te_ulb/41-MAT.usfm

2302 lines
322 KiB
Plaintext
Raw Normal View History

2017-05-19 05:56:45 +00:00
\id MAT Matthew
\s5
\c 1
\s యేసు క్రీస్తు వంశ వృక్షం
\p
\v 1 అబ్రాహాము సంతానంలోని దావీదు, అతని సంతానంలోని యేసు క్రీస్తు వంశావళి.
\v 2 అబ్రాహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకులు యూదా, అతని సోదరులు.
\v 3 యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు.
\s5
\v 4 పెరెసు కొడుకు ఎస్రోము, ఎస్రోము కొడుకు అరాము, అరాము కొడుకు అమ్మీనాదాబు, అమ్మీనాదాబు కొడుకు నయస్సోను.
\v 5 నయస్సోను కొడుకు శల్మాను, శల్మానుకు రాహాబు ద్వారా పుట్టిన కొడుకు బోయజు, బోయజుకు రూతు ద్వారా పుట్టిన కొడుకు ఓబేదు, ఓబేదు కొడుకు యెష్షయి.
\v 6 యెష్షయి కొడుకు దావీదు . గతంలో ఊరియా భార్యగా ఉన్న ఆమెద్వారా దావీదుకు పుట్టిన కొడుకు సొలోమోను.
\s5
\v 7 సొలొమోను కొడుకు రెహబాము, రెహబాము కొడుకు అబీయా, అబీయా కొడుకు ఆసా.
\v 8 ఆసా కొడుకు యెహోషాపాతు, యెహోషాపాతు కొడుకు యెహోరాము, యెహోరాము కొడుకు ఉజ్జియా.
\s5
\v 9 ఉజ్జియా కొడుకు యోతాము, యోతాము కొడుకు ఆహాజు, ఆహాజు కొడుకు హిజ్కియా.
\v 10 హిజ్కియా కొడుకు మనష్షే, మనష్షే కొడుకు ఆమోను, ఆమోను కొడుకు యోషీయా.
\v 11 యోషీయా కొడుకులు యెకొన్యా, అతని సోదరులు. వీరి కాలంలో యూదులు బబులోను చెరలోకి వెళ్ళారు.
\s5
\v 12 బబులోనుకు వెళ్ళిన తరువాత వంశావళి. యెకొన్యా కొడుకు షయల్తీయేలు, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు.
\v 13 జెరుబ్బాబెలు కొడుకు అబీహూదు, అబీహూదు కొడుకు ఎల్యాకీము, ఎల్యాకీము కొడుకు అజోరు,
\v 14 అజోరు కొడుకు సాదోకు, సాదోకు కొడుకు ఆకీము, ఆకీము కొడుకు ఎలీహూదు.
\s5
\v 15 ఎలీహూదు కొడుకు ఎలియాజరు, ఎలియాజరు కొడుకు మత్తాను, మత్తాను కొడుకు యాకోబు.
\v 16 యాకోబు కొడుకు యోసేపు. యోసేపు మరియ భర్త. ఆమె ద్వారా క్రీస్తు అనే పేరున్న యేసు పుట్టాడు.
\v 17 ఈ విధంగా అబ్రాహాము నుంచి దావీదు వరకూ మొత్తం పధ్నాలుగు తరాలు. దావీదు నుంచి యూదులు బబులోను చెరలోకి వెళ్ళిన కాలం వరకు పధ్నాలుగు తరాలు. బబులోను చెరలోకి వెళ్ళిన కాలం నుంచి క్రీస్తు వరకు పధ్నాలుగు తరాలు.
\s యేసు జననం (లూకా 1:26-35; యోహాను 1:1, 2, 14)
\s5
\p
\v 18 యేసు క్రీస్తు పుట్టుక వివరం. ఆయన తల్లి మరియకు యోసేపుతో పెళ్లి నిశ్చయం అయింది కానీ వాళ్ళు ఏకం కాక ముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది.
\v 19 ఆమె భర్త యోసేపు నీతిమంతుడు. కాని ఆమెను బహిరంగంగా అవమాన పరచక రహస్యంగా ఆమెను వదిలేద్దామనుకున్నాడు.
\s5
\v 20 అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత కలలో అతనికి కనిపించి "దావీదు కుమారా, యోసేపూ, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు.
\v 21 తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు" అన్నాడు.
\s5
\v 22 "కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు 'దేవుడు మనతో ఉన్నాడు' అని అర్ధమిచ్చే 'ఇమ్మానుయేలు' అనే పేరు పెడతారు" అని
\v 23 ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది.
\s5
\v 24 యోసేపు నిద్ర నుంచి లేచి ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఆమెను భార్యగా స్వీకరించాడు.
\v 25 ఆమె కొడుకును కనే వరకు ఆమెను కూడలేదు. యోసేపు ఆయనకు యేసు అనే పేరు పెట్టాడు.
\s5
\c 2
\s జ్ఞానుల సందర్శన
\p
\v 1 హేరోదు రాజు పరిపాలించే రోజుల్లో యూదయ ప్రాంతంలోని బేత్లెహేము అనే వూళ్ళో యేసు పుట్టిన తరువాత తూర్పు దేశాలనుండి జ్ఞానులు కొందరు యెరూషలేము వచ్చి
\v 2 "యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాము. ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము" అన్నారు.
\v 3 హేరోదు రాజు ఈ సంగతి విని అతడూ అతనితో పాటు యెరూషలేము వారంతా కంగారు పడ్డారు .
\s5
\v 4 కాబట్టి రాజు ప్రజల ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రజ్ఞులు అందరినీ పిలిపించి "క్రీస్తు ఎక్కడ పుట్టవలసి ఉంది?" అని వారిని అడిగాడు.
\v 5 అందుకు వాళ్ళు "యూదయ ప్రాంతం లోని బేత్లెహేములో. 'యూదయ ప్రాంతపు బేత్లెహేము గ్రామమా! యూదా ప్రముఖ పట్టణాలలో నువ్వు దేనికీ తీసిపోవు. నా ఇశ్రాయేలు ప్రజకు కాపరిగా పాలించేవాడు నీలోనే పుడతాడు' అని ప్రవక్తలు రాశారు" అని చెప్పారు.
\v 6 అప్పుడు హేరోదు ఆ జ్ఞానులను ఏకాంతంగా పిలిపించి,
\s5
\v 7 ఆ నక్షత్రం కనిపించిన సరైన సమయం వారి ద్వారా తెలుసుకున్నాడు.
\v 8 తరువాత వారిని బేత్లెహేము పంపుతూ "మీరు వెళ్లి, ఆ బిడ్డ కోసం జాగ్రత్తగా వెదకండి. మీరు ఆయన్ని కనుగొన్నాక నాకు చెప్పండి. అప్పుడు నేనూ వచ్చి అతన్నిఆరాధిస్తాను" అని చెప్పాడు.
\s5
\v 9 వాళ్ళు రాజు మాట విని బయలుదేరి వెళ్తుంటే, తూర్పున వారికి కనిపించిన నక్షత్రం వారి ముందు వెళుతూ ఆ బిడ్డ ఉన్న స్థలం పైన ఆగింది.
\v 10 ఆ నక్షత్రం చూచి, వాళ్ళు అత్యధికంగా ఆనందించారు.
\s5
\v 11 ఇంట్లోకి వెళ్లి శిశువునూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగ పడి, ఆయన్ని ఆరాధించారు. తమ పెట్టెలు విప్పి, బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు.
\v 12 హేరోదు దగ్గరికి తిరిగి వెళ్ళ వద్దని దేవుడు వారిని కలలో హెచ్చరించినందువల్ల వాళ్ళు వేరే దారిన తమ స్వదేశం వెళ్ళిపోయారు.
\s ఈజిప్టు కు పలాయనం
\s5
\p
\v 13 వాళ్ళు వెళ్ళిన తరువాత ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి "లేచి బిడ్డనూ, తల్లినీ తీసుకొని ఐగుప్తు పారిపో. నేను నీకు మళ్ళీ చెప్పే వరకు అక్కడే ఉండు. ఎందుకంటే బిడ్డను చంపాలని హేరోదు వెతకబోతున్నాడు." అని అతనితో చెప్పాడు.
\v 14 యోసేపు లేచి, రాత్రి వేళ బిడ్డనూ తల్లినీ తీసికొని ఐగుప్తుకు తరలిపోయాడు.
\v 15 హేరోదు చనిపోయే వరకు అక్కడే ఉండిపోయాడు. 'ఐగుప్తు నుంచి నా కుమారుణ్ణి పిలిచాను' అని ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన మాట ఇలా నెరవేరింది.
\s పసి పిల్లల వధ
\s5
\p
\v 16 ఆ జ్ఞానులు తనను మోసగించారని హేరోదు గ్రహించి కోపంతో మండిపడ్డాడు. తాను జ్ఞానుల నుండి తెలుసుకున్న కాలం ప్రకారం బేత్లెహేములోనూ దాని పరిసర గ్రామాలన్నిటిలోనూ రెండేళ్ళు, అంతకు తక్కువ వయస్సు ఉన్న మగపిల్లలందరినీ చంపించాడు.
\s5
\v 17 దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇలా నెరవేరాయి.
\v 18 " ఏడుపు, రోదనలతో రామాలో ఒక స్వరం వినబడింది. రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తూ ఉంది. వారిని కోల్పోయి ఓదార్పు పొందలేక ఉంది."
\s ఈజిప్టు నుంచి నజరేతు రాక (లూకా 2:39,40)
\s5
\p
\v 19 హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు కలలో కనబడి
\v 20 "నీవు లేచి, బాలుణ్ణీ తల్లినీ తీసికొని ఇశ్రాయేలు దేశానికి వెళ్లు.
\v 21 బాలుడి ప్రాణం తీయాలని చూసేవాళ్ళు చనిపోయారు" అని చెప్పాడు. అప్పుడతడు లేచి, పిల్లవాణ్ణీ, తల్లినీ ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వచ్చాడు.
\s5
\v 22 అయితే అర్కెలా తన తండ్రి హేరోదుకు బదులు యూదయ ప్రాంతాన్ని
\v 23 పాలిస్తున్నాడని విని, అక్కడికి వెళ్లడానికి యోసేపు భయపడ్డాడు. దేవుడు అతన్ని కలలో హెచ్చరించగా గలలీ ప్రాంతానికి వెళ్లి, నజరేతు అనే ఊరిలో నివసించాడు. యేసును నజరేయుడు అని పిలుస్తారు అని ప్రవక్తలు చెప్పిన మాట ఈ విధంగా నెరవేరింది.
\s5
\c 3
\s బాప్తిసమిచ్చే యోహాను పరిచర్య (మార్కు 1:3-8; లూకా 3:2-17; యోహాను 1: 6-8, 19-28)
\p
\v 1 ఆ రోజుల్లో బాప్తిసమిచ్చే యోహాను వచ్చి
\v 2 "పరలోకరాజ్యం దగ్గరపడింది. పశ్చాత్తాప పడండి" అని యూదయ అరణ్యంలో బోధిస్తూ ఉన్నాడు.
\v 3 పూర్వం యెషయా ప్రవక్త చెప్పింది ఇతన్ని గురించే - "అరణ్యంలో ఒకని స్వరం ఇలా బిగ్గరగా పిలుస్తూ ఉంది. 'ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన తోవలు తిన్నగా చేయండి."
\s5
\v 4 ఈ యోహాను ఒంటె వెంట్రుకలతో నేసిన బట్టలూ నడుముకు తోలు నడికట్టు కట్టుకునేవాడు. అతని ఆహారం మిడతలు, అడవి తేనె.
\v 5 యెరూషలేము, యూదయ ప్రాంతం, యొర్దాను నదీ ప్రాంతాల వారంతా అతని దగ్గరకు వచ్చి,
\v 6 తమ పాపాలు ఒప్పుకొంటూ యొర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుతూ ఉన్నారు.
\s5
\v 7 చాలామంది పరిసయ్యులూ సద్దూకయ్యులూ బాప్తిసం పొందడానికి రావడం చూసి అతడు "మీరు విషసర్పాల పిల్లలు. రాబోయే దైవాగ్రహాన్ని తప్పించుకోమని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
\v 8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి.
\v 9 'అబ్రాహాము మా తండ్రి' అని మీలో మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుంచి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడని మీతో చెబుతున్నాను.
\s5
\v 10 ఇప్పటికే గొడ్డలి, చెట్ల వేరుకు ఆనించి ఉంది. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో పడేస్తారు.
\v 11 పశ్చాత్తాపానికి అనుగుణంగా నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తూ ఉన్నాను. కానీ నా కంటే గొప్పవాడు నా తరువాత వస్తున్నాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.
\v 12 తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి తన గోదుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు" అని చెప్పాడు.
\s యేసు బాప్తిసం (మార్కు 1:9-11; లూకా 3:21,22; యోహాను 1: 31-34)
\s5
\p
\v 13 ఆ సమయాన యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలలీ ప్రాంతం నుండి యొర్దాను నది దగ్గరకు వచ్చాడు.
\v 14 అయితే యోహాను "నేను నీచేత బాప్తిసం పొందాల్సి ఉంటే నీవు నా దగ్గరకు వస్తున్నావా?" అని ఆయన్ని నివారింప జూశాడు గానీ
\v 15 యేసు "ఇప్పటికి కానివ్వు. నీతి అంతా ఇలా నెరవేర్చడం మనకు సబబే" అని అతనికి జవాబిచ్చాడు, కాబట్టి అతడు ఆ విధంగా చేశాడు.
\s5
\v 16 యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురం లాగా దిగి తన మీదికి వాలడం ఆయన చూశాడు.
\v 17 "ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం" అని ఒక స్వరం ఆకాశం నుండి వినిపించింది.
\s5
\c 4
\s యేసు ఎదుర్కొన్న పరీక్ష (మార్కు 1: 12, 13; లూకా 4: 1- 13; అది 3: 6)
\p p
\v 1 అప్పుడు సాతాను యేసును పరీక్షించడం కోసం ఆత్మ ఆయన్ను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు.
\v 2 నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది.
\v 3 శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి "నీవు దేవుని కుమారుడివయితే ఈ రాళ్ళు రొట్టెలైపోవాలని ఆజ్ఞాపించు" అన్నాడు.
\v 4 అందుకు ఆయన "మనిషి కేవలం ఆహారంతోనే బతకడు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్లా బతుకుతాడు అని రాసి ఉంది" అన్నాడు.
\s5
\v 5 అప్పుడు సాతాను ఆయన్ని పవిత్ర నగరం తీసుకు పోయి, దేవాలయ శిఖరంపై నిలబెట్టి
\v 6 "నీవు దేవుని కుమారుడివయితే కిందికి దూకు. ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. 'నీ పాదానికి రాయి తగలకుండా వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తి పట్టుకుంటారు' అని రాసి ఉంది" అన్నాడు.
\s5
\v 7 "'ప్రభువయిన నీ దేవుణ్ణి నీవు పరీక్షించకూడదు' అని కూడా రాసి ఉంది" అని యేసు అతనితో అన్నాడు.
\v 8 మళ్ళీ సాతాను చాలా ఎత్తయిన ఒక కొండపైకి ఆయన్ని తీసుకుపోయి, ప్రపంచ రాజ్యాలను, వాటి వైభవాన్నీ ఆయనకు చూపించాడు.
\v 9 "నీవు సాష్టాంగపడి నన్ను పూజిస్తే ఇదంతా నీకిస్తాను" అన్నాడు.
\s5
\v 10 అప్పుడు యేసు "సాతానా! అవతలికి పో! 'ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయననే నువ్వు సేవించాలి' అని రాసి ఉంది" అన్నాడు.
\v 11 అప్పుడు సాతాను ఆయన్ని విడిచి వెళ్లిపోయాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారాలు చేసారు.
\s యేసు తన బహిరంగ పరిచర్య ఆరంభంలో కపెర్నహూముకు రాక (మార్కు 1:14; లూకా 4:14,15)
\s5
\p
\v 12 యోహానును చెరసాలలో వేశారని యేసు విని గలలీ ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు.
\v 13 నజరేతు విడిచి వెళ్లి కపెర్నహూము లో నివసించాడు. అది గలలీ సముద్ర తీరాన జెబూలూను నఫ్తాలి ప్రాంతాలలో ఉంది.
\s5
\v 14 యెషయా ప్రవక్త ద్వారా పలికింది ఈ విధంగా నెరవేరింది.
\v 15 "జెబూలూను నఫ్తాలి ప్రాంతాలు, యొర్దాను నది అవతల సముద్రం వైపున్న యూదేతరుల గలలీ రాష్ట్రం ప్రాంతాల్లో చీకటిలో కూర్చున్న ప్రజలూ గొప్ప వెలుగు చూశారు.
\v 16 చావు నీడలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించింది."
\s5
\v 17 అప్పటినుంచి యేసు, "పరలోక రాజ్యం దగ్గర పడింది. పశ్చాత్తాపపడండి" అంటూ బోధించడం మొదలు పెట్టాడు.
\s పేతురు అంద్రెయలకు పిలుపు (మార్కు 1: 16-20; లూకా 5: 2-11)
\s5
\p
\v 18 యేసు గలలీ సముద్ర తీరాన నడుస్తూ, ఇద్దరు అన్నదమ్ములు సముద్రంలో వల వేయడం చూశాడు. వాళ్ళు పేతురు అనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ. వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు.
\v 19 యేసు వారితో, "నా వెంట రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను" అని పిలిచాడు.
\v 20 వెంటనే వాళ్ళు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంట వెళ్ళారు.
\s జెబెదయి కుమారులు యాకోబు, యోహానుల కు పిలుపు
\s5
\p
\v 21 యేసు అక్కడనుంచి వెళ్తూ ఇంకో ఇద్దరు అన్న దమ్ములను చూశాడు. వాళ్ళు జెబెదయి కొడుకులు యాకోబు, యోహాను. వాళ్ళు తమ తండ్రి జెబెదయి దగ్గర పడవలో తమ వలలు బాగుచేసుకుంటుంటే చూసి పిలిచాడు.
\v 22 వెంటనే వాళ్ళు తమ పడవనూ తమ తండ్రినీ విడిచిపెట్టి ఆయన్ని వెంట వెళ్ళారు.
\s5
\v 23 యేసు వారి సమాజ మందిరాలలో బోధిస్తూ, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రజలలో ఉన్న ప్రతి వ్యాధినీ రోగాన్నీ బాగు చేస్తూ గలలీ ప్రాంతమంతా తిరిగాడు.
\v 24 ఆయన పేరు సిరియ దేశమంతా తెలిసిపోయింది. రక రకాల రోగాలతో నొప్పులతో బాధపడుతున్నవాళ్ళనీ దయ్యాలు పట్టిన వాళ్ళనీ మూర్ఛ రోగుల్నీ పక్షవాతం వచ్చిన వాళ్ళనీ ఆయన దగ్గరికి తీసుకు వస్తే ఆయన వాళ్ళని బాగు చేశాడు.
\v 25 గలలీ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రాంతాల నుండీ యొర్దాను అవతలి ప్రాంతం నుండీ ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన వెంట వెళ్ళారు.
\s5
\c 5
\s పర్వత ప్రసంగం (లూకా 6:20- 49). నవ ధన్యతలు (లూకా 6: 20-23)
\p
\v 1 యేసు ఆ ప్రజా సమూహాన్ని చూచి కొండ ఎక్కి వెళ్లి కూర్చోగానే ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు.
\v 2 ఆయన ఇలా ఉపదేశించసాగాడు.
\v 3 "ఆత్మలో దీనులుగా ఉన్న వాళ్ళు ధన్యులు, పరలోకరాజ్యం వారిదే.
\v 4 దుఃఖించే వాళ్ళు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుంది.
\s5
\v 5 సాధు గుణం గల వాళ్ళు ధన్యులు, ప్రపంచానికి వాళ్ళు వారసులు.
\v 6 నీతి కోసం ఆకలిదప్పులు ఉన్న వాళ్ళు ధన్యులు, వారికి తృప్తి కలుగుతుంది.
\v 7 దయ చూపే వాళ్ళు ధన్యులు, వారికి దయ లభిస్తుంది.
\v 8 పవిత్ర హృదయం గల వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవున్ని చూస్తారు.
\s5
\v 9 శాంతి కుదిర్చే వాళ్ళు ధన్యులు, వారిని దేవుని కుమారులు అంటారు.
\v 10 నీతి కోసం నిలబడి హింసల పాలయ్యే వాళ్ళు ధన్యులు, పరలోక రాజ్యం వారిది.
\s5
\v 11 నన్ను బట్టి మనుషులు మిమ్మల్ని అవమానించి, హింసించి మీమీద అన్ని రకాల అపనిందలు అన్యాయంగా వేసినప్పుడు మీరు ధన్యులు.
\v 12 అప్పుడు సంతోషించండి! చాలా ఆనందించండి. పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు ముందు వచ్చిన ప్రవక్తల్ని కూడా మనుషులు ఇలాగే హింసించారు.
\s విశ్వాసి పోలికలు (మార్కు 4: 21-23; లూకా 8: 16-18)
\s5
\p
\v 13 లోకానికి మీరు ఉప్పు. ఉప్పు తన రుచి కోల్పోతే దానికి ఆ రుచి మళ్ళీ ఎలా వస్తుంది? అలాంటి ఉప్పు బయట పారేసి కాళ్ళకింద తొక్కడానికి తప్ప ఇంక దేనికీ పనికిరాదు.
\v 14 ప్రపంచానికి మీరు వెలుగు. కొండ మీద ఉండే ఊరు కనబడకుండా ఉండదు.
\s5
\v 15 ఎవరూ దీపం వెలిగించి బుట్ట కింద పెట్టరు. దీపస్తంభం మీదే పెడతారు. అప్పుడా దీపం ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది.
\v 16 మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింప జేయండి. అప్పుడు వారు మీ మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని కీర్తిస్తారు.
\s క్రీస్తుకు ధర్మశాస్త్రం తో సంబంధం
\s5
\p
\v 17 నేను ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటల్ని గానీ రద్దు చేయడానికి వచ్చాననుకోవద్దు. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దుచేయడానికి కాదు.
\v 18 నేను కచ్చితంగా చెబుతున్నాను, ఆకాశమూ భూమీ నశించే వరకు, ధర్మశాస్త్రమంతా నెరవేరేవరకు దాని నుంఛి ఒక్క పొల్లు అయినా ఒక సున్న అయినా తప్పిపోదు.
\s5
\v 19 కాబట్టి ఈ ఆజ్ఞలలో ఎంత చిన్న దానినైనా సరే అతిక్రమించి, అలా చేయమని బోధించే వాణ్ణి పరలోకరాజ్యంలో తక్కువ వాడుగా ఎంచుతారు. కానీ వాటిని తానూ తాను చేస్తూ బోధించేవాడిని పరలోక రాజ్యంలో గొప్పవానిగా లెక్కిస్తారు .
\v 20 ధర్మశాస్త్ర పండితుల, పరిసయ్యుల నీతి కన్నా మీ నీతి మిన్నగా ఉండక పోతే మీరు పరలోకరాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించలేరని మీతో చెబుతున్నాను.
\s5
\v 21 'హత్య చేయకూడదు. హత్య చేసేవానికి శిక్ష పడుతుంది' అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు.
\v 22 అయితే నేను మీతో చెప్పేదేమిటంటే తన సోదరుని మీద కోపం పెట్టుకొనే ప్రతివానికీ శిక్ష పడుతుంది. తన సోదరుణ్ణి 'పనికిమాలినవాడా' అనే ప్రతివాడూ మహాసభ ఎదుట నిలబడాలి. 'మూర్ఖుడా' అనే ప్రతివానికీ నరకాగ్ని తప్పదు.
\s5
\v 23 కాబట్టి నీవు నీ కానుకను బలిపీఠం వద్ద అర్పించే ముందు, నీ సోదరునికి నీ మీద విరోధ భావం ఉందని నీకు గుర్తుకు వస్తే
\v 24 నీ కానుక అక్కడే, బలిపీఠం ఎదుటనే వదిలి వెళ్ళు. ముందు నీ సోదరునితో రాజీ పడు. ఆ తర్వాత వచ్చి నీ కానుక అర్పించు.
\s5
\v 25 నీ ప్రత్యర్ధి తో న్యాయ స్థానానికి వెళ్ళే దారిలోనే త్వరగా రాజీ పడు. లేకపోతే నీ ప్రత్యర్ధి నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో. ఆ న్యాయాధిపతి నిన్ను అధికారికి అప్పగించి చెరసాలలో వేయిస్తాడేమో.
\v 26 చెల్లించాల్సి ఉన్న దాన్నంతా చెల్లించే వరకూ అక్కడ నుండి బయట పడలేవని కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\v 27 'వ్యభిచారం చేయకూడదు' అని చెప్పడం మీరు విన్నారు గదా
\v 28 కానీ నేను మీతో చెప్పేదేంటంటే ఒక స్త్రీని కామపు చూపు చూస్తే అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు.
\s5
\v 29 నీవు పాపం చేయడానికి నీ కుడి కన్ను కారణమయితే దానిని పీకి పారవెయ్యి. నీ శరీర మంతా నరకంలో పడడం కంటే శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.
\v 30 నీ కుడిచెయ్యి నీవు పాపం చేయడానికి కారణమయితే దానిని నరికి పారవెయ్యి. నీ శరీర మంతా నరకం లో పడడం కంటే నీ శరీర భాగాల్లో ఒకటి పోవడం నీకు మంచిది గదా.
\s విడాకుల గురించి యేసు ఉపదేశం (మత్తయి 13: 3-11; మార్కు 10: 2-12; 1 కొరింతి 7: 10- 15)
\s5
\p
\v 31 'తన భార్యను వదిలేసేవాడు ఆమెకు విడాకులు రాసి ఇవ్వాలి' అని చెప్పడం కూడా మీరు విన్నారు.
\v 32 నేను మీతో చెప్పేదేంటంటే వ్యభిచార కారణం లేకుండా తన భార్యను వదిలేసే ప్రతివాడూ ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. వదిలేసిన ఆమెను పెళ్లి చేసుకొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
\s కచ్చితమైన మాట
\s5
\p
\v 33 'నీవు అబద్ధ ప్రమాణం చేయకూడదు. ప్రభువుకు చేసిన ప్రమాణాలను నిలబెట్టుకోవాలి' అని పూర్వికులకు చెప్పింది మీరు విన్నారు గదా.
\v 34 అయితేనేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు. అది దేవుని సింహాసనం. భూమి తోడు అనవద్దు.
\v 35 అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడు అనవద్దు. అది మహారాజు నగరం.
\s5
\v 36 నీ తల తోడని ప్రమాణం చేయవద్దు. నీవు ఒక వెంట్రుకైనా తెల్లగా గాని నల్లగా గాని చేయలేవు.
\v 37 మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టే ఉండాలి. అలా కానిది సాతాను సంబంధమైనదే.
\s5
\v 38 'కంటికి బదులుగా కన్ను, పన్నుకు బదులుగా పన్ను' అని చెప్పింది మీరు విన్నారు గదా.
\v 39 కానీ నేను మీతో చెప్పేదేంటంటే దుష్టుణ్ణి ఎదిరించ వద్దు. ఎవరైనా నీ కుడిచెంప మీద నిన్ను కొడితే అతన్ని మరొక చెంప మీద కూడా కొట్టనియ్యి.
\s5
\v 40 ఎవరైనా నీ అంగీ విషయం వాదం పెట్టు కుంటే అతనికి నీ పైచొక్కా కూడ ఇచ్చివెయ్యి.
\v 41 ఎవరైనా ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే అతనితో రెండు మైళ్లు వెళ్లు.
\v 42 నిన్ను అడిగిన వానికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వానికి నీ ముఖం చాటు చేయవద్దు.
\s ధర్మశాస్త్రానికి మించిన నీతి
\s5
\p
\v 43 'నీ పొరుగు వాణ్ణి ప్రేమించి, నీ శత్రువును ద్వేషించు' అని చెప్పింది మీరు విన్నారు గదా.
\v 44 నేను మీతో చెప్పేదేంటంటే, మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించే వారికోసం ప్రార్థించండి.
\v 45 ఆ విధంగా మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి కుమారులవుతారు. ఎందుకంటే ఆయన చెడ్డవారికీ మంచి వారికీ తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులకూ, దుర్మార్గులకూ వాన కురిపిస్తున్నాడు.
