ తర్వాత ఆయన బయటికి వెళ్లి పన్నులు వసూలు చేసే లేవి అనే ఒక వ్యక్తిని చూశాడు. అతడు పన్నులు కట్టించుకొనే చోట కూర్చుని ఉన్నాడు. ఆయన అతనితో "నా వెంట రా" అన్నాడు.
\v 28 అతడు అంతా విడిచిపెట్టి, లేచి ఆయనను అనుసరించాడు.
\s5
\v 29 లేవి తన ఇంట్లో ఆయనకు గొప్ప విందు చేశాడు. చాలా మంది పన్నులు వసూలు చేసే వాళ్ళూ వేరే వాళ్ళూ వారితో కూడ భోజనానికి కూర్చున్నారు.
\s మతాధికారులతో వాదం (మత్తయి 9:10-17; మార్కు 2:16-22)
\p
\v 30 పరిసయ్యులూ వారి శాస్త్రులూ "మీరు పన్నులు వసూలు చేసే వాళ్ళతో పాపులతో కలిసి తిని తాగుతున్నారేంటి?" అని శిష్యులమీద సణుక్కొన్నారు.
\v 31 అందుకు యేసు "రోగులకే గాని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడక్కర లేదు.
\v 32 పశ్చాత్తాప పడడానికి నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను కాదు," అన్నాడు.
\s5
\v 33 వారాయనతో "యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేస్తారు. పరిసయ్యుల శిష్యులు కూడా అలాగే చేస్తారు. కానీ నీ శిష్యులు తిని తాగుతున్నారు" అని అన్నారు.
\v 34 అందుకు యేసు "పెళ్లి కొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్లి ఇంట్లో ఉన్న వాళ్ళతో మీరు ఉపవాసం చేయించగలరా?
\v 35 పెళ్లి కొడుకును వారి దగ్గర నుండి తీసుకు పోయే రోజులు వస్తాయి. ఆ రోజుల్లో వాళ్ళు ఉపవాసం చేస్తారు" అని వారితో చెప్పాడు.
\s పాత బట్ట, ద్రాక్షరసం నిలవ చేసే తోలు తిత్తి (మత్తయి 9:16, 17: మార్కు 2:21, 22)
\s5
\p
\v 36 ఆయన వారికి ఒక ఉదాహరణ చెప్పాడు. "ఎవరూ పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయరు. ఒక వేళ అలా చేస్తే కొత్త బట్ట చింపవలసి వస్తుంది. కొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలవదు.
\s5
\v 37 ఎవడూ పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయడు. పోస్తే కొత్త ద్రాక్షారసం వలన ఆ తిత్తులు చినిగి పోతాయి. రసం కారిపోతుంది. తిత్తులు పాడవుతాయి.
\v 38 అయితే క్రొత్త ద్రాక్షారసం కొత్త తిత్తులలోనే పోయాలి.
\v 39 పాత ద్రాక్షారసం తాగిన తర్వాత కొత్త దానిని ఎవరూ ఆశించరు. ఎందుకంటే 'పాతదే బాగుంది,' అంటారు."
\s5
\c 6
\s విశ్రాంతి దినం గురించి యేసు ఉపదేశం (మత్తయి 12:1-8; మార్కు 2:23-28)
\p
\v 1 ఒక విశ్రాంతిదినాన ఆయన పంట చేలల్లోంచి వెళ్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కంకులు తెంపి చేతులతో నలుపుకుని తింటున్నారు.
\v 2 అప్పుడు పరిసయ్యులలో కొందరు "విశ్రాంతి దినాన చేయకూడని పని మీరెందుకు చేస్తున్నారు" అని వారినడిగారు.
\s5
\v 3 యేసు వారితో ఇలా అన్నాడు, "దావీదుకీ , అతనితో ఉన్నవారికీ ఆకలి వేసినప్పుడు దావీదు ఏం చేసాడో అది కూడా మీరు చదవలేదా?
\v 4 అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులు తప్ప ఇంకెవరూ తినకూడని సన్నిధి రొట్టెలు తీసుకుని తిని, తనతో ఉన్నవారికీ ఇచ్చాడు కదా!" అన్నాడు.
\v 5 ఇంకా ప్రభువు "అయితే మనుష్యకుమారుడు విశ్రాంతి దినానికి కూడా యజమాని" అని వారితో చెప్పాడు.
\s చెయ్యి చచ్చుబడిపోయిన వాణ్ణి బాగు చెయ్యడం (మత్తయి 12:9-14; మార్కు 3:1-6)
\s5
\p
\v 6 మరో విశ్రాంతి దినాన ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఉపదేశిస్తున్నాడు. అక్కడ కుడి చెయ్యి చచ్చుబడిపోయి బాధ పడుతున్నవాడు ఒకడు ఉన్నాడు.
\v 7 ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ విశ్రాంతి దినాన ఒకవేళ ఆయన ఆ చచ్చుబడిన చేతితో బాధపడుతున్న వాణ్ణి బాగు చేస్తే తప్పు పడదామని కనిపెడుతూ ఉన్నారు.
\v 8 వారి ఆలోచనలు ఆయన తెలుసుకుని, చచ్చుబడిన చెయ్యిగలవాడితో "నువ్వు లేచి అందరి మధ్యలోకి వచ్చి నిలబడు" అన్నాడు. వాడు లేచి నిలిచాడు.
\s5
\v 9 అప్పుడు యేసు "విశ్రాంతి దినాన మేలు చేయడం న్యాయమా? లేక కీడు చేయడం న్యాయమా? ప్రాణాన్ని రక్షించడం న్యాయమా? లేక హత్య చేయడం న్యాయమా? అని మిమ్మల్ని అడుగుతున్నాను" అని వారితో చెప్పి
\v 10 చుట్టూ ఉన్నవారందరినీ ఒక సారి చూసి "నీ చెయ్యి చాపు" అని వాడితో చెప్పాడు. వాడు అలా చాపగానే వాడి చెయ్యి బాగుపడింది.
\v 11 అప్పుడు వారు వెర్రి కోపంతో నిండి పోయి యేసును ఏమి చేయాలా అని తమలో తాము చర్చించుకున్నారు.
\s5
\v 12 ఆ రోజుల్లో ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్లి దేవునికి ప్రార్థన చేయడంలో రాత్రంతా గడిపాడు.
\s పన్నెండుమంది ఎంపిక (మత్తయి10:2-4; మార్కు 3:13-19)
\p
\v 13 ఉదయాన్నే ఆయన తన శిష్యులను పిలిచాడు. వారిలో పన్నెండు మందిని ఏర్పాటు చేసి వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు.
\s5
\v 14 వాళ్ళెవరంటే ఆయన పేతురు అనే మారుపేరు పెట్టిన సీమోను, అతని సోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి,
\v 15 మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుడు అని పిలిచే సీమోను,
\v 16 యాకోబు సోదరుడు యూదా, నమ్మక ద్రోహి ఇస్కరియోతు యూదా అనే వారు.
\s5
\v 17 ఆయన వారితో బాటు కొండ దిగి వచ్చి మైదానంలో నిలిచినప్పుడు ఆయన శిష్యుల సమూహం అక్కడ ఉంది. ఆయన సందేశం వినడానికీ, తమ రోగాలు బాగు చేసుకోడానికీ యూదయ దేశమంతటినుండీ, యెరూషలేము నుండీ తూరు సీదోను అనే పట్టణాలనుండీ, సముద్ర తీరాలనుండీ పెద్ద జనసమూహం వచ్చారు. వారంతా బాగుపడ్డారు.
\v 18 అలాగే అపవిత్రాత్మలు పట్టి పీడిస్తున్న వారు కూడా బాగయ్యారు.
\v 19 రోగాలను బాగుచేసే ప్రభావం ఆయనలోనుండి బయలుదేరి అందరినీ బాగుచేస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆయనను తాకాలని ప్రయత్నం చేశారు.
\s నవ ధన్యతలు (మత్తయి 5:3-12)
\s5
\p
\v 20 అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని తదేకంగా చూసి ఇలా అన్నాడు,
\p " పేదలారా, మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది.
\p
\v 21 ఇప్పుడు ఆకలితో ఉన్నవారలారా, మీరు ధన్యులు, మీకు తృప్తి కలుగుతుంది.
\p ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు.
\s5
\p
\v 22 మనుష్యకుమారుని కారణంగా మనుష్యులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి మీరు చెడ్డవారంటూ మీ పేరును కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు.
\v 23 ఆ రోజు మీరు సంతోషించి గంతులు వేయండి. చూడండి, పరలోకంలో మీకు గొప్ప ప్రతిఫలం కలుగుతుంది. వారి పూర్వీకులు ప్రవక్తలకు అలాగే చేశారు.
\s5
\p
\v 24 అయ్యో, ధనికులారా, మీకు యాతన. మీరు కోరిన ఆదరణ మీరు ఇప్పటికే పొందారు.
\v 25 అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న మీకు యాతన. మీకు ఆకలి వేస్తుంది. అయ్యో, ఇప్పుడు నవ్వుతున్న మీకు యాతన. మీరు దుఃఖించి ఏడుస్తారు.
\s5
\v 26 మనుష్యులందరూ మిమ్మల్ని పొగుడుతూ ఉంటే మీకు యాతన. వారి పూర్వీకులు అబద్ధ ప్రవక్తలకు అలాగే చేశారు.
\s ఉత్తమ ఆదర్శం
\s5
\p
\v 27 వింటున్న మీతో నేను చెప్పేదేమిటంటే మీ శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి.
\v 28 మిమ్మల్ని శపించే వారిని దీవించండి. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థించండి.
\s5
\v 29 నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండో చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు.
\v 30 అడిగే ప్రతివాడికీ ఇవ్వు. నీ ధనాన్ని తీసుకున్న వాణ్ణి దాని కోసం తిరిగి అడగవద్దు.
\s5
\v 31 మనుష్యులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి.
\v 32 మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు కూడా ప్రేమిస్తే మిమ్మల్నెవరు మెచ్చుకుంటారు? పాపాత్ములు కూడా తమను ప్రేమించే వారిని ప్రేమిస్తారు కదా.
\v 33 మీకు మేలు చేసే వారికే మీరు మేలు చేస్తూ ఉంటే మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా అలాగే చేస్తారు కదా!
\v 34 అప్పు తీరుస్తారు అనుకున్న వాళ్ళకే మీరు అప్పిస్తూ ఉంటే దాంట్లో మీకేం మెప్పు కలుగుతుంది? పాపాత్ములు కూడా మరలా వసూలు చేసుకోవచ్చనుకుని పాపాత్ములకే అప్పులిస్తూ ఉంటారు కదా.
\s5
\v 35 మీరైతే మీ శత్రువులను ప్రేమించండి. వారికి మేలు చేయండి. తిరిగి చెల్లిస్తారని ఆశ లేకుండా అప్పు ఇవ్వండి. అప్పుడు మీ బహుమతి గొప్పగా ఉంటుంది. మీరు సర్వోన్నతుడైన దేవుని సంతానమై ఉంటారు. ఆయన కృతజ్ఞత లేని వారి పట్లా, దుర్మార్గుల పట్లా దయాపరుడై ఉన్నాడు.
\v 36 కాబట్టి మీ పరమ తండ్రి కనికరం చూపిస్తాడు కనుక మీరు కూడా కనికరం గలవారై ఉండండి.
\s5
\v 37 ఇతరులకు తీర్పు తీర్చవద్దు. అప్పుడు ఎవరూ మీకు తీర్పు తీర్చరు. ఎవరి మీదా నేరారోపణ చేయవద్దు. అప్పుడు ఎవరూ మీ మీద నేరం మోపరు.
\s5
\v 38 క్షమించండి. అప్పుడు మిమ్మల్ని క్షమిస్తారు. ఇవ్వండి. అప్పుడు మీకూ ఇస్తారు. అప్పుడు మనుషులు మీకు అదిమి, కుదించి పొంగి పొర్లి పోయేంతగా కొలిచి మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతలో కొలుస్తారో అదే కొలతలో మీకూ కొలుస్తారు."
\s5
\v 39 తర్వాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు, "ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి ఎలా చూపిస్తాడు? వారిద్దరూ గుంటలో పడరా?
\v 40 శిష్యుడు తన గురువు కంటే అధికుడు కాడు. అయితే సంపూర్ణంగా సిద్ధపడినవాడు తన గురువులా ఉంటాడు.
\s5
\v 41 నువ్వు నీ కంట్లో ఉన్న దూలాన్ని పట్టించుకోకుండా నీ సోదరుడి కంట్లో నలుసును చూడడమెందుకు?
\v 42 నీ కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా నీ సోదరుడితో "సోదరా, నీ కంట్లో నలుసు తీసి వేయనియ్యి" అని నువ్వెలా చెప్పగలవు? మోసగాడా, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేయి. అప్పుడు నీ సోదరుడి కంట్లో నలుసు తీసివేయడానికి నీకు స్పష్టంగా కన్పిస్తుంది.
\s5
\v 43 మంచి చెట్టుకు పనికిమాలిన కాయలు కాయవు. అలాగే పనికిమాలిన చెట్టుకు మంచి కాయలు కాయవు.
\v 44 ఏ చెట్టయినా దాని పండ్లను బట్టి తెలిసిపోతుంది. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకోరు. రక్కెస పొదలో ద్రాక్షపండ్లు కోయరు.
\s5
\v 45 మంచి మనిషి తన హృదయమనే ధననిధిలోనుండి మంచి విషయాలను బయటకు తెస్తాడు. చెడ్డవాడు తన చెడ్డ ధననిధి లోనుండి చెడ్డ విషయాలను బయటకు తెస్తాడు. హృదయం దేనితో నిండి ఉంటే దాన్నిబట్టే నోరు మాట్లాడుతుంది.
\s5
\v 46 నా సందేశం ప్రకారం చేయకుండా ఊరికే "ప్రభూ, ప్రభూ" అని నన్ను పిలవడం ఎందుకు?
\s గట్టి నేలపై కట్టిన ఇల్లు (మత్తయి 7:24-27)
\p
\v 47 నా దగ్గరకు వచ్చి, నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతివాడూ ఎవర్ని పోలి ఉంటాడో వినండి.
\v 48 వాడు ఇల్లు కట్టాలని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడి వలె ఉంటాడు. వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ ఇంటిపై వేగంగా కొట్టినా దానిని బలంగా కట్టారు కనుక దానిని కదిలించలేక పోయింది.
\s5
\v 49 అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివాడు పునాది వేయకుండా నేలమీద ఇల్లు కట్టిన వాడిలా ఉంటాడు. ప్రవాహం దానిమీద వడిగా కొట్టగానే అది కూలి పోతుంది. ఆ యింటి నాశనం ఎంతో దయనీయం."
\s5
\c 7
\s శతాధిపతి సేవకుని స్వస్థత (మత్తయి 8:5-13)
\p
\v 1 ఆయన తన మాటలన్నీ ప్రజలకు పూర్తిగా వినిపించి కపెర్నహూం కి వచ్చాడు.
\s5
\v 2 అక్కడ ఒక శతాధిపతికి ఇష్టమైన సేవకుడు ఒకడికి జబ్బు చేసి చావడానికి సిద్ధంగా ఉన్నాడు.
\v 3 ఈ శతాధిపతి యేసును గురించి విని, ఆయన వచ్చి తన దాసుణ్ణి బాగు చేయాలని ఆయన్ని బతిమాలడానికి యూదుల పెద్దలను ఆయన దగ్గరకు పంపించాడు.
\v 4 వారు యేసు దగ్గరకు వచ్చి "నువ్వు తప్పక ఈ మేలు చేయాలి. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా యోగ్యుడు.
\v 5 అతడు మన ప్రజల్ని ప్రేమించాడు. మన సమాజ మందిరాన్ని ఇతనే మన కోసం కట్టించాడు" అని ఆయన్ని ఎంతో బతిమాలారు.
\s5
\v 6 కాబట్టి యేసు వారితో వెళ్ళాడు. ఆయన అతని ఇంటి దగ్గరలోకి వచ్చినప్పుడు, ఆ శతాధిపతి తన స్నేహితుల్ని కొందరిని పంపి వారితో యేసుకు ఇలా చెప్పించాడు "ప్రభూ, నువ్వు శ్రమ తీసుకోవద్దు. నువ్వు నా ఇంట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు.
\v 7 అలాగే నీ దగ్గరకు వచ్చే యోగ్యత కూడా నాకు లేదు. నువ్వు మాట మాత్రం చెప్పు. నా దాసుడికి పూర్తిగా నయమవుతుంది.
\v 8 నేను కూడా అధికారం కింద ఉన్న వాణ్ణే. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకణ్ణి 'వెళ్ళు' అంటే వెళ్తాడు, ఒకణ్ణి 'రా' అంటే వస్తాడు. నా దాసుణ్ణి ఫలానా పని చేయమంటే చేస్తాడు."
\s5
\v 9 యేసు ఈ మాటలు విని, ఆ వ్యక్తి విషయం ఆశ్చర్య పోయాడు. తన వెనకాలే వస్తున్న జనసమూహం వైపు తిరిగి "ఇశ్రాయేలు ప్రజలలో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్తున్నాను" అన్నాడు.
\v 10 అతను పంపిన వారు తిరిగి వచ్చి ఆ పనివాడు జబ్బు నయమై పూర్తి ఆరోగ్యంతో ఉండటం చూశారు.
\s విధవరాలి కొడుక్కి ప్రాణం పోయడం
\s5
\p
\v 11 ఇది జరిగిన తర్వాత ఆయన నాయీను అనే ఒక ఊరికి వెళ్తున్నాడు. ఆయన శిష్యులు, ఇంకా పెద్ద జనసమూహం ఆయనతో వెళ్తున్నారు.
\v 12 ఆయన ఆ ఊరి పొలిమేరకు వచ్చినప్పుడు కొందరు చనిపోయిన వాణ్ణి బయటకు మోసుకుని వెళ్తూ ఎదురయ్యారు. చనిపోయిన వాడు అతని తల్లికి ఒక్కగానొక్క కొడుకు. ఆమె విధవరాలు. గ్రామస్తులు చాలామంది ఆమెతో ఉన్నారు.
\v 13 ప్రభువు ఆమెను చూచి ఆమెపై జాలిపడి "ఏడవ వద్దు" అని ఆమెకు చెప్పి, దగ్గరకు వచ్చి ఆ పాడెను ముట్టుకున్నాడు. దాంతో దానిని మోసేవారు నిలబడి పోయారు.
\v 14 ఆయన "అబ్బాయ్, నేను చెప్తున్నాను, లే!" అన్నాడు.
\v 15 ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుని మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన అతణ్ణి ఆ తల్లికి అప్పచెప్పాడు.
\s5
\v 16 అందరూ భయంతో నిండిపోయి "మనలో గొప్ప ప్రవక్త లేచాడు. దేవుడు తన ప్రజలకు దర్శనాన్ని అనుగ్రహించాడు" అంటూ దేవుణ్ణి కీర్తించారు.
\v 17 ఆయనను గురించిన ఈ సమాచారం యూదయ ప్రాంతమంతటా ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపించింది.
\s5
\v 18 యోహాను శిష్యులు ఈ సంగతులన్నటినీ యోహానుకు తెలియచేశారు.
\s బాప్తిసమిచ్చే యోహాను సందేహం (మత్తయి 11:2-6)
\p
\v 19 అప్పుడు యోహాను తన శిష్యులలో ఇద్దరిని పిలిచి "రావలసిన వాడివి నువ్వేనా? లేక మరొకరి కోసం మేం ఎదురు చూడాలా?" అని అడగడానికి వారిని ప్రభువు దగ్గరకు పంపించాడు.
\v 20 వారు ఆయన దగ్గరకు వచ్చి "రావలసిన వాడివి నువ్వేనా ? లేక మరొకరి కోసం ఎదురు చూడాలా? అని అడగమని మమ్మల్ని బాప్తిస్మమిచ్చే యోహాను నీ దగ్గరకు పంపాడు" అని చెప్పారు.
\s5
\v 21 అదే సమయంలో ఆయన అనేకమంది రోగులనూ, బాధితులనూ, దయ్యాలు పట్టిన వారినీ బాగు చేస్తూ ఉన్నాడు. గుడ్డివారికి చూపు ప్రసాదిస్తూ ఉన్నాడు.
\v 22 అప్పుడాయన వారికి ఇలా జవాబిచ్చాడు "వెళ్లి మీరు చూసిన వాటినీ వినిన వాటినీ యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టు రోగులు బాగుపడుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయిన వారు తిరిగి ప్రాణంతో లేస్తున్నారు. శుభవార్త ప్రకటన జరుగుతూ ఉంది.
\v 23 నా విషయంలో అభ్యంతరాలేమీ లేనివాడు ధన్యుడు"
\s బాప్తిసమిచ్చే యోహాను గురించి యేసు సాక్ష్యం (మత్తయి 11:7-15)
\s5
\p
\v 24 యోహాను దగ్గర నుండి వచ్చిన శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత ఆయన యోహాను గురించి జన సమూహంతో ఇలా చెప్పాడు "మీరు ఏం చూద్దామని అడవిలోకి వెళ్లారు? గాలికి ఊగే రెల్లునా?
\v 25 అది కాకుంటే మరేం చూడ్డానికి వెళ్ళారు? సన్నని వస్త్రాలు ధరించుకున్నవాడినా? వినండి, విలువైన వస్త్రాలు ధరించుకుని సుఖంగా జీవించే వాళ్ళు రాజ మందిరాల్లో ఉంటారు.
\v 26 అదీ కాక పోతే ఇంకేం చూద్దామని వెళ్ళారు? ప్రవక్తనా? అవును. కానీ యోహాను ఒక ప్రవక్త కంటే గొప్పవాడని మీకు చెప్తున్నాను.
\s5
\v 27 "చూడు! నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీకు ముందుగా నీ మార్గాన్ని సిద్ధ పరుస్తాడు" అని ఎవర్ని గురించి రాసారో అతడే యీ యోహాను.
\v 28 స్త్రీ గర్భాన పుట్టిన వారిలో యోహాను కంటె గొప్పవాడెవడూ లేడు. అయినా దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటె గొప్పవాడని మీతో చెప్తున్నాను."
\s5
\v 29 ప్రజలందరూ, పన్ను వసూలుదారులూ యోహాను సందేశం విని, దేవుడు నీతిమంతుడని అంగీకరించారు. అతని ద్వారా బాప్తిస్మం పొందారు.
\v 30 కానీ పరిసయ్యులూ, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వారూ అతని చేత బాప్తిస్మం పొందకుండా వాళ్ళ జీవితాల్లో దేవుని సంకల్పాన్ని నిరాకరించారు.
\s5
\v 31 కాబట్టి యీ తరం మనుష్యులను నేను దేనితో పోల్చాలి? వీళ్ళు దేనిలాగా ఉన్నారు?
\v 32 సంతవీధుల్లో కూర్చుని "మేం వేణువు ఊదాం, మీరు నాట్యం చేయలేదు, ఏడుపు పాట పాడాం, మీరేమో ఏడవలేదు" అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆటలాడుకునే చిన్న పిల్లల్లా ఉన్నారు.
\s5
\v 33 బాప్తిస్మ మిచ్చే యోహాను రొట్టెలు తినకుండా ద్రాక్షారసం తాగకుండా ఉన్నాడని వీడికి దయ్యం పట్టిందని మీరు అంటున్నారు.
\v 34 మనుష్య కుమారుడు తింటూ తాగుతూ ఉన్నాడని వీడు తిండిబోతూ, తాగుబోతూ, సుంకరులకీ పాపులకీ స్నేహితుడూ అంటున్నారు.
\v 35 అయితే జ్ఞానం దాని పిల్లల్ని బట్టి జ్ఞానమని తీర్పు పొందుతుంది."
\s పరిసయ్యుని ఇంట్లో యేసు
\s5
\p
\v 36 పరిసయ్యులలో ఒకడు తనతో భోజనం చేయాలని ఆయనను ఆహ్వానించాడు. ఆయన ఆ పరిసయ్యుడి ఇంటికి వెళ్లి భోజనానికి కూర్చున్నాడు.
\v 37 ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, యేసు పరిసయ్యుని ఇంట్లో భోజనానికి వచ్చాడని తెలుసుకుని, ఒక బుడ్డిలో అత్తరు తీసుకు వచ్చి
\v 38 ఆయనకు వెనుకగా ఆయన పాదాలకు దగ్గరగా ఏడుస్తూ నిలబడింది. ఆమె కన్నీళ్ళతో ఆయన పాదాలు తడిసి పోయాయి. ఆమె తన వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి వాటిని ముద్దు పెట్టుకుని వాటికి అత్తరు పూసింది.
\s5
\v 39 ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి "ఈయన ప్రవక్తే అయితే తనను ముట్టుకున్న స్త్రీ ఎవరో, ఎలాంటిదో తెలుసుకోగలుగుతాడు. ఈమె పాపాత్మురాలు" అని తనలో తాను అనుకున్నాడు.
\v 40 దానికి యేసు "సీమోనూ, నీతో ఒక మాట చెప్పాలి" అని అతనితో అన్నాడు. అతడు "ఉపదేశకా, చెప్పు" అన్నాడు.
\s అప్పు తీసుకున్న ఇద్దరు వ్యక్తులు
\s5
\p
\v 41 అప్పుడు యేసు "అప్పులిచ్చే ఒకడి దగ్గర ఇద్దరు అప్పు చేశారు. వారిలో ఒకడు ఐదువందల వెండి నాణేలూ మరొకడు యాభై వెండి నాణేలూ బాకీ పడ్డారు.
\v 42 ఆ అప్పు తీర్చడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి ఆ వ్యక్తి వాళ్ళిద్దరినీ క్షమించేసాడు. కాబట్టి వీరిద్దరిలో అతణ్ణి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో చెప్పు?" అని అడిగాడు.
\v 43 అందుకు సీమోను "అతడెవరిని ఎక్కువ క్షమించాడో వాడే అని నాకు అన్పిస్తుంది" అన్నాడు. దానికి యేసు "సరిగ్గా ఆలోచించావు" అని అతనితో చెప్పి
\s5
\v 44 ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోనుతో ఇలా అన్నాడు, "ఈ స్త్రీని చూస్తున్నావు కదా. నేను నీ ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోడానికి నాకు నీళ్ళివ్వలేదు, కానీ ఈమె కన్నీళ్ళతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది.
