new, updated files

This commit is contained in:
Larry Versaw 2020-10-16 11:09:26 -06:00
parent 52a645baed
commit 9d8cb486d9
28 changed files with 7669 additions and 93 deletions

View File

@ -153,9 +153,9 @@
\v 3 ఆయనను శోధించటానికి సాతాను ఆయన దగ్గరకు వచ్చాడు. "నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే, తింటానికి ఈ రాళ్ళను రొట్టెలుగా మారమని చెప్పు" అన్నాడు.
\v 4 కాని యేసు, "నేను అలా ఎప్పటికీ చెప్పను. ఎందుకంటే
\q1 మనిషి కేవలం తిండి వల్ల మాత్రమే బతకడు.
\q1 దేవుడు మాట్లాడే ప్రతి మాట వినడం వల్ల బతుకుతాడు" అని దేవుని వాక్యంలో రాసి ఉంది" అన్నాడు.
\q1 దేవుడు మాట్లాడే ప్రతి మాట వినడం వల్ల బతుకుతాడు"
\p అని దేవుని వాక్యంలో రాసి ఉంది" అన్నాడు.
\s5
\p
\v 5 తరవాత సాతాను యేసును దేవుని పట్టణమైన యెరుషలేముకు తీసుకెళ్ళాడు. గుడి గోపురం మీద ఆయనను నిలబెట్టాడు.
\v 6 "నువ్వు నిజంగా దేవుని కుమారుడివైతే కిందకు దూకు. దూకినా నీకేమీ కాదు ఎందుకంటే,
\q "ఆయన తన దూతలకు నిన్ను గురించి ఆజ్ఞాపిస్తాడు.
@ -319,11 +319,9 @@
\v 8 కాబట్టి మీరు వారిలాగా ఉండొద్దు. మీరు మీ తండ్రిని అడగక ముందే మీకు ఏం అవసరమో ఆయనకు తెలుసు
\v 9 కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి.
\q “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ నామాన్ని అందరూ ఘనపరుస్తారు గాక.
\q2
\v 10 ప్రతి ఒక్కరిపై , ప్రతిదానిపై పూర్తిగా నీ అధికారం చెల్లు గాక.
\q2 పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.
\s5
\q2
\v 11 మా అనుదిన ఆహారం ఈ రోజు మాకు ప్రసాదించు.
\q2
\v 12 మాకు రుణపడి ఉన్న వారిని మేము క్షమించినట్టు మా రుణాలు క్షమించు.
@ -453,9 +451,9 @@
\p
\v 16 ఆ సాయంత్రం విశ్రాంతి దినం గడిచి పోయినప్పుడు ప్రజలు దయ్యాలు పట్టిన వాళ్ళని, ఇతర రోగుల్ని తీసుకు వచ్చారు. ఆయన కేవలం మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగులందరినీ స్వస్థపరిచాడు.
\v 17 ఈ విధంగా యెషయా ప్రవక్త మాటలు,
\q1 "ఆయన ప్రజలను రోగాల నుండి విడిపించాడు, వాళ్ళను బాగుచేసాడు" అని రాసినవి నిజమయ్యాయి.
\q1 "ఆయన ప్రజలను రోగాల నుండి విడిపించాడు, వాళ్ళను బాగుచేసాడు"
\p అని రాసినవి నిజమయ్యాయి.
\s5
\p
\v 18 యేసు తన చుట్టూ ఉన్న ప్రజలను చూసి, తన శిష్యులతో పడవలో సరస్సుకు అవతలి వైపుకు తీసుకెళ్ళమన్నాడు.
\p
\v 19 వాళ్ళు పడవ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక యూదుల ధర్మశాస్త్ర పండితుడు యేసు దగ్గరికి వచ్చి ఆయనతో, "బోధకా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నేనూ అక్కడికే వచ్చి, నీతోనే ఉంటాను" అన్నాడు.
@ -2055,4 +2053,4 @@
\v 18 అప్పుడు యేసు వారికి దగ్గరగా వచ్చి, "పరలోకంలో, భూలోకంలో అంతటి మీదా, సర్వ మానవుల మీదా నా తండ్రి నాకు సర్వాధికారం ఇచ్చాడు.
\v 19 కాబట్టి మీరు వెళ్ళి నా అధికారాన్ని ఉపయోగించి సమస్త జాతుల ప్రజలకూ నా సందేశం వినిపించి వారిని కూడా నా శిష్యులుగా చేయండి. తండ్రి, కుమారా, పరిశుద్ధాత్మల అధికారం కింద వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి.
\s5
\v 20 నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించానో దానినంతటినీ వాళ్ళకి బోధించండి. నేను ఈ యుగాంతం వరకూ మీతో ఎల్లప్పుడూ ఉంటానని జ్ఞాపకం ఉంచుకోండి."
\v 20 నేను మీకు ఏమేమి ఆజ్ఞాపించానో దానినంతటినీ వాళ్ళకి బోధించండి. నేను ఈ యుగాంతం వరకూ మీతో ఎల్లప్పుడూ ఉంటానని జ్ఞాపకం ఉంచుకోండి."

View File

@ -164,7 +164,8 @@
\s5
\v 9 ఎందుకంటే ఆయన చాలామంది జబ్బులు నయం చేశాడు.
\p
\v 10 అందువల్ల వ్యాధులతో ఉన్నవాళ్లు ఆయనను తాకాలని ఆయన దగ్గరికి తోసుకొస్తున్నారు. ఆయనని తాకితే చాలు స్వస్థపడతామని వాళ్ళందరూ నమ్ముతున్నారు. అప్పుడాయన తన శిష్యులతో "తొక్కిసలాట జరుగుతూ ఉంది, నా కోసం ఒక చిన్న పడవ తీసుకురండి. ఒడ్డు నుండి కాస్త విడిగా నిలబడతాను" అన్నాడు.
\v 10 అందువల్ల వ్యాధులతో ఉన్నవాళ్లు ఆయనను తాకాలని ఆయన దగ్గరికి తోసుకొస్తున్నారు. ఆయనని తాకితే చాలు స్వస్థపడతామని వాళ్ళందరూ నమ్ముతున్నారు.
\p అప్పుడాయన తన శిష్యులతో "తొక్కిసలాట జరుగుతూ ఉంది, నా కోసం ఒక చిన్న పడవ తీసుకురండి. ఒడ్డు నుండి కాస్త విడిగా నిలబడతాను" అన్నాడు.
\s5
\p
\v 11 దయ్యాలు ఆయనను చూడగానే, అవి తాము పట్టి పీడిస్తున్న వాళ్ళని ఆయన ఎదుట నేలపై పడేసి, "నువ్వు దేవుని కుమారుడివి" అని కేకలు వేశాయి.
@ -399,61 +400,49 @@
\p
\v 21 ఒక రోజు హేరోదియకు అవకాశం దొరికింది. హేరోదు తన రాజ్యంలోని అధికారులను, సేనానులను, గలిలయలోని గొప్పవారిని పిలిచి తన పుట్టిన రోజు విందు చేశాడు.
\v 22 హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసి, హేరోదును అతని అతిథుల్ని మెప్పించింది. అప్పుడు హేరోదు ఆమెతో, "నీకు ఏది ఇష్టమో అడుగు, ఇస్తాను!
\s5
\v 23 అర్థ రాజ్యమైనా సరే!" . అని ఆవేశంతో ప్రమాణం చేశాడు.
\v 23 అర్థ రాజ్యమైనా సరే!". అని ఆవేశంతో ప్రమాణం చేశాడు.
\p
\v 24 ఆమె బయటకి వెళ్ళి తన తల్లితో, "నన్నేమి కోరుకోమంటావు?" అని అడిగింది. ఆమె, "బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకో" అని చెప్పింది.
\v 25 వెంటనే ఆమె రాజు దగ్గరికి గబగబా వెళ్ళి, "బాప్తిసం ఇచ్చే యోహాను తలను పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించండి, నాకు కావలసింది అదే" అని అడిగింది.
\s5
\v 26 రాజుకు చాలా దుఃఖం కలిగింది గానీ, తను తొందరపాటుగా చేసిన ప్రమాణం తనతో కూర్చుని ఉన్నవారంతా విన్నారు. ఇక ఆమె కోరికను తోసిపుచ్చలేక పోయాడు.
\s5
\v 27 అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకు రమ్మని భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి ఖైదులోనే యోహాను తల నరికి చంపాడు.
\v 28 అతని తలను ఒక పళ్ళెంలో పెట్టి, తీసుకు వచ్చి ఆమెకు హేరోదు తరుపున కానుకగా ఇచ్చాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది.
\v 29 యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి అతని శవాన్ని తీసుకుపోయి సమాధి చేశారు. ఇదంతా మనసులో వుండడం వల్ల హేరోదు యేసును గురించి అలా అన్నాడు.
\s5
\p
\v 30 పన్నెండుమంది అపొస్తలులు యేసు దగ్గరికి తిరిగి వచ్చి తాము చేసిన వాటి గురించీ బోధించిన వాటి గురించీ వివరంగా ఆయనకు చెప్పారు.
\v 31 వారి దగ్గరికి అనేకమంది వస్తూ పోతూ ఉండడం వల్ల వారికి కాస్త విశ్రాంతి తీసుకోవడానికి, భోజనం తినడానికి కూడా సమయం లేకపోయింది. యేసు వారితో, "మీరు నాతో రండి. మనం ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి, కొంత విశ్రాంతి తీసుకుందాం" అన్నాడు.
\p
\v 32 వాళ్లంతా పడవలో ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళారు.
\s5
\v 33 అయితే వారు వెళ్తూ ఉండగా జనసమూహాలు ఆయనను, ఆయన శిష్యులను గుర్తుపట్టి, వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో గమనించి, వివిధ గ్రామాల నుంచి, చుట్టు పక్కల పట్టణ ప్రాంతాలనుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారికన్నా ముందే ఆ ప్రదేశానికి చేరుకున్నారు.
\v 34 పడవలో యేసు, ఆయన శిష్యులు అక్కడికి చేరినప్పుడు, వారికంటే ముందే అక్కడకి చేరిన పెద్ద జనసమూహం ఆయనకు కనిపించింది. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజలను చూసి ఆయనకు అమితమైన జాలి కలిగింది. అందుచేత ఆయన వారికి అనేక విషయాలు ఉపదేశించసాగాడు.
\s5
\p
\v 35 చాలా పొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, "ఇది మనుషులెవారూ లేని తావు. ఇక్కడ ఎవరూ నివసించ గలిగే పరిస్థితి లేదు. ఇప్పటికే పొద్దుపోయింది.
\v 36 ఈ ప్రజలకు తినడానికి ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి వారు చుట్టూ ఉన్న పల్లెలకో గ్రామాలకో వెళ్ళి ఏదైనా కొనుక్కోడానికి వారిని పంపివెయ్యి" అన్నారు.
\s5
\v 37 అయితే యేసు వారితో "మీరే వారికి తినడానికి ఏమైనా పెట్టండి" అన్నాడు. అందుకు వారు ఆయనతో, "వీళ్ళకు ఆహారం పెట్టాలంటే రెండు వందల దేనారాలకు రొట్టెలు కొనాలి. అంటే ఒక మనిషి దాదాపు రెండు వందల రోజులు పని చేస్తే వచ్చే కూలీ అది. మనవల్లేమౌతుంది" అని ఆయనతో అన్నారు.
\v 38 ఆయన వారితో, "మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో చూడండి" అన్నాడు. వారు వెళ్ళి చూసి, "ఐదు రొట్టెలు, రెండు కాల్చిన చిన్నచేపలు ఉన్నాయి" అన్నారు.
\s5
\p
\v 39 అప్పుడాయన అందరినీ గుంపులు గుంపులుగా పచ్చగడ్డి మీద కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు.
\v 40 ప్రజలు పంక్తికి యాభైమంది, వందమంది చొప్పున కూర్చున్నారు.
\v 41 యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకొని ఆకాశం వైపు చూసి, దేవునికి ఆ ఆహారం నిమిత్తం కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపల్ని కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు.
\s5
\v 42 అందరూ తిని సంతృప్తి చెందారు.
\v 43 శిష్యులు మిగిలిన రొట్టె ముక్కల్ని, చేప ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు.
\v 44 ఆ రోజు అక్కడ రొట్టెలు, చేపలు తిన్న పురుషులు ఐదు వేల మంది. ఇంకా ఉన్న స్త్రీలనూ, పిల్లలనూ లెక్కబెట్టలేదు.
\s5
\p
\v 45 ఆ తరువాత యేసు తన శిష్యులను తనకన్నా ముందు గలలీ సరస్సు దాటి బేత్సయిదా అనే ఊరికి వెళ్ళమని చెప్పి వారిని పడవ ఎక్కించాడు.
\v 46 తరువాత తనతో ఉన్న జనసమూహాన్ని కూడా పంపేసి ఆయన ప్రార్థన చేసుకోడానికి కొండకు వెళ్ళాడు.
\v 47 చీకటి పడుతూ ఉన్న సమయానికి బెత్సయిదాకు బయలుదేరిన శిష్యులు ఉన్న పడవ సరస్సు నడిబొడ్డున ఉంది. యేసు మాత్రం ఒడ్డునే ఉండిపోయాడు.
\s5
\p
\v 48 ఎదురుగాలి విపరీతంగా వీస్తూ ఉండడం వల్ల శిష్యులు దాదాపు ఆ రాత్రంతా పడవను గాలికి ఎదురు నడపలేక, చాలా కష్టపడుతూ సరస్సు మధ్యలోనే ఉండిపోవడం యేసు చూశాడు. ఆయన తెల్లవారుజామున సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన వారిని దాటి వెళ్ళబోతూ ఉండగా,
\v 49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళ మీద నడవడం చూసి, దయ్యం అనుకొని భయపడి గావుకేకలు వేశారు.
\v 50 వెంటనే యేసు వారితో "ధైర్యంగా ఉండండి. నేనే, భయపడకండి" అన్నాడు.
\s5
\v 51 ఆయన వారి దగ్గరికి వచ్చి, పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు మ్రాన్పడిపోయారు.
\v 52 ఎందుకంటే అంతకుముందే ఐదు రొట్టెలు, రెండు చేపల్ని ఎన్నో రెట్లుగా పెంచి, పంచిపెట్టిన అద్భుతాన్ని వారు చూశారు గానీ, ఆయన ఎంత శక్తిమంతుడో వారు గ్రహించలేక పోయారు. వారి హృదయాలు బండబారి పోయినందువల్ల రొట్టెలను, చేపలను గురించిన సంగతి వారు గ్రహించలేదు.
\s5
\p
\v 53 వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరి అక్కడ పడవ నిలిపారు.
\p
\v 54 వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు.
\v 55 ప్రజలు చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు పరుగెత్తుకుంటూ వెళ్ళి యేసు వచ్చిన సమాచారం అందరికీ అందించారు. ప్రజలు రోగులను మంచాల మీద మోసుకుంటూ ఆయన ఉన్న చోటికి తీసుకొచ్చారు.
\s5
\v 56 యేసు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, ఏ పల్లెలో ప్రవేశించినా వారు రోగులను వీధుల్లో పడుకోబెట్టి, ఆయన వస్త్రాన్నయినా తాకనియ్యమని ఆయనను బతిమాలారు. ఆయనను తాకిన వారంతా బాగుపడ్డారు.
\s5
@ -471,9 +460,9 @@
\q1 వారి హృదయం నాకు చాలా దూరంగా ఉంది.
\q1
\v 7 వారు మానవ కల్పితమైన నియమాలను
\q1 దేవుని ఉపదేశంగా బోధిస్తారు కాబట్టి వారి ఆరాధన వ్యర్థం, అని మీ పూర్వికులను యెషయా గద్దించాడు. ఇప్పుడు మీలో కపట వేషధారులైన వారి గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికిన ఆ మాటలు చక్కగా అతికినట్టు సరిపోయాయి.
\q1 దేవుని ఉపదేశంగా బోధిస్తారు కాబట్టి వారి ఆరాధన వ్యర్థం,
\p అని మీ పూర్వికులను యెషయా గద్దించాడు. ఇప్పుడు మీలో కపట వేషధారులైన వారి గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికిన ఆ మాటలు చక్కగా అతికినట్టు సరిపోయాయి.
\s5
\p
\v 8 మీరూ మీ పూర్వీకుల్లాగే దేవుని ఆజ్ఞల్ని తోసిపుచ్చి మనుషులు నేర్పించిన సంప్రదాయాలకు పెద్ద పీట వేశారు.
\v 9 మీ సంప్రదాయాలను పాటించడం కోసం దేవుని ఆజ్ఞలను మీరడంలో మీరు సిద్ధహస్తులు."
\p
@ -695,9 +684,9 @@
\s5
\v 5 యేసు వారితో, "మీ పూర్వికులు తమ భార్యలను వదిలి పెట్టాలని మొండిగా కోరుకున్నారు. అందుకే మోషే ధర్మశాస్త్రంలో ఇలాటి నియమం రాశాడు.
\v 6 అయితే దేవుడు మాత్రం మొదట్లో మానవుల్ని చేసినప్పుడు,
\q1 దేవుడు వారిని స్త్రీ పురుషులుగా నిర్మించాడు, అని ధర్మశాస్త్రం చెబుతున్నది.
\q1 దేవుడు వారిని స్త్రీ పురుషులుగా నిర్మించాడు,
\p అని ధర్మశాస్త్రం చెబుతున్నది.
\s5
\p
\v 7 ఎప్పుడైతే పురుషుడు వివాహం చేసుకుంటాడో, అప్పటినుంచి అతడు తన తల్లిదండ్రులను కచ్చితంగా విడిచిపెట్టి తన భార్యతో కలసి ఉండాలి, అని దేవుడు చెప్పింది ఇందుకే.
\v 8 వాళ్ళిద్దరూ ఒకే మనిషిగా మారిపోతారు. ఇక వారు ఇద్దరు మనుషులు కాదు, ఒక్కరే.
\v 9 ఇది సత్యం. కాబట్టి, ఏ పురుషుడు తన భార్యను విడిచిపెట్టకూడదు. దేవుడు వారిద్దరినీ జత కలిపాడు. వారిద్దరూ కలిసి ఉండాలని దేవుడు ఆశించాడు" అని చెప్పాడు.
@ -1219,4 +1208,4 @@
\p
\v 19 యేసు ప్రభువు తన శిష్యులకు ఈ విషయాలన్నీ చెప్పిన తరువాత, దేవుడు ఆయనను పైకి, పరలోకంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన తన సింహాసనంపై, దేవుని కుడి పక్కన కూర్చున్నాడు. అలా దేవునితో కలిసి పరిపాలించడానికి అత్యున్నతమైన, ఘనమైన స్థానంలో ఉన్నాడు.
\p
\v 20 శిష్యులైతే యెరూషలేము నుండి బయలుదేరి అన్ని ప్రదేశాలు తిరుగుతూ దేవుని సువార్త ప్రకటించారు. ప్రభువు వాళ్లకి ఎంత సామర్ధ్యం ఇచ్చాడంటే, వాళ్ళు ఎక్కడికి పొతే అక్కడ ప్రజలు ఆశ్చర్య పడేలా శారీరక, మానసిక రోగాలను నయం చేశారు, అద్భుతాలు చేసారు. ఆయన ఇలా చేయడంతో శిష్యులు ప్రకటిస్తున్న సువార్త సత్యమని చూపించాడు.
\v 20 శిష్యులైతే యెరూషలేము నుండి బయలుదేరి అన్ని ప్రదేశాలు తిరుగుతూ దేవుని సువార్త ప్రకటించారు. ప్రభువు వాళ్లకి ఎంత సామర్ధ్యం ఇచ్చాడంటే, వాళ్ళు ఎక్కడికి పొతే అక్కడ ప్రజలు ఆశ్చర్య పడేలా శారీరక, మానసిక రోగాలను నయం చేశారు, అద్భుతాలు చేసారు. ఆయన ఇలా చేయడంతో శిష్యులు ప్రకటిస్తున్న సువార్త సత్యమని చూపించాడు.

View File

@ -412,9 +412,9 @@
\q1
\v 10 "దేవుడు నిన్ను కాపాడడానికి నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు.
\q1
\v 11 పడిపోతుంటే వాళ్ళు వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు. నీకు గాయం కాదు. నీ పదం సైతం రాయికి తగలదు" అని రాసి ఉంది గదా” అని ఆయనతో అన్నాడు.
\v 11 పడిపోతుంటే వాళ్ళు వారు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు. నీకు గాయం కాదు. నీ పదం సైతం రాయికి తగలదు"
\p అని రాసి ఉంది గదా” అని ఆయనతో అన్నాడు.
\s5
\p
\v 12 కాని యేసు, "లేదు, అలా ఒక్కనాటికీ చెయ్యను. లేఖనాల్లో
\q1 "నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించడానికి ప్రయత్నించ వద్దు" అని రాసి ఉంది" అని జవాబిచ్చాడు.
\p
@ -723,9 +723,9 @@
\s5
\v 41 యేసు అతనికి ఒక కథ చెప్తూ, "వడ్డీ వ్యాపారి దగ్గర ఇద్దరు అప్పు తీసుకున్నారు. వాళ్ళల్లో ఒకడు ఐదొందలు వెండి నాణాలు, ఇంకొకడు యాభై వెండి నాణాలు బాకీ ఉన్నారు.
\v 42 అప్పు తీర్చడం వాళ్ళవల్ల కాలేదు. కాబట్టి ఆ వ్యక్తి ఆ ఇద్దరికీ రుణ మాఫీ చేశాడు. కాబట్టి వాళ్ళల్లో ఎవరికి అతడంటే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది?" అని అడిగాడు.
\v 43 సీమోను "ఎక్కువ డబ్బు అప్పు తీసుకున్న వాడే అనుకుంటా" అన్నాడు. అప్పుడు యేసు, "నువ్వు సరిగ్గా చెప్పావు" అని,
\v 43 సీమోను "ఎక్కువ డబ్బు అప్పు తీసుకున్న వాడే అనుకుంటా" అన్నాడు.
\p అప్పుడు యేసు, "నువ్వు సరిగ్గా చెప్పావు" అని,
\s5
\p
\v 44 ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, "ఈమె ఏమి చేసిందో ఒకసారి ఆలోచించు. నేను నీ ఇంట్లో అడుగు పెట్టగానే సాధారణంగా అతిధులను ఆహ్వానించే వాళ్ళు ఏమి చేస్తారో అది నువ్వు చేయలేదు. కాళ్ళకు నీళ్ళియ్యలేదు. కాని, ఈమె తన కన్నీళ్ళతో నా పాదాలు కడిగింది, తన జుట్టుతో తుడిచింది.
\v 45 నువ్వు నన్ను ముద్దు పెట్టుకొని ఆహ్వానించలేదు. కానీ ఈమె నేను వచ్చినప్పటి నుండి నా పాదాలు ముద్దు పెట్టుకోవడం ఆపలేదు.
\s5
@ -814,9 +814,9 @@
\p
\v 40 తరవాత యేసు, ఆయన శిష్యులు సరస్సు దాటి కపెర్నహోం తిరిగి వెళ్ళారు. అక్కడ జన సమూహం ఆయన కోసం కనిపెడుతూ ఆయనను ఆహ్వానించారు.
\v 41 సమాజమందిరం నాయకుల్లో యాయీరు అనే పేరు గల ఒకడు యేసు దగ్గరికి వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి,
\v 42 చావుబతుకుల మధ్య ఉన్న తన పన్నెండేళ్ళ ఒక్కగానొక్క కూతుర్ని బాగు చెయ్యడానికి తన ఇంటికి రమ్మని ఆయనను వేడుకున్నాడు. యేసు వెళుతుండగా చాలా మంది గుంపుగా ఆయన్ని చుట్టుముట్టారు.
\v 42 చావుబతుకుల మధ్య ఉన్న తన పన్నెండేళ్ళ ఒక్కగానొక్క కూతుర్ని బాగు చెయ్యడానికి తన ఇంటికి రమ్మని ఆయనను వేడుకున్నాడు.
\p యేసు వెళుతుండగా చాలా మంది గుంపుగా ఆయన్ని చుట్టుముట్టారు.
\s5
\p
\v 43 ఆ గుంపులో పన్నెండేళ్ళ నుండి ఆగకుండా రక్తం స్రవించే రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. వైద్యం కోసం ఆమె తన డబ్బంతా ఖర్చు చేసింది. కాని ఎవ్వరూ ఆమెని స్వస్థపరచ లేకపోయారు.
\p
\v 44 ఆమె యేసు వెనకగా వెళ్ళి ఆయన అంగీ అంచు ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
@ -1714,7 +1714,8 @@
\p
\v 45 యేసు యెరూషలేములోకి ప్రవేశించాక దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళాడు. అక్కడ సరుకులు అమ్మే వాళ్ళను వెళ్ళగొట్టడం మొదలుపెట్టాడు.
\v 46 ఆయన,
\q1 "నా ఇల్లు జనులు ప్రార్థన చేసేదిగా ఉండాలి అని రాసి ఉంది. కాని మీరు దాన్ని దొంగలు దాక్కునే స్థావరంగా మార్చేసారు" అన్నాడు.
\q1 "నా ఇల్లు జనులు ప్రార్థన చేసేదిగా ఉండాలి అని రాసి ఉంది.
\p కాని మీరు దాన్ని దొంగలు దాక్కునే స్థావరంగా మార్చేసారు" అన్నాడు.
\s5
\p
\v 47 ఆ వారం అంతా యేసు దేవాలయ ప్రాంగణంలో బోధించాడు. ప్రధాన యాజకులు, మతాధికారులు, ఇతర యూదీయ నాయకులు ఆయన్ని చంపడానికి ఉపాయం కోసం చూస్తున్నారు.
@ -1907,9 +1908,9 @@
\p
\v 14 భోజన సమయం అయినప్పుడు యేసు అపొస్తలులతో కలిసి కూర్చున్నాడు.
\v 15 ఆయన వాళ్ళతో, "నేను హింస పొంది, చనిపోకముందు మీతో కలిసి ఈ భోజనం చెయ్యాలని ఎంతగానో అనుకున్నాను.
\v 16 దేవుడు పస్కాలో చేయడానికి మొదలుపెట్టింది ముగించాక, ప్రతి ఒక్కరినీ ప్రతి చోటా ఏలే సమయం వచ్చే వరకూ మళ్ళీ నేను ఈ భోజనం చేయనని మీతో చెప్తున్నాను" అన్నాడు. భోజనం అయ్యాక
\v 16 దేవుడు పస్కాలో చేయడానికి మొదలుపెట్టింది ముగించాక, ప్రతి ఒక్కరినీ ప్రతి చోటా ఏలే సమయం వచ్చే వరకూ మళ్ళీ నేను ఈ భోజనం చేయనని మీతో చెప్తున్నాను" అన్నాడు.
\p భోజనం అయ్యాక
\s5
\p
\v 17 ఆయన ఒక గిన్నెలో ద్రాక్షరసం తీసుకొని, దేవునికి వందనాలు చెప్పాడు. శిష్యులతో ఆయన, "ఇది తీసుకొని, మీరందరూ తాగండి.
\v 18 దేవుడు అందర్నీ అన్ని చోట్లా ఏలే కాలం వచ్చే దాకా నేను ద్రాక్షరసం తాగనని మీతో చెప్తున్నాను.
\s5
@ -2191,4 +2192,4 @@
\s5
\v 52 వాళ్ళు ఆయనను ఆరాధించి గొప్ప ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు.
\p
\v 53 అనుదినం దేవాలయం ఆవరణలో దేవుణ్ణి కీర్తించడంలో నిమగ్నమయ్యారు.
\v 53 అనుదినం దేవాలయం ఆవరణలో దేవుణ్ణి కీర్తించడంలో నిమగ్నమయ్యారు.

1637
44-JHN.usfm Normal file
View File

@ -0,0 +1,1637 @@
\id JHN - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h యోహాను సువార్త
\toc1 యోహాను సువార్త
\toc2 యోహాను సువార్త
\toc3 jhn
\mt1 యోహాను సువార్త
\s5
\c 1
\p
\v 1 ఆరంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడితో ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే.
\v 2 సృష్టి ప్రారంభం కాకముందే ఆయన దేవునితో ఉన్నాడు.
\v 3 దేవుని ఆజ్ఞను అమలు పరుస్తూ సృష్టిని చేసింది ఆయనే. అవును! కచ్చితంగా ప్రతిదానినీ చేసింది ఆయనే.
\s5
\v 4 ప్రతిదానికీ, ప్రతి ఒక్కరికీ ప్రాణం వచ్చేలా జీవం అంతా ఆ వాక్కులోనే ఉంది. ఆ వాక్కు ప్రతి వారిపైనా, ప్రతి చోటా దేవుని వెలుగుగా ప్రకాశించింది.
\v 5 ఈ వెలుగు చీకటిలో ప్రకాశించింది, చీకటి ఈ వెలుగును ఆర్పివెయ్యాలని చూసింది గానీ దానివల్ల కాలేదు.
\s5
\p
\v 6 బాప్తిసమిచ్చే యోహాను అనే వ్యక్తిని దేవుడు పంపించాడు.
\v 7 వెలుగును గురించి మనుషులకు సాక్ష్యమివ్వడానికి అతను వచ్చాడు. ప్రతి ఒక్కరికీ వెలుగు నిచ్చే వాడిపై విశ్వాసం ఉంచాలని అతను ప్రకటించాడు. అతడు చెప్పింది నిజం.
\v 8 యోహాను ఆ వెలుగు కాదు. ప్రజలందరికీ ఆ వెలుగును గురించి బోధించడానికి అతను వచ్చాడు.
\s5
\v 9 ఆ వెలుగు లోకంలోకి వచ్చింది. ప్రతి ఒక్కరిపైనా ప్రకాశించే నిజమైన వెలుగు ఇది.
\s5
\p
\v 10 లోకంలోకి వాక్కు వచ్చాడు. ఆయనే లోకాన్ని చేసినప్పటికీ లోకంలోని మనుషులు ఆయన్ని తెలుసుకోలేదు.
\v 11 తన సొంతం అయిన లోకానికి ఆయన వచ్చినప్పటికీ పెరట్లో తోట కూర వైద్యానికి పానికి రాదన్నట్టు తన సొంత ప్రజలైన యూదులు ఆయన్ని తిరస్కరించారు.
\s5
\v 12 కానీ ఎవరైతే ఆయనలో విశ్వాసముంచి, ఆయన్ని తమ జీవితాల్లోకి తెచ్చుకుంటారో వాళ్ళందరికీ దేవుని పిల్లలయ్యే హక్కును ఆయన ఇచ్చాడు.
\v 13 వీళ్ళు దేవుని నుండి పుట్టిన పిల్లలు. వీళ్ళు పిల్లల్ని కనాలనే కోరిక కారణంగా కానీ, మానవపరమైన అభిలాష లేదా ఎంపిక వల్ల కానీ సాధారణ మానవ జన్మ ద్వారా పుట్టిన వాళ్లు కాదు.
\s5
\p
\v 14 ఇప్పుడు ఈ వాక్కు నిజమైన మానవుడిగా మారి, కొంతకాలం మనం నివసించే ఈ లోకంలో మన మధ్య నివసించాడు. నమ్మకమైన ప్రేమతో దేవుడు మన పట్ల ఉన్నాడని చూపిస్తూ, ఆయన సత్యాన్ని బోధిస్తూ, తండ్రికి ఉన్న విలక్షణమైన కుమారుడిగా ఆయన తన శ్రేష్టమైన, అద్భుతమైన స్వభావాన్ని ప్రదర్శించగా మేము చూశాం.
\p
\v 15 ఒకరోజు బాప్తిసమిచ్చే యోహాను, ఆ వాక్కు గురించి ప్రజలకి చెప్తూ ఉండగా యేసు అతని దగ్గరికి వచ్చాడు. యోహాను పెద్ద స్వరంతో తన చుట్టూ ఉన్న సమూహంతో, "నా తరవాత ఒకరు వస్తారనీ ఆయన నాకంటే చాలా ప్రాముఖ్యమైనవాడనీ నేను మీకు చెప్పాను గదా. ఆయన నాకంటే చాలాకాలం ముందే, నేను పుట్టడానికి ముందే నిత్యం ఉండే యుగాల్లో ఉన్నవాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు. నేను చెప్పేది ఈయన గురించే!" అని చెప్పాడు.
\s5
\p
\v 16 "ఆయన చేసిన దానిమూలంగా మనం అందరం ఎంతో లాభం పొందాము. పదే పదే ఆయన మన పట్ల ఎంతో దయ చూపించాడు.
\v 17 యూదులకు మోషే దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రకటించాడు. యేసుక్రీస్తు మన అర్హతకు మించి ఎంతో ఎక్కువగా మన మీద దయ చూపించి, దేవుని గురించి నిజమైన విషయాలు మనకు నేర్పించాడు.
\v 18 ఎవ్వరూ, ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. అభిషిక్తుడైన యేసు తానే దేవుడుగా తండ్రిని ఎప్పుడూ హత్తుకుని ఉండి, ఆయన్ని మనకు వెల్లడి పరచాడు."
\s5
\p
\v 19 బాప్తిసమిచ్చే యోహాను ఇచ్చిన సాక్ష్యం ఇదే - యెరూషలేము నుండి యూదులు యాజకులనూ లేవీయులనూ పంపించారు. వాళ్ళు యోహాను దగ్గరికి వచ్చి, "నువ్వు ఎవరు?" అని అడిగారు.
\v 20 అందుకు యోహాను సాక్ష్యం ఇస్తూ, "నేను మెస్సీయను కాను" అన్నాడు.
\v 21 అప్పుడు వాళ్ళు అతన్ని, "నీ గురించి ఏమి చెప్పుకుంటావు? నువ్వు ఏలీయావా?" అని అడిగారు. అతడు "కాదు" అన్నాడు. వాళ్ళు మళ్ళీ "రాబోయే ప్రవక్త అని ప్రవక్తలు చెప్పింది నీ గురించేనా?" అని అడిగారు. యోహాను "కాదు" అని జవాబిచ్చాడు.
\s5
\v 22 దానికి వాళ్ళు అతన్ని మళ్ళీ "నువ్వెవరివో చెప్పు. మేము తిరిగి వెళ్ళి మమ్మల్ని పంపిన వాళ్లకి సమాచారం ఇవ్వాలి. నీ గురించి నువ్వేమి చెప్పుకుంటావు?" అని అడిగారు.
\v 23 దానికి అతడు, యెషయా ప్రవక్త రాసినట్టు
\q1 నిర్జన ప్రదేశంలో ప్రజలు ఒక ముఖ్యమైన అధికారి కోసం మార్గం సిద్ధం చేసినట్టు,
\q1 ప్రభువు వచ్చినప్పుడు ఆయన్ని అంగీకరించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, అని బిగ్గరగా వినిపించే కేకను, అన్నాడు.
\s5
\p
\v 24 వీళ్ళల్లో కొందరు పరిసయ్యుల దగ్గర నుండి వచ్చిన వాళ్ళు.
\v 25 వాళ్ళు అతణ్ణి - "నువ్వు ఏలియా ప్రవక్తవు కాదు, మెస్సీయవూ కాదని చెప్పావు. మరి నువ్వు బాప్తిసం ఎందుకు ఇస్తున్నావు?" అని అడిగారు.
\s5
\v 26 అందుకు యోహాను, "నేను ప్రజలకి నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఇప్పుడు మీకు తెలియని వ్యక్తి మీ మధ్య ఉన్నాడు."
\v 27 "ఆయన నా తరువాత వస్తాడు. కానీ ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను సరిపోను" అని చెప్పాడు.
\v 28 ఈ విషయాలు యొర్దాను నదికి తూర్పు దిక్కున ఉన్న బేతనీ అనే ఊరిలో జరిగాయి. అది యోహాను బాప్తిసం ఇచ్చే చోటు.
\s5
\p
\v 29 మరుసటి రోజు యేసు తన దగ్గరికి రావడం యోహాను చూశాడు. అతను ప్రజలతో, "చూడండి! తన ప్రాణాన్ని అర్పించి లోక పాపాల్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల ఈయనే!
\v 30 నా తరువాత వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు. ఎందుకంటే నేను పుట్టడానికి ముందే నిత్యం ఉండే యుగాలలో నాకంటే చాలా కాలం ముందే ఉన్నవాడు.
\v 31 మొదట్లో ఆయన నాకు తెలియలేదు. కానీ ఆయన ఎవరో నాకిప్పుడు తెలుసు. నా పని ఏమిటంటే ఎవరైతే వాళ్ళ పాపాల నుండి మళ్ళుకుని పశ్చాత్తాపపడి వస్తారో, వాళ్లకి బాప్తిసమివ్వడం. ఆయన ఎవరో ఇశ్రాయేలు ప్రజలకు తెలపడమే నా పని" అన్నాడు.
\s5
\v 32 అతడు ఇలా చెప్పాడు - "దేవుని ఆత్మ పావురం రూపంలో పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. ఆ ఆత్మ క్రిందికి వచ్చి యేసు మీద నిలిచింది."
\p
\v 33 "మొదట నేను ఆయన్ని గుర్తించలేదు కానీ, మనుషుల్లో వాళ్ళ పాప మార్గాల నుండి తొలగిపోవాలని కోరుకునే వాళ్లకి నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి దేవుడు నన్ను పంపాడు. దేవుడు నాతో, "నా ఆత్మ దిగి వచ్చి ఎవరి మీద నిలిచి ఉండడం నువ్వు చూస్తావో ఆయనే మీ అందరికీ పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు" అని చెప్పాడు.
\v 34 నేను ఇది చూసి, ఆయనే దేవుని కుమారుడని మీకు సాక్ష్యమిస్తున్నాను."
\s5
\p
\v 35 మళ్ళీ ఆ తర్వాత రోజు కూడా బాప్తిసమిచ్చే యోహాను తన ఇద్దరు శిష్యులతో కలిసి అదే చోట ఉన్నాడు.
\v 36 అప్పుడు యేసు ఆ దారిన వెళ్తుండగా చూసి, "చూడండి! ఈయనే దేవుని గొర్రెపిల్ల! ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాలకు పరిహారంగా గొర్రెపిల్లను వధించినట్టుగా ప్రజల కోసం తన ప్రాణం ఇవ్వడానికి దేవుడు ఈయనను నియమించాడు."
\s5
\p
\v 37 యోహాను చెప్పింది విన్న ఇద్దరు శిష్యులు, యోహానును విడిచి యేసును అనుసరించారు.
\v 38 యేసు వెనక్కి తిరిగి వాళ్ళు తన వెంట రావడం చూసి, "మీరు దేని కోసం చూస్తున్నారు?" అని వాళ్ళని అడిగాడు. వాళ్ళు ఆయనతో, "రబ్బీ (అంటే, బోధకుడా అని అర్థం), నువ్వు ఎక్కడ ఉంటున్నావో మాకు చెప్పు" అన్నారు.