\s5
\v 46 మిమ్మల్ని ప్రేమించేవారినే ప్రేమిస్తే మీకు ఏం లాభం? పన్నులు వసూలు చేసేవాళ్ళు కూడా అలాగే చేస్తారు గదా.
\v 47 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువ ఏమి చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా.
\v 48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరూ పరిపూర్ణులై ఉండండి.
\s5
\c 6
\s పర్వత ప్రసంగం- బాహ్యాచారాలపై విమర్శ
\p
\v 1 ప్రజలకు కనిపించేలా వారి ముందు మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్తపడండి. లేకపోతే పరలోకంలోని మీ తండ్రి దగ్గర మీకు ఏ ఫలమూ రాదు.
\v 2 కాబట్టి దానం చేసేటప్పుడు దొంగ భక్తుల్లాగా మీ ముందు బాకా ఊదించు కోవద్దు. ప్రజలు తమను మెచ్చుకోవాలని ఈ కపట భక్తులు సమాజ మందిరాలలో, వీధుల్లో అలా చేస్తారు. వారి ప్రతిఫలం వారికి దొరికిందని కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\v 3 నువ్వైతే దానం చేసేటప్పుడు నీ కుడిచెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియనీయవద్దు.
\v 4 అప్పుడు ఏకాంతంలో చేసే వాటిని చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.
\s5
\v 5 మీరు ప్రార్థనచేసేటప్పుడు దొంగ భక్తుల లాగా ఉండవద్దు. ప్రజలకు కనబడాలని వాళ్ళు సమాజ మందిరాలలో, వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వాళ్ళు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను.
\v 6 నీవు ప్రార్థన చేసేటప్పుడు, నీ లోపలి గదిలోకి వెళ్లి తలుపు వేసి, ఏకాంతంలో నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యంగా చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.
\v 7 మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరులలాగా వృథా మాటలు పదే పదే పలక వద్దు. చాలా ఎక్కువ మాట్లాడితేనే దేవుడు వింటాడని వాళ్ళు అనుకుంటున్నారు.
\s ప్రార్థన గురించి సరికొత్త ఉపదేశం (లూకా 11: 1-3)
\s5
\p
\v 8 కాబట్టి మీరు వారి లాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు
\v 9 కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. "పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రంగా ఉండాలి.
\v 10 నీ రాజ్యం రావాలి. పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరాలి.
\s5
\v 11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ఇవ్వండి.
\v 12 మాపట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్టు మా అపరాధాలు క్షమించండి.
\v 13 మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించండి."
\s5
\v 14 మనుషుల అతిక్రమాలను మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి కూడా మీ అతిక్రమాలను క్షమిస్తాడు.
\v 15 మీరు మనుషుల అక్రమాలను క్షమించక పోతే మీ తండ్రి కూడా మీ అక్రమాలను క్షమించడు.
\s5
\v 16 మీరు ఉపవాసం చేసేటప్పుడు దొంగ భక్తుల లాగా మీ ముఖాలు నీరసంగా పెట్టుకోవద్దు. తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడాలని వాళ్ళు తమ ముఖాలను వికారం చేసుకుంటారు. వాళ్ళు తమ ప్రతిఫలం పొందారని కచ్చితంగా చెబుతున్నాను.
\v 17 అయితే మీరు ఉపవాసం ఉన్నపుడు తలకు నూనె రాసుకుని ముఖం కడుక్కోండి
\v 18 అప్పుడు ప్రజలకు కాక, ఏకాంతంలో ఉన్న నీ తండ్రికే కనబడతావు. అప్పుడు ఏకాంతంలో చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు.
\s5
\v 19 భూమిమీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు. ఇక్కడ చెదలూ తుప్పూ తినివేస్తాయి. దొంగలు పడి దోచుకుంటారు.
\v 20 పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలు గానీ, తుప్పు గానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు.
\v 21 నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది.
\s5
\v 22 శరీరానికి దీపం కన్ను. కాబట్టి నీ కన్నుబాగుంటే నీ శరీర మంతా వెలుగుతో నిండి ఉంటుంది.
\v 23 నీ కన్ను బాగోపోతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుచేత నీలో ఉన్న వెలుగు వాస్తవంగా చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా!
\v 24 ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకనికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగేదేవునికీ సంపదకూ సేవ చేయడం కుదరదు.
\s దిగులుకు విరుగుడు- తండ్రిపై నమ్మకం
\s5
\p
\v 25 అందుచేత నేను మీతో చెప్పేదేంటంటే, ఏమి తినాలి? ఏమి తాగాలి? అని మీ జీవితాన్ని గురించి గానీ, ఏమి కట్టుకోవాలి? అని మీ శరీరం గురించి గానీ బెంగ పెట్టుకోవద్దు. తిండి కంటే జీవితమూ బట్టల కంటే శరీరమూ ఎక్కువే కదా!
\v 26 ఎగిరే పక్షుల్ని చూడండి. అవి విత్తనాలు నాటవు, కోతకోయవు, కొట్లలో ధాన్యం కూర్చుకోవు. అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటె ఎంతో విలువైన వాళ్ళు కాదా?
\s5
\v 27 ఆందోళనపడి మీలో ఎవరు తన జీవిత కాలాన్ని కాస్త పెంచుకోగలడు?
\v 28 బట్టల గురించి మీకు ఎందుకంత దిగులు? పొలాల్లోని పూలు ఎలా పూస్తున్నాయో ఆలోచించండి. అవి శ్రమ పడవు, బట్టలు నేయవు.
\v 29 అయినా నేనంటాను, తన వైభవమంతటితో ఉన్న సొలొమోను రాజుకు సయితం వీటిలో ఒక్క దాని కున్నంత అలంకారం లేదు.
\s5
\v 30 ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేసే పొలంలోని గడ్డిని దేవుడు ఇంతగా అలంకరిస్తుంటే, అల్ప విశ్వాసులారా, ఆయన మరింకెంతగా మిమ్మల్ని అలంకరిస్తాడో గదా!
\v 31 కాబట్టి ఏమి తినాలో ఏమి తాగాలో ఏమీ కట్టుకోవాలో అని దిగులు పడొద్దు. దేవుడంటే తెలియని వాళ్ళు వీటి కోసం తాపత్రయ పడతారు.
\s5
\v 32 ఇవన్నీ మీకు అవసరమని మీ పరలోకపు తండ్రికి తెలుసు.
\v 33 అయితే మీరు మొట్ట మొదట దేవుని రాజ్యాన్నీ ఆయన నీతినీ వెదకండి. అప్పుడు ఆయన వీటన్నిటినీ మీకు అందిస్తాడు.
\v 34 కాబట్టి రేపటి విషయం దిగులు పడవద్దు. దాని సంగతి అదే చూచుకుంటుంది. ఏరోజు కష్టం ఆ రోజుకు చాలు.
\s5
\c 7
\s పర్వత ప్రసంగం- ఇతరులను తప్పులెన్నడం
\p
\p
\v 1 ఇతరులకు తీర్పు తీర్చవద్దు అప్పుడు మిమ్మల్నీ తీర్పు తీర్చరు.
\v 2 మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలత ప్రకారమే మీకూ దొరుకుతుంది.
\s5
\v 3 నీ కంటిలో ఉన్న దుంగను గమనించుకోకుండా నీ సాటి మనిషి కంటిలోని నలుసు ఎందుకు చూస్తావు?
\v 4 నీ కంటిలో దుంగను ఉంచుకుని నీ సోదరునితో "నీ కంటిలోని నలుసు తీయనివ్వు" అని ఎందుకు చెప్తావు?
\v 5 కపట వేషధారీ ! మొదట నీ కంటిలో ఉన్న దుంగను తీసివేసికో, అప్పుడు నీ సోదరుని కంటిలోఉన్న నలుసు తీసివేయడానికి అది నీకు స్పష్టంగా కనబడుతుంది.
\s5
\v 6 పవిత్రమైనదాన్ని కుక్కలకు పెట్ట వద్దు. మీ ముత్యాలు పందుల ముందు వేయొద్దు. అలాచేస్తే పందులు వాటిని కాళ్ళతో తొక్కేస్తాయి. కుక్కలు మీమీద పడి మిమ్మల్ని చీల్చి వేస్తాయేమో.
\s ప్రార్థనకు ప్రోత్సాహం (లూకా11: 1-13)
\s5
\p
\v 7 అడగండి. మీకు ఇస్తారు. వెదకండి. మీకు దొరుకుతుంది. తట్టండి. మీకు తలుపు తీస్తారు.
\v 8 అడిగే ప్రతివానికీ లభిస్తుంది. వెదికే వానికి దొరుకుతుంది. తట్టే వానికి తలుపు తెరవడం జరుగుతుంది.
\v 9 మీలో ఎవరైనా, తన కొడుకు రొట్టె అడిగితే వాడికి రాయి ఇస్తాడా? చేప అడిగితే పామునిస్తాడా?
\v 10 మీరు చెడ్డ వాళ్ళు అయినా మీ పిల్లలకు మంచి బహుమతులు ఎలా ఇవ్వాలో తెలుసు గదా!
\s5
\v 11 అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి అంతకంటే మంచి బహుమతులు కచ్చితంగా ఇస్తాడు.
\s రెండు దారులు (కీర్తన 1)
\p
\v 12 కాబట్టి మనుషులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి. ధర్మశాస్త్రమూ ప్రవక్తల ఉపదేశమూ ఇదే.
\s5
\v 13 ఇరుకు ద్వారం ద్వారా ప్రవేశించండి. నాశనానికి పోయే ద్వారం వెడల్పు. దారి విశాలం. దాని ద్వారా చాలా మంది ప్రవేశిస్తారు.
\v 14 జీవానికి దారితీసే ద్వారం ఇరుకు. దారి కష్టం. దాన్ని కనుక్కొనే వాళ్ళు కొంతమందే.
\s కపట బోధకుల గురించి హెచ్చరికలు
\s5
\p
\v 15 అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొర్రె తోలు కప్పుకుని మీ దగ్గరికి వస్తారు. కాని లోలోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్లు.
\v 16 వారు చేసే పనుల ప్రతి ఫలాన్ని బట్టి వారిని తెలుసుకోవచ్చు. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లు గానీ పల్లేరు మొక్కల్లో అంజూర పండ్లు గానీ కోస్తారా?
\v 17 అలాగే ప్రతి మంచి చెట్టు మంచి పండ్లు కాస్తుంది. పనికిమాలిన చెట్టు, పనికి మాలిన పండ్లు కాస్తుంది.
\s5
\v 18 మంచి చెట్టు పనికిమాలిన పండ్లు కాయదు. పనికిమాలిన చెట్టు మంచి పండ్లు కాయదు.
\v 19 మంచి పండ్లు కాయని ప్రతిచెట్టునూ నరికి మంటల్లో వేస్తారు.
\v 20 ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు.
\s విశ్వాసం లేకుండా నోటి మాటల వల్ల లాభం లేదు
\s5
\p
\v 21 "ప్రభూ, ప్రభూ," అని నన్ను పిలిచే వారందరూ పరలోకరాజ్యంలో ప్రవేశించరు, పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్ట ప్రకారం చేసే వారే ప్రవేశిస్తారు.
\v 22 ఆ రోజున చాలామంది నాతో, "ప్రభూ, ప్రభూ, మేము నీ పేరున ప్రవచించలేదా? నీ పేరున దయ్యాల్ని వెళ్ళగొట్టలేదా? నీ పేరున చాలా అద్భుతాలు చేయలేదా?" అంటారు.
\v 23 అప్పుడు నేను "దుర్మార్గులారా, నేను మిమ్మల్ని అసలు ఎరగను. నా దగ్గర నుండి వెళ్లి పొండి" అంటాను.
\s రెండు రకాల పునాదులు
\s5
\p
\v 24 కాబట్టి నా ఈ మాటలు విని వాటి ప్రకారం జీవించేవాడు గట్టి నేల మీద తన యిల్లు కట్టుకున్న తెలివిగల వాడిలాగా ఉంటాడు.
\v 25 వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెను గాలులు ఆ యింటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు.
\s5
\v 26 నా ఈ మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతివాడూ ఇసుక మీద తన యిల్లు కట్టుకున్న తెలివిలేని వాడిలా ఉంటాడు.
\v 27 వాన కురిసింది. వరదలు వచ్చాయి. గాలులు వీచి ఆ యింటి మీద కొట్టాయి. అప్పుడది కూలి పోయింది. అది ఘోరమైన పతనం."
\s5
\v 28 యేసు ఈ మాటలు చెప్పి ముగించిన తర్వాత ప్రజలు ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారు.
\v 29 ఎందుకంటే ఆయన వారి ధర్మశాస్త్ర పండితుల్లా కాక అధికారం గల వాడి లాగా వారికి బోధించాడు.
\s5
\c 8
\s యేసు కుష్టరోగిని బాగు చేయడం
\p
\v 1 ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు.
\v 2 ఒక కుష్టురోగి వచ్చి ఆయనకు మొక్కి "ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు" అన్నాడు.
\v 3 యేసు చేయి చాపి అతణ్ణి తాకి"నాకిష్టమే, నువ్వు బాగుపడు" అన్నాడు. వెంటనే అతని కుష్టు రోగం నయమైంది.
\s5
\v 4 అప్పుడు యేసు అతనితో "చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. వెళ్ళి యాజకుడికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే నియమించిన కానుక అర్పించు" అని చెప్పాడు.
\s యేసు శతాధిపతి సేవకుణ్ణి బాగు చేయడం (లూకా7: 1- 10)
\s5
\p
\v 5 యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి,
\v 6 "ప్రభూ, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు" అని చెప్పాడు.
\v 7 "నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను" అని యేసు అతనితో అంటే
\s5
\v 8 ఆ శతాధిపతి "ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మాట మాత్రం అనండి. పనివాడు బాగుపడతాడు.
\v 9 నేను కూడా అధికారం కింద ఉన్న వాడినే. నా చేతి కింద కూడా సైనికులున్నారు. నేను ఎవరినైనా 'వెళ్ళు' అంటే వెళ్తాడు. ఎవరినైనా 'రా' అంటే వస్తాడు. నా పనివాణ్ణి 'ఇది చెయ్యి' అంటే చేస్తాడు" అని జవాబిచ్చాడు.
\v 10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, తన వెంట వస్తున్న వారితో అన్నాడు "ఇశ్రాయేలు ప్రజలలో కూడా ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\v 11 తూర్పు నుంచీ పడమర నుంచీ చాలా మంది వచ్చి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో పాటు పరలోక రాజ్యంలో కూర్చుంటారు.
\v 12 అయితే రాజ్యానికి చెందిన వారిని బయట చీకట్లోకి తోసేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి."
\v 13 యేసు శతాధిపతితో " వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది" అన్నాడు. ఆ క్షణంలోనే అతని పనివాడు బాగు పడ్డాడు.
\s పేతురు అత్తకు స్వస్థత (మార్కు 1:29-34; లూకా 4: 38-41)
\s5
\p
\v 14 తరువాత యేసు, పేతురు ఇంటిలోకి వెళ్లి, జ్వరంతో పడుకున్న అతని అత్తను చూశాడు.
\v 15 యేసు ఆమె చేతిని ముట్టగానే జ్వరం పోయింది. అప్పుడామె లేచి ఆయనకు సేవ చేయసాగింది.
\s5
\v 16 సాయంకాలం అయినప్పుడు దయ్యాలు పట్టిన చాలామందిని ప్రజలు ఆయన దగ్గరకు తీసుకువచ్చారు.
\v 17 ఆయన ఒక్క మాటతో దయ్యాలను వెళ్ళగొట్టి రోగులందరినీ బాగు చేసాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే, "ఆయనే మన బాధలను భరించాడు. మన రోగాలను సహించాడు."
\s5
\v 18 యేసు తన చుట్టూ ఉన్న పెద్ద గుంపుల్ని చూచి గలలీ సరస్సు అవతలికి వెళ్దామని ఆదేశించాడు.
\s శిష్యులుగా ఉండగోరే వారికి పరీక్ష (లూకా 9: 57- 62)
\p
\v 19 అప్పుడు ధర్మశాస్త్ర పండితుడు ఒకడు వచ్చి "బోధకుడా! నీవు ఎక్కడికి వెళ్ళినా సరే, నేను నీ వెంటే వస్తాను" అన్నాడు.
\v 20 అందుకు యేసు అతనితో "నక్కలకు గుంటలున్నాయి. పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మానవ పుత్రునికి మాత్రం తల వాల్చుకునే స్థలం కూడా లేదు" అన్నాడు.
\s5
\v 21 ఆయన శిష్యులలో మరొకడు "ప్రభూ, మొట్టమొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టడానికి నాకు అనుమతి ఇవ్వండి" అని ఆయన్ని అడిగాడు.
\v 22 అయితే యేసు అతనితో "నాతో రా. చనిపోయిన వాళ్ళని పాతి పెట్టడానికి చనిపోయిన వాళ్ళు ఉన్నారులే!" అన్నాడు.
\s యేసు తుఫానును ఆపడం (మార్కు 4: 36- 41; లూకా 8: 22-25)
\s5
\p
\v 23 ఆయన పడవ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయనతో వెళ్ళారు.
\v 24 సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు.
\v 25 వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి "ప్రభూ, చచ్చిపోతున్నాం. మమ్మల్ని రక్షించండి" అంటూ ఆయన్ని లేపారు.
\s5
\v 26 యేసు వారితో "అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకు భయపడుతున్నారు?" అని చెప్పి, లేచి గాలినీ సముద్రాన్నీ గద్దించాడు. అప్పుడు అంతా చాలా ప్రశాంతమై పోయింది.
\v 27 శిష్యులు ఆశ్చర్యపడి "ఈయన ఎలాంటివాడో గానీ గాలీ, సముద్రం ఈయన మాట వింటున్నాయే" అని చెప్పుకున్నారు.
\s గదరా ప్రదేశం లో యేసు దయ్యాలను వెళ్ళగొట్టడం (మార్కు 5: 1-21; లూకా 8: 26- 40)
\s5
\p
\v 28 ఆయన అవతలి ఒడ్డున ఉన్న గదరేనీయుల ప్రాంతం చేరుకున్నప్పుడు దయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తులు సమాధులలో నుంచి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చారు. వాళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తిస్తుండడం వలన ఎవడూ ఆ దారిన వెళ్లలేక పోయేవాళ్ళు.
\v 29 ఆ దయ్యాలు "దైవకుమారా, నీతో మాకేంటి? మా కాలం రాకముందే మమ్మల్ని వేధించడానికి వచ్చావా?" అని కేకలు వేసాయి.
\s5
\v 30 వారికి కొంత దూరంలో పెద్ద పందుల మంద మేస్తూ ఉంది.
\v 31 "నీవు మమ్మల్ని బయటికి వెళ్ల గొడితే, ఆ పందుల మందలోకి పోనియ్యి" అని యేసును ప్రాధేయపడ్డాయి.
\v 32 యేసు "పొండి" అని వాటితో అన్నాడు. అవి బయటికి వచ్చి ఆ పందుల మందలోకి చొరబడ్డాయి. వెంటనే ఆ మంద అంతా నిటారుగా ఉన్న కొండ మీద నుంచి వేగంగా పరుగెత్తుకుంటూ సముద్రంలో పడి చచ్చిపోయాయి.
\s5
\v 33 ఆ పందుల మందను కాసే వాళ్ళు పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్లి జరిగినదంతా, అంటే దయ్యాలు పట్టిన వాళ్ళ సంగతి తెలియజేశారు.
\v 34 అప్పుడు ఆ ఊరి వాళ్ళంతా యేసుకు ఎదురు వచ్చారు. ఆయన్ని చూచి తమ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోమని ఆయన్ని బతిమాలారు.
\s5
\c 9
\s యేసు కపెర్నహూముకు తిరిగి వచ్చి పక్షవాతరోగిని బాగు చేయడం (మార్కు 2:3-12; లూకా 5:18-36)
\p
\v 1 యేసు పడవ ఎక్కి సముద్రం దాటి తన స్వగ్రామం వచ్చాడు.
\v 2 కొంతమంది ఒక పక్షవాత రోగిని పడక మీదే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. యేసు వారి విశ్వాసం చూచి "బాబూ, ధైర్యం తెచ్చుకో. నీ పాపాలు క్షమించాను" అని ఆ పక్షవాత రోగితో చెప్పాడు.
\s5
\v 3 ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడని తమలో తాము అనుకుంటుంటే,
\v 4 యేసు వారి ఆలోచనలు గ్రహించి "మీరెందుకు మీ హృదయాలలో దురాలోచనలు చేస్తున్నారు?
\v 5 నీ పాపాలు క్షమించాను అని చెప్పడం తేలికా? లేచి నడవమని చెప్పడం తేలికా?
\v 6 అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి" అని చెప్పి, పక్షవాత రోగితో, "నీవు లేచి నీ పడక తీసుకుని ఇంటికి వెళ్ళు" అన్నాడు.
\s5
\v 7 అతడు లేచి తన యింటికి వెళ్ళిపోయాడు.
\v 8 ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు.
\s మత్తయి పిలుపు (మార్కు 2:14; లూకా 5: 27-29)
\p
\v 9 యేసు అక్కడనుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయి అనే ఒకతన్ని చూసాడు. యేసు అతనితో, "నా వెంట రా!" అన్నాడు. అతడు లేచి ఆయన్ని అనుసరించాడు.
\s5
\v 10 మత్తయి ఇంట్లో భోజనానికి యేసు కూర్చున్నపుడు చాలామంది పన్ను వసూలు చేసే వాళ్ళూ పాపులూ వచ్చి ఆయనతో ఆయన శిష్యులతో కూర్చున్నారు.
\v 11 పరిసయ్యులు అది గమనించి, "మీ బోధకుడు సుంకం వసూలు చేసే వాళ్ళతో పాపులతో కలిసి తింటున్నాడేంటి?" అని ఆయన శిష్యులను అడిగారు.
\s5
\v 12 యేసు అది విని "ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు, రోగికే అవసరం.
\v 13 పశ్చాత్తాపపడాలని నేను పాపులనే పిలవడానికి వచ్చాను గాని నీతిపరులను కాదు. కాబట్టి మీరు వెళ్లి 'మీరు బలి యాగాలు అర్పించడం కాదు, దయ చూపించాలనే కోరుతున్నాను' అనే వాక్యం భావం నేర్చుకోండి" అని చెప్పాడు.
\s5
\v 14 అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి "పరిసయ్యులూ మేమూ తరచుగా ఉపవాసం ఉంటాము గాని నీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకు?" అని ఆయన్ని అడిగారు.
\v 15 యేసు వారికిలా జవాబిచ్చాడు. "పెళ్లికొడుకు తమతో ఉన్నంత కాలం పెళ్లింట్లోని వాళ్ళు విచారంగా ఉంటారా? అయితే పెళ్ళికొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి. అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉంటారు.
\s రెండు ఉపమానాలు ( మార్కు 2:21; లూకా 5: 36- 39)
\s5
\p
\v 16 ఎవడూ పాత బట్టకు కొత్తబట్ట అతుకు వేయడు. వేస్తే ఆ అతుకు, బట్టను చించుతుంది, చినుగు పెద్దదవుతుంది.
\s5
\v 17 పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయరు. పోస్తే ఆ తిత్తులు పిగిలిపోయి, ద్రాక్షారసం కారిపోతుంది. తిత్తులు పాడైపోతాయి. అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోస్తారు. అప్పుడు ఆ రెండూ చెడిపోవు.
\s యేసు రుతు స్రావమున్న స్త్రీని బాగు చేయడం, యాయీరు కుమార్తెను బ్రతికించడం (మార్కు 5:22- 43; లూకా 8:41- 56)
\s5
\p
\v 18 ఆయన ఈ మాటలు వారితో చెబుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, "నా కూతురు ఇప్పుడే చనిపోయింది. అయినా నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది" అన్నాడు.
\v 19 అప్పుడు యేసు లేచి అతని వెంట వెళ్ళాడు. ఆయన శిష్యులు కూడా వెళ్ళారు.
\s5
\v 20 అప్పుడే పన్నెండేళ్ళ నుండి ఆగని రుతుస్రావంతో ఉన్న ఒక స్త్రీ
\v 21 ఆయన వెనకగా వచ్చి "నేను ఆయన పై బట్ట తాకితే బాగుపడతాను" అని తనలో తాను అనుకొని, ఆయన పై బట్ట తాకింది.
\v 22 యేసు వెనక్కి తిరిగి ఆమెను చూచి, "కుమారీ, ధైర్యంగా ఉండు. నీ నమ్మకం నిన్ను బాగుచేసింది" అన్నాడు. అదే క్షణంలో ఆ స్త్రీ బాగుపడింది.
\s5
\v 23 అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినపుడు అక్కడ వేణువులు వాయించేవారినీ గోల చేస్తున్న గుంపునూ చూచి
\v 24 " వెళ్ళిపోండి. అమ్మాయి చనిపోలేదు. నిద్ర పోతూ ఉంది" అన్నాడు. అయితే వాళ్ళు నవ్వి ఆయన్ని హేళన చేసారు.
\s5
\v 25 అయన ఆ గుంపును బయటకు పంపివేసి, లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ అమ్మాయి లేచింది.
\v 26 ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకిపోయింది.
\s ఇద్దరు గుడ్డి వారికి చూపు
\s5
\p
\v 27 యేసు అక్కడనుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివాళ్ళు ఆయనను అనుసరిస్తూ "దావీదు కుమారుడా, మామీద దయ చూపించు" అని కేకలు వేశారు.
\v 28 యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. యేసు వాళ్ళతో "నేను దీనిని చేయగలనని మీరు నమ్ముతున్నారా?" అని వారిని అడిగితే
\s5
\v 29 వాళ్లు "అవును ప్రభూ" అన్నారు. అప్పుడాయన వారి కళ్ళు ముట్టి "మీరు నమ్మినట్టే మీకు జరుగు గాక" అన్నాడు. వెంటనే వాళ్ళకు చూపు వచ్చింది.
\v 30 అప్పుడు యేసు, "ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకండి" అని వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు.
\v 31 అయినా వాళ్ళు బయటికి వెళ్లి ఆ ప్రాంతమంతా ఆ విషయాన్ని ప్రచారం చేసారు.
\s5
\v 32 యేసు, ఆయన శిష్యులు వెళ్తూ ఉంటే కొంతమంది దయ్యం పట్టిన ఒక మూగవాణ్ని ఆయన దగ్గరకు తీసికొని వచ్చారు.
\v 33 దయ్యాన్ని వెళ్లగొట్టిన తరువాత ఆ మూగవాడు మాటలాడాడు. అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి, "ఇశ్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు" అని చెప్పుకున్నారు.
\v 34 అయితే పరిసయ్యులు, "ఇతడు దయ్యాల రాజు వలన దయ్యాలను వెళ్లగొడున్నాడు" అన్నారు.
\s గలిలయలో పరిచర్య (మార్కు 6: 5,6)
\s5
\p
\v 35 యేసు వారి సమాజ మందిరాలలో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ, అన్ని రకాల రోగాల్నీ వ్యాధుల్నీ బాగుచేస్తూ అన్ని పట్టణాలలో గ్రామాలలో తిరిగాడు.
\v 36 ఆయన ప్రజాసమూహాలను చూసి వారి మీద జాలి పడ్డాడు. వాళ్ళు కాపరి లేని గొర్రెల లాగా అలిసి చెదిరిపోయి ఉన్నారు.
\s5
\v 37 ఆయన తన శిష్యులతో "కోత చాలా ఎక్కువగా ఉంది, కానీ కూలి వాళ్ళు తక్కువగా ఉన్నారు.
\v 38 కాబట్టి తన కోతకు కూలి వాళ్ళను త్వరగా పంపమని కోత యజమానిని వేడుకోండి" అని తన శిష్యులతో చెప్పాడు.
\s5
\c 10
\s యేసు పన్నెండు మందిని పంపించడం (మార్కు 6: 7- 13; లూకా 9: 1-6) ల
\p
\v 1 ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, అపవిత్రాత్మలను వెళ్లగొట్టడానికీ అన్నిరకాల రోగాల్నీ వ్యాధుల్నీ బాగుచేయడానికి, వారికి అధికారం ఇచ్చాడు.
\s5
\v 2 ఆ పన్నెండు మంది అపొస్తలుల పేర్లు ఇవి. మొట్ట మొదటిగా పేతురనే సీమోను, అతని సోదరుడు అంద్రెయ, జెబెదయి కొడుకు యాకోబు, అతని సోదరుడు యోహాను.