\v 45 నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చిన దగ్గర్నించి ఈమె నా పాదాల్ని ముద్దు పెట్టుకోవడం ఆపలేదు.
\s5
\v 46 నువ్వు నా తలకి నూనె పూయలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది.
\v 47 దీన్ని బట్టి నేను చెప్పేదేమిటంటే అనేక పాపాలు చేసిన ఈమె అధికమైన క్షమాపణ పొందింది, అధికంగా ప్రేమించింది. ఎవరికి కొంచెం క్షమాపణ దొరుకుతుందో వాడు కొంచేమే ప్రేమిస్తాడు" అని చెప్పాడు.
\s5
\v 48 తర్వాత ఆమెతో "నీ పాపాలకు క్షమాపణ దొరికింది" అన్నాడు.
\v 49 అప్పుడు ఆయనతో పాటు భోజనానికి కూర్చున్న వారు "పాపాలు క్షమించడానికి ఇతనెవరు?" అని తమలో తాము అనుకోవడం మొదలు పెట్టారు.
\v 50 దానికి ఆయన "నీ విశ్వాసం నిన్ను రక్షించింది. శాంతిగా వెళ్ళు" అని ఆమెతో చెప్పాడు.
\s5
\c 8
\s గలిలయ లో ఉపదేశాలు, స్వస్థతలు
\p
\v 1 ఆ తర్వాత ఆయన ప్రతి పట్టణానికీ ప్రతి గ్రామానికీ దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ, ప్రకటిస్తూ సంచారం చేస్తున్నాడు.
\v 2 పన్నెండుగురు శిష్యులు, అపవిత్రాత్మలనుంచీ, రోగాలనుంచీ ఆయన బాగుచేసిన కొందరు స్త్రీలూ, అంటే ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ, హేరోదు గృహనిర్వాహకుడైన కూజా అనే అతని భార్య యోహన్నా, సూసన్నా ఆయనతో కూడా ఉన్నారు.
\v 3 వీరూ ఇంకా అనేకులు తమ ఆస్తిలో నుండి ఆయనకు సహాయం చేసేవారు.
\s విత్తనాలు చల్లే రైతు ఉపమానం (మత్తయి 13:1-23; మార్కు 4:1-20)
\s5
\p
\v 4 ఒకసారి ప్రతి పట్టణం నుండీ ప్రజలు పెద్ద గుంపులుగా ఆయన దగ్గరకు వస్తున్నారు. అప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పాడు.
\v 5 "విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు. అతడు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. కాబట్టి గాలిలో ఎగిరే పక్షులు వాటిని మింగి వేశాయి
\v 6 మరి కొన్ని రాతినేలమీద పడ్డాయి. అవి మొలిచాయి కానీ లోపల తడి లేకపోవడంతో ఎండి పోయాయి.
\s5
\v 7 మరి కొన్ని ముళ్ళపొదల మధ్యలో పడ్డాయి. ముళ్ళపొదలు వాటితో కూడా మొలిచి వాటిని అణచి వేశాయి.
\v 8 మరికొన్ని మంచినేలపై పడ్డాయి. అవి మొలిచి నూరు రెట్లుగా ఫలించాయి." ఆయన ఇలా చెప్పి "వినడానికి చెవులున్నవాడు వింటాడు గాక" అని బిగ్గరగా అన్నాడు.
\s5
\v 9 ఆయన శిష్యులు "ఈ ఉపమానం అర్ధం ఏమిటి?" అని అడిగారు
\v 10 ఆయన "దేవుని రాజ్య రహస్య సత్యాలు తెలుసుకునే ఆధిక్యత మీరు పొందారు. ఇతరులకైతే చూస్తూ ఉన్నా చూడకుండా, వింటూ ఉన్నా అర్ధం కాకుండా ఉండటానికి వారికి ఉపమానాల్లోనే బోధిస్తున్నాను.
\s5
\v 11 ఈ ఉపమానానికి అర్ధం ఏమిటంటే విత్తనం దేవుని వాక్యం.
\v 12 దారి పక్కనే ఉండేవారు, వీరు వింటారు గానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి వాక్యాన్ని తీసివేస్తాడు.
\v 13 రాతినేలపై ఉండే వారు, వీరు వింటున్నప్పుడు వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారు. కానీ వేరు లేదు కాబట్టి కొంతకాలం నమ్మి తర్వాత విషమ పరీక్షల కాలంలో తొలగి పోతారు.
\s5
\v 14 ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలను పోలిన వారు, వీరు వింటారు గానీ కాలం గడిచే కొద్దీ జీవితంలో ఎదురయ్యే చింతలతో, సుఖాలతో, సంపదలతో ఉక్కిరి బిక్కిరై అణగారి పోతారు. వీరి ఫలం పక్వానికి రాదు.
\v 15 మంచి నేలపై పడే విత్తనం ఎవరంటే యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని విని నిలుపుకుని ఓపికతో ఫలించేవారు.
\s వెలిగించిన దీపం ఉపమానం (మత్తయి 5:15-16; మార్కు 4:21-23; లూకా 11:33)
\s5
\p
\v 16 ఎవరూ దీపాన్ని వెలిగించి బుట్టతో కప్పివేయడు. మంచం కింద పెట్టడు. ఇంట్లోకి వచ్చేవారికి వెలుగు కనిపించేలా దీపస్తంభం పై ఉంచుతాడు.
\v 17 తేటతెల్లం కాని రహస్యమేదీ లేదు. తెలియకుండా, బయట పడకుండా, మరుగుగా ఉండిపోయేది ఏదీ లేదు.
\v 18 కలిగిన వ్యక్తికే ఇస్తారు, లేని వ్యక్తి నుండి తనకు ఉంది అనుకున్నది కూడా తీసివేస్తారు. కాబట్టి మీరు ఎలా వింటున్నారో చూసుకోండి" అన్నాడు.
\s కొత్త అనుబంధాలు (మత్తయి 12:46-50; మార్కు 3:31-35)
\s5
\p
\v 19 ఆయన తల్లీ, సోదరులూ అక్కడికి వచ్చారు గానీ అంతా గుంపుగా ఉండటం వల్ల ఆయనకు దగ్గరగా రాలేకపోయారు.
\v 20 అప్పుడు "నిన్ను చూడ్డానికి నీ తల్లీ నీ తమ్ముళ్ళూ వచ్చి బయట నిల్చున్నారు" అని ఎవరో ఆయనతో అన్నారు.
\v 21 అందుకు ఆయన "దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జరిగించే వీరే నా తల్లీ నా తమ్ముళ్ళూ" అన్నాడు.
\s యేసు పెనుగాలిని, అలలను అదుపుచేయడం (మత్తయి 8:23-27; మార్కు 4:36-41)
\s5
\p
\v 22 మరొక రోజు ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి "సరస్సు అవతలి వైపుకు వెళ్దాం" అన్నాడు. వారు ఆ పడవను నీటిలోకి తోసి బయలుదేరారు.
\v 23 వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్ర పోయాడు. ఈలోగా సరస్సు మీదికి గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది.
\s5
\v 24 కాబట్టి వారు ఆయన దగ్గరకు వచ్చి, "ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం" అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలనూ గద్దించాడు. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది.
\v 25 అప్పుడు ఆయన "మీ విశ్వాసం ఎక్కడ?" అన్నాడు. వారు భయపడి పోయారు, "ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో" అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు.
\s గదర ప్రదేశం లో దయ్యం పట్టిన వాణ్ణి బాగు చేయడం (మత్తయి 8:28-34; మార్కు 5:1-17)
\s5
\p
\v 26 వారు గలిలీకి ఎదురుగా ఉండే గెరాసేను ప్రాంతానికి వచ్చారు.
\v 27 ఆయన ఒడ్డున దిగగానే ఆ ఊరి వాడు ఒకడు ఆయన్ని ఎదుర్కోడానికి వచ్చాడు. వాడికి దయ్యాలు పట్టి చాల కాలం నుండి బట్టలు కట్టుకోకుండా తిరుగుతున్నాడు. సమాధులే వాడి నివాసం. ఇంట్లో ఉండేవాడు కాదు.
\s5
\v 28 వాడు యేసును చూసి, కేకలు వేశాడు. వచ్చి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసాడు. "సర్వోన్నతుడైన దేవుని కుమారా, యేసూ, నా జోలి నీకెందుకు? నన్ను బాధించకు. నిన్ను బతిమాలుకుంటున్నాను" అంటూ కేకలు పెట్టాడు.
\v 29 ఎందుకంటే ఆయన "ఈ వ్యక్తిని వదిలి బయటకు రా" అని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞ ఇచ్చాడు. అది చాలాసార్లు వాణ్ణి పట్టి పీడిస్తుంది. వాణ్ణి గొలుసులతోనూ, కాలి సంకెళ్ళతోనూ బంధించి వాడికి కాపలా పెట్టారు గానీ వాడు ఆ బంధకాలన్నిటినీ తెంచుకునేవాడు. దయ్యాలు వాణ్ణి అడవిలోకి తీసుకుపోయేవి.
\s5
\v 30 యేసు "నీ పేరు ఏమిటి?" అని వాడిని అడిగాడు. చాలా దయ్యాలు వాడిలో చొరబడి ఉన్నాయి.
\v 31 కాబట్టి వాడు "నా పేరు సైన్యం" అన్నాడు. పాతాళంలోకి వెళ్ళమని తనకు ఆజ్ఞ ఇవ్వ వద్దని వాడు ఆయనను ఎంతో బతిమాలాడు.
\s5
\v 32 అక్కడ పెద్ద పందుల మంద ఒకటి కొండ మీద మేస్తూ ఉంది. వాటిలో చొరబడడానికి అనుమతి నిమ్మని ఆయనను బతిమాలినప్పుడు ఆయన వాటికి అనుమతినిచ్చాడు.
\v 33 అప్పుడు దయ్యాలు ఆ వ్యక్తిని విడిచి పెట్టి వెళ్లి పందులలో చొరబడ్డాయి. అప్పుడు ఆ మంద ఎత్తైన కొండపై నుండి పరుగెత్తుకుంటూ వెళ్లి సరస్సులో పడి ఊపిరి ఆడక చచ్చాయి.
\s5
\v 34 ఆ పందుల్ని మేపుతున్న వారు ఇదంతా చూసి పారిపోయారు. వారు పట్టణంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లోనూ జరిగిందంతా చెప్పారు.
\v 35 ఆ ఊరి ప్రజలు అదంతా చూడటానికి వెళ్లారు. వారంతా యేసు దగ్గరకు వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలిన వాడు బట్టలు కట్టుకుని స్థిమితంగా యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండటం చూసి భయపడ్డారు.
\s5
\v 36 జరిగిన దాన్ని దగ్గరగా చూసిన వారు వాడు ఎలా బాగయ్యాడో ప్రజలకు చెప్పారు.
\v 37 గెరాసేను ప్రాంతాల్లో ఉన్న వారంతా ఎంతో భయపడ్డారు. మమ్మల్ని విడిచి వెళ్ళమని ఆయనను బతిమాలుకున్నారు.
\s5
\v 38 ఆయన తిరిగి పడవ ఎక్కి వెళ్లబోతుంటే దయ్యాలు విడిచిన వ్యక్తి తనను కూడా ఆయనతో ఉండనిమ్మని బతిమాలాడు.
\v 39 కానీ ఆయన "నువ్వు నీ ఇంటికి వెళ్లి దేవుడు నీకు చేసిన గొప్ప విషయాలను చెప్పు" అని వాణ్ణి పంపి వేశాడు. వాడు వెళ్లి యేసు తనకు చేసిన గొప్ప కార్యాన్ని గురించి ఆ పట్టణమంతా ప్రకటించాడు.
\s రుతుస్రావం ఉన్న స్త్రీ స్వస్థత, యాయీరు కూతురుకి ప్రాణదానం(మత్తయి 9:18-26; మార్కు 5:22-43)
\s5
\p
\v 40 ఇవతలి ఒడ్డున జనమంతా ఆయన కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కాబట్టి యేసు తిరిగి రాగానే వారు ఆయనను సంతోషంగా స్వీకరించారు.
\v 41 అప్పుడు సమాజ మందిరపు అధికారి యాయీరు అనే వ్యక్తి వచ్చి ఆయన పాదాలపై పడ్డాడు.
\v 42 సుమారు పన్నెండేళ్ళ వయసున్న తన ఏకైక కుమార్తె జబ్బుపడి చావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆయనను తన ఇంటికి రమ్మని బతిమాలుకున్నాడు. ఆయన వెళ్తుంటే క్రిక్కిరిసిన జన సమూహం ఆయన మీద పడుతున్నారు.
\s5
\v 43 అప్పుడు పన్నెండేళ్ళ నుండి రుతుస్రావంతో బాధ పడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసింది. కానీ ఎక్కడా నయం కాలేదు. ఆమె ఆయనకి వెనగ్గా వచ్చి
\v 44 ఆయన పైబట్ట అంచును తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
\s5
\v 45 వెంటనే యేసు "నన్ను తాకిందెవరు?" అని అడిగాడు. చుట్టూ ఉన్నవారు "మాకు తెలియదే" అన్నారు. అప్పుడు పేతురు, "ప్రభూ, జనమంతా తోసుకుంటూ నీ మీద పడుతున్నారు" అన్నాడు.
\v 46 యేసు "ఎవరో నన్ను తాకారు. నాలోనుండి ప్రభావం బయటకు వెళ్లిందని నాకు తెలిసింది" అన్నాడు.
\s5
\v 47 ఇక తాను దాగి ఉండలేనని ఆ స్త్రీకి అర్ధమైంది. ఆమె వణకుతూ ముందుకు వచ్చి ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేసి తాను ఎందుకు ఆయన వస్త్రాన్ని ముట్టుకుందో, వెంటనే ఎలా బాగుపడిందో అంతా ప్రజలకి వివరించి చెప్పింది.
\v 48 అందుకు ఆయన "కుమారీ, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. ప్రశాంతంగా వెళ్ళు" అన్నాడు.
\s5
\v 49 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే సమాజ మందిరం అధికారి ఇంటినుండి ఒక వ్యక్తి వచ్చి "మీ అమ్మాయి చనిపోయింది. బోధకుడిని ఇక శ్రమ పెట్టవద్దు." అని చెప్పాడు.
\v 50 యేసు ఆ మాట విని "భయపడకు, నమ్ము. ఆమె బాగవుతుంది" అని చెప్పాడు.
\s5
\v 51 అతని ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబులనూ ఆ అమ్మాయి తలిదండ్రులనూ తప్ప మరెవర్నీ లోపలికి రానివ్వలేదు.
\v 52 అందరూ ఆమె కోసం ఏడుస్తూ, విలపిస్తూ ఉన్నారు. ఆయన వారితో "ఏడవ వద్దు, ఆమె నిద్రిస్తున్నదే గానీ చనిపోలేదు" అన్నాడు.
\v 53 ఆమె చనిపోయిందని వారికి తెలుసు కాబట్టి వారు ఆయనను ఎగతాళి చేశారు.
\s5
\v 54 అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని "అమ్మాయ్, లే" అని చెప్పగానే
\v 55 ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది. ఆమె వెంటనే లేచింది. అప్పుడు ఆయన "ఆమెకు భోజనం పెట్టండి" అని ఆదేశించాడు.
\v 56 ఆమె తలిదండ్రులు ఆనందాశ్చర్యాలలో మునిగి పోయారు. అప్పుడు ఆయన "జరిగింది ఎవరికీ చెప్పవద్దు" అని వారికి ఆజ్ఞాపించాడు.
\s5
\c 9
\s యేసు పన్నెండు మందిని ప్రకటించడానికి పంపించడం (మత్తయి 10:1-42; మార్కు 6:7-13)
\p
\v 1 ఆయన తన పన్నెండుగురు శిష్యుల్ని పిలిచి వారికి దయ్యాలన్నిటి మీద శక్తినీ, అధికారాన్నీ రోగాలు నయం చేసే వరాన్నీ ఇచ్చాడు.
\v 2 దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికీ రోగుల్ని బాగు చేయడానికీ వారిని పంపాడు.
\s5
\v 3 అప్పుడు ఆయన "మీరు ప్రయాణం కోసం చేతికర్రను గానీ సంచిని గానీ రొట్టెను గానీ వెండిని గానీ ఇంకా దేనినైనా తీసుకు వెళ్ళవద్దు. రెండు అంగీలు దగ్గర ఉంచుకోవద్దు.
\v 4 మీరు ఏ ఇంట్లో ప్రవేశిస్తారో ఆ ఇంట్లోనే బస చేయండి. అక్కడ నుండే బయలు దేరండి.
\s5
\v 5 మిమ్మల్ని ఎవరైనా చేర్చుకోకపోతే ఆ ఊరిలోనుండి బయలుదేరేటప్పుడు వారిమీద సాక్ష్యంగా ఉండటానికి మీ కాలి దుమ్మును దులిపివేయండి" అన్నాడు.
\v 6 వాళ్ళు బయలుదేరి అన్ని స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ, రోగులను బాగు చేస్తూ గ్రామాలలో పర్యటించారు.
\s5
\v 7 జరుగుతున్నవన్నీ రాష్ట్రపాలకుడు హేరోదు విని కలవరపడ్డాడు. ఎందుకంటే ఆయన్ను గురించి కొందరు 'యోహాను చనిపోయి లేచాడనీ,'
\v 8 మరి కొందరు 'ఏలియా కనిపించాడనీ,' ఇంకొంతమంది 'పూర్వకాలంలో నివసించిన ప్రవక్త ఒకరు లేచాడనీ' చెప్పుకుంటూ ఉన్నారు.
\v 9 అప్పుడు హేరోదు 'నేను యోహాను తల తీయించాను కదా. మరి ఎవరిని గురించి ఈ సంగతులు అంటున్నారో' అనుకుని ఆయనను చూడాలనుకున్నాడు.
\s అపోస్తలుల అనుభవాలు, ఐదు వందల మంది ఆకలి తీర్చడం (మత్తయి 14:13-21; మార్కు 6:30-44; యోహాను 6:1-14)
\s5
\p
\v 10 అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నీ ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన వారిని వెంట బెట్టుకొని బేత్సయిదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళాడు.
\v 11 జన సమూహాలు అది తెలుసుకుని ఆయనను అనుసరించారు. ఆయన వారిని రానిచ్చి, దేవుని రాజ్యం గురించి వారికి బోధిస్తూ రోగులను బాగుచేశాడు.
\s5
\v 12 పొద్దు గుంకుతూ ఉన్నప్పుడు పన్నెండుమంది శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, " మనం అడవిలో ఉన్నాం. వీరంతా చుట్టుపక్కల గ్రామాలకూ, పల్లెలకూ వెళ్లి రాత్రి బస చూసుకుని, ఆహారం సంపాదించుకోడానికి వీరిని పంపించెయ్యి" అన్నారు.
\v 13 ఆయన "మీరే వీళ్ళకి భోజనం పెట్టండి" అన్నాడు. అప్పుడు వారు మన దగ్గర అయిదు రొట్టెలూ రెండు చేపలూ తప్పించి ఇంకేమీ లేవు. వీళ్ళందరికీ పెట్టాలంటే భోజనం కొని తేవాల్సిందే" అన్నారు.
\v 14 అక్కడ సుమారు పురుషులే అయిదు వేలమంది ఉన్నారు. ఆయన "వారిని యాభై మంది చొప్పున బారులు తీర్చి కూర్చోబెట్టండి" అని శిష్యులకు చెప్పాడు.
\s5
\v 15 వారు అలానే చేసి అందర్నీ కూర్చోబెట్టారు.
\v 16 అప్పుడు ఆయన ఆ అయిదు రొట్టెలనూ రెండు చేపలనూ తీసుకొని, ఆకాశం వైపు చూసి, వాటిని దీవించి, విరిచి, జనసమూహానికి వడ్డించమని శిష్యులకిచ్చాడు.
\v 17 వారంతా తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన ముక్కలను పన్నెండు గంపల్లో ఎత్తారు.
\s క్రీస్తును గురించి పేతురు ఒప్పుకోలు (మత్తయి 16:13-20; మార్కు 8:27-30)
\s5
\p
\v 18 ఒకసారి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకొంటున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గర ఉన్నారు. "నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు?" అని ఆయన వారిని అడిగాడు.
\v 19 వారు "బాప్తిస్మమిచ్చే యోహాననీ, కొందరు ఏలీయా అనీ, కొందరేమో పూర్వకాలంలో నివసించిన ప్రవక్త లేచాడనీ చెప్పుకుంటున్నారు" అని ఆయనకు జవాబిచ్చారు.
\s5
\v 20 అప్పుడు ఆయన "మరి మీరు నేను ఎవరని భావిస్తున్నారు?" అని వారిని అడిగాడు. అందుకు పేతురు "నువ్వు దేవుని అభిషిక్తుడివి" అన్నాడు.
\v 21 ఆయన ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని వారికి కచ్చితంగా ఆజ్ఞాపించాడు.
\s యేసు తన మరణ, ఉత్థానాలను ముందుగా చెప్పడం(మత్తయి 16-21: మార్కు 8:31)
\p
\v 22 "మనుష్యకుమారుడు ఎన్నో హింసల పాలవుతాడు. యూదు పెద్దలూ, ప్రధాన యాజకులూ, ధర్మ శాస్త్ర పండితులూ ఆయనను తిరస్కరిస్తారు. ఆయనను చంపుతారు. అయన మూడో రోజున తిరిగి లేస్తాడు. ఇదంతా తప్పనిసరిగా జరుగుతుంది." అని చెప్పాడు.
\s శిష్యత్వం(మత్తయి 16:22-28; మార్కు 8:32,38)
\s5
\p
\v 23 ఆయన ఇంకా ఇలా అన్నాడు, "ఎవరైనా నన్ను అనుసరించాలంటే తనను తాను నిరాకరించుకోవాలి. ప్రతిదినం తన సిలువను మోసుకుని నా వెనకే రావాలి,
\v 24 తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునే వాడు దానిని కాపాడుకుంటాడు.
\v 25 ఒకడు లోకాన్నంతా సంపాదించుకుని తనను తాను పోగొట్టుకుంటే వాడికేం లాభం?
\s5
\v 26 నన్ను గూర్చీ నా మాటలను గూర్చీ ఇక్కడ ఎవడు సిగ్గుపడతాడో వాణ్ణి గురించి మనుష్య కుమారుడు తన తేజస్సుతోనూ, తన తండ్రి తేజస్సుతోనూ ఆయన దూతల తేజస్సుతోనూ వచ్చినప్పుడు సిగ్గుపడతాడు.
\v 27 ఇక్కడ ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యాన్ని చూసే వరకూ మరణించరని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను" అన్నాడు.
\s రూపాంతరం (మత్తయి 17:1-8; మార్కు 9:2-8)
\s5
\p
\v 28 ఈ మాటలు పలికిన తర్వాత సుమారు ఎనిమిది రోజులయ్యాక ఆయన పేతురూ యోహానూ యాకోబులను తీసుకుని ప్రార్థన చేయడానికి ఒక కొండ ఎక్కాడు.
\v 29 ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారిపోయింది. ఆయన ధరించిన వస్త్రాలు తెల్లగా ధగ ధగ మెరిసాయి.
\s5
\v 30 ఇద్దరు వ్యక్తులు ఆయనతో మాట్లాడుతున్నారు. వారు మోషే, ఏలియాలు.
\v 31 వారు తమ మహిమతో కనపడి ఆయన యెరూషలేములో పొందబోయే మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు.
\s5
\v 32 పేతురూ ఇంకా అతనితో ఉన్నవారూ నిద్ర మత్తులో ఉన్నారు. వారు మేలుకున్నప్పుడు ఆయన తేజస్సునూ ఆయనతో ఉన్న ఇద్దరు వ్యక్తులనూ చూశారు.
\v 33 ఆ ఇద్దరు వ్యక్తులూ ఆయన దగ్గరనుండి వెళ్ళిపోతుండగా పేతురు " ప్రభూ, మనం ఇక్కడ ఉండటం బాగుంటుంది. నీకు ఒకటీ, మోషేకు ఒకటీ, ఏలియాకు ఒకటీ మూడు పర్ణశాలలు మేం కడతాం" అంటూ తానేం మాట్లాడుతున్నాడో తనకే తెలియకుండా మాట్లాడాడు.
\s5
\v 34 అతడీవిధంగా మాట్లాడుతూ ఉండగా ఒక మేఘం వచ్చి వారిని ఆవరించింది. ఆ మేఘం వారిని కమ్ముకోగా శిష్యులు ఎంతో భయపడ్డారు.
\v 35 తర్వాత "ఈయన నేను ఏర్పాటు చేసుకున్న నా కుమారుడు. ఈయన మాట వినండి" అని ఒక శబ్దం ఆ మేఘంలోంచి వచ్చింది.
\v 36 ఆ శబ్దం వచ్చిన తర్వాత వారికి యేసు మాత్రమే కనిపించాడు. వీరు ఆ రోజుల్లో తాము చూసిన వాటిలో దేనినీ ఎవరికీ చెప్పలేదు.
\s దయ్యం వదిలించే శక్తి లేని శిష్యులు (మత్తయి 17:14-21; మార్కు 9:14-29)
\s5
\p
\v 37 మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు పెద్ద జనసమూహం ఆయనకు ఎదురుగా వచ్చింది.
\v 38 ఆ జనసమూహములో ఒకడు "బోధకుడా, నా కుమారుణ్ణి కనికరించమని నిన్ను బతిమాలుకుంటున్నాను. వీడు నా కొక్కడే కుమారుడు.
\v 39 చూడు, ఒక దయ్యం వాణ్ణి పడుతుంది. అది వాణ్ణి పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా పెడబొబ్బలు పెడతాడు. అది వాణ్ణి విలవిలలాడిస్తుంది. అప్పుడు వాడి నోటి నుండి నురుగు కారుతుంది. అది అతి కష్టం మీద వాణ్ణి వదిలిపెడుతుంది గానీ వాణ్ణి చాలా గాయం చేస్తుంది.
