te_ulb/49-GAL.usfm

332 lines
48 KiB
Plaintext
Raw Normal View History

2017-05-19 05:56:45 +00:00
\id GAL Galatians
\s5
\c 1
\s పలకరింపులు
\p
\v 1 మనుష్యుల ద్వారా కాకుండా ఏ వ్యక్తి వలనా కాకుండా కేవలం యేసుక్రీస్తు ద్వారానూ, ఆయనను చనిపోయిన వారిలోనుంచి సజీవుడిగా లేపిన తండ్రి అయిన దేవుని ద్వారానూ అపోస్తులుడుగా నియమితుడైన పౌలు అనే నేనూ,
\v 2 నాతో ఉన్న సోదరులంతా గలతీయ ప్రాంతం లో ఉన్న సంఘాలకు శుభాకాంక్షలతో రాస్తున్న విషయాలు.
\s5
\v 3 తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభు యేసు క్రీస్తు నుంచి మీకు కృపా, శాంతీ కలుగు గాక.
\v 4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనల్ని ప్రస్తుత దుష్ట కాలం నుంచి విమోచించాలని మన పాపాల కోసం తన్ను తాను అప్పగించుకున్నాడు.
\v 5 నిరంతరమూ దేవునికి మహిమ కలుగుతుంది గాక. ఆమేన్‌.
\s లేఖ ముఖ్యాంశం, సందర్భం
\s5
\p
\v 6 క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచిపెట్టి, భిన్నమైన శుభ వార్త వైపు మీరింత త్వరగా తిరిగిపోవడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
\v 7 అసలు వేరే శుభ వార్త అనేది లేదు, క్రీస్తు శుభ వార్తను వక్రీకరించి మిమ్మల్ని కలవరపరచే వాళ్ళు కొంతమంది ఉన్నారు.
\s5
\v 8 మేము మీకు ప్రకటించిన శుభ వార్త గాక వేరొక శుభ వార్తను మేము అయినా లేక పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినా సరే మీకు ప్రకటిస్తే, అతడు దేవుని శాపానికి గురౌతాడు గాక!.
\v 9 మేము ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాము. మీరు అంగీకరించిన శుభ వార్త గాక వేరొకటి ఎవరైనా మీకు ప్రకటిస్తే, వానిని దేవుడు శపిస్తాడు గాక!
\v 10 ఇప్పుడు నేను మనుషుల ఆమోదం కోరుతున్నానా లేకపోతే దేవుని ఆమోదం కోరుతున్నానా? నేను మనుషుల్ని తృప్తి పరచాలనుకుంటున్నానా? నేనింకా మనుషుల్ని తృప్తి పరచాలనుకుంటుంటే క్రీస్తు సేవకుణ్ణి కానే కాదు.
\s 10 పౌలు ప్రకటించిన సువార్త అతనికి ప్రత్యేకంగా వెల్లడి అయినది, ఇతర అపోస్తలుల నుంచి పొందినది కాదు
\s5
\p
\v 11 సోదరులారా, నేను ప్రకటించిన శుభ వార్త మానవమాత్రుని నుంచి వచ్చింది కాదని మీకు తెలియాలి.
\v 12 మనిషి నుంచి నేను దానిని పొందలేదు, నాకెవరూ దానిని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.
\s5
\v 13 నా గత యూదామత జీవితం గురించి మీరు విన్నారు. నేను దేవుని సంఘాన్ని తీవ్రంగా హింసిస్తూ నాశనం చేస్తూ ఉండేవాణ్ణి.
\v 14 అప్పుడు నాకు నా పూర్వీకుల సంప్రదాయాలంటే ఎంతో ఆసక్తి ఉండేది. యూదా మత నిష్ఠ విషయంలో నా స్వజాతీయుల్లో నా వయసు గల అనేకులను మించిపోయాను.
\s5
\v 15 అయినా తల్లిగర్భం లోనే నన్ను ప్రత్యేకపరచుకుని, తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను యూదేతరులకు తన కుమారుని ప్రకటించాలని
\v 16 ఆయన్ని నాలో వెల్లడి చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వెంటనే నేను మనుషులతో సంప్రదించలేదు.
\v 17 నాకంటె ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్లలేదు, అరేబియా దేశానికి వెళ్లి ఆ తర్వాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను.