\v 3 ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరి మత్తయి, అల్ఫయి కొడుకు యాకోబు, తద్దయి అనే వేరొక పేరున్న లెబ్బయి,
\v 4 కనానీయుడు సీమోను, ఆయన్ని అప్పగించిన ఇస్కరియోతు యూదా.
\s5
\v 5 యేసు ఆ పన్నెండు మందిని పంపుతూ వారికి ఆజ్ఞాపించింది ఏమిటంటే, "మీరు యూదేతరుల ప్రాంతాల్లోకి వెళ్లొద్దు. సమరయ ప్రాంతంలోని ఏ ఊరిలోకీ వెళ్లొద్దు.
\v 6 ఇశ్రాయేలు వంశంలో దారి తప్పిన గొర్రెల దగ్గరికే వెళ్ళండి.
\v 7 వెళుతూ పరలోకరాజ్యం సమీపంగా ఉందని ప్రకటించండి.
\s5
\v 8 రోగులను బాగుచేయండి. చనిపోయినవారిని లేపండి. కుష్టురోగులను శుద్ధి చెయ్యండి. దయ్యాలను వెళ్లగొట్టండి. ఉచితంగా పొందారు. ఉచితంగానే ఇవ్వండి.
\v 9 బంగారం, వెండి, ఇత్తడి, ప్రయాణం కోసం పెట్టె, రెండు అంగీలు, చెప్పులు, చేతికర్ర, ఇవేవీ మీ సంచిలో ఉంచుకోవద్దు.
\v 10 ఎందుకంటే పనివాడు తన ఆహారానికి అర్హుడు.
\s5
\v 11 మీరు ఏదైనా పట్టణం లేదా ఊరిలో ప్రవేశించినప్పుడు దానిలో యోగ్యులెవరో అడిగి తెలుసుకోండి. అక్కడనుండి వెళ్ళే వరకు అతని ఇంట్లోనే అతిథిగా ఉండిపొండి.
\v 12 ఆ ఇంట్లో ప్రవేశిస్తూ ఇంటివారికి శుభం పలకండి.
\v 13 ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని లోకి వస్తుంది. దానిలో యోగ్యత లేకపోతే మీ శాంతి మీకు తిరిగి వచ్చేస్తుంది.
\s5
\v 14 ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకుండా మీ మాటలు వినకపోతే మీరు ఆ ఇంటిని గానీ ఆ ఊరు గానీ, విడిచి వెళ్లి పోయేటపుడు మీ పాదధూళి దులిపి వేయండి.
\v 15 తీర్పు దినాన ఆ పట్టణానికి పట్టే గతి కంటె సొదొమ గొమొర్రా నగరాల గతి నయంగా ఉంటుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\s 16 రానున్న గడ్డు రోజులు
\s5
\p
\v 16 తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పాముల్లాగా వివేకంగా , పావురాల్లాగా కపటం లేకుండా ఉండండి.
\v 17 మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని న్యాయస్థానాలకు అప్పగించి, తమ సమాజ మందిరాలలో మిమ్మల్ని కొరడాలతో కొట్టిస్తారు.
\v 18 వీరికీ యూదేతరులకూ సాక్ష్యార్థమై నాకోసం మిమ్మల్ని అధిపతుల దగ్గరికీ రాజుల దగ్గరికీ తెస్తారు.
\s5
\v 19 వాళ్ళు మిమ్మల్ని అప్పగించేటపుడు, 'ఎలా మాట్లాడాలి? ఏమి చెప్పాలి?' అని ఆందోళన పడవద్దు. మీరేమి చెప్పాలో అది ఆ సమయంలోనే దేవుడు మీకు తెలియ చేస్తాడు.
\v 20 మాటలాడేది మీరు కాదు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుతాడు.
\s5
\v 21 సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కొడుకునూ, చావుకు అప్పగిస్తారు. పిల్లలు తలిదండ్రుల మీద లేచి వారిని చంపిస్తారు.
\v 22 నా పేరు కోసం అందరూ మిమ్మల్ని ద్వేషిస్తారు. చివరి వరకు సహించేవారిని దేవుడు రక్షిస్తాడు.
\v 23 వాళ్ళు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసిస్తుంటే వేరే పట్టణానికి పారిపొండి. మనుష్య కుమారుడు వచ్చేలోగా మీరు ఇశ్రాయేలు గ్రామాలన్నిటికీ వెళ్లి ఉండరు అని కచ్చితంగా మీతో చెబుతున్నాను.
\s5
\v 24 గురువు కంటె శిష్యుడూ యజమాని కంటె పనివాడూ గొప్పవాడేమీ కాదు.
\v 25 శిష్యుడు తన గురువు లాగా, పనివాడు తన యజమానిలాగా ఉంటే చాలు. ఇంటి యజమానికి బయెల్జెబూలు అని వాళ్ళు పేరు పెట్టి ఉంటే అతని ఇంటి వారికి మరింత కచ్చితంగా ఆ పేరు పెడతారు గదా!
\s5
\v 26 కాబట్టి మీరు వారికి భయపడవద్దు. కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు.
\v 27 మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవిలో వినిపించేది మేడల పైన చాటించండి.
\s అభయం
\s5
\p
\v 28 ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు, ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగలవానికే భయపడండి.
\v 29 రెండు పిచ్చుకలు ఒక చిన్న నాణేనికి అమ్ముడవుతాయి గదా. అయినా మీ తండ్రి అనుమతి లేకుండా వాటిలో ఒకటి కూడా నేల కూలదు.
\v 30 మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్కంతా ఉంది.
\v 31 భయపడవద్దు. మీరు అనేక పిచ్చుకల కంటె ఎంతో విలువైన వారు.
\s5
\v 32 ప్రజల ముందు నన్ను ఒప్పుకొనే వాణ్ణి పరలోకంలో ఉన్న నా తండ్రి ముందు నేనూ ఒప్పుకుంటాను.
\v 33 ప్రజల ముందు ఎవడు నన్ను తెలియదంటాడో వాణ్ణి పరలోకం లో ఉన్న నా తండ్రి ముందు నేనూ తెలియదంటాను.
\s శిష్యుడు చెల్లించవలసిన వెల
\s5
\p
\v 34 నేను భూమి మీదికి శాంతి తేవడానికి వచ్చాననుకోవద్దు. కత్తి తేవడానికి వచ్చాను గానీ శాంతిని కాదు.
\v 35 అంటే ఒక మనిషి తన తండ్రికి వ్యతిరేకంగా, ఒక కూతురు తన తల్లికి వ్యతిరేకంగా, ఒక కోడలు తన అత్తకు వ్యతిరేకంగా అయ్యేలా చేస్తాను.
\v 36 తన ఇంటివాళ్ళే ఒక వ్యక్తికి శత్రువులుగా తయారవుతారు.
\s5
\v 37 నా కంటె ఎక్కువగా తండ్రిని గానీ తల్లిని గానీ ప్రేమించే వాడు నాకు తగినవాడు కాడు. నాకంటె ఎక్కువగా కుమారుని గానీ కుమార్తెను గానీ ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు.
\v 38 తన సిలువను ఎత్తికొని నావెంట రాని వాడు నాకు తగినవాడు కాడు.
\v 39 తన ప్రాణం దక్కించుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దానిని దక్కించుకుంటాడు.
\s5
\v 40 మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకుంటాడు. నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన ఆయన్ని చేర్చుకుంటాడు.
\v 41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్తకు దక్కే ప్రతిఫలం పొందుతాడు. నీతిమంతుడని నీతిమంతుణ్ణి చేర్చుకొనేవాడు నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు..
\s5
\v 42 శిష్యుడని గౌరవించి ఎవరైతే ఈ సాధారణ వ్యక్తుల్లో ఎవరికైనా గిన్నెడు చన్నీళ్లయినా తాగడానికి ఇస్తాడో అతడు తన ప్రతిఫలం పోగొట్టుకోడని కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\c 11
\p
\v 1 యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఉపదేశించడం అయిపోయిన తరువాత వారి పట్టణాలలో బోధించడానికీ, ప్రకటించడానికీ అక్కడనుంచి వెళ్లిపోయాడు.
\s బాప్తిసమిచ్చే యోహాను తన శిష్యులను యేసు దగ్గరకు పంపించడం (లూకా 7:18-35)
\p
\v 2 క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాలలో విని "రాబోతున్న వాడివి నీవేనా, లేకపోతే మేము వేరే వానికోసం కనిపెట్టాలా?"
\v 3 అని ఆయన్ని అడగడానికి తన శిష్యుల్ని పంపాడు.
\s5
\v 4 యేసు "మీరు వెళ్లి, విన్నవాటినీ చూసిన వాటినీ యోహానుకు తెలియచేయండి.
\v 5 గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుంటివాళ్ళు నడుస్తున్నారు, కుష్టురోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివాళ్ళు వింటున్నారు, చనిపోయినవాళ్ళు తిరిగి బ్రతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది.
\v 6 నా విషయం అభ్యంతరపడనివాడు ధన్యుడు" అని జవాబిచ్చాడు.
\s5
\v 7 వాళ్ళు వెళ్లిపోతుంటే యేసు యోహానును గురించి ప్రజలతో ఇలా చెప్పాడు. "మీరేం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్ళారు? గాలికి ఊగే గడ్డి పోచనా? అయితే మరింకేమి చూడడానికి వెళ్ళారు?
\v 8 నాజూకు బట్టలు వేసుకున్న వ్యక్తినా? నాజూకు బట్టలు వేసుకునే వాళ్ళు రాజ భవనాల్లో ఉంటారు.
\s5
\v 9 మరింకేమి చూడడానికి వెళ్ళారు? ప్రవక్తనా? అవును గాని ఇతడు ప్రవక్త కంటె గొప్పవాడు అని మీతో చెప్తున్నాను.
\v 10 'నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను, అతడు నీ ముందు వెళ్లి నీ దారి సిద్ధం చేస్తాడు' అని రాసి ఉన్నది ఇతని గురించే.
\s5
\v 11 స్త్రీకి పుట్టిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటె గొప్పవాడు పుట్టలేదని కచ్చితంగా మీతో చెబుతున్నాను. అయినా పరలోకరాజ్యంలో అల్పుడు అతని కంటె గొప్పవాడు.
\v 12 బాప్తిసమిచ్చే యోహాను కాలం నుండి ఇప్పటి వరకు పరలోకరాజ్యం దాడులకు గురి అవుతూ ఉంది. తీవ్రత కలవాళ్ళు బలవంతంగా దానిలో ప్రవేశిస్తున్నారు.
\s5
\v 13 యోహాను కాలం వరకు ప్రవక్తలూ, ధర్మశాస్త్రమూ వీటిని గురించి ప్రవచించారు.
\v 14 ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనస్సుంటే రాబోయే ఏలీయా ఇతడే.
\v 15 వినే చెవులున్నవాడు విను గాక.
\s5
\v 16 ఈ తరం వాళ్ళని దేనితో పోల్చాలి? పిల్లలు బజారుల్లో ఆడుకుంటూ
\v 17 'మీ కోసం వేణువు ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు. ఏడుపు పాట పాడాం గాని మీరు ఏడవలేదు' అని ఒకరితో ఒకరు చెప్పుకునే విధంగా ఉన్నారు.
\s5
\v 18 ఎందుకంటే యోహాను వచ్చి తినకుండా తాగకుండా ఉండేవాడు. అతనికి దయ్యం పట్టిందని వాళ్ళు అంటున్నారు.
\v 19 మనుష్య కుమారుడు తింటూ తాగుతూ వచ్చాడు. కాబట్టి 'వీడు తిండిబోతూ తాగుబోతూ పన్నులు వసూలు చేసే వాళ్ళకూ పాపులకూ స్నేహితుడ'ని వారంటున్నారు. అయితే తెలివి తెలివి కలిగి చేసే పనులను బట్టి తీర్పు పొందుతుంది."
\s జాతి పై యేసు తీర్పు ప్రకటించడం
\s5
\p
\v 20 అప్పుడాయన ఏ పట్టణాలలో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను మందలించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే అవి పశ్చాత్తాప పడలేదు.
\v 21 అయ్యో కొరాజీనూ! నీకు శిక్ష తప్పదు. అయ్యో బేత్సయిదా! నీకు శిక్ష తప్పదు. మీలో జరిగిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాలలో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చాత్తాపపడి గోనె పట్ట కట్టుకొని బూడిదె పూసుకునేవారే.
\v 22 తీర్పు దినాన మీకు పట్టే గతి కంటె తూరు సీదోను పట్టణాల వారి గతే ఓర్చుకోతగినది అవుతుంది" అని మీతో చెప్తున్నాను.
\s5
\v 23 కపెర్నహూమా, పరలోకానికి హెచ్చిపోగలను అని నీవు అనుకుంటున్నావా? నీవు పాతాళంలోకి దిగి పోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో గనక జరిగి ఉంటే అది ఈనాటి వరకూ నిలిచి ఉండేదే!
\v 24 తీర్పు దినాన నీకు పట్టే గతి కంటె సొదొమ నగరానికి పట్టే గతే ఓర్చుకోతగినది అవుతుంది, అని మీతో చెప్తున్నాను.
\s5
\v 25 ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు. "తండ్రీ, పరలోకానికీ భూమికీ ప్రభూ, నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతుల్ని మరుగుచేసి చిన్న పిల్లల్లాంటి పామరులకు వెల్లడి పరచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను.
\v 26 అవును తండ్రీ, ఈ విధంగా చేయడం నీ కెంతో ఇష్టం.
\v 27 సమస్తాన్నీ నా తండ్రి నాకు అప్పగించాడు. తండ్రి తప్ప కుమారుని ఎవరూ ఎరగరు. కుమారుడూ, కుమారుడు ఆయన్ని ఎవరికి బయలుపరచాలని ఉద్దేశిస్తాడో వాడు తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు.
\s యేసు ఇచ్చిన వ్యక్తిగత ఆహ్వానం
\s5
\p
\v 28 మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి. నేను మీకు అలసట తీరుస్తాను.
\v 29 నేను నెమ్మది, వినయం గల వాణ్ణి. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది.
\v 30 ఎందుకంటే నా కాడి సుళువు. నా భారం తేలిక.
\s5
\c 12
\s యేసు తనను విశ్రాంతి దినానికి ప్రభువుగా ప్రకటించుకోవడం (మార్కు 2: 23-28; లూకా 6:1-5)
\p
\v 1 ఆ రోజుల్లో యేసు ఒక విశ్రాంతి దినాన పంటచేలలో పడి వెళ్తూ ఉంటే ఆయన శిష్యులకు ఆకలి వేసి కంకులు తుంచి తింటున్నారు.
\v 2 పరిసయ్యులు అది చూసి , "విశ్రాంతి దినాన చేయకూడనిది నీ శిష్యులు చేస్తున్నారు" అని ఆయనతో అన్నారు.
\s5
\v 3 ఆయన వారితో "దావీదుకూ అతనితో ఉన్న వాళ్ళకు ఆకలి వేస్తే అతడు చేసిన దాని గురించి మీరు చదవలేదా?
\v 4 అతడు దేవుని మందిరంలో ప్రవేశించి, యాజకులే తప్ప తాను గానీ తనతో ఉన్నవాళ్ళు గానీ తినకూడని సముఖపు రొట్టెలు తిన్నాడు.
\s5
\v 5 విశ్రాంతి రోజున దేవాలయంలోని యాజకులు విశ్రాంతి దినాన్ని అతిక్రమించినా కూడా నిర్దోషులు గానే ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా?
\v 6 దేవాలయం కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్తున్నాను.
\s5
\v 7 'కనికరాన్నే కోరుతున్నాను, బలిని కోరను' అనే వాక్యభావం మీకు తెలిసిఉంటే నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చరు.
\v 8 కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభువు" అన్నాడు.
\s విశ్రాంతి దినాన చెయ్యి చచ్చుబడిన వాణ్ణి బాగు చెయ్యడం (మార్కు 3:1-6; లూకా 6: 6-11)
\s5
\p
\v 9 ఆయన అక్కడ నుండి వెళ్లి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, చచ్చుబడిన చేతితో ఒకడు కనిపించాడు.
\v 10 వారాయన మీద నేరం మోపాలని, "విశ్రాంతి దినాన బాగు చేయడం న్యాయమా?" అని ఆయన్ని అడిగారు.
\s5
\v 11 అందుకాయన, "మీలో ఎవరికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినాన గుంటలో పడితే అతడు దానిని పైకి తీయడా?
\v 12 గొర్రె కంటె మనిషి ఎంతో విలువైన వాడు కాబట్టి విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమే" అని చెప్పి
\s5
\v 13 ఆ మనిషితో, "నీ చెయ్యి చాపు" అన్నాడు. వాడు చెయ్యి చాపగా రెండవ దానిలాగా అది బాగుపడింది.
\v 14 పరిసయ్యులు బయటికి పోయి, ఆయన్ని ఎలా చంపాలా అని ఆయనకి విరోధంగా ఆలోచన చేసారు.
\s యెషయా ప్రవచించిన సేవకుడు(మార్కు 3:7-12)
\s5
\p
\v 15 యేసు ఆ సంగతి తెలిసికొని అక్కడ నుండి వెళ్లిపోయాడు. చాలా మంది ఆయన్ని వెంబడించగా
\v 16 ఆయన వారినందరినీ బాగు చేసి, తన గురించి ఎవరికీ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించాడు.
\v 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది నెరవేరేలా ఇలా జరిగింది. అదేమిటంటే
\s5
\v 18 "ఈయన నా సేవకుడు ఈయన్ని నేను ఏర్పరచుకున్నాను.
\p ఈయనంటే నాకెంతో ఆనందం. ఈయన మీద నా ఆత్మ ఉంచుతాను.
\p ఈయన యూదేతరులకు న్యాయం ప్రకటిస్తాడు.
\s5
\p
\v 19 ఈయన పోట్లాడడు, కేకలు వేయడు. ఈయన స్వరం వీధిలో వాళ్ళకెవ్వరికీ వినిపించదు.
\p
\v 20 నేను న్యాయవంతుడినని మనుషులకు తెలిసే వరకు ఇలా చేస్తాడు.
\p ఈయన నలిగిన రెల్లును విరవడు. ఆరిపోతున్న వత్తిని నలపడు.
\p
\v 21 ఈయన నామంలో యూదేతరులకు నిరీక్షణ కలుగుతుంది."అనే ప్రవచనం.
\s దయ్యాన్ని వెళ్ళగొట్టడం (మార్కు 3:22-౩౦; లూకా 11:14-23)
\s5
\p
\v 22 అప్పుడు దయ్యం పట్టిన ఒకణ్ణి యేసు దగ్గరకు తెచ్చారు. అతడు గుడ్డితనం మూగ కూడా. ఆయన అతణ్ణి బాగుచేసాడు. అతనికి మాట, చూపు రెండూ వచ్చాయి.
\v 23 అందుకు ప్రజలందరూ ఆశ్చర్యపడి, "ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకున్నారు.
\s5
\v 24 పరిసయ్యులు ఆ మాట విని, " వీడు దయ్యాలరాజు బయెల్జెబూలు మూలంగానే దయ్యాలు వెళ్లగొడుతున్నాడు, మరెవరి వలనా కాదు" అన్నారు.
\v 25 ఆయన వారి ఆలోచనలు గ్రహించి వారితో ఇలా అన్నాడు, "ఏ రాజ్యమైనా సరే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోతే పాడై పోతుంది. తనకు తానే వ్యతిరేకించి చీలిపోయే ఏ పట్టణమైనా ఏ యిల్లయినా నిలవదు.
\s5
\v 26 ఒకవేళ సాతాను సాతానును వెళ్లగొడితే, తనకు తానే వ్యతిరేకించి చీలిపోయినట్టు. అలాగైతే వాడి రాజ్యం ఎలా నిలుస్తుంది?
\v 27 నేను బయెల్జెబూలు వలన దయ్యాలను వెళ్లగొడుతుంటే మీ వాళ్ళు ఎవరి వలన వెళ్లగొడుతున్నారు? కాబట్టి వాళ్ళే మీకు తీర్పరులవుతారు.
\s5
\v 28 దేవుని ఆత్మ వలన నేను దయ్యాలను వెళ్లగొడుతుంటే కచ్చితంగా దేవుని రాజ్యం మీ దగ్గరికి వచ్చింది.
\v 29 ఒకడు మొదట బలవంతుణ్ణి కట్టేయకుండా అతని ఇంట్లో చొరబడి అతని సామాను ఎలా దోచుకోగలడు? అలా బంధించ గలిగితేనే అతని ఇంట్లోనుంచి అతని సామాను దోచుకోగలదడు.
\v 30 నా వైపున ఉండనివాడు నాకు విరోధే. నాతో కలిసి పోగు చెయ్యని వాడు చెదరగొట్టేవాడే.
\s క్షమాపణ లేని పాపం (మార్కు 3: 29, 30)
\s5
\p
\v 31 కాబట్టి నేను మీతో చెప్పేదేంటంటే, మనుషులు చేసే ప్రతి పాపానికీ దూషణకూ క్షమాపణ దొరుకుతుంది గాని దేవుని ఆత్మకు వ్యతిరేకమైన దూషణకు క్షమాపణ అంటూ మనుషులకు దొరకదు.
\v 32 మానవ పుత్రునికి విరోధంగా మాట్లాడే ఎవరికైనా క్షమాపణ దొరుకుతుంది గానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి, ఈ లోకంలో గానీ రాబోయే లోకంలో గానీ క్షమాపణ ఉండదు.
\s మనిషి పలికే ప్రతి మాట
\s5
\p
\v 33 చెట్టు మంచిదయితే దాని పండూ మంచిదవుతుంది. అలాకాక, చెట్టు చెడ్డదయితే దాని పండూ చెడ్డదవుతుంది. చెట్టు ఎలాటిదో దాని పండు వలన తెలుసుకోవచ్చు.
\v 34 విష సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలరు? హృదయంలో నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది.
\v 35 మంచివాడు తన హృదయం లోని మంచి సంపద లోనుండి మంచి వాటిని బయటికి తెస్తాడు. చెడ్డవాడు తన హృదయం లోని చెడ్డ సంపద లోనుండి చెడ్డ వాటిని బయటికి తెస్తాడు.
\s5
\v 36 మనుషులు అజాగ్రత్తగా పలికే ప్రతి మాటకూ తీర్పు రోజున లెక్క చెప్పవలసి ఉంటుందని మీతో చెబుతున్నాను.
\v 37 నీ మాటలను బట్టి నువ్వు నీతిపరుడివని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నీవు శిక్ష పొందుతావు.
\s యోనా సూచన. యేసు తన మరణ పునరుత్థానాలను ప్రకటించడం (లూకా 11: 24- 26)
\s5
\p
\v 38 అప్పుడు ధర్మశాస్త్ర జ్ఞానులలో పరిసయ్యులలో కొందరు ఆయనకు జవాబిస్తూ, "బోధకుడా, నీవు ఒక సూచక క్రియ చేస్తే చూడాలని ఉంది" అన్నారు. ఆయన ఇలా అన్నాడు.
\v 39 "వ్యభిచారులైన ఈ దుర్మార్గపుతరం వాళ్ళు సూచక క్రియ అడుగుతున్నారు. యోనా ప్రవక్త గురించిన సూచక క్రియ తప్ప ఏ సూచక క్రియా వారికి ఇవ్వను.
\v 40 యోనా మూడు రాత్రింబగళ్లు పెద్ద చేప కడుపులో ఎలా ఉన్నాడో ఆలాగే మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భంలో ఉంటాడు.
\s5
\v 41 నీనెవె ప్రజ యోనా ప్రకటన విని పశ్చాత్తాప పడ్డారు కాబట్టి నీనెవె వాళ్ళు ఈ తరం వారితో నిలబడి తీర్పు రోజున వారి మీద నేరం మోపుతారు. యోనా కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
\s5
\v 42 తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరం మోపుతుంది. ఆమె సొలోమోను జ్ఞానం వినడానికి ఎంతో దూరం నుండి వచ్చింది. అయితే సొలోమోను కంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
\s5
\v 43 అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి కోసం నీళ్ళు లేని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటుంది.
\v 44 దానికి విశ్రాంతి దొరకదు. అప్పుడది 'నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను' అనుకుని వచ్చి, ఆ ఇంట్లో ఎవరూ లేక అది ఊడ్చి చక్కగా సర్ది పెట్టి ఉండడం చూస్తుంది. అప్పుడది వెళ్లి తనకంటె చెడ్డవైన మరో ఏడు దయ్యాల్ని వెంటబెట్టుకొని వస్తుంది. అవన్నీ అక్కడే నివాసముంటాయి.
\v 45 అందుచేత ఆ వ్యక్తి చివరి స్థితి మొదటి దాని కంటే అధ్వాన్నం అవుతుంది. ఈ దుష్టతరం వారికీ అలాగే అవుతుంది."
\s సరికొత్త సంబంధాలు (మార్కు 3: 31- 35; లూకా 8: 19- 21)
\s5
\p
\v 46 ఆయన ప్రజలతో ఇంకా మాట్లాడుతూ ఉండగా ఆయన తల్లీ సోదరులూ ఆయనతో మాట్లాడాలని వచ్చి బయట నిలబడి ఉన్నారు.
\v 47 అప్పుడొకడు, "నీ తల్లీ నీ సోదరులూ నీతో మాటలాడాలని బయట నిలబడి ఉన్నారు" అని ఆయనతో చెప్పాడు.
\s5
\v 48 అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూసి "నా తల్లి ఎవరు? నా సోదరులెవరు?" అని చెప్పి
\v 49 తన శిష్యులవైపు చెయ్యి చాపి, " నా తల్లి, నా సోదరులు వీరే!
\v 50 నా పరలోక తండ్రి ఇష్టం చొప్పున చేసేవాడే నా సోదరుడు, నా సోదరి, నా తల్లి" అన్నాడు.
\s5
\c 13
\s పరలోకరాజ్య మర్మాలు. మొదటిది. 1. విత్తనాలు (మార్కు4:1- 20; లూకా 8: 4:15)
\p
\p
\v 1 ఆ రోజు యేసు ఇంట్లో నుండి వెళ్లి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు.
\v 2 ప్రజలు పెద్ద గుంపులుగా తన చుట్టూ చేరితే ఆయన పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డున నిల్చున్నారు.
\s5
\v 3 ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాడు. "విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు.
\v 4 అతడు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. పిట్టలు వచ్చి వాటిని మింగేశాయి.
\v 5 కొన్ని విత్తనాలు మన్ను ఎక్కువగా లేని రాతి నేలమీద పడ్డాయి. అక్కడ మన్ను లోతుగా లేకపోవడం చేత అవి వెంటనే మొలకెత్తాయి.
\v 6 పొద్దు పొడిచినప్పుడు అవి మాడిపోయి వేరులు లేకపోవడంతో ఎండిపోయాయి.
\s5
\v 7 కొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల్లో పడ్డాయి. ముళ్ళ మొక్కలు ఎదిగి వాటిని అణిచి వేశాయి.
\v 8 మరికొన్ని విత్తనాలు మంచి నేలపై పడి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని వంద రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్నిముప్పై రెట్లు పండాయి.
\v 9 చెవులున్నవాడు విను గాక!" అన్నాడు.
\s5
\p
\v 10 తరువాత శిష్యులు వచ్చి, "నీవు ఉపమానాలతో ఎందుకు వారితో మాట్లాడుతున్నావు" అన్నారు. ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు.
\v 11 "పరలోక రాజ్య మర్మాలు దేవుడు మీకు తెలియజేస్తున్నాడు, వారికి తెలియచజేయ లేదు.
\v 12 కలిగిన వాడికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఆతనికి సమృద్ధిగా ఉంటుంది. లేనివాని నుంచి అతని దగ్గర ఉన్నకొంచెం కూడా తీసివేయడం జరుగుతుంది.
\s5
\v 13 ఇందు కోసమే నేను ఉపమానాలతో వారికి బోధిస్తున్నాను. వాళ్ళు చూన్నారుగానీ నిజానికి చూడరు. వింటున్నారు గానీ నిజానికి వినరు, అర్థం చేసుకోరు.
\v 14 యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుతూ ఉంది.
\q 'మీరు వినడానికి వింటారు గాని గ్రహింపనే గ్రహింపరు,
\q చూడడానికి చూస్తారు గాని ఏ మాత్రం తెలుసుకోరు.
\q
\s5
\v 15 ఈ ప్రజల హృదయం బండబారి పోయింది.