\v 39 ఆయన జవాబిస్తూ, "మీరే చూద్దురు గాని నాతో రండి" అన్నాడు. కాబట్ట్టి వాళ్ళు వచ్చి యేసు ఎక్కడ ఉంటున్నాడో చూసారు. సాయంత్రం నాలుగు గంటలు అయ్యింది. ఆలస్యం కావడంతో వాళ్ళు ఆ రోజు ఆయనతోనే ఉండిపోయారు.
\s5
\p
\v 40 యోహాను చెప్పింది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకడి పేరు అంద్రెయ. అతడు సీమోను పేతురు తమ్ముడు.
\v 41 అంద్రెయ మొట్టమొదటగా తన అన్న సీమోను కోసం వెదికాడు. అతను కనిపించినప్పుడు, "మేము మెస్సీయ (గ్రీకు భాషలో "క్రీస్తు")ను చూశాం" అన్నాడు.
\v 42 అంద్రెయ సీమోనును యేసు దగ్గరికి తీసుకెళ్ళాడు. యేసు పేతురును చూసి, "నువ్వు యోహాను కుమారుడైన సీమోనువి. ఇకమీదట నిన్ను కేఫా అని పిలుస్తారు" అన్నాడు. కేఫా అంటే అరమేయిక్ భాషలో రాయి అని అర్ధం. (ఇదే అర్ధం ఉన్న "పెత్రోస్" అనే గ్రీకు పదం నుండి పేతురు అనే పేరు వచ్చింది.)
\s5
\p
\v 43 ఆ తరవాత రోజు యేసు యొర్దాను నదీ లోయను వదిలి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్ళి, ఫిలిప్పు అనే వ్యక్తిని కలిశాడు. అతణ్ణి "నాతో రా" అని పిలిచాడు.
\v 44 ఫిలిప్పు, అంద్రెయ, పేతురు వీళ్ళందరూ గలిలయలోని బేత్సయిదా ఊరికి చెందినవాళ్ళు.
\v 45 ఫిలిప్పు తన స్నేహితుడు నతనియేలును కలుసుకోవడానికి వెళ్ళాడు. అతడు నతనియేలు దగ్గరికి వచ్చి అతనితో, "మోషే ఎవరి గురించి రాశాడో ఆ మెస్సీయని కనుగొన్నాం. ప్రవక్తలు ఆయన వస్తాడని ప్రవచించారు. ఆ మెస్సీయ యేసే. ఆయన నజరేతు ఊరివాడు. ఆయన తండ్రి పేరు యోసేపు" అన్నాడు.
\s5
\p
\v 46 నతనియేలు జవాబిస్తూ, "నజరేతు నుండా? నజరేతు వంటి ప్రాముఖ్యత లేని చోటు నుండి మంచిది ఏదైనా వస్తుందా?" అన్నాడు. అప్పుడు ఫిలిప్పు, "రా! నువ్వే చూస్తావుగా" అన్నాడు.
\v 47 నతనియేలు తన దగ్గరికి వస్తూ ఉండడం యేసు చూసి అతని గురించి చెప్తూ, "చూడండి. అతను నిజాయితీపరుడైన ఉత్తమ ఇశ్రాయేలీయుడు. అతడు ఎవ్వరినీ ఎప్పుడూ మోసగించలేదు" అన్నాడు.
\v 48 "బోధకా, నేను ఎలాంటి వాడినో నీకు ఎలా తెలుసు? నేను నీకు పరిచయం లేదు కదా" అని నతనియేలు ఆయన్ని అడిగాడు. యేసు జవాబిస్తూ, "అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చున్నప్పుడే, ఫిలిప్పు నిన్ను పిలవక ముందే నిన్ను చూశాను" అన్నాడు.
\s5
\p
\v 49 అప్పుడు నతనియేలు, "బోధకా, నువ్వు కచ్చితంగా దేవుని కుమారుడివే. మేము వేచి చూస్తున్న ఇశ్రాయేలు రాజువు నువ్వే" అని ప్రకటించాడు.
\v 50 యేసు అతనికి జవాబిస్తూ, "అంజూరపు చెట్టు కింద నిన్ను చూశానని నీతో చెప్పినందుకు నన్ను నమ్మావా? దానికంటే గొప్పవి నేను చేయడం నువ్వు చూస్తావు" అన్నాడు.
\v 51 యేసు మళ్ళీ అతనితో, "నేను నీతో నిజం చెబుతున్నాను. చాలాకాలం క్రితం నీ పూర్వీకుడు యాకోబు చూసిన దర్శనంలా మనుష్యకుమారుడినైన నా మీదుగా దేవదూతలు పైకి ఎక్కడం, దిగడం నువ్వు చూస్తావు" అన్నాడు.
\s5
\c 2
\p
\v 1 మూడు రోజుల తర్వాత గలిలయలోని కానా అనే చోట ఒక పెళ్లి జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది.
\v 2 వాళ్ళు యేసుని, ఆయన శిష్యుల్నికూడా పెళ్ళికి పిలిచారు.
\s5
\p
\v 3 పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ద్రాక్షరసం పోశారు. కొంతసేపటికి ద్రాక్షరసం అయిపోయింది. యేసు తల్లి ఆయనతో, "ద్రాక్షరసం అయిపోయింది" అని చెప్పింది.
\v 4 యేసు ఆమెతో, "అమ్మా, దానికి నేనేమి చెయ్యాలి? ఎంతో ప్రాముఖ్యమైన నా పని ప్రారంభించడానికి ఇంకా సమయం రాలేదు" అన్నాడు.
\v 5 యేసు తల్లి అక్కడి పనివాళ్ళతో, "ఆయన మీకు ఏమి చెప్తే అది చెయ్యండి" అని చెప్పింది.
\s5
\p
\v 6 అక్కడ ఆరు పెద్ద రాతి బానలు ఉన్నాయి. యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం, వచ్చిన అతిథులూ, పనివాళ్ళూ కాళ్ళూ చేతులు కడుక్కోడానికి వాటిలో నీళ్ళు పట్టి ఉంచారు. ఒక్కొక్క బానలో 75 నుండి 115 లీటర్ల నీళ్ళు పడతాయి.
\v 7 యేసు అక్కడి పనివాళ్ళతో, "బానలను నీళ్ళతో నింపండి" అని చెప్పాడు. కాబట్టి వాళ్ళు అంచుల వరకు బానలను నింపారు.
\v 8 అప్పుడు ఆయన వాళ్ళతో, "ఇప్పుడు ఆ నీళ్ళను పెళ్ళి విందు మేస్త్రి దగ్గరికి తీసుకు వెళ్ళండి" అన్నాడు. పనివాళ్ళు ఆయన చెప్పినట్టు చేశారు.
\s5
\p
\v 9 ఆ విందు మేస్త్రి ద్రాక్షరసంగా మారిన ఆ నీళ్ళను రుచి చూశాడు. పనివారికి దీని విషయం తెలిసినప్పటికీ అతనికి మాత్రం ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చిందో తెలియ లేదు. పెళ్ళికొడుకుతో,
\v 10 "అందరూ మంచి ద్రాక్షరసం ముందు పోసి, అతిథులు తాగి మత్తుగా ఉన్నప్పుడు, చవకబారు ద్రాక్షరసం పోస్తారు. కానీ నువ్వు శ్రేష్టమైన ద్రాక్షరసం ఇప్పటి వరకూ ఉంచావే" అన్నాడు.
\s5
\p
\v 11 యేసు చేసిన మొదటి అద్భుతం అది. ఆయనను గూర్చిన ప్రాముఖ్యమైన వాస్తవాన్ని తెలియజేసింది అదే. ఆయన దీన్ని గలిలయ ప్రాంతంలోని కానాలో చేశాడు. అక్కడ ఆయన గొప్ప కార్యాలు చేయగలడని రుజువు చేశాడు. కాబట్టి ఆయన శిష్యులు ఆయనలో విశ్వాసముంచారు.
\s5
\p
\v 12 దీని తరవాత యేసు, ఆయన తల్లి, తమ్ముళ్ళు ఆయన శిష్యులతో కలిసి కపెర్నహోము అనే ఊరికి వెళ్ళి, అక్కడ కొన్ని రోజులు ఉన్నారు.
\s5
\p
\v 13 యూదుల పస్కా పండగ దగ్గర పడింది. యేసు, ఆయన శిష్యులు యెరూషలేముకు వెళ్ళారు.
\v 14 అక్కడ దేవాలయం ఆవరణంలో కొందరు పశువుల్నీ, గొర్రెల్నీ, పావురాల్నీ అమ్మడం యేసు చూశాడు. దేవాలయంలో బలి ఇచ్చే వాళ్లకు ఆ జంతువుల్ని అమ్ముతూ ఉంటారు. కొందరు అక్కడ బల్లల దగ్గర కూర్చుని దేవాలయ నాణాల మారకానికి అమ్మడం కూడా ఆయన చూశాడు.
\s5
\p
\v 15 కాబట్టి యేసు తోలు పట్టీలను కొరడాలాగా చేసి, దేవాలయ ఆవరణం నుండి గొర్రెల్నీ, పశువుల్నీ వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేసే దళారుల బల్లలను పడేసి, నాణాలు నేలపాలు చేసాడు.
\v 16 పావురాలు అమ్మే వాళ్ళతో, "వీటిని ఇక్కడ నుండి బయటికి తీసుకు పొండి! నా తండ్రి ఇంటిని వ్యాపార స్థలంగా మార్చకండి" అని గదిమాడు.
\s5
\p
\v 17 చాలాకాలం క్రితం లేఖనాల్లో, "దేవా! నీ ఇల్లంటే నాకెంతో ఇష్టం, దాని కోసం నేను ప్రాణాలు అర్పిస్తాను" అని రాసి ఉన్న మాటలను ఆయన శిష్యులకు ఈ సంఘటన గుర్తు చేసింది.
\p
\v 18 యూదుల నాయకులు కొందరు ఆయన్ని, "నువ్వు చేసే వాటన్నిటికీ దేవుని నుండి నీకు అధికారం ఉందని నిరూపించడానికి మాకు ఏ అద్భుతం చేసి చూపిస్తావు?" అని అడిగారు.
\v 19 యేసు వారికి జవాబిస్తూ, "ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మూడు రోజుల్లో తిరిగి కడతాను" అన్నాడు.
\s5
\p
\v 20 అందుకు వాళ్ళు, "ఈ మొత్తం దేవాలయాన్ని మూడు రోజుల్లోనే కట్టేస్తానంటున్నావా? రాళ్ళన్నీ తొలిచి ఈ ఆలయం కట్టడానికి 46 ఏళ్ళు పట్టింది తెలుసా?" అన్నారు.
\v 21 అయితే యేసు మాట్లాడింది ఆలయ భవనం గురించి కాదు, దేవాలయం అనే తన సొంత శరీరం గురించి.
\v 22 యేసు చనిపోయి తిరిగి మూడవ రోజున లేచిన తరవాత, దేవాలయం గురించి ఆయన చెప్పిన మాటలు ఇవేనని శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు.
\s5
\p
\v 23 పస్కా పండగ జరుగుతున్న సమయంలో యేసు యెరూషలేములో ఉన్నప్పుడు చాలా మంది ప్రజలు యేసు గురించిన వాస్తవాన్ని సూచించే అద్భుతాలు చూసి ఆయనలో నమ్మకం ఉంచారు.
\v 24 అయితే యేసుకు ప్రజలు ఎలాటివారో, వాళ్ళ బుద్ధి ఎలాంటిదో తెలుసు. కనుక ఆయన వాళ్ళను నమ్మలేదు.
\v 25 మనుషులు ఎంత చెడ్డవారో ఆయనకు ఎవ్వరూ చెప్పనక్కరలేదు. వాళ్లకు ఏమి కావాలో, వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారో ఆయనకు అంతా తెలుసు.
\s5
\c 3
\p
\v 1 నికోదేము అనే మనిషి ఒకడు ఉన్నాడు. ఆ రోజుల్లో యూదీయ విశ్వాసంలో నిష్టగా ఉండే పరిసయ్యుల గుంపులో అతడు సభ్యుడు. ఆనాటి సమాజంలో నికోదేము చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. యూదీయ ఉన్నత పాలక మండలిలో సభ్యుడు.
\v 2 అతడు చీకటి పడిన తర్వాత యేసును కలుసుకోవడానికి వెళ్ళాడు. అతడు యేసుతో, "బోధకా, నువ్వు దేవుడి నుండి వచ్చిన వాడివని మాకు తెలుసు. దేవుని సహాయం లేకుండా నువ్వు ఈ అద్భుతాలు చేయలేవని తెలుసు" అన్నాడు.
\s5
\p
\v 3 నికోదేము మాటలకి యేసు జవాబిస్తూ, "నేను నీకు నిజం చెప్తున్నాను. రెండవ సారి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు" అన్నాడు.
\v 4 అప్పుడు నికోదేము ఆయనతో, "ముసలి వాడయ్యాక మనిషి మళ్ళీ ఎలా పుట్టగలడు? తల్లి గర్భంలో ప్రవేశించి ఎవరూ రెండోసారి పుట్టలేరు గదా" అన్నాడు.
\s5
\p
\v 5 అందుకు యేసు ఇలా జవాబిచ్చాడు. "నువ్వు చెప్పింది నిజమే. నీటి మూలంగా, ఆత్మ మూలంగా పుట్టకపోతే ఎవ్వరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు.
\v 6 ఎవరైనా మనిషి నుండి పుడితే ఆ వ్యక్తి మనిషి అవుతాడు. కానీ దేవుని ఆత్మ చేసే పని ద్వారా మళ్ళీ పుట్టిన వాళ్ళకు కొత్త ఆధ్యాత్మిక స్వభావం వస్తుంది. దీనిని దేవుడు వాళ్ళలో కలిగిస్తాడు."
\s5
\p
\v 7 "నువ్వు మళ్ళీ పుట్టాలనీ దేవుని నుండి కొత్త జీవం పొందాలనీ నేను చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు.
\v 8 అది ఎలానంటే, గాలి తనకి ఇష్టమైన వైపుకు వీస్తుంది. దాని శబ్దాన్ని నువ్వు వింటావు, కానీ అది ఎక్కడ నుండి వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. ఆత్మ ద్వారా పుట్టిన వాళ్ళందరి విషయంలో ఇలానే అవుతుంది. ఆత్మ తాను కోరుకున్న వాళ్లకి కొత్త జన్మ ఇస్తాడు."
\s5
\p
\v 9 నికోదేము ఆయనతో, "ఇది ఎలా సాధ్యం?" అన్నాడు.
\v 10 యేసు అతనితో, "నువ్వు ఇశ్రాయేలులో ముఖ్య బోధకుడివైనా నేను చెప్పేది నీకు అర్ధం కావడం లేదు.
\v 11 నేను నీకు నిజం చెప్తున్నాను. నాకూ నా శిష్యులకూ తెలిసిన విషయాలే చెప్తున్నాము. మేము చూసిన వాటినే మీకు చెప్తున్నాము. మేము మీకు చెప్పే ఈ విషయాలు మీలో ఎవరూ ఇంకా నమ్మడం లేదు."
\s5
\p
\v 12 "నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే ఈ భూసంబంధమైన విషయాలూ, పరలోక సంబంధమైన విషయాలూ నీకు చెప్పినప్పుడు ఎలా నమ్ముతావు?
\v 13 నేనే మనుష్యకుమారుణ్ణి. పరలోకానికి వెళ్ళిన వాణ్ణి. భూమికి దిగి వచ్చినవాణ్ణి నేను ఒక్కణ్ణి మాత్రమే."
\s5
\p
\v 14 "మోషే కాలంలో నిర్గమం సమయంలో అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు ఒక స్తంభం పై విషసర్పం ప్రతిమను పైకెత్తి ఉంచినప్పుడు దాన్ని చూసిన వాళ్ళందరూ చావు తప్పించుకుని బ్రతికి బయటపడ్డారు. అదే విధంగా మనుష్యకుమారుడు తనను సిలువమీద పైకెత్తడానికి స్వయంగా అనుమతించాలి.
\v 15 అప్పుడు ఆయన్ని చూసే వాళ్ళకి, ఆయనలో నమ్మకం ఉంచే వాళ్ళకి నిత్యజీవం దొరుకుతుంది."
\s5
\p
\v 16 "దేవుడు లోకాన్ని హృదయపూర్వకంగా ప్రేమించాడు. ప్రేమించి ఆయన తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఇచ్చేశాడు. ఆయనలో నమ్మకం ఉంచిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు చనిపోరు, అంతంలేని జీవితం పొందుతారు.
\v 17 దేవుడు తన కుమారుణ్ణి పంపింది దుష్ట శిక్షణకోసం కాదు, లోకరక్షణ కోసం పంపాడు.
\v 18 తన కుమారుడిలో నమ్మకం ఉంచిన వాళ్ళని దేవుడు ఎన్నడూ శిక్షించడు. ఆయనలో నమ్మకం ఉంచని వాళ్ళకి దేవుడు ఇప్పటికే శిక్ష విధించాడు. ఎందుకంటే దేవుని ఒకే ఒక్క కుమారుడి నామంలో వాళ్ళు నమ్మకం ఉంచలేదు."
\s5
\p
\v 19 "పాపులు అందరూ స్పష్టంగా తెలుసుకునేలా దేవుడు తన తీర్పును వినిపించాడు. ఆయన వెలుగు లోకంలోకి వచ్చింది గానీ ఈ లోక ప్రజలు తాము ఉన్న చీకటినే ఇష్టపడ్డారు. వెలుగు నుండి వాళ్ళు దాకున్నారు. చీకటినే ప్రేమించారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు చెడ్డవి, పాపభూయిష్టమైనవి.
\v 20 చెడు పనులు చేసే ప్రతి ఒక్కరూ వెలుగును ద్వేషిస్తారు. వాళ్ళు చేసే పనులను వెలుగు బట్టబయలు చేసి, వారి నిజస్వరూపాలుబయట పడతాయి కాబట్టి వాళ్ళు వెలుగులోకి రారు.
\v 21 కానీ సత్యమైన యధార్థమైన పనులు చేసే వాళ్ళు తాము దేవునికి లోబడుతున్నారని అందరూ తెలుసుకునేలా, అందరూ చూసేలా వెలుగులోకి వస్తారు."
\s5
\p
\v 22 తరువాత యేసు, ఆయన శిష్యులు యూదయ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆయన తన శిష్యులతో కలిసి కొంతకాలం ఉన్నాడు. ఆయన చాలామందికి బాప్తిసం ఇచ్చాడు.
\p
\v 23 బాప్తిసమిచ్చే యోహాను కూడా సమరయ ప్రాంతంలోని సలీము దగ్గర ఉన్న ఐనోను అనే ఊరిలో ప్రజలకి బాప్తిసం ఇస్తున్నాడు. అక్కడ నీళ్ళు ఎక్కువగా ఉండడంతో చాలామంది ప్రజలు యోహాను దగ్గరికి వస్తున్నారు.
\v 24 ఇది శత్రువులు యోహానును జైల్లో పెట్టకముందు జరిగిన సంగతి.
\s5
\p
\v 25 తనను తాను దేవుని అంగీకారం పొందడానికి చేసుకునే శుద్ధి ఆచారం గురించి ఒక యూదునికి, యోహాను శిష్యులకి మధ్య వివాదం జరిగింది.
\v 26 వారు యోహాను దగ్గరికి వచ్చి, "బోధకా, యొర్దాను అవతల వైపున నువ్వు ప్రజలకు బాప్తిసం ఇస్తున్నప్పుడు నీతో కూడా ఒక మనిషి ఉన్నాడు. నువ్వు అతణ్ణి చూపించి అతని గురించి మాకు చెప్పావు గదా. బాగానే ఉంది. ఇప్పుడు యూదయలో అతడు బాప్తిసం ఇస్తున్నాడు. చాలామంది ఆయన దగ్గరికి వెళ్తున్నారు" అన్నారు.
\s5
\p
\v 27 యోహాను వాళ్లకి జవాబిస్తూ, "దేవుడు ఇవ్వకుండా ఎవరూ ఏమీ పొందలేరు.
\v 28 నేను మీకు చెప్పినప్పుడు, నేను మెస్సీయను కాదనీ ఆయన వచ్చినప్పుడు దారి సరిచేయడానికి ఆయనకు ముందుగా వచ్చిన వాడిననీ నేను చెప్పింది నిజమే.
\s5
\v 29 నేను పెళ్ళికొడుకు స్నేహితుడిలాంటి వాణ్ణి, పెళ్ళికొడుకు వస్తాడని ఎదురుచూస్తున్నాను. చివరికి పెళ్ళికొడుకు వచ్చినప్పుడు, అతని స్వరం విని పెళ్ళికొడుకు స్నేహితుడు సంతోష పడుతున్నాడు. ఇదంతా జరిగింది కనుక అతడు వచ్చినందుకు నాకు ఆనందం పొంగి పొర్లుతున్నది.
\v 30 కాలక్రమేణా ఆయన స్థితి, ప్రాముఖ్యత పెరుగుతాయి. నా ప్రాముఖ్యత తగ్గుతుంది" అన్నాడు.
\s5
\p
\v 31 యేసు పరలోకం నుండి వచ్చాడు. ఆయన అందరికంటే ఉన్నత స్థానంలో ఉన్నవాడు. మనకు భూమి మీద ఇల్లు ఉంది. మనం భూసంబంధమైనవే మాట్లాడుకుంటాం. పరలోకం నుండి వచ్చినవాడు భూమి మీద ఉన్న అన్నిటికంటే, అందరికంటే పైనున్నవాడు.
\v 32 తాను చూసిందీ విన్నదీ సాక్ష్యమివ్వడానికి ఇప్పుడు ఇక్కడ ఒకరున్నారు కానీ ఆయన చెప్పింది ఎవ్వరూ అంగీకరించరు, నిజమని నమ్మరు.
\v 33 అయితే ఆయన చెప్పింది నమ్మిన వాళ్ళు దేవుడు సత్యానికి ఆధారం అనీ సత్యమైన ప్రతిదానికీ కొలత, ప్రామాణికం ఆయన ఒక్కడే అనీ ధృవీకరించుకుంటారు.
\s5
\p
\v 34 దేవుడు తన ప్రతినిధిని పంపాడు. ఆయన దేవుని మాటలే చెప్తాడు కాబట్టి ఆయన చెప్పినదంతా నిజమే.
\v 35 తండ్రి తన కుమారుణ్ణి ప్రేమించి, ఆయన అధికారం క్రింద సమస్తం ఉంచాడు.
\v 36 దేవుని కుమారుడిలో ఎవరు నమ్మకం ఉంచుతారో వాళ్లకి నిత్యజీవం ఉంటుంది. దేవుని కుమారునికి లోబడని వాళ్లకి నిత్యజీవం ఎప్పటికీ ఉండదు. ఆ వ్యక్తి చేసిన ప్రతి పాపానికీ దేవుని న్యాయమైన ఉగ్రత అతని మీద ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
\s5
\c 4
\p
\v 1 బాప్తిసమిచ్చే యోహాను కంటే యేసుకు అనుచరులు ఎక్కువ అవుతున్నారనీ యోహాను కంటే యేసు ఎక్కువ మందికి బాప్తిసం ఇస్తున్నాడనీ పరిసయ్యులు విన్నారు. పరిసయ్యులు ఆ సంగతి విన్నారని యేసుకు తెలిసింది.
\v 2 అసలు విషయానికొస్తే బాప్తిసం ఇచ్చే పని యేసు స్వయంగా చెయ్యలేదు కానీ ఆ పని ఆయన శిష్యులు చేస్తున్నారు.
\v 3 యేసూ ఆయన శిష్యులూ యూదయను విడిచిపెట్టి గలిలయకు తిరుగు ప్రయాణమయ్యారు.
\s5
\p
\v 4 ఇప్పుడు వాళ్ళు సమరయ ప్రాంతం గుండా పోవాలి.
\v 5 వారు సమరయ ప్రాంతంలో సుఖారు అనే ఊరికి వచ్చారు. పూర్వం యాకోబు తన కొడుకు యోసేపుకు ఇచ్చిన స్థలం సుఖారుకు దగ్గరే.
\s5
\p
\v 6 సుఖారు ఊరి బయటే యాకోబు బావి ఉంది. యేసు ప్రయాణం చేసి అలిసిపోయి, విశ్రాంతి కోసం ఆ బావి గట్టు మీద కూర్చున్నాడు. అప్పుడు మిట్ట మధ్యాహ్నం కావస్తున్నది.
\p
\v 7 సుఖారు నుండి ఒకామె బావి దగ్గర నీళ్ళు తోడుకోడానికి వచ్చింది. యేసు ఆమెతో, "నాకు తాగడానికి నీళ్ళు ఇస్తావా?" అని అడిగాడు.
\v 8 ఆ సమయంలో ఆయన శిష్యులు ఆయన్ని ఒంటరిగా వదిలి ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు.
\s5
\p
\v 9 యూదులు సాధారణంగా తమలాంటి వాళ్ళను ద్వేషిస్తారని సమరయులకి తెలుసు కనుక ఆ స్త్రీ ఆయనతో, "నువ్వు యూదుడివి కదా, నీవు సమరయ స్త్రీని నీళ్ళు అడగడం ఆశ్చర్యంగా ఉంది" అంది.
\v 10 యేసు ఆమెతో "దేవుడు నీకు ఇవ్వాలనుకునే బహుమానం గురించి నీకు తెలిసి ఉంటే, నిన్ను నీళ్ళు అడిగేది ఎవరో నీకు తెలిస్తే, నువ్వే నన్ను నీళ్ళు ఇమ్మని అడిగి ఉండే దానివి. అప్పుడు నేను నీకు జీవజలం ఇచ్చేవాణ్ణి" అన్నాడు.
\s5
\p
\v 11 "అయ్యా, ఈ బావి చాలా లోతు. నీదగ్గర నీళ్ళు తోడడానికి చాద కానీ, తాడు కానీ లేవు. నీకు జీవజలం ఎలా దొరుకుతుంది?
\v 12 నువ్వు మా పితరుడు యాకోబు కంటే గొప్పవాడివా? ఆయన ఈ రోజుకీ మేము వాడుతున్న ఈ బావిని తవ్వించాడు. ఆయన కూడా దీనిలో నీళ్ళే తాగాడు, తన పిల్లలకీ పశువులకీ ఇచ్చాడు" అంది.
\s5
\p
\v 13 యేసు ఆమెతో, "ఈ బావి నీళ్ళు తాగిన వాళ్ళందరికీ మళ్ళీ దాహం వేస్తుంది.
\v 14 కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగే వాళ్ళకి మాత్రం మళ్ళీ ఎప్పటికీ దాహం వేయదు. నేను ఇచ్చే నీళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ కడుపులో ఊరుతూ ఉండి వాళ్లకు నిత్యజీవం ఇస్తాయి" అన్నాడు.
\s5
\v 15 ఆ స్త్రీ ఆయనతో, "అయ్యా, నాకు మళ్ళీ దాహం వెయ్యకుండా నాకు ఆ నీళ్ళు ఇవ్వండి. లేకపోతే నేను మాటిమాటికీ వచ్చి నీళ్ళు చేదుకోవాల్సి వస్తూ ఉంది" అంది.
\p
\v 16 తాను చెప్పినది ఆమెకి అర్ధం కాలేదని యేసు గ్రహించి ఆమెతో, "అమ్మా, వెళ్ళి నీ భర్తని పిలుచుకు రా" అన్నాడు.
\s5
\p
\v 17 ఆ స్త్రీ "నాకు భర్త లేడు" అంది. యేసు ఆమెతో, "నీకు భర్త లేడని సరిగ్గానే చెప్పావు.
\v 18 ఎందుకంటే నీకు ఒక్కడు కాదు ఐదుగురు భర్తలు ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఎవరితో ఉంటున్నావో అతడు నీ భర్త కాదు. నీకు భర్త లేడని నువ్వు చెప్పింది నిజమే" అన్నాడు.
\s5
\p
\v 19 ఆ స్త్రీ "అయ్యా, నువ్వు ప్రవక్తవని నాకు అర్ధమయ్యింది.
\v 20 మా పూర్వీకులు ఇక్కడే ఈ కొండ మీద దేవుణ్ణి ఆరాధించారు. కానీ యూదులు మన దేవుణ్ణి యెరూషలేములోనే ఆరాధించాలి అంటారు. ఏది సరైనది?" అంది.
\s5
\p
\v 21 యేసు ఆమెతో, "అమ్మా, రాబోయే కాలంలో ఈ కొండ మీద గానీ యెరూషలేములో గానీ తండ్రిని ఆరాధించరు. నన్ను నమ్ము.
\v 22 మీ సమరయ ప్రజలు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము యూదా ప్రజలం, ఎవర్ని ఆరాధిస్తున్నామో మాకు తెలుసు. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది."
\s5
\p
\v 23 "నిజంగా ఆరాధించే వాళ్ళు ఆత్మతో, సత్యంతో తండ్రిని ఆరాధించే సమయం వస్తున్నది. అది ఇప్పటికే వచ్చేసింది. ఇలా ఆరాధించే వాళ్ళు కావాలని దేవుడు వెదుకుతూ ఉంటాడు.
\v 24 దేవుడు ఆత్మ. ఆయన్ని ఆరాధించే వాళ్ళు ఆత్మతో ఆరాధించాలి. ఆరాధించడంలో సత్యం వాళ్ళని నడిపించాలి" అన్నాడు.
\s5
\p
\v 25 ఆ స్త్రీ ఆయనతో, "మెస్సీయ (గ్రీకులో క్రీస్తు) వస్తాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకు అవసరమైనదంతా చెప్తాడు" అంది.
\v 26 యేసు ఆమెతో, "నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ని" అన్నాడు.
\s5
\p
\v 27 అప్పుడే ఆయన శిష్యులు ఊరి నుండి తిరిగి వచ్చారు. ఆయన కుటుంబంతో సంబంధం లేని ఆ స్త్రీతో యేసు మాట్లాడడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అది యూదా సంప్రదాయానికి విరుద్ధం అయినా "నువ్వు చేసే పనేంటి?" అని గానీ "ఆ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నావు?" అని గానీ ఆయన్ని అడిగే ధైర్యం చెయ్యలేదు.
\s5
\p
\v 28 ఆ స్త్రీ తన నీళ్ళ కుండ అక్కడే వదిలి ఊర్లోకి తిరిగి వెళ్ళింది. ఊరి వాళ్ళందరికీ జరిగిన విషయం చెప్పింది.
\v 29 "నేను చేసినదంతా నాతో చెప్పిన వ్యక్తిని వచ్చి చూడండి. ఆయన మెస్సీయ కాదు గదా!"
\v 30 చాలామంది ఊరిలో నుండి బయలుదేరి, యేసు ఉన్న చోటికి వచ్చారు.
\s5
\p
\v 31 అప్పుడే భోజనం తీసుకు వచ్చిన శిష్యులు, "బోధకా, ఏమన్నా తిను" అని బతిమాలారు.
\v 32 యేసు వాళ్ళతో, "తినడానికి మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది" అన్నాడు.
\v 33 దానికి వాళ్ళు ఒకరితో ఒకరు, "ఆయన తినడానికి ఎవరన్నా ఏమన్నా తెచ్చారా ఏంటి!" అనుకున్నారు.
\s5
\p
\v 34 యేసు "నా ఆకలి ఎలాటిదో తెలుసా? నన్ను పంపిన తండ్రి ఇష్టాన్ని చేయడం, ఆయన పని అంతా పూర్తి చేయడమే నాకు అన్నపానాలు.
\v 35 సంవత్సరంలో సాధారణంగా మీరు కోతకాలం ఇంకా నాలుగు నెలలుంది, ఈ సమయానికి పొలాల్లో పంట కోతకు వస్తుంది, అనుకుంటారు కదా. యూదులు కానివారు ఇప్పుడు దేవుడు తమను పాలించాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కోతకు వచ్చిన పొలాల వంటి వాళ్ళు.
\v 36 ఇది నమ్మి, ఇలాంటి పంటలో పనికి సిద్ధపడిన వాడు తన జీతం అందుకుంటూ నిత్యజీవం కోసం ఫలాలను సేకరిస్తున్నాడు. విత్తనం చల్లేవాడు, పంట కోసేవాడు కలిసి సంతోషిస్తారు."
\s5
\p
\v 37 "నేను చెప్పిన ఈ మాట నిజమే. ఒకడు విత్తనం చల్లితే, మరొకడు పంట కోస్తాడు.
\v 38 మీరు పండించని పంట నుండి కోసింది సేకరించడానికి మిమ్మల్ని నేను పంపాను. ఇతరులు కష్టపడి పని చేశారు కానీ, ఇప్పుడు మీరు వాళ్ళ పనిలో ప్రతిఫలం పొందుతున్నారు" అన్నాడు.
\s5
\p
\v 39 ఆమె చెప్పిన మాటలు విన్న సుఖారు ప్రజలు సమరయులు యేసులో నమ్మకముంచారు.
\v 40 వాళ్ళంతా యేసు దగ్గరికి వచ్చి మరి కొంతకాలం తమతో ఉండమని బతిమాలారు. అందువల్ల యేసు ఇంకా రెండు రోజులు అక్కడ ఉన్నాడు.
\s5
\p
\v 41 ఆయన వాళ్లకు చెప్పిన మాటలకు ఇంకా చాలామంది యేసులో విశ్వాసం ఉంచారు.
\v 42 వాళ్ళు ఆ స్త్రీతో, "మేము ఇప్పుడు యేసులో నమ్మకం ఉంచాం. నువ్వు ఆయన గురించి చెప్పినందుకే కాదు, మేము స్వయంగా ఆయన సందేశం విన్నాం కాబట్టి. ఆయన నిజంగా లోక రక్షకుడని ఇప్పుడు మేము తెలుసుకున్నాం" అన్నారు.
\s5
\p
\v 43 ఆ రెండు రోజుల తరవాత యేసూ ఆయన శిష్యులూ సమరయను విడిచి గలిలయ ప్రాంతానికి వచ్చారు.
\v 44 ప్రవక్త చాలా చోట్ల గౌరవం పొందుతాడు కానీ తాను పుట్టి పెరిగిన చోట గౌరవం పొందడని యేసు తానే చెప్పాడు.
\p
\v 45 యేసు గలిలయ చేరినప్పుడు అనేకులు ఆయనకు స్వాగతం పలికారు. అంతకు ముందే జరిగిన పస్కా పండగ సమయంలో అక్కడి వాళ్ళు చాలామంది యెరూషలేము వెళ్ళారు, అక్కడ ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ వాళ్ళు చూశారు.
\s5
\p
\v 46 యేసు మళ్ళీ కానాకు వెళ్ళాడు (అక్కడే ఆయన నీళ్ళను ద్రాక్షరసంగా మార్చింది). అక్కడ 27 కిలో మీటర్ల దూరాన ఉన్న కపెర్నహోములో రాజు ఆస్థానంలో పనిచేసే ఒక అధికారి ఉన్నాడు. అతని కొడుకు జబ్బుపడ్డాడు.
\v 47 యేసు యూదయ నుండి గలిలయ వచ్చాడని విని, కానాలో యేసు దగ్గరికి వెళ్ళి, "నా కొడుకు చనిపోయేలా ఉన్నాడు. కపెర్నహోము వచ్చి వాణ్ణి బాగుచేయండి" అని బతిమాలాడు.
\s5
\p
\v 48 యేసు అతనితో, "నేను అద్భుతాలు చేయడం చూసి, నేను ఎవరో నిరూపించుకుంటే తప్ప మీరు నన్ను నమ్మరు" అన్నాడు.
\v 49 అప్పుడు ఆ అధికారి ఆయనతో "అయ్యా, దయచేసి నా కొడుకు చనిపోకముందే నా ఇంటికి రండి" అని వేడుకున్నాడు.
\v 50 యేసు అతనితో "నువ్వు ఇంటికి వెళ్ళు, నీ కొడుకు బ్రతుకుతాడు" అన్నాడు. అతను యేసు చెప్పింది నమ్మాడు. తన ఇంటికి తిరుగు ప్రయాణం కట్టాడు.
\s5
\p
\v 51 అతను కపెర్నహోములో ఉన్న తన ఇంటికి వెళుతూ ఉండగానే అతని పనివాళ్ళు దారిలో ఎదురుపడ్డారు. వాళ్ళు అతనితో, "నీ కొడుకు బ్రతికాడు" అన్నారు.
\v 52 అతను, "ఏ సమయం నుండి కోలుకోవడం మొదలుపెట్టాడు?" అని వాళ్ళని అడిగాడు. వాళ్ళు అతనితో, "నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుండి జ్వరం తగ్గింది" అన్నారు.
\s5
\v 53 అప్పుడు ఆ పిల్లవాడి తండ్రి "నీ కొడుకు బ్రతుకుతాడు" అని యేసు చెప్పిన సమయం అదే అని గ్రహించాడు. కాబట్టి అతడు, అతని ఇంటిలో నివసించే ప్రతి ఒక్కరూ యేసులో నమ్మకముంచారు.
\p
\v 54 యేసు ఎవరో ప్రజలకు రుజువు చేసుకోవడానికి ఇది ఆయన చేసిన రెండవ సూచక క్రియ. ఆయన యూదయ నుండి ప్రయాణం చేసి గలిలయ ప్రాంతానికి వెళ్తున్న సమయంలో దీనిని చేశాడు.
\s5
\c 5
\p
\v 1 తరవాత మరొక యూదుల పండుగ వచ్చినప్పుడు యేసు ఆ పండగ ఆచరించడానికి యెరూషలేము వెళ్ళాడు.
\v 2 యెరూషలేము పట్టణ ద్వారాల్లో ఒకదాని పేరు గొర్రెల ద్వారం. ఆ గేటు దగ్గర యూదులు వాడే భాషలో బేతెస్థ అని పిలిచే ఒక కోనేరు ఉంది. దానికి ఐదు మంటపాలు ఉన్నాయి.
\v 3 చాలామంది రోగులు అక్కడ పడి ఉండేవాళ్ళు. వాళ్ళు నయం కాని జబ్బులు ఉన్నవాళ్ళు, గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, పక్షవాతం వచ్చినవాళ్ళు.
\p
\v 4 (కొన్ని సమయాల్లో ప్రభువు దూత కొలనులోకి దిగి నీళ్ళు కదిపే వాడు. అలా నీళ్ళు కదిపినప్పుడు అందులో దిగిన వాళ్ళు ఎలాంటి వ్యాధితో బాధ పడుతున్నా స్వస్థపడే వాళ్ళు).
\s5
\v 5 అక్కడ నడవలేని రోగి ఒకడు 38 ఏళ్ళ నుండి పడి ఉన్నాడు.
\v 6 యేసు అతణ్ణి చూసి, అతడు చాలాకాలం నుండి అదే పరిస్థితిలో అతడు ఉన్నాడని గ్రహించాడు. ఆయన "ఆరోగ్యంగా బలంగా అవ్వాలని ఉందా?" అని అతణ్ణి అడిగాడు.