\v 40 దానిని వెళ్లగొట్టమని నీ శిష్యులను బతిమాలాను గానీ వారి వాళ్ళ వల్ల కాలేదు" అని దీనంగా చెప్పాడు.
\s5
\v 41 దానికి యేసు "విశ్వాసం లేని అక్రమ తరమా! నేనెంత కాలం మీతో ఉండి మిమ్మల్ని సహించాలి?" అని "నీ కుమారుణ్ణి ఇక్కడకు తీసుకుని రా" అని ఆ తండ్రితో చెప్పాడు.
\v 42 వాడు వస్తుండగానే ఆ దయ్యం వాణ్ణి కిందకు పడదోసి అల్లాడించింది. యేసు ఆ దయ్యాన్ని గద్దించి ఆ అబ్బాయిని బాగుచేసి అతని తండ్రికి అప్పగించాడు.
\s5
\v 43 అక్కడ అందరూ దేవుని ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
\s యేసు మరోసారి తన మరణం గురించి చెప్పాడు (మత్తయి 17:22,23; మార్కు 9:30-32)
\p
\v 44 ఆయన చేసిన కార్యాలను చూసి అందరూ ఆశ్చర్య పోతూ ఉండగా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, "ఈ మాటలు మీ చెవుల్లో నాటుకోనివ్వండి. మనుష్య కుమారుణ్ణి మనుషుల చేతులకు పట్టించబోతూ ఉన్నారు"
\v 45 అయితే వారు ఆ మాటను అర్థం చేసుకోలేదు. అది వారికి రహస్యం గానే ఉండిపోయింది. కాబట్టి వారు దానిని తెలుసుకోలేక పోయారు. అదీగాక ఆ మాట ప్రభువును అడిగేందుకు వారు భయంతో సంశయించారు.
\s పిల్లల గురించి ఉపదేశం (మత్తయి 18:1-5; మార్కు 9:33-37)
\s5
\p
\v 46 తమలో ఎవడు గొప్పవాడు అనే వాదం వారిలో పుట్టింది.
\v 47 యేసు వారి హృదయాల్లోని ఆలోచనలను తెలుసుకుని ఒక చిన్న బిడ్డను తన దగ్గర నిలబెట్టుకుని
\v 48 ఇలాంటి చిన్న బిడ్డను నా పేర ఎవరైనా స్వీకరిస్తే అతడు నన్ను స్వీకరిస్తున్నాడు. నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరిస్తున్నాడు. మీలో ఎవరు అందరి కంటే చిన్నవాడిగా ఉంటాడో వాడే గొప్పవాడు.
\s ముఠాతత్త్వం తగదు (మార్కు 9:38-40)
\s5
\p
\v 49 అప్పుడు యోహాను "ప్రభూ, ఎవరో ఒక వ్యక్తి నీ పేర దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. వాడు మనల్ని అనుసరించేవాడు కాదు కాబట్టి వాణ్ణి అడ్డుకున్నాం" అని యేసుతో చెప్పాడు.
\v 50 అందుకు యేసు "మీరు వాణ్ణి అడ్డుకోవద్దు. మీకు విరోధి కాని వాడు మీ వైపు ఉన్నవాడే"అని చెప్పాడు.
\s గలిలయ నుండి నిష్క్రమణం (యోహాను 7:2-10)
\s5
\p
\v 51 యేసును పరలోకానికి తీసుకువెళ్ళే సమయం దగ్గర పడింది.
\v 52 ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి మనస్సులో నిశ్చయం చేసుకున్నాడు. తనకంటే ముందుగా దూతలను పంపాడు. వారు వెళ్లి ఆయనకు అంతా సిద్ధం చేయడానికి ఒక సమరయ వారి గ్రామంలో ప్రవేశించారు.
\v 53 ఆయన యెరూషలేముకు వెళ్తున్నాడని తెలిసి వారు ఆయనను స్వీకరించలేదు.
\s5
\v 54 శిష్యులైన యాకోబు యోహానులు అది చూసి "ప్రభూ, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయాలని మేం వీరిని శపించడం నీకిష్టమేనా?" అని అడిగారు.
\v 55 ఆయన వారి వైపు తిరిగి వారిని మందలించాడు.
\v 56 అప్పుడు వారు మరో గ్రామానికి వెళ్లారు.
\s శిష్యత్వానికి పరీక్ష (మత్తయి 8:18,22)
\s5
\p
\v 57 వారు దారిన వెళ్తుండగా ఒకడు వచ్చి "నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను" అని ఆయనకు చెప్పాడు.
\v 58 అందుకు యేసు "నక్కలకు గుంటలు ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తల వాల్చుకోడానికైనా చోటు లేదు" అని అతనికి చెప్పాడు.
\s5
\v 59 ఆయన మరో వ్యక్తిని చూసి "నా వెంట రా" అన్నాడు. ఆ వ్యక్తి "ముందు నేను వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి రావడానికి నాకు అనుమతి ఇయ్యి" అన్నాడు.
\v 60 అందుకాయన "చనిపోయినవారు తమ చనిపోయిన వారిని పాతి పెట్టుకోనియ్యి. నువ్వు వెళ్లి దేవుని రాజ్యాన్ని ప్రకటించు" అని అతనితో చెప్పాడు.
\s5
\v 61 మరొకడు "ప్రభూ, నీ వెనకే వస్తాను గానీ మా ఇంట్లోని వారి దగ్గర అనుమతి తీసుకుని వస్తాను. నాకు సెలవియ్యి" అన్నాడు.
\v 62 దానికి యేసు "నాగలిపై చెయ్యి పెట్టి వెనక్కిచూసేవాడు ఎవడూ దేవుని రాజ్యానికి తగడు" అని వాడితో చెప్పాడు.
\s5
\c 10
\s యేసు తనకు ముందుగా డెబ్భై మందిని పంపడం (మత్తయి 10: 1-42)
\p
\v 1 ఆ తర్వాత ప్రభువు డెబ్భై మంది ఇతర శిష్యులను కూడా నియమించి తాను వెళ్ళబోయే ప్రతి ఊరికీ, ప్రతి చోటికీ ఇద్దరిద్దరిని తనకంటే ముందుగా పంపించాడు.
\v 2 వారిని పంపిస్తూ ఆయన వారితో ఇలా అన్నాడు. "కోత ఎక్కువగా ఉంది. పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి పనివారిని పంపమని కోత యజమానుణ్ణి వేడుకోండి.
\s5
\v 3 మీరు వెళ్ళండి. ఇదిగో వినండి, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల్ని పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను.
\v 4 మీరు డబ్బులు గానీ సంచిని గానీ చెప్పులు గానీ తీసుకు వెళ్ళవద్దు. దారిలో ఎవర్నీ పలకరించవద్దు.
\s5
\v 5 మీరు ఏ ఇంట్లోనైనా ప్రవేశిస్తే, ముందుగా 'ఈ ఇంటికి శాంతి కలుగు గాక,' అని చెప్పండి.
\v 6 శాంతికి అర్హుడు ఆ ఇంట్లో ఉంటే మీ శాంతి అతని మీద ఉంటుంది. లేకపోతే అది మీకు తిరిగి వస్తుంది.
\v 7 వారు మీకు పెట్టే పదార్థాలను తింటూ తాగుతూ ఆ ఇంటిలోనే ఉండండి. పనివాడు జీతానికి పాత్రుడు. ఇంటింటికీ తిరగవద్దు.
\s5
\v 8 మీరు ఏదైనా ఊర్లో ప్రవేశించినప్పుడు అక్కడి వారు మిమ్మల్ని స్వీకరిస్తే వారు మీ ముందు పెట్టినవి తినండి.
\v 9 ఆ ఊర్లో ఉన్న రోగుల్ని బాగు చేయండి. దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చిందని వారికి ప్రకటించండి.
\s5
\v 10 ఒకవేళ ఏ ఊళ్ళో నైనా మిమ్మల్ని వారు స్వీకరించక పోతే
\v 11 మీరు ఆ ఊరి వీధుల్లోకి వెళ్ళి 'మా కాళ్ళకు అంటిన మీ పట్టణపు దుమ్మును మీ ముందే దులిపి వేస్తున్నాం. అయినా దేవుని రాజ్యం దగ్గరకు వచ్చిందని తెలుసుకోండి' అని చెప్పండి.
\v 12 తీర్పు రోజున ఆ ఊరికి పట్టే గతి కంటే సొదొమ పట్టణానికి పట్టిన గతే ఓర్చుకోదగినది అవుతుందని మీతో చెప్తున్నాను.
\s యూదయ పట్టణాలపై తీర్పు (మత్తయి 11:20-24)
\s5
\p
\v 13 అయ్యో కొరాజీనా, నీకు యాతన. అయ్యో బేత్సయిదా, నీకు యాతన. మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే ఆ పట్టణాల్లోని వారు ముందే గోనె పట్ట కట్టుకుని బూడిదె లో కూర్చుని మనస్సు మార్చకుని ఉండేవారు.
\v 14 అయినా తీర్పు రోజున మీ గతి కంటే తూరు, సీదోను పట్టణాల గతి ఓర్చుకోదగినది గా ఉంటుంది.
\v 15 కపెర్నహూమూ, ఆకాశం వరకూ హెచ్చించుకున్నా నువ్వు పాతాళం వరకూ దిగిపోతావు.
\s5
\v 16 మీ మాట వినే వాడు నా మాటా వింటాడు. మిమ్మల్ని నిరాకరించే వాడు నన్నూ నిరాకరిస్తాడు."
\s5
\v 17 ఆ డెబ్భై మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి "ప్రభూ, దయ్యాలు కూడా నీ పేరు చెప్తే మాకు లోబడుతున్నాయి" అని చెప్పారు.
\v 18 అప్పుడు ఆయన "సాతాను మెరుపులా ఆకాశం నుండి పడటం చూశాను.
\v 19 ఇదిగో వినండి, పాములనూ, తేళ్లనూ తొక్కడానికి శత్రువు బలమంతటి మీదా మీకు అధికారం ఇచ్చాను. మీకు ఏదీ ఏ మాత్రమూ హాని చేయదు.
\v 20 అయినా దయ్యాలు లోబడుతున్నాయని కాదు, మీ పేర్లు పరలోకంలో రాసి ఉన్నాయని సంతోషించండి." అని వారికి చెప్పాడు.
\s5
\v 21 ఆ సమయంలోనే యేసు పరిశుద్ధాత్మలో ఎంతో ఆనందించాడు. "తండ్రీ, ఆకాశానికీ భూమికీ ప్రభూ, నువ్వు ఈ సంగతులను జ్ఞానులకూ, తెలివైన వారికీ దాచిపెట్టి పసివారికి వెల్లడి పరిచావని నిన్ను కీర్తిస్తున్నాను. అవును తండ్రీ, అలా చేయడం నీకు అనుకూలమైంది.
\s5
\v 22 సమస్తమూ నా తండ్రి నాకు అప్పగించాడు. కుమారుణ్ణి తండ్రి తప్ప ఇంకెవరూ ఎరుగరు. అలాగే తండ్రి ఎవరో కుమారుడూ, ఆ కుమారుడు ఎవరికి ఆయనను వెల్లడి చేయడానికి ఇష్టపడతాడో అతడూ తప్ప ఇంకెవరూ ఎరుగరు."
\s5
\v 23 అప్పుడు ఆయన తన శిష్యులవైపు తిరిగి ఏకాంతంగా వారితో "మీరు చూస్తున్న వాటిని చూసే కన్నులు ధన్యమైనాయి.
\v 24 అనేకమంది ప్రవక్తలూ, రాజులూ మీరు చూస్తున్న వాటిని చూడాలని కోరుకున్నా చూడలేక, వినాలని కోరుకున్నా వినలేక పోయారని మీతో చెప్తున్నాను" అని వారితో అన్నాడు.
\s మంచి సమరయుడు (మత్తయి 22: 34-40; మార్కు 12:28-34)
\s5
\p
\v 25 ఒకసారి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేచి ఆయనను పరీక్షిస్తూ "బోధకుడా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేను ఏమి చేయాలి?" అని అడిగాడు.
\v 26 అందు కాయన "ధర్మశాస్త్రం లో ఏమని రాసి ఉంది? నువ్వు ఏం చదువుతున్నావు?" అని అడిగాడు.
\v 27 అతడు "నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకం తోనూ ప్రేమించాలి. నిన్ను ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణీ ప్రేమించాలి" అన్నాడు.
\v 28 దానికి ఆయన "సరిగ్గా చెప్పావు. నువ్వూ అలా చెయ్యి, జీవిస్తావు" అన్నాడు.
\s5
\v 29 అయితే తనను నీతిమంతుడిగా చూపించుకోడానికి అతడు "అది సరే గానీ నా పొరుగువాడు ఎవడు?" అని యేసును అడిగాడు.
\v 30 అందుకు యేసు ఇలా అన్నాడు, "ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ప్రయాణమై పోతూ దోపిడీ దొంగల చేతికి చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకుని అతణ్ణి కొట్టి, కొన ప్రాణంతో విడిచి పెట్టారు.
\s5
\v 31 అప్పుడొక యాజకుడు ఆ దారినే వెళ్తూ అతణ్ణి చూసి పక్కగా వెళ్ళిపోయాడు.
\v 32 ఆలాగే ఒక లేవీయుడు అటుగా వచ్చి అతణ్ణి చూసి పక్కగా వెళ్ళాడు.
\s5
\v 33 అయితే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ, అతడు పడి పోయిన చోటికి వచ్చి
\v 34 అతణ్ణి చూసి అతని మీద జాలి పడి దగ్గరకు వెళ్ళాడు. అతనిపై నూనే, ద్రాక్షారసం పోసి, గాయాలకు కట్లు కట్టి తన గాడిదపై ఎక్కించుకుని ఒక సత్రానికి తీసుకు వెళ్ళి అతని బాగోగులు చూశాడు.
\v 35 మరుసటి రోజు అతడు రెండు వెండి నాణేలు తీసి ఆ సత్రం వాడికిచ్చి, "ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతనికి నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఈసారి నేను మళ్ళీ వచ్చినప్పుడు అది నీకు తీర్చేస్తాను" అని వెళ్ళి పోయాడు.
\s5
\v 36 అయితే ఇప్పుడు దొంగల చేతిలో చిక్కిన వాడికి ఈ ముగ్గురిలో పొరుగువాడు ఎవరని నువ్వనుకుంటున్నావు? ఎవడు పొరుగువాడయ్యాడని నీకు తోస్తుంది?" అని యేసు అడిగాడు. దానికి అతడు "అతనిమీద జాలి చూపిన వాడే" అన్నాడు.
\v 37 అందుకు యేసు "నువ్వు కూడా వెళ్ళి అలాగే చెయ్యి" అని అతనితో చెప్పాడు.
\s మార్త, మరియ
\s5
\p
\v 38 వారు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ మార్త అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట్లోకి ఆహ్వానించింది.
\v 39 ఆమెకు మరియ అనే సోదరి ఉంది. ఈమె యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశం వింటూ ఉంది.
\s5
\v 40 మార్త ఎన్నో పనులు పెట్టుకుని తొందర పడుతూ ఆయన దగ్గరకు వచ్చి, "ప్రభూ, నా సోదరి నన్ను విడిచి ఇక్కడ కూర్చుంది, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకోవలసి వస్తున్నది. నీకేం పట్టదా? వచ్చి నాకు సాయం చేయమని ఆమెకు చెప్పు" అంది.
\v 41 అందుకు ప్రభువు "మార్తా, మార్తా, నువ్వు అనేకమైన పనులను గురించి విచారంతో తొందర పడుతున్నావు. కానీ అవసరమైంది ఒక్కటే.
\v 42 మరియ ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. దాన్ని ఆమె దగ్గరనుంచి తీసివేయడం జరగదు" అని ఆమెతో చెప్పాడు.
\s5
\c 11
\s ప్రార్థన నమూనా
\p
\v 1 ఆయన ఒకసారి ఒక చోట ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన ముగించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు "ప్రభూ, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించు" అని ఆయనను అడిగాడు.
\s5
\v 2 అందుకు ఆయన "మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటలు పలకండి, 'పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామం అందరికీ పవిత్రంగా ఉంటుంది గాక, నీ రాజ్యం వస్తుంది గాక,
\s5
\v 3 మాకు కావలసిన అనుదిన ఆహారం ప్రతిరోజూ మాకు దయచెయ్యి,
\v 4 మా దగ్గర అప్పు తీసుకున్న ప్రతీ వాణ్ణీ క్షమిస్తూ ఉన్నాం కనుక మా పాపాలనూ క్షమించు. మమ్మల్ని శోధనలోకి తీసుకు వెళ్ళకు' అని పలకండి" అని చెప్పాడు.
\s వదలకుండా అడిగిన మిత్రుడు
\s5
\p
\v 5 తర్వాత ఆయన వారితో ఇలా అన్నాడు. "మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉన్నాడనుకోండి. అర్థరాత్రి వేళ ఆ స్నేహితుడి దగ్గరకు వెళ్ళి "మిత్రమా, నాకు మూడు రొట్టెలు బదులివ్వు.
\v 6 నా స్నేహితుడు ప్రయాణం చేస్తూ దారిలో నా దగ్గరకు వచ్చాడు. అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు" అని చెప్పాడనుకోండి.
\v 7 అతడు లోపలే ఉండి "నన్ను తొందర పెట్టవద్దు. తలుపు వేసేశాను. చిన్న పిల్లలు నిద్ర పోతున్నారు. నేను లేచి ఇవ్వలేను" అని చెప్తాడా?
\v 8 అతడు తన స్నేహితుడని కాక పోయినా సిగ్గు విడిచి అదేపనిగా అడగడం వల్లనైనా లేచి కావలసినవన్నీ ఇస్తాడని మీకు చెప్తున్నాను.
\s5
\v 9 అలాగే మీరు కూడా దేవుణ్ణి అడగండి, ఆయన ఇస్తాడు. వెదకండి, మీకు దొరుకుతుంది. తలుపు తట్టండి. మీకు తెరుచుకుంటుంది.
\v 10 అడిగే ప్రతి వ్యక్తికీ లభిస్తుంది. వెదికే వాడికీ దొరుకుతుంది. తట్టేవాడికి తలుపు తెరచుకుంటుందని మీకు చెప్తున్నాను.
\s తండ్రి నైజం
\s5
\p
\v 11 మీలో ఎవరైనా ఒక తండ్రి తన కొడుకు చేపను అడిగితే చేపకు బదులుగా పామును ఇస్తాడా? గుడ్డు కావాలంటే రాయినిస్తాడా?
\v 12 కాబట్టి మీరు చెడ్డవారైనా మీ పిల్లలకు మంచి విషయాలనే ఇవ్వాలని అనుకుంటుంటే
\v 13 పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు." అని చెప్పాడు.
\s దయ్యాల రాజు సాయంతో యేసు దయ్యాలు వెళ్ళగొడుతున్నాడని నీలాపనింద (మత్తయి 12:22-37)
\s5
\p
\v 14 ఒకసారి ఆయన ఒక మూగ దయ్యాన్ని వెళ్ళ గొడుతూ ఉన్నాడు. ఆ దయ్యం వదలి పోయిన తర్వాత మూగ వాడు మాట్లాడాడు. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్య పోయారు.
\v 15 అయితే వారిలో కొందరు "వీడు దయ్యాలకు నాయకుడైన బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు" అని చెప్పుకున్నారు.
\s5
\v 16 మరి కొందరు ఆయనను పరీక్షిస్తూ పరలోకం నుండి ఒక సూచన చూపించమని ఆయనను అడిగారు.
\v 17 ఆయనకు వారి ఆలోచనలన్నీ తెలుసు. ఆయన వారితో ఇలా అన్నాడు. "తనకు తానే వ్యతిరేకంగా వేరై పోయిన ఏ రాజ్యమైనా నశించి పోతుంది. తనకు తానే విరోధమైన ఇల్లు కూలి పోతుంది.
\s5
\v 18 సాతాను కూడా తనకు తానే వ్యతిరేకంగా వేరై పోతే వాడి రాజ్యం ఎట్లా నిలుస్తుంది?
\v 19 నేను బయెల్జెబూలు సహాయంతో దయ్యాలను వెళ్ళ గొడితే మీ అనుచరులు వాటిని ఎవరి సహాయంతో వెళ్ళ గొడుతున్నారు? దీనివల్ల మీ సంతానమే మీకు తీర్పు తీరుస్తారు.
\v 20 అయితే నేను దేవుని వేలితో దయ్యాలను వెళ్ళగొడుతుంటే దాని అర్థం, దేవుని రాజ్యం కచ్చితంగా మీ దగ్గరకు వచ్చిందనే.
\s5
\v 21 బలవంతుడు ఆయుధాలు ధరించుకొని, తన ఆవరణలో కాపలా కాస్తే అతని సొత్తు భద్రంగా ఉంటుంది.
\v 22 అయితే అతని కంటె బలవంతుడైన వాడు అతణ్ణి ఎదిరించి ఓడించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధాలన్నిటినీ బలవంతంగా తీసుకుని అతని ఆస్తినంతా దోచుకుని పంచి వేస్తాడు.
\v 23 నా వైపు ఉండని వాడు నాకు విరోధి; నాతో కలసి పోగుచెయ్యని వాడు చెదరగొట్టే వాడే.
\s తనను తను సంస్కరించుకునే ప్రయత్నం (మత్తయి 12:43,45)
\s5
\p
\v 24 అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదలిపోయిన తరువాత విశ్రాంతి కోసం వెదకుతూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంటుంది. దానికెక్కడా విశ్రాంతి దొరకదు. అందుకని అది నా పాత ఇంటికే మళ్ళీ వెళతాననుకుంటుంది.
\v 25 అది వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి ఉండటం చూసి
\v 26 తిరిగి వెళ్లి, తన కంటె చెడ్డవైన మరో ఏడు అపవిత్రాత్మల్ని వెంటబెట్టుకొని వస్తుంది. అవి ఆ ఇంట్లో చొరబడి ఇక అక్కడే నివాసముంటాయి. కాబట్టి ఆ వ్యక్తి చివరి దశ మొదటి దశ కంటే అధ్వాన్నంగా ఉంటుంది"అని చెప్పాడు.
\s5
\v 27 ఆయన యీ మాటలు చెప్తూ ఉండగా ఆ జన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూసి బిగ్గరగా "నిన్ను మోసిన గర్భం, నువ్వు పాలు తాగిన స్తనాలూ ధన్యం" అని కేకలు వేసి చెప్పింది.
\v 28 దానికి ఆయన "అది నిజమే కానీ దేవుని మాట విని దానిని అంగీకరించేవారు ఇంకా ధన్యులు" అని చెప్పాడు.
\s యోనా సూచన (మత్తయి 12:39-42)
\s5
\p
\v 29 ప్రజలంతా గుంపులుగా ఉన్నప్పుడు ఆయన వారికి ఇలా చెప్పాడు. "ఈ తరం చెడ్డది. వీరు సూచన అడుగుతున్నారు. అయితే యోనా సూచన తప్పించి మరే సూచనా వీరికి చూపడం జరగదు.
\v 30 యోనా నీనెవె పట్టణ వాసులకు ఎలా సూచనగా ఉన్నాడో ఆలాగే మనుష్య కుమారుడూ ఈ తరానికి సూచనగా ఉంటాడు.
\s5
\v 31 దక్షిణ దేశం రాణి తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వీరి మీద నేరం మోపుతుంది. ఆమె సొలోమోను జ్ఞాన వాక్కులు వినడానికి సుదూర దేశం నుండి వచ్చింది. సోలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
\s5
\v 32 నీనెవె ప్రజలు తీర్పు రోజున ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతారు. ఎందుకంటే వారు యోనా బోధ విని మారుమనస్సు పొందారు. యోనా కంటే ఘనుడు ఇక్కడ ఉన్నాడు.
\s వెలిగించిన దీపం ఉపమానం (మత్తయి 5:15, 16; మార్కు 4:21,22; లూకా 8:16)
\s5
\p
\v 33 ఎవరూ దీపాన్ని వెలిగించి చాటుగానో బుట్ట కిందనో పెట్టరు, లోపలి వచ్చేవారికి వెలుగు కనబడాలని దీప స్తంభం పైనే పెడతారు.
\v 34 నీ దేహానికి దీపం నీ కన్నే. నీ కన్ను మంచిదైతే నీ శరీరమంతా వెలుగు ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ దేహం చీకటి మయమై ఉంటుంది.
\v 35 కాబట్టి నీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా చూసుకో.
\v 36 నీ దేహంలో ఏ భాగమూ చీకటిలో లేకుండా నీ దేహం అంతా వెలుగే ఉన్నట్లయితే, దీపం కాంతి నీపై ప్రసరించినప్పుడు ఎలా ఉంటుందో అలాగే దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది."
\s5
\v 37 ఆయన మాట్లాడుతూ ఉండగా ఒక పరిసయ్యుడు తనతో కలసి భోజనం చేయమని ఆయన్ని ఆహ్వానించాడు. ఆయన అతనితో లోపలికి వెళ్ళి భోజన వరుసలో కూర్చున్నాడు.
\v 38 ఆయన భోజనానికి ముందు కాళ్ళుచేతులు కడుక్కోలేదని ఆ పరిసయ్యుడు ఆశ్చర్యపోయాడు.
\s యేసు పరిసయ్యులను తీవ్రంగా విమర్శించడం (మత్తయి 23:13-35)
\s5
\p
\v 39 అది చూసి ప్రభువిలా అన్నాడు, "పరిసయ్యులైన మీరు పాత్రనూ పళ్ళేన్నీ బయట శుభ్రం చేస్తారు గానీ మీ అంతరంగం మాత్రం దోపిడీతోనూ చెడుతనంతోనూ నిండి ఉంది.
\v 40 అవివేకులారా, బయటి భాగాన్ని చేసినవాడే లోపలి భాగాన్ని కూడా చేశాడు కదా!
\v 41 మీకు ఉన్నవాటిని దాన ధర్మాలు చేయండి. అప్పుడు మీకు అన్నీ శుభ్రంగా ఉంటాయి.