\q వారికి చెముడు వచ్చినట్టుగా ఉంది.
\q వారి కళ్ళు మూసుకు పోయాయి.
\q వారు కళ్ళారా చూసి , చెవులారా విని, హృదయంతో గ్రహించి
\q మనస్సు తిప్పుకుని నా వలన బాగు పడే వీలు లేకుండా అయిపోయింది.'
\s5
\p
\v 16 అయితే మీ కళ్ళు చూస్తున్నాయి కాబట్టి అవి ధన్యమయ్యాయి. మీ చెవులు వింటున్నాయి, కాబట్టి అవి ధన్యమయ్యాయి.
\v 17 చాలామంది ప్రవక్తలూ నీతిమంతులూ మీరు చూస్తున్నవాటిని చూడాలని ఆశించారు గానీ చూడలేక పోయారు. మీరు వింటున్నవాటిని వినాలనుకున్నారు గానీ వినలేకపోయారని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\p
\v 18 విత్తనాలు చల్లే వాని గురించిన ఉపమాన భావం వినండి.
\v 19 ఎవడైనా రాజ్యం గురించిన వాక్యం విని కూడా గ్రహించకపోతే దుష్టుడు వచ్చి అతని హృదయంలో పడిన విత్తనాలను ఎత్తుకు పోతాడు. దారిపక్కన విత్తనాలు పడినవాడు ఇతడే.
\s5
\v 20 రాతినేలను విత్తనాలు పొందినది ఎవరంటే వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు.
\v 21 అయితే అతనిలో వేరు లేకపోవడంతో అతడు కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్యం కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే తొట్రుపడిపోతాడు.
\s5
\v 22 ముళ్ళ మొక్కల్లో విత్తనాలు పడింది ఎవరంటే వాక్యం వింటాడు గానీ ఈ లోక చింతలూ, సంపదలోని మోసమూ ఆ వాక్యాన్ని అణచివేస్తాయి. కాబట్టి వాడు ఫలించని వాడై పోతాడు.
\v 23 మంచినేలను విత్తనాలు పడింది ఎవరంటే వాక్యం విని దానిని అర్ధం చేసుకునేవాడు. అలాటి వాళ్ళు నిజంగా ఫలించి వృద్ధిపొందుతారు. కొందరు వంద రెట్లు, కొందరు అరవై రెట్లు, మరికొందరు ముప్పై రెట్లు ఫలిస్తారు."
\s రెండవ మర్మం. గోధుమ చేలో కలుపు మొక్కలు (వ. 24 30; 36- 43)
\s5
\p
\v 24 ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు. తన పొలంలో మంచి విత్తనాలు చల్లించిన రైతులా పరలోకరాజ్యం ఉంది.
\v 25 మనుషులు నిద్రపోతూ ఉంటే అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య కలుపు మొక్కల విత్తనాలు చల్లి పోయాడు.
\v 26 మొక్కలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపు మొక్కలు కూడా కనిపించాయి.
\s5
\v 27 అప్పుడు అ రైతు పనివాళ్ళు అతని దగ్గరికి వచ్చి "అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం చల్లించావు గదా, అందులో కలుపు మొక్కలు ఎలా వచ్చాయి?" అని అడిగారు.
\v 28 "ఇది పగవాడు చేసిన పని" అని అతడు వారితో అన్నాడు. ఆ పనివాళ్ళు "మేము వెళ్లి ఆ కలుపు మొక్కల్ని పీకేయమంటారా?" అని అతన్ని అడిగారు.
\s5
\v 29 అందుకతడు, "వద్దు. కలుపు మొక్కల్ని పీకితే వాటితోపాటు గోధుమ మొక్కల్నీ పెళ్లగిస్తారేమో.
\v 30 కోతకాలం వరకు రెంటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో కలుపు మొక్కల్ని పోగు చేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి. గోధుమలను నా గిడ్డంగిలో చేర్చండి అని కోత కోసే వారికి చెబుతాను", అన్నాడు."
\s మూడవ మర్మం. ఆవ గింజ (మార్కు 4: 30- 32)
\s5
\p
\v 31 ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాడు. "పరలోకరాజ్యం ఇలా ఉంది. ఒకడు తన పొలంలో ఒక ఆవ విత్తనం నాటాడు.
\v 32 అది విత్తనాలన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటినీ మించిన పెద్ద చెట్టు అవుతుంది. పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి."
\s నాలుగవ మర్మం. పొంగజేసే పదార్థం (లూకా 13: 20, 21)
\s5
\p
\v 33 ఆయన ఇంకొక ఉపమానం వారితో చెప్పాడు. "పరలోక రాజ్యం ఒక స్త్రీ మూడు మానికల పిండిలో, చాలా కొద్దిగా పులిపిండి వేసి కలుపుతుంది. అప్పుడు అదంతా పులుస్తుంది.
\q1
\s5
\v 34 "నేను నోరారా ఉపమానాలతో బోధిస్తాను. లోకం సృష్టి మొదలుకొని రహస్యంగా ఉండిపోయిన విషయాలు చెబుతాను."
\p
\v 35 అని ప్రవక్త చెప్పినమాట నెరవేరేలా యేసు ఈ సంగతులన్నీ ప్రజలకు ఉపమానాలతో బోధించాడు. ఉపమానం లేకుండా వారికి ఏదీ బోధించలేదు.
\s గోధుమ కలుపు మొక్కల ఉపమానం వివరణ
\s5
\p
\v 36 అప్పుడాయన ప్రజలను పంపివేసి, ఇంటిలోనికి వెళితే ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి పొలంలోని కలుపు మొక్కల్ని గురించిన ఉపమాన భావం తమకు తెలియజేయమన్నారు.
\v 37 అందుకాయన ఇలా అన్నాడు. మంచి విత్తనం చల్లేది మనుష్య కుమారుడు.
\v 38 పొలం ఈ లోకం. మంచి విత్తనాలు రాజ్యసంబంధులు. కలుపు మొక్కలు దుష్టుని సంబంధులు.
\v 39 వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోతకోసే వాళ్ళు దేవదూతలు.
\s5
\v 40 కలుపు మొక్కలను పోగుచేసి మంటల్లో కాల్చినట్టే ఈ లోకాంతంలో జరుగుతుంది.
\v 41 మనుష్య కుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు.
\v 42 అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడమూ ఉంటాయి.
\v 43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని లాగా ప్రకాశిస్తారు. వినగలిగే చెవులున్నవాడు వింటాడు గాక.
\s ఐదవ మర్మం. భూమిలో నిక్షిప్త నిధి
\s5
\p
\v 44 పరలోకరాజ్యం పొలంలో దాచిన నిధి లాగా ఉంది. ఒక మనిషి దాన్ని చూసి దాచి పెట్టి, అది దొరికిన సంతోషంతో వెళ్లి, తనకున్నదంతా అమ్మి ఆ పొలం కొంటాడు.
\s అరవ మర్మం. ఆణి ముత్యం
\p
\v 45 పరలోకరాజ్యం మంచి ముత్యాలను కొనడానికి వెతుకుతున్న వ్యాపారస్తుణ్ణి పోలి ఉంది.
\v 46 అతడు చాలా విలువైన ఒక ముత్యం కనబడగానే పోయి తనకు ఉన్నదంతా అమ్మేసి దాన్ని కొనుక్కుంటాడు.
\s ఏడవ మర్మం. లాగే వల
\s5
\p
\v 47 పరలోకరాజ్యం, సముద్రంలో వేసే వలను పోలి ఉంది. అది రకరకాల చేపలను పడుతుంది.
\v 48 అది నిండినప్పుడు తీరానికి లాగి, కూర్చుని మంచి వాటిని గంపల్లో వేసుకుని పనికి రాని వాటిని విసిరేస్తారు.
\s5
\v 49 ఆలాగే ఈ లోకాంతంలో జరుగుతుంది. దేవ దూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరు చేసి,
\v 50 అగ్ని గుండంలో పడవేస్తారు. అక్కడ ఏడుపూ పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి."
\s5
\v 51 "వీటినన్నిటిని మీరు గ్రహించారా?" అని వారిని అడిగితే వాళ్ళు "గ్రహించాము" అన్నారు.
\v 52 ఆయన "అందువలన పరలోకరాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి ధర్మశాస్త్ర పండితుడూ తన ఖజానాలో నుండి కొత్తవాటినీ పాత వాటినీ బయటికి తెచ్చే ఇంటి యజమానిని పోలి ఉన్నాడు" అని వారితో చెప్పాడు.
\s యేసు నజరేతు తిరిగి రాక. మరలా తిరస్కారం (మార్కు 6:1-6; లూకా 4: 16-32)
\p
\v 53 యేసు ఈ ఉపమానాలు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్లి తన సొంత ఊరు వచ్చి, సమాజ మందిరాలలో వారికి బోధిస్తూ ఉన్నాడు.
\s5
\v 54 వారు ఆశ్చర్యపడి "ఈ జ్ఞానం, ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడ నుంచి వచ్చాయి?
\v 55 ఇతడు వడ్రంగి కొడుకు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదా అనే వాళ్ళు ఇతని సోదరులు కారా?
\v 56 ఇతని సోదరీలంతా మనతోనే ఉన్నారు కదా! ఇతనికి ఇవన్నీ ఎక్కడనుండి వచ్చాయి?" అని చెప్పుకుని ఆయన్ని అంగీకరించ లేకపోయారు.
\s5
\v 57 అయితే యేసు "ప్రవక్త మిగతా అన్ని చోట్లా ఘనత పొందుతాడు, తన సొంత ఊళ్ళో తన సొంత ఇంట్లో తప్ప" అని వారితో చెప్పాడు.
\v 58 వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.
\s5
\c 14
\s బాప్తిసమిచ్చే యోహాను వధ (మార్కు 6: 14- 29; లూకా 9:7-9)
\p
\v 1 ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని
\v 2 "ఇతడు బాప్తిసమిచ్చే యోహాను, చనిపోయి తిరిగి లేచాడు. అందుకే అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి" అని తన సేవకులతో చెప్పాడు.
\s5
\v 3 అంతకు పూర్వం "నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు" అని యోహాను చెప్పినందుకు,
\v 4 హేరోదు ఆమె కోసం యోహానును బంధించి జైలులో వేయించాడు.
\v 5 హేరోదు అతన్ని చంపాలనుకున్నాడు గాని ప్రజలు అతన్ని ప్రవక్తగా భావించారు కాబట్టి వారికి భయపడ్డాడు.
\s5
\v 6 హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వాళ్ళ ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది.
\v 7 కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు.
\s5
\v 8 తన తల్లి ఆమె కిచ్చిన సూచన ప్రకారం "బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించు" అని అడిగింది.
\v 9 ఆమె అభ్యర్ధనకు రాజు ఎంతో కలత చెందినా తాను ఇచ్చిన మాట కోసం, తనతో బాటు విందులో కూర్చున్న వారి కోసం, అలా చేయమని ఆజ్ఞాపించాడు.
\s5
\v 10 భటుల్ని పంపి జైలులో ఉన్న యోహాను తల నరికించాడు.
\v 11 వారు అతని తల ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె తన తల్లికి ఇచ్చింది.
\v 12 యోహాను శిష్యులు వచ్చి శవాన్ని తీసుకు పోయి పాతిపెట్టారు. ఆ తర్వాత యేసు దగ్గరికి వెళ్లి ఈ సంగతి తెలియచేసారు.
\s5
\v 13 యేసు పడవ ఎక్కి, అక్కడనుంచి నిర్జన ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ప్రజలు ఆ సంగతి విని, పట్టణాల నుంచి కాలినడకన ఆయన వెంట వెళ్ళారు.
\v 14 యేసు బయటికి వచ్చి ఆ పెద్ద గుంపును చూశాడు. ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు.
\s యేసు ఐదు వేలమంది ఆకలి తీర్చడం (మార్కు 6: ౩౦- 44; లూకా 9:10-17; యోహాను 6:1-14)
\s5
\p
\v 15 సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, "ఇది అరణ్య ప్రదేశం. ఇప్పటికే పొద్దు పోయింది. ఈ ప్రజలు వెళ్లి ఆహారం కొనుక్కోడానికి వారిని పంపి వెయ్యి" అన్నారు.
\s5
\v 16 యేసు వారితో, "వాళ్ళు వెళ్లనక్కర్లేదు, మీరే వాళ్ళకి భోజనం పెట్టండి" అన్నాడు.
\v 17 వాళ్ళు, "ఇక్కడ మన దగ్గర అయిదు రొట్టెలూ రెండు చేపలు తప్ప ఇంకేమీ లేవు" అని ఆయనతో అన్నారు.
\v 18 అందుకు ఆయన "వాటిని నా దగ్గరికి తీసుకు రండి" అన్నాడు.
\s5
\v 19 ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ అయిదు రొట్టెలూ రెండు చేపలు చేతిలో తీసుకొని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు.
\v 20 వారంతా తిని సంతృప్తి చెందినా తరువాత మిగిలిపోయిన ముక్కలు పోగు చేస్తేమొత్తం పన్నెండు గంపలు నిండాయి.
\v 21 స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు అయిదు వేలమంది తిన్నారు.
\s యేసు నీటిపై నడవడం, పేతురు అల్ప విశ్వాసం (మార్కు 6: 45- 56; యోహాను 6: 15- 21)
\s5
\p
\v 22 యేసు వెంటనే ఆ ప్రజలను పంపివేసి శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు.
\v 23 ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు.
\v 24 అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అది అలల తాకిడికి కొట్టుకు పోతూ ఉంది.
\s5
\v 25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు.
\v 26 ఆయన సముద్రం మీద నడవడం శిష్యులు చూచి భయపడిపోయి, దయ్యం అనుకొని గాభరాగా కేకలు వేశారు.
\v 27 వెంటనే యేసు, "ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు" అన్నాడు.
\s5
\v 28 పేతురు, "ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వండి," అని ఆయనతో అన్నాడు.
\v 29 యేసు రమ్మన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ల మీద నడిచాడు గాని
\v 30 గాలిని చూసి భయపడి మునిగి పోతూ ప్రభూ, నన్ను రక్షించమని కేకలు వేశాడు.
\s5
\v 31 వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని,"అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?" అన్నాడు.
\v 32 వాళ్ళు పడవ ఎక్కినప్పుడు గాలి వేగం తగ్గింది.
\v 33 పడవలో ఉన్న వాళ్ళు వచ్చి, "నీవు నిజంగా దేవుని కుమారుడివి" అని చెప్పి ఆయన్ని ఆరాధించారు.
\s5
\v 34 వారు అవతలి ఒడ్డుకు వెళ్లి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకున్నారు.
\v 35 అక్కడి ప్రజలు ఆయన్ని గుర్తుపట్టి, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు.
\v 36 'వీరిని నీ పైబట్ట అంచు మాత్రమే ముట్ట నివ్వండ' ని ఆయన్ని బతిమాలారు. ముట్టిన వాళ్ళంతా బాగయ్యారు.
\s5
\c 15
\s శాస్త్రులను, పరిసయ్యులను యేసు విమర్శించడం (మార్కు 7: 1-23)
\p
\p
\v 1 ఆ రోజుల్లో యెరూషలేమునుండి ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ వచ్చి
\v 2 "నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి ?" అని యేసుని అడిగారు.
\v 3 అందుకు ఆయన వారితో ఇలా అన్నాడు, "మీరు మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞనే మీరుతున్నారు.
\s5
\v 4 ఎలాగంటే తలిదండ్రుల్ని ఘనపరచమనీ, తండ్రిని గాని తల్లిని గాని దూషించేవాడికి శిక్ష మరణమేననీ దేవుడు చెప్పాడు.
\v 5 కాని మీరు మాత్రం ఎవరైనా తన తండ్రితో, తల్లితో నానుండి మీకు ఏమైనా లాభం కలుగుతూ ఉంటే దానిని దేవునికి ఇచ్చేశాను అని చెప్తే అతడు ఇకనుండి తన తల్లిదండ్రుల్ని పట్టించుకోనక్కర లేదని చెబుతారు.
\v 6 ఆ విధంగా మీరు మీ సంప్రదాయాల కోసం దేవుని మాటను పక్కన పెట్టేశారు.
\s5
\v 7 మీ భక్తి అంతా వట్టి దొంగభక్తి.
\v 8 'ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది.
\v 9 వారు నన్ను వ్యర్ధంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు' అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు."
\s5
\p
\v 10 ఆయన ప్రజలందరినీ పిలిచి, "మీరు తెలుసుకోవలసింది ఏమంటే
\v 11 ఒక వ్యక్తి నోటిలోకి వెళ్ళేది అతనినేమీ అపవిత్ర పరచదు. నోటినుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్ర పరుస్తుంది" అని చెప్పాడు.
\s5
\v 12 అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, "నీకు తెలుసా? పరిసయ్యులు నీ మాటలు విని చాలా నొచ్చుకున్నారు" అని ఆయనతో అన్నారు.
\v 13 ఆయన "పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కా పీకివేయడం జరుగుతుంది.
\v 14 వారి జోలికి వెళ్ళవద్దు. వారు గుడ్డివారు. వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా" అన్నాడు.
\s5
\v 15 అందుకు పేతురు 'ఈ ఉపమానభావం మాకు వివరించు' అని ఆయన్ని అడిగాడు.
\v 16 అప్పుడాయన "మీరు ఇంకా అవివేకంగాఉన్నారా?
\v 17 నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది.
\s5
\v 18 కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా?
\v 19 హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధసాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి.
\v 20 మనిషిని అపవిత్రపరచేది ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు.
\s సురోఫెనికయ స్త్రీ కూతురు స్వస్థత (మార్కు 7: 24- 30)
\s5
\p
\v 21 యేసు బయలుదేరి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు.
\v 22 అప్పుడు అక్కడ నివసించే కనాను జాతి స్త్రీ ఒకామె వచ్చి, "ప్రభూ, దావీదు కుమారా, నన్ను కరుణించు. నా కూతురికి దయ్యం పట్టి విపరీతంగా బాధ పెడుతున్నది" అని పెద్దగా అరిచి చెప్పింది.
\v 23 కానీ ఆయన ఏమీ బదులు పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు "ఈమె కేకలు వేస్తూ మన వెంటే వస్తున్నది, ఆమెని పంపించెయ్యి" అని ఆయన్ని వేడుకున్నారు.
\s5
\v 24 దానికి ఆయన, "దేవుడు ఇశ్రాయేలు వంశంలో తప్పిపోయిన గొర్రెల దగ్గరకే నన్ను పంపించాడు, ఇంకెవరి దగ్గరకూ కాదు" అని జవాబిచ్చాడు.
\v 25 అయినా ఆమె వచ్చి ఆయనకు మొక్కి "ప్రభూ, నాకు సహాయం చెయ్యి" అంది.
\v 26 ఆయన, "పిల్లలు తినే రొట్టెని కుక్కపిల్లలకి పెట్టడం సరి కాదు" అని ఆమెతో అన్నాడు.
\s5
\v 27 ఆమె "ప్రభూ, నిజమే! కాని కుక్కపిల్లలు సైతం తమ యజమాని భోజనం బల్లపైనుండి కింద పడే ముక్కలు తింటాయి కదా" అంది.
\v 28 అందుకు యేసు "అమ్మా, నీ నమ్మకం గొప్పది. నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది" అని ఆమెతో చెప్పాడు. సరిగ్గా ఆ గంటలోనే ఆమె కుమార్తె బాగుపడింది.
\s యేసు అనేకమందిని బాగు చేయడం (మార్కు 7: 31-37)
\s5
\p
\v 29 యేసు అక్కడనుండి బయలుదేరి, గలలీ సముద్రం పక్కగా ఉన్న ఒక కొండ ఎక్కి కూర్చున్నాడు.
\v 30 ప్రజలు గుంపులు గంపులుగా అనేకమంది కుంటివారినీ గుడ్డివారినీ మూగవారినీ వికలాంగుల్నీ తీసికొచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచారు. ఆయన వారిని బాగుచేశాడు.
\v 31 ప్రజలు మూగవారు మాట్లాడటం, వికలాంగులు బాగుపడటం, కుంటివారు నడవటం, గుడ్డివారికి చూపు రావటం చూసి ఆశ్చర్య పడ్డారు. వారంతా ఇశ్రాయేలీయుల దేవునికి స్తుతులు చెల్లించారు.
\s నాలుగు వేలమందికి ఆహారం (మార్కు 8:1-9)
\s5
\p
\v 32 అప్పుడు యేసు తన శిష్యుల్ని పిలిచి, "ఈ ప్రజల మీద నాకు జాలిగా ఉంది. మూడు రోజుల నుండి వీరు నా దగ్గరే ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదు. వారు దారిలోనే స్పృహ కోల్పోతారేమో" అన్నాడు.
\v 33 ఆయన శిష్యులు, "ఇంతమందికి సరిపడినన్ని రొట్టెలు ఈ అడవి ప్రాంతంలో ఎక్కడ దొరుకుతాయి?" అన్నారు.
\v 34 యేసు, "మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?" అని వారిని అడిగాడు. వారు, "ఏడు రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి" అని చెప్పారు.
\p
\v 35 అప్పుడు యేసు, 'నేల మీద కూర్చోండి' అని అ ప్రజలకి ఆజ్ఞాపించి
\s5
\v 36 ఆ యేడు రొట్టెలు, ఆ చేపలు పట్టుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వాటిని ముక్కలు చేసి తన శిష్యులకిచ్చాడు. శిష్యులు ఆ ప్రజలకి వాటిని పంచిపెట్టారు.
\v 37 వారంతా కడుపారా తిన్న తర్వాత అక్కడ ఏడు గంపల నిండుగా ముక్కలు మిగిలిపోయాయి.
\v 38 స్త్రీలు, పిల్లలు కాకుండా కేవలం పురుషులే నాలుగువేల మంది తిన్నారు.
\v 39 తరువాత ఆయన ఆ ప్రజలందరినీ పంపివేసి, పడవ మీద మగదాను ప్రాంతానికి వచ్చాడు.
\s5
\c 16
\s అంధ మతనాయకులను యేసు విమర్శించడం (మార్కు 8: 1-12)
\p
\v 1 అప్పుడు పరిసయ్యులు, సద్దూకయ్యులు వచ్చి ఆయన్ని పరీక్షించడం కోసం తమకొరకు పరలోకం నుండి ఒక అద్భుటం చెయ్యమని అడిగారు.
\v 2 ఆయన వారితో ఇలా అన్నాడు, "సాయంకాలం ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి వర్షం కురవదనీ,
\s5
\v 3 అదే ఆకాశం ఉదయం ఎర్రగా, మబ్బులతో ఉంది కాబట్టి గాలివాన వస్తుందనీ మీరు చెప్తారు కదా, ఆకాశంలోని సూచనలు మీకు తెలుసు గాని ఈ కాలాల సూచనలు మాత్రం గుర్తించలేరు.
\v 4 సూచక క్రియలు అడిగే ఈ తరం దుష్టత్వంతో, వ్యభిచారంతో నిండి ఉంది. యోనా ప్రవక్త గురించినది తప్ప మరే సూచనా ఈ తరానికి ఇవ్వడం జరగదు." ఆ వెంటనే ఆయన వారిని విడిచి వెళ్లిపోయాడు.
\s5
\p
\v 5 అవతలి ఒడ్డుకు చేరినప్పుడు ఆయన శిష్యులు రొట్టెలు తెచ్చుకోవటం మర్చిపోయారు.
\v 6 అప్పుడు యేసు, "పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పులిపిండిని గురించి జాగ్రత్త పడండి" అని వారితో అన్నాడు.
\v 7 అయితే శిష్యులు 'మనం రొట్టెలు తేకపోవడం చేత ఇలా అన్నాడు' అని తమలో తాము చర్చించు కున్నారు.
\v 8 యేసుకు అది తెలిసి, "అల్పవిశ్వాసులారా, మీరు రొట్టెలు తీసుకురాని విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు?
\s పొంగ జేసే పదార్ధం వివరణ (మార్కు 13-21)
\s5
\p
\v 9 మీరింకా గ్రహించలేదా? ఐదు రొట్టెలు ఐదువేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో,
\v 10 ఏడు రొట్టెలు నాలుగు వేలమంది తిన్న తరువాత ఎన్ని పెద్ద గంపలు ఎత్తారో అవేమీ మీకు గుర్తు లేదా?
\s5
\v 11 నేను మీతో మాట్లాడింది రొట్టెల్ని గురించి కాదని ఎందుకు గ్రహించరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే పులిపిండిని గురించి జాగ్రత్త పడండి" అని వారితో చెప్పాడు.
\v 12 అప్పుడు రొట్టెల్లో వాడే పులిపిండిని గురించి కాక పరిసయ్యులు, సద్దూకయ్యులు చేసే బోధ విషయంలో జాగ్రత్తపడమని ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు.
\s పేతురు విశ్వాస ప్రకటన (మార్కు 8: 27-30; లూకా 9: 18- 21; యోహాను 6: 68, 69)
\s5
\p
\v 13 యేసు కైసరయ ఫిలిప్పీ ప్రాంతాలకు వచ్చినపుడు తన శిష్యుల్ని ఇలా అడిగాడు, "మనుష్య కుమారుడు ఎవరని ప్రజలు మాట్లాడుకొంటున్నారు?"
\v 14 వారు "కొందరేమో నీవు బాప్తిసమిచ్చే యోహానువనీ, మరి కొందరు ఏలీయావనీ, కొందరు యిర్మీయావనీ, లేక ఎవరో ఒక ప్రవక్తవనీ అనుకొంటున్నారు" అన్నారు.
\v 15 "అయితే మీరు నేనెవరినని భావిస్తున్నారు?" వారిని అడిగాడు.
\v 16 వెంటనే సీమోను పేతురు, "నీవు అభిషిక్తుడివి! సజీవుడైన దేవుని కుమారుడివి!" అని చెప్పాడు.
\s ‘సంఘము‘ మొట్టమొదటి ప్రస్తావన
\s5
\p
\v 17 అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు, "యోనా కుమారుడైన సీమోనూ, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాత్రులు కాదు.
\v 18 ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళలోకపు ద్వారాలు దానిని ఎదిరించి నిలబడలేవు.
\s5
\v 19 పరలోక రాజ్యపు తాళాలు నీకిస్తాను. నీవు భూమి మీద దేనిని బంధిస్తావో దానిని పరలోకంలో బంధిస్తాను, దేనిని విడిపిస్తావో దానిని పరలోకంలో విడిపిస్తాను."
\v 20 తానే క్రీస్తు అని యెవరికీ చెప్పవద్దని యేసు తన శిష్యులకు గట్టిగా ఆజ్ఞాపించాడు.
\s క్రీస్తు తన మరణ పునరుత్థానాలను ముందుగా చెప్పటం (మార్కు 8:31-38; లూకా 9:22-27)
\s5
\p
\v 21 అప్పటినుంచి యేసు తాను యెరూషలేము వెళ్లి అక్కడి పెద్దల, ప్రధాన యాజకుల, ధర్మశాస్త్ర పండితుల చేతుల్లో అనేక హింసలు పొంది, చనిపోయి, మూడో రోజు తిరిగి సజీవంగా లేవడం తప్పనిసరి అని తన శిష్యులతో చెప్పడం మొదలెట్టాడు.
\v 22 అప్పుడు పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, "ప్రభూ, అది నీకు దూరమవుతుంది, నీకలా ఎప్పటికీ జరగదు" అని గద్దింపుగా అన్నాడు.
\v 23 అయితే యేసు పేతురు వైపు తిరిగి "సాతానూ, నా వెనక్కి పో! నువ్వు నాకు దారిలో అడ్డుబండగా ఉన్నావు. నీవు దేవుని సంగతులపై కాక మనుషుల సంగతుల పైనే నీ మనసు పెడుతున్నావు" అన్నాడు.
\s5
\p
\v 24 అప్పుడు యేసు తన శిష్యులతో, "ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే, వాడు తనను తాను తిరస్కరించుకొని, తన సిలువను మోసుకుంటూ రావాలి.
\v 25 తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూసేవాడు దానిని పోగొట్టుకుంటాడు. నా కోసం తన ప్రాణాన్ని కోల్పోయేవాడు దానిని దక్కించుకుంటాడు.
\v 26 ఒక మనిషి ఈ ప్రపంచమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని కోల్పోతే అతనికేం లాభం? తన ప్రాణానికి బదులుగా మనిషి దేనిని ఇవ్వగలడు?