\s5
\v 18 మూడు సంవత్సరాలైన తరువాత కేఫాను పరిచయం చేసుకోవాలని యెరూషలేము వచ్చి అతనితో పదిహేను రోజులున్నాను.
\v 19 అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవరినీ నేను చూడలేదు, ప్రభువు సోదరుడు యాకోబును మాత్రం చూశాను.
\v 20 నేను మీకు రాస్తున్న ఈ విషయాల గురించి దేవుని ముందు నేను అబద్ధమాడడం లేదు.
\s5
\v 21 ఆ తరువాత సిరియ, కిలికియ ప్రాంతాలకు వచ్చాను.
\v 22 క్రీస్తులో ఉన్న యూదయ సంఘాల వారికి నా ముఖ పరిచయం లేదు గానీ
\v 23 "మునుపు మనల్ని హింసించినవాడు తాను గతంలో నాశనం చేస్తూ వచ్చిన విశ్వాసాన్ని తానే ప్రకటిస్తున్నాడు" అనే విషయం మాత్రమే విని,
\v 24 వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచారు.
\s5
\c 2
\s నిర్దోషిగా అయ్యేది విశ్వాసం మూలంగానే (గలతి 2: 15 3: 24). యూదులకు సైతం ఇదే మార్గం
\p
\v 1 పద్నాలుగు సంవత్సరాలైన తరువాత నేను తీతును వెంటబెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేము తిరిగి వెళ్లాను.
\v 2 మేము వెళ్లాలని దేవుడు దర్శనంలో నాకు చెబితేనే వెళ్లాను. నా ప్రయాస వ్యర్థమైపోతుందేమో, లేక వ్యర్థమైపోయిందేమో అని నేను యూదేతరులకు ప్రకటిస్తున్న శుభ వార్త గురించి విశ్వాసుల్లో ముఖ్యమైన నాయకులకు ప్రత్యేకంగా వివరించాను.
\s5
\v 3 అయినా నాతో ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనా సున్నతి పొందాలని ఎవరూ అతణ్ణి బలవంతం చేయలేదు.
\v 4 క్రీస్తు యేసులో మనకు కలిగిన స్వాతంత్రాన్ని కనిపెట్టడానికీ, మనల్ని ధర్మశాస్త్రానికి బానిసలుగా చేసుకోడానికీ క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వేచ్ఛను గూఢచారుల్లాగా కనిపెట్టడానికి రహస్యంగా కపట సోదరుల్ని ప్రవేశపెట్టారు.
\v 5 శుభ వార్త సత్యం మార్పులేనిదిగా, మీకు ప్రయోజనంగా నిలిచి ఉండేలా కాసేపైనా వారితో మేము ఏకీభవించలేదు.
\s5
\p
\v 6 ఇతరులు నాయకులుగా ఎంచిన వారు నాకెలాంటి తోడ్పాటూ ఇవ్వలేదు. ఆ నాయకులు గొప్పవారే కానీ వారు నాకంత ప్రధానం కాదు. దేవుడు మనిషి పైరూపం చూడడు.
\v 7 అయితే సున్నతి పొందిన వారికి బోధించడానికి దేవుడు శుభ వార్తను పేతురుకు ఎలా అప్పగించాడో అలాగే సున్నతి పొందనివారికి బోధించడానికి నాకు అప్పగించాడని వారు గ్రహించారు.
\v 8 అంటే సున్నతి పొందిన వారికి అపొస్తలుడుగా ఉండడానికి పేతురుకు సామర్థ్యం కలగజేసిన వాడే యూదేతరులకు అపొస్తలుడుగా ఉండడానికి నాకు కూడా సామర్థ్యం కలగచేసాడు.
\s5
\v 9 నాయకులుగా పేరొందిన యాకోబు, కేఫా, యోహాను, అనే వారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను గుర్తించి, మేము యూదేతరులకూ, తాము సున్నతి పొందిన వారికీ అపొస్తలులుగా ఉండాలని చెప్పి, సహవాసానికి గుర్తుగా నాతోనూ, బర్నబాతోనూ తమ కుడి చేతులు కలిపారు.
\v 10 మేము యెరూషలేములో ఉన్న తోటి విశ్వాసుల్లోని పేదవారి అవసరాల్ని ఇంకా పట్టించుకొంటూ ఉండాలని మాత్రమే వాళ్ళు కోరారు. అలా చేయడానికి నేను కూడా ఆసక్తితో ఉన్నాను.