\s5
\v 42 అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన. మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి ఆకు కూరలోనూ పదోభాగం దేవునికి చెల్లిస్తారు గానీ దేవుని ప్రేమనూ, న్యాయాన్నీ వదలి వేస్తున్నారు. మీరు న్యాయంగా నడుచుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి. మిగిలిన వాటిని కూడా జరిగించాలి.
\s5
\v 43 అయ్యో పరిసయ్యులారా, మీకు యాతన, మీరు సమాజ మందిరాలలో అగ్ర స్థానాలూ సంత వీధుల్లో ప్రజల నుండి వందనాలూ కోరుకుంటారు.
\v 44 అయ్యో, మీరు కనిపించని సమాధుల్లా ఉన్నారు. అవి సమాధులని తెలియని మనుషులు వాటి మీదే నడుస్తారు."
\s యేసు ధర్మశాస్త్రులను తీవ్రంగా విమర్శించడం
\s5
\p
\v 45 అప్పుడు ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు "బోధకుడా. ఇలా చెప్పి మమ్మల్ని కూడా నిందిస్తున్నావు" అని ఆయనతో అన్నాడు.
\v 46 అందుకు యేసు "ఆయన అయ్యో, ధర్మ శాస్త్ర ఉపదేశకులారా, మీరు మనుషులపై వారు మోయలేని బరువులు మోపుతారు. మీరు మాత్రం ఒక వేలితో కూడా ఆ బరువులను తాకరు.
\s5
\v 47 అయ్యో, మీకు యాతన, మీ పూర్వీకులు ప్రవక్తలను చంపారు. మీరు చనిపోయిన ప్రవక్తల సమాధులను కట్టిస్తున్నారు.
\v 48 దీన్నిబట్టి మీరు సాక్షులై మీ పూర్వీకులు చేసిన పనులకు సమ్మతి తెలుపుతున్నారు. వారు ప్రవక్తలను చంపారు. మీరు సమాధులు కడుతున్నారు.
\s5
\v 49 ఈ కారణం చేత దేవుని జ్ఞానం చెప్పేదేమిటంటే "నేను వారి దగ్గరకు ప్రవక్తలనూ, అపోస్తలులనూ పంపుతాను.
\v 50 వారు కొంత మందిని చంపుతారు. కొంతమందిని హింసిస్తారు."
\v 51 కాబట్టి లోకారంభం నుండీ అంటే హేబేలు రక్తం నుండి బలిపీఠానికీ దేవాలయానికీ మధ్య హతమైన జెకర్యా రక్తం వరకూ చిందిన ప్రవక్తలందరి రక్తం కోసం ఈ తరం వారికి విచారణ జరుగుతుంది. ఆ రక్తం కోసం ఈ తరం వారు విచారణకు నిలబడతారని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను.
\s5
\v 52 అయ్యో, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే మీరు జ్ఞానానికి తాళం చెవిని తీసుకు పోయారు. మీరు లోపల ప్రవేశించరు. ప్రవేశించే వారిని అడ్డుకుంటారు" అని చెప్పాడు.
\s5
\v 53 ఆయన అక్కడ నుండి వెళ్లి పోయిన తర్వాత ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ ఆయన మీద పగ పట్టి ఆయన మీద నేరం మోపడానికై ఆయన నోటి నుండి వచ్చే ఏ మాటనైనా పట్టుకోడానికి సిద్ధమై
\v 54 చాలా విషయాలను గురించి ఆయనతో మాట్లాడించాలని చూడటం మొదలు పెట్టారు.
\s5
\c 12
\s పరిసయ్యుల పొంగజేసే పదార్థం గురించి హెచ్చరిక (మార్కు 8:14-21)
\p
\v 1 అంతలో వేలకొద్దీ ప్రజలు పోగయి ఒకరినొకరు తొక్కుకుంటూ ఉన్నారు. అప్పుడు ఆయన మొదట తన శిష్యులతో ఇలా చెప్పనారంభించాడు. "పరిసయ్యుల కపటం అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి.
\s5
\v 2 కప్పి పెట్టింది ఏదీ బట్టబయలు కాకపోదు. రహస్యమైనదేదీ తెలియకుండా ఉండదు.
\v 3 అందుకని మీరు చీకటిలో మాట్లాడేవి వెలుగులో వినబడతాయి. గదుల్లో చెప్పుకునేవి ఇంటి కప్పుల పైన చాటిస్తారు.
\s5
\v 4 నా స్నేహితులైన మీకు నేను చెప్పేదేమిటంటే దేహాన్ని చంపడం మినహా మరేమీ చేయలేని వాడికి భయపడవద్దు.
\v 5 ఎవరికి మీరు భయపడాలో మీకు చెప్తాను. చంపిన తర్వాత నరకంలో పడవేసే శక్తి గల వాడికి భయపడండి. ఆయనకే భయపడమని మీకు చెప్తున్నాను.
\s5
\v 6 అయిదు పిచ్చుకల్ని రెండు కాసులకు అమ్ముతారు కదా. అయినా వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు.
\v 7 మీ తలవెంట్రుకలన్నిటి లెక్కా ఉంది. భయపడకండి. మీరు ఎన్నో పిచ్చుకల కంటే విలువైన వారే కదా.
\s5
\v 8 ఇంకా మీతో చెప్పేదేమిటంటే, నన్ను మనుషుల ముందు ఎవరు అంగీకరిస్తాడో వాణ్ణి మనుష్య కుమారుడు దేవుని దూతల ముందు అంగీకరిస్తాడు.
\v 9 మనుష్యుల ముందు నేను ఎవరో తెలియదు అనే వాణ్ణి గురించి నేను కూడా దేవుని దూతల ముందు నాకు తెలియదు అని చెప్తాను.
\v 10 మనుష్యకుమారుడికి వ్యతిరేకంగా ఏదన్నా మాట అనే వాడికి పాపక్షమాపణ కలుగుతుంది గానీ పరిశుద్ధాత్మను దూషిస్తే వాడికి క్షమాపణ లేదు.
\s5
\v 11 వారు సమాజమందిరాల్లో పెద్దల దగ్గరకూ అధిపతుల దగ్గరకూ అధికారుల దగ్గరకూ మిమ్మల్ని తీసుకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎలా జవాబివ్వాలా, ఏం మాట్లాడాలా అని చింత పడవద్దు.
\v 12 మీరు ఏం చెప్పాలో ఆ సమయం లోనే పరిశుద్ధాత్మ మీకు నేర్పిస్తాడు."
\s5
\v 13 ఆ జనసమూహంలో ఒకడు "ఉపదేశకా, వారసత్వంగా నాకు వచ్చిన ఆస్తిలో నాకు భాగం పంచమని మా అన్నయ్యతో చెప్పండి" అన్నాడు.
\v 14 అందుకు ఆయన "ఏమయ్యా, మీ మీద తీర్పరిగానో లేక మధ్యవర్తి గానో నన్ను ఎవరు నియమించారు?" అన్నాడు.
\v 15 ఆయన ఇంకా వారితో ఇలా అన్నాడు, "మీరు అత్యాశకు చోటివ్వకండి. ఒకరి జీవానికి మూలం అతని కలిమి కాదు."
\s తెలివిలేని ధనికుని ఉపమానం
\s5
\p
\v 16 తర్వాత ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు, "ఒక ధనవంతుడి భూమి విస్తారంగా పండింది.
\v 17 అప్పుడు అతడు ఇలా ఆలోచించాడు. " నా పంట సమకూర్చుకోడానికి నాకు స్థలం చాలదు. కాబట్టి నేనేం చేయాలి? ఇలా చేస్తాను.
\v 18 నా గిడ్డంగులు పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యమంతటినీ, నా ఆస్తి అంతటినీ దాచి నిల్వ చేస్తాను.
\v 19 అప్పుడు నా ప్రాణంతో "ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపోయే విస్తారమైన ఆస్తి నీ కోసం సమకూర్చాను. సుఖపడు, తిను, తాగు, సంతోషంగా ఉండు అని చెప్తాను" అనుకున్నాడు.
\s5
\v 20 అయితే దేవుడు అతడితో "మూర్ఖుడా! ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. నువ్వు కూడబెట్టినవి ఎవరివి అవుతాయి?" అని అతడితో అన్నాడు.
\v 21 దేవుని విషయంలో ధనవంతుడు కాకుండా తన కోసమే సమకూర్చుకునే వాడు అలాగే ఉంటాడు" అన్నాడు.
\s5
\v 22 తర్వాత ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, "అందుచేత ఏం తింటామని మీ ప్రాణం కోసమో, ఏం కట్టుకుంటామని మీ శరీరం కోసమో మధన పడవద్దు.
\v 23 ఆహారం కంటె ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పవి కావా?
\s5
\v 24 కాకుల గురించి ఆలోచించండి. అవి విత్తనాలు చల్లవు, కోయవు, వాటికి గిడ్డంగులూ, కొట్లూ లేవు. అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. మీరు పక్షులకంటె ఎంతో ఉన్నతమైన వారు.
\v 25 పైగా మీలో ఎవడు చింత పడటం వల్ల తన ఎత్తును ఒక మూరెడు ఎక్కువ పొడిగించుకోగలడు?
\v 26 కాబట్టి అన్నిటి కంటే చిన్న విషయాలే మీరు చేయలేకపోతే పెద్దవాటిని గురించి ఆలోచించడం ఎందుకు? పువ్వులు ఎలా పూస్తున్నాయో చూడండి.
\s5
\v 27 అవి కష్టపడవు, బట్టలు నేయవు. అయినా తన వైభవమంతటితో సహా సొలోమోను కున్న అలంకరణ ఈ పూలలో ఏ ఒక్కదాని అలంకరణకీ సరి తూగదని మీకు చెప్తున్నాను.
\v 28 అల్ప విశ్వాసులారా, ఈ వేళ పొలంలో ఉండి, రేపు పొయ్యిలో వేసే అడవి గడ్డినే దేవుడిలా అలంకరిస్తే మీకు మరి ఎంతో ఖాయంగా బట్టలిస్తాడు గదా.
\s5
\v 29 ఏం తింటాం, ఏం తాగుతాం అని మధన పడకండి. ఏ అనుమానమూ పెట్టుకోకండి.
\v 30 ఈ లోకులు వీటిని వెదకుతారు. ఇవి మీకు కావాలని మీ తండ్రికి తెలుసు.
\s5
\v 31 మీరు మాత్రం ఆయన రాజ్యాన్ని వెదకండి. దానితో పాటుగా ఇవి కూడా మీకు లభిస్తాయి.
\v 32 చిన్న మందా, భయపడకండి. మీకు రాజ్యాన్నివ్వడం మీ తండ్రికి ఇష్టం.
\s5
\v 33 మీకు ఉన్నవాటిని అమ్మి దాన ధర్మాలు చేయండి. పరలోకంలో పాతబడని డబ్బు సంచులనూ, నాశనం కాని ధనాన్నీ సంపాదించుకోండి. అక్కడికి దొంగ రాడు, పురుగు పట్టదు.
\v 34 మీ డబ్బు ఎక్కడ ఉంటుందో మీ హృదయం అక్కడే ఉంటుంది.
\s రెండవ రాకకు సంబంధించిన ఉపమానాలు, హెచ్చరికలు (మత్తయి 24:37 25:30)
\s5
\p
\v 35 మీ నడుములు కట్టుకొని ఉండండి. మీ దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి.
\v 36 యజమాని పెండ్లి విందు నుండి వచ్చి తలుపు కొట్టగానే అతనికి తలుపు తీయడం కోసం అతడు ఎప్పుడు వస్తాడో అని అతని కోసం ఎదురు చూసే సేవకుల్లా ఉండండి.
\s5
\v 37 యజమాని వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండటం చూస్తాడో ఆ దాసులు ధన్యులు. అప్పుడు అతడు తన నడుం బిగించి వారిని భోజనానికి కూర్చోబెడతాడు. వారికి తానే పరిచర్య చేస్తాడని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను.
\v 38 అతడు రాత్రి రెండో జాములో వచ్చినా, మూడో జాములో వచ్చినా ఏ దాసులు మెలకువగా ఉండటం చూస్తాడో ఆ దాసులు ధన్యులు.
\s5
\v 39 దొంగ ఏ సమయంలో వస్తాడో ఇంటి యజమానికి తెలిస్తే అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనివ్వడని తెలుసుకోండి.
\v 40 మీరు ఊహించని సమయంలో మనుష్యకుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి" అని వారికి చెప్పాడు.
\s5
\v 41 అప్పుడు పేతురు "ప్రభూ ఈ ఉపమానం మా కోసమే చెప్తున్నావా లేక అందరి కోసం చెప్తున్నావా?" అని ఆయనను అడిగాడు.
\s గృహనిర్వహకుడు, సేవకులు
\p
\v 42 దానికి ప్రభువు ఇలా అన్నాడు, "సరైన సమయంలో అందరికీ ఆహారం పెట్టడానికి యజమానుడు తన ఇంటి కోసం నియమించే నమ్మకమైన, బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?
\v 43 యజమాని వచ్చి ఏ పనివాడు ఆ విధంగా చేయడం చూస్తాడో ఆ పనివాడు ధన్యుడు.
\v 44 అప్పుడు ఆ యజమాని తన ఆస్తి అంతటి మీదా అతడిని ఉంచుతాడని మీకు చెప్తున్నాను.
\s5
\v 45 అయితే ఆ పనివాడు నా యజమాని ఆలస్యం చేస్తున్నాడని తన మనస్సులో అనుకుని తోటి దాసదాసీలను కొట్టడం, తిని తాగి మత్తెక్కి ఉండటం చేస్తే
\v 46 వాడు ఎదురు చూడని రోజున తెలియని సమయంలో యజమాని వస్తాడు. వాణ్ణి కఠినంగా శిక్షించి నమ్మదగని వారి గతే వాడికి పట్టేలా చేస్తాడు.
\s5
\v 47 తన యజమాని ఇష్టం తెలిసి కూడా సిద్ధ పడకుండా, ఆయన ఇష్ట ప్రకారం చేయకుండా ఉండే దాసుడికి చాలా దెబ్బలు తగులుతాయి.
\v 48 దెబ్బలకు తగిన పనులు చేసినా తెలియక చేసిన వాడికి తక్కువ దెబ్బలే తగులుతాయి. ఎవరికి ఎక్కువగా ఇచ్చారో అతని దగ్గర ఎక్కువగా తీసుకుంటారు. మనుషులు ఎవరికి ఎక్కువ అప్పగిస్తారో వారి దగ్గరే ఎక్కువగా అడుగుతారు.
\s క్రీస్తు విభేదాలు కలిగించేవాడు
\s5
\p
\v 49 నేను భూమి మీద అగ్ని వేయడానికి వచ్చాను. అది ఇప్పటికే రగులుకుని మండాలని ఎంతగానో కోరుతున్నాను.
\v 50 అయితే నేను పొందాల్సిన బాప్తిస్మం ఉంది. అది జరిగే వరకూ నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను.
\s5
\v 51 నేను భూమి మీద శాంతిని స్థాపించడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? కానే కాదు. నేను చీలికలు కలగజేయడానికి వచ్చానని మీకు చెప్తున్నాను.
\v 52 ఇకనుండి ఒక ఇంటిలో ఉండే అయిదుగురు వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురూ, ముగ్గురికి విరోధంగా ఇద్దరూ ఉంటారు.
\v 53 తండ్రి కొడుక్కీ, కొడుకు తండ్రికీ, తల్లి కూతురుకీ, కూతురు తల్లికీ, అత్త కోడలికీ, కోడలు అత్తకూ విరోధులుగా ఉంటారు" అని చెప్పాడు.
\s5
\v 54 తర్వాత ఆయన జనసమూహాలతో ఇలా అన్నాడు, " మీరు పడమట నుండి మబ్బు పైకి రావడం చూసేటప్పుడు వాన వస్తుందని వెంటనే చెప్పేస్తారు. అలాగే జరుగుతుంది.
\v 55 దక్షిణపు గాలి వీయడం చూసేటప్పుడు వడగాలి కొడుతుందని చెప్తారు. అలాగే జరుగుతుంది.
\v 56 కపట భక్తులారా, మీరు భూమీ ఆకాశాల ధోరణులను గుర్తిస్తారు. కానీ ఈ కాలాన్ని గుర్తించడం తెలుసుకోలేక పోతున్నారు.
\s5
\v 57 ఏది న్యాయమో మీ అంతట మీరే ఎందుకు ఆలోచించరు?
\v 58 మీ ప్రత్యర్థితో కలసి న్యాయాధికారి దగ్గరకు వెళ్తున్నప్పుడు దార్లోనే అతనితో రాజీపడే ప్రయత్నం చెయ్యి. లేకుంటే అతడు ఒక వేళ నిన్ను న్యాయాధిపతి దగ్గరకు లాక్కుపోతాడు. ఆ న్యాయాధిపతి నిన్ను భటుడికి అప్పగిస్తాడు. ఆ భటుడు నిన్ను చెరసాలలో వేస్తాడు.
\v 59 నువ్వు చివరి పైసా చెల్లించేంత వరకూ నువ్వు బయటకు రానే రావని నీకు చెప్తున్నాను." అన్నాడు.
\s5
\c 13
\s మనుషులు ఇతరులను వేలెత్తి చూపకూడదు
\p
\v 1 కొందరు గలిలయులు ఆలయంలో బలులర్పిస్తుంటే పిలాతు తన సైనికుల్ని పంపి వారిని క్రూరంగా చంపించాడు. కొద్ది కాలం క్రితమే జరిగిన ఈ సంగతిని కొందరు యేసుకు తెలియజేశారు.
\v 2 అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, "ఈ గలిలయులు ఇలా దారుణంగా చనిపోయారు కాబట్టి వీళ్ళు మిగిలిన గలిలయులందరి కంటే పాపులని మీరు అనుకుంటున్నారా?
\v 3 కారని మీతో చెప్తున్నాను. మీరు మారుమనస్సు పొందక పోతే మీరు కూడా అలాగే నశిస్తారు.
\s5
\v 4 అలాగే సిలోయంలో గోపురం కింద పడి చనిపోయిన పద్దెనిమిదిమంది సంగతేంటి? వారు యెరూషలేములో నివాసమున్న వారందరి కంటే అపరాధులని అనుకుంటున్నారా?
\v 5 కానే కాదని మీతో చెప్తున్నా. మీరు మారుమనస్సు పొందక పోతే మీరు కూడా అలాగే నశిస్తారు.
\s పండ్లు లేని అంజూరు చెట్టు (యెషయా 5:1-7; మత్తయి 21:18-20)
\s5
\p
\v 6 తర్వాత ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు, "ఒక మనిషి తన ద్రాక్షతోటలో ఒక అంజూరం చెట్టు నాటాడు. అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చి చూస్తే అతనికి పండ్లేమీ కన్పించలేదు.
\v 7 దాంతో అతడు తోటమాలిని పిలిచి అతనితో "మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్ల కోసం వస్తున్నాను కానీ నాకేమీ దొరకడం లేదు, దీనినిక నరికెయ్యి. దీని వల్ల భూమి కూడా ఎందుకు వృధా కావాలి" అన్నాడు.
\s5
\v 8 అయితే ఆ తోటమాలి "అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి, ఎరువు వేస్తాను. అందుకని ఈ సంవత్సరం కూడా దీనిని ఉండనియ్యి,
\v 9 అది ఫలిస్తే సరే, లేకపోతే నరికించి వెయ్యి" అన్నాడు."
\s ఒక స్త్రీకి స్వస్థత
\s5
\p
\v 10 ఒక విశ్రాంతి దినం ఆయన ఒక సమాజమందిరంలో బోధిస్తున్నాడు.
\v 11 బలహీనపరచే దయ్యం పట్టిన ఒక స్త్రీ పద్దెనిమిది ఏళ్ళుగా అక్కడ ఉంది. ఆమె నడుం వంగిపోయి ఎంత మాత్రమూ సరిగ్గా నిలబడలేక పోతూ ఉంది.
\s5
\v 12 యేసు ఆమెను చూచి, తన దగ్గరకు రమ్మని పిలిచి "అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందావు" అని ఆమెతో చెప్పి
\v 13 ఆమె మీద చేతులుంచాడు. వెంటనే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరచింది.
\v 14 యేసు విశ్రాంతి దినం రోజున స్వస్థపరచాడని ఆ సమాజ మందిరపు అధికారి మండిపడ్డాడు. అతడు జనసమూహాన్ని చూసి "పని చేయదగిన ఆరు రోజులున్నాయి కదా, ఆ రోజుల్లోనే వచ్చి స్వస్థత పొందండి. విశ్రాంతి దినం మాత్రం రావద్దు" అని చెప్పాడు.
\s5
\v 15 అందుకు ప్రభువు అతనికిలా జవాబిచ్చాడు, "కపటులారా, మీలో ప్రతివాడూ విశ్రాంతిదినాన తన ఎద్దునైనా గాడిద నైనా గాడి దగ్గర్నుంచి విప్పి, తోలుకుపోయి, నీళ్లు పెడతాడు కదా.
\v 16 ఇదిగో, పద్దెనిమిది ఏళ్ళ నుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినాన ఈ బంధకాల నుండి విడిపించకూడదా?" అని అతనితో చెప్పాడు.
\s5
\v 17 ఆయన ఈ మాటలు అన్నప్పుడు ఆయనను ఎదిరించిన వారంతా సిగ్గుపడ్డారు. అయితే జనసమూహమంతా ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి సంతోషించారు.
\s ఆవగింజ ఉపమానం (మత్తయి 13: 31,32; మార్కు 4:30-32)
\s5
\p
\v 18 ఆయన ఇలా అన్నాడు, "దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దానిని దేనితో పోల్చగలం?
\v 19 అది ఒక వ్యక్తి తన తోటలో వేసిన ఆవగింజ లాగా ఉంది. అది పెరిగి పెద్ద చెట్టు అయింది. ఆకాశంలోని పక్షులు దాని కొమ్మల పైన నివసించాయి," అన్నాడు.
\s పొంగ జేసే పదార్థం ఉపమానం (మత్తయి 13:33)
\s5
\p
\v 20 మళ్ళీ ఆయన "దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం?
\v 21 ఒక స్త్రీ మూడు కుంచాల పిండి పొంగడానికి, దానిలో వేసే పుల్లని పిండిని పోలి ఉంది" అన్నాడు.
\s యెరూషలేము మార్గంలో బోధనలు
\s5
\p
\v 22 ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలోని పట్టణాల్లో గ్రామాల్లో సంచరించి ప్రజలకు బోధించాడు.
\v 23 ఒకడు "ప్రభూ, దేవుడు కొద్ది మందినే రక్షిస్తాడా?" అని ఆయనని అడిగాడు.
\v 24 దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు, "ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి శ్రమ పడండి. చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు కాని వారివల్ల కాదని చెప్తున్నాను.
\s5
\v 25 ఇంటి యజమాని తలుపు వేసుకున్న తర్వాత మీరు బయట నిలబడి తలుపు కొడుతూ "అయ్యా, మాకు దయచేసి తలుపు తీయండి" అని ప్రార్థిస్తే
\v 26 ఆయన "మీరు ఎవరో, ఎక్కడి వారో నాకు తెలియదు" అని మీతో అంటాడు. అప్పుడు మీరు "నీ ముందే మేము తిన్నాం, తాగాం, మా వీధుల్లో నువ్వు ప్రచారం చేసావు కదా" అంటారు.
\v 27 అప్పుడు ఆయన "మళ్ళీ చెప్తున్నా, మీరు ఎక్కడి వారో నాకు తెలియదు. మీరంతా అక్రమాలు చేస్తారు. నా దగ్గర్నుంచి తొలగి పొండి" అంటాడు.
\s5
\v 28 అబ్రాహాము ఇస్సాకు యాకోబు, సకల ప్రవక్తలూ దేవుని రాజ్యంలో ఉండటం, మిమ్మల్ని బయటకు తోసివేయడం, అది చూస్తూ మీరు ఏడుస్తూ పండ్లు కొరుకుతారు.
\v 29 ఇంకా ప్రజలు తూర్పు నుండీ పడమర నుండీ ఉత్తరం నుండీ దక్షిణం నుండీ వచ్చి, దేవుని రాజ్యంలో భోజనానికి కూర్చుంటారు.
\v 30 ఇదిగో వినండి, చివరి వారిలో కొందరు మొదటి వారవుతారు, అలాగే మొదటివారిలో కొందరు చివరి వారవుతారు."
\s5
\v 31 అదే రోజున కొందరు పరిసయ్యులు వచ్చి "నువ్వు ఇక్కడనుండి వెంటనే వెళ్ళిపో. ఎందుకంటే హేరోదు నిన్ను చంపాలని చూస్తున్నాడు," అని ఆయనతో చెప్పారు.
\v 32 ఆయన వారిని చూసి, "మీరు వెళ్లి, ఆ గుంట నక్కతో ఇలా చెప్పండి, ఇదిగో ఈ రోజూ, రేపూ నేను దయ్యాలను వెళ్ళగొడతాను. రోగులను స్వస్థ పరుస్తాను. మూడవ రోజున నా గమ్యం నేను చేరుతాను.
\v 33 అయితే ఈ రోజూ రేపూ ఆ తర్వాత కూడా నేను యెరుషలేముకు నా ప్రయాణం కొనసాగించాల్సిందే. ఎందుకంటే యెరుషలేం వెలుపల ప్రవక్త హతం కావడం కుదరదు!
\s యెరూషలేము కోసం యేసు విలాపం (మత్తయి 23:37-39; లూకా 19:41-44)
\s5
\p
\v 34 యెరూషలేమా, ఓ యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ దగ్గరకు పంపిన వారిని రాళ్ళతో కొడుతూ ఉండే పట్టణమా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా చేర్చుకుంటుందో ఆలాగే నేను నీ పిల్లల్ని చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడ్డాను. కాని నువ్వు కలిసి రాలేదు.
\v 35 ఇదిగో విను! నీ ఇల్లు నీకు పాడుగా విడిచి పెడుతున్నాను. "ప్రభువు పేరట వచ్చే వాడు ధన్యుడు" అని నువ్వు చెప్పేంత వరకు నన్ను మళ్ళీ చూడవని నీతో ఖచ్చితంగా చెప్తున్నాను," అన్నాడు.