\s5
\v 27 మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకొని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.
\v 28 నేను మీతో కచ్చితంగా చెబుతున్నదేమంటే, ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొంతమంది మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావడం చూసేవరకు మరణించరు" అని చెప్పాడు.
\s5
\c 17
\s రూపాతరము (మార్కు 9:2-13; లూకా 9:28-36)
\p
\v 1 ఆరు రోజుల తరువాత యేసు పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానులను తీసికొని ఎత్తైన ఒక పర్వతం మీదికి వెళ్ళాడు. వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది.
\v 2 ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు కాంతి లాగా తెల్లనివయ్యాయి.
\s5
\v 3 అకస్మాత్తుగా మోషే, ఏలీయాలు యేసుతో మాట్లాడుతూ వారికి కనిపించారు.
\v 4 అప్పుడు పేతురు యేసుతో, "ప్రభూ, మనమిక్కడే ఉండిపోదాం. నీకిష్టమైతే ఇక్కడ నీకు, మోషేకు, ఏలీయాకు, మూడు పాకలు వేస్తాను" అన్నాడు.
\s5
\v 5 అతడు మాట్లాడుతూ ఉండగానే గొప్ప వెలుగుతో నిండిన ఒక మేఘం వారిని కమ్ముకుంది. ఆ మేఘంలోనుండి ఒక స్వరం వారితో, "ఈయన నా ప్రియకుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం. మీరు ఈయన చెప్పేది వినండి" అని పలికింది.
\v 6 శిష్యులు ఈ మాట విని భయంతో బోర్లాపడిపోయారు.
\v 7 యేసు వారి దగ్గరకు వచ్చి వారిని తాకి, "భయపడకండి, ఇక లేవండి" అన్నాడు.
\v 8 వారు కళ్ళు తెరచి చూస్తే, యేసు తప్ప ఇంకెవరూ వారికి కనబడలేదు.
\s5
\p
\v 9 వారు కొండ దిగి వచ్చేటప్పుడు, "మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి సజీవుడై లేచే వరకు ఈ దర్శనం మీరు ఎవ్వరితో చెప్పవద్దు" అని యేసు వారికి ఆజ్ఞాపించాడు.
\v 10 అప్పుడు శిష్యులు, "మరి మొదట ఏలీయా రావాలని ధర్మశాస్త్ర బోధకులు ఎందుకు చెబుతున్నారు?" అని అడిగారు.
\s5
\v 11 అందుకు ఆయన ఇలా జవాబిచ్చాడు, "ఏలీయా ముందుగా వచ్చి అంతా చక్కబెడతాడనే మాట నిజమే.
\v 12 అయితే నేను కచ్చితంగా మీతో చెప్పేదేమంటే, ఏలీయా ఇప్పటికే వచ్చేశాడు గాని వారు అతణ్ణి గుర్తించలేదు. పైగా, అతన్ని ఇష్టం వచ్చినట్టుగా బాధించారు. అదే విధంగా మనుష్య కుమారుడు కూడా వారి చేతిలో బాధలు అనుభవించ బోతున్నాడు."
\v 13 బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆయన తమతో చెప్పాడని శిష్యులు గ్రహించారు.
\s శిష్యుల అశక్తత (మార్కు 9:14-29; లూకా 9:37-43)
\s5
\p
\v 14 వారు కొండ దిగి అక్కడి జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరించి,
\v 15 "ప్రభూ, నా కొడుకుని కనికరించు. వాడు మూర్ఛరోగి. చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పుల్లో, నీళ్ళలో పడిపోతుంటాడు.
\v 16 వాణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసికొని వచ్చాను గాని వారు బాగుచేయలేక పోయారు" అని చెప్పాడు.
\s5
\v 17 అందుకు యేసు, "మూర్ఖులారా! విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎప్పటి వరకు మిమ్మల్ని సహిస్తాను? అతణ్ణి నా దగ్గరికి తీసుకు రండి" అన్నాడు.
\v 18 యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలుణ్ణి విడిచిపెట్టేసింది. వెంటనే అతడు బాగుపడ్డాడు.
\s5
\p
\v 19 తరువాత శిష్యులు ఏకాంతంగా యేసును కలిసి "మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్లగొట్టలేక పోయాం?" అని అడిగారు.
\v 20 అందుకాయన, "మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడనుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\v 21 మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు. అని వారితో చెప్పాడు.
\s క్రీస్తు తన మరణ పునరుత్థానాలను గురించి మరలా చెప్పటం (మార్కు 9:30-32; లూకా 9:43- 45)
\s5
\p
\v 22 వారు గలలీలో ఉన్నప్పుడు యేసు, "మానవ పుత్రుణ్ణి మనుషుల చేతికి అప్పగిస్తారు,
\v 23 వారు ఆయన్ని చంపుతారు. కానీ ఆయన మూడో రోజు సజీవుడై తిరిగి లేస్తాడు" అని వారితో చెప్పినప్పుడు వారు చాలా దుఃఖపడ్డారు.
\s ఆలయం పన్ను అద్భుతం (మార్కు 12:13)
\s5
\p
\v 24 వారు కపెర్నహూముకు చేరగానే అర షెకెలు పన్ను వసూలు చేసేవారు పేతురు దగ్గరికి వచ్చి, "మీ గురువుగారు ఈ అర షెకెలు పన్ను చెల్లించడా?" అని అడిగారు. అతడు "అవును, చెల్లిస్తాడు" అన్నాడు.
\v 25 అతడు ఇంటి లోపలికి వెళ్లి యేసుతో ఆ విషయం చెప్పక ముందే ఆయన, "సీమోనూ, ఈ భూమి మీద రాజులు సుంకం, పన్ను ఎవరినుండి వసూలు చేస్తారు? తమ కొడుకుల దగ్గరా లేక బయటివాళ్ళ దగ్గరా?" అని అడిగాడు.
\s5
\v 26 అతడు, "బయటివాళ్ళ దగ్గరే" అని చెప్పినప్పుడు యేసు, "అలాగైతే కొడుకులు స్వతంత్రులే.
\v 27 అయినా ఈ పన్ను వసూలు చేసేవారిని ఇబ్బంది పెట్టకుండా నీవు సముద్రానికి వెళ్ళి, గాలం వేసి, మొదట పడిన చేపను తీసికొని దాని నోరు తెరువు. దానిలో ఒక షెకెలు నాణెం నీకు దొరుకుతుంది. దానిని నాకోసం, నీకోసం వారికి ఇవ్వు" అన్నాడు.
\s5
\c 18
\s చిన్న పిల్లల ఆదర్శం(మార్కు 9:33-37; లూకా 9:46- 48)
\p
\v 1 ఆ రోజుల్లోనే శిష్యులు వచ్చి, "పరలోక రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఎవరు?" అని యేసుని అడిగారు.
\v 2 అప్పుడాయన ఒక చిన్న పిల్లవాణ్ణి పిలిచి, వారి మధ్యలో నిలబెట్టి ఇలా అన్నాడు,
\v 3 "మీరు మారుమనస్సు పొంది చిన్నపిల్లల్లాంటి వారైతేనే పరలోకరాజ్యంలో ప్రవేశించగలరని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\v 4 కాబట్టి ఈ చిన్నవాడిలాగా ఎవడైతే తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు.
\v 5 ఇలాంటి చిన్నవారిని నా పేరట స్వీకరించేవాడు నన్ను స్వీకరించినట్టే.
\v 6 నన్ను నమ్మిన ఈ చిన్నవారిలో ఒక్కడిని ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే వాడి మెడకి ఒక పెద్ద తిరగలి బండ కట్టి చాలా లోతైన సముద్రంలో పడవేయడం అతనికి మేలు.
\s5
\p
\v 7 "నా విషయంలో ఆటంకాలు కలిగించడం లోకానికి శిక్షా కారణమౌతుంది. ఆటంకాలు రాక మానవు, కానీ అవి ఎవరి వలన కలుగుతాయో, ఆ వ్యక్తికి శిక్ష తప్పదు.
\v 8 నీ చెయ్యిగాని, నీ పాదం గాని నీకు ఆటంకంగా ఉంటే, దానిని నరికి పారవెయ్యి. రెండు చేతులూ రెండు పాదాలూ ఉండి నిత్యాగ్నిలో పడడం కంటే కుంటివాడుగానో, అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.
\s5
\v 9 నీ కన్ను నీకు ఆటంకంగా ఉంటే దానిని పెరికి దూరంగా పారవెయ్యి. రెండు కళ్ళు కలిగి నరకంలో పడడం కంటే ఒకే కంటితో జీవంలో ప్రవేశించడం నీకు మంచిది.
\s5
\v 10 ఈ చిన్నపిల్లల్లో ఎవరినీ తక్కువగా చూడవద్దు. వీరిని కాపాడే దూతలు, ఎప్పటికప్పుడు పరలోకంలో నా తండ్రి సన్నిధిలో నిలబడిఆయనవైపు చూస్తూ ఉంటారు.
\s పోయిన గొర్రె (లూకా 15:3-7)
\p
\v 11 మీరేమంటారు?\f + \fr 18.11 \ft కొన్ని ప్రాచీన ప్రతులలో 'నశించిన దానిని వెదికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు' అని రాసి ఉంది.\f* ఒక మనిషికి వంద గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోయింది అనుకోండి,
\s5
\v 12 మిగిలిన తొంభై తొమ్మిది గొర్రెల్ని కొండలమీద విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెని వెదకడానికి వెళ్తాడు గదా?
\v 13 అది అతనికి దొరికినప్పుడు తొంభై తొమ్మిది గొర్రెల గురించి కంటే ఆ ఒక్క గొర్రెను గురించి ఎక్కువగా సంతోషిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\v 14 అదే విధంగా ఈ చిన్నవారిలో ఒక్కడు కూడా నశించడం పరలోకంలోని మీ తండ్రికి ఇష్టం లేదు.
\s5
\p
\v 15 "ఇంకో విషయం. నీ సోదరుడు నీపట్ల తప్పు చేస్తే, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ తప్పిదం గురించి అతనిని గద్దించు. అతడు నీ మాట వింటే నీవు నీ సోదరుణ్ణి సంపాదించుకొన్నట్టే.
\v 16 అతడు వినకపోతే, 'ప్రతి విషయమూ ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట వలన రుజువు కావాలి' కాబట్టి నీవు ఒకరిద్దరిని తీసుకొని అతని దగ్గరకు వెళ్ళు.
\s5
\v 17 అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘానికి తెలియజేయి. అతడు సంఘం మాట కూడా తోసిపుచ్చితే ఇక అతణ్ణి బయటి వారిలో ఒకడుగా, పన్ను వసూలుదారుడుగా పరిగణించు.
\s5
\p
\v 18 "నేను మీతో కచ్చితంగా చేప్పేదేమంటే, భూమి మీద మీరు దేనిని బంధిస్తారో దానిని పరలోకంలో కూడా బంధిస్తారు. దేని కట్లు విప్పుతారో, దానిని పరలోకంలో కూడా విప్పుతారు.
\v 19 ఇంకో విషయం, దేవుణ్ణి వేడుకొనే విషయంలో ఈ భూమి మీద మీలో కనీసం ఇద్దరు ఏకీభవిస్తే దానిని నా పరలోకపు తండ్రి తప్పక అనుగ్రహిస్తాడు.
\s స్థానిక సంఘం మౌలిక రూపం
\p
\v 20 ఎందుకంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో సమావేశం అవుతారో అక్కడ నేను కూడా ఉంటాను.
\s క్షమ సిద్ధాంతం (లూకా 17: 3, 4)
\s5
\p
\v 21 అప్పుడు పేతురు వచ్చి, "ప్రభూ, నా సోదరుడు నా విషయంలో తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు అతణ్ణి క్షమించాలి? ఏడు సార్లు సరిపోతుందా?" అని యేసుని అడిగాడు.
\v 22 అందుకు యేసు అతనికి జవాబిస్తూ, "ఏడు సార్లు వరకే కాదు, ఏడుకు డెబ్బై సార్ల వరకు అని నీతో చెబుతున్నాను.
\s5
\v 23 కాబట్టి పరలోక రాజ్యం ఒక రాజు తన పనివారి దగ్గర లెక్కలు చూడడానికి పూనుకున్నట్టు ఉంది.
\v 24 అతడు లెక్క చూడడం ప్రారంభించగానే, అతనికి పదివేల తలాంతులు బాకీపడిన ఒక పనివాణ్ణి తీసుకొచ్చారు.
\v 25 ఆ బాకీ తీర్చడానికి అతని దగ్గర ఏమీ లేదు. ఆ రాజు అతనినీ అతని భార్యనూ అతని పిల్లలనూ, ఇంకా అతనికి ఉన్న సమస్తాన్నీ అమ్మివేసి తన బాకీ తీర్చాలని ఆజ్ఞాపించాడు.
\s5
\v 26 అప్పుడా పనివాడు ఆ రాజుకు సాష్టాంగ నమస్కారం చేసి, 'రాజా, నా విషయం కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను' అని వేడుకున్నాడు.
\v 27 ఆ రాజు జాలిపడి, అతని బాకీ అంతా క్షమించి, అతనిని విడిచి పెట్టేసాడు.
\s5
\v 28 అయితే ఆ పనివాడు బయటికి వెళ్లి తనకు కేవలం వంద దేనారాలు బాకీ ఉన్న తోటి పనివాణ్ణి చూసి 'నా బాకీ తీర్చు' అని అతని గొంతు పట్టుకున్నాడు.
\v 29 అందుకు అతని తోటి పనివాడు సాగిలపడి, 'కొంచెం ఓపిక పట్టు, నీ బాకీ అంతా తీర్చేస్తాను' అని వేడుకున్నాడు.
\s5
\v 30 కాని దానికి అతడు ఒప్పుకోక తన బాకీ తీర్చేవరకు అతణ్ణి జైలులో పెట్టించాడు.
\v 31 అదంతా చూసిన ఇతర పనివారు చాలా బాధపడి, వెళ్ళి జరిగిందంతా రాజుకు వివరించారు.
\s5
\v 32 అప్పుడా రాజు ఆ మొదటి పనివాణ్ణి పిలిపించి, 'నువ్వు చెడ్డవాడివి. నీవు నన్ను వేడుకున్నప్పుడు నీ బాకీ అంతా క్షమించేసానే,
\v 33 నేను నీ మీద దయ చూపించినట్టే నీవు కూడా నీ తోడి పనివాణ్ణి క్షమించాలి కదా' అని చెప్పి
\s5
\v 34 అతని మీద కోపంతో అతడు తనకు బాకీపడినదంతా పూర్తిగా తీర్చేదాకా చిత్రహింసలు పెట్టే వారికి అతన్ని అప్పగించాడు.
\v 35 మీలో ప్రతి ఒక్కడూ తన సోదరుడి తప్పిదాల విషయంలో హృదయపూర్వకంగా క్షమించకపోతే నా పరలోకపు తండ్రి కూడా మీకు ఆ విధంగానే చేస్తాడు" అని వారితో చెప్పాడు.
\s5
\c 19
\s యూదయ లో యేసు
\p
\v 1 యేసు ఈ మాటలు చెప్పిన తరువాత గలలీ ప్రాంతాన్ని విడిచి యొర్దాను నది అవతల ఉన్న యూదయ ప్రాంతానికి వచ్చాడు.
\v 2 గొప్ప జనసమూహాలు ఆయన్ని వెంబడించాయి. ఆయన వారిని అక్కడ బాగుచేశాడు.
\s విడాకుల గురించి యేసు ఉపదేశం (మత్తయి 5:31,32; మార్కు 10:1- 12; లూకా 16: 18; 1 కొరింతి 7: 10-15)
\s5
\p
\v 3 పరిసయ్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన్ని పరీక్షించడం కోసం, "ఏ కారణం చేతనైనా సరే, పురుషుడు తన భార్యను విడిచిపెట్టడం చట్టబద్ధమేనా?" అని అడిగారు.
\v 4 ఆయన "సృష్టికర్త ఆదినుండి వారిని పురుషునిగా స్త్రీగా సృష్టించాడనీ
\s5
\v 5 అందుకే పురుషుడు తన తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏకశరీరంగా అవుతారని చెప్పాడనీ మీరు చదవలేదా?
\v 6 కాబట్టి వారింక ఇద్దరు కాదు, ఏక శరీరమే. కాబట్టి దేవుడు జత పరచిన వారిని మనిషి వేరు చేయకూడదు" అని వారితో చెప్పాడు.
\s5
\v 7 అందుకు వారు, "అలాటప్పుడు ఒక స్త్రీని విడిచిపెట్టాలంటే ఆమెకు విడాకుల పత్రిక రాసివ్వాలని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?" అని అడిగారు.
\v 8 అప్పుడాయన, "మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే మీ భార్యలను విడిచిపెట్ట వచ్చని మోషే చెప్పాడు గానీ, ప్రారంభం నుండీ అలా జరగలేదు.
\v 9 వ్యభిచార కారణాన్ని బట్టి కాక, ఒకడు తన భార్యను విడిచిపెట్టి మరొకరిని పెళ్ళిచేసికొంటే అతడు వ్యభిచార పాపం చేస్తున్నాడు. అలాగే వేరొకడు (వ్యభిచార కారణంగా) విడిచిపెట్టిన స్త్రీని పెళ్ళి చేసికొనేవాడు వ్యభిచారం చేస్తున్నాడని మీతో చెబుతున్నాను" అని వారితో అన్నాడు.
\s5
\v 10 ఆయన శిష్యులు "భార్యాభర్తల మధ్య సంబంధం ఇలాటిదైతే అసలు పెళ్ళి చేసుకోక పోవడమే మంచిది" అని ఆయనతో అన్నారు.
\v 11 అందుకు యేసు, "దేవుడు అనుమతించిన వారు తప్ప మరి ఎవరూ ఈ మాటను అంగీకరించలేరు.
\v 12 తల్లి గర్భంనుండి నపుంసకులుగా పుట్టినవారు ఉన్నారు, మనుష్యులు నపుంసకులుగా తయారు చేసినవారు ఉన్నారు. పరలోక రాజ్యం కోసం తమను తామే నపుంసకులుగా చేసుకున్న వాళ్ళూ ఉన్నారు. ఈ మాటను అంగీకరించ గలవాడు దానిని స్వీకరించి పాటిస్తాడు గాక" అని వారితో చెప్పాడు.
\s యేసు చిన్న పిల్లలను దీవించడం (మార్కు 10:17- 30; లూకా18: 15-17)
\s5
\p
\v 13 అప్పుడు కొందరు తమ పిల్లల మీద యేసు తన చేతులుంచి వారికోసం ప్రార్థన చేయాలని కోరుతూ చిన్నపిల్లల్ని ఆయన దగ్గరకి తీసికొని వచ్చారు.
\v 14 అయితే ఆయన శిష్యులు ఆ పిల్లల్ని తీసుకొచ్చిన వారిని గద్దించారు. అప్పుడు యేసు, "చిన్నపిల్లల్ని అడ్డుకోకుండా నా దగ్గరికి రానియ్యండి. పరలోకరాజ్యం ఇలాటి వారిదే" అని వారితో చెప్పి,
\v 15 ఆ పిల్లల మీద చేతులుంచి, అక్కడనుంచి వెళ్ళిపోయాడు.
\s సంపన్నుడైన యువ అధికారి (మార్కు 10:17-30; లూకా 18:18-30; 10: 25-30)
\s5
\p
\v 16 ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి, "బోధకుడా, శాశ్వతజీవం పొందాలంటే నేను ఏం మంచి పని చేయాలి?" అని ఆయన్ని అడిగాడు.
\v 17 అందుకు యేసు, "మంచి పని ఏమిటో చెప్పమని నన్నెందుకు అడుగుతున్నావు? మంచి వాడు ఒక్కడే ఉన్నాడు. అయితే నీవు శాశ్వత జీవాన్ని కోరుకుంటే ఆజ్ఞలను పాటించు" అన్నాడు. అతడు "ఏ ఆజ్ఞలు?" అని ఆయనను అడిగాడు.
\s5
\v 18 యేసు, "నరహత్య, వ్యభిచారం, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్షం చెప్పవద్దు, తలిదండ్రుల్ని గౌరవించు,
\v 19 నిన్ను నీవు ఎంతగా ప్రేమించుకుంటావో, నీ పొరుగువాణ్ణి కూడా అంతే ప్రేమించు, అనేవే" అని చెప్పాడు.
\s5
\v 20 అందుకు ఆ యువకుడు, "వీటన్నిటినీ నా చిన్నతనం నుండీ పాటిస్తూనే ఉన్నాను. ఇవి కాక నేనింకేమి చెయ్యాలి?" అన్నాడు.
\v 21 అందుకు యేసు, "నీవు ఇంకా పరిపూర్ణత సాధించాలంటే, వెళ్లి నీకున్నదంతా అమ్మేసి దానిని బీదవారికి పంచిపెట్టు. అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగుతుంది. తరువాత నీవు వచ్చి నన్ను అనుసరించు" అని అతనితో చెప్పాడు.
\v 22 అయితే ఆ యువకుడు గొప్ప ఆస్తిపరుడు. అతడు ఆ మాట వినగానే చాలా విచారంగా తిరిగి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 23 యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు, "నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం.
\v 24 ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూదిబెజ్జంలో గుండా దూరి వెళ్ళడం తేలిక."
\s5
\v 25 శిష్యులు ఈ మాట విని చాలా ఆశ్చర్యపోయారు. "ఇలా అయితే ఇంకెవరు పరలోకంలో ప్రవేశించగలరు?" అన్నారు.
\v 26 యేసు వారితో, "ఇది మానవులకు అసాధ్యమే. కానీ, దేవునికి సమస్తమూ సాధ్యమే" అని చెప్పాడు.
\s రానున్న రాజ్యంలో అపోస్తలుల స్థానాలు
\p
\v 27 పేతురు, "ఇదిగో మేము మాకున్నదంతా వదిలేసి నీ వెంట వచ్చాం గదా, మాకేమి లభిస్తుంది?" అని ఆయన్ని అడగ్గా
\s5
\v 28 యేసు వారితో ఇలా అన్నాడు, "కొత్త సృష్టిలో మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు, నన్ను అనుసరించిన మీరు కూడా పన్నెండు సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు తీర్పు తీరుస్తారు.
\s5
\v 29 నా పేరు నిమిత్తం సోదరులను, సోదరీలను, తండ్రినీ, తల్లినీ, పిల్లలనూ, భూములనూ ఇళ్ళనూ విడిచిపెట్టిన ప్రతివాడూ అంతకు వంద రెట్లు పొందుతాడు. దానితోబాటు శాశ్వత జీవం కూడా సంపాదించుకుంటాడు.
\v 30 మొదటివారిలో చాలామంది చివరి వారవుతారు. చివరివారిలో చాలామంది మొదటి వారవుతారు."
\s5
\c 20
\s ద్రాక్ష తోట కూలీల కథ
\p
\v 1 "ఎలాగంటే, పరలోకరాజ్యం ఈ విధంగా ఉంది, ఒక ఇంటి యజమాని తన ద్రాక్షతోటలో కూలికి పనివారి కోసం వేకువనే లేచి బయలుదేరాడు.
\v 2 రోజుకు ఒక దేనారం ఇస్తానని ఒప్పుకొని కొందరు పనివారిని తన ద్రాక్షతోటలోకి పంపించాడు.
\s5
\v 3 తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి బజారులో ఖాళీగా నిలబడి ఉన్న కొందరిని చూసి,
\v 4 'మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళి పని చేయండి, యేది న్యాయమో ఆ జీతం మీకిస్తానని వారితో చెప్పినప్పుడు వారు వెళ్ళారు.
\s5
\v 5 దాదాపు పన్నెండు గంటలకూ, తరువాత మూడు గంటలకూ, అతడు బయటికి వెళ్లి, ఆ విధంగా చేసాడు.
\v 6 మళ్ళీ సుమారు ఐదు గంటలకు అతడు బయటికి వెళ్లి, ఇంకా కొందరు ఉరికే నిలబడి ఉండటం చూసి, 'మీరెందుకు రోజంతా ఇక్కడ ఖాళీగా నిలబడి ఉన్నారు?' అని వారిని అడిగాడు.
\v 7 వారు 'ఎవ్వరూ మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు' అన్నారు. అతడు, 'అయితే మీరు కూడా నా ద్రాక్షతోటలోకి వెళ్ళండి' అన్నాడు.
\s5
\v 8 సాయంకాలమైన తరువాత ఆ ద్రాక్షతోట యజమాని తన గృహాన్ని పర్యవేక్షించే అధికారిని పిలిచి, 'పనివారిలో చివర వచ్చిన వారితో ప్రారంభించి మొదట వచ్చిన వారివరకు అందరికీ వారి కూలి ఇమ్మని చెప్పాడు.
\v 9 దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరిన వారికి ఒక్కొక్క దేనారం కూలి లభించింది.
\v 10 అది చూసిన మొదట పనిలో చేరినవారు తమకు ఎక్కువ జీతం దొరుకుతుంది అని ఆశించారు గాని వారికి కూడా ఒక్కొక్క దేనారమే ఇచ్చారు.
\s5
\v 11 వారు దానిని తీసికొని 'చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేశారు.
\v 12 మేమైతే పగలంతా ఎండలో కష్టపడి పని చేసాము. కానీ వారికీ మాకూ జీతం సమానంగా ఇచ్చారేమిటి?' అని ఆ యజమాని మీద సణుక్కున్నారు.
\s5
\v 13 అప్పుడా యజమాని వారిలో ఒకనితో, 'మిత్రమా, నేను నీకు అన్యాయమేమీ చేయలేదు. నీకు జీతం ఒక దేనారం ఇస్తానని ఒప్పుకున్నాను కదా? నీ కూలి సొమ్ము తీసికొని వెళ్ళు.
\v 14 నీ కిచ్చినట్టే చివరిలో వచ్చిన వారికి కూడా ఇవ్వడం నా ఇష్టం.
\s5
\v 15 నా సొంత డబ్బును నాకిష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం న్యాయమే కదా? నేను మంచివాణ్ణి కావడం నీకు కడుపుమంటగా ఉందా?' అని అన్నాడు.
\v 16 ఆ విధంగా చివరివారు మొదటివారూ, మొదటివారు చివరివారూ అవుతారు.
\s క్రీస్తు తన మరణ పునరుత్థానాలను గురించి మరలా చెప్పటం (మార్కు 10: 32-34; లూకా 18:31-34; మత్తయి 12:38-42; 16: 21-28; 17:22,23)
\s5
\p
\v 17 యేసు యెరూషలేముకు వెళ్లబోయే ముందు తన పన్నెండు మంది శిష్యుల్నీ ఏకాంతంగా తీసికొనిపోయి, దారిలో వారితో ఇలా అన్నాడు,
\v 18 "ఇదిగో, మనం యెరూషలేము వెళ్తున్నాం. అక్కడ మానవ పుత్రుణ్ణి ప్రధాన యాజకులకూ ధర్మశాస్త్ర పండితులకూ అప్పగిస్తారు. వారు ఆయనకి మరణశిక్ష విధించి
\v 19 ఆయన్ని అవమానించడానికీ కొరడా దెబ్బలు కొట్టడానికీ సిలువ వేయడానికీ యూదేతరులకు అప్పగిస్తారు. మూడవ రోజున ఆయన సజీవంగా తిరిగి లేస్తాడు.
\s యాకోబు, యోహానుల తల్లి విన్నపం (మార్కు 10:35-45)
\s5
\p
\v 20 అప్పుడు జెబెదయి భార్య తన కుమారులతో ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయింది.
\v 21 "నీకేమి కావాలి?" అని యేసు అమెను అడిగాడు. అందుకామె "నీ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులు, ఒకణ్ణి నీ కుడివైపున, మరొకణ్ణి నీ యెడమవైపున, కూర్చోబెట్టుకుంటానని మాట ఇవ్వు" అంది.
\s5
\v 22 అందుకు యేసు, "మీరు ఏమి అడుగుతున్నారో మీకు తెలియడం లేదు. నేను తాగబోయే గిన్నెలోది మీరు తాగగలరా?" అని వారిని అడగ్గా వారు "తాగగలం" అన్నారు.
\v 23 ఆయన "నా గిన్నెలోది మీరు తాగుతారు గానీ, నా కుడి వైపున, ఎడమ వైపున కూర్చోబెట్టుకోవడం నా వశంలో లేదు. నా తండ్రి ఎవరి కోసం వాటిని సిద్ధపరిచాడో వారికే అవి దొరుకుతాయి" అని చెప్పాడు.