\s5
\p
\v 7 ఆ వ్యక్తి ఆయనతో, "అయ్యా, నీళ్ళు కదిలినప్పుడు ఆ కోనేట్లో దిగడానికి నాకు ఎవ్వరూ సాయం చేయడం లేదు. నేను దిగడానికి ప్రయత్నించే లోపలే నా కంటే ముందే ఎవరో ఒకరు దిగిపోతూ ఉన్నారు" అన్నాడు.
\v 8 యేసు అతనితో, "లే, నీ పడక ఎత్తుకుని నడువు" అన్నాడు.
\s5
\v 9 ఒక్కసారిగా ఆ వ్యక్తి స్వస్థపడి తన పడక చుట్టుకుని వెళ్ళిపోయాడు.
\p ఆ రోజు సబ్బాతు అనే యూదుల విశ్రాంతి దినం.
\s5
\v 10 కాబట్టి యూదు నాయకులు స్వస్థపడిన ఆ వ్యక్తితో, "ఇది విశ్రాంతి దినం. ఈ పవిత్ర దినాన నీ పరుపు మోయడం ధర్మశాస్త్రానికి వ్యతిరేకం అని నీకు తెలియదా" అన్నారు.
\v 11 బాగుపడిన మనిషి "మరి నన్ను స్వస్థపరచిన వ్యక్తి నీ పడక తీసుకుని నడువు అన్నాడే" అని జవాబిచ్చాడు.
\s5
\p
\v 12 వాళ్ళు అతన్ని, "ఆ మనిషి ఎవరు?" అని అడిగారు.
\v 13 యేసు అతణ్ణి స్వస్థపరచినా అతనికి ఆయన పేరు తెలీదు. ఎందుకంటే అతణ్ణి స్వస్థపరిచాక యేసు అతణ్ణి విడిచి జనంలో కలిసిపోయాడు.
\s5
\p
\v 14 తరవాత యేసు అతణ్ణి దేవాలయంలో కలుసుకుని అతనితో, "చూడూ! నువ్వు ఇప్పుడు బాగుపడ్డావు. ఇక నుండి పాపం చెయ్యొద్దు. అప్పుడు నీ పరిస్థితి మరింత అధ్వానం కాకుండా ఉంటుంది" అన్నాడు.
\v 15 ఆ వ్యక్తి వెళ్ళిపోయి యూదుల నాయకులతో, తనను స్వస్థపరిచింది యేసు అని చెప్పాడు.
\s5
\p
\v 16 యేసు అద్భుతాలు చేస్తూ, తరచుగా యూదుల విశ్రాంతి దినాన ఈ పనులు చేయడంతో యూదులు ఆయన్ని ఆపడానికి శాయశక్తులా ప్రయత్నం చేయసాగారు.
\v 17 యేసు వాళ్లతో "నా తండ్రి అస్తమానం పనిచేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను" అని చెప్పాడు.
\v 18 వారి దృష్టిలో యేసు విశ్రాంతి రోజు నియమాలు పాటించక పోవడమే కాదు, తనను దేవునితో సమానం చేసుకుంటూ దేవుణ్ణి తన సొంత తండ్రి అని పిలుస్తున్నాడు. ఆ కారణాన వాళ్ళు ఆయనను చంపాలని శాయశక్తులా ప్రయత్నించ సాగారు.
\s5
\p
\v 19 యేసు వాళ్లకి జవాబిస్తూ, "నేను మీకు నిజం చెప్తున్నాను. నేను మనుష్యకుమారుణ్ణి. నేను నా సొంత అధికారంతో ఏమీ చేయలేను. తండ్రి చేసింది నేను చూడడం మాత్రమే చేయగలను. తండ్రి ఏమి చేస్తే అదే కుమారుడిగా నేను చేస్తాను.
\v 20 తండ్రి తన కుమారుడినైన నన్ను ప్రేమించి ఆయన చేసేది అంతా నాకు చూపిస్తాడు. ఈ గొప్ప పనులు కూడా తండ్రి నాకు చూపిస్తాడు. కాబట్టి నేను చేసినవన్నీ మీరు చూసి ఆశ్చర్యపోతున్నారు."
\s5
\p
\v 21 "తండ్రి చనిపోయిన వాళ్ళకి ప్రాణమిచ్చి తిరిగి బ్రతికించినట్టే కుమారుణ్ణి అయిన నేను కూడా నాకు ఇష్టమైన వాళ్లని బ్రతికించగలను.
\v 22 దేవుడు ఎవరికీ తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చే అధికారాన్ని నాకు ఇచ్చాడు.
\v 23 కాబట్టి మనుషులంతా తండ్రిని గౌరవించినట్టు కుమారుణ్ణి అయిన నన్ను కూడా గౌరవిస్తారు. నన్ను గౌరవించనివాడు నన్ను పంపిన తండ్రిని గౌరవించ లేడు."
\s5
\p
\v 24 "నేను నిజం చెప్తున్నాను. ఎవరైనా నా సందేశం విని దేవుడు నన్ను పంపాడని నమ్మితే వాళ్లకి నిత్యజీవం ఉంటుంది. వాళ్ళు దేవుని తీర్పులోకి రారు. చావు అనేది లేకుండా బ్రతుకుతారు."
\s5
\p
\v 25 "నేను మీకు నిజం చెప్తున్నాను. ఒక సమయం వస్తుంది అప్పుడు చనిపోయినవాళ్ళు దేవుని కుమారుడి స్వరం, అంటే నా స్వరం వింటారు. అది విన్నవాళ్ళు బ్రతుకుతారు. నిజానికి ఆ సమయం వచ్చేసింది."
\s5
\p
\v 26 "తండ్రికి ఏ విధంగా మనుషులను బ్రతికించగల శక్తి ఉందో అదే విధంగా ఆయన కుమారుణ్ణి అయిన నాకు ఆ అధికారం ఇచ్చి వాళ్ళను బ్రతికిస్తాడు.
\v 27 తండ్రికి కేవలం న్యాయమే తెలుసు కాబట్టి నేను మనుష్యకుమారుణ్ణి అయినందుకు ఇవి చేయడానికి ఆయన నాకు అధికారమిచ్చాడు.
\s5
\v 28 చనిపోయిన వాళ్ళందరూ నా పిలుపు వినే సమయం ఒకటి ఉంది. దీనికి ఆశ్చర్యపోకండి.
\v 29 అప్పుడు వాళ్ళు సమాధుల నుండి బయటికి వస్తారు. మంచి చేసిన వాళ్ళని దేవుడు లేపి నిత్య జీవం ఇస్తాడు. కానీ చెడు చేసిన వాళ్ళని దేవుడు లేపుతాడు గానీ శాశ్వతమైన శిక్ష విధిస్తాడు.
\s5
\v 30 నా సొంతంగా నేను ఏమీ చేయలేను. తండ్రి నుండి నేను ఏమి వింటానో ఆ తీర్పునే ఇస్తాను. నా తీర్పు న్యాయంగా ఉంటుంది. నేను న్యాయంగా తీర్పు ఇస్తాను. ఎందుకంటే నాకు ఇష్టమైనది చేయడానికి నేను ప్రయత్నించను. నన్ను ఇక్కడికి పంపిన తండ్రి కోరుకున్నది చేస్తాను."
\p
\v 31 "నేనే స్వయంగా నా గురించి సాక్ష్యమిస్తే అది నిజమని ఎవ్వరూ నమ్మరు.
\v 32 అలా కాకుండా నా గురించి సాక్ష్యం చెప్పే ఒకరు ఉన్నారు. ఆయన సాక్ష్యం నిజమని నాకు తెలుసు.
\s5
\v 33 బాప్తిసమిచ్చే యోహాను దగ్గరికి మీరు మనుషుల్ని పంపారు. అతను మీకు నా గురించి అంతా నిజమే చెప్పాడు.
\v 34 నాకు అతని సహాయం అసలు అవసరం లేదు, నా విషయంలో ఎవరి సాక్ష్యం అక్కరలేదు. దేవుడు మిమ్మల్ని రక్షించాలని నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను.
\v 35 బాప్తిసమిచ్చే యోహాను మండుతూ ప్రకాశిస్తున్న దీపశిఖ. అతని సందేశ వెలుగులో కొంతకాలం మీరు ఆనందించారు.
\s5
\v 36 అయితే నా విషయంలో స్వయంగా నేను ఇచ్చే సాక్ష్యం యోహాను ఇచ్చే సాక్ష్యం కంటే గొప్పది. తండ్రి నేను చెయ్యడానికి అనుమతించినవన్నీ నేను ప్రతిరోజూ చేస్తూ ఉంటాను. అవి నేను చేయడం మీరు చూస్తున్నారు కూడా. నేను ఎవరో మీకు ఇంకా ఎక్కువగా నేను చేసే పనులు చెప్తాయి. నేను ఇక్కడికి రావడంలో నీ ఉద్దేశాన్ని అవి వివరిస్తాయి. దేవుడు నన్ను పంపాడు అనడానికి అవే నిదర్శనం.
\p
\v 37 నన్ను పంపిన తండ్రే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఆయన స్వరాన్ని ఎప్పుడూ వినలేదు. ఆయన్ని మీరు శరీర రూపంలో ఎప్పుడూ చూడలేదు.
\v 38 నన్ను పంపిన వాణ్ణీ, నన్నూ నమ్మలేదు అనడానికి నిదర్శనం మీలో ఆయన వాక్యం జీవించక పోవడమే."
\s5
\p
\v 39 "మీరు జాగ్రత్తగా లేఖనాలు చదవాలి. ఎందుకంటే వాటిని చదవడం వల్ల మీకు నిత్య జీవం దొరుకుతుందని మీరు అనుకుంటారు. ఆ లేఖనాలే నా గురించి చెప్తాయి.
\v 40 అయినా నా నుండి మీరు నిత్య జీవం పొందుతారు అనే విషయంలో ఇంకా మీరు నన్ను తిరస్కరిస్తున్నారు."
\s5
\p
\v 41 "ప్రజలు నన్ను పొగిడి, ఘనపరుస్తూ ఉంటే నేను పట్టించుకోను.
\v 42 మీ గురించి నాకు తెలుసు. మీరు దేవుని ప్రేమించరు."
\s5
\p
\v 43 "నేను నా తండ్రి అధికారంతో వచ్చాను. అయినా మీరు ఇంకా నన్ను అంగీకరించలేదు, ఆహ్వానించలేదు. ఇంకొకరు ఎవరైనా వాళ్ళ సొంత అధికారంతో వస్తే వాళ్ళ మాట మీరు వింటారు.
\v 44 ఇతరుల మెప్పు పొందాలని మీరు శాయశక్తులా కృషి చేస్తుంటే నన్ను మీరు ఎలా నమ్ముతారు? ఇక అన్ని సమయాల్లో ఒకే ఒక్క దేవుని నుండి వచ్చే అసలైన మెప్పును తోసిపుచ్చడానికే చూస్తారు."
\s5
\p
\v 45 "నా తండ్రి సమక్షంలో మిమ్మల్ని నేను నిందిస్తానని అనుకోకండి. మోషే మిమ్మల్ని రక్షిస్తాడని మీరు అనుకుంటున్నారు కదా. మీ ఆశలన్నీ అతని మీదే. అయితే మిమ్మల్ని నిందించేవాడు మోషేనే.
\v 46 మోషే చెప్పింది మీరు అంగీకరించి ఉంటే నేను చెప్పింది మీరు నమ్మేవారు. ఎందుకంటే అతడు నా గురించి వివరిస్తున్నాడు.
\v 47 కనీసం మోషే చెప్పింది కూడా మీరు నమ్మలేదు కాబట్టి నేను మీకు చెప్పింది మీరు ఎలా నమ్ముతారు?"
\s5
\c 6
\p
\v 1 యేసు ఆయన శిష్యులు సరస్సు అవతలి వైపుకు వెళ్ళారు. ఆ సరస్సును గలిలయ సముద్రం అనీ తిబెరియా సముద్రం అనీ పిలుస్తారు.
\v 2 ఆయన రోగుల్ని బాగుచేయడం ద్వారా చేసిన అద్భుతాలు చూసిన పెద్ద జన సమూహం ఆయన్ని వెంబడించింది.
\v 3 ఏటవాలుగా ఉన్న కొండ మీదకి వెళ్ళి యేసు ఆయన శిష్యులతో కూర్చున్నాడు.
\s5
\p
\v 4 అది యూదులకు ప్రత్యేకమైన పర్వదినం అయిన పస్కా సమయం.
\v 5 పెద్ద జన సమూహం తన వైపు రావడం యేసు చూశాడు. ఆయన ఫిలిప్పుతో, "వీళ్ళందరూ తినడానికి రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి?" అన్నాడు.
\v 6 ఫిలిప్పు ఎలాంటి జవాబు చెప్తాడో చూద్దామని ఆయన ఆ ప్రశ్న అడిగాడు. ఈ సమస్య ఎలా తీర్చాలో ఆయనకి ముందే తెలుసు.
\s5
\v 7 ఫిలిప్పు "ఒకడు రెండు వందల రోజులు పని చేస్తే వచ్చే మొత్తం డబ్బు మన దగ్గర ఉన్నా, అది ఈ పెద్ద సమూహంలో ఒక్కొక్కరికి చిన్న ముక్క చొప్పున ఇవ్వడానికి కూడా సరిపోదు" అన్నాడు.
\v 8 తన శిష్యుల్లో ఒకడైన సీమోను పేతురు తమ్ముడు అంద్రెయ యేసుతో,
\v 9 "ఇక్కడ ఒక అబ్బాయి దగ్గర బార్లీతో చేసిన ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలు ఉన్నాయి. అయినా ఇంత మందికి అవి ఎలా సరిపోతాయి?" అన్నాడు.
\s5
\p
\v 10 ప్రజలందరూ వచ్చిన ఆ ప్రదేశంలో వత్తుగా గడ్డి ఉంది. యేసు వాళ్ళను అక్కడ కూర్చోబెట్టమని తన శిష్యులతో చెప్పాడు. ప్రజలందరూ కూర్చున్న తరవాత శిష్యులు ఆ మనుషుల్ని లెక్కపెట్టారు. వారి లెక్క సుమారు ఐదు వేలు.
\v 11 అప్పుడు యేసు ఆ చిన్న రొట్టెల్ని, చేపల్ని తీసుకుని వాటి కోసం దేవునికి వందనాలు చెప్పాడు. అప్పుడు వాటిని అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పంచారు. ప్రజలు రొట్టె ముక్కలు, చేపలు కడుపారా తిన్నారు.
\v 12 అందరూ తినడం అయిపోయాక ఆయన తన శిష్యులతో, "మిగిలిపోయిన రొట్టె ముక్కల్ని సేకరించండి. ఏదీ వ్యర్థం చేయకండి" అన్నాడు.
\s5
\p
\v 13 కాబట్టి వాళ్ళు మిగిలిన ముక్కల్ని సేకరిస్తే అవి పన్నెండు పెద్ద గంపలు అయ్యాయి.
\p
\v 14 యేసు చేసిన అద్భుతాలు చూసిన తరవాత ప్రజానీకం "దేవుడు ఈ లోకానికి పంపే ప్రవక్త కచ్చితంగా ఈయనే" అన్నారు.
\v 15 ప్రజల ఉద్దేశాలు యేసుకు తెలుసు. ఆయన్ని వాళ్ళు బలవంతంగా రాజును చెయ్యాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన వాళ్ళని విడిచి ఒక్కడే కొండ పైకి వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 16 సాయంత్రం అవుతుండగా ఆయన శిష్యులు గలిలయ సముద్రం దగ్గరికి వెళ్లి,
\v 17 పడవ ఎక్కి, అవతలి వైపు ఉన్న కపెర్నహోముకు వెళ్ళడానికి పడవ నడుపుతున్నారు. చీకటి పడింది కానీ యేసు ఇంకా వాళ్ళని చేరుకో లేదు.
\v 18 బలమైన ఈదురు గాలి మొదలయ్యింది. అలలు పెద్ద ఎత్తున లేస్తున్నాయి.
\s5
\v 19 ఐదో ఆరో కిలో మీటర్లు ప్రయాణించాక యేసు నీళ్ళపై నడుస్తూ పడవ దగ్గరికి రావడం శిష్యులు చూసి బెదిరిపోయారు.
\v 20 యేసు వాళ్ళతో, "నేనే! భయపడకండి" అన్నాడు.
\v 21 అప్పుడు వాళ్ళు ఆయన్ని సంతోషంగా పడవలో ఎక్కించుకున్నారు. ఆయన వాళ్ళతో చేరిన కొద్ది సమయానికే పడవ వాళ్ళు వెళ్ళాలనుకున్న స్థలానికి చేరింది.
\s5
\p
\v 22 ఆ తరవాత రోజు అవతలి వైపునే ఉండిపోయిన జన సమూహం అంతకు ముందు రోజు అక్కడ ఒకే పడవ ఉండడం గుర్తించారు. యేసు తన శిష్యులతో వెళ్లిపోయారని కూడా తెలుసుకున్నారు.
\v 23 ఆ సమయంలో కొందరు వాళ్ల పడవల్లో తిబెరియ సరస్సు దాటి వచ్చారు. వారు అంతకు ముందు తమ పడవలను ప్రభువు ఆహారం కోసం దేవునికి వందనాలు చెప్పి ప్రజలకు రొట్టెలు పంచిన చోట పెట్టుకున్నారు.
\s5
\v 24 యేసు, ఆయన శిష్యులు అక్కడ లేరని రొట్టెలు తిన్న ఆ సమూహం గ్రహించి, వాళ్ళల్లో కొందరు అక్కడి పడవలు ఎక్కి వెళ్ళి యేసును వెదుక్కుంటూ కపెర్నహోముకు వచ్చారు.
\p
\v 25 వాళ్ళకు సరస్సుకు అవతలి వైపున ఉన్న కపెర్నహోములో యేసు కనిపించాడు. వాళ్ళు ఆయన్ని, "బోధకా, నువ్వు నావలో రాలేదని మాకు తెలుసు. మరి ఇక్కడికి ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు?" అని అడిగారు.
\s5
\v 26 అందుకు యేసు, "నిజంగా చెప్తున్నాను. మీరు నన్ను వెదుకుతున్నది నేను అద్భుతాలు చేసినందుకో, లేక నేనెవరో మీకు చూపించినందుకో కాదు. కడుపు నిండా తిండి తిన్నందుకే.
\v 27 తొందరగా చెడిపోయే ఆహారం కోసం పనిచేయడం మానుకోండి. దాని బదులు మీకు నిత్య జీవాన్ని తెచ్చే ఆహారం కోసం కృషి చెయ్యండి. దేవుడు ఎంచుకున్నవాణ్ణీ మనుష్యకుమారుణ్ణి అయిన నేనే ఆ ఆహారం మీకు ఇస్తాను. తండ్రి అయిన దేవుడు ప్రతి దానిలో నన్ను ఆమోదిస్తాడు" అన్నాడు.
\s5
\p
\v 28 అప్పుడు ప్రజలు ఆయన్ని, "దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మేము ఏ పనులు, ఏ సేవలు చెయ్యాలి?" అని అడిగారు.
\v 29 అప్పుడు యేసు, "దేవుడు మీరు ఏం చెయ్యాలని కోరుతున్నాడంటే ఆయన పంపిన నాపై నమ్మకం ఉంచడం" అన్నాడు.
\s5
\v 30 అప్పుడు వాళ్ళు యేసుతో, "నువ్వు ఎవరివో నిరూపించడానికి ఒక సూచక క్రియ చేసి చూపించు. అప్పుడు నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చావని నమ్ముతాం. మా కోసం నువ్వు ఏమి చేయబోతున్నావు?
\v 31 వాళ్ళు తినడానికి దేవుడు పరలోకం నుండి ఆహారం ఇచ్చాడు అని లేఖనాలు చెప్పినట్టు మన పితరులు ఆ అరణ్య ప్రదేశంలో మన్నా తిన్నారు కదా" అన్నారు.
\s5
\p
\v 32 యేసు వాళ్ళతో, "పరలోకం నుండి మన పితరులకి ఆహారం ఇచ్చింది మోషే కాదు, నా తండ్రే. నిజమైన ఆహారం పరలోకం నుండి మీకు ఇస్తున్నవాడే.
\v 33 దేవుని నిజమైన ఆహారం నేనే, లోకంలోని ప్రతి ఒక్కరినీ నిజంగా జీవింప జేయడానికి పరలోకం నుండి క్రిందికి దిగి వచ్చిన వాణ్ణి నేనే" అన్నాడు.
\p
\v 34 ఆయన చెప్పింది వాళ్లకి అర్ధం కాక ఆయనతో, "అయ్యా, మాకు ఎప్పుడూ ఈ ఆహారం ఇవ్వు" అని అడిగారు.
\s5
\p
\v 35 యేసు వాళ్ళతో, "మనుషులు జీవించడానికి భోజనం అవసరం అయినట్టే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా బ్రతకడానికి నేను అవసరం. సాధారణ భోజనం, నీళ్ళు తీసుకునే వాళ్లకి మళ్ళీ ఆకలి, దాహం వేస్తాయి. కానీ నన్ను నమ్మి, అడిగే వాళ్ళకి ఆధ్యాత్మికంగా జీవించడానికి నేను వీలు కలిగిస్తాను.
\v 36 అయినా నేను మీకు చెప్పినట్టు నన్ను మీరు చూసినా ఇంకా నమ్మడం లేదు.
\v 37 నా తండ్రి నాకు ఇచ్చిన వాళ్ళందరూ నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని నేను ఎప్పుడూ వెళ్ళగొట్టను."
\s5
\p
\v 38 "నా ఇష్టానుసారంగా చేయడానికి నేను పరలోకం నుండి దిగి రాలేదు. నన్ను పంపిన వాని ఇష్టాన్ని జరిగించడానికే నేను వచ్చాను.
\v 39 నన్ను పంపిన వానికి కూడా ఇదే కావాలి. ఆయన నాకు ఇచ్చిన వాళ్ళను ఎవ్వరినీ వదులుకోను. నేను తీర్పు ఇచ్చే రోజున వాళ్ళను అందరినీ బ్రతికిస్తాను.
\v 40 కుమారుణ్ణి అయిన నాలో విశ్వాసంతో ప్రతి ఒక్కరూ నిరీక్షించాలని నా తండ్రి కూడా కోరుకుంటున్నాడు. అలా నాలో నమ్మకముంచిన వాళ్లకి నిత్యజీవం ఇస్తాను. యుగాంతం రోజున వాళ్ళని బ్రతికిస్తాను."
\s5
\p
\v 41 "పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారం నేనే" అని యేసు చెప్పినందుకు యూదుల నాయకులు యేసు మీద గింజుకోవడం మొదలుపెట్టారు.
\v 42 వాళ్ళు, ఇతడు యోసేపు కొడుకు కాదా? అతని తల్లి, తండ్రి ఎవరో మనకు తెలుసు కదా. నేను పరలోకం నుండి వచ్చాను అని ఎలా చెప్పగలుగుతున్నాడు, అనుకున్నారు.
\s5
\p
\v 43 యేసు వారికి జవాబిస్తూ, "నేను చెప్పిన దాని గురించి సణగడం ఆపెయ్యండి.
\v 44 నన్ను పంపిన నా తండ్రి నా దగ్గరికి వచ్చే వాళ్ళని ఏర్పాటు చేస్తాడు. ఇతరులు ఎవ్వరూ నిత్యజీవం పొందడానికి నా దగ్గరికి రారు. తీర్పు రోజున నా దగ్గరికి వచ్చిన వాళ్ళని మళ్ళీ బ్రతికిస్తాను.
\v 45 దేవుడు వాళ్ళందరికీ నేర్పిస్తాడు అని పూర్వం ఒక ప్రవక్త రాసాడు. నా తండ్రి నుండి నేర్చుకున్న ప్రతి వాళ్ళూ నాలో నమ్మకం ఉంచడానికి వస్తారు.
\s5
\v 46 నేను దేవుని నుండి వచ్చాను. తండ్రిని చూసింది నేనొక్కడినే. ఇంకెవ్వరూ ఆయన్ని చూడలేదు."
\p
\v 47 "నేను సత్యం చెప్తున్నాను - నాలో నమ్మకం ఉంచిన వాళ్ళకే నిత్య జీవం."
\s5
\p
\v 48 "నిజమైన జీవాన్ని ఇచ్చే ఆహారం నేనే.
\v 49 మీ పితరులు అరణ్య ప్రదేశంలో మన్నా తిన్నారు అయినా చనిపోయారు.
\s5
\v 50 కానీ నేను పరలోకం నుండి వచ్చిన ఆహారం గురించి మాట్లాడుతున్నాను. ఆ ఆహారం తిన్నవాడి ఆత్మకు మరణం లేదు.
\v 51 మనుషులు నిజంగా జీవించేలా చేసే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారాన్ని నేనే. ఎవరైనా ఈ ఆహారం తింటే చిరకాలం బ్రతుకుతారు. లోకాన్ని బ్రతికించడానికి నేను ఇచ్చే ఆహారం ఏమిటో తెలుసా? నా మరణం."
\s5
\p
\v 52 యేసు చెప్పిన ఈ మాటలు విన్న యూదులు తమలో తాము ఉక్రోషంగా వాదించుకున్నారు. వాళ్ళకు ఆయన మాటలు అర్ధం కాలేదు. "ఇతడు తన శరీరం ఎలా తిననిస్తాడు?" అన్నారు.
\v 53 యేసు కఠినంగా వారికి బదులిచ్చాడు. "నేను నిజమే చెప్తున్నాను - నేను మనుష్యకుమారుణ్ణి. నా శరీరాన్ని మీరు తినకపోయినా, నా రక్తం తాగకపోయినా మీరు నిత్యం జీవించలేరు.
\s5
\v 54 నా శరీరం తిని, నా రక్తం తాగే ఎవరినైనా నేను యుగాంతం రోజున బతికిస్తాను.
\v 55 ఎందుకంటే నా శరీరం నిజమైన ఆధ్యాత్మిక ఆహారం, నా రక్తం ఆధ్యాత్మిక పానం.
\v 56 నా శరీరం తిని, నా రక్తం ఎవరు తాగుతారో వాళ్ళు నాతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు. నాకు వాళ్ళతో సన్నిహిత సంబంధం ఉంటుంది."
\s5
\p
\v 57 "ప్రతి ఒక్కర్నీ బ్రతికించే నా తండ్రి నన్ను పంపాడు. నా తండ్రి వల్లే నేను జీవిస్తున్నాను. అదే విధంగా నా నుండి ఆహారం పొందిన వాళ్ళు వాళ్ల కోసం నేను చేసిన దాని కారణంగా నిత్య జీవం కలిగి ఉంటారు.
\v 58 నేను పరలోకం నుండి దిగి వచ్చిన నిజమైన ఆహారాన్ని. ఈ ఆహారం ఎవరు తింటారో వాళ్ళు ఎప్పటికీ చనిపోరు. శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు. మీ పూర్వీకులు మన్నా తిని చనిపోయారు. నేను అలా వీళ్ళకు జరగనివ్వను" అన్నాడు.
\v 59 కపెర్నహోములో యూదుల ఉపదేశ స్థలంలో యేసు ఈ మాటలు చెప్పాడు.
\s5
\p
\v 60 ఆయన శిష్యుల్లో చాలామంది "ఆయన చెప్పేది అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఆయన చెప్పేది ఎవరు అంగీకరించగలరు?" అనుకున్నారు.
\v 61 ఈ రకంగా తన శిష్యుల్లో కొందరి సణుగుడు చూసి వాళ్ళతో, "నేను బోధించింది మీకు కోపం తెప్పించిందా?
\s5
\v 62 బహుశా పరలోకం నుండి వచ్చినవాడిగా నేను ఇంతకు ముందు ఉన్న చోట నుండి దిగి రావడం చూస్తే నా సందేశాన్ని మీరు నమ్మేవారేమో.
\v 63 ఎవరినైనా నిత్యం జీవించేలా చేసేది ఆత్మ ఒక్కటే. మానవ స్వభావం ఇందుకు సహకరించలేదు. నేను మీకు బోధించిన మాటలు ఆత్మ గురించి, నిత్య జీవం గురించి చెప్తాయి."
\s5
\v 64 "నేను బోధించేది నమ్మని వాళ్ళు ఇంకా మీలో కొందరు ఉన్నారు" అన్నాడు. యేసు తన పని మొదలుపెట్టినప్పటి నుండి ఆయనలో ఎవరు నమ్మకం ఉంచటం లేదో ఆయనకు తెలుసు. తనకు ఎవరు ద్రోహం చేస్తారో కూడా తెలుసు కాబట్టి ఆయన ఇలా అన్నాడు.
\v 65 "అందుకే తండ్రి ద్వారా తప్ప నా దగ్గరికి ఎవరూ రాలేరనీ ఎవరూ నిత్య జీవానికి వెళ్ళలేరనీ చెప్పాను" అని యేసు అన్నాడు.
\s5
\p
\v 66 ఆ సమయం నుండి చాలామంది యేసు శిష్యులు ఆయన్ని విడిచిపెట్టి, ఇక ఎప్పుడూ ఆయన్ని అనుసరించలేదు.
\v 67 కనుక ఆయన తన పన్నెండు మంది శిష్యులతో, "మీరు కూడా నన్ను విడిచి పెట్టి పోవాలనుకుంటున్నారా?" అన్నాడు.
\v 68 సీమోను పేతురు - "ప్రభూ! మేము నిన్ను వదలిపెట్టం. ఎందుకంటే మేము వెళ్ళడానికి నీలాంటి మనిషి వేరెవరూ లేడు.
\v 69 మేము నీలో నమ్మకం ఉంచుతున్నాం. దేవుడు నిన్ను పంపించాడనీ నువ్వు పరిశుద్దుడివనీ మాకు స్పష్టంగా తెలుసు" అన్నాడు.
\s5
\p
\v 70 యేసు - "నేను ఎంచుకున్న మీ పన్నెండుమందీ నన్ను నమ్ముతున్నాం అంటున్నారు కదా. కానీ మీలో ఒకడు సాతాను స్వాధీనంలో ఉన్నాడు" అన్నాడు.
\v 71 ఆయన ఇస్కరియోతు కొడుకు యూదా గురించి మాట్లాడాడు. యూదా ఆ పన్నెండు మందిలో ఒకడు. అయినా ఆ తర్వాత యేసుకు ద్రోహం చేసింది అతడే.
\s5
\c 7
\p
\v 1 దీని తరవాత యేసు గలిలయ ప్రాంతంలోని ఇతర చోట్లకి వెళ్ళాడు. యూదుల అధికారులు ఆయన మీద నేరం మోపి మరణ శిక్ష విధించేలా చేయాలని దారి వెదుకుతున్నందుకు యూదయ ప్రాంతం వైపు ప్రయాణించడానికి యేసు ఇష్టపడలేదు.
\v 2 యూదుల పర్ణశాలల పండుగ సమయం వచ్చింది. చాలాకాలం క్రితం నిర్గమనం సమయంలో యూదు ప్రజలు గుడారాలలో నివసించిన విషయం జ్ఞాపకం చేసుకునే సమయం ఇది.
\s5
\p
\v 3 యూదయలో ఈ పండగ జరుగుతుంది కాబట్టి యేసు తమ్ముళ్ళు ఆయనతో, "ఈ చోటు వదిలి యూదయకు వెళ్ళు. అక్కడ నీ ఇతర అనుచరులు నువ్వు చేసే శక్తివంతమైన పనులు చూస్తారు.
\v 4 కీర్తి సంపాదించాలి అనుకునే వాళ్ళు తాము చేసే పనులు రహస్యంగా చేయరు. నువ్వు ఈ అద్భుతాలు చేస్తున్నానని అంటున్నావు కదా, ఇంకా కొన్ని అద్భుతాలు అందరూ చూసేలా చేయి" అన్నారు.
\s5
\p
\v 5 తన సొంత తమ్ముళ్ళు కూడా ఆయన నిజం చెప్తున్నా నమ్మలేదు.
\v 6 కాబట్టి యేసు వాళ్ళతో, "నా పనులు ముగించడానికి ఇది నాకు సమయం కాదు. మీరు అనుకున్నది నెరవేరడానికి మీకు ఇష్టమైన సమయాన్ని ఎంచుకోవచ్చు.
\v 7 తమ కోసమే జీవించే వాళ్ళని, ఈ లోక విషయాలు ఇష్టపడే వాళ్ళని మనుషులు ద్వేషించరు. వాళ్ళు నన్ను ద్వేషిస్తారు. వాళ్ళ చెడు నడత గురించి వాళ్లకు చెప్పేది నేనొక్కడినే.
\s5
\v 8 మీరు పండగకు వెళ్ళండి. నేను అప్పుడే యెరూషలేముకు వెళ్ళడం లేదు. నేను వెళ్ళడానికి ఇది తగిన సమయం కాదు అన్నాడు."
\p
\v 9 అలా చెప్పాక యేసు కొంత సమయం గలిలయలోనే ఉన్నాడు.
\s5
\v 10 అయితే తన తమ్ముళ్ళు పండగకు వెళ్ళిన కొన్ని రోజులకి ఆయన కూడా వెళ్ళాడు కానీ రహస్యంగా వెళ్ళాడు.
\v 11 యేసును వ్యతిరేకించే యూదులు ఆయన కోసం చూస్తూ, పండుగలో ఆయన కనిపిస్తాడని చూస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రజల్ని "యేసు వచ్చాడా?" అని మాట్లాడుకుంటున్నారు.
\s5
\p
\v 12 ఆ సమూహాల మధ్యలో చాలామంది ఒకరినొకరు యేసు గురించి మాట్లాడుకుంటున్నారు. కొందరు ఆయన మంచివాడు అంటున్నారు. ఇంకొందరు, "కాదు. ఆయన మోసకారి, తప్పుదారి పట్టిస్తున్నాడు" అన్నారు.
\v 13 యేసుకు శత్రువులుగా ఉన్నయూదులకు భయపడి వాళ్ళు మాట్లాడుకునేది ఎవరూ వినకూడదని పండగలో ఎవరూ బహిరంగంగా ఆయన గురించి పెదవి విప్పలేదు.
\s5
\p
\v 14 పర్ణశాలల పండగ సగం ముగిసిన తర్వాత యేసు దేవాలయ ఆవరణలోకి వెళ్లి బోధించడం మొదలుపెట్టాడు.
\v 15 ఆయన చెప్పింది విని యూదుల పెద్దలు ఆశ్చర్యపోయారు. వాళ్ళు, "ఇతడు ఆమోదించిన గురువు ద్వారా మన సిద్ధాంతాలు ఎప్పుడూ నేర్చుకోలేదు. మన పాఠశాలల్లో చేరిందీ లేదు. లేఖనాల గురించి ఇతనికి ఇంత పరిజ్ఞానం ఉండడం, నమ్మశక్యంగా లేదు" అనుకున్నారు.
\v 16 యేసు వాళ్ళకి జవాబిస్తూ, "నేను బోధించేది నాలో నుండి వచ్చింది కాదు. నన్ను పంపిన దేవుని నుండి వచ్చింది."
\s5
\p
\v 17 "దేవునికి ఇష్టమైనది ఎంచుకున్న ఎవరైనా నేను బోధించేది దేవుని నుండి వస్తుందో, నా సొంత అధికారంతో నేనే మాట్లాడుతున్నానో తెలుసుకుంటాడు.
\v 18 తన సొంత అధికారంతో ఎవరైనా మాట్లాడితే అప్పుడు ఇతరులు ఆ మనిషినే గౌరవిస్తారు. తనను పంపిన వ్యక్తి కోసం పనివాడు కష్టపడి పని చేస్తే, నిజాయితీ ఉన్న వాడిగా యజమానికి మంచి పేరు తెచ్చి పెట్టినప్పుడు అలాంటి పనివాడిలో లోపం ఉండదు."
\s5
\p
\v 19 "మోషే మీకు ఇచ్చిన చట్టాలు గుర్తు చేసుకోండి. ఆ విధులకు మీలో ఒక్కరు కూడా లోబడరు. నన్నెందుకు చంపడానికి చూస్తున్నారు? విశ్రాంతి దినానికి సంబంధించిన విధులకి నేను లోబడనందుకేనా?"
\p
\v 20 ఆ గుంపులో ఒక మనిషి, "నీకు దయ్యం పట్టుకుంది. నిన్ను చంపాలనుకునే మనిషి పేరు చెప్పు?" అన్నాడు.
\s5
\v 21 దానికి యేసు జవాబిస్తూ, "విశ్రాంతి దినాన్న నేను ఒక్క అద్భుతం చేయడం మీకు మింగుడు పాడడం లేదు."
\p
\v 22 "మోషే మీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అందులో మీ మగపిల్లలు పుట్టిన తరవాత ఏడవ రోజున కచ్చితంగా సున్నతి చేయించాలి (సరిగ్గా చెప్పాలంటే ఈ ఆచారం మీ పితరులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల నుండి వచ్చింది. ధర్మశాస్త్రాన్ని రాసి ఇచ్చిన మోషే నుండి వచ్చింది కాదు). ధర్మశాస్త్రం ఆజ్ఞలు పాటించవలసిన అవసరాన్ని బట్టి మీరు కొన్నిసార్లు విశ్రాంతి దినాన శిశువుకు సున్నతి చేయడం అనే పని చేస్తారు గదా."
\s5
\p
\v 23 "అది విశ్రాంతి దినం అయినా సరే మోషే ఆజ్ఞల్ని మీరకుండా ఉండడానికి మీరు కొన్నిసార్లు మగ శిశువులకి సున్నతి చేస్తారు. కాబట్టి ఒక వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు నేను విశ్రాంతి దినాన పని చేసానని మీరు నా మీద పగ పెంచుకుంటారేమిటి? ఒక వ్యక్తికి స్వస్థత చాలా అవసరం. అది చిన్నబిద్దకు సున్నతి చేయడం కంటే ఘనమైన పని.
\v 24 దేవుని ధర్మశాస్త్రానికి తప్పుగా వ్యాఖ్యానించుకుంటూ ఆలోచన లేకుండా ఒక వ్యక్తిని స్వస్థపరచడం తప్పా ఒప్పా అని నిర్ణయించడం మానేయండి. అందుకు బదులుగా మనిషి ఏం చేయాలో, మానవ పద్ధతిలో కాకుండా దేవుని న్యాయ ప్రకారం ఏది సరైనదో అది నిర్ణయించండి" అన్నాడు.
\s5
\p
\v 25 యెరూషలేము ఊరివాళ్ళు కొందరు, "వాళ్ళు చంపాలనుకున్నది ఇతన్నే.
\v 26 ఆయన ఈ విషయాలన్నీ బహిరంగంగానే చెప్తున్నా అధికారులు ఆయనకు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనడం లేదు. ఆయన మెస్సీయ అని వాళ్ళు గ్రహించారా ఏమిటి?
\v 27 కానీ ఈయన మెస్సీయ అయి ఉండడు. ఈయన ఎక్కడి నుండి వచ్చాడో మనకు తెలుసు. కానీ మెస్సీయ వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వస్తాడో ఎవరికీ తెలీదు" అనుకున్నారు.