\s5
\c 14
\s విశ్రాంతి దినాన యేసు స్వస్థపరిచాడు
\p
\v 1 ఒక విశ్రాంతి దినం ఆయన ఒక పరిసయ్యుల అధికారి ఇంట్లో భోజనానికి వెళ్ళాడు. అక్కడ ఆయనను అందరూ గమనిస్తున్నారు.
\v 2 అక్కడ వాపు రోగం ఉన్న ఒకడు ఆయనకు ఎదురుగా ఉన్నాడు.
\v 3 అప్పుడు యేసు "విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా కాదా? " అని ధర్మశాస్త్రాన్ని బోధించే వారినీ పరిసయ్యులనూ అడిగాడు.
\s5
\v 4 వారు మౌనం వహించారు. అప్పుడు ఆయన అతణ్ణి దగ్గరకు తీసుకుని అతడి రోగాన్ని బాగు చేసి పంపించేశాడు.
\v 5 "మీలో ఎవరి గాడిదైనా ఎద్దైనా విశ్రాంతి దినాన గుంటలో పడిపోతే దానిని బయటకు తీయకుండా ఉంటారా?" అని వారిని అడిగాడు.
\v 6 ఈ ప్రశ్నకు వారు జవాబివ్వలేకపోయారు.
\s తన గురించి ఎక్కువగా ఊహించుకునే అతిథి
\s5
\p
\v 7 ఆ విందుకు ఆహ్వానం అందినవారు భోజనపంక్తిలో అగ్ర స్థానాలను ఎన్నుకోవడం చూసి ఆయన ఇలా అన్నాడు,
\v 8 "నిన్ను ఎవరైనా పెళ్లి విందుకు పిలిస్తే అక్కడ అగ్ర స్థానంలో కూర్చోవద్దు. ఒకవేళ నీకంటె గొప్పవాణ్ణి అతడు పిలిచి ఉండవచ్చు.
\v 9 మిమ్మల్నిద్దర్నీ పిలిచినవాడు వచ్చి 'ఈయన్ని ఇక్కడ కూర్చోనివ్వు' అనవచ్చు. అప్పుడు నువ్వు సిగ్గు పడి చివరి స్థానంలో కూర్చోడానికి వెళ్తావు.
\s5
\v 10 కాబట్టి నీకు ఆహ్వానం అందినప్పుడు వెళ్లి చివరి స్థానంలో కూర్చో. అప్పుడు నిన్ను ఆహ్వానించిన వాడు వచ్చి నీతో 'మిత్రమా, పై స్థానానికి వెళ్ళు.' అనవచ్చు. అప్పుడు నీకు అందరి ముందూ గౌరవం కలుగుతుంది.
\v 11 తనను తాను గొప్ప చేసుకునేవాడు తగ్గడం, తగ్గించుకునేవాడు హెచ్చడం జరుగుతుంది."
\s5
\v 12 తర్వాత ఆయన తనను పిలిచిన వ్యక్తితో ఇలా అన్నాడు, "నువ్వు పగలైనా రాత్రి అయినా విందు చేసినప్పుడు నీ స్నేహితులనైనా నీ సహోదరులనైనా నీ బంధువులనైనా ధనవంతులనైనా నీ పొరుగువారినైనా పిలవకు. ఎందుకంటే నువ్వు వాళ్ళను పిలిచావు కాబట్టి వాళ్ళు నిన్ను తిరిగి పిలవ వచ్చు. కాబట్టి నీకు వారి ద్వారా ఉపకారం కలుగుతుంది.
\s5
\v 13 అందుకని నువ్వు విందు చేసినప్పుడు పేదలనూ వికలాంగులనూ గుడ్డివారినీ పిలువు.
\v 14 నీకు తిరిగి ఉపకారం చేయడానికి వారికేమీ ఉండదు. కాబట్టి నువ్వు దీవెన పొంది ధన్యుడివి అవుతావు. చనిపోయిన నీతిమంతులు సజీవంగా లేచినప్పుడు నీకు ప్రతిఫలం దొరుకుతుంది," అని చెప్పాడు.
\s5
\v 15 ఆయనతో భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని "దేవునిరాజ్యం లో భోజనం చేసేవాడు ధన్యుడు" అని ఆయనతో చెప్పాడు.
\s గొప్ప విందు ఉపమానం (మత్తయి 22:1-14)
\p
\v 16 అప్పుడు ఆయన అతనితో ఇలా చెప్పాడు, "ఒక మనిషి గొప్ప విందు చేయించి అనేక మందిని పిలిచాడు.
\v 17 విందుకు వేళయినప్పుడు అతడు 'ఇప్పుడు విందు సిద్ధంగా ఉంది, రండి' అని తాను పిలిచిన వారితో చెప్పడానికి తన దాసుణ్ణి పంపాడు.
\s5
\v 18 అయితే వారంతా ఒక్కపెట్టున సాకులు చెప్పడం మొదలు పెట్టారు. మొదటి వాడు 'నేనొక పొలం కొన్నాను. వెంటనే వెళ్లి దానిని చూసుకోవాలి. నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను' అన్నాడు.
\v 19 మరొకడు 'నేను అయిదు జతల ఎద్దుల్ని కొన్నాను. ఇప్పుడు నేను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. నన్ను క్షమించాలని వేడుకుంటున్నాను' అన్నాడు.
\v 20 మరొకడు 'నేను పెళ్లి చేసుకున్నాను. కాబట్టి రాలేను' అన్నాడు.
\s5
\v 21 అప్పుడాపనివాడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి చెప్పాడు. దాంతో ఆ యజమాని కోపపడి ఆ దాసుడితో 'నువ్వు త్వరగా ఊరి వీధుల్లోకీ, సందుల్లోకీ వెళ్లి అక్కడ ఉన్న పేదలనూ వికలాంగులనూ గుడ్డివారినీ కుంటివారినీ తీసుకుని రా' అన్నాడు.
\v 22 తర్వాత ఆ పనివాడు వచ్చి 'ప్రభూ, నువ్వు చెప్పినట్లే చేసాను. కానీ ఇంకా చోటు ఉంది' అన్నాడు.
\s5
\v 23 అప్పుడు ఆ యజమాని తన దాసునితో ఇలా అన్నాడు, 'నా ఇల్లు నిండిపోవాలి. కనుక నువ్వు రాజ మార్గం లో ఉన్నవారినీ, కంచెలు వేసుకుని నివసిస్తున్న వారినీ బలవంతంగా తీసుకునిరా.'
\v 24 నేను నీకు చెప్తున్నాను. నేను మొదట పిలిచిన వారిలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు."
\s శిష్యరికానికి పరీక్ష (మత్తయి 10:37-39)
\s5
\p
\v 25 గొప్ప జన సమూహాలు ఆయనతో వస్తూ ఉన్నారు. ఆయన వారి వైపు తిరిగి ఇలా అన్నాడు,
\v 26 "నా దగ్గరకు వచ్చే వాడెవడైనా సరే, తన తండ్రినీ తల్లినీ భార్యనీ పిల్లల్నీ అన్నదమ్ముల్నీ అక్కచెల్లెళ్ళనీ చివరకు తన ప్రాణాన్ని కూడా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కాలేడు.
\v 27 అలాగే తన సిలువను మోసుకుంటూ నా వెనుక రానివాడు నా శిష్యుడు కాలేడు.
\s గోపురం
\s5
\p
\v 28 మీలో ఎవరైనా ఒక గోపురం కట్టాలని అనుకుంటే దానిని మొదలుపెట్టి కొనసాగించడానికి కావలసింది తన దగ్గర ఉందో లేదో లెక్క చూసుకోడా?
\v 29 అలా చూసుకోకుండా మొదలు పెట్టేసి ఆ తర్వాత గోపురం పూర్తి చేయలేకపోతే
\v 30 చూస్తున్న వాళ్ళంతా 'ఈ మనిషి కట్టడం మొదలు పెట్టాడు గానీ ముగించ లేకపోయాడు' అంటూ వేళాకోళం చేస్తారు.
\s యుద్ధం
\s5
\p
\v 31 అలాగే ఒక రాజు మరో రాజు పై యుద్ధానికి బయల్దేరినప్పుడు, ఇరవై వేల మంది సైన్యంతో తన మీదకు వస్తున్న వాణ్ణి ఎదుర్కోడానికి తన వద్ద ఉన్న పదివేల మంది సైన్యం సరిపోతుందో లేదో ఆలోచించుకోడా?
\v 32 తన శక్తి చాలదనుకుంటే ఆ రాజు దూరంగా ఉన్నప్పుడే శాంతి రాయబారం పంపి సంధి చేసుకోడానికి ప్రయత్నిస్తాడు కదా!
\v 33 అదే విధంగా మీలో తనకు ఉన్నదంతా వదులుకోని వాడు నాకు శిష్యుడు కాలేడు.
\s ఉప్పదనం పోయిన ఉప్పు (మత్తయి 5:13; మార్కు 9:50)
\s5
\p
\v 34 ఉప్పు మంచిదే. అయితే ఉప్పు తన సారాన్ని కోల్పోతే దానికి తిరిగి సారం దేనివల్ల కలుగుతుంది?
\v 35 అది భూమికి గానీ, ఎరువులా వాడడానికి గానీ పనికిరాదు. కాబట్టి దానిని బయట పారవేస్తారు. వినడానికి చెవులున్న వాడు వింటాడు గాక."
\s5
\c 15
\s సణుగుకున్న పరిసయ్యులు
\p
\v 1 తర్వాత ఒకసారి పన్నులు వసూలు చేసేవారూ, పాపులూ అనేకమంది ఆయన ఉపదేశం వినడానికి ఆయన దగ్గరకు వచ్చారు.
\v 2 పరిసయ్యులూ, ధర్మశాస్త్ర పండితులూ అది చూసి "ఈ మనిషి పాపులను దగ్గరకు రానిస్తూ వారితో కలసి భోజనం చేస్తున్నాడు" అని సణుగుకున్నారు.
\s5
\v 3 అందుకాయన వారికి ఈ ఉపమానం చెప్పాడు.
\s కనిపించకుండా పోయిన గొర్రె ఉపమానం (మత్తయి 18: 12-24)
\p
\v 4 "మీలో ఏ మనిషి కైనా వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే అతడు మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెలను అడవిలో వదిలి, వెళ్లి ఆ తప్పిపోయిన గొర్రె దొరికేంతవరకూ వెదకడా"
\v 5 అది దొరకినప్పుడు సంతోషంతో దానిని తన భుజాల మీద వేసుకొని యింటికి వచ్చి తన స్నేహితులనూ, ఇరుగుపొరుగు వారినీ పిలిచి
\s5
\v 6 'మీరు నాతో కలిసి సంతోషించండి. ఎందుకంటే తప్పి పోయిన నా గొర్రె దొరికింది' అని వారితో చెప్తాడు కదా.
\v 7 అలాగే పశ్చాత్తాపం అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయంలో కలిగే సంతోషం కంటే పశ్చాత్తాపం పొందే ఒక్క పాపి విషయమై పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది.
\s పోయిన నాణెం
\s5
\p
\v 8 ఒకామెకు పది వెండి నాణేలు ఉండి వాటిలో ఒకటి పోతే ఆమె దానికోసం దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి, పోయిన నాణెం దొరికే వరకూ జాగ్రత్తగా వెదకదా ?
\v 9 అది దొరికినప్పుడు తన స్నేహితురాళ్ళనూ ఇరుగుపొరుగు వారినీ పిలిచి "నేను పోగొట్టుకున్న నాణెం దొరికింది కాబట్టి నాతో కలసి సంతోషించండి" అంటుంది కదా.
\v 10 అలాగే పశ్చాత్తాపం పొందే పాపిని గురించి పరలోకంలో దేవుని దూతల సముఖంలో సంతోషం కలుగుతుందని మీకు చెప్తున్నాను" అన్నాడు.
\s ఇల్లు విడిచి వెళ్లిపోయిన కొడుకు
\s5
\p
\v 11 ఆయన ఇంకా ఇలా అన్నాడు, "ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.
\v 12 వారిలో చిన్నవాడు 'నాన్నా, ఆస్తిలో నా వాటా నాకు పంచి ఇవ్వు' అన్నాడు. తండ్రి తన ఆస్తిని వారికి పంచి ఇచ్చాడు.
\s5
\v 13 కొన్నాళ్ళయ్యాక చిన్న కొడుకు తనకున్నదంతా కూడగట్టుకుని ఒక దూర దేశానికి ప్రయాణమై వెళ్ళాడు. అక్కడ తన డబ్బంతా దుర్వ్యసనాలపై విచ్చలవిడిగా ఖర్చు చేసాడు.
\v 14 అంతా ఖర్చయిపోయాక ఆ దేశంలో తీవ్రమైన కరవు వచ్చింది. వాడికి ఇబ్బందులు మొదలైనాయి.
\s5
\v 15 దాంతో వాడు వెళ్లి ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనికి కుదిరాడు. ఆ వ్యక్తి వీడిని తన పందులు మేపడానికి తన పొలాల్లోకి పంపించాడు.
\v 16 వాడు ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశ పడ్డాడు. కానీ వాడికి ఎవరూ ఏమీ ఇవ్వలేదు.
\s5
\v 17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఇలా అనుకున్నాడు, 'నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వాళ్లకు ఆహారం పుష్కలంగా ఉంది. నేనేమో ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను.
\v 18 నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళ్ళిపోతాను. నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను.
\v 19 ఇకనుండి నీ కొడుకు అనిపించుకోవడానికి నాకు ఏ అర్హతా లేదు. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకడిగా పెట్టుకో అని చెప్తాను'. ఇలా అనుకుని వాడు లేచి తన తండ్రి దగ్గరకు వచ్చాడు.
\s5
\v 20 అతడింకా దూరంగా ఉండగానే తండ్రి వాణ్ణి చూసి కనికరపడి, పరుగెత్తుకుంటూ వెళ్లి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు.
\v 21 అప్పుడా కొడుకు తండ్రితో "నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను. ఇక నుండి నీ కొడుకునని చెప్పుకోడానికి నాకు ఏ యోగ్యతా లేదు" అన్నాడు.
\s5
\p
\v 22 అయితే తండ్రి తన దాసులతో "శ్రేష్టమైన బట్టలు తెచ్చి ఇతనికి తొడగండి. ఇతని చేతికి ఉంగరం పెట్టి, కాళ్ళకు చెప్పులు తొడగండి.
\v 23 కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంబరాలు చేసుకుందాం.
\v 24 నా ఈ కొడుకు చనిపోయి మళ్ళీ బతికాడు. తప్పిపోయి దొరికాడు." అని చెప్పాడు. అప్పుడు వాళ్ళంతా సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు.
\s పరిసయ్యుల మనస్తత్వం
\s5
\p
\v 25 ఆ సమయంలో అతని పెద్ద కొడుకు పొలంలో ఉన్నాడు. అతడు ఇంటికి దగ్గరగా వచ్చినప్పుడు సంగీతం, నాట్య ధ్వని అతనికి వినిపించాయి.
\v 26 ఒక దాసుణ్ణి పిలిచి "ఏం జరుగుతోంది?" అని అడిగాడు.
\v 27 ఆ పనివాడు అతనితో "నీ తమ్ముడు వచ్చాడు. అతడు తన దగ్గరకు క్షేమంగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి కొవ్విన దూడను వధించాడు" అని చెప్పాడు.
\s5
\v 28 దాంతో పెద్దకొడుక్కి కోపం వచ్చి లోపలికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అతని తండ్రి బయటకు వచ్చి అతణ్ణి లోపలికి రమ్మని బతిమాలాడు.
\v 29 కాని అతడు "ఇదిగో విను, ఇన్నేళ్ళ నుండి నీకు సేవలు చేస్తున్నాను. ఏనాడూ నీ మాట జవ దాటలేదు. అయినా నా స్నేహితులతో కలసి సంబరం చేసుకోడానికి నువ్వు నాకొక మేకపిల్లను కూడా ఇవ్వలేదు.
\v 30 కానీ నీ ఆస్తిని వేశ్యలకు ఖర్చు చేసిన నీ కొడుకు రాగానే వాడి కోసం కొవ్విన దూడను వధించావు" అంటూ నిష్టూరంగా మాట్లాడాడు.
\s5
\v 31 అందుకతని తండ్రి "నాయనా, నువ్వెప్పుడూ నా దగ్గరే ఉన్నావు. నావన్నీ నీవే.
\v 32 మనం సంతోషంగా పండగ చేసుకోవాల్సిందే. ఎందుకంటే నీ తమ్ముడు చనిపోయి బతికాడు, తప్పిపోయి దొరికాడు" అని చెప్పాడు.
\s5
\c 16
\s న్యాయం తప్పిన మేనేజర్ ఉపమానం
\p
\v 1 ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు, "ఒక ధనవంతుడి దగ్గర ఒక అధికారి ఉన్నాడు. అతడు ఆ ధనవంతుని ఇంటి ఆర్ధిక వ్యవహారాలు చూసేవాడు. అతడు తన ఆస్తిని పాడు చేస్తున్నాడనే ఫిర్యాదు ధనవంతుడికి వచ్చింది.
\v 2 అతడు ఆ అధికారిని పిలిపించి "నీ గురించి నేను వింటున్నదేమిటి ? నీ పనికి సంబంధించిన లెక్క అంతా అప్పగించు. ఇకపైన నువ్వు నిర్వహణాధికారిగా ఉండటానికి వీల్లేదు" అన్నాడు.
\s5
\v 3 అప్పుడు అతడు ఇలా అనుకున్నాడు "యజమాని నన్ను నిర్వహణ పనిలో నుండి తీసివేస్తున్నాడు. ఇప్పుడు నేనేంచేయాలి? తవ్వకం పని నాకు చేతకాదు. భిక్షమెత్తాలంటే అవమానం.
\v 4 నన్ను ఈ నిర్వాహకత్వపు పని నుండి తొలగించిన తర్వాత నలుగురూ తమ ఇళ్ళల్లోకి నన్ను ఆహ్వానించేలా ఎలా చేయాలో నాకు తెలుసు" అనుకున్నాడు.
\s5
\v 5 ఆ తర్వాత అతడు తన యజమానికి బాకీ ఉన్న వారందరినీ పిలిపించాడు. ఒకడితో "నా యజమానికి నువ్వు ఎంత బాకీ ఉన్నావు" అని అడిగాడు.
\v 6 "మూడు వేల లీటర్ల నూనె" అని అతడు జవాబిచ్చాడు. ఈ అధికారి ఆ వ్యక్తితో "నీ పత్రంలో పదిహేను వందల లీటర్లని రాసుకో" అన్నాడు.
\v 7 "నువ్వు ఎంత బాకీ ఉన్నావు?" అని మరొకణ్ణి అడిగితే అతడు "వంద మానికల గోధుమలు" అని చెప్పాడు. నిర్వహణాధికారి అతనితో "నీ పత్రంలో ఎనభై మానికలని రాసుకో" అన్నాడు.
\s5
\v 8 న్యాయం తప్పి వ్యవహరించిన ఆ అధికారి తెలివైన పని చేసాడని యజమాని అతణ్ణి మెచ్చుకున్నాడు. ఈ లోక సంబంధులు తమ వారి విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. ఈ విషయంలో వారు దేవుని ప్రజల కంటే తెలివైన వారు.
\v 9 అన్యాయమైన ధనంతో స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకంటే ఆ ధనం మిమ్మల్ని వదిలి పోయినప్పుడు వారు తమ శాశ్వతమైన నివాసాలలో మిమ్మల్ని చేర్చుకుంటారని మీతో చెప్తున్నాను.
\s5
\v 10 చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండేవాడు పెద్ద విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటాడు. చిన్న విషయాల్లో అన్యాయంగా ఉండే వాడు పెద్ద విషయాల్లో కూడా అన్యాయంగానే ఉంటాడు.
\v 11 కాబట్టి మీరు అన్యాయమైన ధనం విషయంలోనే నమ్మకంగా లేకపోతే, ఇక న్యాయమైన ధనం మీకెవరిస్తారు ?
\v 12 మీరు ఇతరుల ధనం విషయంలో నమ్మకంగా లేకపోతే మీ సొంతమైనది మీకు ఎవరిస్తారు?
\s5
\v 13 ఏ సేవకుడూ ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు. అతడు ఒకర్ని ద్వేషించి రెండో యజమానిని ప్రేమిస్తాడు. లేదా ఒకరికి కట్టుబడి ఉండి మరొకర్ని చిన్న చూపు చూస్తాడు."
\s పరిసయ్యులకు యేసు జవాబు.
\s5
\p
\v 14 ధనాన్ని ప్రేమించే పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను ఎగతాళి చేశారు.
\v 15 ఆయన వారితో ఇలా అన్నాడు. "మీరు మనుష్యుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకునేవారే గానీ దేవునికి మీ హృదయాలు తెలుసు. మనుషులు ఘనంగా ఎంచేది దేవునికి అసహ్యం.
\s5
\v 16 బాప్తిస్మమిచ్చే యోహాను వచ్చేంత వరకూ ధర్మశాస్త్రమూ ప్రవక్తల బోధలూ ఉన్నాయి. అప్పట్నించి దేవుని రాజ్య సువార్త ప్రకటన జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతూ ఉన్నారు.
\v 17 ధర్మశాస్త్రంలో ఒక పొల్లయినా తప్పి పోవడం కంటే ఆకాశం, భూమీ నశించి పోవడమే తేలిక.
\s విడాకులు (మత్తయి 5: 31,32; 19:3-11; మార్కు 10:2-12; కొరింతి 7: 10-15)
\s5
\p
\v 18 భార్యకు విడాకులు ఇచ్చి మరో స్త్రీని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు. అలాగే విడాకులు తీసుకున్న స్త్రీని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
\s ధనికుడు, లాజరు
\s5
\p
\v 19 ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఊదారంగు వస్త్రాలూ, ఖరీదైన బట్టలూ ధరించేవాడు. ప్రతి రోజూ విలాసంగా జీవించేవాడు.
\v 20 లాజరు అనే నిరుపేద కూడా ఉండేవాడు. ఇతనికి ఒంటినిండా కురుపులుండేవి. ఇతడు ధనవంతుని ఇంటి గుమ్మం ముందు పడి ఉండేవాడు.
\v 21 ధనవంతుని భోజన బల్ల పైనించి కిందపడే రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకోడానికి ప్రయత్నం చేసేవాడు. అంతేకాకుండా వీధి కుక్కలు వచ్చి అతని కురుపులు నాకేవి.
\s5
\v 22 ఆ నిరుపేద చనిపోయాడు. దేవదూతలు వచ్చి అతణ్ణి అబ్రాహాముకు సన్నిహితంగా ఉండటానికి తీసుకు వెళ్ళారు. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అతణ్ణి పాతిపెట్టారు.
\v 23 అతడు పాతాళంలో యాతన పడుతూ పైకి తేరి చూసి దూరంగా ఉన్న అబ్రాహామునూ అతనికి సన్నిహితంగా ఉన్న లాజరునూ చూసి
\s5
\v 24 "తండ్రీ అబ్రాహామూ, నన్ను కరుణించు. నేను ఈ మంటల్లో అల్లాడి పోతూ ఉన్నాను. లాజరు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకపై చల్లడానికి అతణ్ణి పంపు" అని కేకలు పెట్టాడు.
\s5
\v 25 దానికి జవాబుగా అబ్రాహాము "నాయనా, గుర్తు తెచ్చుకో, నువ్వు జీవించి ఉన్నప్పుడు నీకిష్టమైన వాటిని నువ్వు అనుభవించావు. అప్పుడు లాజరు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పుడు ఇక్కడ అతను సేద దీరుతున్నాడు. నువ్వు యాతన పడుతున్నావు.
\v 26 అదీగాక ఇక్కడ నుండి మీ దగ్గరకు రావాలనుకునే వారు వెళ్ళలేకుండా అక్కడి వారు మా దగ్గరకు రాకుండా మీకూ మాకూ మధ్య పెద్ద అగాధం ఉంది," అన్నాడు.
\s5
\v 27 అప్పుడతడు "అలాగైతే తండ్రీ, నాకు ఐదుగురు సోదరులున్నారు.
\v 28 వారు కూడా ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా సాక్ష్యం ఇవ్వడానికి లాజరును మా ఇంటికి పంపించమని నిన్ను వేడుకుంటున్నాను" అన్నాడు.
\s5
\v 29 అందుకు అబ్రాహాము "వారి దగ్గర మోషే, ప్రవక్తలూ ఉన్నారు. నీ సోదరులు వారి మాటలు వినాలి" అన్నాడు.
\v 30 అతడు "తండ్రీ, అబ్రాహామూ అలా అనకు, చనిపోయిన వారిలోనుండి ఎవరైనా వెళ్తే వారు తప్పక పశ్చాత్తాప పడతారు" అన్నాడు.
\v 31 అందుకు అబ్రాహాము అతనితో "మోషే, ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలోనుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు" అన్నాడు.
\s5
\c 17
\s క్షమాపణ గురించిన ఉపదేశం (మత్తయి 18:7, 15)
\p
\v 1 ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, "ఆటంకాలు రాకుండా ఉండడం అసాధ్యం. కానీ అవి ఎవరి వల్ల వస్తాయో ఆ వ్యక్తికి శిక్ష తప్పదు.
\v 2 అలాంటి వ్యక్తి ఈ చిన్న బిడ్డలలో ఎవరికైనా ఆటంకం కలగచేయడం కంటే అతడి మెడకు తిరగలి రాయి కట్టి సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
\s5
\v 3 మీ వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు మీకు వ్యతిరేకంగా అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి.
\v 4 అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరకు వచ్చి "పశ్చాత్తాప పడుతున్నాను" అంటే మీరు అతణ్ణి క్షమించాలి."
\s5
\v 5 అపొస్తలులు "ప్రభూ, మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి." అన్నారు.
\v 6 ప్రభువు "మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ మారేడు చెట్టును చూసి 'నీవు వేళ్లతో సహా పెళ్లగించుకుని పోయి సముద్రం లో నాటుకు పో' అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది.