\s5
\p
\v 11 అయితే కేఫా, అంతియొకయ వచ్చినప్పుడు అతడు తప్పు చేశాడు. కాబట్టి నేను ముఖాముఖిగా అతన్ని నిలదీశాను.
\v 12 ఎందుకంటే, యాకోబు దగ్గర నుంచి కొంతమంది రాక ముందు అతడు యూదేతరులతో భోజనం చేస్తున్నాడు. గాని వాళ్ళు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనక్కి తగ్గి, పక్కకి వెళ్ళిపోయాడు.
\s5
\v 13 మిగతా యూదులు కూడా కేఫాతో ఈ కపటంలో కలిసిపోయారు. బర్నబా కూడా వారి కపటవేషధారణ వల్ల మోసపోయాడు.
\v 14 వారు శుభ వార్త సత్యాన్ని అనుసరించడం లేదని నేను చూసి అందరి ముందు కేఫాతో, "నీవు యూదుడవై ఉండి కూడా యూదుల లాగా కాక యూదేతరుడిలా ప్రవర్తిస్తుంటే, యూదేతరులు యూదుల లాగా ప్రవర్తించాలని ఎందుకు బలవంతం చేస్తున్నావు?" అన్నాను.
\s5
\p
\v 15 మనం పుట్టుకతో యూదులం గానీ "పాపులైన యూదేతరులం" కాదు. మనిషి యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు గాని, ధర్మశాస్త్ర క్రియల వలన కాదు. ఆ సంగతి ఎరిగిన మనం కూడా ధర్మశాస్త్ర క్రియల వలన గాక క్రీస్తు నందలి విశ్వాసం ద్వారానే దేవుని చేత నీతిమంతులుగా తీర్పు పొందడానికి యేసు క్రీస్తులో విశ్వాసముంచాము.
\v 16 ధర్మశాస్త్ర క్రియల వలన ఎవరూ నీతిమంతుడని తీర్పు పొందడు గదా.
\s5
\v 17 అయితే, దేవుడు మనల్ని క్రీస్తులో నీతి మంతులుగా తీర్చాలని కోరుకొంటూ, మనకు మనం పాపులుగా కనబడితే, క్రీస్తు పాపానికి సేవకుడయ్యాడా? కచ్చితంగా కాదు.
\v 18 నేను పడగొట్టిన వాటిని మళ్ళీ కడితే నన్ను నేనే అపరాధిగా చేసుకుంటాను గదా.
\v 19 నేనైతే దేవుని కోసం బతకడానికి ధర్మశాస్త్రం ద్వారా ధర్మశాస్త్రానికి చనిపోయాను.
\s 20 లోపల నివసిస్తున్న క్రీస్తును బయటకు కనుపరచేదే క్రైస్తవ జీవితం
\s5
\p
\v 20 నేను క్రీస్తుతో కూడ సిలువ మరణం పొందాను. ఇక మీదట జీవించేది నేను కాదు. క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేనిప్పుడు శరీరంలో జీవిస్తున్న జీవితం నన్ను ప్రేమించి, నా కోసం తన్నుతాను సమర్పించుకున్న దేవుని కుమారుని మీద విశ్వాసం వలననే.
\v 21 నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం ద్వారా సాధ్యం అయితే క్రీస్తు అనవసరంగా చనిపోయినట్లే గదా.
\s5
\c 3
\s ఆత్మ వరం విశ్వాసం వల్లనే, ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు
\p
\v 1 తెలివిలేని గలతీయులారా, మిమ్మల్ని భ్రమపెట్టిందెవరు? సిలువకు గురి అయినట్టుగా యేసు క్రీస్తును మీ కళ్ళముందు చూపించాము గదా!
\v 2 మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్న ఒకే విషయం ఏమిటంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందారా లేక విన్న దానిని విశ్వసించడం వలన పొందారా?
\v 3 మీరింత అవివేకులయ్యారా? మొదట దేవుని ఆత్మతో మొదలు పెట్టి, ఇప్పుడు శరీరంతో ముగిస్తారా?
\s5
\p
\v 4 వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అవన్నీ నిజంగా వ్యర్థమైపోతాయా?