\s5
\p
\v 28 దేవాలయ ఆవరణంలో యేసు బోధిస్తుండగా ఆయనకి ఎవరో చెప్పినట్టు "ఔను. నేను మీకు తెలుసని మీరు అనుకుంటారు. నేను ఎక్కడి నుండి వచ్చానో మీకు తెలుసు అనుకుంటారు. నాకు నేనుగా రాలేదు. నన్ను పంపినవాడు నిజమైన సాక్షి. ఆయన మీకు తెలియదు.
\v 29 నేను ఆయన దగ్గర నుండి వచ్చాను కాబట్టి ఆయన నాకు తెలుసు. నన్ను పంపినవాడు ఆయనే." అన్నాడు.
\s5
\p
\v 30 అప్పుడు ఆయన్ని వాళ్ళు బంధించాలనుకున్నారు. కానీ అలా చేయలేకపోయారు ఎందుకంటే ఆయన పని పూర్తి చేసుకుని తన జీవితం ముగించే సమయం ఇంకా రాలేదు.
\v 31 ఆ సమూహంలో ఉన్నవాళ్ళు చాలామంది ఆయన చెప్పింది విని, ఆయన చేసిన పనులు చూసి ఆయనలో నమ్మకం ఉంచారు. "మనం ఎదురు చూసే మెస్సీయ వచ్చినప్పుడు ఆయన్ని గుర్తించగలిగే అద్భుతమైన గుర్తులు ఇవే గదా" అనుకున్నారు.
\p
\v 32 వాళ్ళు అలా మాట్లాడుకోవడం పరిసయ్యులు విన్నారు. కాబట్టి వాళ్ళూ, ప్రధాన యాజకులూ కలిసి కొందరు అధికారుల్ని ఆయన్ని బంధించమని పంపారు.
\s5
\p
\v 33 యేసు, "నేను మీతో కొంత కాలమే ఉంటాను. తరవాత నన్ను పంపిన వాని దగ్గరికి నేను వెళ్తాను.
\v 34 నా కోసం మీరు వెదుకుతారు కానీ నేను మీకు కనిపించను. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు" అన్నాడు.
\s5
\v 35 యూదులలో ఆయన శత్రువులు తమలో తాము, ఈ మనిషి ఎక్కడికి వెళ్తాడు? మనం కనిపెట్టలేని చోటు ఏముంది? యూదులు వలసబోయిన గ్రీసు దేశం వెళ్లి అక్కడ ఈ కొత్త విషయాలు బోధించాలని ఇతని ఉద్దేశమా? అనుకున్నారు,
\v 36 నన్ను మీరు వెదుకుతారు కానీ మీరు నన్ను కనిపెట్టలేరు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు, అనే ఆయన మాటల అంతర్యం ఏంటి? అనుకున్నారు.
\s5
\p
\v 37 అతి ప్రాముఖ్యమైన పండగ చివరి రోజున యేసు దేవాలయ ఆవరణలో లేచి నిలబడి బిగ్గరగా "నాలో నమ్మకం ఉంచిన వాళ్ళకు వారి హృదయంలో నుండి జీవ జలాలు ప్రవహిస్తాయి, అని లేఖనం చెప్పినట్టు,
\v 38 దాహంతో ఉన్న వాళ్ళు నేను ఇచ్చింది తాగడానికి నా దగ్గరికి రావాలి" అన్నాడు.
\s5
\v 39 తండ్రి తనలో నమ్మకం ఉంచిన వాళ్ళకి ఇచ్చే ఆత్మను గురించి ఆయన చెప్పాడు. ఆయనలో నమ్మకం ఉంచిన వాళ్ళలో జీవించడానికి దేవుడు ఇంకా ఆత్మను పంపలేదు. ఎందుకంటే యేసు తన మరణం ద్వారా ప్రజల్ని రక్షించి దేవునికి గొప్ప ఘనత తెచ్చే తన పనిని ఇంకా పూర్తి చేయలేదు.
\s5
\p
\v 40 ఆ గుంపులో ఈ మాటలు విన్న వాళ్ళు కొందరు మనం ఎదురు చూస్తున్న ప్రవక్త నిజంగా ఈయనే అన్నారు.
\v 41 కొందరు, "ఈయన మెస్సీయ" అన్నారు. ఇంకొందరు యేసు గలిలయలో పుట్టాడు అనుకుని, "మెస్సీయ గలిలయ ప్రాంతం నుండి రాడు.
\v 42 దావీదు వంశం నుండి వస్తాడు, దావీదు సొంత గ్రామమైన బేత్లెహేములో పుడతాడు అని లేఖనాలు చెప్తున్నాయి" అన్నారు.
\s5
\v 43 ఇలా యేసు గురించి రకరకాల అభిప్రాయాలు ప్రజల్లో ఉన్నాయి.
\p
\v 44 కొందరు సైనికులు ఆయన్ని బంధించాలని చూశారు కానీ పట్టుకోలేక పోయారు.
\s5
\v 45 వాళ్ళు ప్రధాన యాజకులూ పరిసయ్యులూ ఉన్న చోటికి తిరిగి వచ్చారు. పరిసయ్యులు యేసును ఎందుకు బంధించ లేదని వాళ్ళని అడిగారు.
\v 46 "ఆ మనిషి చెప్పిన అద్భుతమైన విషయాలు ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు" అని సైనికులు జవాబిచ్చారు.
\s5
\p
\v 47 అందుకు పరిసయ్యులు, "అతడు మిమ్మల్ని కూడా బుట్టలో వేసుకున్నాడా?
\v 48 యూదు పాలకుల వంటి ప్రముఖులు గానీ, మా పరిసయ్యులు గానీ యేసుపై నమ్మకం ఉంచామా?
\v 49 మన ధర్మశాస్త్ర బోధల్నిఅర్ధం చేసుకోలేని పామరులు మాత్రమే ఆయనలో విశ్వాసం ఉంచారు. వాళ్ళ చేజేతులా వాళ్ళే శాపం కొని తెచ్చు కుంటారు" అన్నారు.
\s5
\p
\v 50 అప్పుడు నికోదేము (రాత్రివేళ యేసును కలిసి మాట్లాడిన పరిసయ్యుడు) వాళ్ళతో,
\v 51 "ఒక వ్యక్తి చెప్పేది వినకుండా అతని మీద నింద వేయడానికి మన యూదు ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ముందు అతడు చెప్పేది వినాలి. తరవాత అతని గురించి నిర్ణయానికి రావాలి" అన్నాడు.
\v 52 అప్పుడు వాళ్ళు అతన్ని అవమానిస్తూ, "నువ్వు కూడా గలిలయ వాడివేనా ఏంటి? లేఖనాలను జాగ్రత్తగా చదువు. గలిలయ నుండి ఏ ప్రవక్తా రాడని నీకు తెలుస్తుంది" అన్నారు.
\s5
\p
\v 53 తరవాత వాళ్ళందరూ ఎవరికీ వారు ఇంటి ముఖం పట్టారు.
\s5
\c 8
\p
\v 1 యేసు తన శిష్యులతో కలిసి ఒలీవల కొండకు వెళ్ళి, ఆ రాత్రి అక్కడ గడిపాడు.
\v 2 ఆ మరుసటి ఉదయాన్నే యేసు దేవాలయ ఆవరణానికి తిరిగి వెళ్ళాడు. చాలామంది ఆయన చుట్టూ మూగారు. ఆయన వాళ్లకు బోధించడానికి కూర్చున్నాడు.
\v 3 యూదుల ధర్మశాస్త్రాన్ని బోధించే కొందరు, పరిసయ్యులు కొందరు ఒక స్త్రీని యేసు దగ్గరికి తెచ్చారు. ఆమె వ్యభిచరిస్తూ దొరికింది. ఆమెని ప్రశ్నించడానికి ఈ గుంపు యేసు ఎదుట నిలబెట్టారు.
\s5
\p
\v 4 వాళ్ళు యేసుతో, "బోధకా, ఈమె ఒక పరాయి మగాడితో వ్యభిచారం చేస్తూ దొరికింది.
\v 5 ఇలాంటి కులటను రాళ్ళతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించాడు. అయినా ఈ విషయంలో నువ్వు ఏమి చెప్తావో చెప్పు" అని అడిగారు.
\v 6 ఆయన్ని ఎలాగైనా ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగారు. ఆమెని చంపకూడదని ఆయన అంటే మోషే ఆజ్ఞల్ని గౌరవించట్లేదు అనవచ్చు. ఆమెని చంపేయండి అంటే రోమా గవర్నరుకు మాత్రమే ఉన్న చట్టపరమైన అధికారం తన చేతుల్లోకి తీసుకున్నాడు అనవచ్చు. అయితే యేసు తలవంచుకుని నేల మీద ఏదో రాయసాగాడు.
\s5
\p
\v 7 వాళ్ళు ఆయన్ని అదేపనిగా ప్రశ్నిస్తూ ఉంటే ఆయన వాళ్ళతో, "మీలో ఎప్పుడూ పాపం చెయ్యని వారెవరో ఆమె మీద మొదటి రాయి వేసి శిక్షించొచ్చు" అన్నాడు.
\v 8 ఇలా చెప్పి మళ్ళీ నేల మీద రాయసాగాడు.
\s5
\v 9 ఆయన చెప్పింది విని, ఆయన్ని ప్రశ్నించిన వాళ్ళంతా ఒకరి తరవాత ఒకరు తేలుకుట్టిన దొంగల్లా వెళ్ళిపోసాగారు. తాము పాపం చేస్తున్నట్టు వాళ్లకు తెలుసు. చివరికి యేసు మాత్రమే అక్కడ ఆమెతో మిగిలాడు.
\p
\v 10 యేసు నిలబడి, "అమ్మా, నీ మీద నేరం మోపిన వాళ్ళు ఏరీ? ఎవరూ నీకు శిక్ష వేయలేదా?" అని ఆమెని అడిగాడు.
\v 11 ఆమె "లేదయ్యా" అంది. అప్పుడు యేసు, "నేను కూడా నీకు శిక్ష వేయను. ఇంటికి వెళ్ళు. ఇప్పటి నుండి ఇలా ఎప్పుడూ పాపం చెయ్యొద్దు" అన్నాడు.
\s5
\p
\v 12 యేసు మళ్ళీ ప్రజలతో మాట్లాడాడు. ఆయన, "నేను లోకానికి వెలుగును. నన్ను వెంబడించే వాడికి నిత్య జీవాన్నిచ్చే వెలుగు దొరుకుతుంది. వాడు ఇంకెప్పుడూ చీకటిలో నడవడు."
\v 13 అప్పుడు పరిసయ్యులు ఆయనతో, "నీ గురించి నువ్వు గొప్పలు చెప్పుకుని నిన్ను నమ్మేలా మమ్మల్ని ఒప్పించడానికి చూస్తున్నట్టు ఉందే! నీ గురించి నువ్వు చెప్పుకొనే సాక్ష్యం చెల్లుబాటు కాదు. అది నిరాధారం" అన్నారు.
\s5
\p
\v 14 అందుకు యేసు, "నా గురించి నేను ఒక్కడినే సాక్ష్యం చెప్పుకున్నా నేను చెప్పేది నిజమే. ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో , ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్తానో మీకు తెలియదు.
\v 15 మానవ ప్రమాణాల ప్రకారం , మనుషులు పెట్టిన చట్టాల ప్రకారం మీరు ప్రజలకి తీర్పు తీరుస్తారు. నేను ఎవరికీ తీర్పు తీర్చడానికి రాలేదు.
\v 16 నేను తీర్పు తీర్చినప్పుడు అది సరైనదీ న్యాయమైనదే అవుతుంది. నేను ఒక్కడినే న్యాయం తీర్చను. నేనూ నన్ను పంపిన తండ్రీ ఉభయులం కలిసి న్యాయం తీర్చుతాము.
\s5
\v 17 మీ ధర్మశాస్త్రాన్ని మోషే రాసినప్పుడు ఒక విషయాన్ని పరిష్కరించాలంటే కనీసం ఇద్దరు వ్యక్తుల సాక్ష్యాలు అవసరమని చెప్పాడు.
\v 18 నా గురించిన సాక్ష్యం మీకు ఇస్తున్నాను. నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మేము చెప్పేది నిజమని మీరు నమ్మాలి" అన్నాడు.
\s5
\p
\v 19 అప్పుడు పరిసయ్యులు ఆయన్ని "నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు?" అని అడిగారు. యేసు జవాబిస్తూ, "మీకు నేను తెలియదు. నా తండ్రి కూడా తెలియదు. మీకు నేను తెలిస్తే నా తండ్రి కూడా తెలిసే ఉండాలి" అన్నాడు.
\v 20 ఆయన ఈ విషయాలు చెప్పినప్పుడు దేవాలయ ఆవరణలో ప్రజలు తమ కానుకలు తెచ్చే హుండీ దగ్గర ఉన్నాడు. అయినా ఆయన్ని ఎవరూ అరెస్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన మరణ సమయం ఇంకా రాలేదు.
\s5
\p
\v 21 యేసు వాళ్ళతో ఇంకా చెప్తూ, "నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెదుకుతారు. కానీ దేవుడు మీ పాపాలు క్షమించకుండానే మీరు చనిపోతారు. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు" అన్నాడు.
\v 22 యూదులలో ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు, బహుశా ఇతడు ఆత్మహత్య చేసుకుంటాడేమో. నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అని చెప్పిన మాటకి అర్ధం అదే, అని తమలో తాము అనుకున్నారు.
\s5
\p
\v 23 యేసు ఇంకా, "మీరు ఈ క్రింది భూమి నుండి వచ్చినవాళ్ళు, నేను పైన పరలోకం నుండి వచ్చిన వాడిని. మీరు ఈ లోకానికి చెందిన వాళ్ళు. నేను ఈ లోకానికి చెందిన వాణ్ణి కాదు.
\v 24 మీరు మరణిస్తారనీ దేవుడు మీ పాపాలకు శిక్ష విధిస్తాడనీ నేను మీకు చెప్పాను. నేను చెప్పినట్టు నేను దేవుణ్ణి అని మీరు నమ్మకపోతే ఇది తప్పక జరుగుతుంది."
\s5
\p
\v 25 "నువ్వెవరు?" అని వాళ్ళు ఆయన్ని అడిగారు. యేసు వాళ్ళతో, "మొదటి నుండి నేను చెప్తూనే ఉన్నాను.
\v 26 చాలా విషయాల్లో మీరు పాపం చేశారని నేను మీకు తీర్పు చెప్పగలను. అలా కాక నన్ను పంపిన వాడు నిజమే చెప్తాడు. ఆయన నుండి నేను ఏం విన్నానో లోకంలో ఉన్న మనుషులకి అదే చెప్తాను."
\p
\v 27 యేసు పరలోకంలోని తండ్రి గురించి మాట్లాడుతున్నాడని వాళ్ళు అర్ధం చేసుకోలేదు.
\s5
\v 28 కాబట్టి యేసు - "నన్ను చంపడానికి నన్ను సిలువ ఎక్కించినప్పుడు మనుష్యకుమారుణ్ణి అయిన నేను దేవుణ్ణి అని మీరు తెలుసుకుంటారు. అంతే కాదు, నా సొంత అధికారంతో నేను ఏమీ చేయలేదని తెలుసుకుంటారు. నా తండ్రి నాకు చెప్పింది మాత్రమే చెప్తాను.
\v 29 నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. ఆయన నన్ను ఏకాకిని చేయలేదు. ఎందుకంటే ఆయన్ని సంతోషపెట్టేవే నేను చేస్తాను."
\v 30 యేసు ఈ విషయాలు చెప్పినప్పుడు ఇంకా చాలామంది ఆయన దేవుడు పంపిన వాడని నమ్మారు.
\s5
\p
\v 31 ఇప్పుడు ఆయనలో నమ్మకం ఉంచామని చెప్పిన యూదులకి యేసు, "నేను బోధించినది అంతా మీరు వింటే మీ ప్రవర్తన మార్చుకుని ఆ విధంగా జీవించండి. అప్పుడు మీరు నా నిజమైన శిష్యులు అవుతారు.
\v 32 మీరు సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ సత్యమే మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపించి, స్వేచ్ఛను ఇస్తుంది" అని చెప్పాడు.
\v 33 వాళ్ళు, "మేము అబ్రాహాము పిల్లలం. మేము ఎప్పుడూ బానిసలుగా ఉండలేదు. మాకు స్వేచ్చ అవసరమని ఎందుకు అంటున్నావు?" అని అడిగారు.
\s5
\p
\v 34 యేసు, "నేను మీకు నిజం చెప్తున్నాను. "బానిస తన యజమానికి బలవంతంగా లోబడినట్టే పాపపు కోరికలకు లోబడిన వాళ్ళు పాపానికి బానిసలు.
\v 35 బానిసలు కుటుంబంలో శాశ్వత సభ్యులు కారు. వారిని వేరొక యజమానికి అమ్మివేసినా ఇప్పుడున్న యజమాని వారికి విడుదల ఇచ్చినా వారు తమ ఇంటికి తిరిగి వెళ్ళిపోయినా, వారు ఇకపై ఆ కుటుంబంలో భాగం కాదు. అయితే కుమారుడు ఎప్పటికీ కుటుంబ సభ్యుడే.
\v 36 కాబట్టి కుమారుడు మిమ్మల్ని విడిపిస్తే, మీరు పూర్తిగా స్వేచ్చ పొందుతారు."
\s5
\p
\v 37 "మీరు అబ్రాహాము కుటుంబం నుండి వచ్చారనీ, మీరు ఆయన పిల్లలనీ నాకు తెలుసు. అయితే మీ మనుషులు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. నేను చెప్పింది ఏదీ మీరు నమ్మరు.
\v 38 నేను ఆశ్చర్యకరమైన విషయాలన్నీ మీకు చెప్తున్నాను, మీరు మాత్రం మీ తండ్రి మీకు చెప్పిందే చేస్తారు" అన్నాడు.
\s5
\p
\v 39 అప్పుడు వాళ్ళు, "అబ్రాహాము మా పితరుడు" అన్నారు. యేసు వాళ్ళతో, "మీరు అబ్రాహాము పిల్లలైతే అతను చేసిన మంచి పనులు చేయాలనుకుంటారు.
\v 40 నేను దేవుని నుండి విన్న నిజాన్నే నేను మీకు చెప్పాను. కానీ మీరు నన్ను చంపాలని చూస్తున్నారు. అబ్రాహాము ఇలాంటి పనులు చేయలేదు.
\v 41 మీ అసలైన తండ్రి చేసేవి మీరు చేస్తున్నారు" అన్నాడు. వాళ్ళు, "నీ గురించి మాకు తెలీదు. మేము మాత్రం అక్రమ సంతానం కాదు. మాకు ఒక్కడే తండ్రి. అది దేవుడే" అన్నారు.
\s5
\p
\v 42 యేసు వాళ్ళతో, "దేవుడు మీ తండ్రి అయితే నేను దేవుని దగ్గర నుండి లోకానికి వచ్చాను కాబట్టి మీరు నన్ను ప్రేమిస్తారు. నాకు నేనుగా రాలేదు. నన్ను ఆయనే పంపాడు.
\v 43 నేను చెప్పేది మీకు ఎందుకు అర్ధం కావడం లేదో చెప్తాను. నా బోధలూ నా సందేశాలూ మీరు అంగీకరించలేక పోతున్నారు.
\v 44 మీరు మీ తండ్రి సాతానుకు చెందినవాళ్ళు. వాడికి ఇష్టమైనదే మీరు చేయడానికి ఇష్టపడతారు. మొదటిగా మనుషులు పాపం చేసిన కాలం నుండి వాడు నరహంతకుడు. వాడు దేవుని సత్యాన్ని వదిలేసాడు. వాడిలో ఆ సత్యం ఇప్పుడు లేదు. వాడు అబద్ధాలకోరు కాబట్టి వాడు అబద్ధాలు చెప్పిన ప్రతిసారీ తన స్వభావం ప్రకారం మాట్లాడతాడు. అబద్ధాలు చెప్పేవాళ్ళు సాతాను వాళ్ళను ఎలా ఉండాలని కోరుకుంటాడో అలానే ఉంటారు."
\s5
\p
\v 45 "నేను నిజం చెప్పినా మీరు నన్ను నమ్మరు.
\v 46 నేను పాపం ఏమీ చేయలేదు కాబట్టి ఆ విషయంలో నా మీద మీరు నేరం మోపలేరు. నేను సత్యం చెప్పినా నన్ను నమ్మకపోడానికి సరైన కారణం ఏం లేదు.
\v 47 దేవునికి చెందిన వాళ్ళు ఆయన ఏం చెబితే అది విని, లోబడతారు. ఆయన సందేశం విని, లోబడకపోడానికి కారణం మీరు దేవునికి చెందిన వాళ్ళు కాక పోవడమే."
\s5
\p
\v 48 యూదులలో ఉన్న ఆయన శత్రువులు ఆయనతో, "నువ్వు సమరయుడివని మేము అన్నది నిజమే. నువ్వు యూదుడివే కాదు. నీలో దయ్యం ఉంది" అన్నారు.
\v 49 యేసు జవాబిస్తూ, "దయ్యం నాలో నివసించదు. నేను నా పరలోక తండ్రిని గౌరవిస్తాను. కానీ మీరు ఆయన్ని గౌరవించరు."
\s5
\p
\v 50 "నన్ను పొగడడానికి మనుషుల్ని నేను ఒప్పించను. నా అర్హతను బట్టి నాకు ఇవ్వడానికి ఇంకొకరు ఉన్నారు. నేను చెప్పేదీ చేసేదీ ప్రతిదీ న్యాయమో కాదో తీర్పు తీర్చేది ఆయనే.
\v 51 నేను మీకు నిజం చెప్తున్నాను - నా మాటలను స్థిరంగా పట్టుకుని, నేను ఇచ్చిన దానిలో నమ్మకంగా ఉన్నవాడు ఎప్పటికీ చనిపోడు" అన్నాడు.
\s5
\p
\v 52 దానికి యూదు ప్రత్యర్థులు ఆయనతో, "నీలో దయ్యం ఉందని ఇప్పుడు తేట తెల్లం అయిపోయింది. అబ్రాహాము, ప్రవక్తలు పూర్వం ఎప్పుడో చనిపోయారు. మరి నీవేమో నీవు బోధించిన దానిలో స్థిరంగా ఉంటే ఎప్పటికీ చనిపోరని చెప్తున్నావు.
\v 53 నువ్వు మా పితరుడు అబ్రాహాము కంటే గొప్పవాడివా ఏంటి? అతను చనిపోయాడు, ప్రవక్తలందరూ చనిపోయారు. ఇప్పుడు నీ గురించి నువ్వు ఏమని అనుకుంటున్నావు?" అన్నారు.
\s5
\p
\v 54 యేసు వాళ్లతో, "ప్రజలు నన్ను పొగడాలని నేను ప్రయత్నిస్తే అది వ్యర్ధమే. మీరు మీ దేవుడు అని ఎవరి గురించి చెప్తున్నారో ఆయన నా తండ్రి. నా మంచితనాన్నీ గుణాన్నీ పొగిడేది ఆయనే.
\v 55 మీకు ఆయన తెలియకపోయినా ఆయన నాకు తెలుసు. ఆయన నాకు తెలియదని చెప్తే మీలా నేను కూడా అబద్ధికుడిని అవుతాను. నాకు ఆయన తెలుసు, ఆయన చెప్పిన దానికి నేను ఎప్పుడూ లోబడతాను.
\v 56 నేను చేయబోయేది ఒక ప్రవక్తగా మీ పితరుడు అబ్రాహాము చూసినప్పుడు సంతోషిస్తాడు."
\s5
\p
\v 57 యూదు నాయకులు ఆయనతో, "అబ్రాహాము చాలాకాలం క్రితం చనిపోయాడు. నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా లేవు. అబ్రాహామును చూశానని ఎలా చెప్తున్నావు?" అని అడిగారు.
\v 58 యేసు వాళ్లతో, "నిజం చెప్పాలంటే అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను" అన్నాడు.
\v 59 వాళ్ళు రాళ్ళు తీసుకుని ఆయన్ని చంపడానికి ఆయన మీదికి విసిరారు. వాళ్ళకి కనిపించకుండా ఆయన తప్పించుకుని దేవాలయ ప్రాంగణం విడిచి వేరే చోటికి వెళ్ళిపోయాడు.
\s5
\c 9
\p
\v 1 యేసు, ఆయన శిష్యులు కలిసి నడిచి వెళ్తున్నారు. పుట్టిన దగ్గర నుండి జీవితమంతా గుడ్డివాడిగా ఉన్న వ్యక్తిని ఆయన చూశాడు.
\v 2 ఆయన శిష్యులు, "బోధకా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఏ పాపం కారణం అయి ఉంటుంది? ఇతను స్వయంగా పాపం చేశాడా, లేక ఇతని తలిదండ్రులా?" అని అడిగారు.
\s5
\p
\v 3 అప్పుడు యేసు, "ఇతడు గానీ ఇతని తలిదండ్రులు గానీ పాపం చేయలేదు. ఈ రోజున దేవుని శక్తివంతమైన కార్యాన్ని మనుషులు చూడాలనే ఇతను పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టాడు.
\v 4 ఇంకా సమయం ఉన్నప్పుడే నన్ను పంపినవాడు నన్ను చేయమన్న పని నేను చేయాలి. పగలు తరువాత రాత్రి వచ్చినప్పుడు మనుషులు పని చెయ్యరు. దేవుడు మనం ఏం చేయాలని అనుకుంటున్నాడో అది చేయడానికి చాలా ఆలస్యం అయిపోయిందే అనుకునే సమయం వస్తుంది.
\v 5 నేను ఈ లోకంలో ఇంకా జీవిస్తుండగా లోకానికి వెలుగును ఇచ్చేది నేనే" అని జవాబిచ్చాడు.
\s5
\p
\v 6 ఆయన ఇలా చెప్పి నేల మీద ఉమ్మివేసి, దానితో బురద చేసి, ఆ గుడ్డివాడి కళ్ళకు మందులా రాసాడు.
\v 7 అప్పుడు యేసు అతనితో "సిలోయం అనే చెరువుకు వెళ్లి కడుక్కో" అన్నాడు. సిలోయం అనే మాటకి "పంపించడం" అని అర్థం. అప్పుడు వాడు వెళ్లి ఆ చెరువులో కళ్ళు కడుక్కున్నాడు. కంటి చూపుతో తిరిగి వచ్చాడు.
\s5
\p
\v 8 అతడు అడుక్కుంటూ ఉండగా చూసిన వాళ్ళు, "వీడు ఇక్కడ కూర్చుని అడుక్కునేవాడు కదా" అన్నారు.
\v 9 కొందరు ఔను వీడే అన్నారు. మరికొందరు, "కాదు. అదే పోలికలున్న వేరే మనిషి" అన్నారు. అయితే వాడు స్వయంగా వాళ్ళతో, "ఆ మనిషి నేనే" అన్నాడు.
\s5
\p
\v 10 దానికి వాళ్ళు, "ఇప్పుడు నువ్వు ఎలా చూడగలుగుతున్నావు?" అని అడిగారు.
\v 11 అతను, "యేసు అనే మనిషి బురదను మందులా వాడి నా కళ్ళ మీద పూసి, సిలోయం చెరువు దగ్గరికి వెళ్లి కడుక్కోమన్నాడు. అక్కడికి వెళ్లి కడుక్కున్నాను. అప్పుడు మొదటిసారి ప్రపంచాన్ని చూడగలిగాను" అని చెప్పాడు.
\v 12 "ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?" అని వాళ్ళు అతణ్ణి అడిగారు. అతడు "నాకు తెలియదు" అన్నాడు.
\s5
\p
\v 13 కొందరు మనుషులు పరిసయ్యులు కూర్చుని ఉన్నచోటికి అతణ్ణి తీసుకువెళ్ళారు.
\v 14 యేసు బురద చేసి అతని చూపు తెప్పించిన రోజు యూదుల విశ్రాంతి దినం.
\v 15 కాబట్టి పరిసయ్యులు "నీకు చూపు ఎలా వచ్చింది?" అని అతణ్ణి మళ్ళీ అడిగారు. వాడు "ఒక మనిషి నా కళ్ళకి బురద రాసాడు, నేను కడుక్కున్నాను, నాకు చూపు వచ్చింది" అన్నాడు.
\s5
\v 16 కొందరు పరిసయ్యులు "ఈ యేసు విశ్రాంతి దిన్నాన్ని పాటించడం లేదు కాబట్టి అతడు దేవుడి నుండి వచ్చినవాడు కాదని తెలుసి పోతూ ఉంది" అన్నారు. ఆ గుంపులో నుండి కొందరు, "అతను పాపి అయితే అందరూ చూసేలా ఇంత శక్తివంతమైన పనులు ఎలా చేయగలడు?" అన్నారు. పరిసయ్యుల్లో అభిప్రాయభేదాలు పుట్టాయి.
\p
\v 17 వాళ్ళు ఆ గుడ్డివాణ్ణి మళ్ళీ, "అతడు నీకు చూపు తెప్పించాడు కదా. అతని గురించి నువ్వు ఏం చెప్తావు?" అని అడిగారు. "అతను ప్రవక్త అయ్యి ఉండాలి" అని ఆ మనిషి చెప్పాడు.
\p
\v 18 పరిసయ్యులు అతడు గతంలో గుడ్డివాడుగా ఉండి, ఇప్పుడు చూడగలుగుతున్నాడని నమ్మలేకపోయారు. యేసుకు వ్యతిరేకంగా పోగయ్యారు. అతని తలిదండ్రుల్ని ప్రశ్నించాలని వాళ్ళని తీసుకు రమ్మని కొందరిని పంపారు.
\s5
\p
\v 19 అతని తలిదండ్రుల్ని, "వీడు మీ కొడుకేనా? పుట్టినప్పటి నుండి గుడ్డివాడేనా? ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నాడు?" అని అడిగారు.
\v 20 అందుకు వాళ్ళు, "వీడు మా కొడుకే. వాడు పుట్టినప్పుడు గుడ్డివాడని మాకు తెలుసు.
\v 21 అయితే వాడు ఎలా చూడగలుగుతున్నాడో మాకు తెలియదు. వాడి కళ్ళు ఎవరు స్వస్థపరిచారో మాకు తెలియదు. వాడినే అడగండి. జవాబు చెప్పగల వయస్సు వాడికి ఉంది కదా" అన్నారు.
\s5
\v 22 యేసును మెస్సీయ అని ఎవరైనా అంటే సమాజ మందిరంలోకి రాకుండా నిషేధించాలని ముందుగానే యూదులు ఒక అంగీకారానికి వచ్చారు కాబట్టి అతని తలిదండ్రులు యూదుల నాయకులకు భయపడ్డారు.
\v 23 అందుకే వాళ్ళు, "వాడినే అడగండి, వాడు చిన్న పిల్లవాడేమీ కాదు గదా" అన్నారు.
\s5
\p
\v 24 అప్పుడు యూదుల నాయకులు ఆ గుడ్డివాడిని రెండోసారి పిలిపించారు. వాడు వచ్చాక, "నిజమే చెప్తానని దేవుని మీద ఒట్టు వెయ్యి. నిన్ను స్వస్థపరచిన ఈ మనిషి పాపాత్ముడని మాకు తెలుసు. అతడు మోషే మనకు ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించడు" అని అతనితో అన్నారు.
\v 25 అందుకు వాడు, "ఆయన పాపి ఔనో కాదో నాకు తెలీదు. నాకు తెలిసిన ఒకే విషయం నేను గుడ్డివాడిగా ఉండేవాణ్ణి. ఇప్పుడు చూడగలుగుతున్నాను" అన్నాడు.
\s5
\p
\v 26 దానికి వాళ్ళు అతనితో, "ఆయన నీకు ఏమి చేశాడు? నువ్వు చూడగలిగేలా నిన్ను ఎలా స్వస్థపరచాడు?" అన్నారు.
\v 27 వాడు జవాబిస్తూ, "నేను మీకు ముందే చెప్పాను. కానీ మీరు నన్ను నమ్మలేదు. మళ్ళీ నన్ను చెప్పమని పదే పదే ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు అవ్వాలని అనుకుంటున్నారా ఏమిటి?" అన్నాడు.
\s5
\p
\v 28 అప్పుడు వాళ్ళు మండిపడి ఈసడింపుగా "నువ్వే అతని శిష్యుడివి. మేము మోషే శిష్యులం.
\v 29 దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. కానీ ఈ మనిషి ఎక్కడి నుండి వచ్చాడో కూడా తెలియదు" అన్నారు.
\s5
\p
\v 30 అప్పుడు చూపు పొందిన గుడ్డివాడు వాళ్ళతో, "చాలా ఆశ్చర్యంగా ఉందే! ఆయనకు శక్తి ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలీదు కానీ నా కళ్ళు బాగుచేసింది మాత్రం ఆయనే.
\v 31 తన ఆజ్ఞలు పట్టించుకోని పాపుల ప్రార్ధనలు దేవుడు వినడని తెలుసు. ఆయనకి ఇష్టమైనట్టు ప్రవర్తిస్తూ ఆయన్ని ఆరాధించే వాళ్ళ ప్రార్ధనలు ఆయన వింటాడు."
\s5
\p
\v 32 "లోకం ఆరంభమైనప్పటి నుండి పుట్టు గుడ్డివాణ్ణి స్వస్థపరచడం ఎక్కడైనా జరిగిందా?
\v 33 ఈ మనిషి దేవుని దగ్గర నుండి రాకపోతే ఇలాంటిది చేయలేడు గదా" అన్నాడు.
\v 34 దానికి వాళ్ళు, "నీ తలిదండ్రుల పాప ఫలితంగా నువ్వు పుట్టావు. నీ జీవితం అంతా పాపంలోనే బ్రతికావు. మమ్మల్ని సవాలు చేసేటంత వాడివా?" అని, వాణ్ణి యూదా సమాజ మందిరంలోనించి వెలివేశారు.
\s5
\p
\v 35 తను స్వస్థపరచిన వ్యక్తిని పరిసయ్యులు సమాజ మందిరం నుండి వెలివేసిన సంగతి యేసు విని, అతని కోసం వెదకడానికి వెళ్ళాడు. అతను కనిపించినప్పుడు ఆయన అతనితో, "మనుష్యకుమారుడి మీద నువ్వు నమ్మకం ఉంచుతున్నావా?" అన్నాడు.
\v 36 అతను, "అయ్యా! నమ్మడానికి ఆయన ఎవరో ముందు చెప్పండి" అన్నాడు.
\v 37 యేసు అతనితో, "నువ్వు ఆయన్ని చూసావు. నీతో మాట్లాడుతున్నది ఆయనే" అన్నాడు.
\v 38 అప్పుడు అతను, "ప్రభూ! నేను నమ్ముతున్నాను" అని, కాళ్ళపై పడి ఆయన్ని పూజించాడు.
\s5
\p
\v 39 యేసు, "గుడ్డివాళ్ళు చూపు పొందేలా, చూపు ఉన్న వాళ్ళు గుడ్డివాళ్ళు అయ్యేలా తీర్పు తీర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను" అన్నాడు.
\v 40 అక్కడ ఉన్న కొందరు పరిసయ్యులు ఆయన్ని, "మేము కూడా గుడ్డి వాళ్ళమేనా?" అని అడిగారు.
\v 41 యేసు వాళ్ళతో, "మీరు గుడ్డివాళ్ళు అయితే మీకు పాపం ఉండేది కాదు. అయితే మీకు అనుకూలంగా మాట్లాడుతూ "మాకు చూపు ఉంది" అని చెప్పుకుంటున్నారు కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది" అని చెప్పాడు.
\s5
\c 10
\p
\v 1 "నేను నిజమే చెప్తున్నాను - గొర్రెల దొడ్డిలోకి వెళ్ళేవాడు ద్వారం గుండా వెళ్తాడు. వేరే దారిలో ఎక్కి వెళ్ళేవాడు గొర్రెల కాపరి కాదు. గొర్రెల్ని దొంగిలించే దొంగ.
\v 2 గొర్రెల దొడ్డిలో గొర్రెల్ని జాగ్రత్త చేసి, ద్వారం గుండా ప్రవేశించేవాడు నిజమైన గొర్రెల కాపరి."
\s5
\p
\v 3 "గొర్రెల కాపరి లేనప్పుడు గొర్ర్రెలను కాయడానికి జీతానికి పెట్టుకున్న కాపలావాడు కాపరి వచ్చినప్పుడు తలుపులు తెరుస్తాడు. అయితే గొర్రెలు మాత్రం కాపరి తమను పేరుతో పిలిచినప్పుడు అతని గొంతును మాత్రమే గుర్తుపడతాయి. అప్పుడు కాపరి వాటిని దొడ్డిలో నుండి బయటికి తీసుకు వెళ్ళి మేత, నీళ్ళు పెడతాడు.
\v 4 తన సొంత గొర్రెల్ని బయటికి తెచ్చాక కాపరి వాటి ముందు నడుస్తాడు. అతని స్వరం గొంతు వాటికి తెలుసు కాబట్టి అతణ్ణి నమ్మకంగా వెంబడిస్తాయి.
\s5
\v 5 పరిచయం లేనివాడు వాటిని పిలిచినా అవి వెంబడించవు. అతని స్వరం పరిచయం లేక పారిపోతాయి."
\p
\v 6 గొర్రెల కాపరి చేసే పని నుండి ఈ ఉదాహరణను యేసు వాడాడు. అయితే ఆయన శిష్యులు ఆయన చెప్పింది అర్ధం చేసుకోలేకపోయారు.
\s5
\p
\v 7 కాబట్టి యేసు వాళ్ళతో, "నేను మీకు నిజం చెప్తున్నాను, గొర్రెల దొడ్డి లోకి గొర్రెలు ప్రవేశించే ద్వారాన్ని నేనే.
\v 8 నాకు ముందు వచ్చిన వాళ్ళందరూ దొంగలూ బందిపోట్లూ. కానీ గొర్రెలు నా మాట వినిపించుకోలేదు. నన్ను అవి వెంబడించలేదు.
\s5
\v 9 నేనే గొర్ర్రెలు ప్రవేశించే ద్వారం. నాలో నమ్మకం ఉంచి తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ దేవుడు రక్షిస్తాడు. అవి భద్రత గల ద్వారాల నుండి బయటికి వెళుతూ లోపలికి వస్తూ మేత భూములకు పోతూ ఉండేలా వాటిని జాగ్రత్తగా కాపాడతాను.
\v 10 దొంగ దొంగిలించడానికీ చంపడానికీ నాశనం చేయడానికీ మాత్రమే వస్తాడు. జీవం పొంగి పొర్లేలా వాళ్ళు నిత్యజీవం పొందేలా చేయడానికి నేను వచ్చాను."
\s5
\p
\v 11 "నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల్ని భద్రం చేసి, రక్షించడానికీ చనిపోడానికీ కూడా ఇష్టపడతాడు.