\s ఉపచారం గురించిన ఉపమానం
\s5
\p
\v 7 మీలో ఎవరి సేవకుడైనా పొలంలో భూమి దున్నుతూనో, మందను మేపుతూనో ఉండి ఇంటికి వస్తే యజమాని 'నువ్వు వెంటనే వచ్చి భోజనానికి కూర్చో' అంటాడా? అనడు.
\v 8 పైగా 'నాకు భోజనం సిద్ధం చెయ్యి. తువ్వాలు కట్టుకుని నేను భోజనం చేసి ముగించే వరకూ నాకు సేవ చెయ్యి. ఆ తర్వాత నువ్వు తినవచ్చు' అంటాడు.
\s5
\v 9 తాను ఆజ్ఞాపించిన పనులన్నీ ఆ పనివాడు చక్కగా చేసాడని యజమాని 'నాపై దయ చూపించావు' అని వాణ్ణి మెచ్చుకుంటాడా?
\v 10 అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తర్వాత 'మేము పనికిమాలిన దాసులం. మేం చేయాల్సిందే చేసాం' అని చెప్పాలి.
\s పదిమంది కుష్టరోగుల స్వస్థత
\s5
\p
\v 11 ఆయన యెరూషలేం కు ప్రయాణమై దారిలో సమరియ, గలిలయ ప్రాంతాల గుండా వెళ్తూ
\v 12 ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్టు రోగమున్న పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు.
\v 13 "యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు" అని గట్టిగా కేకలు వేసారు.
\s5
\v 14 ఆయన వారిని చూసి, "మీరు వెళ్లి, యాజకులకు కనపడండి" అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు.
\v 15 వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి
\v 16 బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. వాడు సమరయ ప్రాంతం వాడు.
\s5
\v 17 అందుకు యేసు "పది మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన తొమ్మిది మంది ఎక్కడ?
\v 18 దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడక పోవడం ఏమిటి?" అన్నాడు.
\v 19 "నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది" అని వాడితో చెప్పాడు.
\s రాజ్యం గురించిన ఆత్మిక అంతరార్థం (లూకా 19:11, 12)
\s5
\p
\v 20 ఒకసారి పరిసయ్యులు "దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది" అని ఆయనను అడిగారు. దానికి ఆయన "దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు.
\v 21 ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. కాబట్టి దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది అంటూ చెప్పడానికి కుదరదు" అని వారికి జవాబిచ్చాడు.
\s యేసు తన రెండవ రాక విషయం వెల్లడించడం
\s5
\p
\v 22 ఇంకా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, "మనుష్య కుమారుడి రోజుల్లో ఒక రోజుని చూడాలని మీరు ఎంతగానో కోరుకునే సమయం వస్తుంది. కానీ మీరు ఆ రోజుని చూడరు.
\v 23 వారు "ఇదిగో యిక్కడుంది, అదిగో అక్కడుంది" అంటారు. మీరు వెళ్ళవద్దు. అసలు వారిని అనుసరించవద్దు.
\v 24 ఆకాశంలో ఒక దిక్కున తళుక్కున మెరుపు మెరిసి ఆ వెలుగు మరో దిక్కు వరకు ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఆ రోజున మనుష్య కుమారుడు కూడా ఉంటాడు.
\s5
\v 25 అయితే దీనికి ముందుగా ఆయన అనేక హింసలు పొందాలి. ఈ తరం వారు ఆయన్ని పూర్తిగా నిరాకరించాలి.
\v 26 నోవహు రోజులలో జరిగినట్టు గానే మనుష్యకుమారుడి రోజుల్లో కూడా జరుగుతుంది.
\v 27 నోవహు ఓడలోనికి వెళ్లిన రోజు వరకూ ప్రజలు తినడం తాగడం పెళ్లిళ్లకు ఇవ్వడం పుచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి అందర్నీ నాశనం చేసింది.
\s5
\v 28 లోతు రోజులలో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నారు నాటుతూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు.
\v 29 అయితే లోతు, సొదొమ విడిచి వెళ్ళిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి అందరూ నాశనం అయ్యారు.
\s5
\v 30 అలాగే మనుష్యకుమారుడు ప్రత్యక్షమయే రోజున కూడా జరుగుతుంది.
\v 31 ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకు పోవడం కోసం కిందకు దిగకూడదు. అలాగే పొలంలో పనిచేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు.
\s5
\v 32 లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి.
\v 33 తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునే వాడు దానిని పోగొట్టుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకుంటాడు.
\s5
\v 34 నేను చెప్పేదేమంటే ఆ రాత్రి ఒక మంచం మీద ఇద్దరు ఉంటే వారిలో ఒకరు పైకి వెళతారు. మరొకరు కిందనే ఉండిపోతారు.
\v 35 ఇద్దరు స్త్రీలు ఒకే తిరుగలి విసురుతూ ఉంటారు. వారిలో ఒకామె వెళ్ళిపోవడం, మరొకామె కిందనే ఉండిపోవడం జరుగుతుంది. ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటారు. వారిలో ఒకడు వెళ్ళిపోతాడు. మరొకడు కిందనే ఉండిపోతాడు."
\v 36 అప్పుడు శిష్యులు "ప్రభూ, ఇదంతా ఎక్కడ జరుగుతుంది" అని అడిగారు.
\v 37 దానికి జవాబుగా ఆయన "శవం ఎక్కడ ఉంటే రాబందులు అక్కడ పోగవుతాయి" అన్నాడు.
\s5
\c 18
\s న్యాయం లేని న్యాయాధికారి ఉపమానం
\p
\v 1 తన శిష్యులు నిరుత్సాహపడకుండా ఎల్ల వేళలా ప్రార్థన చేస్తూ ఉండాలనడానికి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు.
\v 2 "ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుష్యులంటే లెక్కలేదు.
\s5
\v 3 ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని దగ్గరకు తరచుగా వచ్చి 'నా ప్రతివాదితో వివాదం విషయంలో నాకు న్యాయం చెయ్యి' అని అడుగుతూ ఉండేది.
\v 4 అతడు ఆమెకు న్యాయం చేయడానికి కొంతకాలం ఇష్టపడలేదు. కాని తరువాత ఇలా అనుకున్నాడు. 'నేను దేవుడికి భయపడను, మనుష్యులనూ లెక్కచెయ్యను.
\v 5 కానీ ఈ విధవరాలు నన్ను ఒకటే విసిగిస్తూ ఉంది. కాబట్టి ఆమె మాటిమాటికీ వచ్చి నన్ను సతాయించకుండా ఆమెకి న్యాయం జరిగిస్తాను' అనుకున్నాడు."
\s5
\v 6 ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, "న్యాయవంతుడు కాని ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినండి.
\v 7 తాను ఎన్నుకున్న వారు రాత్రింబగళ్ళు తనకు విజ్ఞాపనలు చేస్తూ వుంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా?
\v 8 ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు. వారి విషయమై ఆయన సహనం చూపిస్తున్నాడు కదా? అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా?"
\s పరిసయ్యుడు, పన్ను వసూలుదారుడు
\s5
\p
\v 9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు.
\v 10 "ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్లారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు.
\s5
\v 11 పరిసయ్యుడు నిలబడి "దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను
\v 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదో వంతు నీకిస్తున్నాను" అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు
\s5
\v 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడటానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ "దేవా, నేను పాపిని. నన్ను కరుణించు" అన్నాడు.
\v 14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాడినే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నీతిమంతుడిగా ఇంటికి వెళ్ళాడని మీతో చెప్తున్నాను. నేను గొప్పవాణ్ణి అనుకునే వాణ్ణి తగ్గించడం, నేను హీనుడని అనుకునే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది.
\s యేసు చిన్నపిల్లలను దీవించడం (మత్తయి 19:13-15; మార్కు 10:13-16)
\s5
\p
\v 15 తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకు వచ్చిన వారిని గద్దించారు.
\v 16 అయితే యేసు వారిని తన దగ్గరకు పిలిపించాడు. "పసిపాపల్ని నా దగ్గరకు రానివ్వండి. వారిని ఆటంక పెట్టవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాటి వారిదే.
\v 17 చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో ఖచ్చితంగా చెప్తున్నాను." అన్నాడు.
\s ధనికుడైన యువ అధికారి (మత్తయి 19:16-30; మార్కు 10:17-31)
\s5
\p
\v 18 ఒక అధికారి ఆయనను చూచి "మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి" అని అడిగాడు.
\v 19 అందుకు యేసు "నన్ను మంచి వాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు.
\v 20 వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, తలిదండ్రుల్ని గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా" అని అతనితో అన్నాడు.
\v 21 దానికి జవాబుగా అతడు "వీటిని చిన్నప్పట్నించి పాటిస్తూనే ఉన్నాను" అన్నాడు.
\s5
\v 22 యేసు అతని మాట విని ఇలా అన్నాడు. "నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. నువ్వేమో నన్ను అనుసరించు" అన్నాడు.
\v 23 అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు.
\s5
\v 24 యేసు అతని చూచి "ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం.
\v 25 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది రంధ్రం గుండా ఒంటె వెళ్ళడం తేలిక" అన్నాడు.
\s5
\v 26 ఇది విన్న వారు "అలాగైతే రక్షణ ఎవరు పొందగలరు?"అని అడిగారు
\v 27 అందుకు ఆయన "మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే" అని చెప్పాడు.
\s5
\v 28 అప్పుడు పేతురు ఇలా అన్నాడు "చూడు, మేం అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాము."
\v 29 అందుకు ఆయన "దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నాదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి
\v 30 ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను " అన్నాడు .
\s యేసు తన మరణ ఉత్థానాల గురించి చెప్పడం (మత్తయి 20:17-19; మార్కు 10:32-34)
\s5
\p
\v 31 ఆయన తన పన్నెండు మంది శిష్యులను ఓ పక్కకు పిలిచి, "వినండి, మనం యెరూషలేం వెళ్తున్నాం. ప్రవక్తలు మనుష్యకుమారుని గురించి రాసిన మాటలన్నీ జరుగుతాయి.
\v 32 ఆయనను యూదేతరులకు పట్టిస్తారు. వారేమో ఆయనను ఎగతాళి చేస్తారు. అవమానిస్తారు. ఆయన మీద ఉమ్మి వేస్తారు.
\v 33 ఆయనను కొరడాలతో కొడతారు. చంపివేస్తారు. కానీ మూడో రోజున ఆయన తిరిగి లేస్తాడు" అని చెప్పాడు.
\s5
\v 34 వారికి ఈ మాటలలో ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఈ సంగతి వారికి మర్మంగా ఉంది. కాబట్టి ఆయన చెప్పిన సంగతులు వారికి అంతు బట్టలేదు.
\s యెరికో దగ్గర గుడ్డివాడికి చూపునివ్వడం (మత్తయి 20:29-34: మార్కు 10: 46-52)
\s5
\p
\v 35 ఆయన యెరికో పట్టణం సమీపానికి వచ్చినప్పుడు దారి పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు.
\v 36 పెద్ద సంఖ్యలో జనం వెళ్తున్నట్టు అతడు పసిగట్టి "ఏం జరుగుతోంది?" అని అడిగాడు.
\v 37 నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని ఎవరో అతనికి చెప్పారు.
\s5
\v 38 అప్పుడు వాడు "యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు" అని కేకలు వేయడం మొదలు పెట్టాడు.
\v 39 ముందు నడుస్తున్న వాళ్ళు "నోరు మూసుకో" అని గద్దించారు. కానీ వాడు "యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు" అని మరింత బిగ్గరగా కేకలు వేసాడు.
\s5
\v 40 అప్పుడు యేసు నిలబడి, వాణ్ణి తన దగ్గరకు తీసుకు రమ్మన్నాడు.
\v 41 వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన "నీ కోసం నేనేం చేయాలని కోరుతున్నావు?" అని అడిగాడు. దానికి వాడు, "ప్రభూ, నాకు చూపు కావాలి" అన్నాడు.
\s5
\v 42 దానికి యేసు "చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది" అని వాడితో చెప్పాడు.
\v 43 వెంటనే వాడు చూపు పొందాడు. దేవుని కీర్తిస్తూ యేసు వెనకాలే వెళ్ళాడు. ప్రజలంతా ఇది చూసి దేవుణ్ణి స్తుతించారు..
\s5
\c 19
\s జక్కయ మార్పు
\p
\v 1 ఆయన ప్రయాణం చేస్తూ సంచరిస్తూ యెరికో పట్టణంలో ప్రవేశించి
\v 2 దానిగుండా వెళ్తున్నాడు. అక్కడ జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు ప్రధాన పన్ను వసూలుదారు, ధనవంతుడు.
\s5
\v 3 ఇతడు యేసు ఎవరో చూడాలని ఆశించాడు. కాని జనసమూహం గుమిగూడటం కారణంగానూ ఇతడు పొట్టివాడు కావడం వల్లనూ చూడలేకపోయాడు.
\v 4 అప్పుడు యేసు ఆ దార్లోనే వస్తున్నాడు, కాబట్టి అతడు ముందుగా పరిగెత్తి వెళ్లి ఒక మేడి చెట్టు ఎక్కాడు.
\s5
\v 5 యేసు ఆ చోటికి వచ్చినప్పుడు, తలెత్తి చూసి "జక్కయ్యా, త్వరగా దిగిరా. ఈ రోజు నేను నీ ఇంట్లో ఉండాలి" అన్నాడు
\v 6 అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను తన ఇంటికి తీసుకు వెళ్ళాడు.
\v 7 అది చూసి అందరూ "ఈయన ఒక పాపి ఇంటికి అతిథిగా వెళ్ళాడు" అని గొణగడం మొదలు పెట్టారు.
\s5
\v 8 జక్కయ్య నిలబడి "ఇదిగో ప్రభూ, నా ఆస్తిలో సగం పేదలకిస్తున్నాను. నేనెవరి నైనా మోసం చేసి ఏదన్నా తీసుకుంటే అతనికి నాలుగంతలు మళ్ళీ చెల్లిస్తాను" అన్నాడు.
\v 9 అందుకు యేసు "ఈ ఇంటికి ఈరోజు రక్షణ వచ్చింది. ఇతడు కూడా అబ్రాహాం సంతతి వాడే.
\v 10 నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు" అని చెప్పాడు.
\s పది బంగారు నాణేల ఉపమానం
\s5
\p
\v 11 వారు ఈ మాటలు వింటున్నప్పుడు అయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. ఎందుకంటే ఆయన యెరూషలేముకు దగ్గరలో ఉండటం వల్ల దేవుని రాజ్యం వెంటనే వచ్చేస్తుందని వారు అనుకుంటున్నారు.
\v 12 "గొప్ప వంశానికి చెందిన ఒక వ్యక్తి తన కోసం రాజ్యం ఒకటి సంపాదించుకుని రావాలని దూరదేశానికి ప్రయాణం అయ్యాడు.
\s5
\v 13 దానికి ముందు తన దాసులను పది మందిని పిలిచి వారికి పది బంగారు నాణేలు ఇచ్చాడు. "నేను తిరిగి వచ్చే వరకు మీరు వీటితో వ్యాపారం చేయండి" అని చెప్పాడు.
\v 14 అయితే అతని పట్టణంలోని పౌరులు అతణ్ణి ద్వేషించారు. "ఇతడు మమ్మల్ని పరిపాలించడం మాకు ఇష్టం లేదు" అంటూ అతని వెనుకే రాయబారం పంపారు.
\v 15 అయినా అతడు ఆ రాజ్యాన్ని సంపాదించుకుని తిరిగి వచ్చాడు. తన దాసులు వ్యాపారం చేసి ఎంత సంపాదించారో తెలుసుకోవాలని వారిని పిలిపించాడు.
\s5
\v 16 మొదటి వాడు వచ్చి "అయ్యా, మీరిచ్చిన నాణెం మరో పది నాణేలను సంపాదించింది" అన్నాడు.
\v 17 దానికి ఆ యజమాని "భలే, మంచి సేవకా! నువ్వు ఈ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది పట్టణాల మీద అధికారి గా ఉండు" అన్నాడు.
\s5
\v 18 ఇక రెండో పనివాడు వచ్చాడు. "అయ్యా, మీరిచ్చిన నాణెంతో మరో అయిదు నాణేలు సంపాదించాను" అన్నాడు.
\v 19 యజమాని వాడితో "నువ్వు అయిదు పట్టణాల మీద అధికారిగా ఉండు" అన్నాడు.
\s5
\v 20 అప్పుడు మరో పనివాడు వచ్చాడు. వాడిలా అన్నాడు, "అయ్యా, ఇదిగో నువ్వు ఇచ్చిన నాణెం.
\v 21 దీనిని జాగ్రత్తగా గుడ్డలో కట్టి దాచిపెట్టాను. నువ్వు కఠినుడవని నాకు తెలుసు. నువ్వు పెట్టని చోట తీసుకుంటావు, నాటని చోట పంట కోస్తావు," అన్నాడు.
\s5
\v 22 అందుకా యజమాని "చెడ్డ సేవకా, నీ నోటి మాట పైనే నీకు తీర్పు తీరుస్తాను. నేను పెట్టని చోట తీసుకుంటాను, నాటని చోట పంట కోస్తాను, కఠినుడినని నీకు తెలుసు కదా
\v 23 అలాంటప్పుడు నా డబ్బుని వడ్డీ వ్యాపారుల దగ్గర ఎందుకు పెట్టలేదు? అలా చేస్తే నేను వచ్చి వడ్డీతో సహా తీసుకునే వాణ్ణి కదా" అని వాడితో చెప్పాడు.
\s5
\v 24 తన దగ్గర ఉన్న వారితో "వీడి దగ్గర ఉన్న నాణెం తీసేసుకుని పది నాణేలు ఉన్న వాడికివ్వండి." అన్నాడు.
\v 25 దానికి వాళ్ళు "అయ్యా అతని దగ్గర పది నాణేలు ఉన్నాయి కదా" అన్నారు.
\s5
\v 26 అందుకు అతడు "కలిగి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇవ్వడం, లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుందని మీకు చెప్తున్నాను "
\v 27 తర్వాత నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుట వాళ్ళని వధించండి" అన్నాడు.
\s యెరూషలేము జయప్రవేశం (మత్తయి 21:1-9; మార్కు 11:1-10; యోహాను 12:12-19)
\s5
\p
\v 28 యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేం కు ప్రయాణమై సాగిపోయాడు.
\s5
\v 29 ఆయన ఆలీవ్ కొండ దగ్గర ఉన్న బేత్ఫగే, బేతని అనే గ్రామాల సమీపానికి వచ్చినపుడు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచాడు.
\v 30 "మీరు ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి. దానిలో మీరు ప్రవేశించగానే కట్టి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కన్పిస్తుంది. దాని మీద ఇంతవరకు ఎవ్వరూ కూర్చోలేదు. దానిని విప్పి తోలుకుని రండి.
\v 31 ఎవరైనా 'దీనిని ఎందుకు విప్పుతున్నారు' అని మిమ్మల్ని అడిగితే 'ఇది ప్రభువుకు కావాలి' అని చెప్పండి" అని చెప్పి వారిని పంపించాడు.
\s5
\v 32 ఆయన పంపిన వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టే దానిని చూసారు.
\v 33 ఆ గాడిద పిల్లను విప్పుతుంటే దాని యజమానులు "మీరు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు?" అని వారినడిగారు.
\v 34 దానికి వారు "ఇది ప్రభువుకు కావాలి" అన్నారు.
\v 35 తర్వాత యేసు దగ్గరకు దానిని తోలుకుని వచ్చారు. దానిపై తమ బట్టలు వేసి ఆయన్ని దానిపై కూర్చోబెట్టారు.
\v 36 ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు.
\s5
\v 37 ఆలీవ్ కొండ నుండి దిగే చోటికి ఆయన వచ్చినప్పుడు శిష్యుల గుంపంతా తాము చూసిన అద్భుతాలను గురించి సంతోషంతో గొంతెత్తి దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు.
\v 38 ప్రభువు పేరట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!" అన్నారు.
\s5
\v 39 ఆ జనసమూహం లో ఉన్న కొందరు పరిసయ్యులు "బోధకా, నీ శిష్యులను గద్దించు" అని ఆయనతో అన్నారు.
\v 40 ఆయన "వీరు ఊరుకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయని మీతో చెప్తున్నాను" అన్నాడు.
\s యేసు యెరూషలేము గురించి విలపించడం (లూకా 13: 34, 35)
\s5
\p
\v 41 ఆయన యెరూషలేం పట్టణానికి దగ్గరగా వచ్చినప్పుడు దానిని చూస్తూ దాని కోసం విలపించాడు.
\v 42 "ఇది నీ దినం. నువ్వు కూడా కనీసం ఈ రోజైనా శాంతి కోసం కావలసిన విషయాలను తెలుసుకుంటే నీకు ఎంత మేలు! కాని ఇప్పుడు అవి నీ కళ్ళకు కనిపించడం లేదు.
\s5
\v 43 ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టి దిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపులనుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు.
\v 44 నీలో ఒక రాయిపై మరో రాయి ఉండకుండా కూల్చి వేసే రోజు వస్తుంది." అన్నాడు.
\s ఆలయ శుద్ధి రెండవ సారి (మత్తయి 21:12-16; మార్కు 11:15-18; యోహాను 2:13-17)
\s5
\p
\v 45 అప్పుడు ఆయన దేవాలయం లో ప్రవేశించి అక్కడ అమ్మకాలు చేసేవారితో " 'నా మందిరం ప్రార్థనా మందిరం' అని రాసి ఉంది.
\v 46 కాని మీరు దానిని దొంగల గుహగా చేశారు" అంటూ వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టడం ప్రారంభించాడు.
\s5
\v 47 ఆయన ప్రతి రోజూ దేవాలయంలో ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ, ప్రజలలో ప్రాముఖ్యమైన వారూ ఆయనను అంతం చేయాలని చూశారు .
\v 48 కాని ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. ఎందుకంటే ప్రజలంతా ఆయనను విడిచి పెట్టకుండా ఆయన మాటలు వింటూ ఉన్నారు.
\s5
\c 20
\s యేసుకు అధికారం ఎక్కడిది? (మత్తయి 21:23-27; మార్కు 11:27-33)
\p
\v 1 ఆ రోజుల్లో ఒకసారి ఆయన దేవాలయంలో ప్రజలకు బోధిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. అప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ పెద్దలతో కూడా ఆయనకు వ్యతిరేకంగా వచ్చి,
\v 2 "నువ్వు ఏ అధికారం తో ఈ పనులన్నీ చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు? మాకు చెప్పు" అని ఆయనను అడిగారు.
\s5
\v 3 దానికి ఆయన "నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నాకు జవాబివ్వండి.
\v 4 యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా, మనుష్యులలో నుండి కలిగిందా?" అని వారినడిగాడు
\s5
\v 5 వారు ఇలా ఆలోచించారు "మనం పరలోకం నుండి కలిగింది అంటే, అలాగైతే మీరెందుకు నమ్మలేదు? అని అడుగుతాడు.
\v 6 మనుషులలో నుండి కలిగింది అంటే జనం మనల్ని రాళ్ళతో కొడతారు. ఎందుకంటే యోహాను ఒక ప్రవక్త అని అంతా కచ్చితంగా నమ్ముతున్నారు"
\s5
\v 7 ఇలా ఆలోచించుకుని "అది ఎక్కడనుండి కలిగిందో మాకు తెలీదు" అని జవాబిచ్చారు.
\v 8 దానికి యేసు "నేను కూడా ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నానో మీతో చెప్పను" అన్నాడు.
\s ద్రాక్షతోట ఉపమానం (మత్తయి 21:33-46; మార్కు 12:1-12; యెషయా 5:1-7)
\s5
\p
\v 9 ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పాడు. "ఒక మనిషి ద్రాక్షతోట నాటించి, దానిని రైతులకు కౌలుకిచ్చాడు. ఆ తర్వాత వేరే దేశానికి వెళ్లి అక్కడ చాలా కాలం ఉన్నాడు.
\v 10 కోతల కాలం వచ్చినపుడు అతడు ఆ ద్రాక్ష తోటలో తన భాగం కోసం రైతుల దగ్గరికి తన పనివాడు ఒకణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపి వేశారు.
\s5
\v 11 మళ్ళీ అతడు మరో దాసుణ్ణి పంపాడు. వారు వాణ్ణి కొట్టి, అవమానపరచి వట్టి చేతులతో పంపివేశారు.
\v 12 మళ్ళీ అతడు మూడో వాణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి గాయపరచి బయటకు తోసివేశారు.
\s5
\v 13 అప్పుడా ద్రాక్షతోట యజమానుడు ఇలా అనుకున్నాడు. "ఇప్పుడు నేనేం చేయాలి? ఇక నా సొంత కుమారుణ్ణి పంపుతాను. వారు ఒకవేళ అతణ్ణి గౌరవిస్తారేమో"
\v 14 అయితే ఆ కౌలు రైతులు అతణ్ణి చూసి "ఇతడే వారసుడు. ఇతన్ని చంపివేస్తే ఈ పొలం మనదవుతుంది" అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
\s5
\v 15 అతణ్ణి ద్రాక్ష తోట బయటకు తోసి చంపివేశారు. ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వాళ్ళనేం చేస్తాడు?
\v 16 అతడు వచ్చి ఆ రైతులను నాశనం చేసి తన ద్రాక్షతోటను మరొకరికి అప్పగిస్తాడు." వారు అది విని "అలా ఎన్నటికీ కాకూడదు" అన్నారు.
\s5
\v 17 ఆయన వారిని చూసి "అలాగైతే ఇల్లు కట్టేవారు పనికి రాదని తీసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది, అని రాసి ఉన్న మాట సంగతి ఏంటి?
\v 18 ఈ రాయి పైన పడే ప్రతీ వాడూ ముక్కలై పోతాడు. కానీ ఈ రాయి ఎవడి పైన పడుతుందో వాణ్ణి పిండి చేసేస్తుంది."