\v 5 ఆత్మను మీకు అనుగ్రహించి, మీలో అద్భుతాలు చేయించేవాడు, ధర్మశాస్త్ర సంబంధమైన పనుల వలనా లేక విశ్వాసంతో వినడం వల్ల చేయిస్తున్నాడా?
\s అబ్రాహాము నిబంధన విశ్వాస నిబంధన
\s5
\p
\v 6 అబ్రాహాము "దేవుని నమ్మాడు, అదే అతనికి నీతిగా లెక్కలోకి వచ్చింది."
\v 7 కాబట్టి, నమ్మకముంచే వాళ్ళే అబ్రాహాము సంతానమని మీరు తెలుసుకోవాలి.
\v 8 విశ్వాసం ద్వారా దేవుడు యూదేతరుల్ని నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనం ముందుగానే ప్రవచించింది. "ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ నీలో దీవెనలు పొందుతాయి." అని అబ్రాహాముకు శుభ వార్త ముందుగానే ప్రకటించడం జరిగింది.
\v 9 కాబట్టి విశ్వాస సంబంధుల్నే విశ్వాసముంచిన అబ్రాహాముతో కూడా దేవుడు దీవిస్తాడు.
\s ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్న మనిషి ధర్మశాస్త్ర శాపం కింద ఉన్నవాడు
\s5
\p
\v 10 ధర్మశాస్త్రం విధించిన క్రియలపై ఆధారపడి జీవించే వారందరినీ దేవుడు శిక్షిస్తాడు. ఎందుకంటే "ధర్మశాస్త్ర గ్రంథంలో రాసివున్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు" అని రాసి ఉంది.
\v 11 ధర్మశాస్త్రం వలన దేవుడు ఎవర్నీ నీతిమంతునిగా తీర్చడు అనే విషయం స్పష్టం. ఎందుకంటే, "నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు."
\v 12 ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు గానీ "దాని విధులను ఆచరించే వాడు వాటి వలనే జీవిస్తాడు."
\s ధర్మశాస్త్ర సంబంధిత శాపాన్ని క్రీస్తు భరించి విశ్వాస సంబంధమైన దీవెనలను మనకు ఇచ్చాడు
\s5
\p
\v 13 ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనకు లభించేలా, అబ్రాహాము పొందిన దీవెన క్రీస్తు యేసు ద్వారా యూదేతరులకు కలగడానికి, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనల్ని ధర్మశాస్త్రం శిక్ష నుంచి విమోచించాడు.
\v 14 అందుకే "మాను మీద వేలాడిన ప్రతివాడూ శాపగ్రస్తుడు" అని రాసి ఉంది .
\s5
\v 15 సోదరులారా, మానవరీతిగా మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి ఇంకేమీ కలపరు.
\v 16 అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు "నీ సంతానాలకు" అని అనలేదు గానీ ఒకని గురించి అన్నట్టుగా, "నీ సంతానానికి" అన్నాడు. ఆ సంతానం క్రీస్తే.
\s అబ్రాహాముకు చేసిన విశ్వాస నిబంధనకు ధర్మశాస్త్రం ఏమీ కలపడం లేదు
\s5
\p
\v 17 నేను చెప్పేది ఏంటంటే, 430 సంవత్సరాలైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం, దేవుడు ముందుగానే స్థిరపరచిన నిబంధనను కొట్టివేయదు. దాని వాగ్దానాన్ని వ్యర్ధం చేయదు.
\v 18 ఆ వారసత్వం ధర్మశాస్త్రం వలన అయిందంటే ఇక ఏ మాత్రం వాగ్దానం వలన అయ్యేది కానట్టే. అయితే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం వలనే వారసత్వాన్ని ఇచ్చాడు.
\s ధర్మశాస్త్రం అసలు ఉద్దేశం శిక్ష విధించడమే
\s5
\p
\v 19 ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? అతిక్రమాలను బట్టి దేవుడు దానిని కలిపాడు. ఎవరికి ఆ వాగ్దానం చేశాడో ఆ సంతానం వచ్చే వరకు అది అమల్లో ఉంది. దానిని మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా దేవుడు నియమించాడు.
\v 20 మధ్యవర్తి ఉన్నాడంటే ఒక్కడి కోసమే ఉండడు, కానీ దేవుడు ఒక్కడే.
\s5
\v 21 ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ ధర్మశాస్త్రం బతికించగలిగేలా ఉంటే, ధర్మశాస్త్రం వలననే నీతి కలిగి ఉండేది.