\v 12 గొర్రెల కాపరిని జీతం ఇచ్చిఎవరైనా పెట్టుకోవచ్చు. అతడు గొర్రెల్ని తనవిగా చూడడు. అతడు జీతగాడే. కాబట్టి తోడేలు వాటిని వేటాడ డానికి వచ్చినప్పుడు అతడు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టడు. అతడు గొర్రెల్ని వదిలి పారిపోతాడు. అప్పుడు తోడేలుకి గొర్రెల మీద దాడి చేయడం సులువు అవుతుంది. కొన్ని తోడేలుకు చిక్కుతాయి, కొన్ని చెదిరిపోతాయి.
\v 13 జీతగాడు కేవలం జీతం కోసం పనిచేస్తాడు కాబట్టి పారిపోతాడు. గొర్రెలకి ఏం అవుతుందో అతనికి పట్టదు."
\s5
\p
\v 14 "నేనే మంచి గొర్రెల కాపరిని. నాకు చెందిన వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళకి నేను తెలుసు.
\v 15 నా తండ్రికి నేనూ నాకు తండ్రీ తెలిసినట్టుగా నాకు చెందిన వాళ్ళ కోసం నన్ను అర్పించుకుంటాను.
\v 16 ఇతర గొర్రెల దొడ్డిలోని గొర్రెల్లా వాళ్ళను నా దగ్గరికి తెచ్చుకుంటాను. నేను చెప్పే దానిమీద వాళ్ళు దృష్టి పెడతారు. చివరికి నాకు చెందిన మందతో కలిసి అవి ఒకటిగా ఉంటాయి. నేను ఒక్కడినే కాపరిగా ఉంటాను."
\s5
\p
\v 17 "నా ప్రాణం అర్పిస్తాను గనక నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. మళ్ళీ నా ప్రాణం నేను తీసుకుని బ్రతుకుతాను.
\v 18 నా ప్రాణం ఇవ్వడానికి ఎవరూ కారణం కాదు. నా ప్రాణం అర్పించడానికి నేనే స్వయంగా ఎంచుకున్నాను. నా ప్రాణం ఇవ్వడానికీ దాన్ని మళ్ళీ తీసుకుని బ్రతకడానికీ నాకు అధికారం ఉంది. ఈ పని నా తండ్రి నుండి వచ్చింది. ఇలా చేయమని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు."
\s5
\p
\v 19 యేసు చెప్పిన ఈ మాటలు విన్న తరువాత యూదులలో ఆయన గురించి అభిప్రాయ భేదాలు వచ్చాయి.
\v 20 వాళ్ళలో చాలామంది, "అతనికి దయ్యం పట్టి ఇలా పిచ్చి వాడైపోయాడు. అతని మాటలు విని సమయం పాడు చేసుకోవద్దు" అన్నారు.
\v 21 "అతను చెప్పేవి దయ్యం పట్టిన వాడి మాటలు కానే కాదు. గుడ్డివాణ్ణి దయ్యం స్వస్థపరచగలదా?" అని మరికొందరు అన్నారు.
\s5
\p
\v 22 యూదా ప్రజలు తమ పితరులు దేవాలయాన్ని శుద్దీకరించి, మళ్ళీ దేవునికి ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆచరించే పండగను ప్రతిష్టిత పండగ అంటారు. ఆ ప్రతిష్టిత పండగ చేసుకునే సమయం వచ్చింది. అది చలికాలం.
\v 23 యేసు దేవాలయ ప్రాంగణంలో నడుస్తూ సోలోమోను మంటపం అనే చోట ఉన్నాడు.
\v 24 యేసుకు వ్యతిరేకంగా ఉన్న యూదులు ఆయన చుట్టూ చేరి, "ఎంతకాలం మమ్మల్ని గందరగోళంలో ఉంచుతావు? నువ్వు మెస్సీయ అయితే మాకు స్పష్టంగా చెప్పు" అన్నారు.
\s5
\v 25 యేసు వాళ్ళతో, "నేను మీకు చెప్పాను గానీ మీరు నన్ను నమ్మలేదు. నా తండ్రి పేరిట ఆయన అధికారంతో నేను చేసిన అద్భుతాల వల్లా ఇతర విషయాల వల్లా నేను ఎవరో మీకు తెలుసు. నా గురించి అవే తేటతెల్లం చేస్తాయి.
\v 26 మీరు నాకు చెందని వారు కాబట్టి నాలో విశ్వాసం ఉంచరు. మీరు వేరొక కాపరికి చెందిన గొర్రెలు."
\s5
\p
\v 27 "గొర్రెలు వాటి నిజమైన కాపరి గొంతు విని గుర్తు పట్టినట్టే, నా ప్రజలు నేను చెప్పే దాని మీద దృష్టి పెడతారు. వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు నా అనుచరులు అయ్యారు.
\v 28 నేను వాళ్లకు నిత్య జీవం ఇస్తాను. ఎవరూ ఎప్పుడూ వాళ్ళను నాశనం చేయలేరు. నా నుండి ఎవరూ వాళ్ళను దొంగిలించలేరు."
\s5
\p
\v 29 "నా తండ్రి వాళ్ళను నాకు ఇచ్చాడు. ఆయన అందరికంటే గొప్పవాడు. కాబట్టి ఎవరూ ఆయన నుండి దొంగిలించలేరు.
\v 30 నేను నా తండ్రి ఒకటిగా ఉన్నాం" అన్నాడు.
\v 31 ఆ మాటకు యేసు శత్రువులు ఆయనను చంపాలని ఆయన మీదికి మళ్ళీ రాళ్ళు ఎత్తారు.
\s5
\p
\v 32 యేసు వాళ్ళతో, "నా తండ్రి నాకు చెప్పగా నేను చాలా అద్భుతాలు చేయడం మీరు చూశారు. వాటిలో దేని విషయంలో నన్ను రాళ్ళతో కొట్టాలని అనుకుంటున్నారు?" అని అడిగాడు.
\v 33 యేసును వ్యతిరేకించే ఆ యూదులు, "నువ్వు చేసిన ఏ మంచి పని వలనా నిన్ను చంపాలని మేము అనుకోవడం లేదు. కానీ నువ్వు మానవమాత్రుడివి, నిన్ను నువ్వు దేవుడిగా చేసుకుని, దేవుణ్ణి అవమానిస్తున్నావు" అన్నారు.
\s5
\p
\v 34 యేసు వాళ్ళతో, "దేవుడు పాలకులుగా నియమించిన వాళ్ళతో లేఖనాల్లో ఇలా రాయించాడు - మీరు దేవుళ్ళ వంటివారు (అనేక మంది మీద అధికారులుగా, ఘనతతో ఉండడానికి).
\v 35 ఈ మాటలు ఆయన నాయకుల్ని నియమిస్తూ చెప్పాడు. వాళ్ళు ఎవ్వరూ దానికి అభ్యంతరం చెప్పలేదు. లేఖనాల్లో ఉన్నది ఏదీ తప్పుగా చూపలేదు.
\v 36 నా తండ్రి ఈ లోకానికి పంపడానికి నన్నుఎంచుకున్నాడు. నేను దేవుని కుమారుణ్ణి అన్నందుకు దేవునితో నిన్నెందుకు సమానం చేసుకున్నావని మీరు నా మీద మండిపడుతున్నారు?
\s5
\v 37 నా తండ్రి నాకు చెప్పిన పనులు నేను చెయ్యకపోతే నాలో మీరు నమ్మకం ఉంచాలని నేను అనుకునేవాణ్ణి కాదు.
\v 38 నేను చెప్పింది మీరు నమ్మకపోయినా నేను ఈ పనులు చేస్తున్నందుకు అయినా ఆ పనులు మీకు వెల్లడి చేస్తున్న దాని మీద నమ్మకం ఉంచండి. మీరు అలా చేస్తే అప్పుడు నా తండ్రి నాలో ఉన్నాడనీ, నేను నా తండ్రిలో ఉన్నాననీ మీకు అర్ధం అవుతుంది."
\p
\v 39 ఆ మాటలు వాళ్ళు విని యేసుని బంధించాలని మళ్ళీ ప్రయత్నం చేశారు గానీ మరొకసారి ఆయన వాళ్ళ నుండి తప్పించుకున్నాడు.
\s5
\p
\v 40 అప్పుడు యేసు యొర్దాను నది దాటి తూర్పు వైపు ఉన్న ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు. అది ఆయన పరిచర్య ప్రారంభంలో యోహాను బాప్తిసం ఇచ్చిన చోటు. యేసు చాలా రోజులు అక్కడే ఉన్నాడు.
\v 41 చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు, "బాప్తిసమిచ్చే యోహాను ఎప్పుడూ అద్భుతాలు చెయ్యలేదు. కానీ ఈ మనిషి చాలా అద్భుతాలు చేస్తున్నాడు. యోహాను ఈయన గురించి చెప్పింది అంతా నిజమే" అని చెప్పుకున్నారు.
\v 42 అనేకులు ఆయనలో నమ్మకముంచారు. ఆయన ఎవరో గ్రహించారు. ఆయన వాళ్లకి చేయబోయేది ఏమిటో అర్థం చేసుకున్నారు.
\s5
\c 11
\p
\v 1 లాజరు అనే మనిషి జబ్బుపడ్డాడు. అతడు తన అక్కలు మార్త, మరియలతో కలిసి బేతనియ అనే ఊరిలో ఉండేవాడు.
\v 2 ఒకసారి యేసుపై తన ప్రేమాభిమానాలు చూపడం కోసం ఆయనను అత్తరుతో అభిషేకించి తన జుట్టుతో ఆయన పాదాలు తుడిచింది ఈ మరియే. ఆమె తమ్ముడే ఈ జబ్బు పడిన లాజరు.
\s5
\p
\v 3 ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు లాజరు గురించి యేసుకు "ప్రభూ, నువ్వు ప్రేమించే వాడు జబ్బు పడ్డాడు" అని కబురు పంపారు.
\v 4 లాజరు జబ్బు గురించి విని యేసు, "ఈ జబ్బు లాజరు చనిపోవడంతో ముగిసిపోదు. ఈ జబ్బు రావడంలో ఉద్దేశం దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు మనుషులు దాన్ని చూసి ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోవడం. కాబట్టి దేవుని కుమారుణ్ణి అయిన నేను ఆయన శక్తిని చూపిస్తాను" అన్నాడు.
\s5
\p
\v 5 యేసు మార్తనూ ఆమె సోదరి మరియనూ, సోదరుడు లాజరునూ ప్రేమించాడు.
\v 6 లాజరుకు జబ్బుచేసిందని యేసు విని కూడా అతణ్ణి చూడడానికి వెళ్ళకుండా ఆలస్యం చేసాడు. ఆయన ఉన్న చోటే ఇంకా రెండు రోజులు ఉండిపోయాడు.
\p
\v 7 అప్పుడు తన శిష్యులతో ఆయన, "మనం యూదయకు వెళ్దాం" అన్నాడు.
\s5
\v 8 ఆయన శిష్యులు ఆయనతో, "బోధకా కొన్ని రోజుల క్రితమే యూదులు నీకు వ్యతిరేకమై నిన్ను రాళ్ళతో చంపాలని చూశారు. ఇప్పుడు నువ్వు తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళాలంటున్నావు" అన్నారు.
\v 9 యేసు జవాబిస్తూ, "మీకు తెలుసా, రోజులో పన్నెండు గంటలపాటు పనులు చేసుకోడానికి వెలుగు ఉంటుంది. పగలు నడిచే వ్యక్తి దారిలో ఏమి ఉందో చూడగలడు కాబట్టి క్షేమంగా నడుస్తాడు.
\s5
\v 10 అయితే రాత్రివేళ చీకటిలో నడిచే వాడికి ఏమీ కనబడదు గనుక ఆ వ్యక్తి సులువుగా తడబడతాడు."
\p
\v 11 ఈ మాటలు చెప్పి ఆయన వాళ్ళతో, "మన స్నేహితుడు లాజరు నిద్రపోయాడు, నేను అతణ్ణి నిద్రలేపడానికి వెళ్తాను" అన్నాడు.
\s5
\p
\v 12 ఆయన శిష్యులు ఆయనతో, "ప్రభూ, అతను నిద్రపోతుంటే కోలుకుంటాడు" అన్నారు.
\v 13 యేసు నిజానికి లాజరు చనిపోవడం గురించి మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యులు మాత్రం యేసు మాట్లాడుతున్నది మనిషికి విశ్రాంతినిచ్చే నిద్ర గురించి అనుకున్నారు.
\v 14 అప్పుడు ఆయన స్పష్టంగా, "లాజరు చనిపోయాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 15 యేసు మాట్లాడడం కొనసాగిస్తూ, "అతను చనిపోయినప్పుడు నేను అక్కడ లేనందుకు మీ విషయంలో సంతోషపడుతున్నాను. దీని వల్ల మీరు నాలో ఎందుకు నమ్మకం ఉంచాలో మీరు చూస్తారు. ఇప్పుడు సమయం వచ్చింది అతని దగ్గరికి వెళ్దాం పదండి" అన్నాడు.
\v 16 అప్పుడు కవల అనే పేరున్న తోమా మిగతా శిష్యులతో, "యేసుతో చనిపోడానికి మనం కూడా వెళ్దాం పదండి" అన్నాడు.
\s5
\p
\v 17 వాళ్ళు బేతనియకు దగ్గరలో ఉండగా లాజరు చనిపోయాడనీ నాలుగు రోజుల క్రితమే అతని శరీరాన్ని సమాధి చేశారనీ ఆయనకి ఎవరో చెప్పారు.
\v 18 బేతనియ యెరూషలేముకు మూడు కిలోమీటర్లు మాత్రమే.
\v 19 అనేకమంది యూదులకు లాజరు, అతని కుటుంబం పరిచయమే. మార్త మరియల తమ్ముడు చనిపోయినందుకు ఓదార్చడానికి వాళ్ళు యెరూషలేము నుండి వచ్చారు.
\v 20 యేసు దగ్గరలో ఉన్నాడని ఎవరో చెప్తుండగా మార్త విని, ఆయన్ని కలవడానికి ఆ దారి వెంట ఎదురు వెళ్ళింది. మరియ వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయింది.
\s5
\p
\v 21 మార్త యేసును చూసి, "ప్రభూ! నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు.
\v 22 ఇప్పుడైనా సరే నువ్వు దేవుణ్ణి ఏమి అడిగితే అది నీకు ఇస్తాడు" అని అన్నది.
\v 23 యేసు ఆమెతో, "నీ తమ్ముడు మళ్ళీ బ్రతుకుతాడు" అని చెప్పాడు.
\s5
\p
\v 24 మార్త ఆయనతో, "యుగాంతం రోజున దేవుడు చనిపోయిన వాళ్ళందరినీ లేపినప్పుడు మళ్ళీ బ్రతుకుతాడని నాకు తెలుసు" అంది.
\v 25 యేసు "చనిపోయిన వాళ్ళకు తిరిగి ప్రాణం పోసేది నేనే. వాళ్ళకు జీవాన్ని ఇచ్చేది నేనే. నాలో ఎవరు నమ్మకం ఉంచుతారో వాళ్ళు చనిపోయినా తిరిగి బ్రతుకుతారు.
\v 26 జీవాన్ని పొందిన వాళ్ళు అందరూ నాతో చేరారు. నాలో నమ్మకం ఉంచిన వాళ్ళు ఎప్పటికీ చనిపోరు. నువ్వు నన్ను నమ్ముతున్నావా?" అని ఆమెని అడిగాడు.
\s5
\v 27 ఆమె, "ఔను ప్రభూ! నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. నువ్వు దేవుని కుమారుడు అనీ మెస్సీయ అనీ దేవుని వాగ్దానం చొప్పున ఈ లోకానికి వచ్చావనీ నమ్ముతున్నాను" అంది.
\p
\v 28 ఆమె అలా చెప్పి, ఇంట్లోకి వెళ్లి తన చెల్లెలు మరియను పక్కకు పిలిచి, "బోధకుడు వచ్చాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు" అని చెప్పింది.
\v 29 మరియ ఇది విని, వెంటనే లేచి ఆయన దగ్గరికి వెళ్ళింది.
\s5
\v 30 అప్పటికీ యేసు ఇంకా ఊళ్లోకి రాలేదు. మార్త ఆయన్ని కలిసిన చోటే ఉన్నాడు.
\v 31 అక్కాచెల్లెళ్ళను ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు మరియ ఉన్నట్టుండి లేచి బయటికి వెళ్ళడం చూశారు. లాజరు సమాధి దగ్గర ఏడవడానికి వెళ్తుంది అనుకుని ఆమెని వెనకాలే వెళ్లారు.
\p
\v 32 మరియ యేసు ఉన్నచోటికి వచ్చింది. ఆమె ఆయన్ని చూసినప్పుడు ఆయన పాదాల మీద పడి, "ప్రభూ! నువ్వు ఇక్కడ ఉండి ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు" అంది.
\s5
\p
\v 33 ఆమె, ఆమెతో వచ్చిన ఏడ్చేవాళ్ళని యేసు చూసినప్పుడు చాలా కలతతో తన ఆత్మ లోతుల్లో బాధపడ్డాడు.
\v 34 "అతణ్ణి ఎక్కడ సమాధి చేశారు?" అని అడిగాడు. వాళ్ళు, "ప్రభూ, రండి" అన్నారు.
\v 35 యేసు కన్నీరు కార్చాడు.
\s5
\p
\v 36 అది చూసి యూదులు, "చూడండి, లాజరంటే ఆయనకెంత ఇష్టమో!" అనుకున్నారు.
\v 37 అయితే కొందరు, "గుడ్డివాణ్ణి బాగు చేశాడు గానీ ఇతను చావకుండా చేయడానికి చాలిన శక్తి ఆయనకు లేదేమో" అన్నారు.
\s5
\p
\v 38 ఆయన సమాధి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ఉద్వేగంతో చలించిపోయాడు. కలత చెందాడు. ఆ సమాధి ఒక గుహ. పెద్ద రాయితో దాని ద్వారం మూసి ఉంది.
\p
\v 39 ఆయన అక్కడ నిలుచున్న వాళ్లతో "ఆ రాయి తొలగించండి" అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మార్త, "ప్రభూ! ఇప్పటికి నాలుగు రోజులు అయ్యింది. దేహం కుళ్ళి కంపు కొడుతూ ఉంటుంది" అంది.
\v 40 యేసు ఆమెతో, "నువ్వు నన్ను నమ్మితే దేవుడు ఎవరో ఏమి చేయగలడో చూస్తావు అని నీకు చెప్పలేదా?" అన్నాడు.
\s5
\p
\v 41 అప్పుడు వాళ్ళు ఆ పెద్ద బండను తొలగించారు. యేసు ఆకాశం వైపు చూసి, "తండ్రీ, నా ప్రార్ధన విన్నావు, నీకు వందనాలు.
\v 42 నువ్వు నా ప్రార్ధన ఎప్పుడూ వింటావని తెలుసు. వీళ్ళు నీలో నమ్మకం ఉంచేలా నిజానికి నువ్వు నన్ను పంపావని విశ్వాసం ఉంచేలా ఇక్కడ నిలబడి ఉన్నవాళ్ళ కోసం నేను ఈ మాటలు పలికాను" అని ప్రార్థించాడు.
\s5
\p
\v 43 ఆయన ఈ మాటలు పలికి పెద్ద స్వరంతో, "లాజరూ, బయటికి రా!" అన్నాడు.
\v 44 చనిపోయిన వాడు బయటికి వచ్చాడు. అతని చేతులకు కట్లు ఉన్నాయి. ఒళ్ళంతా నార బట్ట చుట్టి ఉంది. అతని ముఖం కూడా రుమాలుతో చుట్టి ఉంది. యేసు వాళ్ళతో, "చుట్టిన బట్ట విప్పి అతణ్ణి పోనియ్యండి" అన్నాడు.
\s5
\p
\v 45 మరియను చూడడానికి వచ్చిన యూదులు చాలామంది యేసు చేసిన దానికి సాక్ష్యమిస్తూ ఆయనలో నమ్మకం ఉంచారు.
\v 46 అయినా కొందరు పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి యేసు చేసింది చెప్పారు.
\s5
\p
\v 47 కాబట్టి, ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ యూదా పాలక మండలి సభ్యులతో సమావేశమయ్యారు. వాళ్ళు ఒకరితో ఒకరు "మనం ఏం చెయ్యాలి? ఈ మనిషి చాలా అద్భుతాలు చేస్తున్నాడు.
\v 48 అతణ్ణి ఇలాగే చేయనిస్తే ప్రతివాడూ ఆయనలో నమ్మకం ఉంచుతాడు, అంతా మనకు వ్యతిరేకం అవుతారు. అప్పుడు రోమా సైన్యం వచ్చి దేవాలయాన్నీ మన దేశాన్నీనాశనం చేస్తుంది" అనుకున్నారు.
\s5
\p
\v 49 ఆ పాలకమండలిలో కయప ఒక పెద్ద. అతడు ఆ ఏడాది అంతటికీ నియమించబడిన ప్రధాన యాజకుడు. అతడు, "మీకు ఏమీ తెలియదు.
\v 50 యూదా జాతి ప్రజల్ని రోమీయులు చంపేదానికంటే, మన ప్రజలందరి కోసం ఒక మనిషి చనిపోవడం మంచిది. అది మీరు గ్రహించట్లేదు" అన్నాడు.
\s5
\p
\v 51 అతను తన గురించి ఆలోచించుకున్నాడు. ఆ సంవత్సరం అతను ప్రధాన యాజకుడు కావడంవల్ల యూదా జాతి కోసం యేసు చనిపోవాలని ప్రవచించాడు.
\v 52 కానీ అతను యూదా జాతి కోసమే ప్రవచించలేదు. ఇతర ప్రదేశాల్లో ప్రతి చోటా ఉన్నదేవుని పిల్లలను అందరినీ ఒకే జాతిగా పోగు చేయడానికి యేసు చనిపోతాడని ప్రవచించాడు.
\v 53 ఆ రోజు నుండి ఆ పాలక మండలి యేసును బంధించి, చంపించాలని ఎదురు చూస్తున్నారు.
\s5
\p
\v 54 అందుకే యేసుకు వ్యతిరేకంగా ఉన్న యూదుల కారణంగా యేసు బహిరంగంగా చుట్టుప్రక్కల ప్రాంతం అంతా ప్రయాణించ లేకపోయాడు. డానికి బదులుగా తన శిష్యులతో కలిసి యెరూషలేము విడిచి నిర్జన ప్రదేశం సమీపాన ఉన్న ఎఫ్రాయీము అనే ఊరికి వెళ్ళాడు. అక్కడ ఆయన తన శిష్యులతో కలిసి కొంతకాలం ఉన్నాడు.
\p
\v 55 మళ్ళీ యూదుల పస్కాపండగ సమయం వచ్చింది. చాలామంది భక్తులు దేశమంతటి నుండి యెరూషలేముకు చేరుకున్నారు. యూదుల నియమాల ప్రకారం సిద్ధపాటులో భాగంగా తమను శుద్ధి చేసుకుంటారు. అప్పుడే పస్కా పండగ చేసుకోడానికి వారిని అనుమతిస్తారు.
\s5
\p
\v 56 పస్కా పండగకి యెరూషలేముకు వచ్చిన భక్తులందరూ యేసు కోసం చూస్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చి దేవాలయంలో నిలబడి ఒకరితో ఒకరు, "ఆయన పస్కాకు వస్తాడంటావా రాడంటావా?" అని చెప్పుకుంటున్నారు.
\v 57 యేసు ఎక్కడైనా కనిపిస్తే ఆయన్ని బంధించడం కోసం తమకు సమాచారం అందించాలని యూదా ప్రధాన యాజకులూ, పరిసయ్యులూ ఆజ్ఞలు జారీ చేశారు.
\s5
\c 12
\p
\v 1 పస్కాపండుగ ఇంకా ఆరు రోజుల్లో మొదలు కాబోతోంది. ఆ సమయంలో యేసు బేతనియ గ్రామం చేరుకున్నాడు. చనిపోయిన లాజరును యేసు తిరిగి బతికించింది ఈ గ్రామంలోనే.
\v 2 అక్కడ యేసు కోసం విందు ఏర్పాటు చేశారు. మార్త వంటకాలు సిద్ధం చేసింది. భోజనం చేయడానికి లాజరు కూడా కూర్చున్నాడు.
\v 3 అప్పుడు మరియ (నార్డ్ అనే పేరుగల) ఎంతో ఖరీదైన అత్తరు సీసా తీసుకువచ్చి యేసు పాదాలపై పోసి ఆయనను అభిషేకించింది. ఆయన పాదాలను ఆమె తన తల వెంట్రుకలతో తుడిచింది. ఆ ఇల్లంతా అత్తరు సువాసనతో నిండిపోయింది.
\s5
\p
\v 4 అయితే ఆయన శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదాకు ఇది నచ్చలేదు. (యేసుకు నమ్మకద్రోహం చేసి ఆయనను శత్రువులకు అప్పగించ బోయేవాడు ఇతడే).
\v 5 "ఆ అత్తరు అమ్మగా వచ్చిన డబ్బుతో పేదవాళ్ళకి మూడు వందల రోజులకు సరిపడా కూలి ఇవ్వచ్చు గదా" అన్నాడు.
\v 6 అతడు ఈ మాటలు పేదవాళ్ళ మీద ప్రేమతో చెప్పలేదు. అతడు దొంగ బుద్ది గలవాడు. డబ్బు సంచి అతని దగ్గరే ఉంటుంది. తన సొంత అవసరాల కోసం ఆ డబ్బును వాడుకుంటూ ఉంటాడు.
\s5
\p
\v 7 అప్పుడు యేసు "ఆమెను ఇలా చెయ్యనివ్వండి. నేను చనిపోయి సమాధి అయ్యే సమయం కోసం ఆమె దీనిని సిద్ధం చేసింది.
\v 8 పేదవాళ్ళు మనచుట్టూ ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్లకు సహాయం చెయ్యవచ్చు. నేనైతే ఎంతోకాలం మీ మధ్య ఉండను. కాబట్టి నన్ను గౌరవిస్తూ ఈమె చేసిన పని మంచిదే" అని చెప్పాడు.
\s5
\p
\v 9 యెరూషలేములో ఉన్న యూదులు యేసు బేతనియలో ఉన్నాడని విన్నప్పుడు గుంపులుగా బయలుదేరారు. వాళ్ళు కేవలం యేసును చూడ్డానికి మాత్రమే కాక, యేసు బతికించిన లాజరును కూడా చూడ్డానికి వచ్చారు.
\v 10 అవసరమైతే లాజరును చంపాలని యూదుల ప్రధాన బోధకులు నిర్ణయించుకున్నారు.
\v 11 ఎందుకంటే, ప్రజలు యేసు బోధలు వింటూ ఆయనపై నమ్మకం ఉంచుతున్నారు. తమ బోధలు పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారు.
\s5
\p
\v 12 పస్కా పండగ కోసం వచ్చిన ప్రజలకు మరుసటి రోజు యేసు యెరూషలేముకు వస్తున్నాడని తెలిసింది.
\v 13 వాళ్ళంతా గుంపులు గుంపులుగా పోగై ఖర్జూర మట్టలు పట్టుకుని యేసుకు స్వాగతం పలుకుతూ "హోసన్నా! దేవునికి స్తుతులు! ప్రభువు పేరట వస్తున్న ఇశ్రాయేలు రాజును దేవుడు దీవిస్తాడు గాక!" అంటూ గట్టిగా కేకలు వేశారు.
\s5
\q
\v 14 "యెరూషలేము నివాసులారా, భయపడవద్దు.
\q చూడండి, గాడిద పిల్లపై ఎక్కి నీ రాజు వస్తున్నాడు!"
\p
\v 15 అని లేఖనాల్లో రాసి ఉన్నట్టు ఇది నెరవేరింది.
\s5
\p
\v 16 జరిగిన సంఘటన ప్రవచనాల నెరవేర్పు అని శిష్యులు గ్రహించలేకపోయారు. కాని యేసు తన పని ముగించి మహిమ పొందిన తరువాత ఈ ప్రవచం ఆయనను గురించి రాసినదనీ, అందువల్లనే ప్రజలు ఈ విధంగా చేశారనీ శిష్యులు గుర్తు చేసుకున్నారు.
\s5
\p
\v 17 యేసును వెంబడిస్తున్న ప్రజలు తాము చూసిన లాజరు గురించి, అతణ్ణి యేసు సమాధిలో లేపిన విషయం గురించి ఒకరికొకరు చెప్పుకున్నారు.
\v 18 ఆయన ఈ సూచక క్రియ చేశాడని విన్న ఇతర ప్రజలు యేసును కలుసుకోవడానికి నగర ద్వారం వద్దకు చేరుకున్నారు.
\v 19 "చూడండి, లోకమంతా ఆయన వెంట వెళ్తున్నది. మనం చేయ్యగలిగింది ఏమీ లేదు. పరిస్థితులు చెయ్యి దాటిపోతున్నాయి" అని పరిసయ్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు.
\s5
\p
\v 20 ఆ సమయంలో పస్కా పండగ ఆచరించడానికి యెరూషలేముకు వచ్చిన వారిలో కొందరు గ్రీకు జాతివాళ్ళు కూడా ఉన్నారు.
\v 21 వాళ్ళు గలిలయలోని బేత్సయిదా ఊరివాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, "అయ్యా, మాకు యేసును పరిచయం చేస్తారా?" అని అడిగారు.
\v 22 ఫిలిప్పు అంద్రెయకు ఈ సంగతి చెప్పాడు. ఇద్దరూ యేసు వద్దకు వచ్చారు.
\s5
\v 23 యేసు వాళ్ళిద్దరితో ఇలా చెప్పాడు, "నేను చెప్పినట్టుగా దేవుడు ప్రజలందరి ఎదుటా మనుష్య కుమారుణ్ణి మహిమ పరిచే సమయం వచ్చింది.
\v 24 నేను మీతో నిజం చెబుతున్నాను. గోదుమ గింజను భూమిలో పాతిపెట్టిన తరువాత అది చావకపోతే అది ఒక్కటిగానే ఉంటుంది. అయితే అది భూమిలో చనిపోతే అది పెరిగి మరింత అధికంగా పంట ఇస్తుంది."
\s5
\p
\v 25 "ఈ లోకంలో ఎవరైనా తనను మాత్రమే ప్రేమించుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు. అలా కాక తనను తాను ద్వేషించుకునే వాడు శాశ్విత జీవం పొందుతా డు.
\v 26 నా సేవకుడుగా ఉండాలని కోరుకునేవాడు నన్ను తప్పక అనుసరించాలి. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటే నా సేవకుడు అక్కడే ఉండాలి. నన్ను సేవించేవాళ్ళను దేవుడు ఘనపరుస్తాడు."
\s5
\p
\v 27 "ఇప్పుడు నా ప్రాణం ఆందోళనగా ఉంది. నేనిలా చెప్పనా, తండ్రీ, ఈ వేదన, మరణం పొందే ఈ సమయం నుండి నన్ను తప్పించు. కానీ కేవలం ఈ కారణం కోసమే నేను ఈ లోకానికి వచ్చాను.
\v 28 నా తండ్రీ, నువ్వు ఏమై ఉన్నావో, నువ్వు ఏమి పలికావో, నీ శక్తి ప్రభావాలు ఏమిటో కనపరచు."
\p అప్పుడు ఆకాశంలో నుంచి ఒక స్వరం వినబడింది, "నేను నా స్వభావం, నా కార్యాలు, నా మాటలు ముందుగానే బయలు పరిచాను. మళ్ళీ బయలు పరుస్తాను"
\v 29 అక్కడ ఉన్న జనసమూహం ఆ స్వరం విన్నారు. కొందరు అది ఉరుము శబ్దం అన్నారు. కొందరు "ఒక దేవదూత యేసుతో మాట్లాడాడు" అన్నారు.
\s5
\p
\v 30 యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, "మీరు విన్నది దేవుని స్వరం. ఇది నాకోసం కాదు, మీ మేలు కోసమే వచ్చింది.
\v 31 ఇప్పుడు లోకానికి దేవుని తీర్పు సమయం వచ్చింది. ఇది లోకాన్ని ఏలుతున్న సాతాన్ను తరిమివేసే సమయం.
\s5
\v 32 నన్ను సిలువపై పైకి ఎత్తినప్పుడు నేను ప్రతి ఒక్కరినీ ఆకర్షించుకుంటాను."
\v 33 ఆయన ఎలాంటి మరణం పొందబోతున్నాడో ప్రజలు తెలుసుకునేందుకు ఇలా చెప్పాడు.
\s5
\p
\v 34 సమూహంలో కొందరు యేసుతో, "లేఖనాల ప్రకారం మెస్సీయ శాశ్విత కాలం జీవిస్తాడని మేము అర్థం చేసుకున్నాము. మరైతే మనుష్యకుమారుడు చనిపోతాడని నువ్వు ఎందుకు చెబుతున్నావు? అసలు మనుష్యకుమారుడు ఎవరు?" అని అడిగారు.
\v 35 అందుకు యేసు, "నా సందేశం వెలుగు వలే కొంతకాలం మాత్రమే మీ మధ్య ఉంటుంది. ఇంకా వెలుగు ఉండగానే, చీకటి మిమ్మల్ని కమ్ముకోక ముందే వెలుగులో నడవండి. చీకట్లో నడిచే వాడికి తాను ఎక్కడి వెళ్తున్నాడో తెలియదు.
\v 36 మీకు వెలుగు ఉండగానే దానిని నమ్మండి, అప్పుడు మీరు వెలుగు సంబంధులు అవుతారు."
\p యేసు ఈ మాటలు చెప్పిన తరువాత జనసమూహం నుండి దూరంగా వెళ్ళిపోయాడు.
\s5
\p
\v 37 యేసు అనేక అద్భుతాలు చేసినా, మంచి విషయాలు బోధించినా ప్రజలు ఆయనను నమ్మలేదు.
\v 38 యెషయా ప్రవక్త రాసినట్టు ఇదంతా నిజమయ్యింది:
\q "ప్రభూ, మా సమాచారం విన్న వాళ్ళలో దానిని నమ్మిన వాళ్ళెవరు?
\q ప్రభువు ఎంతటి శక్తి గల సంరక్షకుడో కనపరచుకున్నాడు."
\s5
\p
\v 39 అయినా ప్రజలు నమ్మలేకపోయారు. ఎందుకంటే యెషయా మరోచోట ఇలా రాశాడు.
\p
\v 40 ప్రభువు వాళ్ళ కళ్ళకు గుడ్డితనం కలగజేశాడు.
\q వాళ్ళ హృదయాలు బండబారిపోయాయి.
\q వాళ్ళు తమ కళ్ళతో చూడలేకపోతున్నారు.
\q వాళ్ళు చూడగలిగితే అర్థం చేసుకునే వారే.
\q క్షమాపణ కోసం పశ్చాత్తాపపడి నన్ను వేడుకునే వారే.
\q ఈ కారణం వల్ల, నేను వాళ్ళను బాగుచెయ్యను.
\s5
\p
\v 41 మెస్సీయ మహిమ ప్రభావాలను యెషయా అర్థం చేసుకున్నాడు కనుక ఆయన గురించి ఈ మాటలు రాశాడు.
\p
\v 42 ఇది నిజమని నమ్మిన కొందరు యూదు నాయకులు యేసుపై నమ్మకముంచారు. అయితే తమను పరిసయ్యులు సమాజ మందిరం నుండి వెలి వేస్తారన్న భయంతో ఈ విషయం బయట పడనివ్వలేదు.
\v 43 వాళ్ళు దేవుని వల్ల కలిగే మెప్పు కంటే ప్రజల నుండి వచ్చే మెప్పునే కోరుకున్నారు.
\s5
\p
\v 44 యేసు అక్కడ చేరి ఉన్న జనసమూహంతో బిగ్గరగా ఇలా చెప్పాడు, "నా మీద నమ్మకం ఉంచినవాడు నాపై మాత్రమే కాక, నన్ను పంపిన నా తండ్రిపై కూడా నమ్మకముంచుతాడు.
\v 45 నన్ను చూసినవాడు నన్ను పంపినవాణ్ణి కూడా చూస్తున్నాడు."
\s5
\p
\v 46 "నేను లోకానికి వెలుగుగా ఉండడానికి వచ్చాను. నన్ను నమ్మినవాడు చీకటిలో ఉండిపోడు.
\v 47 నా మాటలు విని వాటికి లోబడని వాళ్లకు నేను తీర్పు తీర్చను. నేను ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాను గానీ లోక ప్రజల తప్పులు ఎత్తి చూపడానికి రాలేదు."
\s5
\p
\v 48 "అయితే నా మాటలు త్రోసిపుచ్చి నన్ను తిరస్కరించిన వాళ్లకు ఒక రోజు వస్తుంది. నేను పలికిన మాటలే వాళ్లకు తీర్పు తీరుస్తాయి.
\v 49 నేను తండ్రి గురించి మాట్లాడినప్పుడు అవి నాకు నేనుగా చెప్పిన మాటలు కావు. తండ్రే నేను ఏమి చెప్పాలో, ఏమి మాట్లాడాలో నాకు ఆదేశించాడు.
\v 50 నేను బోధించిన తండ్రి ఆదేశాలు శాశ్వత జీవానికి నడిపిస్తాయని నాకు తెలుసు. అందుకే నేను ఏమి చెప్పినా తండ్రి నాతో చెప్పినట్టే వాళ్ళతో చెబుతున్నాను."
\s5
\c 13
\p
\v 1 పస్కా పండగ దగ్గర పడింది. యేసు తాను ఈ లోకం విడిచి తండ్రి వద్దకు వెళ్లబోయే సమయం దగ్గర పడిందని గ్రహించాడు. ఈ లోకంలో తనతో ఉన్నవారి పట్ల ఆయన తన ప్రేమను కనపరచాడు. తన జీవితం చివరి వరకూ ఆయన వాళ్ళను ప్రేమించాడు.
\p
\v 2 యేసు తన శిష్యులతో సాయంత్రం భోజనానికి కూర్చున్నాడు. అప్పటికే సాతాను యేసును అప్పగించాలనే దుష్ట తలంపును సీమోను కొడుకైన యూదా ఇస్కరియోతు హృదయంలో పెట్టాడు.
\s5
\p
\v 3 తండ్రి సమస్తాన్నీ తన ఆధీనంలో ఉంచాడని యేసుకు తెలుసు. తాను దేవుని వద్ద నుండి వచ్చాననీ, తిరిగి ఆయన దగ్గరకే వెళ్ళబోతున్నాననీ కూడా ఆయనకు తెలుసు.
\v 4 యేసు భోజనం బల్ల వద్ద నుండి లేచి తన పైవస్త్రం తీసివేసి, ఒక తువాలు తన నడుముకు కట్టుకున్నాడు.
\v 5 ఒక గిన్నెలో నీళ్ళు పోసి, శిష్యుల కాళ్ళు కడిగి తువాలుతో తుడవడం మొదలుపెట్టాడు.