\v 24 మిగిలిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు అన్నదమ్ముల మీద కోపం తెచ్చుకున్నారు.
\s5
\v 25 కాబట్టి యేసు వారిని పిలిచి, "ఇతర జాతులలో అధికారులు ప్రజల మీద పెత్తనం చేస్తారనీ గొప్పవారు వారిమీద అధికారం చెలాయిస్తారనీ మీకు తెలుసు.
\v 26 కానీ మీరు అలా ప్రవర్తించ కూడదు. మీలో గొప్పవాడుగా ఉండాలని కోరేవాడు మీకు సేవకుడుగా ఉండాలి.
\v 27 మీలో ప్రధాన స్థానంలో ఉండాలని కోరేవాడు మీకు దాసుడుగా ఉండాలి.
\v 28 అలాగే మనుష్య కుమారుడు తనకు సేవ చేయించుకోడానికి రాలేదు. ఆయన ఇతరులకి సేవ చేయడానికీ అనేకమంది విమోచన కోసం వారి ప్రాణాలకు బదులుగా తన ప్రాణం ఇవ్వడానికీ వచ్చాడు" అని చెప్పాడు.
\s ఇద్దరు గుడ్డివారికి చూపు (మార్కు 10:46-52; లూకా 18:35-43)
\s5
\p
\v 29 వారు యెరికో దాటి వెళుతుండగా గొప్ప జనసమూహం ఆయన వెంట వెళ్తూ ఉంది.
\v 30 అప్పుడు దారి పక్కనే కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్తున్నాడని విని, "ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు" అని కేకలు వేశారు.
\v 31 ప్రజలు వారిని కేకలు వేయవద్దని గద్దించారు గాని వారు "ప్రభూ, దావీదు కుమారా, మమ్మల్ని కరుణించు" అని ఇంకా పెద్దగా కేకలు వేశారు.
\s5
\v 32 యేసు ఆగి, వారిని పిలిచి, "మీకోసం నన్నేమి చేయమంటారు? అని అడిగాడు.
\v 33 వారు "ప్రభూ, మాకు చూపు అనుగ్రహించు" అన్నారు.
\v 34 యేసు వారిమీద జాలిపడి వారి కళ్ళు ముట్టుకున్నాడు. వెంటనే వారు చూపు పొంది ఆయన వెంట వెళ్ళారు.
\s5
\c 21
\s రాజు తనను బహిరంగంగా రాజుగా ప్రకటించుకోవడం (జకర్యా 9: 9; మార్కు 11:1-10; లూకా 19:29-38; యోహాను 12: 12-19)
\p
\v 1 వారు యెరూషలేమును సమీపించి ఒలీవచెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చారు. అక్కడ యేసు ఇద్దరు శిష్యులను పిలిచి
\v 2 "మీకు ఎదురుగా కనిపించే గ్రామంలోకి వెళ్ళండి. వెళ్లగానే కట్టేసి ఉన్న ఒక గాడిదా, దాని పిల్లా మీకు కనబడతాయి. వాటిని విప్పి నా దగ్గరకు తోలుకొని రండి.
\v 3 ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే 'అవి ప్రభువుకు కావాలి' అని చెప్పండి, అప్పుడు అతడు వెంటనే వాటిని మీతో పంపుతాడు" అని చెప్పి వారిని పంపించాడు.
\s5
\v 4 దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన ఈ మాటలు నెరవేరేలా ఇది జరిగింది-
\v 5 "ఇదిగో నీ రాజు దీనుడుగా, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరకు వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి" అనేవే ఆ మాటలు.
\s5
\v 6 అప్పుడా శిష్యులు వెళ్లి యేసు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు.
\v 7 వారు ఆ గాడిదను, దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. వాటిపైన ఆయనను కూర్చోబెట్టారు.
\v 8 జనసమూహంలో అనేకమంది తమ బట్టలు దారి పొడుగునా నేలమీద పరిచారు. కొందరైతే చెట్లకొమ్మలు నరికి దారిలో పరిచారు.
\s5
\v 9 జనసమూహంలో ఆయనకు ముందూ, వెనకా నడుస్తూ, "దావీదు కుమారునికి జయం! ప్రభువు పేరట వచ్చేవానికి స్తుతులు, ఉన్నతమైన స్థలాల్లో జయం" అని కేకలు వేస్తూ వచ్చారు.
\v 10 ఆయన యెరూషలేము లోకి వచ్చినప్పుడు పట్టణమంతా "ఎవరీయన?" అని కలవరపడింది.
\v 11 ఆయనతో వచ్చిన జనసమూహం "ఈయన యేసు. గలలీలోని నజరేతునుండి వచ్చిన ప్రవక్త" అని చెప్పారు.
\s ఆలయం శుద్ధి చేయడం (మార్కు 11: 15-18; లూకా 19: 45-47; యోహాను 2: 13- 16)
\s5
\p
\v 12 యేసు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మటం, కొనటం చేసేవారిని అందరినీ వెళ్లగొట్టాడు. డబ్బు మారకం చేసేవారి బల్లల్నీ, పావురాలు అమ్మేవారి పీటల్నీ, పడదోసాడు.
\v 13 వాళ్ళతో ఇలా అన్నాడు, "నా ఆలయం ప్రార్థనకు నిలయం అని రాసి ఉంది. కానీ మీరు దానిని దొంగల గుహగా చేసేశారు."
\p
\v 14 అక్కడి గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఉన్న యేసు దగ్గరకు వచ్చారు, ఆయన వారందరినీ బాగుచేశాడు.
\s5
\v 15 ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ ఆయన చేసిన అద్భుతాలు చూశారు. "దావీదు కుమారునికి జయం" అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూసినపుడు వారు కోపంతో మండిపడ్డారు.
\v 16 "వీరి కేకలు వింటున్నావా?" అని ఆయనను అడిగారు. అందుకు యేసు, "వింటున్నాను, 'చిన్నపిల్లల, చంటిబిడ్డల నోళ్ళలో స్తుతులను సిద్ధింపజేశావు' అనే మాట మీరెప్పుడూ చదవలేదా?" అని వారితో చెప్పి
\v 17 ఆ పట్టణం నుండి బయలుదేరి బేతనియ వెళ్లి అక్కడ ఆ రాత్రి గడిపాడు.
\s నిష్ఫలమైన అంజూరు చెట్టును శపించడం (మార్కు 11: 12-14; 20-24)
\s5
\p
\v 18 తెల్లవారిన తరువాత ఆయన తిరిగి పట్టణంలోకి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది.
\v 19 అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. అయన దాని దగ్గరకు వెళ్ళి చూస్తే, దానిలో ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, "ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు!" అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది.
\s5
\v 20 అది చూసి, శిష్యులు ఆశ్చర్యపోయి "ఆ అంజూరు చెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో కదా!" అని చెప్పుకున్నారు.
\v 21 అందుకు యేసు, "మీకు విశ్వాసం ఉండి, ఏమాత్రం సందేహపడకుండా ఉంటే, ఈ అంజూరు చెట్టుకు చేసిన దానిని మీరు కూడా చేయగలరు. అంత మాత్రమే కాదు, ఈ కొండతో, 'నీవు లేచి సముద్రంలో పడిపో' అంటే ఆ విధంగా తప్పక జరుగుతుంది.
\v 22 మీరు ప్రార్థన చేసేటప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికాయని నమ్మితే వాటిని మీరు పొంది తీరుతారు" అని వారితో చెప్పాడు.
\s యేసుకు ఉన్న అధికారాన్ని మతపెద్దలు ప్రశ్నించడం (మార్కు 11:27-33; లూకా 20: 1-8)
\s5
\p
\v 23 ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన దగ్గరకు వచ్చి, "ఏ అధికారంతో నీవీ పనులు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?" అని అడిగారు.
\v 24 యేసు, "నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు జవాబు చెబితే నేను ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెబుతాను.
\s5
\v 25 యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి వచ్చిందా లేక మనుషుల నుండి వచ్చిందా?" అని వారిని అడిగాడు. అప్పుడు వారు, 'మనం పరలోకం నుండి అని చెబితే, మీరెందుకు యోహానును నమ్మలేదని అంటాడు,
\v 26 మనుషుల నుండి అని చెబితే ఈ ప్రజలంతా యోహానును ఒక ప్రవక్త అని భావిస్తున్నారు కాబట్టి వారేం చేస్తారో అని భయంగా ఉంది' అని తమలో తాము చర్చించుకొని, "మాకు తెలియదు" అని యేసుకు జవాబిచ్చారు.
\v 27 అందుకు ఆయన, "ఏ అధికారంతో నేనీ పనులు చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను" అన్నాడు.
\s ఇద్దరు కొడుకుల కథ
\s5
\p
\v 28 ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ, "మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో, 'బాబూ, నీవు పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి' అన్నాడు.
\v 29 అతడు, 'నేను వెళ్ళను' అని జవాబిచ్చాడు గానీ తరువాత మనస్సు మార్చుకొని వెళ్ళాడు.
\v 30 అప్పుడా తండ్రి తన రెండో కొడుకు దగ్గరకు వచ్చి అదే విధంగా అడిగాడు. అతడు, 'నేను వెళతాను' అన్నాడు గానీ వెళ్ళలేదు. ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?" అని వారిని అడిగాడు.
\s5
\v 31 వారు "మొదటివాడే" అని జవాబిచ్చారు. యేసు "నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటె ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు.
\v 32 యోహాను నీతి మార్గంలో మీ దగ్గరకు వచ్చాడు గానీ అతణ్ణి మీరు నమ్మలేదు. అయితే పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు నమ్మారు. దాన్ని చూసైనా మీరు పశ్చాత్తాపపడి అతనిని నమ్మలేదు.
\s ద్రాక్ష తోట యజమాని, కౌలు రైతులు (మార్కు 12:1-9; లూకా 20:9-19; యెషయా 5:1-7)
\s5
\p
\v 33 "ఇంకో ఉదాహరణ వినండి, ఒక యజమాని తన పెద్ద స్థలంలో ద్రాక్షతోట నాటించి, దాని చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. అందులో ద్రాక్షగానుగ ఏర్పాటు చేసి, కావలికి ఎత్తుగా ఒక గోపురం కట్టించి, దానిని కౌలుకిచ్చి, దూరదేశం వెళ్ళాడు.
\v 34 కోతకాలం వచ్చినప్పుడు పంటలో తన వంతు తీసికొని రమ్మని ఆ కౌలు రైతుల దగ్గరకు తన దాసులను పంపాడు.
\s5
\v 35 ఆ రైతులు అతని దాసులను పట్టుకొని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు. ఇంకొకడి మీద రాళ్లు రువ్వి తరిమేశారు.
\v 36 అప్పుడు అతడు ముందుకంటే ఎక్కువమంది ఇతర దాసుల్ని పంపాడు. కానీ వారు వీరికి కూడా ముందు వారి లాగానే చేసారు.
\v 37 చివరికి ఆ యజమాని 'నా కుమారుణ్ణి అయితే వారు గౌరవిస్తారు' అనుకొని, తన కుమారుణ్ణి వారి దగ్గరకు పంపాడు.
\s5
\v 38 అయితే ఆ కౌలుదారులు అతనిని చూసి, 'అడుగో, అతడే వారసుడు. అతణ్ణి చంపివేసి అతని వారసత్వం లాగేసుకుందాం, రండి' అని తమలో తాము చెప్పుకున్నారు.
\v 39 వారు అతణ్ణి పట్టుకొని ద్రాక్షతోట బయటికి తోసి చంపేసారు.
\s5
\v 40 ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వచ్చి ఆ రైతుల్ని ఏం చేస్తాడు?" అని వారిని అడిగాడు.
\v 41 వారు, "అతడు ఆ దుర్మార్గుల్ని నిర్దాక్షిణ్యంగా వధిస్తాడు. కోతకాలంలో తనకు రావలసిన కౌలు పండ్లను సక్రమంగా చెల్లించే ఇతర రైతులకు ఆ ద్రాక్షతోటను కౌలుకిస్తాడు" అని ఆయనకు జవాబిచ్చారు.
\s5
\p
\v 42 అప్పుడు యేసు వారితో, "ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. దీనిని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం' అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?
\s5
\v 43 కాబట్టి దేవుని రాజ్యాన్ని మీనుండి తీసివేసి, దానికి ఫలాలను తిరిగి ఇచ్చే ప్రజలకు ఇస్తారు అని మీతో చెబుతున్నాను.
\v 44 ఈ బండ మీద పడేవాడు ముక్కలై పోతాడు గానీ అది ఎవని మీద పడుతుందో వాడిని అది నలిపి పొడి చేస్తుంది" అన్నాడు.
\s5
\p
\v 45 ఆయన చెప్పిన ఉదాహరణలన్నీ తమ గురించే చెప్పాడని ప్రధానయాజకులు, పరిసయ్యులు గ్రహించారు.
\v 46 వారు ఆయన్ని పట్టుకోడానికి తగిన సమయం కోసం చూశారు గానీ ప్రజలకు భయపడ్దారు. ఎందుకంటే ప్రజలంతా ఆయన్ని ఒక ప్రవక్తగా భావిస్తున్నారు.
\s5
\c 22
\s పెళ్లి విందు ఉపమానం (లూకా14:16-24)
\p
\v 1 యేసు వారికి జవాబిస్తూ మళ్ళీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు.
\v 2 "పరలోకరాజ్యం, ఒక రాజు తన కుమారుని పెళ్ళి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది.
\v 3 ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు. అయితే వారెవ్వరూ రాలేదు.
\s5
\v 4 అప్పుడు ఆ రాజు 'ఇదిగో, నా విందు సిద్ధంగా ఉంది. ఎద్దులను, కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను. పెళ్ళి విందుకు రండి' అని ఆహ్వానితులను మళ్ళీ పిలవడానికి మరి కొందరు సేవకులను పంపించాడు.
\s5
\v 5 కానీ వారు లెక్క చేయకుండా, ఒకడు తన పొలానికి మరొకడు తన వ్యాపారానికి వెళ్లారు.
\v 6 మిగిలినవారు అతని దాసులను పట్టుకొని అవమాన పరచి చంపారు.
\v 7 కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గుల్ని సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.
\s5
\v 8 అప్పుడతడు, "పెళ్ళి విందు సిద్ధంగా ఉంది గానీ నేను పిలిచిన వారు యోగ్యులు కారు.
\v 9 కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్ళి మీకు కనబడిన వారందరినీ పెళ్ళి విందుకు ఆహ్వానించండి" అని తన దాసులతో చెప్పాడు.
\v 10 ఆ దాసులు రహదారుల్లోకి వెళ్ళి చెడ్డవారినీ మంచివారినీ తమకు కనబడినవారి నందరినీ పోగు చేశారు. కాబట్టి ఆ ఇల్లంతా పెళ్ళి విందుకు వచ్చినవారితో నిండిపోయింది.
\s5
\v 11 రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు. అక్కడ పెళ్లి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు అతనికి కనిపించాడు.
\v 12 రాజు అతనితో, 'మిత్రమా, పెళ్లి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు?' అని అడిగాడు. కానీ అతడు మౌనంగా ఉండిపోయాడు.
\s5
\v 13 కాబట్టి రాజు, 'ఇతని కాళ్లు, చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి' అని తన పరిచారకులతో చెప్పాడు.
\v 14 ఆహ్వానం అందుకొన్నవారు చాలామంది ఉన్నారు గానీ ఎన్నికయిన వారు కొద్దిమందే."
\s హేరోదు అనుచర గణానికి యేసు జవాబు (మార్కు 12:13-17; లూకా 20:20-26)
\s5
\p
\v 15 అప్పుడు పరిసయ్యులు వెళ్లి, ఆయన్ని ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలి అని ఆలోచించారు.
\v 16 వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరకు పంపించారు. వారు ఆయనతో, "బోధకుడా, నీవు యధార్ధవంతుడివనీ, దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివనీ, ఎవరినీ లెక్క చేయవనీ మాకు తెలుసు.
\v 17 సీజరు చక్రవర్తికి పన్ను కట్టటం న్యాయమా? కాదా? ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు" అని అడిగారు.
\s5
\v 18 యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, "కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు?
\v 19 ఏదీ, ఒక సుంకం నాణెం ఒకటి నాకు చూపించండి" అన్నాడు. వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు.
\s5
\v 20 ఆయన, "దీనిపై ఉన్న బొమ్మ, అక్షరాలు ఎవరివి?" అని వారి నడిగాడు. వారు, "అవి సీజరు చక్రవర్తివి" అన్నారు.
\v 21 ఆయన వెంటనే, "అలాగైతే సీజరువి సీజరుకూ, దేవునివి దేవునికీ చెల్లించండి" అని వారితో చెప్పాడు.
\v 22 వారీమాట విని ఆశ్చర్యపడి ఆయన్ని విడిచి వెళ్లిపోయారు.
\s సద్దూకయ్యుల ప్రశ్నకు జవాబు (మార్కు 12;18-27; లూకా (20: 27- 38)
\s5
\p
\v 23 అదే రోజు, మరణించిన వారు తిరిగి లేవడం జరగదని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి,
\v 24 "బోధకుడా, ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్లి చేసికొని తన సోదరునికి సంతానం కలిగించాలి అని మోషే చెప్పాడు గదా.
\s5
\v 25 మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. మొదటివాడు పెళ్ళి చేసికొని సంతానం లేకుండానే చనిపోయాడు. అతని తమ్ముడు అతని భార్యను చేసుకున్నాడు.
\v 26 ఈ రెండోవాడు, మూడోవాడు, తరువాత ఏడోవాని వరకు అందరూ ఆ విధంగానే చేసి చనిపోయారు.
\v 27 వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది.
\v 28 చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్య అవుతుంది? ఇక్కడ ఆమె వారందరికీ భార్యగా ఉంది కదా? అని ఆయనను అడిగారు.
\s5
\p
\v 29 అందుకు యేసు, "మీకు లేఖనాలూ, దేవుని శక్తీ తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు.
\v 30 పునరుత్థానం జరిగిన తరువాత ఎవరూ పెళ్ళి చేసుకోరు, పెళ్ళికియ్యరు. వారు పరలోకంలోని దేవదూతల్లాగా ఉంటారు.
\s5
\v 31 చనిపోయిన వారి పునరుత్థానం విషయమైతే దేవుడు, 'నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి' అని చెప్పిన మాట మీరు చదవలేదా?
\v 32 ఆయన బ్రదికి ఉన్నవారికే దేవుడు, చనిపోయినవారికి కాదు" అని వారితో చెప్పాడు.
\v 33 ఈ మాటలు విన్న జన సమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు.
\s పరిసయ్యుల ప్రశ్నలకు జవాబు (మార్కు 12: 28-34; లూకా 10:25-28)
\s5
\p
\v 34 ఆయన సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు ఆయన దగ్గరకి వచ్చారు.
\v 35 వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయన్ని పరీక్షించడానికి,
\v 36 "బోధకుడా , ధర్మశాస్త్రంలో ఏది అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ?" అని అడిగాడు.
\s5
\v 37 అందుకు యేసు, " 'నీ పూర్ణహృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణమనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి' అనేదే.
\v 38 ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.
\s5
\v 39 'మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి' అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే.
\v 40 ఈ రెండు ఆజ్ఞలూ ధర్మశాస్త్రమంతటికీ, ప్రవక్తల రాతలకూ మూలాధారం" అని అతనితో చెప్పాడు.
\s పరిసయ్యులకు ప్రశ్న (మార్కు 12: 35-37; లూకా 20: 41-44)
\s5
\p
\v 41 మరోసారి పరిసయ్యులు ఒకచోట సమావేశమై ఉన్నప్పుడు, యేసు వారిని,
\v 42 "క్రీస్తు విషయంలో మీ అభిప్రాయమేమిటి? ఆయన ఎవరి కుమారుడు?" అని ప్రశ్నించాడు. వారు, "ఆయన దావీదు కుమారుడు" అని చెప్పారు.
\s5
\v 43 అందుకు యేసు, "అయితే, 'నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకు
\v 44 నీవు నా కుడిపక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు' అని దావీదు ఆయనను ఆత్మమూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు?
\s5
\v 45 దావీదు ఆయన్ని ప్రభువు అని పిలుస్తుండగా ఆయన అతనికి ఏ విధంగా కుమారుడవుతాడు?" అని వారిని అడిగాడు.
\v 46 ఆయన ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు. అంతే కాదు, ఆ రోజునుండి ఆయన్ని ఒక ప్రశ్న అడగటానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు.
\s5
\c 23
\s పరిసయ్యుల ఆగడాలు (మార్కు 12: 38-40; లూకా 20: 45-47)
\p
\v 1 అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు,
\v 2 ధర్మశాస్త్ర పండితులు, పరిసయ్యులు మోషే పీఠంపై కూర్చుంటారు
\v 3 కాబట్టి వారు మీతో చెప్పేవాటినన్నిటిని ఆలకించి అనుసరించండి. అయితే వారి పనులను మాత్రం అనుకరించకండి. వారు చెబుతారే గాని చేయరు.
\s5
\v 4 మోయడానికి సాధ్యం కాని బరువులు మనుషుల భుజాలపై మోపుతారు గాని వాటిని మోయడానికి సహాయంగా తమ వేలు కూడా ఉపయోగించరు.
\v 5 వారు చేసే పనులన్నీ మనుషులకు కనబడాలని చేస్తారు. తమ చేతులపై దైవ వాక్కులు రాసి ఉన్నరక్షరేకులను వెడల్పుగా, తమ వస్త్రాల అంచులు పెద్దవిగా చేసుకుంటారు.
\s5
\v 6 విందు భోజనాల్లో గౌరవప్రదమైన స్థానాలూ సమాజ మందిరాలలో ఉన్నతమైన ఆసనాలూ కోరుకుంటారు.
\v 7 సంత వీధుల్లో దండాలు పెట్టించుకోవడం, ప్రజలచేత 'రబ్బీ, రబ్బీ' అని పిలిపించుకోవడం వారికి ఇష్టం.
\s5
\v 8 మీరు మాత్రం బోధకులని పిలిపించుకోవద్దు. అందరికీ ఒక్కడే బోధకుడు. మీరంతా సోదరులు.
\v 9 ఇంకా, భూమిమీద ఎవరినీ 'తండ్రి' అని పిలవవద్దు. పరలోకంలో ఉన్న దేవుడొక్కడే మీ తండ్రి.
\v 10 అంతే గాక, మీరు గురువులని పిలిపించుకోవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు.
\s5
\v 11 మీలో అందరికంటె గొప్పవాడు మీకు సేవకుడై ఉండాలి.
\v 12 తనను తాను గొప్ప చేసికొనేవాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.
\s పరిసయ్యులకు యాతన (మార్కు 12: 38-40; లూకా 20:47)
\s5
\p
\v 13 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. ఎందుకంటే మనుషులు పరలోకరాజ్యంలో ప్రవేశించడానికి మీరు అడ్డుగా ఉన్నారు.
\v 14 మీరు అందులో ప్రవేశించరు, ఇతరులను ప్రవేశించ నియ్యరు. మీకు శిక్ష తప్పదు.
\v 15 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. ఒక్క వ్యక్తిని మీ మతంలో కలుపుకోడానికి మీరు సముద్రాన్నీ, భూమినీ చుట్టివచ్చినంత పని చేస్తారు. తీరా అతడు మీతో కలిసినప్పుడు అతణ్ణి మీకంటె రెండంతలు నరకపాత్రుడిగా చేస్తారు. మీకు శిక్ష తప్పదు.
\s5
\p
\v 16 అయ్యో, అంధ మార్గదర్శులారా, ఒకడు దేవాలయం తోడు అని ఒట్టుపెట్టుకొన్నా ఫరవాలేదు గానీ ఆ దేవాలయంలోని బంగారం తోడు అని ఒట్టు పెట్టుకొంటే మాత్రం వాడు దానికి కట్టుబడి తీరాలి అని మీరు చెబుతారు.
\v 17 బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? బంగారమా, ఆ బంగారాన్ని పవిత్ర పరిచే దేవాలయమా?
\s5
\v 18 అలాగే బలిపీఠం తోడు అని ఒట్టు వేస్తే పరవాలేదు గాని, దానిపై ఉన్న అర్పణ తోడు అని ఒట్టు వేస్తే మాత్రం దానికి కట్టుబడి ఉండాలని మీరు చెబుతారు.
\v 19 బుద్ధిహీనులారా, అంధులారా! ఏది గొప్పది? అర్పించిన వస్తువా, దానిని పవిత్ర పరిచే బలిపీఠమా?
\s5
\v 20 బలిపీఠం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దానితోడనీ, దానిపై ఉన్న వాటన్నిటి తోడనీ ఒట్టుపెట్టుకొంటున్నాడు.
\v 21 అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ, దానిలో నివసించేవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.
\v 22 ఆకాశం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు దేవుని సింహాసనం తోడనీ, దానిపై కూర్చున్నవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.
\s5
\p
\v 23 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోపు, జీలకర్రలో, పదో వంతు చెల్లిస్తారు, కానీ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన విషయాలైన న్యాయం, కరుణ, విశ్వాసం అనేవాటిని విడిచిపెట్టారు. పదో వంతు చెల్లించడం మానకుండానే వీటిని కూడా పాటిస్తూ ఉండాలి.
\v 24 అంధ మార్గదర్శులారా, మీరు చిన్న దోమల్ని వడకట్టి తీసేసి పెద్ద ఒంటెను మింగేస్తారు.
\s5
\v 25 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు గిన్నె, పళ్లెం బయట శుభ్రం చేస్తారు గాని వాటి లోపలి వైపంతా దోపిడీ, అత్యాశ నిండి ఉన్నాయి.
\v 26 గుడ్డి పరిసయ్యుడా, గిన్నె, పళ్ళెం, ముందుగా లోపల శుభ్రం చెయ్యి. అప్పుడు వాటి బయట కూడా శుభ్రం అవుతుంది.
\s5
\v 27 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. అవి బయటకి అందంగానే కనిపిస్తాయి. కాని, లోపల చచ్చినవారి యెముకలూ, సమస్త కల్మషమూ నిండి ఉంటాయి.
\v 28 అలాగే మీరు కూడా బయటకి మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తారు. కానీ, మీ లోపల కపటమూ, దుష్టత్వమూ నిండి ఉంటారు.
\s5
\p
\v 29 అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపట వేషధారులు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల సమాధులు కట్టిస్తారు, నీతిమంతుల సమాధులకు రంగులు వేస్తారు.
\v 30 'మేమే గనుక మా పూర్వికుల రోజుల్లో జీవించి ఉంటే ప్రవక్తలను చంపే విషయంలో వారితో కలిసేవాళ్ళం కాము' అని చెప్పుకొంటారు.
\v 31 నిజానికి మీరు ప్రవక్తలను చంపినవారి సంతానం అని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు.
\s5
\v 32 ఇంకేం, మీ పూర్వికుల దోషాలను మీరే పూర్తి చేయండి.
\p
\v 33 సర్పాల్లారా, సర్పసంతానమా! మీరు నరకాన్ని తప్పించుకోలేరు.
\s5
\v 34 కాబట్టి వినండి! నేను మీ దగ్గరకు ప్రవక్తలనూ, జ్ఞానులనూ, ధర్మశాస్త్ర పండితులనూ పంపుతున్నాను. మీరు వారిలో కొంతమందిని చంపుతారు, సిలువ వేస్తారు. కొంతమందిని మీ సమాజ కేంద్రాల్లో కొరడాలతో కొడతారు, మరి కొందరిని ఊరినుంచి ఊరికి తరిమి కొడతారు.
\v 35 నీతిపరుడైన హేబెలు రక్తంతో మొదలుపెట్టి, మీరు దేవాలయం, బలిపీఠం మధ్య చంపి పడవేసిన బరకీయ కుమారుడు జెకర్యా రక్తం వరకు ఈ భూమి మీద చిందిన నీతిపరుల రక్తాపరాధమంతా మీపైకి వస్తుంది.
\v 36 అదంతా ఈ తరం వారిమీదికి వస్తుందని మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\s యెరూషలేముకై విలాపం (లూకా 13:34,35)
\s5
\p
\v 37 యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ, దేవుడు నీ దగ్గరకు పంపిన వారిని రాళ్లతో కొట్టి చంపేదానా, కోడి తన పిల్లలను ఏ విధంగా తన రెక్కల కింద చేర్చుకొని పోషిస్తుందో అదే విధంగా నేను కూడా నీ పిల్లలను చేర్చుకోవాలని చూశాను గానీ నువ్వు ఇష్టపడలేదు.