\v 22 యేసు క్రీస్తులో విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించే వారికి దేవుడు అనుగ్రహించేలా, లేఖనం అందరినీ పాపంలో బంధించింది.
\s5
\v 23 క్రీస్తులో మనం విశ్వాసం ఉంచక ముందు విశ్వాసం ప్రత్యక్షమయ్యే వరకు, మనం ధర్మశాస్త్రానికి మాత్రమే పరిమితమై దాని చెరలో ఉన్నాము.
\v 24 కాబట్టి దేవుడు మనల్ని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చి క్రీస్తు దగ్గరకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రం మనకు ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ఉన్నాడు.
\s 25 విశ్వాసి జీవితంపై రాజ్యమేలుతున్నది కృపే, చట్టం కాదు.
\p
\v 25 అయితే విశ్వాసం వెల్లడయింది కాబట్టి మనం ఇక ప్రాథమిక ఉపాధ్యాయుని కింద లేము.
\v 26 యేసు క్రీస్తులో మీరంతా విశ్వాసం ద్వారా దేవుని కుమారులు.
\s5
\v 27 క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరంతా క్రీస్తును ధరించుకున్నారు.
\v 28 ఇందులో యూదుడు, గ్రీకు, దాసుడు, స్వతంత్రుడు, పురుషుడు, స్త్రీ అనే తేడా లేదు. యేసు క్రీస్తులో మీరంతా ఒక్కటిగా ఉన్నారు.
\v 29 మీరు క్రీస్తు సంబంధులైతే, అబ్రాహాము సంతానంగా ఉండి, వాగ్దానం ప్రకారం వారసులు.
\s5
\c 4
\p
\v 1 నేను చెప్పేదేమిటంటే వారసుడు తండ్రి సంపద అంతటికీ యజమాని అయినప్పటికీ పిల్లవాడుగా ఉన్నంతకాలం అతనికీ దాసునికీ ఏ తేడా లేదు.
\v 2 తండ్రి నిర్ణయించిన రోజు వచ్చే వరకు అతడు సంరక్షకుల, నిర్వాహకుల అధీనంలో ఉంటాడు.
\s5
\v 3 అలాగే మనం పిల్లలంగా ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠాలకు లోబడి దాసులంగా ఉన్నాము.
\s విశ్వాసి ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందాడు
\p
\v 4 అయితే సరైన సమయం వచ్చినపుడు దేవుడు తన కొడుకుని పంపాడు. ఆయన స్త్రీకి పుట్టి,
\v 5 మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికి ధర్మశాస్త్రానికి లోబడినవాడయ్యాడు.
\s విశ్వాసి కుమారత్వాన్ని వాస్తవం చేసేది ఆత్మ
\s5
\p
\v 6 మీరు కొడుకులు కాబట్టి, "నాన్నా, తండ్రీ," అని పిలిచే తన కుమారఆత్మను దేవుడు మన హృదయాలలోకి పంపాడు.
\v 7 కాబట్టి నీవిక ఏమాత్రం బానిసవి కాదు, కొడుకువే. కొడుకువైతే దేవుని ద్వారా వారసుడివి.
\s ధర్మశాస్త్ర క్రియల వైపుకు మళ్ళడం అంటే తిరిగి ప్రాథమిక మతం వైపు తిరగడమే
\s5
\p
\v 8 ఆ కాలంలో మీరు దేవుని ఎరుగనివారై, వాస్తవానికి దేవుళ్లు కానివారికి బానిసలుగా ఉన్నారు గాని
\v 9 ఇప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్న వారు. మరి విశేషంగా దేవుడు మిమ్మల్ని తెలుసుకున్నాడు. కాబట్టి, బలహీనమైనవీ ప్రయోజనం లేనివీ అయిన మూల పాఠాల వైపు మళ్ళీ ఎందుకు తిరుగుతున్నారు? మళ్ళీ బానిసలుగా ఉండాలనుకుంటున్నారా?
\s5
\v 10 మీరు ప్రత్యేక దినాలూ అమావాస్య దినాలూ ఉత్సవ కాలాలూ సంవత్సరాలూ జాగ్రత్తగా ఆచరిస్తూ ఉన్నారు.
\v 11 మీ విషయంలో నా కష్టం వ్యర్థమై పోతుందేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను.