\s పన్నుకట్టడం విషయమై ప్రశ్న(మత్తయి 22: 15-22; మార్కు 12: 13-17)
\s5
\p
\v 19 ఆయన తమను ఉద్దేశించే ఈ ఉపమానం చెప్పాడని ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ గ్రహించి ఆయనను ఆ సమయంలోనే పట్టుకోవాలని చూశారు కానీ ప్రజలకు భయపడ్డారు.
\v 20 వారాయన్ని కనిపెట్టి చూస్తూ ఉన్నారు. ఆయన్ని అధిపతి వశం చేసి అతని అధికారానికి అప్పగించడం కోసం ఆయన్ని మాటల్లో తప్పు పట్టుకోవాలని, తాము నీతిపరులమని ఎంచుకునే వేగుల వారిని ఆయన దగ్గరికి పంపారు.
\s5
\v 21 వారు వచ్చి బోధకా, "నీవు న్యాయంగా మాటలాడుతూ ఉపదేశిస్తూ ఉన్నావు. మొహమాటం లేకుండా యథార్థంగా దేవుని మార్గం బోధిస్తున్నావని మాకు తెలుసు.
\v 22 మనం కైసరునకు పన్ను కట్టడం న్యాయమా కాదా?" అని ఆయన్ని అడిగారు.
\s5
\v 23 ఆయన వారి కుతంత్రాన్ని గుర్తెరిగి "ఒక దేనారం నాణెం చూపించండి.
\v 24 దీని మీది బొమ్మ, అక్షరాలు ఎవరివి?" అని అడిగాడు. వారు "కైసరువి" అన్నారు.
\s5
\v 25 అందుకాయన "ఆలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి" అన్నాడు.
\v 26 వారు ప్రజల యెదుట ఈ మాటల్లో తప్పు పట్టడం చేతగాక ఆయన ఇచ్చిన జవాబుకు ఆశ్చర్యపడి ఊరుకున్నారు.
\s పునరుత్థానం గురించి సద్దూకయ్యులకు యేసు ఇచ్చిన జవాబు (మత్తయి 22:23-33; మార్కు 12: 18-27)
\s5
\p
\v 27 పునరుత్థానం లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను అడిగారు.
\v 28 "బోధకా, ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోయి భార్య బతికే ఉంటే, అతని సోదరుడు అతని భార్యను వివాహమాడి తన సోదరునికి సంతానం కలిగించాలి కదా,
\s5
\v 29 ఏడుగురు అన్నదమ్ములు ఉన్నారు. మొదటివాడు ఒకామెను పెళ్ళాడి సంతానం లేకుండానే చనిపోయాడు.
\v 30 రెండవవాడు మూడవవాడు కూడా ఆమెను పెళ్ళాడారు.
\v 31 ఆ విధంగా ఏడుగురూ ఆమెను పెళ్ళాడి పిల్లలు లేకుండానే చని పోయారు. అ పైన ఆ స్త్రీ కూడా చనిపోయింది.
\v 32 కాబట్టి పునరుత్థానంలో ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉంటుంది?
\v 33 ఆ ఏడుగురికీ ఆమె భార్యగా ఉంది గదా" అన్నారు.
\s5
\v 34 అందుకు యేసు "ఈ లోక జనులు పెళ్లికి ఇచ్చి పుచ్చుకుంటారు గానీ
\v 35 పరలోకానికీ మృతుల పునరుత్థానానికీ అర్హులు పెళ్లి చేసుకోరు, ఎవరూ వారిని పెళ్ళికి ఇయ్యరు.
\v 36 వారు పునరుత్థానంలో భాగస్తులు. దేవదూతలతో సమానులు, దేవుని బిడ్డలు. కాబట్టి వారికి చావు లేదు.
\s5
\v 37 మండుతున్న పొద గురించిన భాగంలో మోషే రాస్తూ ప్రభువు అబ్రాహాము దేవుడనీ ఇస్సాకు దేవుడనీ యాకోబు దేవుడనీ చెప్పడంలో
\v 38 చనిపోయినవారు లేస్తారని సూచించాడు గదా; ఆయన సజీవులకే దేవుడు, మృతులకు కాదు. ఆయన దృష్టికి అందరూ జీవితులే" అని వారికి జవాబిచ్చాడు.
\s శాస్త్రులను యేసు ప్రశ్నించడం (మత్తయి 22:51-46; మార్కు 12:35-37)
\s5
\p
\v 39 అ మీదట వారాయన్ని మరేదీ అడగడానికి తెగించలేదు. అది చూసి శాస్త్రుల్లో కొందరు "బోధకా,
\v 40 చాలా బాగా చెప్పావు" అన్నారు.
\s5
\v 41 ఆయన వారితో "క్రీస్తు దావీదు కుమారుడని మనుషులు ఎలా చెప్తున్నారు?
\v 42 "నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేదాకా నీవు నా కుడివైపున కూర్చోమని
\v 43 ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు," అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పాడు.
\v 44 దావీదు ఆయన్ని ప్రభువని చెప్పాడంటే ఆయన అతని కుమారుడెలా అవుతాడు?" అన్నాడు.
\s5
\v 45 ప్రజలందరూ వింటుండగా ఆయన "శాస్త్రులను గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు నిలువుటంగీలు వేసుకొని తిరుగుతూ ఉండాలని చూస్తారు
\v 46 వ్యాపార వీధుల్లో వందనాలను, సమాజమందిరాల్లో పెద్ద ఆసనాలను, విందులలో అగ్ర స్థానాలను ఆశిస్తారు.
\v 47 వారు వితంతువుల ఇళ్ళు దిగమింగుతూ కపటంగా దీర్ఘప్రార్థనలు చేస్తుంటారు. వారు మరింత కఠినమైన శిక్ష పొందుతారు" అని తన శిష్యులతో చెప్పాడు.
\s5
\c 21
\s విధవరాలి కానుక. దేవునికి ఇవ్వడం గురించి యేసు అభిప్రాయం (మార్కు12:41, 44)
\p
\v 1 హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు.
\v 2 ఒక పేద విధవరాలు అతి తక్కువ విలువగల రెండు నాణేలు అందులో వేస్తుంటే చూశాడు.
\v 3 "ఈ పేద విధవరాలు అందరి కంటే ఎక్కువ వేసిందని మీతో నిజంగా చెప్తున్నాను.
\v 4 వారంతా తమ కలిమిలో నుండి కానుకలు వేశారు. కానీ ఈమె తన లేమిలోనుంచి తన బతుకు తెరువంతా వేసింది" అని వారితో చెప్పాడు.
\s ఒలీవ కొండ ప్రసంగం (మత్తయి 24, 25. మార్కు 13)
\s5
\p
\v 5 దేవాలయాన్ని అందమైన రాళ్ళతోనూ, కానుకలతోనూ అలంకరించారని కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు.
\v 6 అప్పుడు ఆయన "ఈ కట్టడాల్ని మీరు చూస్తున్నారే, వీటిలో రాయి మీద రాయి నిలవకుండా పడదోసే రోజు వస్తుంది" అన్నాడు.
\s5
\v 7 అప్పుడు వారు "బోధకా, ఇవి ఎప్పుడు జరుగుతాయి. ఇవి జరిగే ముందు ఏ సూచన కన్పిస్తుంది?" అని ఆయనను అడిగారు.
\s భావి మానవ చరిత్ర (మత్తయి 24:3-14)
\p
\v 8 ఆయన "మీరు మోసానికి గురి కాకుండా చూసుకోండి. అనేకులు నా పేర వచ్చి "నేనే ఆయనను" అంటారు. "ఆ కాలం దగ్గర పడింది" అంటారు. మీరు వారిని అనుసరించవద్దు.
\v 9 మీరు యుద్ధాలను గూర్చీ పోట్లాటలను గూర్చీ విన్నప్పుడు భయపడవద్దు. ఇవి మొదట తప్పక జరగాలి కాని అంతం అప్పుడే రాదు" అన్నాడు.
\s5
\v 10 ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు. "ఒక జాతి పైకి మరో జాతీ ఒక రాజ్యం పైకి మరో రాజ్యమూ దాడి చేస్తుంది.
\v 11 కొన్ని చోట్ల గొప్ప భూకంపాలూ కరువులూ ఈతిబాధలూ కలుగుతాయి. ఆకాశంలో భయంకరమైన ఉత్పాతాలూ గొప్ప సూచనలూ కన్పిస్తాయి.
\s5
\v 12 ఇవన్నీ జరగడానికి ముందు వాళ్ళు మిమ్మల్ని పట్టుకుని హింసిస్తారు. నా నామం కోసం మిమ్మల్ని రాజుల ఎదుటికీ అధికారుల ఎదుటికీ తీసుకువెళ్ళి, సమాజ మందిరాలకీ చెరసాలలకూ అప్పగిస్తారు.
\v 13 దీనివల్ల సాక్ష్యం ఇవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది.
\s5
\v 14 కనుక మేం ఏం జవాబులు చెప్పాలా అని ముందే ఆలోచించరాదని మీ మనస్సులో నిశ్చయం చేసుకోండి.
\v 15 మీ విరోధులు ఎదిరించలేని, కాదనలేని జ్ఞానాన్నీ, నోటిమాటనీ మీకిస్తాను.
\s5
\v 16 తలిదండ్రులూ, అన్నదమ్ములూ, బంధువులూ, స్నేహితులే మిమ్మల్ని పట్టిస్తారు. వాళ్ళు మీలో కొంతమందిని చంపిస్తారు.
\v 17 నా నామం కారణంగా అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు.
\v 18 కానీ మీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు.
\v 19 మీరు మీ సహనం వలన మీ ప్రాణాలను కాపాడుకుంటారు.
\s యెరూషలేము వినాశనం
\s5
\p
\v 20 యెరూషలేము చుట్టూ సైన్యాలు ముట్టడించడం మీరు చూసినప్పుడు దాని నాశనం దగ్గర పడిందని తెలుసుకోండి.
\v 21 అప్పుడు యూదయలో ఉన్న వారు కొండలకు పారిపోవాలి. పట్టణంలో ఉన్నవారు బయటకు పోవాలి. గ్రామవాసులు దానిలో ప్రవేశించ కూడదు.
\v 22 ఎందుకంటే అవి పగ తీర్చుకునే రోజులు. రాసి ఉన్నవన్నీ నెరవేరేలా ఆ రోజులు వస్తాయి.
\s5
\v 23 ఆ రోజుల్లో గర్భవతులకూ బాలింతలకూ ఎంతో యాతన కలుగుతుంది. దేశంలో చాలా దురవస్థ కలుగుతుంది. ఈ ప్రజల పైకి ఉగ్రత దిగి వస్తుంది.
\v 24 వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్ని జనాలలోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేంను కాళ్ళ కింద తొక్కుతారు.
\s మహా తేజస్సు లో ప్రభువు రాక (మత్తయి 24: 29-31)
\s5
\p
\v 25 ఇంకా సూర్య చంద్ర నక్షత్రాలలో సూచనలు కలుగుతాయి. సముద్రం, దాని అలల హోరు శబ్దానికి భూమి మీద ప్రజలు భయకంపితులై యాతన పడతారు.
\v 26 ఆకాశం లోని శక్తులు కదిలిపోతాయి. కాబట్టి లోకం పైకి రాబోయే వాటిని గురించిన భయం ప్రజలకి కలుగుతుంది. వారు గుండెలవిసిపోయి కూలిపోతారు.
\s5
\v 27 అప్పుడు మనుష్యకుమారుడు బలప్రభావంతో, గొప్ప యశస్సు కలిగి మేఘాలపై రావడం చూస్తారు.
\v 28 ఇవి జరగడం ఆరంభమైనప్పుడు ధైర్యం తెచ్చుకోండి. తలలు పైకెత్తి చూడండి. మీ విముక్తి దగ్గరవుతూ ఉంటుంది." అన్నాడు.
\s అంజూరు చెట్టు ఉపమానం (మత్తయి24:32,33; మార్కు 13:28,29)
\s5
\p
\v 29 తర్వాత ఆయన వారికి ఒక ఉపమానం చెప్పాడు. "అంజూర చెట్టునూ మిగిలిన అన్ని చెట్లనూ చూడండి.
\v 30 అవి చిగురించినప్పుడు వసంత రుతువు వచ్చేసిందని మీరు తెలుసుకుంటారు కదా !
\v 31 అట్లాగే ఈ సంగతులు జరుగుతున్నప్పుడు దేవుని రాజ్యం దగ్గరలో ఉందని తెలుసుకోండి.
\s5
\v 32 ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతం కాదని మీకు ఖచ్చితంగా చెప్తున్నాను.
\v 33 ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు.
\s ప్రభువు రాక, హెచ్చరికలు (మత్తయి 24:34-51; మార్కు 13:30-37)
\s5
\p
\v 34 తినడం, తాగడం వల్లా, మత్తుగా ఉండడం వల్లా, ఇహలోక చింతల వల్లా మీ హృదయాలు బరువెక్కి పోకుండా, ఆ రోజు ఒక వలలాగా ఆకస్మికంగా మీ మీదకు వచ్చి పడకుండా జాగ్రత్త పడండి.
\v 35 ఆ రోజు ఈ లోకంలో ఉన్న వారందరి పైకి అకస్మాత్తుగా వస్తుంది.
\s5
\v 36 కాబట్టి జరుగబోయే వీటన్నటి నుండీ తప్పించుకుని, మనుష్యకుమారుని ముందు నిలవడం కోసం శక్తిగల వారుగా ఉండటానికి ఎప్పుడూ ప్రార్ధన చేస్తూ మెలకువగా ఉండండి" అని చెప్పాడు.
\s5
\v 37 ఆయన ప్రతి రోజూ పగలు దేవాలయంలో బోధిస్తూ రాత్రి ఆలివ్ కొండపై గడిపేవాడు.
\v 38 ప్రజలంతా పొద్దున్నే దేవాలయంలో ఆయన ఉపదేశం వినడానికి వస్తూ ఉన్నారు.
\s5
\c 22
\s యేసును పట్టివ్వడానికి యూదా లాలూచీ (మత్తయి 26:2,4; మార్కు 14: 1,2,10,11)
\p
\v 1 పొంగని రొట్టెల పండుగ పస్కా దగ్గర పడింది.
\v 2 ప్రధానయాజకులూ ధర్మశాస్త్ర పండితులూ యేసును ఎలా చంపించాలా అని ఆలోచిస్తున్నారు. అయితే వాళ్ళు ప్రజలకి భయపడుతున్నారు.
\s5
\v 3 అప్పుడు పన్నెండు మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు.
\v 4 దాంతో యూదా వెళ్లి ఆయనను ఎలా పట్టివ్వాలనే విషయమై ప్రధానయాజకులతోనూ అధికారులతోనూ మాట్లాడాడు.
\s5
\v 5 దానికి వారు సంతోషించారు. అతనికి డబ్బివ్వడానికి అంగీకరించారు.
\v 6 అతడు కూడా వారికి మాట ఇచ్చాడు. జనసందోహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి అనువైన సమయం కోసం చూస్తున్నాడు.
\s పస్కా ఏర్పాట్లు (మత్తయి 26:17-19; మార్కు 14: 12-16)
\s5
\p
\v 7 పొంగని రొట్టెల పండుగ సందర్భంగా పస్కాపశువును వధించాల్సిన రోజు వచ్చింది.
\v 8 యేసు పేతురు యోహానులతో "మీరు వెళ్లి మనం భోజనం చేయడానికి పస్కాను సిద్ధం చేయండి" అన్నాడు.
\v 9 వారు "మేము దానిని ఎక్కడ సిద్ధం చేయాలి?" అన్నారు.
\s5
\v 10 ఆయన "మీరు ఊరిలో ప్రవేశిస్తున్నప్పుడు నీళ్లకుండ మోసుకుంటూ ఒక వ్యక్తి మీకు ఎదురు వస్తాడు. అతని వెనకే అతని ఇంటివరకూ వెళ్ళండి.
\v 11 మా గురువు 'నేను నా శిష్యులతో కలసి పస్కాభోజనం తినడానికి విశ్రాంతి గది ఎక్కడుంది?' అంటున్నాడని ఆ ఇంటి యజమానితో చెప్పండి.
\s5
\v 12 అతడు సదుపాయాలన్నీ ఉన్న ఒక పెద్ద మేడగది మీకు చూపిస్తాడు. అక్కడ సిద్ధం చేయండి" అని వారితో చెప్పాడు.
\v 13 సరిగ్గా ఆయన తమతో చెప్పినట్టే అన్నీ వారికి జరిగాయి. దాంతో ఆయన చెప్పినట్టే వారు పస్కాభోజనం సిద్ధ పరచారు.
\s చివరి పస్కా (మత్తయి 26:20; మార్కు 14:17; యోహాను 13)
\s5
\p
\v 14 సమయం వచ్చినప్పుడు ఆయనా ఆయనతో కూడా అపొస్తలులూ భోజనానికి కూర్చున్నారు.
\v 15 అప్పుడాయన "నేను హింస పొందకముందు మీతో కలిసి ఈ పస్కావిందు ఆరగించాలని ఎంతో ఆశించాను.
\v 16 ఎందుకంటే అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకూ మళ్ళీ దానిని తిననని మీతో చెప్తున్నాను."
\s5
\v 17 తర్వాత ఆయన ఒక గిన్నె తీసుకుని కృతజ్ఞతలు చెప్పి "మీరు దీనిని తీసికొని పంచుకోండి.
\v 18 ఇక దేవుని రాజ్యం వచ్చే వరకూ నేను ద్రాక్షారసం తాగనని మీతో చెప్తున్నాను" అన్నాడు.
\s ప్రభు రాత్రి భోజన సంస్కారం స్థాపన (మత్తయి 26: 26-29; మార్కు 14: 22-25)
\s5
\p
\v 19 ఆ తర్వాత ఆయన ఒక రొట్టె తీసుకుని కృతజ్ఞతలు అర్పించి, దానిని విరిచి వారికిచ్చి "ఇది మీ కోసం ధారాదత్తమైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోడానికి దీనిని చేయండి" అని చెప్పాడు.
\v 20 అలాగే భోజనమైన తర్వాత ఆయన ఆ పాత్రను తీసుకుని "ఈ పాత్ర మీ కోసం చిందే నా రక్తం ద్వారా వచ్చిన కొత్త నిబంధన.
\s యేసు తనకు జరగనైయున్న ద్రోహం గురించి వెల్లడించడం (మత్తయి 26: 21-25; మార్కు 14:18-21; యోహాను 13:18-30)
\s5
\p
\v 21 వినండి, నన్ను శత్రువులకు పట్టించే వాడి చెయ్యి నా చేతితో కూడా ఈ బల్ల మీదనే ఉంది.
\v 22 దేవుని నిర్ణయం ప్రకారం మనుష్యకుమారుడు వెళ్లి పోతున్నాడు. కానీ ఆయనను పట్టిస్తున్న ఆ వ్యక్తికి యాతన తప్పదు" అన్నాడు,
\v 23 ఇది చేయబోయేదెవరో అంటూ వారు తమలో తాము ప్రశ్నించుకోవడం మొదలు పెట్టారు.
\s తమలో ఎవరు గొప్ప వారని శిష్యుల మధ్య వాదం (మత్తయి 20:25,28; మార్కు 10:42-45)
\s5
\p
\v 24 తమలో ఎవరు గొప్ప అనే వివాదం వారిలో తలెత్తింది.
\v 25 అప్పుడు ఆయన వారితో ఇలా అన్నాడు, "ఇతర ప్రజల రాజులు తమ ప్రజల మీద ప్రభుత్వం చేస్తారు. తమ మీద అధికారం చెలాయించే వారు 'ఉపకారులు' అని పిలిపించుకుంటారు.
\s5
\v 26 మీరు అలా ఉండకూడదు. మీలో ప్రముఖుడు చిన్నవాడిలా, నాయకుడు సేవకుడిలా ఉండాలి.
\v 27 అసలు గొప్పవాడు అంటే ఎవరు? భోజనానికి కూర్చునే వాడా లేక సేవ చేసేవాడా? భోజనానికి కూర్చునే వాడే కదా! అయినా నేను మీ మధ్య సేవ చేసే వాడిలా ఉన్నాను.
\s రానున్న రాజ్యంలో అపోస్తలుల స్థానం (మత్తయి 19:28; ప్రకటన 3:21)
\s5
\p
\v 28 నాకు కలిగిన విషమ పరీక్షలలో మీరే నాతో నిలిచి ఉన్నారు.
\v 29 నా తండ్రి నాకు రాజ్యాన్ని ప్రసాదించాడు. నా రాజ్యంలో నా భోజన బల్ల దగ్గర భోజనం చేసి
\v 30 సింహాసనాలపై కూర్చుని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకూ మీరు తీర్పు తీర్చడానికి నేను కూడా మీకు రాజ్యాన్ని ప్రసాదిస్తున్నాను.
\s పేతురు చెప్పనున్న అబద్ధం (మత్తయి 26: 33-35; మార్కు 14: 29-31)
\s5
\p
\v 31 సీమోనూ, సీమోనూ, విను. సాతాను మిమ్మల్ని పట్టుకుని గోధుమల్లా జల్లించడానికి మిమ్మల్ని కోరుకున్నాడు.
\v 32 నీ విశ్వాసం విఫలం కాకుండా నేను నీ కోసం ప్రార్థించాను. నువ్వు మళ్ళీ దేవుని వైపు తిరిగిన తర్వాత నీ సోదరులను స్థిరపరచు."
\s5
\v 33 కానీ పేతురు "ప్రభూ, నీతో కూడా చెరసాలకు వెళ్లడానికైనా, మరణించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను" అని ఆయనతో అన్నాడు.
\v 34 అప్పుడు ఆయన "నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తర్వాతే కోడి కూస్తుందని నీకు చెప్తున్నాను" అన్నాడు.
\s వాటిల్లబోయే గడ్డు పరిస్థితి గురించి శిష్యులకు హెచ్చరికలు
\s5
\p
\v 35 ఇంకా ఆయన "నేను సంచీ, చెప్పులూ లేకుండా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమన్నా తక్కువయిందా" అని అడిగాడు. దానికి వారు "ఏమీ తక్కువ కాలేదు" అన్నారు.
\v 36 ఆయన "కానీ ఇప్పుడు సంచీ జోలే ఉన్నవాడు వాటిని తీసుకువెళ్ళాలి. కత్తి లేనివాడు తన పైబట్ట అమ్మి కత్తి కొనుక్కోవాలి.
\s5
\v 37 'ఆయనను అక్రమాలు చేసేవారిలో ఒకడిగా ఎంచారు' అని రాసి ఉన్న లేఖనం నా విషయంలో నేరవేరాలి. నన్ను గురించిన విషయాలన్నీ తప్పక నెరవేరతాయని మీతో చెప్తున్నాను" అన్నాడు.
\v 38 శిష్యులు " ప్రభూ ఇక్కడ రెండు కత్తులున్నాయి" అన్నారు. ఆయన "అవి చాలు" అన్నాడు.
\s గేత్సేమనే వనం లో యేసు (మత్తయి 26: 36-46; మార్కు 14:32, 42; యోహాను 18:1)
\s5
\p
\v 39 భోజనం అయ్యాక ఆయన బయల్దేరి తన అలవాటు ప్రకారం ఆలివ్ కొండకు వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా ఆయనతో వెళ్ళారు.
\v 40 వారు అక్కడికి చేరుకున్న తర్వాత ఆయన వారితో "మీరు విషమ పరీక్షలో పడకుండా ప్రార్థన చేయండి" అన్నాడు.
\s5
\v 41 వారి దగ్గరనుండి ఆయన రాతివేత దూరం వెళ్లి అక్కడ మోకరించి ఇలా ప్రార్థన చేసాడు.
\v 42 "తండ్రీ, నీకు ఇష్టమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అయినా నా ఇష్టం కాదు. నీ ఇష్టమే జరగాలి."
\s5
\v 43 అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచాడు.
\v 44 ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట పెద్ద రక్త బిందువుల్లా నేలపై రాలింది.
\s5
\v 45 ఆయన ప్రార్థన ముగించి తన శిష్యుల దగ్గరకు వచ్చాడు. వారు దుఖం చేత నిద్రపోవడం చూశాడు. వారితో
\v 46 "మీరెందుకు నిద్ర పోతున్నారు? విషమ పరీక్షలో పడకుండా మేల్కొని ప్రార్థించండి" అన్నాడు.
\s యూదా ద్రోహం (మత్తయి 26: 47-56; మార్కు 14: 43-50; యోహాను 18:3-11)
\s5
\p
\v 47 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే ప్రజలు సమూహంగా వచ్చారు. పన్నెండు మంది శిష్యులలో ఒకడైన యూదా వారికి ముందుగా నడుస్తూ యేసును ముద్దు పెట్టుకోడానికి దగ్గరగా వచ్చాడు.
\v 48 అప్పుడు యేసు "ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుణ్ణి పట్టిస్తున్నావా?" అన్నాడు.
\s5
\v 49 ఆయన చుట్టూ ఉన్నవారు జరుగుతున్నదేమిటో గ్రహించారు. "ప్రభూ, కత్తితో నరకమంటావా?" అని అడిగారు.
\v 50 ఈలోగా వారిలో ఒకడు ప్రధానయాజకుడి సేవకుణ్ణి కొట్టి వాడి చెవి నరికాడు.
\v 51 దానికి యేసు "ఇక్కడితో ఆగండి" అని అతని చెవిని తాకి బాగుచేసాడు.
\s5
\v 52 తనను పట్టుకోడానికి వచ్చిన పెద్దలతో, ప్రధాన యాజకులతో, దేవాలయం అధికారులతో "ఒక బందిపోటు దొంగను పట్టుకోడానికి వచ్చినట్టు కత్తులతో దుడ్డు కర్రలతో బయల్దేరి వచ్చారా?
\v 53 నేను ప్రతిరోజూ మీ దగ్గర దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ సమయం, చీకటి ప్రభావం" అన్నాడు.
\s యేసును బంధించడం. పేతురు అబద్ధం (మత్తయి 26:57, 69-75; మార్కు 14:53,54, 66-72; యోహాను 18:12, 15-18, 25-27)
\s5
\p
\v 54 వారు ఆయన్ని పట్టుకుని ఈడ్చుకుంటూ ప్రధాన యాజకుడి ఇంట్లోకి తీసుకు వెళ్ళారు. పేతురు దూరంగా వారి వెనకే వెళ్ళాడు.