\s5
\p
\v 6 ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు పేతురు, "ప్రభూ, నువ్వు నా కాళ్ళు కడుగుతావా?" అన్నాడు.
\v 7 అప్పుడు యేసు, "నేను చేస్తున్నది ఇప్పుడు నీకు అర్థం కాదు. తరవాత నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావు" అన్నాడు.
\v 8 పేతురు "నువ్వు నా కాళ్ళు ఎప్పటికీ కడగకూడదు" అన్నాడు. అందుకు యేసు, "నేను నిన్ను కడగకపోతే నీతో నాకు సంబంధం ఉండదు" అన్నాడు.
\v 9 అప్పుడు పేతురు "అయితే ప్రభూ, నా కాళ్ళు మాత్రమే కాదు, నా చేతులు, తల కూడా కడుగు" అన్నాడు.
\s5
\p
\v 10 యేసు అతనితో, "స్నానం చేసినవాడు తన కాళ్ళు తప్ప ఇంకేమీ కడుక్కోనవసరం లేదు. మిగిలిన శరీరం అంతా ముందుగానే శుభ్రం అయింది. నువ్వు శుద్ధుడివే, అయితే మీలో అందరూ శుద్ధులు కాదు" అన్నాడు.
\v 11 తనకు ద్రోహం చేసేవాడెవడో ఆయనకు తెలుసు. అందుకే "మీలో అందరూ శుద్ధులు కాదు" అన్నాడు.
\s5
\p
\v 12 శిష్యుల కాళ్ళు కడగడం పూర్తి అయిన తరువాత తన పైవస్త్రం తీసుకుని బల్ల దగ్గర కూర్చుని, "నేను మీకు చేసినదేమిటో అర్థం చేసుకున్నారా?" అని శిష్యులను అడిగాడు.
\v 13 మీరు నన్ను బోధకుడు, ప్రభువు అని పిలుస్తున్నారు. నిజమే, నేను మీకు బోధకుడిని, ప్రభువును.
\v 14 నేను మీ బోధకుడిగా, ప్రభువుగా మీ కాళ్ళు కడిగినట్టే మీరు కూడా ఒకరి కాళ్ళు ఒకరు కడగాలి.
\v 15 నేను చేసినట్టు మీరు చెయ్యాలని మీకోసం ఒక ఆదర్శంగా ఈ పని చేసి చూపించాను."
\s5
\p
\v 16 "మీకొక విషయం చెబుతున్నాను. సేవకుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు. అలాగే సందేశం తెచ్చేవాడు సందేశం పంపినవాడి కంటే గొప్పవాడు కాదు.
\v 17 ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి వీటి ప్రకారం చేస్తే దేవుడు మీ విషయంలో సంతోషిస్తాడు."
\p
\v 18 "మీ అందరి గురించి నేను మాట్లాడడం లేదు. నేను ఎంపిక చేసుకున్నవారు నాకు తెలుసు. అయితే, నా రొట్టె తిన్నవాడు నాకు వ్యతిరేకంగా మారి నాకు శత్రువయ్యాడు అనే లేఖనం నేరవేరేలా ఈ విధంగా జరుగుతుంది."
\s5
\p
\v 19 "ఇది జరగముందే ఇప్పుడు దీన్ని మీతో చెబుతున్నాను. ఎందుకంటే అది జరిగినప్పుడు నేను దేవుని కుమారుణ్ణి అని మీరు నమ్మాలని నా ఉద్దేశం.
\v 20 నేను మీతో నిజం చెబుతున్నాను. నేను పంపినవాణ్ణి స్వీకరించినవాడు నన్ను స్వీకరిస్తాడు. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపినవాణ్ణి స్వీకరిస్తాడు."
\s5
\p
\v 21 ఈ మాటలు చెప్పిన తరువాత యేసు తనలో తాను కలవరానికి గురయ్యాడు. "నేను మీతో ఒక విషయం చెబుతున్నాను, తల్లి పలు తాగి రొమ్ము గుద్దినట్టుగా మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపబోతున్నాడు" అన్నాడు.
\v 22 శిష్యులు ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకున్నారు. యేసు తమలో ఎవరి గురించి చెబుతున్నాడో వాళ్లకు అర్థం కాలేదు.
\s5
\p
\v 23 శిష్యులలో ఒకడైన యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను భోజనం బల్ల వద్ద యేసును ఆనుకుని కూర్చుని ఉన్నాడు.
\v 24 యేసు ఏ శిష్యుడి గురించి మాట్లాడుతున్నాడో అడగమని సీమోను పేతురు యోహానుకు సైగ చేశాడు.
\v 25 కాబట్టి యోహాను తన భుజం యేసుకు ఆనించి నెమ్మదిగా, "ప్రభూ, ఆ వ్యక్తి ఎవరు?" అని అడిగాడు.
\s5
\p
\v 26 యేసు, "ఈ రొట్టె ముక్కను గిన్నెలో ముంచి ఎవరికి ఇస్తానో అతడే” అని జవాబు చెప్పాడు. తరవాత యేసు రొట్టెను ముంచి సీమోను ఇస్కరియోతు కొడుకైన యూదాకి ఇచ్చాడు.
\v 27 అతడు ఆ రొట్టె ముక్కను తీసుకున్న వెంటనే సాతాను అతనిలోకి ప్రవేశించి అతన్ని వశపరచుకున్నాడు. యేసు అతనితో, "నువ్వు చెయ్యవలసింది తొందరగా చెయ్యి" అన్నాడు.
\s5
\p
\v 28 యేసు ఎందుకు అలా చెప్పాడో ఆ భోజనం బల్ల దగ్గర ఉన్న వాళ్ళెవ్వరికీ తెలీదు.
\v 29 డబ్బు సంచి యూదా దగ్గర ఉంది. కాబట్టి వెళ్లి పస్కా పండుగకు అవసరమైన సామగ్రిని కొనమని యేసు చెప్తున్నాడేమో అని వాళ్ళు అనుకున్నారు. ఇంకొంతమంది పేదలకు డబ్బులు ఏమైనా ఇవ్వమని యూదాకు చెప్తున్నాడేమో అనుకున్నారు.
\v 30 రొట్టెను తీసుకున్న వెంటనే యూదా బయటికి వెళ్ళిపోయాడు. అది రాత్రి సమయం.
\s5
\p
\v 31 యూదా వెళ్ళిపోయిన తరవాత యేసు, "ఇప్పుడు మనుష్య కుమారుడిగా ఉన్న నేను ఏమిటో, చేస్తున్నదేమిటో మనుషులంతా తెలుసుకునేలా దేవుడు చేస్తాడు. అలాగే మనుష్య కుమారుడనైన నేను దేవుడు చేస్తున్నదేమిటో మనుషులంతా తెలుసుకునేలా చేస్తాను. దీని గురించి మనుషులంతా ఆయన్ని కీర్తిస్తారు.
\v 32 మనుష్య కుమారుణ్ణి అయిన నేను దేవుణ్ణి గౌరవిస్తున్నాను కాబట్టి అందరికీ ఆయన్ని వెల్లడి చేశాను. దేవుడు కూడా నన్ను మహిమపరుస్తాడు. దేవుడు దీనిని వెంటనే చేస్తాడు."
\p
\v 33 "మీరు నా ప్రేమను చూరగొన్న పిల్లలైనప్పటికీ, కొంతకాలం మాత్రమే నేను మీతో కూడా ఉంటాను. అప్పుడు నా గురించి మీరు వెతుకుతారు గానీ ఇక్కడ నేను ఉండను. యూదు నాయకులకు చెప్పినట్టుగా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేనెక్కడికి వెళ్తున్నానో అక్కడికి మీరు రాలేరు.
\s5
\v 34 నేను మీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు కూడా తప్పకుండా ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
\v 35 మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు."
\s5
\p
\v 36 సీమోను పేతురు ఆయనతో, "ప్రభూ, నువ్వెక్కడికి వెళ్తున్నావు?" అని అడిగాడు. అప్పుడు యేసు, "నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి ఇప్పుడు మీరు నాతో రాలేరు. తరవాత వస్తారు."
\v 37 పేతురు, "ప్రభూ, ఇప్పుడు ఎందుకు నేను నీతో రాలేను? నేను నీకోసం చనిపోడానికైనా సిద్ధంగా ఉన్నాను" అన్నాడు.
\v 38 యేసు, "నాకోసం చనిపోడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పావు. నేను నిజం చెప్తున్నాను, నేనెవరో నీకు తెలియదని మూడుసార్లు నువ్వు చెప్పక ముందు కోడి కూయదు" అని చెప్పాడు.
\s5
\c 14
\p
\v 1 "తలకిందులై పోవద్దు, ఆదుర్దా పడొద్దు. దేవుణ్ణి నమ్ముతున్నట్టుగానే నన్ను కూడా నమ్మండి.
\v 2 నా తండ్రి ఉండే చోట నివసించడానికి ఎన్నో నివాసాలు ఉన్నాయి. అది నిజం కాదనుకుంటే, నేను మీతో చెప్పేవాడిని. మీరు నివసించే స్థలం సిద్ధం చేయడానికే నేను అక్కడికి వెళ్తున్నాను.
\v 3 నేను వెళ్లి స్థలం సిద్ధం చేయడం వల్ల నేను తిరిగి వచ్చి నాతోబాటు ఉండడానికి మిమ్మల్ని తీసుకువెళ్తాను, ఆ విధంగా నేను ఎక్కడ ఉంటానో, అక్కడే నాతోబాటు మీరు కూడా ఉండవచ్చు.
\s5
\v 4 నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు. దాని దారి కూడా మీకు తెలుసు."
\v 5 తోమా ఆయనతో, "ప్రభూ, నేవెక్కడికి వెళ్తున్నావో తెలియనప్పుడు, దాని దారి మాకెలా తెలుస్తుంది?" అన్నాడు.
\v 6 యేసు అతనితో, "తండ్రి ఎక్కడ ఉన్నాడో అక్కడికి మార్గం నేనే. దేవుని గురించిన సత్యాన్ని వెల్లడించేవాణ్ణి నేనే, ప్రజలందరికీ నిత్యజీవాన్ని ఇచ్చేవాణ్ణీ నేనే. నావల్లే ప్రజలందరికీ తండ్రి దగ్గరికి రావడం సాధ్యమౌతుంది. ఇంకొక మార్గం లేనే లేదు.
\v 7 నేనెవరినో మీరు నిజంగా తెలుసుకుంటే నా తండ్రిని కూడా తెలుసుకొని ఉండేవాళ్ళు. ఇప్పటినుండి మీకు ఆయన తెలుసు, ఆయనను మీరు చూశారు" అన్నాడు.
\s5
\p
\v 8 ఫిలిప్పు యేసుతో, "ప్రభూ, తండ్రిని మాకు చూపించు, ఎప్పటికీ మాకు అదే చాలు" అన్నాడు.
\v 9 యేసు అతనితో, "ఫిలిప్పూ, ఎప్పటినుండో నేను మీతోటే ఉంటున్నాను, ఇప్పటికీ నన్ను నీవు తెలుసుకోలేదు. నన్ను చూసినవాళ్ళు తండ్రినీ చూసేశారు. కాబట్టి మళ్ళీ తండ్రిని చూపించమని ఎందుకు అడుగుతున్నావు?
\s5
\v 10 నేనూ, తండ్రీ కలిసే ఉన్నామనీ, తండ్రిలో నేనూ, నాలో తండ్రీ ఉన్నామనీ మీరు నమ్మడం లేదా? నేను చెప్పిన సంగతులు నేను అలోచించినవి కాదు. ఈ విషయాలన్నీ మీకు తెలపమని తండ్రే నన్ను పంపాడు. నాలో ఉన్న తండ్రి నా ద్వారా పని చేస్తున్నాడు.
\v 11 నన్ను నమ్మండి, నేను చెప్పాను కదా, తండ్రిలో నేనూ, నాలో తండ్రీ ఉన్నామని. అలా కాకపోతే నేను చేసిన అద్భుతాలూ, గొప్ప కార్యాల గురించైనా నన్ను నమ్మండి."
\s5
\p
\v 12 "నేను ఒక సత్యం చెప్తున్నాను, ఎవరైతే నన్ను నమ్ముతారో, వారు కూడా నేను చేసిన కార్యాలు చేస్తారు. అంతకంటే ఇంకా గొప్ప పనులు కూడా చేస్తారు. ఎందుకంటే నేను తండ్రితో ఉండటానికి వెళ్తున్నాను.
\v 13 నా పేరు మీద మీరేమి అడిగినా నేను చేస్తాను. ఎందుకంటే ఆయన కుమారుడినైన నేనూ తండ్రి అందరిలో మహిమ పొందాలనీ, అలా వారు తండ్రిని తెలుసుకోగలుగుతారనీ అలా చేస్తాను.
\v 14 మీరు తండ్రిని ఏమైనా అడిగితే నేను చేస్తాను. ఎందుకంటే మీరు నాకు చెందినవారు."
\s5
\p
\v 15 "మీరు నన్ను ప్రేమించినట్టైతే నేను బోధించినట్టుగా జీవిస్తారు.
\v 16 అప్పుడు నేను తండ్రిని మీకు ఒక బహుమానం ఇమ్మని అడుగుతాను. ఆయన మీకు ఒక సహాయకుణ్ణి పంపిస్తాడు. ఆయన వచ్చి మీ పక్కనే ఎప్పుడూ ఉంటాడు.
\v 17 మీకు దేవుని గురించిన సత్యాన్ని తెలిపే ఆత్మ ఆయనే. ఈ లోకంలో ఉన్న అవిశ్వాసులు ఆయన్ని అంగీకరించరు. ఈ లోకం ఆయన్ని చూడలేదు, తెలుసుకోలేదు. మీకు ఆయన తెలుసు. ఎందుకంటే ఆయన మీతో జీవిస్తాడు, మీలో ఉంటాడు."
\s5
\p
\v 18 "మిమ్మల్ని ఎవరూ పట్టించుకోని అనాధలుగా వదలి వెళ్ళిపోను. మీ దగ్గరికి వస్తాను.
\v 19 తొందరలో ఈ లోకం ఇంక నన్ను ఎప్పటికీ చూడదు, అయితే మీరు మాత్రం చూస్తారు. ఎందుకంటే నేను జీవిస్తున్నాను కాబట్టి మీరు కూడా జీవిస్తారు.
\v 20 మీరు మళ్ళీ నన్ను చూసినప్పుడు, నేను నా తండ్రిలో, మీరు నాలో, నేను మీలో ఉన్నామని ఆ రోజు మీరు తెలుసుకుంటారు.
\s5
\v 21 నా ఆజ్ఞలు విని వాటిని పాటించే ప్రతివాడూ నన్ను ప్రేమించేవాడు. నన్ను ప్రేమించే వాణ్ణి నా తండ్రి కూడా ప్రేమిస్తాడు. నేను అతణ్ణి ప్రేమించి నన్ను అతనికి ప్రత్యక్షం చేసుకుంటాను."
\p
\v 22 అప్పుడు యూదా (ఇతడు ఇస్కరియోతు యూదా కాదు, అదే పేరుగల మరొక శిష్యుడు) యేసుతో, "ప్రభూ, లోకమంతటికీ కాకుండా మాకు మాత్రమే నిన్ను నీవు ప్రత్యక్షం చేసుకోడానికి కారణం ఏమిటి?" అన్నాడు.
\s5
\v 23 యేసు అతనికి ఇలా జవాబిచ్చాడు, "మనుషులు నన్ను ప్రేమిస్తున్నారో లేదో ఎలా చెప్పగలము? ఎవరైనా నన్ను ప్రేమిస్తే, వాళ్ళు నేను చెప్పినట్టు చేస్తారు. నా తండ్రి అతణ్ణి ప్రేమిస్తాడు. తండ్రీ, నేనూ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో నివాసం చేస్తాము.
\v 24 ఎవరైతే నన్ను ప్రేమించరో వాళ్ళు నేను చెప్పినట్టు చేయరు. నేను చెప్తున్న ఈ విషయాలు నేను స్వంతంగా నిర్ణయించి చెప్పినవి కాదు, నా తండ్రి మీతో ఈ విషయాలు చెప్పమని నన్ను పంపించాడు.
\s5
\v 25 ఈ విషయాలు నేను మీతో ఉన్నప్పుడే చెప్పాను."
\p
\v 26 "నా తండ్రి పరిశుద్దాత్మను పంపుతాడు. ఆయన మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. ఆయన నా అధికారంతో వస్తాడు. మీరు దేవుని గురించి తెలుసుకోవాల్సిన సత్యాలన్నిటినీ ఆయన మీకు బోధిస్తాడు. అంతే కాదు, నేను మీకు బోధించిన విషయాలన్నింటినీ మీకు గుర్తు చేస్తాడు."
\p
\v 27 "నేను శాంతితో మిమ్మల్ని వదిలి వెళ్తూ నా శాంతినే మీకూ ఇస్తున్నాను. నేను ఇచ్చేలాంటి శాంతి ఈ లోకానికి సంబంధించింది కాదు, ఎవ్వరూ ఇవ్వగలిగిందీ కాదు. కాబట్టి మీరు గాభరా పడొద్దు, ఆదుర్దా పడొద్దు, భయపడొద్దు."
\s5
\p
\v 28 "నేను దూరంగా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ తరవాత తిరిగి మీ దగ్గరకు వస్తాను అని నేను చెప్పడం మీరు విన్నారు కదా. మీరు గనక నన్ను ప్రేమిస్తున్నట్టయితే, నేను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్తున్నానని సంతోషిస్తారు. ఎందుకంటే నాతండ్రి నాకంటే గొప్పవాడు.
\v 29 ఈ సంగతులు ఇంకా జరగక ముందే ఇప్పుడే చెప్పేశాను. ఎందుకంటే ఇవి జరిగినప్పుడు మీరు నా మీద నమ్మకంతో కొనసాగాలన్నది నా ఉద్దేశం.
\s5
\v 30 ఇంకా ఎక్కువ సేపు మీతో మాట్లాడలేను. ఎందుకంటే ఈ లోకాధికారి అయిన సాతాను వస్తున్నాడు. అయితే నాకు జరిగే వాటిపై అతనికి ఏ నియంత్రణా, అధికారమూ లేదు.
\v 31 తండ్రి నాకు ఏం చేయమని ఆజ్ఞాపించాడో దానిని నేను చేస్తాను. ఆ విధంగా నేను తండ్రిని నిత్యమూ ప్రేమిస్తున్నానని లోకం తెలుసుకుంటుంది. ఇక పదండి. మనం ఇక్కడినుంచి వెళ్దాం."
\s5
\c 15
\p
\v 1 "నేను నిజమైన ద్రాక్ష తీగెను (సత్యాన్ని బోధించని ఆ యూదా పెద్దలలాగా కాదు). నా తండ్రి, తోటమాలి లాంటివాడు.
\v 2 నాలో ఫలించని ప్రతి కొమ్మనూ నా తండ్రి కత్తిరించి పారేస్తాడు. నాలో ఉన్న ప్రతి కొమ్మా మంచికాయలు కాయాలని పనికి రాని వాటిని కత్తిరించేసి ఇంకా ఎక్కువగా పళ్ళు కాసేలా వాటిని శుభ్రం చేస్తాడు.
\s5
\v 3 నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఇప్పటికే పవిత్రులుగా ఉన్నారు.
\v 4 నాలో నిలిచి ఉండండి. నేను మీలో ఉంటాను. కొమ్మ ద్రాక్ష తీగెలో ఉండకుండా ఒక్కటే వేరుగా ఉంటే తనంతట తానే ఏ విధంగా ఫలించదో, అలాగే మీరు నాలో ఉండి, ప్రతి దానికీ నాపై ఆధారపడితేనే తప్ప ఫలించ లేరు."
\s5
\p
\v 5 "నేను ద్రాక్షతీగె లాంటి వాడిని. మీరు కొమ్మల్లాంటి వారు. మీరు నాతో కలిసి ఉన్నట్టయితే నేను మీతో ఉంటాను. అప్పుడు మీరు బాగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉంటే మీరు ఏమాత్రం ఫలించలేరు.
\v 6 అప్పుడు తోటమాలి పనికిరాని కొమ్మల్ని కత్తిరించి బయట పడేస్తాడు. అవి ఎండిపోయిన తరవాత వాటిని తీసుకెళ్ళి తగలబెడతారు. అలాగే నాతో కలిసి ఉండని ప్రతివారినీ దేవుడు వదిలించుకుంటాడు.
\v 7 మీరు గనక నాతో కలిసి ఉండి, నా సందేశం ప్రకారం జీవిస్తూ ఉంటే దేవుణ్ణి మీరు ఏం అడిగినా ఆయన చేస్తాడు.
\s5
\v 8 మీరు ఎక్కువగా ఫలించడం వల్ల ప్రజలంతా నా తండ్రిని ఘనపరుస్తారు. ఇలా చేయడం వల్ల మీరు నా శిష్యులని అందరికీ తేటతెల్లం అవుతుంది."
\p
\v 9 "నా తండ్రి నన్ను ప్రేమించినట్టుగానే నేను మిమ్మల్ని ప్రేమించాను. నేను ప్రేమించే వారికి తగినట్టుగా ఇప్పుడు మీరు జీవిస్తూ నిలకడగా ఉండండి.
\s5
\v 10 నేనిచ్చిన ఆజ్ఞల్ని పాటించినట్టైతే నాకు తగినట్టుగా జీవిస్తున్నట్టే. అదే విధంగా నా తండ్రి ఆజ్ఞల్ని నేను పాటించాను కాబట్టి నన్ను ప్రేమించిన ఆయనకు తగినట్టుగా నడుస్తారు.
\v 11 మీలో నా ఆనందం ఉండాలనీ, మీ ఆనందం పరిపూర్ణం కావాలనీ ఈ సంగతులు మీతో చెప్పాను.
\s5
\v 12 నేను చేయమని ఆజ్ఞాపిస్తున్నది ఇదే. నేను మిమ్మల్ని ప్రేమించినట్టుగానే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి."
\p
\v 13 "తన స్నేహితుల కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టే ఒక వ్యక్తి ప్రేమ కన్నా మించిన ప్రేమ ఏదీ లేదు.
\s5
\v 14 నా ఆజ్ఞల్ని పాటించడం మాత్రమే కాదు, వాటిని అనుసరిస్తూ జీవిస్తే మీరే నా స్నేహితులు."
\p
\v 15 "ఇకపై మిమ్మల్ని దాసులు అని పిలవను. దాసులకి యజమానులు చేసేది ఏమీ తెలియదు. కాబట్టి అతడు అర్ధం చేసుకోలేడు. ఇప్పుడు మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తాను. ఎందుకంటే నా తండ్రి చెప్పిన వాటన్నిటినీ నేను మీకు తెలియజేశానని మీకు తెలుసు. కాబట్టి మీరు అన్నీ అర్థం చేసుకోగలరు.
\s5
\v 16 నా శిష్యులు కావాలని మీరు కోరుకోలేదు, నేనే మిమ్మల్ని ఎంచుకున్నాను. మీరు వెళ్లి ఫలించి అభివృద్ధి చెందాలనీ, మీ ఫలాలు ఎప్పటికీ నిలిచి ఉండాలనీ నేనే మిమ్మల్ని ఎంచుకొని నియమించాను. అందువల్ల నా అధికారాన్ని ఉపయోగించి నా తండ్రి పేరు మీద ఏమడిగినా ఆయన మీకు చేస్తాడు.
\v 17 ఇది మీరు చేయాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. మీరు ఒకళ్ళ నొకళ్ళు ప్రేమించుకోవాలి."
\s5
\p
\v 18 "లోకం ఒకవేళ మిమ్మల్ని ద్వేషిస్తే, మీకన్నా ముందు అది నన్ను ద్వేషించింది అని తెలుసుకోండి.
\v 19 మీరు ఈ లోకానికి చెందిన అవిశ్వాసులైతే మట్టుకు ఈ లోకం మిమ్మల్ని స్వంత వాళ్ళలాగా ప్రేమిస్తుంది. అప్పుడు మీరు వాళ్ళు ప్రేమించేదాన్నే ప్రేమిస్తారు, వాళ్ళు చేసేదే మీరూ చేస్తారు. అయితే మీరు లోకానికి చెందిన వాళ్ళలాగా ఉండొద్దు. నేను వాళ్ళలోనుండి మిమ్మల్ని బయటికి తెచ్చాను. అందుకే లోకంలో ఉన్న అవిశ్వాసులు మిమ్మల్ని ద్వేషిస్తారు."
\s5
\p
\v 20 "దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు అని నేను చెప్పానని గుర్తు పెట్టుకోండి. వాళ్ళు నన్ను హింసించారంటే మిమ్మల్ని కూడా తప్పకుండా హింసిస్తారని తెలుసుకోండి. వాళ్ళలో ఎవరైనా నా బోధలు విని వాటిని పాటిస్తే వాళ్ళు మీ బోధలు కూడా విని వాటిని కూడా పాటిస్తారు.
\v 21 నన్ను ప్రేమించిన తండ్రి వాళ్లకి తెలీదు. మీరు నాకు ప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి ఈ లోకంలోని అవిశ్వాసులు మీ పట్ల భయంకరంగా ప్రవర్తిస్తారు.
\v 22 ఒక వేళ నేను వచ్చి దేవుని సందేశాన్ని వాళ్లకి తెలియ జేయక పోయి ఉంటే నన్ను తిరస్కరించిన దోషారోపణ వాళ్ళపై ఉండేది కాదు. ఇప్పుడు నేను వచ్చి దేవుని సందేశాన్ని వాళ్లకి తెలియజేశాను కాబట్టి వాళ్ళ పాపానికి క్షమాపణ లేదు.
\s5
\v 23 నన్నెవరైతే ద్వేషిస్తారో వాళ్ళు నా తండ్రిని కూడా ద్వేషిస్తారు.
\v 24 నేను వారి మధ్యలో ఎవ్వరూ, ఎప్పుడూ చేయని పనులూ, నా శక్తిని నిరూపించే పనులూ చేయకపోతే వాళ్లకి పాపం ఉండేది కాదు. అయితే ఇప్పుడు వాళ్ళు నన్ను చూశారు, నన్ను ద్వేషించారు, నా తండ్రిని కూడా ద్వేషించారు.
\v 25 వాళ్ళు నన్ను అకారణంగా ద్వేషించారు అని ధర్మశాస్త్ర గ్రంథంలో రాసిన మాటలు ఇప్పుడు నెరవేరాయి."
\s5
\p
\v 26 "తండ్రి దగ్గర నుండి వచ్చిన సహాయకుణ్ణి నేను పంపినప్పుడు ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. ఆయన ఆత్మ రూపంలో ఉండి దేవుని గురించిన, నా గురించిన వాస్తవాలను తెలియజేస్తాడు. ప్రతివాళ్లకీ నేనెవరినో చెప్తాడు, నేనేమి చేశానో వాటిని అందరికీ చూపిస్తాడు.
\v 27 నేను ఉపదేశించడం, అద్భుతాలు చేయడం మొదలు పెట్టిన నాటినుండి ఇంతకాలం నాతోబాటు ఉన్నారు కాబట్టి నా గురించి మీరు తెలుసుకున్న విషయాలను మీరు కూడా ప్రతి ఒక్కరికీ తప్పకుండా చెప్పాలి."
\s5
\c 16
\p
\v 1 "మీరు తడబడకుండా అపనమ్మకం లేకుండా ఉండాలని మీరు ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి మీకు ముందుగానే చెప్పాను.
\v 2 కష్టకాలం ముందుంది. సమాజ మందిరాలలో ఆరాధించకుండా మీ శత్రువులు మిమ్మల్ని అడ్డుకుంటారు. ఏది ఏమైనా ఏదో కీడు మాత్రం జరుగుతుంది. వాళ్ళు మిమ్మల్ని చంపి దేవుని కోసం గొప్ప పనులు చేస్తున్నామని అనుకునే రోజులు వస్తాయి.
\s5
\v 3 వాళ్లకి నిజంగా నేను ఎవరో, నా తండ్రి ఎవరో తెలియదు కాబట్టే ఇలాంటి పనులు చేస్తారు.
\v 4 ఇవి జరిగే ఆ కష్టకాలం వచ్చినప్పుడు ఈ విషయాలను మీకు ముందుగానే చెప్పానని మీరు గుర్తు చేసుకుంటారని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఈ సంగతులు ఆరంభంలో ఎందుకు చెప్పలేదంటే అప్పుడు మీతో పాటు నేనూ ఉన్నాను."
\s5
\p
\v 5 "ఇప్పుడు నేను తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను. ఆయనే నన్ను ఈ లోకానికి పంపాడు. "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?" అని మీలో ఎవరూ నన్ను అడగడం లేదు.
\v 6 ఈ విషయాలు చెప్పినందుకు ఇప్పుడు మీరు విచారంగా ఉన్నారు.
\v 7 నేను వెళ్ళిపోవడం మీకు నిజంగా మంచిది. నేను వెళ్ళకపోతే, మిమ్మల్ని ఆదరించే సహాయకుడు రాడు. నేను వెళ్తే ఆయన్ని మీ దగ్గరికి పంపిస్తాను.
\s5
\v 8 సహాయకుడు వచ్చినప్పుడు తాము చేసిన పాపాల గురించి ఆయన మనుషుల్ని ఒప్పింప జేస్తాడు. మనుషులు దేవుని మంచితనం స్థాయిని అందుకోలేరని తెలియజేస్తాడు. మనుషులు చేయకూడదని దేవుడు ఆజ్ఞాపించిన వాటిని వాళ్ళు చేయడం వల్ల వాళ్లకి దేవుడు తీర్పు తీరుస్తాడని హెచ్చరిస్తాడు.
\v 9 వాళ్ళు నన్ను నమ్మకపోవడమే వాళ్ళు చేసిన పెద్ద పాపం అని ఆయన ప్రజలకు తెలియజేస్తాడు.
\v 10 నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను కాబట్టీ ఇంకెంతో కాలం నన్ను మీరు చూడలేరు కాబట్టీ నేను నిజంగా నీతిమంతుణ్ణి అని మీరు తెలుసుకుంటారని ఆయన తెలియచేస్తాడు."
\p
\v 11 "దేవుడు ఇప్పటికే లోకాన్ని ఏలే సాతానుని శిక్షించడానికి నిర్ణయం తీసుకున్నాడనే వాస్తవాన్ని ఆయన ప్రజలకు తెలియజేస్తాడు. అదే విధంగా ఒకానొక రోజు ఆయనకు చెందని వారిని కూడా ఇలాగే శిక్షిస్తాడు."
\s5
\p
\v 12 "నేను మీతో చెప్పవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తే ఆ విషయాలు తెలుసుకుని మీరు సంతోషంగా జీవించలేరు.
\v 13 సత్యాత్మ వచ్చినప్పుడు మీరు తెలుసుకోవలసిన సర్వ సత్యంలోకి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన తన స్వంత అధికారంతో తనంతట తానే మాట్లాడడు. ఆయన విన్నదంతా మీకు తెలియజేస్తాడు. అంతే కాదు, రాబోయే కాలంలో జరిగే సంగతులు కూడా మీకు తెలియజేస్తాడు.
\v 14 నేనెవరినో, ఏమి చేశానో మీకు తెలియచేయడం ద్వారా ఆత్మ నన్ను మహిమపరుస్తాడు. నానుండి విన్నదంతా, ఆయన మీకు వివరిస్తాడు.
\s5
\v 15 నా తండ్రికి చెందినవన్నీ నావే. అందుకే నేను చెప్పాను, ఆత్మ నానుండి పొందినవన్నీ మీకు వివరిస్తాడు."
\p
\v 16 "కొంత కాలం తరవాత మీరు నన్ను చూడరు. మరి కొంతకాలం అయ్యాక మీరు మళ్ళీ నన్ను చూస్తారు."
\s5
\v 17 కాబట్టి ఆయన శిష్యులలో కొంతమంది ఒకళ్ళతో ఒకళ్ళు, "కొంత కాలం తరవాత మీరు నన్ను చూడరు అనీ, మరి కొంత కాలం తరవాత మీరు నన్ను మళ్ళీ చూస్తారు, అనీ, నేను తిరిగి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను అనీ అంటున్నాడు.
\v 18 ఇలా యేసు మనతో చెప్పిన మాటల అర్ధం ఏమిటో" అని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారు.
\s5
\p
\v 19 వాళ్ళు ఎన్నో ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నారని యేసు గమనించాడు. కాబట్టి ఆయన తన శిష్యులతో, "దాని అర్థం గురించి ఎందుకు తర్జనభర్జనలు పడుతున్నారు? నేను, కొంతకాలం తరవాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలం తరవాత నన్ను మళ్ళీ చూస్తారు, అని చెప్పాను.
\v 20 నేను నిజం చెప్తున్నాను, మీరు ఏడుస్తారు, దుఖపడతారు. ఈ లోక సంబంధులు మాత్రం సంతోషిస్తారు. మీరు గొప్ప దుఖం గుండా వెళ్తారు. కానీ మీ దుఖం సంతోషంగా మారుతుంది.
\v 21 ఒక స్త్రీ బిడ్డను కనే సమయంలో పురిటి నొప్పులతో ఎలా వేదన అనుభవిస్తుందో, ఇది కూడా అలాగే ఉంటుంది. అయితే బిడ్డ పుట్టగానే, బిడ్డ లోకంలోకి వచ్చిన ఆనందంలో ఆ స్త్రీ తాను పడ్డ బాధ అంతా మర్చిపోతుంది.
\s5
\v 22 ఆమెలాగే మీకు ఇప్పుడు దుఖం కలుగుతుంది, కానీ మళ్ళీ నేను మిమ్మల్ని చూస్తాను. అప్పుడు దేవుడు మీకు గొప్ప ఆనందాన్ని కలిగిస్తాడు, ఆ ఆనందాన్ని మీనుండి ఎవరూ తీసివేయలేరు."
\p
\v 23 "ఆ రోజున నన్ను అడగడానికి మీకు ఇంకా ప్రశ్నలు ఏవీ ఉండవు. నేను కచ్చితంగా మీతో చెప్తున్నాను, నాలో మీరున్నందువల్ల మీరు నా పేరు మీద తండ్రిని ఏది అడిగినా అది ఆయన మీకు ఇస్తాడు.
\v 24 ఇంతవరకూ మీరు నా పేరు మీద అలా ఏమీ అడగలేదు. అడగండి, మీరు పొందుతారు. దేవుడు మీ ఆనందం సంపూర్ణం అయ్యేలా గొప్ప ఆనందం మీకు దయచేస్తాడు."
\s5
\p
\v 25 "ఉపమాన శైలిలో నేనిప్పటి వరకూ ఈ విషయాలన్నీ మాట్లాడుతూ వచ్చాను గానీ, ఇక కొద్ది కాలంలో ఈ రకమైన భాష వాడను. నా తండ్రి గురించి అందరికీ అర్థమయ్యే భాషలో స్పష్టంగా మీకు చెప్తాను.
\s5
\v 26 ఆ సమయంలో మీ మనవులన్నిటినీ నా పేరు మీద దేవుని ఉద్దేశ ప్రకారం దేవునికి తెలియజేయండి. మీ అవసరాలు తీర్చమని నేను తండ్రిని వేడుకోవలసిన అవసరం లేదు.
\v 27 ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను తండ్రి దగ్గరనుండి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు.
\v 28 నేను తండ్రి దగ్గర నుండి వచ్చాను. నేను ఈ లోకంలోకి ప్రవేశించాను, తిరిగి నా తండ్రి దగ్గరకు తొందరలోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను" అన్నాడు.
\s5
\p
\v 29 అప్పుడు ఆయన శిష్యులు, "ఇన్నాళ్ళకు అర్ధం కాని భాషలో కాకుండా స్పష్టంగా మాతో మాట్లాడుతున్నావు.
\v 30 నీకు అన్నీ తెలుసని ఇప్పటికి మాకు అర్ధం అయ్యింది. ఇంకా మేము ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదు. దీనివల్లే నీవు దేవుని దగ్గర నుండి వచ్చావని మేము నమ్ముతున్నాము" అన్నారు.
\p
\v 31 యేసు వారితో, "మీరు ఇప్పుడు నమ్ముతున్నారా?
\s5
\v 32 చూడండి, ఇతరులు మిమ్మల్ని అన్ని చోట్లకు చెదరగొట్టేచెల్లా చెదరు చేసే సమయం వస్తుంది. ప్రతి ఒక్కరూ చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతారు. నన్ను ఒంటరిగా వదిలేస్తారు. అయినప్పటికీ నేను ఒంటరిగా ఉండను. నా తండ్రి నాతో ఎప్పుడూ ఉంటాడు.
\v 33 నాతో మీకున్న సంబంధం కారణంగా మీరు మనశ్శాంతిగా ఉండాలని ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు శ్రమలు, విచారాలే ఉంటాయి, అయిన సరే, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించాను" అన్నాడు.
\s5
\c 17
\p
\v 1 యేసు ఈ సంగతులన్నీ చెప్పిన తరవాత ఆకాశం వైపు చూసి, "తండ్రీ నేనెవరినో, ఏమి చేశానో, నువ్వు అందరికీ వెల్లడి చేయాల్సిన సమయం వచ్చేసింది. సమస్తం చేయగలిగిన గొప్ప రాజువైన నీవు ఎవరివో, ప్రతి ఒక్కరికీ నీ కుమారుడ నైన నేను వెల్లడి చేయగలిగేలా దీనిని జరిగించు.
\v 2 నువ్వు నీ కుమారునికి అప్పగించిన వాళ్ళందరికీ శాశ్వత జీవం ఇచ్చేలా మనుషులందరి మీదా ఆయనకు అధికారం ఇచ్చావు."
\s5
\p
\v 3 "నువ్వు మాత్రమే ఏకైక సత్య దేవుడవని నీ గురించి తెలుసుకోవడం, మెస్సీయ అయిన యేసు అనే నన్ను నీవే ఈ లోకంలోకి పంపావని తెలుసుకోవడమే శాశ్వత జీవం.
\v 4 నీ గురించి తెలియజెప్పడానికి అన్ని రకాల మనుషుల్నీ నీ దగ్గరికి తెచ్చాను. నువ్వు నాకప్పగించిన పనిని ఈ విధంగా చేసి పూర్తి చేశాను.
\v 5 తండ్రీ, మనం ఈ లోకాన్ని సృష్టించక ముందు నాకు ఎలాంటి మహిమ ఉండేదో, అలాంటి మహిమనే ఇప్పుడు నీ సమక్షానికి నన్ను తీసుకెళ్ళినప్పుడు నాకు మళ్ళీ కలిగించు."
\s5
\p
\v 6 "లోకంలో నుండి నీవు ఎంపిక చేసి నాకప్పగించిన వాళ్ళందరికీ నిజంగా నీవెవరివో, నీవెలా ఉంటావో తెలియజేశాను. వాళ్ళు నీ వాళ్ళే. నువ్వే వాళ్ళని నాకిచ్చావు. వాళ్ళు నువ్వు చెప్పిన వాక్కును నమ్మి దానికి లోబడ్డారు.