\s5
\v 12 సోదరులారా, నేను మీలాంటి వాడినయ్యాను కాబట్టి మీరు కూడా నాలాంటి వాళ్ళు కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
\v 13 మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర బలహీనత కలిగినా నేను శుభ వార్త మీకు ప్రకటించానని మీకు తెలుసు.
\v 14 అప్పుడు నా దేహంలో మీకు శోధనగా ఉన్న దానిని బట్టి నన్ను మీరు తృణీకరించలేదు, నిరాకరించనూ లేదు గాని దేవుని దూతలాగా, క్రీస్తు యేసులాగా నన్ను అంగీకరించారు.
\s చట్టపరమైన నీతికి మళ్లడం ద్వారా గలతీయులు తమ దీవెనలను పోగొట్టుకున్నారు
\s5
\p
\v 15 మీ సంతోషం ఇప్పుడు ఏమయింది? వీలుంటే మీ కళ్ళు తీసి నాకిచ్చేసే వారని మీ గురించి సాక్ష్యం చెప్పగలను.
\v 16 నేను మీకు వాస్తవం చెప్పి విరోధినయ్యానా?
\s5
\p
\v 17 వారు అత్యాసక్తితో మీ వెంట పడుతున్నారు, కానీ వారి ఉద్దేశం మంచిది కాదు. మీరు వారిని అనుసరించాలని నా నుంచి మిమ్మల్ని దూరం చేయాలనుకుంటున్నారు.
\v 18 నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ మంచి కారణాల విషయం అత్యాసక్తి కలిగి ఉండటం మంచిది.
\s ధర్మశాస్త్రం, కృప, ఈ రెండూ కలిసి ఉండడం అసాధ్యం
\s5
\p
\v 19 నా చిన్న పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మీ విషయం మళ్ళీ నేను ప్రసవ వేదన అనుభవిస్తున్నాను.
\v 20 మిమ్మల్ని గురించి ఎటూ తోచక ఉన్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరొక రకంగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను.
\s5
\v 21 ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలని కోరే వారలారా, మీరు ధర్మశాస్త్రం వినడం లేదా? నాతో చెప్పండి.
\v 22 దాసి వలన ఒకడు, స్వతంత్రురాలి వలన ఒకడు, ఇద్దరు కొడుకులు అబ్రాహాముకు కలిగారని రాసి ఉందిగదా?
\v 23 అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమూలంగా పుట్టాడు.
\s5
\v 24 ఈ విషయాల్ని అలంకార రూపంలో చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలుగా ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి పర్వతానికి సంబంధించి బానిసత్వంలో ఉండడానికి పిల్లల్ని కంటుంది. ఇది హాగరు.
\v 25 ఈ హాగరు అరేబియా ప్రాంతంలో ఉన్న సీనాయి కొండ. ప్రస్తుతం ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడ బానిసత్వంలో ఉంది.
\s5
\v 26 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉంది. అది మనకు తల్లి.
\q1
\v 27 "గొడ్రాలా, పిల్లల్ని కనని దానా, ఆనందించు.
\q1 ప్రసవ వేదన పడనిదానా, ఆనందంతో కేకలు పెట్టు.
\q1 ఎందుకంటే, భర్త ఉన్న ఆమె పిల్లల కంటె భర్త లేని దాని పిల్లలు ఎక్కువమంది ఉన్నారు" అని రాసి ఉంది .
\s5
\p
\v 28 సోదరులారా, మనం కూడా ఇస్సాకు లాగా వాగ్దాన ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నాం.
\v 29 అప్పుడు శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాణ్ణి ఎలా హింసపెట్టాడో ఇప్పుడు కూడా ఆలాగే జరుగుతున్నది.
\s5
\v 30 లేఖనం ఏమి చెబుతున్నది? "దాసిని, ఆమె కొడుకుని వెళ్లగొట్టు. దాసి కొడుకు స్వతంత్రురాలి కొడుకుతో పాటు వారసుడుగా ఉండడు."
\v 31 అందుచేత, సోదరులారా, మనం స్వతంత్రురాలి కొడుకులమే గాని దాసి కొడుకులం కాదు.
\s5
\c 5
\s ఉపమానం వివరణ
\p
\v 1 స్వేచ్ఛ గా ఉండడం కోసం క్రీస్తు మనల్ని విడుదల చేశాడు. కాబట్టి, స్థిరంగా నిలబడి మళ్ళీ బానిసత్వపు కాడి కింద చిక్కుకోవద్దు.