\v 38 ఇదిగో ఇక మీ యిల్లు మీకే పాడుగా విడిచి పెట్టేస్తున్నాను
\v 39 ఇప్పటినుండి మీరు 'ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతులు పొందు గాక' అని చెప్పే వరకు నన్ను చూడరని నేను మీతో చెబుతున్నాను."
\s5
\c 24
\s ఒలీవ కొండ ప్రసంగం. దేవాలయం విధ్వంసం గురించి (మార్కు 13: 1, 2; లూకా 21: 5,6)
\p
\v 1 యేసు దేవాలయం నుండి వెళ్తూ ఉండగా, ఆయన శిష్యులు ఆ దేవాలయం కట్టడాలను ఆయనకు చూపించారు.
\v 2 అందుకాయన, "మీరు ఇవన్నీ చూస్తున్నారు గదా, నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఇక్కడ రాయి మీద రాయి ఒక్కటి కూడా నిలిచి ఉండకుండా అన్నీ కూలదోస్తారు" అని వారితో అన్నాడు.
\s శిష్యుల మూడు ప్రశ్నలు (మార్కు 13: 3, 4; లూకా 21: 7)
\s5
\p
\v 3 ఆయన ఒలీవ కొండమీద కూర్చొని ఉండగా శిష్యులు ఆయన దగ్గరకు ఏకాంతంగా వచ్చి, "నీవు చెప్పిన విషయాలు ఎప్పుడు జరుగుతాయి? నీ రాకడకూ, లోకాంతానికీ సంకేతాలు మాకు చెప్పు" అని అడిగారు.
\s ఈ యుగం పరిణామాలు (మార్కు 13: 5, 13; లూకా 21: 8- 19)
\v 4 యేసు వారితో ఇలా అన్నాడు, "ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి.
\v 5 చాలామంది నా పేరున వచ్చి 'నేనే క్రీస్తుని' అని చెప్పి అనేకమంది దారి తప్పేలా చేస్తారు.
\s5
\v 6 అంతే గాక మీరు యుద్ధాల గురించీ, వాటి గురించిన వార్తలను వింటారు. అప్పుడు కలవరపడవద్దు. ఇవన్నీ జరిగి తీరవలసిందే గాని అంతం వెంటనే రాదు.
\v 7 జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి.
\v 8 అక్కడక్కడ కరవులూ భూకంపాలూ వస్తాయి. ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే.
\s5
\p
\v 9 "అప్పుడు మనుషులు మిమ్మల్ని హింసలకు గురి చేస్తారు, చంపుతారు. నా పేరు పెట్టుకున్నందుకు మనుషులంతా మిమ్మల్ని ద్వేషిస్తారు.
\v 10 ఆ కాలంలో చాలామంది వెనక్కి జారిపోతారు, ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు శత్రువులకు పట్టిస్తారు.
\v 11 అధిక సంఖ్యలో కపట ప్రవక్తలు వచ్చి అనేకమందిని మోసగిస్తారు.
\s5
\v 12 అన్యాయం పెరిగిపోయి, దాని ఫలితంగా చాలామందిలో ప్రేమ చల్లారిపోతుంది.
\v 13 అంతం వరకు ఎవరు నిలిచి ఉంటారో వారికే విమోచన లభిస్తుంది.
\v 14 రాజ్యం గురించిన శుభవార్త మానవులందరికీ సాక్ష్యంగా లోకమంతటా వినబడుతుంది. ఆ తరువాత అంతం వస్తుంది.
\s మహా బాధల కాలం (మార్కు 13: 14-23)
\s5
\p
\v 15 "కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన 'వినాశకారి అయిన హేయ వస్తువు' అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక)
\v 16 యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి.
\v 17 మిద్దెలపై ఉన్నవారు కింద ఇంట్లోనుండి దేన్నైనా తీసికొనిపోవడానికి దిగి రాకూడదు.
\v 18 పొలాల్లో ఉన్నవాడు తన బట్టలు తీసుకోడానికి ఇంటికి వెళ్ళకూడదు.
\s5
\v 19 అయ్యో, ఆ రోజులు గర్భవతులకీ చంటిపిల్లల తల్లులకూ కష్టకాలం.
\v 20 అప్పుడు మహా బాధలు కలుగుతాయి. కాబట్టి మీరు పారిపోయే సమయం చలికాలంలో గానీ విశ్రాంతిదినాన గానీ రాకూడదని ప్రార్థన చేసుకోండి.
\v 21 ఎందుకంటే అంతటి ఉపద్రవం లోకం పుట్టింది మొదలు ఇప్పటివరకు రాలేదు, ఇక ముందు రాదు.
\v 22 ఆ రోజుల్ని దేవుడు తగ్గించకపోతే శరీరంతో ఉన్న ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. ఆయన ఎన్నుకున్నవారి నిమిత్తం ఆ రోజుల్ని దేవుడు తక్కువ చేస్తాడు.
\s5
\p
\v 23 "ఆ కాలంలో ఎవరైనా, 'ఇదిగో, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు' అని చెబితే నమ్మవద్దు.
\v 24 కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వచ్చి, సాధ్యమైతే దేవుడు ఎన్నుకున్న వారిని కూడా మోసగించడానికి గొప్ప సూచక క్రియలూ, అద్భుతాలూ జరిగిస్తారు.
\v 25 ఇదిగో, ఇవన్నీ నేను ముందుగానే మీతో చెప్పాను.
\s5
\v 26 కాబట్టి ఎవరైనా 'ఇదిగో, క్రీస్తు ఎడారిలో ఉన్నాడు' అని చెప్పినా, 'ఇదిగో, ఈ గది లోపల ఉన్నాడు' అని చెప్పినా మీరు నమ్మవద్దు, వారివెంట వెళ్ళవద్దు.
\s మహిమ సహితంగా రాజు రాక (మార్కు 13: 24- 37; లూకా 21: 25- 36)
\p
\v 27 మెరుపు తూర్పు వైపున పుట్టి పడమర వైపుకు ఏవిధంగా కనిపిస్తుందో, ఆ విధంగా మానవ పుత్రుని రాక కూడా ఉంటుంది.
\v 28 పీనుగు ఎక్కడ ఉందో అక్కడ రాబందులు పోగవుతాయి.
\s5
\p
\v 29 "ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి.
\s5
\v 30 అప్పుడు మానవ పుత్రుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న సమస్త జాతుల ప్రజలు తమ గుండెలు బాదుకుంటారు.
\v 31 ఆయన గొప్ప బూర ధ్వనులతో తన దూతలను పంపుతాడు. వారు ఆకాశం ఆ కొన నుండి ఈ కొన వరకు నలుదిక్కుల నుండీ ఆయన ఎన్నుకున్నవారిని సమకూర్చుతారు.
\s అంజూరు చెట్టు ఉపమానం (మార్కు 13: 28,29: లూకా 21: 29-31)
\s5
\p
\v 32 "అంజూరు చెట్టు గురించిన ఉదాహరణ నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు.
\v 33 అదే విధంగా ఈ సంగతులన్నీ జరగటం చూసినప్పుడు ఆయన మీకు సమీపంలోనే, ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోండి.
\s5
\v 34 ఇవన్నీ జరిగే వరకూ ఈ జాతి అంతరించదని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\v 35 ఆకాశమూ భూమీ గతించిపోతాయి గాని నా మాటలు ఎన్నటికీ గతించవు.
\s5
\p
\v 36 "అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడో తండ్రికి మాత్రమే తెలుసు గాని, ఏ మనిషికీ తెలియదు. చివరికి పరలోకంలోని దూతలకు, కుమారునికి కూడా తెలియదు.
\s5
\v 37 నోవహు రోజులు ఎలా ఉండేవో మానవ పుత్రుని రాకడ కూడా అలా ఉంటుంది.
\v 38 జలప్రళయం రాక ముందు నోవహు ఓడలోకి వెళ్లిన రోజు వరకు, మనుషులు తింటూ, తాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇచ్చి పుచ్చుకుంటూ ఉన్నారు.
\v 39 జలప్రళయం వచ్చి వారంతా కొట్టుకొనిపోయే వరకు వారికి తెలియలేదు. ఆ విధంగానే మానవ పుత్రుని రాకడ ఉంటుంది.
\s5
\v 40 ఆ రోజు, పొలంలో ఇద్దరు పురుషులు ఉంటే, ఒకడు వెళ్ళిపోతాడు, మరొకడు అక్కడే ఉండిపోతాడు.
\v 41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుతూ ఉంటే, ఒకామె వెళ్ళిపోతుంది, మరొకామె ఉండిపోతుంది.
\v 42 ఏ రోజున మీ ప్రభువు వస్తాడో మీకు తెలీదు కాబట్టి మెలకువగా ఉండండి.
\s5
\v 43 దొంగ ఏ గంటలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే అతడు మేలుకొని ఉండి దొంగతనం చేయనివ్వడు కదా!
\v 44 మీరు ఎదురు చూడని గంటలో మనుష్య కుమారుడు వస్తాడు కాబట్టి మీరు కూడా సిద్ధంగా ఉండండి.
\s5
\p
\v 45 "ఒక యజమాని తన ఇంటిలో పనివారికి వేళకు భోజనం పెట్టడానికి నియమించిన నమ్మకమైన, తెలివైన దాసుదు ఎవరుంటారు?
\v 46 యజమాని ఇంటికి వచ్చినప్పుడు ఏ దాసుడు ఆ విధంగా చేస్తుండడం గమనిస్తాడో ఆ దాసుడు ధన్యుడు.
\v 47 ఆ యజమాని తన యావదాస్తి మీదా ఆ దాసుని నియమిస్తాడని నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను.
\s5
\v 48 కానీ ఆ దాసుడు చెడ్డవాడైతే, 'నా యజమాని ఆలస్యంగా వస్తాడులే' అని తన మనస్సులో అనుకొని
\v 49 తన సాటి సేవకుల్ని కొడుతూ, తాగుబోతులతో కలిసి తింటూ, తాగుతూ ఉంటే,
\v 50 అతడు ఎదురు చూడని రోజున, అనుకోని గంటలో వాని యజమాని వచ్చి, వాణ్ణి రెండు ముక్కలుగా నరికించి కపట వేషధారులతో బాటు వాడిని శిక్షిస్తాడు.
\v 51 అక్కడ ఏడుపూ పండ్లు కొరకడమూ ఉంటాయి.
\s5
\c 25
\s ఒలీవ కొండ ప్రసంగం. ప్రభువు రాక, పదిమంది కన్యలకు పరీక్ష
\p
\v 1 పరలోకరాజ్యాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. పదిమంది యువతులు పెళ్ళికొడుకుని కలుసుకోడానికి కాగడాలు పట్టుకొని బయలుదేరారు.
\v 2 వీరిలో ఐదుగురు తెలివి తక్కువ వారు, ఐదుగురు తెలివైన వారు.
\v 3 తెలివి తక్కువ వారు తమ కాగడాలు పట్టుకొన్నారు గాని తమతో నూనె తీసికొని పోలేదు.
\v 4 తెలివైన వారు తమ దివిటీలతో బాటు సీసాలలో నూనె తీసికొని వెళ్ళారు.
\s5
\v 5 పెళ్ళికొడుకు రావడం ఆలస్యం కావడంతో వారంతా నిద్రలోకి జారుకున్నారు.
\v 6 అర్ధరాత్రి, 'ఇడుగో, పెళ్ళికొడుకు వస్తున్నాడు. అతనికి ఎదురు వెళ్ళండి' అనే పిలుపు వినిపించింది.
\s5
\v 7 అప్పుడు ఆ యువతులంతా లేచి తమ కాగడాలు సరిచేసుకున్నారు.
\v 8 అయితే తెలివి తక్కువ యువతులు, 'మా కాగడాలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాక్కూడా ఇస్తారా?' అని తెలివైన యువతులను అడిగారు.
\v 9 అందుకు వారు, 'మా దగ్గర ఉన్న నూనె మన ఇద్దరికీ సరిపోదేమో, మీరు వెళ్ళి నూనె అమ్మేవారి దగ్గర కొనుక్కోండి' అని చెప్పారు.
\s5
\v 10 వారు కొనడానికి వెళ్తూ ఉండగానే పెళ్ళికొడుకు వచ్చేశాడు. అప్పుడు సిద్ధంగా ఉన్న ఐదుగురు యువతులు అతనితో కలిసి పెళ్ళి విందుకు లోపలికి వెళ్లారు.
\v 11 వెంటనే తలుపు మూశారు. ఆ తరువాత మిగిలిన యువతులు వచ్చి, 'ప్రభూ, ప్రభూ, మాకు తలుపు తెరవండి' అని అడిగారు.
\v 12 కాని ఆయన, 'నేను కచ్చితంగా చెబుతున్నాను, మీరెవరో నాకు తెలీదు' అన్నాడు.
\v 13 ఆ రోజైనా, ఆ గంటైనా మీకు తెలియదు కాబట్టి మేలుకొని ఉండండి.
\s ప్రభువు రాక, సేవకులకు పరీక్ష
\s5
\p
\v 14 "పరలోక రాజ్యం ఇలా ఉంటుంది, ఒక మనిషి దూరదేశానికి ప్రయాణమై తన పనివారిని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించాడు.
\v 15 వారి వారి సామర్ధ్యం ప్రకారం ఒకడికి ఐదు తలాంతులూ ఇంకొకడికి రెండు తలాంతులూ మరొకడికి ఒక్క తలాంతూ ఇచ్చి, వెంటనే ప్రయాణమై వెళ్ళాడు.
\v 16 ఐదు తలాంతులు తీసికొన్న వాడు వాటితో వ్యాపారం చేసి, ఇంకో ఐదు తలాంతులు సంపాదించాడు.
\s5
\v 17 అదే విధంగా రెండు తలాంతులు తీసికొన్న వాడు ఇంకో రెండు సంపాదించాడు.
\v 18 అయితే ఒక తలాంతు తీసికొన్న వాడు వెళ్లి, గుంట తవ్వి తన యజమాని డబ్బు దాచిపెట్టాడు.
\s5
\p
\v 19 "చాలా కాలం తరువాత ఆ యజమాని తిరిగి వచ్చి తన పనివారి దగ్గర లెక్కలు చూసుకున్నాడు.
\v 20 అప్పుడు ఐదు తలాంతులు తీసికొన్న వాడు మరో ఐదు తలాంతులు తెచ్చి 'అయ్యగారూ, మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో ఐదు తలాంతులు సంపాదించాను' అని చెప్పాడు.
\v 21 అతని యజమాని, 'ఆహా! నీవు నమ్మకమైన మంచి పనివాడివి! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో' అన్నాడు.
\s5
\v 22 అలాగే రెండు తలాంతులు తీసికొన్న వాడు వచ్చి, 'అయ్యగారూ, మీరు నాకు రెండు తలాంతులు ఇచ్చారు కదా, అవి గాక నేను ఇంకో రెండు తలాంతులు సంపాదించాను' అని చెప్పాడు.
\v 23 యజమాని, 'ఆహా! నీవు ఈ చిన్నపాటి విషయంలో నమ్మకంగా ఉన్నావు. కాబట్టి నిన్ను ఎక్కువ పనుల మీద నియమిస్తాను. నీ యజమాని సంతోషంలో నీవు కూడా భాగం పంచుకో' అన్నాడు.
\s5
\v 24 తరువాత ఒక్క తలాంతు తీసికొన్నవాడు వచ్చాడు. అతడన్నాడు, 'అయ్యగారూ, మీరు విత్తనాలు నాటని చోట పంట కోయడానికీ, వెదజల్లని చోట పంట పోగుచేసుకోడానికీ చూసే కఠినాత్ములని నాకు తెలుసు.
\v 25 కాబట్టి నాకు భయం వేసి, మీరిచ్చిన తలాంతును భూమిలో దాచిపెట్టాను. ఇదిగో, తీసికోండి' అన్నాడు.
\s5
\v 26 అందుకు ఆ యజమాని అతనితో, 'నీవు సోమరివి! చెడ్డ దాసుడివి. నేను విత్తని చోట కోసేవాడిని, వెదజల్లని చోట పంట పోగుచేసుకో జూసే వాడిని అని నీకు తెలుసు గదా!
\v 27 అలాంటప్పుడు నీవు నా డబ్బుని వడ్డీవ్యాపారుల దగ్గర ఉంచాల్సింది. అప్పుడు నేను వచ్చి దానిని వడ్డీతో కలిపి తీసికొని ఉండేవాణ్ణి' అని చెప్పి,
\s5
\v 28 'ఆ తలాంతును వాని దగ్గరనుండి తీసికొని పది తలాంతులు ఉన్నవాడికి ఇవ్వండి.
\v 29 కలిగిన ప్రతివానికీ మరింత ఇవ్వటం జరుగుతుంది, అతడు సమృద్ధి కలిగి ఉంటాడు. లేనివాని దగ్గరనుండి వాడు కలిగి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుంది.
\v 30 పనికిమాలిన ఆ దాసుణ్ణి బయట ఉన్న చీకటిలోకి తోసివేయండి. అక్కడ ఏడుపు, పండ్లు కొరుక్కోవడం ఉంటాయి.
\s ప్రభువు రాక, యుదేతర జాతులకు పరీక్ష (యోవేలు 3:11-16)
\s5
\p
\v 31 "మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.
\v 32 మానవులందరినీ పోగుచేసి ఆయన ముందు నిలబెడతారు. అప్పుడు ఒక గొల్లవాడు తన మందలో మేకలను, గొర్రెలను వేరు చేసినట్టు
\v 33 ఆయన తన కుడివైపున 'గొర్రెలు' (నీతిపరులు), ఎడమవైపున 'మేకలు' (అనీతిపరులు) ఉండేలా వేరు చేసి నిలబెడతాడు.
\s5
\v 34 తరువాత రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, 'నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పుట్టినపుడే మీ కోసం సిద్ధపరచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి.
\v 35 ఎందుకంటే నాకు ఆకలి వేసినప్పుడు మీరే నాకు భోజనం పెట్టారు. నేను దప్పిగొన్నప్పుడు నాకు దాహం తీర్చారు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చారు.
\v 36 వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి పలకరించారు' అని చెబుతాడు.
\s5
\v 37 అందుకు నీతిపరులు 'ప్రభూ, ఎప్పుడు నీకు ఆకలి వేయడం చూసి నీకు భోజనం పెట్టాం? ఎప్పుడు దప్పిగొనడం చూసి దాహం తీర్చాం?
\v 38 ఎప్పుడు పరదేశిగా చూసి నీకు ఆశ్రయమిచ్చాం? ఎప్పుడు దిగంబరిగా చూసి బట్టలిచ్చాం?
\v 39 ఎప్పుడు రోగివై ఉండటం, చెరసాలలో ఉండటం చూసి నీ దగ్గరకు వచ్చి పరామర్శించాం? అని ఆయనను అడుగుతారు.
\v 40 అందుకు రాజు, 'మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, దీనులైన ఈ నా సోదరులలో ఒకడికి ఇది చేస్తే నాకు కూడా చేసినట్టే' అని వారికి జవాబిస్తాడు.
\s5
\p
\v 41 "తరువాత ఆయన ఎడమవైపున ఉన్నవారిని చూసి, 'శాపగ్రస్తులారా, నన్ను విడిచి వెళ్ళండి! సాతానుకు, వాడి అనుచరులకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోకి వెళ్ళండి.
\v 42 ఎందుకంటే, నాకు ఆకలి వేసినప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దప్పిగొన్నప్పుడు నాకు దాహం తీర్చలేదు. పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు,
\v 43 వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి పలకరించలేదు' అని చెబుతాడు.
\s5
\v 44 అందుకు వారు కూడా, 'ప్రభూ, మేమెప్పుడు నీవు ఆకలిగా ఉండటం, దప్పిగొని ఉండటం, పరదేశిగా ఉండటం, దిగంబరివై ఉండటం, రోగివై ఉండటం చూసి నీకు సహాయం చేయలేదు?' అని అడుగుతారు.
\v 45 అందుకు రాజు, 'మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మీరు దీనులైన నా ఈ సోదరులలో ఒకరికి కూడా ఈ విధంగా చేయలేదు కాబట్టి నాకు కూడా చేయనట్టే' అని వారికి జవాబిస్తాడు.
\v 46 వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు."
\s5
\c 26
\s 1 యేసు వధకై యూదు నాయకుల కుట్ర (మార్కు 14:1, 2; లూకా 22: 1, 2)
\p
\v 1 యేసు ఈ మాటలు చెప్పడం ముగించిన తరువాత ఆయన తన శిష్యులతో,
\v 2 "రెండు రోజుల తరువాత పస్కా పండుగ వస్తుందని మీకు తెలుసు. అప్పుడు మానవ పుత్రుణ్ణి సిలువ వేయడానికి అప్పగిస్తారు" అని చెప్పాడు.
\s5
\p
\v 3 ఆ సమయంలోనే ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు కయప అనే ప్రధాన యాజకుని నివాసంలో సమావేశమయ్యారు.
\v 4 వారంతా ఏకమై కుట్ర చేసి యేసును పట్టుకొని, చంపాలని కుయుక్తులు పన్నారు.
\v 5 అయితే ప్రజలలో అల్లరి జరుగుతుందేమో అని 'పండగ సమయంలో వద్దు' అని చెప్పుకొన్నారు.
\s బేతనీ మరియ యేసుకు చేసిన అభిషేకం (మార్కు 14: 3-9; యోహాను 12: 1-8)
\s5
\p
\v 6 యేసు బేతనీలో కుష్ఠరోగి సీమోను ఇంట్లో ఉన్నాడు.
\v 7 ఆ సమయంలో ఒక స్త్రీ పాలరాతి సీసా లో బాగా ఖరీదైన అత్తరు తెచ్చి, ఆయన భోజనానికి కూర్చుని ఉన్నప్పుడు ఆయన తలమీద ఆ అత్తరు పోసింది.
\v 8 అది చూసి శిష్యులకు కోపం వచ్చింది. వారు ఆమెతో, "ఎంత నష్టం!
\v 9 దీనిని మంచి ధరకు అమ్మి ఆ సొమ్మును బీదలకు దానం చెయ్యవచ్చు కదా?" అన్నారు.
\s5
\v 10 యేసు ఆ సంగతి గ్రహించి, "ఈ స్త్రీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఈమె నా విషయం ఒక మంచి పని చేసింది.
\v 11 బీదవారు మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు. గాని నేను ఎల్లకాలం మీతో ఉండను.
\s5
\v 12 ఈమె ఈ అత్తరు నా తలపై పోసి నా శరీర భూస్థాపన కోసం సిద్ధం చేసింది.
\v 13 నేను కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ లోకమంతటిలో సువార్త ప్రకటన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఈమెనూ, ఈమె చేసిన పనినీ అందరూ గుర్తు చేసికొని ప్రశంసిస్తారు."
\s యూదు నాయకులతో ఇస్కరియోతు యూదా లాలూచీ (మార్కు 14: 10,11; లూకా 22: 3- 6)
\s5
\p
\v 14 అప్పుడు పన్నెండు మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు.
\v 15 "యేసును మీకు పట్టిస్తే నాకేమి ఇస్తారు?" అని అతడు వారినడిగాడు. వారు ముప్పై వెండి నాణాలు లెక్కపెట్టి అతనికి ఇచ్చారు.
\v 16 అతడు అప్పటి నుండి ఆయన్ని వారికి పట్టించడానికి తగిన సమయం కోసం కనిపెడుతున్నాడు.
\s పస్కా ఏర్పాట్లు (మార్కు 14: 12-16; లూకా 22: 7-13)
\s5
\p
\v 17 పొంగని రొట్టెల పండుగలో మొదటి రోజు, శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, "మనం పస్కా భోజనాన్ని ఆచరించడానికి ఏర్పాట్లు ఎక్కడ చేయమంటావు?" అని అడిగారు.
\v 18 అందుకాయన, "మీరు పట్టణంలో ఫలాని వ్యక్తి దగ్గరకు వెళ్లి, 'నా కాలం సమీపించింది. నా శిష్యులతో కలిసి నీ ఇంట్లో పస్కా భోజనం చేస్తాను' అని మా గురువు అంటున్నాడని అతనితో చెప్పండి" అన్నాడు.
\v 19 యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి శిష్యులు పస్కాను సిద్ధం చేశారు.
\s చివరి భోజనం (మార్కు 14: 17-21; లూకా 22:14-20, 24-30) (ఇక్కడ యోహాను 13: 2-30 చదువుకోవచ్చు)
\s5
\p
\v 20 సాయంకాలం యేసు తన పన్నెండు మంది శిష్యులతో భోజనానికి కూర్చున్నాడు.
\v 21 వారు భోజనం చేస్తుండగా ఆయన, "మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడని మీతో కచ్చితంగా చెబుతున్నాను" అన్నాడు.
\v 22 అందుకు వారు చాలా దుఃఖంలో మునిగిపోయారు. ప్రతి ఒక్కడూ, "ప్రభూ, అది నేనా?" అని ఆయన్ని అడగటం ప్రారంభించారు.
\s5
\v 23 ఆయన "నాతో కలిసి పాత్రలో చెయ్యి ముంచి భోజనం చేసేవాడే నన్ను పట్టిస్తాడు.
\v 24 మానవ పుత్రుని గురించి రాసి ఉన్న ప్రకారం ఆయన చనిపోవలసిందే గాని ఆయనను ఎవరు పట్టిస్తాడో ఆ వ్యక్తికి యాతన తప్పదు. ఆ వ్యక్తి అసలు పుట్టి ఉండక పోయి ఉంటే అతనికి మంచిది."
\v 25 ఆయనను అప్పగించబోయే యూదా, "ప్రభూ, నేను కాదు కదా?" అని అడగ్గానే ఆయన, "నీవే చెబుతున్నావు కదా?" అన్నాడు.
\s ప్రభు రాత్రి భోజన సంస్కార స్థాపన (మార్కు 14:22-25; లూకా 22:17-20; 1 కొరింతి 11: 23-25)
\s5
\p
\v 26 వారు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసికొని స్తుతులు చెల్లించి, విరిచి తన శిష్యులకు ఇస్తూ, "దీనిని మీరు తీసికొని తినండి. ఇది నా శరీరం" అని చెప్పాడు.
\s5
\v 27 తరువాత ఆయన ద్రాక్ష రసం పాత్ర తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి వారికిచ్చి, "దీనిలోనిది మీరంతా తాగండి.
\v 28 ఇది నా రక్తం. అంటే పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కోసం నేను చిందించబోతున్న కొత్త నిబంధన రక్తం.
\v 29 నా తండ్రి రాజ్యంలో మీతో కలిసి ఇలాటి ద్రాక్షారసం మళ్ళీ తాగే రోజు వరకు నేనిక దానిని తాగనని మీతో చెబుతున్నాను"
\s5
\v 30 అప్పుడు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు.
\s (ఇక్కడ యోహాను 14: 1- 31 చదువుకోవచ్చు). పేతురు తన్నెరగనంటాడని యేసు ముందుగా చెప్పడం (మార్కు 14; 26-31; లూకా 22:31-34; యోహాను 13: 36-38)
\p
\v 31 అప్పుడు యేసు వారితో, "ఈ రాత్రి మీరంతా నా విషయంలో తొట్రుపడతారు. ఎందుకంటే, 'కాపరిని దెబ్బ తీస్తాను, మందలోని గొర్రెలు చెదరిపోతాయి' అని రాసి ఉంది కదా!
\v 32 కాని నేను మరణం నుండి తిరిగి లేచిన తరువాత మీకంటె ముందుగా గలలీకి వెళ్తాను" అన్నాడు.
\s5
\v 33 అందుకు పేతురు, "నీ విషయంలో అంతా వెనుకంజ వేసినా నేను మాత్రం ఎన్నటికీ వెనుకంజ వేయను" అని యేసుతో చెప్పాడు.
\v 34 యేసు అతణ్ణి చూసి, "నేను నీతో కచ్చితంగా చెప్పేదేమంటే, ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నీవు మూడుసార్లు చెప్తావు" అన్నాడు.
\v 35 పేతురు ఆయనతో, "నేను నీతో కలిసి చావాల్సి వచ్చినా సరే, నిన్ను ఎరగనని చెప్పను" అన్నాడు. మిగిలిన శిష్యులందరూ అవే మాటలు పలికారు.