\v 7 వీళ్ళు నానుండి విన్న మాటలన్నీ నీనుండే వచ్చాయని ఇప్పుడు తెలుసుకున్నారు.
\v 8 నువ్వు నాకిచ్చిన సందేశాన్ని నేను వాళ్ళకిచ్చాను. దాన్ని వాళ్ళు అంగీకరించారు. ఇప్పుడు నీ దగ్గరనుండి నేను వచ్చాననీ, నువ్వే నన్ను పంపావనీ, వాళ్ళు కచ్చితంగా తెలుసుకున్నారు."
\s5
\p
\v 9 "నేను వాళ్ళ గురించి ప్రార్ధిస్తున్నాను. ఈ లోకానికి సంబంధించిన వాళ్ళ కోసం, నిన్ను ఎప్పుడూ వ్యతిరేకిస్తున్న వాళ్ళ కోసం, నేను ప్రార్థించడం లేదు. నువ్వు నాకప్పగించిన వాళ్ళ కోసమే ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నీకు చెందినవారు.
\v 10 నావన్నీ నీవి, నీవన్నీ నావి. నేనెవరో వాళ్లకు తెలుసు. నేనెవరినో, నన్ను గురించిన వాస్తవాన్ని వాళ్ళు యథార్థంగా చెప్తారు."
\p
\v 11 నేనిక ఎంతో కాలం ఈ లోకంలో ఉండను. వాళ్ళు ఈ లోకంలో ఉంటారు. నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడవైన తండ్రీ, వాళ్ళని క్షేమంగా ఉంచు. నువ్వు నాకిచ్చిన అదే శక్తితో మనం ఏకంగా ఉన్నట్టే వాళ్ళూ కలిసి ఐక్యతగా ఉండేలా వాళ్ళని కాపాడు."
\s5
\p
\v 12 "నేను వారితో ఉన్నప్పుడు నువ్వు నాకిచ్చిన శక్తితో వాళ్ళని క్షేమంగా కాపాడాను. వాళ్ళలో ఒక్కడూ తప్పిపోలేదు. అయితే లేఖనాల్లో ముందుగా చెప్పినట్టుగా నాశనానికి తగినవాడు తప్ప ఇంకెవరూ తప్పిపోలేదు."
\p
\v 13 "ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా సంపూర్ణమైన ఆనందాన్ని వాళ్ళకీ ఇవ్వవచ్చని లోకంలో ఉండగానే ఈ సంగతులు చెప్తున్నాను.
\v 14 నీ సందేశాన్ని వాళ్లకి చెప్పాను. లోకం వాళ్ళను ద్వేషించి నీ సందేశాన్ని వినలేదు. నన్ను ద్వేషించినట్టే లోకం వాళ్ళను కూడా ద్వేషించింది. వాళ్ళు కూడా ఈ లోకానికి చెందినవారు కాదు, ఎందుకంటే వారికి ఇంకొక ఇల్లు ఉంది."
\s5
\p
\v 15 "వాళ్ళను ఈ లోకంలోనుండి బయటికి తీసుకెళ్ళమని నేను ప్రార్థన చేయడం లేదు. దుష్టుడు తలపెట్టే హాని నుండి వాళ్ళని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను."
\p
\v 16 "నేను ఈ లోకానికి చెందిన వాణ్ని కానట్టే వాళ్ళు కూడా ఈ లోకానికి చెందిన వాళ్ళు కారు.
\v 17 నా శిష్యులు సంపూర్ణంగా నీకు చెందిన వాళ్ళుగా ఉండేలా, ఏది సత్యమో దాన్ని అనుసరించి జీవించేలా వాళ్ళని ప్రత్యేకపరచు. నీ సందేశమే సత్యం."
\s5
\p
\v 18 "నువ్వు నన్ను ఈ లోకంలోకి పంపినట్టుగానే నేనూ వీళ్ళని లోకంలోకి పంపుతున్నాను.
\v 19 వాళ్ళ కోసం నన్ను నేను సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను. అలా చేయడం వల్ల వాళ్ళు కూడా తమను తాము నీకు సమర్పించుకుంటారు."
\s5
\p
\v 20 "నేను ఇక్కడ ఉన్న శిష్యుల గురించే కాదు, వాళ్ళు చెప్పిన సందేశం విని నా మీద విశ్వాసముంచిన వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాను.
\v 21 మనం ఐక్యంగా ఉన్నట్టుగా వాళ్ళంతా కూడా ఐక్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. తండ్రీ, నువ్వు నాతో, నేను నీతో ఐక్యంగా ఉన్నట్టు వాళ్ళు కూడా మనతో ఐక్యంగా ఉండాలి. ఇది లోకం గమనించినప్పుడు నన్ను పంపింది నువ్వేనని తెలుసుకుంటుంది."
\s5
\p
\v 22 "నేనెవరినో వాళ్లకి చూపించాను, నేనేమి చేశానో వాళ్ళు చూశారు. మనం ఐక్యంగా ఉన్నట్టే వాళ్ళు కూడా ఐక్యంగా ఉండాలని నేను వాళ్ళకి ఇలా బోధించాను.
\v 23 వాళ్ళలో నేను, నాలో నువ్వు ఐక్యంగా ఉన్నాం. ఈ కారణంగా వాళ్ళు పరిపూర్ణంగా ఐక్యంగా ఉండటం వల్ల నువ్వు నన్ను పంపావనీ, నువ్వు నన్ను ప్రేమించినట్టే వాళ్ళని కూడా ప్రేమించావనీ, అవిశ్వాసులు తెలుసుకుంటారు."
\s5
\p
\v 24 "తండ్రీ, నేనెక్కడ ఉంటానో నువ్వు నాకప్పగించిన వారు కూడా ఎప్పుడూ నాతోబాటు అక్కడ ఉండాలనీ, నువ్వు నాకీయబోయే వైభవాన్నీ, ఠీవినీ వాళ్ళూ చూడాలని నేను ఆశ పడుతున్నాను. ఎందుకంటే భూమికి పునాది వేయక ముందునుంచే నువ్వు నన్ను ప్రేమించావు."
\s5
\p
\v 25 "నీతి న్యాయాలు కలిగిన తండ్రీ, లోకం నిన్ను తెలుసుకోలేదు, కానీ నువ్వు నాకు తెలుసు. ఇప్పుడు నాతో ఉన్న వీళ్ళకి నువ్వు నన్ను పంపావని తెలుసు.
\v 26 నువ్వు నన్ను ప్రేమించినట్టుగానే వాళ్ళని కూడా ప్రేమిస్తావని నువ్వెవరివో వాళ్ళు తెలుసుకొనేలా చేశాను. ఇంకా తెలియజేస్తూనే ఉంటాను."
\s5
\c 18
\p
\v 1 యేసు తన ప్రార్థన ముగించాక, ఆయనా ఆయన శిష్యులూ కిద్రోను లోయను దాటారు. ఆ లోయ అవతల పక్కన గుబురుగా పెరిగిన ఒలీవ తోటలోకి వాళ్ళు వెళ్ళారు.
\p
\v 2 యేసును శత్రువులకు అప్పగించబోతున్న యూదాకు ఆ ప్రదేశం కొట్టిన పిండి. ఎందుకంటే యేసు తన శిష్యులతో తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవాడు.
\v 3 కాబట్టి యూదా కొంతమంది రోమా సైనికులనూ, పరిసయ్యులు, ముఖ్య యాజకులు పంపించిన దేవాలయ అధికారులనూ వెంటబెట్టుకొని ఆ తోట దగ్గరికి వచ్చాడు. వాళ్ళు కాగడాలూ, దీపాలూ, ఆయుధాలూ పట్టుకొని వచ్చారు.
\s5
\v 4 యేసు తనకు ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ముందుకు వచ్చి వాళ్ళతో, "మీరెవరి కోసం చూస్తున్నారు?" అని అడిగాడు.
\v 5 వాళ్ళు, "నజరేతు వాడైన యేసు కోసం" అన్నారు. యేసు వాళ్ళతో, "నేనే ఆ మనిషిని" అన్నాడు. (యేసును పట్టించి ఇచ్చే యూదా వాళ్ళతో పాటు నిలబడి ఉన్నాడు).
\s5
\v 6 యేసు వాళ్ళతో, "నేనే ఆయన్ని" అనగానే ఆయన శక్తి చూసి వాళ్ళు వెనక్కి తూలి నేల మీద పడిపోయారు.
\v 7 కాబట్టి ఆయన మళ్ళీ వాళ్ళను "మీరు ఎవరి కోసం చూస్తున్నారు?" అని అడిగాడు. వాళ్ళు, "నజరేతు వాడైన యేసు కోసం" అన్నారు.
\s5
\v 8 యేసు వాళ్ళతో, "నేనే ఆయన్ని అని మీతో చెప్పాను. మీరు నా కోసమే చూస్తూ ఉంటే మిగిలిన వారిని వెళ్ళనివ్వండి" అన్నాడు.
\v 9 "నువ్వు ఇచ్చిన వారిలో ఏ ఒక్కరినీ నేను పోగొట్టుకోలేదు" అని ఆయన చేసిన ప్రార్థన నెరవేరడానికి ఆయన ఈ మాటలు అన్నాడు.
\s5
\p
\v 10 అప్పుడు సీమోను పేతురు తన ఒరలో ఉన్న చిన్న కత్తిని బయటికి లాగి ప్రధాన యాజకుడి పనివాడి కుడి చెవి నరికాడు. అతని పేరు మల్కు.
\v 11 యేసు పేతురుతో, "కత్తిని ఒరలో పెట్టు. తండ్రి నాకోసం ఉద్దేశించిన ప్రకారంగానే నేను హింసలు పొందుతాను" అన్నాడు.
\s5
\p
\v 12 అప్పుడు సేనాధిపతితో కలిసి ఆ సైనికుల గుంపు, కొందరు దేవాలయ అధికారులు యేసుని చుట్టుముట్టి, ఆయన్ని బంధించారు.
\v 13 అప్పుడు వారు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయప మామ అయిన అన్న దగ్గరికి ఆయన్ని తీసుకు వెళ్ళారు.
\v 14 ప్రజలందరూ చనిపోవడం కంటే ప్రజలందరి కోసం ఒక్క మనిషి చనిపోవడం మంచిదని మిగిలిన నాయకులకు ఆలోచన చెప్పినవాడే ఈ కయప.
\s5
\p
\v 15 సీమోను పేతురు, ఇంకొక శిష్యుడు యేసును వెంబడించారు. ఇంకొక శిష్యుడు ప్రధాన యాజకుడికి పరిచయం ఉన్నవాడు కాబట్టి సైనికులు యేసును ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోకి తీసుకు వెళ్ళేటప్పుడు వాళ్ళతో కూడా వెళ్ళడానికి అతనికి అనుమతి దొరికింది.
\v 16 పేతురు గుమ్మం ముందే ఆగిపోవలసి వచ్చింది. కాబట్టి ఆ మరొక శిష్యుడు మళ్ళీ బయటికి వెళ్లి గుమ్మం దగ్గర కాపలా కాస్తున్న పనిపిల్లతో మాట్లాడాడు. అప్పుడు ఆమె పేతురును లోపలికి రానిచ్చింది.
\s5
\v 17 ఆ పనిపిల్ల పేతురుతో, "వాళ్ళు బంధించిన ఆ మనిషి శిష్యులలో నువ్వూ ఒకడివి కదా?" అని అడిగింది. అప్పుడు అతడు, "కాదు, నేను కాదు" అన్నాడు.
\p
\v 18 బాగా చలిగా ఉండడం వల్ల ప్రధాన యాజకుని సేవకులూ, దేవాలయ అధికారులూ, చలిమంట వేసుకుని చుట్టూ నిలబడి చలి కాచుకుంటున్నారు. పేతురు కూడా వాళ్ళతో ఉండి చలి కాచుకుంటున్నాడు.
\s5
\p
\v 19 ప్రధాన యాజకుడు యేసును ఆయన శిష్యుల గురించీ, ఆయన వారికి చేసే ఉపదేశాల గురించీ ప్రశ్నలు వేశాడు.
\v 20 యేసు, "నేను ప్రతి ఒక్కరితో బహిరంగంగానే మాట్లాడాను, నేనేదీ రహస్యంగా మాట్లాడలేదు. నేను ఎప్పుడైనా సరే, యూదులు సమావేశమయ్యే సమాజమందిరాల్లో, దేవాలయంలో, ఎక్కడైతే మనుషులు పోగవుతారో అక్కడే మాట్లాడాను.
\v 21 నన్ను ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు? నేనేమి చెప్పానో నా ఉపదేశాలు విన్నవారిని అడగండి. నేనేమి చెప్పానో వాళ్లకు తెలుసు" అన్నాడు.
\s5
\p
\v 22 యేసు ఈ విషయాలు మాట్లాడుతూ ఉండగానే ఆయన పక్కన నిలబడిన అధికారులలో ఒకడు తన అరచేతితో ఆయన్ని గట్టిగా కొట్టి, ప్రధాన యాజకునితో అలాగేనా మాట్లాడేది?" అన్నాడు.
\v 23 యేసు అతనితో, "నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే ఆ తప్పు ఏమిటో చెప్పు. కానీ నేను సరిగ్గానే చెప్పి ఉంటే నన్నెందుకు కొడతావు" అన్నాడు.
\v 24 తరవాత అన్న యేసును ప్రధాన యాజకుడైన కయప దగ్గరకి పంపించాడు.
\s5
\p
\v 25 సీమోను పేతురు నిలబడి చలి కాచుకుంటూ ఉన్నాడు. ఇంకో వ్యక్తి అతనితో, "వాళ్ళు అరెస్ట్ చేసిన ఆ మనిషి శిష్యులలో వాడివే కదా నువ్వు?" అని అడిగాడు. పేతురు, "నేను కాదు" అన్నాడు.
\v 26 ప్రధాన యాజకుని సేవకుల్లో ఒకడూ, పేతురు ఎవరి చెవి నరికాడో అతని బంధువూ అయిన ఆ సేవకుడు పేతురుతో, "కచ్చితంగా ఆ మనిషిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ ఒలీవ తోట దగ్గర ఆ మనిషితో నిన్ను చూశాను. అవునా, కాదా?" అన్నాడు.
\v 27 పేతురు మళ్ళీ ఒప్పుకోకుండా దానిని ఖండించాడు. వెంటనే కోడి కూసింది.
\s5
\p
\v 28 తరవాత సైనికులు యేసును కయప దగ్గరనుండి రోమా గవర్నర్ అయిన పిలాతు రాజమందిరానికి తీసుకెళ్ళారు. అది తెల్లవారుతున్న సమయం. పిలాతు యూదుడు కాదు గనక యేసు మీద నేరారోపణ చేస్తున్నవారు ఒకవేళ తాము రోమీయుడైన అధికారి రాజమందిరం లోకి వెళ్తే మైల పడి పస్కా పండుగను ఆచరించలేక పోతామేమోనని భావించారు. కాబట్టి వాళ్ళు లోపలి వెళ్ళలేదు.
\v 29 కాబట్టి పిలాతు బయటికి వచ్చి వాళ్ళతో మాట్లాడాడు. అతడు, "ఈ మనిషి పై ఏ నేరాన్ని మోపుతున్నారు?" అని అడిగాడు.
\v 30 వాళ్ళు, "ఇతడు నేరస్తుడు కాకపోతే నీ దగ్గరికి తీసుకు వచ్చే వాళ్ళం కాదు గదా?" అన్నారు.
\s5
\v 31 అప్పుడు పిలాతు వాళ్ళతో, "అతణ్ణి మీరే తీసుకుపోయి మీ ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చుకోండి" అన్నాడు. అప్పుడు ఆ యూదు నాయకులు, "మేము అతనికి మరణ శిక్ష వేయాలనుకుంటున్నాం. కానీ ఆ పని చేయడానికి మీ రోమా చట్టాలు అడ్డుపడుతున్నాయి" అన్నారు.
\v 32 యేసు తాను ఏ విధంగా చనిపోతానని చెప్పాడో దాన్ని నిజం చేయడానికే వారు అలా చెప్పారు.
\s5
\p
\v 33 పిలాతు మళ్ళీ తన రాజమందిరంలోకి వెళ్లి, యేసును రప్పించి ఆయనతో, "నువ్వు యూదులకు రాజువా?" అని అడిగాడు.
\v 34 యేసు, "ఈ ప్రశ్న నువ్వు తెలుసుకోవాలని అడుగుతున్నావా లేకపోతే ఈ ప్రశ్న ఎవరైనా నిన్ను అడగమన్నారా?" అన్నాడు.
\v 35 దానికి పిలాతు, "నాకేం పని? నేను యూదుడినా ఏంటి? మీ స్వజాతి ప్రజలు, మీ ముఖ్య యాజకులు నిన్ను నాకు అప్పగించారు. నీవేం తప్పు చేశావు?" అని అడిగాడు.
\s5
\p
\v 36 యేసు అతనితో, "నా రాజ్యం ఈ లోకానికి సంబంధించింది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించిందే అయితే నేను ఈ యూదుల చేతిలో పడకుండా నా సేవకులు పోరాడేవాళ్ళు. కానీ నా రాజ్యం ఈ లోకసంబంధమైనది కాదు" అని జవాబిచ్చాడు.
\v 37 అప్పుడు పిలాతు యేసుతో, "అయితే నువ్వు రాజువా?" అన్నాడు. యేసు, "అవును, నేను రాజునని నువ్వంటున్నది నిజమే. నేను రాజును కావడానికే పుట్టాను. దేవుని గురించిన సత్యం చెప్పడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో వాళ్ళే నేను చెప్పేదాని మీద ఆసక్తి చూపుతారు."
\s5
\p
\v 38 పిలాతు ఆయనతో, "సత్యం అంటే ఏమిటో ఎవరికైనా ఎలా తెలుస్తుంది?" అన్నాడు.
\p పిలాతు ఆ ప్రశ్న అడిగి బయటికి వెళ్లి యూదీయ నాయకులతో మళ్ళీ మాట్లాడాడు. అతడు వాళ్ళతో, "అతడు ఏ చట్టాన్నీ ఉల్లంఘించలేదు.
\v 39 ఎలాగైనా మీ యూదులకు ప్రతి సంవత్సరం పస్కా పండగ సమయంలో జైలు నుండి ఒకరిని విడుదల చేసే ఆనవాయితీ ఉంది. కాబట్టి మీరు యూదుల రాజు అని చెప్తున్న ఇతన్ని మీకోసం విడుదల చేయమంటారా?" అని అడిగాడు.
\v 40 వాళ్ళు "వద్దు, ఈ మనిషిని విడుదల చేయొద్దు. బరబ్బాని విడుదల చేయండి" అని గట్టిగా కేకలు వేశారు. బరబ్బా ఒక తిరుగుబాటుదారుడు.
\s5
\c 19
\p
\v 1 అప్పుడు పిలాతు యేసును పిలిపించాడు. తన సైనికులచేత ఆయన్ని కొరడాలతో కొట్టించాడు.
\v 2 సైనికులు ముళ్ళ తీగెను కిరీటం లాగా అల్లి దానిని ఆయన తల మీద పెట్టారు. ఆయనకు లేత ఎరుపు రంగు అంగీని తొడిగించారు. యూదుల రాజా అని పిలుస్తూ ఆయన్ని ఎగతాళి చేయడం కోసమే ఇవన్నీ చేశారు.
\v 3 వాళ్ళు ఆయన్ని హేళన చేస్తూ "యూదుల రాజా, జయహో" అని చెప్పి ఆయన్ని మళ్ళీ మళ్ళీ కొట్టారు.
\s5
\p
\v 4 పిలాతు మళ్ళీ బయటికి వచ్చి ఆ ప్రజలతో, "చూడండి, ఈ మనిషిని శిక్షించడానికి నాకు ఏ కారణం కనబడలేదని మీకు తెలిసేలా మీ దగ్గరికి తీసుకు వస్తున్నాను" అన్నాడు.
\v 5 కాబట్టి యేసు ముళ్ళ కిరీటం, లేత ఎరుపు రంగు అంగీ వేసుకొని బయటికి వచ్చాడు. పిలాతు వారితో, "ఇదిగో ఈ మనిషి!" అన్నాడు.
\p
\v 6 అప్పుడు ముఖ్య యాజకులూ, దేవాలయ అధికారులూ ఆయన్ని చూసి, సిలువ వెయ్యండి! సిలువ వెయ్యండి! అని కేకలు వేశారు. పిలాతు వారితో, "నాకైతే శిక్షించడానికి ఇతనిలో ఏకారణం కనబడడం లేదు. కాబట్టి మీరే తీసుకువెళ్ళి సిలువ వేసుకోండి" అన్నాడు.
\s5
\v 7 యూదు నాయకులు పిలాతుతో, "ఇతడు తనను దేవుని కుమారుడుగా ప్రకటించుకున్నాడు. కాబట్టి మాకు ఒక కచ్చితమైన చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం అతడు చావవలసిందే" అన్నారు.
\p
\v 8 పిలాతు ఇది విని ఒకవేళ యేసును చంపమని తన సైనికులకు ఆజ్ఞాపిస్తే తనకేమి జరుగుతుందో అని భయపడ్డాడు.
\v 9 మళ్ళీ ఇంకొకసారి అతడు రాజమందిరంలోకి వెళ్లి సైనికులను పిలిచి యేసును లోపలి తీసుకు రమ్మని చెప్పాడు. అప్పుడు అతడు యేసుతో "నువ్వు ఎక్కడినుండి వచ్చావు?" అని అడిగాడు. యేసు అతనికి జవాబు చెప్పలేదు.
\s5
\v 10 అప్పుడు పిలాతు ఆయనతో, "నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేసే అధికారం, సిలువ వేసే అధికారం కూడా నాకు ఉన్నాయని నీకు తెలియదా?" అన్నాడు.
\v 11 యేసు అతనితో, "దేవుడు నీకు అధికారం ఇస్తే తప్ప నామీద నీకు ఏమాత్రం అధికారం లేదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వాడికి ఇంకా ఎక్కువ పాపం చుట్టుకుంటుంది" అన్నాడు.
\s5
\p
\v 12 ఆ క్షణం నుండీ పిలాతు యేసును విడుదల చేయడానికి ఇంకా ఎక్కువగా ప్రయత్నం చేశాడు. దానికి యూదీయ నాయకులు, "నువ్వు గనక ఈ మనిషిని విడుదల చేస్తే నువ్వు రోమా చక్రవర్తి కైసరుకు స్నేహితుడివి కాదు. ఎవరైనా తనకు తానే రాజుగా చేసుకొనేవాడు కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడినట్టే" అని కేకలు వేశారు.
\v 13 పిలాతు ఆ కేకలు విని యేసును బయటికి తీసుకొచ్చి, తీర్పులు ప్రకటించే న్యాయపీఠం మీద యేసుకు ఎదురుగా కూర్చున్నాడు. ఆ స్థలాన్ని హెబ్రీ భాషలో "గబ్బతా" అంటారు. ఆ మాటకు "రాళ్ళు పరచిన స్థలం" అని అర్థం.
\s5
\p
\v 14 అది పస్కా పండుగకు ముందు రోజైన సిద్ధబాటు రోజు. అది దాదాపు మధ్యాహ్న సమయం. అప్పుడు పిలాతు యూదులతో, "ఇదిగో మీ రాజు" అన్నాడు.
\v 15 వారు, "అతణ్ణి చంపెయ్యండి! చంపెయ్యండి! అతణ్ణి సిలువ వేయండి" అని అరిచారు. పిలాతు వారితో, "మీ రాజును సిలువ వేయమంటారా?" అన్నాడు. ముఖ్య యాజకులు, "కైసరు తప్ప మాకు రాజెవ్వరూ లేరు" అని జవాబిచ్చారు.
\v 16 ఆఖరికి అతడు వాళ్ళ ఇష్ట ప్రకారమే చెయ్యడానికి ఒప్పుకుని, యేసును సిలువ వేయమని తన సైనికులతో చెప్పాడు. అప్పుడు సైనికులు యేసును తీసుకెళ్ళిపోయారు.
\s5
\p
\v 17 యేసు తన సిలువ తానే మోసుకుంటూ బయటికి వచ్చి, "కపాల స్థలం" అనే చోటికి వచ్చాడు. ఆ చోటును హెబ్రీ భాషలో "గొల్గొతా" అని పిలుస్తారు.
\v 18 అక్కడ వారు ఆయన్ని సిలువ వేశారు. అదే సమయంలో ఇద్దరు నేరస్తులను కూడా సిలువ వేశారు. వారిద్దరినీ ఇరువైపులా ఉంచి మధ్యలో యేసును సిలువ వేశారు.
\s5
\p
\v 19 పిలాతు, "యూదుల రాజైన నజరేయుడైన యేసు" అని రాయించి ఒక పలకను సిలువకు బిగించమని చెప్పాడు.
\v 20 యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి సమీపంలో ఉంది కాబట్టి చాలామంది యూదులు ఆ రాతను చదివారు. పైగా అది హీబ్రూ, లాటిన్, గ్రీకు అనే మూడు భాషల్లో రాసి ఉంది.
\s5
\v 21 ముఖ్య యాజకులు మళ్ళీ పిలాతు దగ్గరికి వెళ్లి, "యూదులకు రాజు అని రాయకుండా దానికి బదులుగా "ఈ మనిషి తాను యూదుల రాజు అని చెప్పుకున్నాడు" అని రాయాల్సింది" అన్నారు.
\v 22 అప్పుడు పిలాతు, "నేనేమి రాయమని చెప్పానో వాళ్ళు అదే రాశారు, దాన్ని మార్చేది లేదు" అన్నాడు.
\s5
\p
\v 23 యేసును సిలువ వేసిన తరవాత సైనికులు ఆయన బట్టలు నాలుగు భాగాలుగా చేసికుని తలొక భాగం పంచుకున్నారు.
\v 24 ఆయన అంగీని మాత్రం "దీన్ని మధ్యకు చింపకుండా ఎవరు తీసుకోవాలో నిర్ణయించడానికి మనం చీట్లు వేద్దాం" అనుకున్నారు. అలా అనడంతో "వారు నా వస్త్రాలు పంచుకున్నారు, వారు నా అంగీ కోసం చీట్లు వేసుకున్నారు" అని లేఖనాల్లో రాసి ఉన్నది నెరవేరింది. అందుకే సైనికులు ఆ విధంగా చేశారు.
\s5
\p
\v 25 సిలువ దగ్గర యేసు తల్లీ, ఆమె సోదరీ, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ నిలబడి ఉన్నారు.
\v 26 తన తల్లీ, తాను ప్రత్యేకంగా ప్రేమించే తన శిష్యుడైన యోహానూ దగ్గరగా నిలబడి ఉండడం యేసు చూసి, తన తల్లితో, "అమ్మా, ఇదిగో ఇకనుండి నీ కొడుకు" అనీ,
\v 27 ఆ శిష్యుడితో, "ఇదిగో నీ తల్లి" అనీ అన్నాడు. ఆ క్షణం నుండీ ఆ శిష్యుడు ఆమెను తనతోబాటు ఉండడానికి తన ఇంటికి తీసుకెళ్ళాడు.
\s5
\p
\v 28 కొద్దిసేపటి తరవాత దేవుడు తనను చేయమని పంపినవన్నీ సమాప్తం అయ్యాయని యేసుకు తెలుసు కాబట్టి లేఖనాల్లో ముందుగా చెప్పిన చివరి విషయాన్నీ నెరవేర్చడానికి, "నాకు దాహంగా ఉంది!" అన్నాడు.
\v 29 అప్పుడు ఒక సైనికుడు పులిసిన ద్రాక్షరసం కుండలో ఒక స్పాంజి ముంచి దాన్ని ఒక హిస్సోపు చెట్టు బెత్తానికి తగిలించి ఆయన నోటికి అందించాడు.
\v 30 ఆ పులిసిన ద్రాక్షరసాన్ని తాగిన తరవాత యేసు, "సమాప్తం అయ్యింది" అని కేక పెట్టి తలవంచి ప్రాణం విడిచాడు.
\s5
\p
\v 31 అది పస్కా పండగ ముందు రోజైన సిద్ధపాటు రోజు (మరుసటి రోజు యూదులకు చాల ప్రత్యేకమైన విశ్రాంతి దినం). ఆ సెలవు రోజున చనిపోయిన వారి శరీరాలను సిలువ మీదే వదిలి పెట్టడం వాళ్ళ చట్టానికి వ్యతిరేకం కాబట్టి వాళ్ళు పిలాతు దగ్గరికి వెళ్లి ఆ ముగ్గురి కాళ్ళను విరగ్గొడితే తొందరగా చనిపోతారనీ, అప్పుడు వెంటనే ఆ శరీరాలను సిలువ మీదనుండి కిందికి దింపడానికి వీలవుతుందనీ అతణ్ణి అడిగారు.
\v 32 ఆ సైనికులు వెళ్లి యేసుతోబాటు సిలువ వేసిన ఇద్దరు దొంగల కాళ్ళు విరగ్గొట్టారు.
\p
\v 33 వాళ్ళు యేసు దగ్గరికి వచ్చి చూస్తే, ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఆయన కాళ్ళను విరగ్గొట్ట లేదు.
\s5
\v 34 దానికి బదులుగా ఆ సైనికుల్లో ఒకడు ఒక బల్లెంతో ఆయన కుడివైపున డొక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు ఆ శరీరంలో నుండి కారాయి.
\v 35 ఇదంతా ప్రత్యక్షంగా చూసినవాడి సాక్ష్యం సత్యం. సత్యమే చెప్తున్నానని అతనికి తెలుసు. కాబట్టి మీరు కూడా యేసుపై నమ్మకం ఉంచవచ్చు.
\s5
\v 36 "ఆయన ఎముకలలో ఒక్క ఎముక కూడా ఎవ్వరూ విరగ్గొట్టలేదు" అని లేఖనాల్లో రాసి ఉన్నది నెరవేరడానికే ఇలా జరిగింది.
\v 37 "వాళ్ళు తాము పొడిచిన వాని వైపు చూస్తారు" అని లేఖనాల్లో రాసి ఉన్న ఇంకొక ప్రవచనం కూడా వాళ్ళు నెరవేర్చారు.
\s5
\p
\v 38 ఇలా జరిగిన తరవాత, అప్పటిదాకా యూదులకు భయపడి రహస్య శిష్యుడిగా ఉన్న అరిమతయ యోసేపు పిలాతు దగ్గరికి వెళ్లి యేసు దేహాన్ని ఇస్తే తాను తీసుకు వెళ్తానని అడిగాడు. పిలాతు అందుకు అనుమతించాడు. కాబట్టి అతడు వచ్చి యేసు దేహాన్ని తీసుకు పోయాడు.
\v 39 యేసు దగ్గరికి ఒకసారి రాత్రి సమయంలో వచ్చిన నికోదేము కూడా యేసు దేహాన్ని సిద్ధం చేయడానికి సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్నీ, బోళాన్నీ తీసుకువచ్చాడు. అవి ఇంచుమించు 33 కిలోలు.
\s5
\v 40 వాళ్ళు యేసు దేహాన్ని తీసుకువచ్చి నారబట్టతో చుట్టి, ఆ బట్టలో సుగంధ ద్రవ్యాలు నింపారు. ఇది యూదుల సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి దేహాలను సమాధి చేసే పద్ధతి.
\p
\v 41 యేసును సిలువ వేసిన స్థలం ఒక తోట. ఆ తోట అంచున ఎవ్వరినీ అప్పటి వరకూ పాతిపెట్టని ఒక కొత్త సమాధి ఉంది.
\v 42 పస్కా పండగ ఆ సాయంత్రం నుండి మొదలవుతుంది కాబట్టి ఇది దగ్గరగా ఉండడం వలన యేసును తొందరగా అక్కడ సమాధి చెయ్యవచ్చని ఆ సమాధిని వాళ్ళు ఎంచుకున్నారు. కాబట్టి వాళ్ళు యేసును అక్కడ సమాధి చేశారు.
\s5
\c 20
\p
\v 1 వారంలో మొదటి రోజైన ఆదివారం నాడు ఇంకా చీకటిగా ఉండగానే మగ్దలేనే మరియ సమాధి దగ్గరికి వచ్చింది. అక్కడ సమాధిలోకి వెళ్ళే ముందు ఉన్న రాయిని ఎవరో తీసివేసినట్టు కనిపించింది.
\v 2 కాబట్టి ఆమె సీమోను పేతురూ, యేసు ప్రేమించిన శిష్యుడూ ఉంటున్న యెరూషలేముకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆమె వాళ్ళతో, "వాళ్ళు ప్రభువు దేహాన్ని సమాధిలో నుండి ఎత్తుకు పోయారు. దానిని వాళ్ళు ఎక్కడ పెట్టారో తెలియడం లేదు" అని చెప్పింది.
\s5
\p
\v 3 వాళ్ళు ఆ మాటలు వినగానే వెంటనే గబగబా దగ్గరికి వచ్చారు.
\v 4 వారిద్దరూ పరుగెడుతూ ఉండగా మరొక శిష్యుడు పేతురు కంటే ముందుగా పరిగెత్తి సమాధి దగ్గరికి చేరుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళడానికి తటపటాయించాడు.
\v 5 అతడు వంగి కిందికి ఆ సమాధిలోకి చూశాడు. అక్కడ బట్టలు చుట్టి పడి ఉన్నాయి.
\s5
\v 6 అప్పుడు అతని వెనక పరిగెత్తి వచ్చిన సీమోను పేతురు అక్కడికి చేరుకొని, సమాధి లోపలికి వెళ్ళాడు. అతడు కూడా నారబట్టలు చుట్టి పడి ఉండడం చూశాడు.
\v 7 అంతే కాదు, యేసు తలకు కట్టిన గుడ్డ వేరుగా మరొక చోట పెట్టి ఉండడం చూశాడు.
\s5
\v 8 అప్పుడు ముందుగా వచ్చిన శిష్యుడు కూడా లోపలికి వెళ్ళాడు. అతడు అక్కడి పరిస్థితిని చూసి యేసు నిజంగానే తిరిగి లేచాడని అతనిలో నమ్మకం కలిగింది.
\v 9 ఇది జరగక ముందు యేసు మరణించి తిరిగి లేవడం తప్పనిసరి అని లేఖనాల్లో ప్రవక్తలు రాసినవి వాళ్ళు అర్థం చేసుకోలేక పోయారు.
\p
\v 10 శిష్యులు తిరిగి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
\s5
\v 11 కానీ మరియ మాత్రం సమాధి బయటే నిలబడి ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తూ, సమాధిలోకి వంగి చూసింది.
\v 12 అప్పుడు తెల్లని అంగీలు వేసుకున్న ఇద్దరు దేవదూతలు యేసు శరీరాన్ని ఎక్కడ ఉంచారో అక్కడ తల దగ్గర ఒకరు, కాళ్ళ దగ్గర ఒకరు కూర్చుని ఉండడం ఆమె చూసింది.
\v 13 వాళ్ళు ఆమెతో, "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగారు. ఆమె వాళ్ళతో, "నా ప్రభువు శరీరాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియడం లేదు" అంది.
\s5
\v 14 అలా మాట్లాడిన తరవాత ఆమె వెనక్కి తిరిగి అక్కడ ఎవరో ఉండడం చూసింది. కానీ ఆయన యేసు అని ఆమెకు తెలియలేదు.
\v 15 ఆయన ఆమెతో, "అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి కోసం చూస్తున్నావు?" అని అడిగాడు. ఆమె తనతో మాట్లాడుతున్నది తోటమాలి అనుకొని ఆయనతో, "అయ్యా, ఆయన్ని గనక నువ్వు తీసుకుపోయి ఉంటే ఆయన శరీరాన్ని ఎక్కడ ఉంచావో చెప్పు. నేను ఆయన్ని తీసుకెళ్తాను" అంది.
\s5
\v 16 అందుకు యేసు ఆమెను, "మరియా" అని పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి హెబ్రీ భాషలో "రబ్బూనీ" (అంటే బోధకుడు) అని పిలిచింది.
\v 17 యేసు ఆమెతో, "నన్ను తాకవద్దు, నేను నా తండ్రి దగ్గరికి పరలోకానికి ఇంకా వెళ్ళలేదు. నా శిష్యుల దగ్గరికి వెళ్లి నా తండ్రీ, మీ తండ్రీ, నా దేవుడూ, మీ దేవుడూ అయిన ఆయనతో ఉండడానికి పరలోకానికి ఆరోహణం అవుతున్నానని చెప్పు" అని చెప్పాడు.
\v 18 వెంటనే మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరికి వెళ్లి "నేను ప్రభువును చూశాను" అని చెప్పింది. యేసు ఆమెతో ఏమి చెప్పమన్నాడో ఆ సమాచారం అంతా వారికి తెలియజేసింది.
\s5
\p
\v 19 ఆదివారం సాయంత్రం, వారంలో మొదటి రోజున శిష్యులు యూదుల అధికారులు తమను అరెస్ట్ చేస్తారేమో అని భయపడి ఇంటి తలుపులు వేసుకుని లోపల ఉన్నారు. అకస్మాత్తుగా యేసు వచ్చి ఆ గుంపు మధ్యలో నిలబడ్డాడు. ఆయన వారితో, "మీకు దేవుడు శాంతిని ఇచ్చు గాక" అన్నాడు.
\v 20 ఆయన అలా చెప్పిన తరవాత వారికి తన చేతుల్నీ, తన పక్కనూ చూపించాడు. ప్రభువుని చూసిన శిష్యులు చాలా సంతోషించారు.
\s5
\v 21 యేసు వారితో, "దేవుడు మీకు శాంతిని ప్రసాదిస్తాడు గాక. తండ్రి నన్ను పంపిన విధంగానే ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుతున్నాను" అన్నాడు.
\p
\v 22 అలా చెప్పిన తరవాత ఆయన వారి మీద ఊది, "పరిశుద్ధాత్మను పొందండి.
\v 23 మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వాళ్ళ పాపాలను దేవుడు క్షమిస్తాడు. మీరు ఎవరి పాపాలను క్షమించక వాటిని అలాగే ఉండనిస్తారో అవి అలా నిలిచి ఉంటాయి" అన్నాడు.
\s5
\p
\v 24 పన్నెండు మంది శిష్యులలో ఒకడైన తోమా యేసు వారి దగ్గరికి వచ్చినప్పుడు వారి మధ్య లేడు. ఇతన్ని "దిదుమ" అని కూడా పిలుస్తారు.
\v 25 మిగిలిన శిష్యులు అతనితో, "మేము యేసును చూశాము" అని చెప్పారు. అయితే తోమా వారితో, "నేను ఆయన చేతుల్లో మేకులు కొట్టిన గుర్తులు చూసి, ఆ రంధ్రాలలో నా వేలు పెట్టి, ఆయన పక్కలో అయిన గాయంలో నా చెయ్యి పెట్టి తడిమితే గానీ నమ్మనే నమ్మను" అన్నాడు.