\v 2 మీరు సున్నతి పొంది ఉంటే క్రీస్తు వలన మీకు ఏ ప్రయోజనమూ ఉండదని పౌలు అనే నేను మీతో చెబుతున్నాను.
\s5
\v 3 ధర్మశాస్త్రమంతటినీ పాటించ బద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనిషికీ నేను మళ్ళీ గట్టిగా చెబుతున్నాను.
\v 4 మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతుల లెక్కలోకి రావాలనుకునేవారు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరై పోయారు. కృపలో నుంచి తొలగిపోయారు.
\s5
\v 5 మనం విశ్వాసం వలన నీతి కలుగుతుందనే నిశ్చయంతో ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము.
\v 6 యేసు క్రీస్తులో సున్నతి పొందడంలోనో , పొందకపోవడంలోనో ఏమీ లేదు, ప్రేమతో పనిచేసే విశ్వాసమే ముఖ్యం.
\v 7 మీరు బాగా పరుగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు?
\v 8 ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుస్తున్న వాని నుంచి కలగలేదు.
\s5
\v 9 పులిసిన పిండి కొంచెమైనా ముద్దనంతా పులియ చేస్తుంది.
\v 10 మీరెంత మాత్రమూ వేరుగా ఆలోచించరని ప్రభువులో మీ గురించి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపెట్టేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష అనుభవిస్తాడు.
\s5
\v 11 సోదరులారా, సున్నతి పొందాలని నేను ఇంకా ప్రకటిస్తూ ఉంటే ఇప్పటికీ ఎందుకు హింసలకు గురి అవుతూ ఉన్నాను? సిలువను గురించిన అభ్యంతరాన్ని సున్నతి నాశనం చేస్తుంది గదా?
\v 12 మిమ్మల్ని తప్పు దారి పట్టించే వాళ్ళు తమ్మును తాము మీ నుంచి నరికివేసుకొనడం మంచిది.
\s5
\v 13 సోదరులారా, మీరు స్వతంత్రంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ స్వతంత్రాన్ని శరీర ఆశల కోసం వినియోగించక, ప్రేమతో ఒకరికొకరు సేవ చేసుకోండి.
\v 14 ధర్మశాస్త్రమంతా "నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగు వాణ్ణి కూడా ప్రేమించు" అనే ఒక్క ఆజ్ఞ లో ఇమిడి ఉంది.
\v 15 అయితే మీరు ఒకరినొకరు కరచుకొని తినేస్తే ఒకడి వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి.
\s పవిత్రీకరణ ఆత్మ ద్వారానే, ధర్మశాస్త్రం ద్వారా కాదు
\s5
\p
\v 16 నేను చెప్పేది ఏంటంటే, ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను నెరవేర్చరు.
\v 17 శరీర స్వభావం ఆశించేవి ఆత్మకు విరోధంగా ఉంటాయి, ఆత్మ ఆశించేవి శరీరానికి విరోధంగా పనిచేస్తాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏవి చేయాలని ఇష్టపడతారో వాటిని చేయరు.
\v 18 ఆత్మ మిమ్మల్ని నడిపిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు.
\s5
\v 19 శరీర స్వభావ క్రియలు స్పష్టంగా ఉన్నాయి. అవేవంటే, జారత్వం, అపవిత్రత, కామవికారం,
\v 20 విగ్రహారాధన, మంత్ర తంత్రాలు, ద్వేషం, కలహం, ఈర్ష్య భావాలు, కోపోద్రేకాలు, కక్షలు,
\v 21 శత్రుత్వాలు, కలతలు, అసూయలు, తాగుబోతుల పోకిరీతనం మొదలైనవి. వీటిని గురించి నేను ముందే చెప్పినట్లు ఇలాంటి పనులు చేసే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.
\s5
\p
\v 22 అయితే ఆత్మఫలం ఏదంటే ప్రేమ, ఆనందం, శాంతి సమాధానాలు, సహనం, కనికరం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం.
\v 23 అలాంటి వాటికి ధర్మశాస్త్రం వ్యతిరేకం కాదు.
\v 24 క్రీస్తు యేసుకు చెందిన వాళ్ళు, శరీర స్వభావాన్నీ దానితో కూడా దాని చెడ్డ కోరికలనూ సిలువ వేశారు.