\v 55 అప్పుడు కొంతమంది ఆ ఇంటి ఆవరణలో చలిమంట వేసుకుని దాని చుట్టూ కూర్చుని వున్నారు. పేతురు కూడా వెళ్లి వారితో కూర్చున్నాడు.
\s5
\v 56 అప్పుడు ఒక పనిపిల్ల మంట వెలుతురులో కూర్చుని ఉన్న పేతురును పరీక్షగా చూసి "ఈ మనిషి కూడా అతనితో ఉన్నాడు" అంది.
\v 57 దానికి పేతురు "అమ్మాయ్, అతనెవరో నాకు తెలియదు" అన్నాడు.
\v 58 కాసేపటికి మరొకడు పేతురును చూసి "నువ్వు కూడా వారిలో ఒకడివే" అన్నాడు. దానికి పేతురు "నేను కాదయ్యా" అన్నాడు.
\s5
\v 59 మరో గంట గడిచాక ఇంకొకడు పేతురును చూసి "ఇతడు ఖచ్చితంగా అతనితో కూడా ఉన్నాడు. ఇతడు గలిలయుడే" అని నొక్కి చెప్పాడు.
\v 60 అందుకు పేతురు "నువ్వు అంటున్నదేమిటో నాకు తెలియడం లేదు" అన్నాడు. అతనిలా మాట్లాడుతూ ఉండగానే కోడి కూసింది.
\s5
\v 61 అప్పుడు ప్రభువు అటు తిరిగి పేతురు వైపు చూశాడు. "నేనెవరో నీకు తెలియదని నువ్వు మూడుసార్లు చెప్పిన తర్వాతే కోడి కూస్తుందని" ప్రభువు తనతో చెప్పిన మాట పేతురుకి జ్ఞాపకం వచ్చింది.
\v 62 దాంతో పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు.
\s యేసును కొట్టడం (మత్తయి 26:67,68; మార్కు 14:65; యోహాను 18:22,23)
\s5
\p
\v 63 యేసును పట్టుకున్నవారు ఆయనను ఎగతాళి చేశారు. కొట్టారు.
\v 64 ఆయన కళ్ళకు గంతలు కట్టి, కొట్టి "నిన్ను ఎవరు కొట్టారో ప్రవచనం చెప్పు" అన్నారు.
\v 65 ఆయనను నీచంగా దూషించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక మాటలు పలికారు.
\s సన్ హెడ్రిన్ సభ ఎదుట యేసు (మత్తయి 26:59-68; మార్కు 14:55-65; యోహాను 18:19-24)
\s5
\p
\v 66 ఉదయం కాగానే ప్రజల నాయకులూ, ప్రధానయాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ సమావేశమయ్యారు. ఆయనను మహాసభకు తీసుకువెళ్ళారు.
\v 67 "నువ్వు అభిషిక్తుడివైతే అది మాకు చెప్పు" అన్నారు. అందుకాయన "నేను మీతో చెప్పినా మీరు నమ్మరు.
\v 68 అంతే కాకుండా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే జవాబివ్వరు.
\s5
\v 69 అయితే ఇకపై మనుష్యకుమారుడు బలప్రభావాలున్న దేవుని కుడి వైపున కూర్చుని ఉంటాడు" అన్నాడు.
\v 70 "అయితే నువ్వు దేవుని కుమారుడివా?" అన్నారు. వారితో ఆయన వారితో "మీరన్నట్టు ఆయనను నేనే" అన్నాడు.
\v 71 అందుకు వారు "మనకిక సాక్షులతో పనేముంది? ఇతని నోటిమాట మనమే విన్నాం కదా" అని చెప్పారు.
\s5
\c 23
\s పిలాతు ఎదుట యేసు (మత్తయి 27: 2, 11-14; మార్కు 15:1-5; యోహాను 18: 28-38)
\p
\v 1 అప్పుడు వారంతా కలసి ఆయనను పిలాతు దగ్గరకు తీసుకువెళ్ళారు.
\v 2 "ఇతడు మా ప్రజలను తిరగబడమని ప్రోత్సహిస్తున్నాడు. కైసరుకి పన్ను చెల్లించ వద్దనీ తాను క్రీస్తు అనే రాజుననీ ఇతడు చెప్తుంటే విన్నాము" అని ఆయన మీద నేరారోపణ చేశారు.
\s5
\v 3 అప్పుడు పిలాతు "నువ్వు యూదుల రాజువా?" అని ఆయనను అడిగాడు. దానికి ఆయన "నువ్వే అంటున్నావు కదా" అన్నాడు.
\v 4 పిలాతు ప్రధాన యాజకులతోనూ, జనంతోనూ "ఈ వ్యక్తిలో నాకు ఎలాంటి దోషమూ కన్పించడం లేదు," అన్నాడు.
\v 5 అయితే వారు "ఇతడు గలిలీ నుండి ఇక్కడ వరకూ యూదయ దేశమంతా ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నాడు"అని మరింత తీవ్రంగా నొక్కి చెప్పారు.
\s హేరోదు ఎదుట యేసు
\s5
\p
\v 6 పిలాతు ఈ మాట విని "ఈ వ్యక్తి గలిలీ ప్రాంతం వాడా" అని అడిగాడు.
\v 7 ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశానికి చెందినవాడని తెలియగానే ఆయన్ని హేరోదు దగ్గరకు పంపించాడు. ఆ రోజుల్లో హేరోదు యెరూషలేములోనే ఉన్నాడు.
\s5
\v 8 హేరోదు యేసును చూసి ఎంతో సంతోషించాడు. ఆయనను గురించి అతడు ఎన్నో విషయాలు విని ఉన్నాడు. ఎంతో కాలంగా ఆయన్ని చూడాలని ఆశిస్తున్నాడు. ఆయన ఏదైనా ఒక అద్భుతం చేస్తే చూడాలని కూడా ఆశిస్తున్నాడు.
\v 9 హేరోదు ఆయన్ని ఎన్నో ప్రశ్నలు వేశాడు కానీ ఆయన అతనికి జవాబేమీ ఇవ్వలేదు.
\v 10 ప్రధానయాజకులూ ధర్మశాస్త్ర పండితులూ అక్కడే నిలబడి ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు.
\s5
\v 11 హేరోదు తన సైనికులతో కలిసి, ఆయన్ని అవమానించి, అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి పిలాతు దగ్గరకు మళ్ళీ పంపించాడు.
\v 12 అంతకు ముందు హేరోదూ, పిలాతూ శత్రువులుగా ఉండేవారు. కానీ ఆ రోజు వాళ్ళిద్దరూ స్నేహితులయ్యారు.
\s తిరిగి పిలాతు ఎదుటికి, బరబ్బా విడుదల, యేసుకు మరణ శిక్ష (మత్తయి 27: 15-26; మార్కు 15:6-15; యోహాను 18:39, 40)
\s5
\p
\v 13 అప్పుడు పిలాతు ప్రధాన యాజకులనూ, అధికారులనూ, ప్రజలనూ పిలిపించాడు.
\v 14 "ప్రజలు తిరుగబడేలా చేస్తున్నాడంటూ మీరు ఈ వ్యక్తిని నా దగ్గరకు తీసుకువచ్చారు కదా. మీ ముందే నేను ఇతణ్ణి ప్రశ్నించాను. కానీ మీరితని మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా నాకు నిజమనిపించడం లేదు.
\s5
\v 15 హేరోదుకు కూడా ఏ దోషమూ కన్పించలేదు. హేరోదు ఇతణ్ణి నా దగ్గరకే తిరిగి పంపాడు కదా. మరణ శిక్షకు తగిన నేరమేదీ ఇతను చేయలేదు.
\v 16 అందుచేత నేనితణ్ణి శిక్షించి విడుదల చేస్తాను" అన్నాడు.
\v 17 పండగ సమయంలో పిలాతు ప్రజల కోసం ఒక ఖైదీని విడుదల చేయాల్సి ఉంది.
\s5
\v 18 అయితే వారంతా "వీణ్ణి చంపి మాకు బరబ్బను విడుదల చెయ్యండి" అని ఒక్కపెట్టున కేకలు వేశారు.
\v 19 ఈ బరబ్బ పట్టణంలో జరిగిన ఒక తిరుగుబాటు, హత్యా నేరాలకై చెరసాలలో ఉన్నాడు.
\s5
\v 20 పిలాతు యేసును విడుదల చేయాలని ఆశించి వారితో మళ్ళీ మాట్లాడాడు.
\v 21 కాని వారంతా "వీణ్ణి సిలువ వేయాలి, సిలువ వేయాలి" అని మరింతగా కేకలు వేశారు.
\v 22 మూడో సారి అతడు "ఎందుకు? ఇతడేమి దుర్మార్గం చేసాడు? ఇతనిలో మరణ శిక్షకు తగిన నేరమేదీ నాకు కనపడలేదు. అందుచేత ఇతణ్ణి శిక్షించి వదిలి వేస్తాను" అన్నాడు.
\s5
\v 23 కాని వారంతా పట్టుబట్టి పెద్దగా కేకలు వేసి "వీణ్ణి సిలువ వేయండి" అని కోరారు. చివరకు వారి కేకలే గెలిచాయి.
\v 24 వారు కోరినట్టే జరగాలని పిలాతు తీర్పు తీర్చాడు.
\v 25 తిరుగుబాటు, హత్యానేరాలకై చెరసాలలో ఉన్న వాణ్ణి వారు కోరినట్టే విడుదల చేసి, యేసును వారికిష్టం వచ్చినట్టు చేయడానికి వారికి అప్పగించాడు.
\s5
\v 26 వారాయనను తీసుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పల్లెటూరి నుండి వస్తున్న కురేనీ ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తిని పట్టుకుని, యేసు వెంటే సిలువ మోయడానికి దానిని అతనిమీద పెట్టారు.
\s సిలువ (మత్తయి 27: 33-38; మార్కు 15:22-28; యోహాను 19:17-19)
\s5
\p
\v 27 పెద్ద జనసమూహమూ, ఆయనను గురించి రొమ్ముకొట్టుకుంటూ దుఃఖిస్తున్న చాలమంది స్త్రీలూ ఆయనను వెంబడించారు.
\v 28 యేసు వారివైపు తిరిగి "యెరూషలేము స్త్రీలారా, నా కోసం ఏడవవద్దు. మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి.
\s5
\v 29 వినండి, "గొడ్రాళ్ళు ధన్యులు, కనని గర్భాలూ పాలియ్యని స్తనాలూ ధన్యం," అని చెప్పే రోజులు వస్తున్నాయి.
\v 30 అప్పుడు మా మీద పడండని పర్వతాలతోనూ, మమ్మల్ని కప్పివేయమని కొండలతోనూ ప్రజలు చెప్పడం మొదలుపెడతారు.
\v 31 చెట్టు పచ్చిగా ఉన్నప్పుడే వారు ఇలా చేస్తే ఇక ఎండిన దానికేం చేస్తారో" అని చెప్పాడు.
\s5
\v 32 ఇద్దరు నేరస్తులను ఆయనతో బాటు చంపడానికి తీసుకు వచ్చారు.
\s5
\v 33 వారు కపాలం అనే చోటికి వచ్చినప్పుడు అక్కడ వారాయన్ని సిలువ వేశారు. ఆ నేరస్తులలో ఒకణ్ణి ఆయనకు కుడివైపున, మరొకణ్ణి ఎడమవైపున ఆయనతో బాటు సిలువ వేశారు.
\v 34 అప్పుడు యేసు "తండ్రీ, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళని క్షమించు" అని చెప్పాడు. వారు ఆయన బట్టలు పంచుకోడానికి చీట్లు వేసుకున్నారు.
\s5
\v 35 ప్రజలు నిలబడి ఇదంతా చూస్తున్నారు. అధికారులు "వీడు ఇతరులను రక్షించాడు. వీడు దేవుడేర్పరచుకున్న క్రీస్తు అయితే తనను తాను రక్షించుకోవాలి" అంటూ ఎగతాళి చేశారు.
\s5
\v 36 ఇక సైనికులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు పులిసిపోయిన ద్రాక్షారసం ఇవ్వబోతూ
\v 37 "నువ్వు యూదుల రాజువైతే నిన్ను నువ్వే రక్షించుకో" అని ఆయనను వెక్కిరించారు.
\v 38 "ఇతడు యూదుల రాజు" అని రాసి ఆయనకు పైగా ఉంచారు.
\s పరితాపం చెందిన దొంగ (మత్తయి 27:44; మార్కు 15:32)
\s5
\p
\v 39 వేలాడుతున్న ఆ నేరస్థులలో ఒకడు ఆయన్ని దూషిస్తూ "నువ్వు నిజంగా క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు" అన్నాడు.
\v 40 కాని రెండోవాడు వాణ్ణి చీవాట్లు పెట్టాడు. "నువ్వూ అదే శిక్ష అనుభవిస్తున్నావు కదా. దేవునికి భయపడవా?
\v 41 మనకైతే యిది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు" అన్నాడు.
\s5
\v 42 తర్వాత ఆయనను చూసి "యేసూ, నువ్వు నీ రాజ్యంలో ప్రవేశించేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో" అన్నాడు.
\v 43 అందుకాయన వాడితో "ఈ రోజు నువ్వు నాతో కూడా ఆనంద నివాసంలో ఉంటావని నీతో కచ్చితంగా చెప్తున్నాను" అన్నాడు.
\s5
\v 44 అప్పుడు సుమారుగా మధ్యాహ్నమైంది. మూడు గంటల వరకు ఆ దేశమంతటిమీదా చీకటి అలముకొంది.
\v 45 సూర్యుడు అంతర్థానమయ్యాడు. దేవాలయంలో గర్భాలయం తెర రెండుగా చిరిగిపోయింది.
\s యేసు తన ఆత్మను తండ్రికి అప్పగించడం (మత్తయి 27:50; మార్కు 15:37; యోహాను 19:30)
\s5
\p
\v 46 అప్పుడు యేసు పెద్ద స్వరంతో కేకవేసి "తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంటున్నాను." అన్నాడు. ఆయన ఈ విధంగా చెప్పి తన ప్రాణం విడిచాడు.
\v 47 శతాధిపతి జరిగిందంతా చూసి "ఈ వ్యక్తి నిజంగా నీతిపరుడే" అని చెప్పి దేవుణ్ణి కీర్తించాడు.
\s5
\v 48 చూడటానికి సమకూడిన ప్రజలంతా జరిగిందంతా చూసి గుండెలు బాదుకుంటూ తిరిగి వెళ్లారు.
\v 49 ఆయనతో పరిచయమున్నవారూ, గలిలీ నుండి ఆయన్ని అనుసరించిన స్త్రీలూ దూరంగా నిలబడి చూస్తున్నారు.
\s భూస్థాపన (మత్తయి 27: 57-61; మార్కు 15: 42,47; యోహాను 19:38,42)
\s5
\p
\v 50 యూదుల మహా సభలో యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు అరిమతయి ఊరివాడు. మంచివాడు, నీతిపరుడు.
\v 51 మహాసభ చేసిన తీర్మానానికి ఇతడు సమ్మతించలేదు. ఇతడు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
\s5
\v 52 అతడు పిలాతు దగ్గరకు వెళ్ళి, యేసు శరీరాన్ని తనకిమ్మని అడిగాడు.
\v 53 తర్వాత ఆయన శరీరాన్ని సిలువ పైనుండి దించి, సన్నని నారవస్త్రంతో చుట్టి, తొలిచిన ఒక రాతి సమాధిలో ఉంచాడు. ఆ సమాధిలో ఎవరి దేహాన్నీ అంతకుముందు ఎప్పుడూ ఉంచలేదు.
\s5
\v 54 అది పండుగకు సిద్ధపడే రోజు. విశ్రాంతి దినం మొదలు కాబోతూ ఉంది.
\v 55 అప్పుడు గలిలీ నుండి ఆయనతో వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధినీ, ఆయన దేహాన్నీ ఎలా ఉంచారో చూసి
\v 56 తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యాలూ, పరిమళ తైలాలూ సిద్ధం చేసుకున్నారు. తర్వాత దేవుని ఆజ్ఞ ప్రకారం విశ్రాంతి దినం ఏ పనీ లేకుండా ఉన్నారు.
\s5
\c 24
\s యేసు క్రీస్తు పునరుత్థానం (మత్తయి 28:1-6; మార్కు 16:1-8; యోహాను 20:1-17)
\p
\v 1 ఆదివారం తెల్లవారిన తర్వాత ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరకు వచ్చారు.
\v 2 సమాధిని మూసిన రాయి దొర్లించి ఉండటం చూసి లోపలికి వెళ్ళారు.
\v 3 కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు.
\s5
\v 4 దాంతో వారికేమీ తోచలేదు. అయితే ధగధగలాడే బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి ఉన్నారు.
\v 5 వారిని చూసి ఈ స్త్రీలు భయపడి ముఖాలు నేలకు వంచుకుని ఉండగా వారు "సజీవుడైన వ్యక్తిని మీరు చనిపోయిన వారిలో ఎందుకు వెదుకుతున్నారు?
\s5
\v 6 ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఆయన ఇంతకు ముందు గలిలయలో ఉన్నప్పుడు
\v 7 మనుష్య కుమారుణ్ణి పాపుల చేతికి పట్టిస్తారనీ, వారు ఆయనను సిలువ వేసి చంపుతారనీ, తిరిగి ఆయన మూడో రోజున సజీవుడిగా లేస్తాడనీ మీతో చెప్పింది జ్ఞాపకం చేసుకోండి" అన్నారు.
\s5
\v 8 అప్పుడు వారు ఆయన మాటల్ని జ్ఞాపకం చేసుకున్నారు.
\v 9 వారు సమాధి దగ్గర నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతుల్ని పదకొండుమంది శిష్యులకూ మిగిలిన వారికందరికీ చెప్పారు.
\v 10 ఇలా ఈ సంగతుల్ని అపోస్తులులకు చెప్పిన స్త్రీలు ఎవరంటే మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ, వారితో కూడ ఉన్న యితర స్త్రీలూ.
\s5
\v 11 అయితే వారికి ఈ మాటలు పిచ్చి మాటలుగా అనిపించాయి. కాబట్టి వారెవరూ వీరి మాటలు నమ్మలేదు.
\v 12 అయితే పేతురు లేచి, సమాధి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ సమాధిలోకి తొంగి చూశాడు. అక్కడ నారబట్టలు మాత్రం కనిపించాయి. అతడు జరిగిన దానిని గురించి ఆశ్చర్య పడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు.
\s పునరుత్థాన క్రీస్తు పరిచర్య
\s5
\p
\v 13 ఆ రోజే ఇద్దరు శిష్యులు యెరూషలేముకు సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎమ్మావస్ గ్రామానికి వెళ్తున్నారు.
\v 14 జరిగిన ఈ విషయాలన్నిటి గురించి మాట్లాడుకుంటున్నారు.
\s5
\v 15 అలా వారు మాట్లాడుకుంటూ, చర్చించుకుంటూ ఉండగా యేసు వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడుస్తూ ఉన్నాడు.
\v 16 అయితే వారు ఆయన్ని గుర్తు పట్టలేకపోయారు. ఎందుకంటే వారి కన్నులు మూతలు పడ్డట్టు అయింది.
\s5
\v 17 ఆయన "మీరు నడుస్తూ పరస్పరం చర్చించుకుంటున్న విషయాలు ఏమిటి?" అని వారిని అడిగాడు. దాంతో వారు దుఖంతో నిండిపోయి నిలబడిపోయారు.
\v 18 వారిలో క్లెయొపా అనేవాడు "యెరూషలేములో కాపురముంటూ ఈ రోజుల్లో అక్కడ జరుగుతున్న విషయాలు తెలియని వ్యక్తివి నువ్వు ఒక్కడివే అనుకుంటా" అన్నాడు.
\s5
\v 19 ఆయన "ఏ విషయాలు?" అని అడిగాడు. అప్పుడు వారు "నజరేతు వాడైన యేసును గురించిన విషయాలే. ఆయన దేవుని దృష్టిలోనూ ప్రజలందరి దృష్టిలోనూ మాటల్లో పనుల్లో శక్తిగల ప్రవక్తగా ఉన్నాడు.
\v 20 మన ప్రధాన యాజకులూ అధికారులూ ఆయనను మరణశిక్షకు అప్పగించి, ఎలా సిలువ వేయించారో నీకు తెలియదా?
\s5
\v 21 ఇశ్రాయేలు ప్రజను విడుదల చేసేవాడు ఈయనే అని మేము ఆశించాం. ఈ విషయాలన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి.
\s5
\v 22 అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి దగ్గరకు వెళ్లి అక్కడ ఆయన దేహం కన్పించక తిరిగి వచ్చారు.
\v 23 కొందరు దూతలు తమకు కనబడి "ఆయన బతికే ఉన్నాడని చెప్పారు" అని మా అందరికీ చెప్పినప్పుడు మాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది.
\v 24 మా వాళ్ళు కొంతమంది సమాధి దగ్గరకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టే ఖాళీ సమాధిని చూశారు గానీ ఆయనను చూడలేదు" అని ఆయనకు చెప్పారు.
\s5
\v 25 అందుకాయన "అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా,
\v 26 క్రీస్తు ఈ విధంగా హింసలు అనుభవించి తన మహిమలో ప్రవేశించడం తప్పనిసరి కాదా?" అని చెప్పాడు.
\v 27 ఇంకా మోషే నుండి ప్రవక్తలందరి వరకూ లేఖనాలన్నిటిలో తనను గురించి తెలిపిన మాటల అర్థాన్ని వారికి తెలియచేశాడు.
\s5
\v 28 ఇంతలో వారి గ్రామం వచ్చింది. ఆయన ఇంకా ముందుకు ప్రయాణం చేస్తున్నట్లు కన్పించింది.
\v 29 దాంతో వారు "పొద్దు వాలుతున్నది. చీకటి పడుతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు" అంటూ ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడా ఇంటిలోకి వెళ్ళాడు.
\s5
\v 30 ఆయన వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని దానికోసం కృతజ్ఞతలు చెప్పి, విరిచి తినడానికి వారికిచ్చాడు.
\v 31 అప్పుడు వారి కన్నులు తెరచుకున్నాయి. వారు ఆయనను గుర్తు పట్టారు. అయితే ఆయన వారికి కనబడకుండా మాయమయ్యాడు.
\v 32 అప్పుడు వారు "దారిలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను మనకు అర్థం అయేలా చెప్తున్నప్పుడు మన హృదయాలు దహించుకు పోతున్నట్లు అనిపించ లేదూ" అని చెప్పుకున్నారు.
\s5
\v 33 అప్పుడే వారు లేచి తిరిగి యెరూషలేం వెళ్ళారు. అక్కడ పదకొండు మంది శిష్యులూ, వారితో ఉన్నవారూ కలుసుకుని
\v 34 "ప్రభువు నిజంగా లేచి సీమోనుకు కనిపించాడు" అని చెప్పుకుంటున్నారు. వారిది విని
\v 35 దారిలో జరిగిన సంగతులూ, ఆయన రొట్టె విరవడం వల్ల తమకెలా ప్రత్యక్షమయ్యాడో తెలియచేశారు.
\s5
\v 36 వారు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే యేసే వారి మధ్య నిలబడి "మీకు శాంతి కలుగు గాక" అన్నాడు.
\v 37 అయితే వారు తమకేదో ఆత్మ కన్పించిందనుకుని భయంతో హడలిపోయారు.
\s5
\v 38 అప్పుడాయన "మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ హృదయాల్లో సందేహం ఎందుకు పుడుతుంది?
\v 39 నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకి ఎముకలూ మాంసమూ ఉండవు" అని చెప్పాడు.
\v 40 అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు.
\s5
\v 41 అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన "మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?" అని అడిగాడు.
\v 42 వారు కాల్చిన చేప ముక్కను ఆయన కిచ్చారు.
\v 43 ఆయన దానిని తీసికొని వారి కళ్ళ ముందే తిన్నాడు.
\s5
\v 44 తర్వాత ఆయన "మోషే ధర్మశాస్త్రంలోనూ, ప్రవక్తల గ్రంథాల్లోనూ, కీర్తనలలోనూ నా గురించి రాసినవన్నీ నెరవేరాలని నేను మీతో ఉన్నప్పుడు చెప్పాను గదా" అన్నాడు.
\s5
\v 45 అప్పుడు లేఖనాలను గ్రహించగలిగేలా ఆయన వారి మనస్సులను తెరిచాడు.
\s మహాభినియామకం (మత్తయి 28:18-20; మార్కు 16:15-18; యోహాను 1:8)
\p
\v 46 "క్రీస్తు హింసలు పొంది చనిపోయి మూడోరోజున చనిపోయిన వారిలోనుండి లేస్తాడనీ,
\v 47 యెరూషలేములో ప్రారంభమై సమస్త జాతులకీ ఆయన పేర పశ్చాత్తాపం, పాప క్షమాపణ ప్రకటన జరుగుతుందనీ రాసి ఉంది.
\s5
\v 48 మీరు ఈ విషయాలన్నిటికీ సాక్షులు.
\s క్రీస్తు ఆరోహణం (మార్కు 16:19,20; అపో కా 1:9,11)
\p
\v 49 వినండి, నా తండ్రి చేసిన వాగ్దానాన్ని మీ మీదకు పంపుతున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకూ పట్టణంలోనే ఉండండి" అని వారికి చెప్పాడు.
\s5
\v 50 ఆయన బేతనియ వరకూ వారిని తీసుకు పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు.
\v 51 అలా వారిని ఆశీర్వదిస్తూ ఉండగానే ఆయన వారిలో నుండి వేరై పరలోకానికి ఆరోహణం అయ్యాడు.
\s5
\v 52 వారు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేం కు తిరిగి వెళ్ళారు.
\v 53 దేవాలయంలో నిరంతరం ఉంటూ దేవుణ్ణి కీర్తిస్తూ, ఆరాధిస్తూ ఉన్నారు.