\s (ఇక్కడ యోహాను 15, 16, 17 అధ్యాయాలు చదువుకోవచ్చు) వనం లో యేసు వేదన (మార్కు 14:32-42; లూకా 22:39-46; యోహాను 18:1)
\s5
\p
\v 36 ఆ తరువాత, యేసు వారితో కలిసి గేత్సెమనే అనే చోటికి వచ్చారు. ఆయన, "నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి తిరిగి వచ్చే వరకు మీరు ఇక్కడే కూర్చోండి" అని వారితో చెప్పాడు.
\v 37 పేతురు, జెబెదయి ఇద్దరు కొడుకులనీ తన వెంట తీసుకెళ్ళి తీవ్రమైన దుఃఖంలో, కలతలో మునిగిపోయాడు.
\v 38 అప్పుడు ఆయన వారితో, "నా ప్రాణం పోయేటంతగా నాకు దుఃఖం ముంచుకొస్తూ ఉంది. మీరు ఇక్కడే నిలిచి నాతో కలిసి మెలకువగా ఉండండి" అని చెప్పి,
\s మొదటి ప్రార్థన (మార్కు 14: 35; లూకా 22; 41,42)
\s5
\p
\v 39 కొంత దూరం వెళ్లి, సాగిలపడి, "నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నా దగ్గరనుండి తీసివేయి. అయినా నీ ఇష్టమే నెరవేరాలి, నా ఇష్టం కాదు" అని ప్రార్థన చేశాడు.
\v 40 శిష్యుల దగ్గరకు వచ్చి, వారు నిద్ర పోతుండటం చూసి, "నాతో కలిసి ఒక్క గంట కూడా మెలకువగా ఉండలేరా?
\v 41 మీరు శోధనలో పడకుండా ఉండేందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధంగానే ఉన్నా శరీరం బలహీనంగా ఉంది" అని పేతురుతో అన్నాడు.
\s రెండవ ప్రార్థన (మార్కు 14:39; లూకా 22: 44)
\s5
\p
\v 42 యేసు రెండో సారి దూరంగా వెళ్ళి, "నా తండ్రీ, నేను దీనిని తాగితేనే తప్ప నానుండి తీసివేయడం సాధ్యం కాదనుకుంటే, నీ చిత్తమే నెరవేరనీ!" అని ప్రార్థన చేశాడు.
\v 43 ఆయన తిరిగి వచ్చి, వారు ఇంకా నిద్రపోతూ ఉండటం చూశాడు. వారి కన్నులు నిద్రాభారంలో మూతలు పడుతున్నాయి.
\s మూడవ ప్రార్థన (మార్కు 14:41)
\p
\v 44 ఆయన వారిని మళ్ళీ విడిచి వెళ్లి, ఆ మాటలే తిరిగి చెబుతూ మూడోసారి ప్రార్థన చేశాడు.
\s5
\v 45 అప్పుడాయన తన శిష్యుల దగ్గరకు తిరిగి వచ్చి ఇలా అన్నాడు, "మీరింకా విశ్రాంతిగా నిద్రపోతున్నారా? వినండి, మానవ పుత్రుణ్ణి పాపాత్ముల చేతులకు అప్పగించే సమయం వచ్చేసింది.
\v 46 ఇంక వెళ్దాం, లేవండి. నన్ను వారికి పట్టిచ్చేవాడు సమీపించాడు."
\s యేసును బంధించడం (మార్కు 14: 43-50; లూకా 22: 47-53; యోహాను 18: 3-11)
\s5
\p
\v 47 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన యూదా వచ్చాడు. అతనితో ప్రధాన యాజకుల, ప్రజల పెద్దల నుండి వచ్చిన పెద్ద గుంపు ఉంది. వారి చేతుల్లో కత్తులు గదలు ఉన్నాయి.
\v 48 ఆయనను పట్టి ఇచ్చేవాడు, 'నేనెవరికి ముద్దు పెడతానో ఆయనే యేసు. ఆయన్ని మీరు పట్టుకోండి.' అని వారికి ముందుగానే ఒక గుర్తు చెప్పాడు.
\s5
\v 49 అతడు యేసు దగ్గరకు వచ్చి, "బోధకా , నీకు శుభం!" అంటూ ఆయనకు ముద్దు పెట్టాడు.
\v 50 యేసు, "మిత్రమా, నీవేం చేయాలనుకున్నావో అది చేయి" అని అతనితో చెప్పగానే వారు దగ్గరకు వచ్చి ఆయన్ని ఒడిసి పట్టుకొన్నారు.
\s5
\v 51 వెంటనే యేసుతో ఉన్నవారిలో ఒకడు తన చెయ్యి చాపి, కత్తి బయటికి తీసి ప్రధాన యాజకుని దాసుణ్ణి కొట్టి, అతని చెవి నరికేసాడు.
\v 52 అప్పుడు యేసు, "నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టు. కత్తి వాడేవారంతా కత్తి తోనే నశించిపోతారు.
\v 53 ఇప్పుడు నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన పన్నెండు సేనా వ్యూహాలకంటె ఎక్కువ మంది దేవదూతలను వెంటనే పంపడు అనుకుంటున్నావా?
\v 54 నేనలా వేడుకుంటే అంతా ఈ విధంగా జరగాలని ఉన్న లేఖనం ఎలా నెరవేరుతుంది?" అని అతనితో చెప్పాడు.
\s5
\p
\v 55 తరువాత యేసు ఆ గుంపు వైపు చూసి, "ఒక దోపిడీదొంగ మీదకి వచ్చినట్టు నన్ను పట్టుకోడానికి మీరు కత్తులు, గదలతో వచ్చారా? ప్రతి రోజూ నేను దేవాలయంలో బోధించేటప్పుడు నన్ను పట్టుకోలేదే,
\v 56 ప్రవక్తల లేఖనాలు నెరవేరడం కోసమే ఈ విధంగా జరిగింది" అని చెప్పాడు. అప్పుడు శిష్యులంతా ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు.
\s కయఫా ఎదుటా సన్ హెడ్రిన్ ఎదుటా యేసు (మార్కు 14: 53- 65: యోహాను 18: 12, 19-24)
\s5
\p
\v 57 యేసును పట్టుకొన్న వారు ప్రధానయాజకుడు కయప దగ్గరకు ఆయనను తీసికొనిపోయారు. అక్కడ ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు సమావేశమై ఉన్నారు.
\v 58 పేతురు దూరం నుండి వెంబడిస్తూ, ప్రధాన యాజకుని ఇంటి గుమ్మం వరకు వచ్చి, లోపలికి వెళ్ళి ఏమి జరగబోతున్నదో చూడాలని అక్కడ ఉన్న సైనికులతో కలిసి కూర్చున్నాడు.
\s5
\v 59 ప్రధాన యాజకులు, మహా సభ సభ్యులంతా యేసుని చంపించాలని ఆయనకు వ్యతిరేకంగా అబద్ధసాక్షం కోసం వెదికారు.
\v 60 అబద్ధసాక్షులు చాలామంది వచ్చినా వారి సాక్షం నిలబడలేదు.
\v 61 చివరికి ఇద్దరు మనుషులు వచ్చి "ఈ మనిషి దేవాలయాన్ని పడగొట్టి, మూడు రోజుల్లో దానిని తిరిగి కడతానని చెప్పాడు" అన్నారు.
\s5
\v 62 అప్పుడు ప్రధాన యాజకుడు లేచి, "నీవు జవాబు చెప్పవేమిటి? వీరు నీకు వ్యతిరేకంగా పలికిన సాక్ష్యం విషయం ఏమంటావు?" అని అడిగాడు. యేసు మౌనం వహించాడు.
\v 63 అందుకు ప్రధాన యాజకుడు ఆయనతో, "సజీవుడైన దేవుని పేరున నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా? మాతో చెప్పు!" అన్నాడు.
\v 64 అందుకు యేసు, "నీకై నీవే ఆ మాట చెప్పావు. నేను చెప్పేదేమంటే, ఇకనుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపక్కన కూర్చోవడమూ, ఆకాశ మేఘాల మీద ఆసీనుడై రావడమూ మీరు చూస్తారు" అన్నాడు.
\s5
\v 65 వెంటనే ఆ ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొన్నాడు. "వీడు దేవదూషణ చేశాడు. అతని దేవదూషణ మీరే విన్నారు కదా, మనకింక సాక్షులతో పనేముంది?
\v 66 మీరేమంటారు?" అని సభవారిని అడిగాడు. అందుకు వారు, "వీడు చావుకు తగినవాడు!" అన్నారు.
\s5
\v 67 అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు.
\v 68 కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, "క్రీస్తూ! నిన్ను కొట్టింది ఎవరో ప్రవచించు!" అన్నారు.
\s పేతురు అబద్ధాలు (మార్కు 14: 66 -72; లూకా 22: 55-62)
\s5
\p
\v 69 పేతురు బయట వసారాలో కూర్చొని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరకు వచ్చి, "నీవు గలలీ వాడైన యేసుతో ఉన్నావు కదా?" అని అడిగింది.
\v 70 అందుకు అతడు, "నేను లేను, నీవు చెప్పే సంగతి నాకు తెలియదు" అని అందరి ముందూ అన్నాడు.
\s5
\v 71 అతడు నడవలోకి వెళ్లినపుడు మరొక పని పిల్ల అతణ్ణి చూసి, "ఇతడు కూడా నజరేతు వాడైన యేసుతో కలిసి ఉండేవాడు" అని అక్కడున్న వారితో చెప్పింది.
\v 72 పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టుపెట్టుకుంటూ "ఆ మనిషి ఎవరో నాకు తెలియదు" అన్నాడు.
\s5
\v 73 కొంతసేపటి తరువాత అక్కడ నిలబడిన కొందరు పేతురు దగ్గరకు వచ్చి, "నిజమే, నువ్వు కూడా వాళ్ళలో ఒకడివే. నీ మాట్లాడే విధానం వల్ల అది తెలిసిపోతున్నది" అన్నారు.
\v 74 దానితో పేతురు "ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను" అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది.
\v 75 'ఈ రాత్రి కోడి కూసే ముందే నన్ను ఎరుగనని నీవు మూడుసార్లు చెప్తావు' అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసికొని పేతురు బయటికి వెళ్లి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు.
\s5
\c 27
\s పిలాతు వద్దకు యేసు (మార్కు 15:1; లూకా 23:1; యోహాను 18: 28)
\p
\v 1 తెల్లవారింది. ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలందరు యేసును చంపించాలని ఆయనపై కుట్ర చేశారు.
\v 2 ఆయనను బంధించి, తీసికెళ్ళి రోము ప్రతినిధి, అధిపతీ అయిన పొంతి పిలాతుకు అప్పగించారు.
\s యూదా నిర్వేదనం (అపో కా 1: 16-19)
\s5
\p
\v 3 అప్పుడు ఆయనను వారికి పట్టించి ఇచ్చిన యూదా, ఆయనకు శిక్ష విధించడం చూసి పశ్చాత్తాపపడి, ఆ ముప్పై వెండి నాణాలు ప్రధాన యాజకుల, పెద్దల దగ్గరకు తీసుకొచ్చి
\v 4 "నేను నిరపరాధి రక్తాన్ని మీకు అప్పగించి పాపం చేశాను" అని చెప్పాడు. అందుకు వారు, "మాకేంటి? దాని సంగతి నువ్వే చూసుకో" అని చెప్పారు.
\v 5 అప్పుడతడు ఆ వెండి నాణాలు దేవాలయంలో విసిరేసి, వెళ్లి ఉరి వేసుకొన్నాడు.
\s5
\v 6 ప్రధాన యాజకులు ఆ వెండి నాణాలు తీసికొని 'ఇది రక్తం కొన్న డబ్బు. కాబట్టి వీటిని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం" అని చెప్పుకొన్నారు.
\v 7 వారు ఆలోచించి ఆ సొమ్ముతో పరదేశుల్ని పాతిపెట్టడం కోసం ఒక కుమ్మరి వాడి పొలం కొన్నారు.
\v 8 ఆ పొలాన్ని నేటివరకూ రక్తపొలం అని పిలుస్తున్నారు.
\s5
\v 9 దీనితో "ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు కట్టిన వెల, క్రయధనం ముప్పై వెండి నాణాలు.
\v 10 వాటిని ప్రభువు నాకు నియమించిన ప్రకారం కుమ్మరి వాని పొలం కోసం ఇచ్చారు" అని దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట నెరవేరింది.
\s యేసును పిలాతు ప్రశ్నించడం (మార్కు 15: 2-5; లూకా 23: 2,3; యోహాను 18: 29-38)
\s5
\p
\v 11 యేసు పిలాతు ముందు నిలబడ్డాడు. అప్పుడు పిలాతు, "నీవు యూదుల రాజువా?" అని ఆయనను అడిగాడు. యేసు "నీవే అంటున్నావు గదా" అన్నాడు.
\v 12 ప్రధాన యాజకులు, పెద్దలు ఆయన మీద నేరాలు మోపుతున్నప్పుడు ఆయన వాటికి ఏమీ జవాబు చెప్పలేదు.
\v 13 కాబట్టి పిలాతు, "నీ మీద వీరు ఎన్ని నేరాలు మోపుతున్నారో నీవు వినడం లేదా?" అని ఆయనను అడిగాడు.
\v 14 అయితే ఆయన ఒక మాటకైనా అతనికి జవాబు చెప్పకపోవడం పిలాతుకి చాలా ఆశ్చర్యం కలిగించింది.
\s యేసా, బరబ్బానా ? (మార్కు 15:6-15; లూకా 23: 13-25; యోహాను 18: 38-40)
\s5
\p
\v 15 ఆ పండగలో ప్రజలు కోరుకొనే ఒక ఖైదీని విడుదల చేయడం అధిపతికి వాడుక.
\v 16 ఆ కాలంలో బరబ్బ అనే పేరు మోసిన ఒక బందిపోటు చెరసాలలో ఉన్నాడు.
\s5
\v 17 కాబట్టి ప్రజలు తన దగ్గరకు వచ్చినప్పుడు పిలాతు వారినిలా అడిగాడు, "నేను మీకు ఎవరిని విడుదల చేయాలి? బరబ్బానా లేక క్రీస్తు అని పిలిచే యేసునా?"
\v 18 ఎందుకంటే వారు కేవలం అసూయతోనే ఆయన్ని అప్పగించారని అతనికి తెలుసు.
\v 19 అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, "నీవు ఆ నీతిపరుని జోలికి పోవద్దు. ఈ రోజు నేను ఆయన్ని గురించి కలలో బహు బాధపడ్డాను" అని అతనికి కబురు పంపింది.
\s5
\v 20 ప్రధాన యాజకులు, పెద్దలు, బరబ్బనే విడిపించమనీ, యేసును చంపించమనీ అడగమని జనసమూహాలను రెచ్చగొట్టారు.
\v 21 పిలాతు "ఈ యిద్దరిలో నేనెవరి ని విడుదల చేయాలని మీరు కోరుతున్నారు?" అని అడగ్గా వారు, "బరబ్బనే" అని అరిచారు.
\v 22 అందుకు పిలాతు "మరి క్రీస్తు అని పిలిచే ఈ యేసును ఏమి చెయ్యమంటారు?" అన్నప్పుడు వారంతా "అతణ్ణి సిలువ వేయండి" అని కేకలు వేసారు.
\s5
\v 23 పిలాతు "ఎందుకు? ఇతడు ఏం నేరం చేసాడు?" అని అడిగినప్పుడు, వారు "సిలువ వేయండి" అని ఇంకా ఎక్కువగా కేకలు వేశారు.
\p
\v 24 అల్లరి ఎక్కువౌతుందే గాని తన ప్రయత్నాలేమీ ఫలించడం లేదని గ్రహించి, పిలాతు నీళ్లు తీసికొని ఆ జనసమూహం ముందు చేతులు కడుక్కొని, "ఈ నీతిపరుని రక్తం విషయంలో నేను నిరపరాధిని, దీనిని మీరే చూచుకోవాలి" అని చెప్పాడు.
\s5
\v 25 అందుకు ప్రజలంతా, "అతడి రక్తం మా మీదా, మా పిల్లల మీదా ఉంటుంది" అన్నారు.
\s బరబ్బా విడుదల
\p
\v 26 అప్పుడు పిలాతు వారు కోరినట్టే బరబ్బను విడుదల చేసి, యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించాడు.
\s రాజుకు ముళ్ళ కిరీటం, సిలువ శిక్షకై కొనిపోవడం (మార్కు 15: 16-23; లూకా 23:26-32)
\s5
\p
\v 27 అప్పుడు సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకుపోయి, ఆయన ముందు సైనికులందరినీ పోగుచేశారు.
\v 28 వారు ఆయన వస్త్రాలు తీసేసి, ఆయనకు ఎర్రని అంగీ తొడిగించారు.
\v 29 ముళ్ళతో ఒక కిరీటం అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయన కుడి చేతిలో ఒక రెల్లు కర్ర ఉంచారు. అప్పుడు ఆయన ముందు మోకరించి, "యూదుల రాజా, నీకు శుభం!" అంటూ ఎగతాళి చేశారు.
\s5
\v 30 ఆయన మీద ఉమ్మి వేసి, ఆ రెల్లు కర్రతో ఆయన తలమీద కొట్టారు.
\v 31 అదంతా అయిన తరువాత ఆయనకు వేసిన అంగీ తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకి తొడిగించి, సిలువ వేయడానికి తీసుకు వెళ్లారు.
\s5
\v 32 వారు బయటికి వస్తూ ఉండగా కురేనే ప్రాంతానికి చెందిన సీమోను అనే వ్యక్తి కనిపించాడు. వారు బలవంతంగా అతని చేత ఆయన సిలువను మోయించారు.
\s సిలువ (మార్కు 15:22-32; లూకా 23:33-43; యోహాను 19:16, 17)
\p
\v 33 వారు "కపాల స్థలం" అని అర్థమిచ్చే 'గొల్గొతా' అనే చోటికి వచ్చారు.
\v 34 అక్కడ చేదు కలిపిన ద్రాక్షారసాన్ని తాగడానికి ఆయనకు అందించారు గాని ఆయన దానిని రుచి చూసి తాగలేక నిరాకరించాడు.
\s లేఖనాల నెరవేర్పు (మత్తయి 5:17,18; గలతి 3:11-14)
\s5
\p
\v 35 వారు ఆయన్ని సిలువ వేసిన తరువాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు.
\v 36 అక్కడే ఆయనకు కావలిగా కూర్చున్నారు.
\v 37 ''ఇతడు యూదుల రాజైన యేసు'' అని ఆయన మీద మోపిన నేరం రాసి ఉన్న ప్రకటన ఒకటి ఆయన తలకు పైన ఉంచారు.
\s5
\v 38 ఆయన కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను కూడా సిలువవేశారు.
\v 39 ఆ దారిన వెళ్ళేవారు తలలూపుతూ,
\v 40 "దేవాలయాన్ని పడగొట్టి మూడు రోజుల్లో కట్టేవాడా, నిన్ను నీవే రక్షించుకో. నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీదనుండి దిగిరా!" అంటూ ఆయనను తిట్టారు.
\s5
\v 41 అలాగే ధర్మశాస్త్ర పండితులూ, పెద్దలూ, ప్రధాన యాజకులూ ఆయనను వెక్కిరిస్తూ
\v 42 "ఇతడు ఇతరులను రక్షించాడు గానీ తనను రక్షించుకోలేడు. ఇశ్రాయేలు రాజు గదా, అతడిప్పుడు సిలువ మీదనుండి దిగి వస్తే అతణ్ణి నమ్ముతాం.
\s5
\v 43 ఇతడు దేవునిలో విశ్వాసం ఉన్నవాడు గదా, తాను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడు గదా. కాబట్టి ఆయనకిష్టమైతే దేవుడే ఇతన్ని తప్పిస్తాడు" అని హేళనగా మాట్లాడారు.
\v 44 ఆయనతోబాటు సిలువ వేసిన దోపిడీ దొంగలు కూడా అలాగే ఆయన్ని నిందించారు.
\s యేసు క్రీస్తు మరణం (మార్కు 15:33-41; లూకా 23: 44-49; యోహాను 19: 30-37)
\s5
\p
\v 45 మధ్యాహ్నం పన్నెండు గంటలనుండి మూడు గంటల వరకు దేశమంతా చీకటి కమ్మింది.
\v 46 సుమారు మూడు గంటలప్పుడు యేసు, "ఏలీ, ఏలీ, లామా సబక్తానీ" అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు "నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?" అని అర్ధం.
\v 47 అక్కడ నిలబడిన వారిలో కొందరు ఆ మాట విని, "అతడు ఏలీయాను పిలుస్తున్నాడు" అన్నారు.
\s5
\v 48 వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, స్పంజీ తెచ్చి పులిసిన ద్రాక్షరసంలో ముంచి, రెల్లు కర్రకు తగిలించి ఆయనకు తాగడానికి అందించాడు.
\v 49 మిగిలిన వారు, "ఉండండి, ఏలీయా వచ్చి ఇతణ్ణి రక్షిస్తాడేమో చూద్దాం" అన్నారు.
\p
\v 50 యేసు మళ్ళీ పెద్దగా కేక వేసి ప్రాణం విడిచాడు.
\s ధర్మ శాస్త్ర యుగం అంతం (హెబ్రీ 9: 3-8; 10:19,20)
\s5
\p
\v 51 అప్పుడు దేవాలయం లోనితెర పైనుండి కింది వరకు రెండుగా చినిగింది. భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి.
\v 52 సమాధులు తెరచుకున్నాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు సజీవంగా లేచాయి.
\v 53 వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన పునరుత్థానం చెందిన తరువాత పవిత్ర నగరంలో ప్రవేశించి చాలామందికి కనిపించారు.
\s5
\p
\v 54 రోమా శతాధిపతి, అతనితో యేసుకు కావలి ఉన్నవారు, భూకంపాన్ని, జరిగిన సంఘటనలు చూసి చాలా భయపడ్డారు. "ఈయన నిజంగా దేవుని కుమారుడే" అని వారు చెప్పుకొన్నారు.
\v 55 యేసుకు ఉపచారం చేయడానికి గలిలయ నుండి ఆయన వెంట వచ్చిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరంగా నిలబడి చూస్తున్నారు.
\v 56 వారిలో మగ్దలేనే మరియ, యాకోబు, యోసే అనే వారి తల్లి మరియ, జెబెదయి కుమారుల తల్లి ఉన్నారు.
\s 57 క్రీస్తు భూస్తాపన (మార్కు 15:42-47; లూకా 23: 50-56; యోహాను 19: 38-42)
\s5
\p
\v 57 ఆ సాయంకాలం అప్పటికే యేసు శిష్యుడుగా ఉండిన అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు వచ్చాడు.
\v 58 అతడు పిలాతు దగ్గరకు వెళ్లి, యేసు దేహాన్ని తనకు ఇప్పించమని విన్నవించుకున్నాడు. పిలాతు దానిని అతనికి అప్పగించమని ఆజ్ఞాపించాడు.
\s5
\v 59 యోసేపు ఆ దేహాన్ని తీసికొని శుభ్రమైన నారబట్టతో చుట్టాడు.
\v 60 తాను రాతిలో తొలిపించుకొన్న తన కొత్త సమాధిలో దానిని పెట్టాడు. తరువాత వారుపెద్ద రాయితో సమాధి ద్వారాన్ని మూసివేసి వెళ్లిపోయారు.
\v 61 మగ్దలేనే మరియ, వేరొక మరియ, అక్కడే సమాధికి ఎదురుగా కూర్చుని ఉన్నారు.
\s5
\p
\v 62 ఆ తరువాతి రోజు, అంటే సిద్ధపడే రోజుకు తరువాతి రోజు ప్రధాన యాజకులు, పరిసయ్యులు, పిలాతు దగ్గరకు వెళ్లి,
\v 63 "అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు 'మూడు రోజుల తరువాత నేను సజీవంగా తిరిగి లేస్తాను' అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది.
\v 64 కాబట్టి మూడో రోజు వరకు సమాధిని భద్రం చేయమని ఆజ్ఞాపించండి. ఒకవేళ అతని శిష్యులు అతణ్ణి ఎత్తుకుపోయి 'ఆయన మృతులలో నుండి సజీవంగా లేచాడు' అని ప్రజలలో ప్రచారం చేస్తారేమో. అదే జరిగితే మొదటి వంచనకంటె చివరి వంచన మరింత చెడ్డదౌతుంది" అన్నారు.
\s5
\v 65 అందుకు పిలాతు, "కావలి వారున్నారు గదా, మీరు వెళ్లి మీ శక్తి మేర సమాధిని భద్రం చేయండి" అని వారితో చెప్పాడు.
\v 66 వారు వెళ్లి రాతికి ముద్ర వేసి సమాధికి కావలి వారిని ఏర్పాటు చేసారు.
\s5
\c 28
\s యేసు క్రీస్తు సజీవంగా లేవడం (మార్కు 16: 1-14; లూకా 24: 1- 49; యోహాను 20: 1-23)
\p
\v 1 విశ్రాంతిదినం గడచిన తరువాత ఆదివారం నాడు, తెల్లవారుతుండగా మగ్దలేనే మరియ, వేరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు.
\v 2 ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ఆ రాయిని పొర్లించి దాని మీద కూర్చున్నాడు. అప్పుడు మహా భూకంపం వచ్చింది.
\s5
\v 3 ఆ దూత స్వరూపం మెరుపులా ఉంది. అతని వస్త్రం మంచు అంత తెల్లగా ఉంది.
\v 4 అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు.
\s5
\v 5 ఆ దూత ఆ స్త్రీలతో, "భయపడకండి, సిలువ వేసిన యేసును మీరు వెదకుతున్నారని నాకు తెలుసు.
\v 6 ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలం చూసి,
\v 7 త్వరగా వెళ్లి, ఆయన చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచాడని ఆయన శిష్యులకు చెప్పండి. ఇదిగో, ఆయన గలలీకి మీకంటే ముందుగా వెళ్ళాడు. మీరు ఆయన్ని అక్కడ చూస్తారు. ఇదిగో నేను మీతో చెప్పాను గదా" అన్నాడు.
\s5
\p
\v 8 వారు భయంతో, మహా ఆనందంతో సమాధి దగ్గరనుండి త్వరగా వెళ్లి ఆ సంగతి ఆయన శిష్యులకు చెప్పడానికి పరుగెడుతుండగా
\v 9 యేసు వారికి ఎదురు వచ్చి, "మీకు శుభం!" అని చెప్పాడు. వారు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన పాదాలపై బడి ఆయనను పూజించారు.
\v 10 అప్పుడు యేసు, "భయపడకండి. మీరు వెళ్లి, నా సోదరులను గలలీకి వెళ్ళమని చెప్పండి. అక్కడ వారు నన్ను చూస్తారు" అని వారితో చెప్పాడు.
\s5
\p
\v 11 వారు వెళ్తూ ఉండగా సమాధికి కావలిగా ఉన్నవారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పారు.
\v 12 కాబట్టి వారు పెద్దలతో ఆలోచించి, ఆ సైనికులకు చాలా లంచమిచ్చి,
\v 13 "మీరు 'మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతణ్ణి ఎత్తుకు పోయారు' అని చెప్పండి.
\s5
\v 14 ఇది గవర్నర్ కి తెలిసినా మేమతనితో మాట్లాడి మీకేమీ ఇబ్బంది లేకుండా చూస్తాం." అన్నారు.
\v 15 సైనికులు ఆ డబ్బు తీసికొని వారు తమతో చెప్పిన ప్రకారం చేశారు. ఆ మాట యూదులలో ఇప్పటి వరకు వ్యాపించి ఉంది.
\s గలిలయ లో యేసు. మహాభినియామకం (మార్కు 16: 15- 18)
\s5
\p
\v 16 పదకొండు మంది శిష్యులు యేసు తమను రమ్మని చెప్పిన గలలీలోని కొండకు వెళ్ళారు.
\v 17 అక్కడ వారు ఆయనను చూసి ఆయనను పూజించారు, కొందరు సందేహించారు.
\s5
\v 18 అయితే యేసు వారి దగ్గరకు వచ్చి "పరలోకంలో, భూమి మీదా నాకు సంపూర్ణమైన అధికారం ఉంది.
\v 19 కాబట్టి మీరు వెళ్లి, ప్రజలందరినీ శిష్యులుగా చేయండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల నామంలో వారికి బాప్తిసమిస్తూ
\s5
\v 20 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. నేను కలకాలం ఎల్లప్పుడూ మీతో ఉన్నాను" అని వారితో చెప్పాడు.