\s క్రీస్తులో నూతన జీవం బహిర్గతం కావడం
\s5
\p
\v 25 మనం దేవుని ఆత్మతో బతుకుతూ ఉంటే ఆ ఆత్మననుసరించి కలిసి నడుద్దాం.
\v 26 అహంభావం లేకుండా జగడాలు రేపుకోకుండా ఒకరిపై ఒకరు అసూయపడకుండా ఉందాం.
\s5
\c 6
\s సహోదరత్వం తో కూడిన నూతన జీవితం
\p
\v 1 నా తోటి సోదరులారా, మీలో ఎవరైనా పాపం చేస్తూ పట్టుబడితే, దేవుని ఆత్మ ప్రేరేపణతో ఉన్న మీరెవరైనా, సాత్వికమైన మనస్సుతో ఆ వ్యక్తిని సరిచేయాలి. అలాటి వ్యక్తిని మీరు సరిదిద్దుతున్నపుడు మీరు కూడా పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండండి.
\v 2 ఒకరి సమస్యల్ని ఒకరు పట్టించుకోండి. అలా చేస్తూ ఉంటే, మీరు క్రీస్తు నియమాన్ని పాటించినట్టు.
\s5
\v 3 వ్యర్ధుడు ఎవరైనా తాను గొప్పవాడినని అనుకుంటుంటే తనను తానే మోసపరచుకుంటున్నాడు.
\v 4 ప్రతివాడూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే అతనికి అతిశయం కలుగుతుంది.
\v 5 ప్రతివాడు తన బరువు తానే మోసుకోవాలి గదా?
\s5
\v 6 వాక్యోపదేశం పొందిన వ్యక్తి ఉపదేశించిన వాడికి మంచి పదార్ధాలన్నిటిలో భాగమివ్వాలి.
\v 7 మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనుషుడు ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.
\v 8 ఎలాగంటే, తన సొంత శరీర ఇష్టాల ప్రకారం విత్తనాలు చల్లేవాడు తన శరీరం నుంచి నాశనం అనే పంట కోస్తాడు. ఆత్మ ప్రకారం విత్తనాలు చల్లేవాడు ఆత్మ నుంచి నిత్యజీవం అనే పంట కోస్తాడు.
\s5
\v 9 మనం మేలు చేస్తూ ఉండడంలో అలసిపోకుండా ఉందాం. మనం వదిలిపెట్టకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాము.
\v 10 కాబట్టి ప్రతి అవకాశంలో అందరికీ మేలు చేస్తూ ఉందాం, మరి ముఖ్యంగా మన సహ విశ్వాసులకు.
\s5
\p
\v 11 నా సొంత దస్తూరి తో పెద్ద అక్షరాలతో ఎలా రాస్తున్నానో చూడండి.
\v 12 శరీర విషయంలో చక్కగా కన్పించాలని కోరే వాళ్ళు, తాము క్రీస్తు సిలువ విషయంలో హింస పొందకుండా ఉండడానికి మాత్రమే సున్నతి పొందాలని మిమ్మల్ని బలవంతం చేస్తున్నారు.
\v 13 అయితే వారు సున్నతి పొందిన వారైనా ధర్మశాస్త్రం ఆచరించరు. వాళ్ళు మీ శరీర విషయంలో అతిశయించడం కోసం మీరు సున్నతి పొందాలని కోరుతున్నారు.
\s5
\v 14 అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు సిలువ విషయంలో తప్ప మరి దేనిలోనూ అతిశయించడం నాకు దూరమవుతుంది గాక. ఆయన ద్వారా లోకానికి నేనూ, నేను లోకానికీ సిలువ మరణం చెందాను.
\v 15 కొత్త సృష్టి పొందడమే గాని సున్నతి పొందడంలో, పొందకపోవడంలో ఏమీ లేదు.
\v 16 ఈ పద్ధతి ప్రకారం నడుచుకొనే వారందరికీ అంటే, దేవుని ఇశ్రాయేలుకు శాంతి, కృప కలుగుతాయి గాక.
\s5
\v 17 నేను యేసు గుర్తులు నా దేహంలో ధరించి ఉన్నాను కాబట్టి ఇకనుంచి ఎవరూ నన్ను కష్టపెట్టవద్దు.
\v 18 సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండు+గాక. ఆమేన్‌.