\s5
\p
\v 26 ఎనిమిది రోజుల తరవాత ఆయన శిష్యులు మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు తాళాలు వేసి ఉన్నా యేసు వచ్చి వారి మధ్య నిలుచున్నాడు. ఆయన వాళ్ళందరితో, "దేవుడు మీకు శాంతిని ప్రసాదించు గాక!" అన్నాడు.
\v 27 అప్పుడు ఆయన తోమాతో, "నా చేతులు చూసి నీ వేళ్ళు పెట్టు. నీ చేయి నా పక్కలోని గాయంలో పెట్టు. నేనే, సందేహపడ వద్దు. నన్ను నమ్ము" అన్నాడు.
\s5
\v 28 తోమా ఆయనతో, "నా ప్రభూ, నా దేవా!" అన్నాడు.
\v 29 యేసు తోమాతో, "నేను తిరిగి లేచానని ఇప్పుడు నన్ను చూసి నమ్మావు. కానీ చూడకుండానే నమ్మినవాళ్ళకు దేవుడు గొప్ప సంతోషాన్ని ఇస్తాడు" అన్నాడు.
\s5
\p
\v 30 యేసు తానెవరో రుజువుపరిచే అనేక రకాల శక్తివంతమైన పనులూ, అద్భుతాలూ చేశాడు. ఆయన శిష్యులు వాటిని కళ్ళారా చూశారు. అవి లెక్కకు మించి ఉండడం వల్ల నేను అన్నిటినీ ఈ పుస్తకంలో రాయలేదు.
\v 31 అయితే యేసే మెస్సీయ అనీ, దేవుని కుమారుడనీ, మీరు నమ్మడం వల్ల ఆయన నామంలో మీకు నిత్య జీవం కలుగుతుందన్న సంపూర్ణమైన నమ్మకం మీకు కలగాలని వీటన్నిటినీ రాశాను.
\s5
\c 21
\p
\v 1 ఆ తరవాత యేసు తిబెరియ సరస్సు (దీన్ని గలిలయ సరస్సు అని కూడా అంటారు) తీరాన శిష్యులకు ఇంకొకసారి కనిపించాడు. ఆయన తనను తాను ఈ విధంగా వారికి తెలియపరచుకున్నాడు.
\v 2 సీమోను పేతురు, తోమా (ఇతన్ని దిదుమ అని కూడా పిలుస్తారు), గలిలయలోని కానా ఊరివాడైన నతనయేలూ, జెబెదయి కొడుకులూ (అంటే యాకోబూ, యోహానూ), ఇంకా ఆయన శిష్యులలో ఇద్దరూ కలిసి ఉన్నారు.
\p
\v 3 సీమోను పేతురు మిగిలిన వాళ్ళతో, "నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను" అన్నాడు. వాళ్ళు, "మేము కూడా నీతో వస్తాం" అన్నారు. వాళ్ళు వెళ్లి పడవ ఎక్కారు. కానీ ఆ రాత్రి వాళ్ళు చేపలేమీ పట్టలేదు.
\s5
\v 4 తెల్లవారగానే యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు. కానీ శిష్యులు ఆయన యేసు అని గుర్తుపట్ట లేదు.
\v 5 యేసు వాళ్ళతో, "మిత్రులారా, చేపలు ఏమైనా ఉన్నాయా?" అని అడిగాడు. వాళ్ళు "లేదు" అన్నారు.
\v 6 ఆయన వాళ్ళతో, "మీ వలలు పడవకు కుడి వైపున వేయండి. చేపలు దొరుకుతాయి" అన్నాడు. ఆయన చెప్పినట్టే వాళ్ళు వలలు వేశారు. వెంటనే చాలా చేపలతో తమ వల నిండిపోవడం వల్ల వాళ్ళు ఆ వలను పడవలోకి లాగలేక పోయారు.
\s5
\p
\v 7 యేసు ప్రత్యేకంగా ప్రేమించిన శిష్యుడైన యోహాను పేతురుతో "ఆయన ప్రభువు" అన్నాడు. అతడు అలా చెప్పడం వినగానే సీమోను పేతురు తన పైబట్టను కప్పుకుని నీళ్ళలోకి దూకేశాడు (చేపలు పట్టే పనిలో ఉన్నప్పుడు అతడు దాదాపుగా ఏమీ ధరించడు).
\v 8 మిగిలిన శిష్యులు పడవలో ఒడ్డుకు చేరుకున్నారు. వాళ్ళు ఒడ్డుకు ఎంతో దూరంలో లేరు. కేవలం 90 మీటర్ల దూరంలో ఉన్నారు.
\v 9 వాళ్ళు ఒడ్డుకు చేరుకోగానే వారికి అక్కడ మండుతున్న నిప్పులు, వాటిపైన ఉన్న చేపలు, రొట్టె కనిపించాయి.
\s5
\p
\v 10 యేసు వారితో, "మీరు పట్టిన చేపల్లో కొన్నిటిని తీసుకు రండి" అన్నాడు.
\v 11 సీమోను పేతురు పడవ ఎక్కి వలను ఒడ్డుకి లాగాడు. దానిలో 153 పెద్ద చేపలు ఉన్నాయి. అయినా ఆ వల పిగిలిపోలేదు.
\s5
\v 12 యేసు వారితో, "వచ్చి భోజనం చేయండి" అని పిలిచాడు. శిష్యులలో ఒక్కరు కూడా "నువ్వెవరివి?" అని అడిగే ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే ఆయన ప్రభువని వారికి తెలుసు.
\v 13 యేసు వచ్చి ఆ రొట్టె తీసుకొని వాళ్ళందరికీ ఇచ్చాడు. అలాగే చేపలు కూడా పంచిపెట్టాడు.
\v 14 యేసు చనిపోయి దేవుడు ఆయన్ని తిరిగి లేపిన తరవాత ఆయన శిష్యులకు కనపడడం ఇది మూడో సారి.
\s5
\p
\v 15 వాళ్ళు భోజనం ముగించిన తరవాత యేసు సీమోను పేతురుతో, "యోహాను కొడుకైన సీమోనూ, వీరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగాడు. అప్పుడు పేతురు ఆయనతో, "అవును ప్రభూ, నేను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. యేసు, "నా గొర్రెల్ని మేపు" అన్నాడు.
\p
\v 16 యేసు రెండవసారి పేతురుతో, "యోహాను కొడుకైన పేతురూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగాడు. అతడు, "అవును ప్రభూ, నేను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. అప్పుడు యేసు అతనితో, "నా గొర్రెలకు కాపరిగా ఉండు" అన్నాడు.
\s5
\p
\v 17 యేసు మూడవసారి అతనితో, "యోహాను కొడుకైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగాడు. యేసు మూడుసార్లు అడిగినందుకు పేతురు బాధపడి, "ప్రభూ, నీకు అంతా తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. అప్పుడు యేసు, "నా గొర్రెల్ని మేపు.
\v 18 నేను ఒక వాస్తవం చెప్తున్నాను, నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీకు నువ్వే బట్టలు వేసుకొని ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి నడిచి వెళ్లిపోయే వాడివి. అయితే నువ్వు ముసలివాడవైనప్పుడు నువ్వు చేతులు చాపితే ఎవ్వరో నీకు బట్టలు వేసి వాళ్ళే నిన్ను మోసుకుంటూ నీకిష్టం లేని చోటికి తీసుకు వెళతారు” అని అతనితో చెప్పాడు.
\s5
\v 19 పేతురు దేవుణ్ణి మహిమ పరచడం కోసం ఎలా మరణిస్తాడో దానిని యేసు చూచాయగా చెప్పాడు. తరవాత యేసు అతనితో, "నన్ను అనుసరించు” అన్నాడు.
\s5
\p
\v 20 పేతురు వెనక్కి తిరిగి చూసి, యేసు ప్రత్యేకంగా ప్రేమించిన శిష్యుడు వారి వెనక నడుస్తుండడం చూశాడు. వారంతా భోజనం చేసే సమయంలో యేసు పక్కనే కూర్చుని ఆయనకు తన భుజం ఆనించి, "ప్రభూ, నిన్ను శత్రువులకు అప్పగించేది ఎవరు?" అని అడిగిన వాడు అతడే.
\v 21 పేతురు అతణ్ణి చూసి "ప్రభూ, ఇతనికేమౌతుంది?" అని యేసును ప్రశ్నించాడు.
\s5
\v 22 అందుకు యేసు అతనితో, "నేను తిరిగి వచ్చేవరకు అతడు బతికి ఉండడం నాకిష్టమైతే నీకేం సంబంధం? నువ్వు నన్ను అనుసరించు" అన్నాడు.
\v 23 కాబట్టి యేసు తిరిగి వచ్చేవరకూ అతడు మరణించడనే మాట సోదర సోదరీలందరికీ పాకిపోయింది. అయితే యేసు అతడు చనిపోడు అనలేదు. ఆయన కేవలం "నేను తిరిగి వచ్చేవరకూ అతడు బతికి ఉండడం నాకిష్టమైతే నీకేం సంబంధం?" అన్నాడు, అంతే.
\s5
\p
\v 24 యోహాను అనే నేను ఆయన శిష్యులలో ఒకడిగా ఈ విషయాలన్నీ ప్రత్యక్షంగా చూసి రాశాను. ఇతని సాక్ష్యం నిజమని మనకు తెలుసు.
\v 25 యేసు ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. వాటన్నిటినీ రాయాలంటే ఆ పుస్తకాలకు ఈ లోకమే సరిపోదని నా అభిప్రాయం.

View File

@ -472,7 +472,7 @@
\v 29 "ఆ మాట విన్న మోషే ఈజిప్టు నుండి మిద్యాను దేశం పారిపోయి, అక్కడే పెళ్ళిచేసుకుని, ఇద్దరు కొడుకులను కని అక్కడే కొన్ని ఏళ్ళు ఉన్నాడు.
\v 30 నలభై ఏళ్ళ తర్వాత ఒక రోజు సీనాయి పర్వతారణ్యంలో, దేవుడు ఒక పొదలోని మంటల్లో దేవదూత వలె కనిపించాడు.
\s5
\v 31 పొదలో మంటలు లేకపోయినా మండుతున్న దాన్ని చూసి ఆశ్యర్యపడిన మోషే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు. ప్రభువు మాటలు అతనికి వినపడ్డాయి.,
\v 31 పొదలో మంటలు లేకపోయినా మండుతున్న దాన్ని చూసి ఆశ్యర్యపడిన మోషే దాని దగ్గరికి వెళ్ళినప్పుడు. ప్రభువు మాటలు అతనికి వినపడ్డాయి,
\v 32 "నేను నీ పూర్వీకుల దేవుణ్ణి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి." ప్రభువు మాటలు విన్న మోషే వణికిపోతూ, అటు చూడటానికి సాహసించ లేకపోయాడు."
\s5
\p
@ -483,7 +483,8 @@
\p
\v 36 "మోషే ఈజిప్టులో, ఎర్ర సముద్రంలో, అరణ్యంలో 40 ఏళ్ళు అనేక అద్బుత కార్యాలను చేసి, ఇశ్రాయేలీయులను ఈజిప్టునుండి బయటకు తోడుకుని వచ్చాడు."
\q1
\v 37 "నా లాంటి ఒక ప్రవక్తను దేవుడు మీ ప్రజలనుండి లేవనెత్తుతాడు." "ఈ విధంగా ఇశ్రాయేలీయులతో చెప్పింది ఈ మోషేనే."
\v 37 "నా లాంటి ఒక ప్రవక్తను దేవుడు మీ ప్రజలనుండి లేవనెత్తుతాడు."
\p "ఈ విధంగా ఇశ్రాయేలీయులతో చెప్పింది ఈ మోషేనే."
\s5
\p
\v 38 "సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దూతతోను మన పూర్వికులతోను అరణ్యంలోని సంఘంలో ఉండి మనకు ఇవ్వడానికి దేవుని ఆజ్ఞలను తీసుకున్నది ఈ మోషేనే."
@ -2009,4 +2010,4 @@
\s5
\p
\v 30 పౌలు రెండు సంవత్సరాలు ఆ అద్దె ఇంట్లో నివసించాడు. తన దగ్గరకు వచ్చిన వారందరినీ కుశల ప్రశ్నలు అడుగుతూ వాళ్ళకి బోధించేవాడు.
\v 31 దేవుడు తనను తాను రాజుగా కనపరచుకున్నాడు అనే విషయాలను, యేసు ప్రభువే మెస్సీయ అనే విషయాలను గొప్ప ధైర్యంతో, అధికారంతో బోధిస్తూ ఉన్నాడు. అతణ్ణి ఆపడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదు.
\v 31 దేవుడు తనను తాను రాజుగా కనపరచుకున్నాడు అనే విషయాలను, యేసు ప్రభువే మెస్సీయ అనే విషయాలను గొప్ప ధైర్యంతో, అధికారంతో బోధిస్తూ ఉన్నాడు. అతణ్ణి ఆపడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదు.

831
46-ROM.usfm Normal file
View File

@ -0,0 +1,831 @@
\id ROM - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h రోమీయులకు రాసిన పత్రిక
\toc1 రోమీయులకు రాసిన పత్రిక
\toc2 రోమీయులకు రాసిన పత్రిక
\toc3 rom
\mt1 రోమీయులకు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 క్రీస్తు యేసును సేవించే పౌలు అనే నేను రోమా నగరంలో ఉన్న విశ్వాసులైన మీ అందరికీ ఈ ఉత్తరం రాస్తున్నాను. దేవుడు నన్ను అపొస్తలుడిగా ఉండడానికి ఎన్నుకుని, ఆయన నుండి వచ్చిన శుభవార్త చాటడానికి నన్ను నియమించాడు.
\v 2 దేవుడు తన ప్రవక్తలు రాసిన పవిత్ర లేఖనాల ద్వారా ఈ శుభవార్తను వెల్లడి చేస్తానని భూమి మీదకి యేసు రావడానికి చాలా కాలం ముందే వాగ్దానం చేసాడు.
\p
\v 3 ఈ శుభవార్త తన కుమారుడి గురించే. సహజ స్వభావ రీత్యా ఆ కుమారుడు దావీదు రాజు సంతానంగా పుట్టాడు.
\s5
\v 4 దైవిక స్వభావరీత్యా ఆయన తన సొంత కుమారుడు అని దేవుడు శక్తివంతంగా కనపరిచాడు. ఆయన చనిపోయాక పరిశుద్ధాత్మ ఆయన్ని తిరిగి బ్రతికించడం ద్వారా దీన్ని చూపించాడు. ఆయన మన ప్రభువైన క్రీస్తు యేసు.
\p
\v 5 ఆయన మన మీద గొప్ప దయ చూపి మనల్ని అపొస్తలులనుగా నియమించాడు. వివిధ జాతుల ప్రజలందరూ ఆయనకు లోబడి ఆయనలో విశ్వాసం ఉంచాలని ఆయన ఇలా చేసాడు.
\v 6 రోమ్ లో విశ్వాసులుగా జీవిస్తున్న మీరందరూ కూడా యేసు క్రీస్తుకు చెందిన వాళ్ళుగా, దేవుడు ఎన్నుకున్న వాళ్ళలో చేరారు.
\s5
\v 7 దేవుడు ప్రేమించి తన ప్రజలుగా ఎన్నుకున్న రోమ్ లోని మీ అందరికీ నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు మీ పట్ల దయ కలిగి ఉంటూ మీకు శాంతి అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను.
\s5
\p
\v 8 ఈ ఉత్తరం రాస్తూ మొదటిగా రోమ్ లో ఉన్న విశ్వాసులందరిని బట్టి నా దేవునికి వందనాలు చెప్తున్నాను. మన కోసం యేసు క్రీస్తు చేసిన దాన్ని బట్టి నేను ఇలా చేయగలుగుతున్నాను. ఆయనలో మీరు ఎలా విశ్వాసం ఉంచారో రోమా సామ్రాజ్యం అంతా ప్రజలు చెప్పుకుంటున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
\v 9 ఆయన కుమారుడి గురించిన శుభవార్త ప్రజలకు ప్రకటించడం ద్వారా నేను భక్తితో సేవిస్తున్న దేవునికి మీ గురించి ఎడతెగక ప్రార్థిస్తున్నాను అని చెప్పడంలో నేను నిజమే చెబుతున్నానని తెలుసు.
\p
\v 10 నేను మిమ్మల్ని సందర్శించడం దేవుని చిత్తమైతే ఎదో ఒక విధంగా ఎట్టకేలకు మిమ్మల్ని చూడగలనని నేను ప్రత్యేకంగా దేవుణ్ణి అడుగుతున్నాను.
\s5
\v 11 మీరు క్రీస్తు పట్ల విశ్వాసంలో, స్తుతి చెల్లించడంలో, ఎదుగుతూ ఉండేందుకు సాయపడాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని సందర్శించాలని నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను.
\v 12 మనం యేసులో ఎలా విశ్వాసం ఉంచామో, అలానే ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని నా ఉద్దేశం.
\s5
\p
\v 13 నా సహ విశ్వాసులారా! చాలా సార్లు మిమ్మల్ని చూడాలని అనుకున్నాను. కానీ ఎప్పుడూ ఏదో ఆటంకం వల్ల నేను మీ దగ్గరికి రాలేకపోయాను. ఇది మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ఇతర ప్రాంతాల్లో ఉన్న యూదేతరుల్లో ఉన్నట్టు, మీలో కూడా ఎక్కువ మంది యేసులో విశ్వాసం పెట్టుకునేలా చూడాలని నేను రావాలనుకున్నాను.
\v 14 యూదేతరుల్లో బుద్ధిమంతులకు, బుద్దిహీనులకు, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళకీ మాట్లాడని వాళ్ళకీ శుభవార్త ప్రకటించడం నా బాధ్యత.
\v 15 దీని ఫలితంగా రోమ్ లో నివసించే వాళ్లకు కూడా ఈ శుభవార్త చాటాలని తహతహలాడుతున్నాను.
\s5
\p
\v 16 క్రీస్తు చేసిన కార్యాన్ని గురించిన శుభవార్తను నేను చాలా ధైర్యంగా ప్రకటిస్తాను. ఎందుకంటే క్రీస్తు తమ కోసం చేసినది ఎవరు నమ్ముతారో, వాళ్ళను దేవుడు రక్షిస్తాడనే విషయంలో ఈ శుభవార్త శక్తివంతమైన మార్గం. ప్రత్యేకించి దేవుడు ముందుగా శుభవార్తను నమ్మిన యూదులను రక్షిస్తాడు, తరువాత యూదేతరులను రక్షిస్తాడు.
\v 17 ఈ శుభవార్త ద్వారా దేవుడు మనుషులను ఎలా తన కోసం న్యాయవంతులుగా చేసుకుంటాడో వెల్లడిస్తాడు. చాలా కాలం క్రితం ప్రవక్తలు లేఖనాల్లో రాసింది ఇదే. "దేవుడు ఎవరిని న్యాయవంతులుగా చేసాడో వారు ఆయనపై నమ్మకం ఉంచడం ద్వారా జీవిస్తారు.
\s5
\p
\v 18 పరలోకంలోని దేవుడు తన పట్ల మర్యాద లేకుండా చెడు పనులు చేసే వాళ్ళ విషయంలో కోపంగా ఉన్నాను అని స్పష్టం చేసాడు. తన చేతుల్లో శిక్ష పొందడానికి వాళ్ళు అర్హులని ఆయన వాళ్ళకి చూపిస్తాడు. కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టినట్టు వాళ్ళు చెడు పనులు చేస్తారు, దేవుని విషయంలో ఏది సత్యమో దాన్ని తెలుసుకోకుండా ఇతరులకూ అడ్డుపడతారు.
\p
\v 19 దేవుడు ప్రతివారికీ తనను వెల్లడి చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఎలాంటివాడో యూదులు కాని వారందరూ స్పష్టంగా తెలుసుకోగలరు.
\s5
\v 20 దేవుడు ఎలా ఉంటాడో మనుషులు తమ కళ్ళతో చూడలేరు. కాని, ఆయన లోకాన్ని సృష్టించినప్పటి నుండి, అందులోని విషయాలు మనం ఆయన్ని గురించి అర్థం చేసుకునేలా చేస్తున్నాయి. ఉదాహరణకు, ఆయన అన్ని సమయాల్లో శక్తివంతమైన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. ఇంకొక ఉదాహరణ - ఆయన చేసిన సృష్టి అంతటికీ ఆయన భిన్నంగా ఉంటాడని అందరికీ తెలుసు. కాబట్టి, "దేవుని గురించి మాకు తెలీదు" అని నిజాయితీగా ఎవరూ అనలేరు.
\p
\v 21 యూదేతరులకు దేవుడు ఎలా ఉంటాడో తెలిసినా ఆయన్ని దేవుడుగా గౌరవించలేదు, ఆయన చేసిన వాటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పలేదు. దానికి బదులు ఆయన్ని గురించి బుద్ధిహీనంగా ఆలోచించడం మొదలుపెట్టారు. తన గురించి వాళ్ళు ఏమి తెలుసుకోవాలని ఆయన ఆశించాడో దాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు.
\s5
\v 22 వాళ్ళు తమకు తామే తెలివైన వాళ్ళుగా చెప్పుకుంటూ తెలివి తక్కువ వాళ్ళుగా తయారయ్యారు.
\v 23 దేవుడు మహిమ గలవాడనీ, ఆయనకి చావు లేదనీ అంగీకరించ లేకపోయారు. దానికి బదులుగా ఏదో ఒకనాడు చనిపోయే మనుషులను పోలిన విగ్రహాలను చేసి, పూజించారు. తరువాత నాలుగు కాళ్ళ జంతువులు, పక్షులను పోలిన ఇతర విగ్రహాలను చేశారు. చివరిగా సరీసృపాలను పోలిన ప్రతిమలను కూడా చేశారు.
\s5
\p
\v 24 కాబట్టి యూదేతరులు తీవ్రంగా ఆశించిన అక్రమ లైంగిక కార్యాలు చేయడానికి దేవుడు వాళ్లకు అనుమతి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు వాటిని చేయాలని ఆత్రుత పడ్డారు. దాని ఫలితంగా తమ కామకేళీ విలాసాల వల్ల ఒకరి శరీరాలను ఒకరు అశుద్ధం చేసుకున్నారు.
\v 25 దేవుని గురించిన సత్యాన్ని అంగీకరించడానికి బదులుగా అబద్ధ దేవుళ్ళపూజను ఎన్నుకున్నారు. దేవుణ్ణి పూజించడానికి బదులు ఆయన సృష్టించిన వాటిని పూజిస్తున్నారు. సమస్తం సృష్టించిన ఆయనకే మనందరం నిత్యం స్తుతులు చెల్లించాలి, ఆమెన్.
\s5
\p
\v 26 సిగ్గుమాలిన లైంగిక కార్యాలను చేయాలని తాపత్రయపడిన యూదేతరులను దేవుడు అలానే చేయనిచ్చాడు. ఫలితంగా చాలా మంది స్త్రీలు స్త్రీలతో లైంగికంగా కలవడం మొదలుపెట్టారు. ఇది సహజ స్వభావానికి విరుద్ధం.
\v 27 అదే విధంగా చాలా మంది పురుషులు స్త్రీలతో ఉండే సహజ సంబంధాలను వదిలేసారు. ఒకరిపై ఒకరు బలమైన లైంగిక వాంఛలు పెంచుకున్నారు. పురుషులు పురుషులతో సిగ్గుమాలిన స్వలింగ సంపర్క చర్యలకు పాల్పడ్డారు. అలాంటి పాపానికి సరైన పర్యవసానంగా దేవుడు వాళ్ళ శరీరాలలో అనారోగ్యం కలిగించి శిక్షించాడు.
\s5
\p
\v 28 ఇకపోతే దేవుణ్ణి తెలుసుకోవడం కొరగాని విషయంగా వాళ్ళు నిర్ణయించుకున్నారు. కాబట్టి తమ వ్యర్థ ఆలోచనల అదుపులోకి వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోయేలా దేవుడు అనుమతించాడు. దాని ఫలితంగా వాళ్ళు ఇతరులెవ్వరూ చేయరాని చెడ్డ పనులు చేయడం మొదలుపెట్టారు.
\s5
\v 29 ఇతరుల పట్ల అన్ని రకాల అవినీతి కార్యాలు చేయడం, ఇతరుల నుండి దొంగిలించడం, రకరకాలుగా ఇతరులకు హాని కలిగించడం వాళ్ళు బలంగా కోరుకున్నారు. కొందరికి ఇతరుల్ని చూస్తే అస్తమానం కన్ను కుడుతుంది. మనుషుల్ని మట్టుపెట్టాలనే దుర్బుద్ధి వాళ్ళల్లో ఉంటుంది. మనుషుల మధ్య తగాదాలు, గిల్లికజ్జాలు పెడతారు. ఇతరుల్ని మోసగిస్తారు, ఇతరుల గురించి అసహ్యంగా మాట్లాడతారు.
\p
\v 30 వీళ్ళు చాలా మంది ఇతరుల గురించి చాడీలు చెబుతారు. నీలాపనిందలు వేస్తారు. చాలా మంది దేవునిపై అక్కసు వెళ్ళగక్కుతారు. ఇతరులను హింసిస్తారు. తమ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఇతరుల్ని తక్కువ చేసి మాట్లాడతారు. దుష్ట కార్యాలు చేయడానికి కొత్త దారులు కనిపెడతారు. చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను ఎదిరిస్తారు.
\v 31 చాలా మంది బుద్ధిహీనంగా దేవునికి కోపం తెప్పించే చర్యలు చేస్తారు. ఇతరులకి చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోరు. తమ సొంత వాళ్ళను సైతం ప్రేమించలేరు. ఇతరుల పట్ల కనికరం చూపించరు.
\s5
\v 32 ఇలాంటివి చేసిన వాళ్ళు మరణానికి గురవుతారని దేవుడు ప్రకటించాడని వాళ్లకి తెలిసినా ఈ చెడ్డ కార్యాలు వాళ్ళు చేయడమే కాదు, అవి చేసే వాళ్ళని కూడా సమర్ధిస్తారు.
\s5
\c 2
\p
\v 1 దేవుడు ద్వేషించే వాటిని మనుషులు చేసినప్పుడు దేవుడు శిక్షించాలి అని నువ్వు అనవచ్చు. కాని నువ్వు అది అన్నప్పుడు నువ్వు కూడా అలాంటి జీవితమే గడిపావు కాబట్టి, దేవుడు నిన్ను కూడా శిక్షించాలని నువ్వు అంటున్నావు. వాళ్ళు చేసిందే నువ్వూ చేసావు.
\v 2 ఇలాంటి దుర్మార్గపు పనులు చేసే వాళ్ళందరికీ దేవుడు తీర్పు తీర్చి, న్యాయంగా శిక్ష వేస్తాడని మనకు బాగా తెలుసు.
\s5
\v 3 కాబట్టి చెడు పనులు చేసే వాళ్ళందరినీ దేవుడు శిక్షించాలని నువ్వు అంటున్నావు. అయినా నీకు నువ్వు చెడ్డ పనులు చేస్తావు కాబట్టి దేవుడు నిన్ను శిక్షించేటప్పుడు తప్పించుకుంటానని నీలో నువ్వు అనుకోకు.
\v 4 దేవుడు నా పట్ల సహనం, ఓర్పు చూపిస్తున్నాడు కాబట్టి నేను నా పాపం నుండి దూరంగా మళ్ళి పోవాల్సిన అవసరం లేదని నువ్వు అనకూడదు. నీ పాపాల విషయంలో నీకు పశ్చాత్తాపం వస్తుందని దేవుడు ఓపికగా నీ కోసం ఎదురు చూస్తున్నాడు.
\s5
\p
\v 5 కానీ దానికి బదులుగా, నువ్వు మొండితనం చూపుతూ పాపం చేయడం మానడానికి నిరాకరిస్తున్నావు. దేవుడు నిన్ను ఇంకా ఎక్కువగా శిక్షిస్తాడు. ఆయన ప్రజలందరికీ న్యాయంగా తీర్పు ఇచ్చినప్పుడు తన కోపాన్ని చూపించే సమయంలో అలా చేస్తాడు.
\v 6 ప్రతి ఒక్కరూ చేసిన పనులకు తగినట్టు దేవుడు వాళ్లకు చెల్లిస్తాడు.
\v 7 ప్రత్యేకంగా కొందరు దేవుణ్ణి ఘనపరచాలని అనుకుని మంచి పనులు చేస్తారు. వీళ్ళు ఆయనతో నిత్యం జీవించాలని అనుకుంటారు. వీళ్లకు ఆయన ఈ విధంగానే ప్రతిఫలం ఇస్తాడు.
\s5
\v 8 కాని కొందరు స్వార్ధంతో ఉంటూ దేవుడు చెప్పిన సత్యాన్ని నమ్మడానికి నిరాకరిస్తారు. దేవుడు తప్పు అని చెప్పిన వాటన్నిటినీ వీళ్ళు చేస్తారు. దానివల్ల దేవునికి చాలా కోపం వచ్చి, వాళ్ళని కఠినంగా శిక్షిస్తాడు.
\p
\v 9 అలవాటుగా చెడు పనులు చేసే ప్రతి ఒక్కరూ బాధపడేలాగా, ఇబ్బందులు ఎదుర్కొనేలాగా ఆయన చేస్తాడు. తన ప్రత్యేక ప్రజలుగా అయ్యే అధికారాన్ని దేవుడు వాళ్లకి ఇచ్చాడు కాబట్టి దేవుని సందేశాన్ని అంగీకరించకుండా నిరాకరించిన యూదులకు కచ్చితంగా ఇది సంభవిస్తుంది. ఇది యూదేతరులకు కూడా సంభవిస్తుంది.
\s5
\v 10 అలవాటుగా మంచి పనులు చేసే ప్రతి వ్యక్తికీ దేవుడు ఘనత, గౌరవం, ప్రశాంతమైన ఆత్మను ఇస్తాడు. తన ప్రత్యేక ప్రజలుగా ఆయన యూదులను ఎన్నుకున్నాడు కాబట్టి ఇది వాళ్ళకు తప్పకుండా ఇస్తాడు. కానీ యూదులు కాని వారికి కూడా ఇస్తాడు.
\v 11 ఎవరు ఏమిటీ అనేది చూడకుండా దేవుడు దీన్ని న్యాయంగా చేస్తాడు.
\p
\v 12 దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం యూదేతరులకు లేదు. ధర్మశాస్త్రం వాళ్ళకి లేకపోయినా పాపం చేస్తారు. దేవుడు వాళ్ళని శాశ్వతంగా నాశనం చేస్తాడు. ధర్మశాస్త్ర ప్రకారం యూదులకు తీర్పు తీరుస్తాడు కాబట్టి తన ధర్మశాస్త్రానికి లోబడని యూదుల్ని కూడా ఆయన శిక్షిస్తాడు.
\s5
\v 13 దేవుని ధర్మశాస్త్రం గురించి తెలుసుకోవడం వల్ల దేవుడు వాళ్ళను నీతిమంతులుగా చేయడు గానీ, దేవుని ధర్మశాస్త్రానికి ఎవరు విధేయత చూపిస్తారో వాళ్ళను మాత్రమే ఆయన నీతి మంతులుగా చేస్తాడు కాబట్టి వాళ్ళకు శిక్ష వేయడం సరైనదే.
\p
\v 14 ధర్మశాస్త్రం లేని యూదేతరుల విషయానికి వస్తే దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం వాళ్లకు లేకపోయినా, వాళ్లకు ఉన్న వెలుగు స్వభావం వల్ల ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి, దానికి లోబడి, వాళ్ళల్లోనే ఒక ధర్మశాస్త్రం ఉన్నట్టు నిరూపించారు.
\s5
\v 15 దేవుడు తన ధర్మశాస్త్రంలో ఏమి ఆజ్ఞాపించాడో, అది మనసులో తెలుసుకున్నారని వాళ్ళు చూపిస్తారు. ప్రతి వ్యక్తి తన చెడు ప్రవర్తనను బట్టి మనస్సాక్షిలో తనను తాను నిందించుకుంటాడు లేదా సమర్ధించుకుంటాడు.
\v 16 వాళ్ళు రహస్యంగా ఆలోచించిన, చేసిన వాటి ప్రకారం దేవుడు మనుషులకు తీర్పు తీర్చి, శిక్ష వేస్తాడు. దేవుడు వాళ్లకు తీర్పు తీర్చడానికి క్రీస్తు యేసుకు అధికారం ఇవ్వడం ద్వారా ఆయన వాళ్లకు తీర్పు తీర్చుతాడు. శుభవార్త ప్రకటించినప్పుడు నేను మనుషులకు ఇదే బోధిస్తాను.
\s5
\p
\v 17 ఈ ఉత్తరం రాస్తున్న నేను మీ యూదులకు ఇప్పుడు చెప్పాల్సింది ఒకటి ఉంది. దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం మీకు తెలుసు కాబట్టి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని మీరు అనుకుంటున్నారు. మీరు దేవునికి చెందిన వాళ్ళని గొప్ప చెప్పుకుంటారు.
\v 18 దేవుడు ఆశించేది ఏమిటో మీకు తెలుసు. మీకు దేవుని ధర్మశాస్త్రం బోధించారు కాబట్టి ఏవి సరైనవో, ఏవి చేయడానికి ఎంచుకోవాలో మీరు తెలుసుకోగలరు.
\v 19 మీరు యూదేతరులకు దేవుని సత్యాన్ని చూపించగలరనీ దేవుని గురించి ఏమీ తెలియని వారికి మీరు సూచనలు ఇవ్వగలరనీ మీకు కచ్చితంగా తెలుసు.
\v 20 దేవుని గురించి అవివేకమైన విషయాలను నమ్మేవారికి, దేవుని గురించి ఏమీ తెలియని చిన్న పిల్లల వంటి వారికి మీరు సూచనలు ఇవ్వగలరని మీకు తెలుసు. దేవుని గురించి సత్యాన్ని బోధించే ధర్మశాస్త్రం మీకు ఉంది కాబట్టి ఇవన్నీ మీకు స్పష్టంగా తెలుసు.
\s5
\p
\v 21 మీరు ఇతరులకి బోధిస్తారు కానీ ఆ ధర్మశాస్త్రానికి మీరే విధేయత చూపించక పోవడం అసహ్యంగా అనిపిస్తుంది. మీరు యూదులు కాబట్టి మీకు ఈ ప్రయోజనాలన్నీ ఉన్నాయని చెప్పుకుంటారు. ఇతరులకు దొంగతనం చేయకూడదని చెప్పి మీరు దొంగతనం చేయడం రోత కలిగిస్తుంది.
\v 22 నీ భార్య కని వారితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదని ఇతరులకు ఆదేశించి, మీరు వ్యభిచారం చేయడం అసహ్యం. విగ్రహాలను పూజించవద్దని ఇతరులకి ఆజ్ఞాపిస్తావు, నువ్వు అసహ్యం కలిగించే పనులు మానుకోవు.
\s5
\v 23 "నాకు దేవుని ధర్మశాస్త్రం ఉంది" అని మీరు గొప్పలు చెప్తూ, అవే ఆజ్ఞలు మీరు పాటించకపోవడం అసహ్యం. దీని ఫలితంగా మీరు దేవుణ్ణి అవమానిస్తున్నారు.
\v 24 "యూదులైన మీరు చేసే చెడ్డ పనుల వల్ల యూదేతరులు దేవుని గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు" అని లేఖనాలు చెప్పినట్టే ఉంది.
\s5
\p
\v 25 మీలో దేవునికి చెందిన వారు అని చూపించుకోవడానికి సున్నతి పొందినవాళ్ళు ఎవరైనా దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రానికి లోబడితే లాభం ఉంటుంది. కానీ నువ్వు సున్నతి చేసుకుని ధర్మశాస్త్రానికి లోబడకపోతే, దేవుని దృష్టిలో సున్నతి పొందని వాడి కంటే మెరుగుగా దేవుడు నిన్ను పరిగణించడు.
\v 26 దీని అర్థం సున్నతి చేసుకోని యూదేతరులైనా ధర్మశాస్త్రంలోని దేవుని ఆజ్ఞలకు లోబడితే కచ్చితంగా ఆయన ప్రజలుగా దేవుడు పరిగణిస్తాడు.
\v 27 మీరు సున్నతి చేసుకున్నా ధర్మశాస్త్రాన్ని పాటించక పోవడం వల్ల దేవుడు మిమ్మల్ని శిక్షించినప్పుడు, దేవుని ఆజ్ఞలకి లోబడే వీళ్ళు సున్నతి చేసుకోనప్పటికీ దేవుడు సరైనదే చేసాడని బాహాటంగా చెప్తారు.
\s5
\v 28 దేవుని కోసం ఆచారాలు చేసేవాళ్ళు నిజమైన యూదులు కాదు. దేవుడు వాళ్ళని అంగీకరించడానికి కారణం శరీరానికి సున్నతి చేసుకోవడం కాదు.
\v 29 దీనికి భిన్నంగా చెప్పాలంటే - ధర్మశాస్త్ర ఆచారాలు ఆచరించడం వల్ల కాదు, ఎవరి అంతరంగాన్నిదేవుడు మార్చుతాడో వాళ్ళు నిజమైన యూదులు. దేవుడు మనల్ని అంగీకరించాడు, మన స్వభావాన్ని దేవుని ఆత్మ మార్చాడు. ఇతరులు మనల్ని పొగడకపోయినా దేవుడు మనల్ని పొగుడుతాడు.
\s5
\c 3
\p
\v 1 అదే నిజమైతే యూదేతరుడి కంటే యూదుడుగా ఉండడం వల్ల ప్రయోజనం లేనట్టు అనిపిస్తుంది. సున్నతి చేసుకోవడం మన యూదులకు లాభం ఏమీ కాదు.
\v 2 కానీ యూదులు కావ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిగా దేవుడు తన వాక్కులు వాళ్ళ పితరులకే ఇచ్చాడు. ఆ వాక్కులే దేవుడు ఎవరో మనకు తెలిపాయి.
\s5
\v 3 యూదులు నమ్మకంగా ఉండకపోతే దేవుడు వాగ్దానం చేసినట్టుగా యూదుల్ని ఆశీర్వదించడు అని ఎవరైనా అనుకోవచ్చు.
\v 4 కాదు, దాని అర్థం కచ్చితంగా అది కాదు. మనుషులు దేవునికి ఇష్టమైనట్టు ఉండకపోయినా దేవుడు తాను చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటాడు. యూదులుగా ఉన్న మన పట్ల దేవుడు వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదని ఆయన్ని నిందించే వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. దావీదు మహారాజు దీని గురించి, "వాళ్ళ గురించి నువ్వు చెప్పినది అంతా నిజమే, నువ్వు తప్పు చేసావని నిన్ను ఎవరైనా నిందించినప్పుడు ఆ విచారణలో నువ్వు ఎప్పుడూ గెలుపొందుతావని ప్రతి ఒక్కరూ గుర్తించాలి" అని రాసాడు.
\s5
\p
\v 5 అందుకే మనం చెడ్డ వాళ్ళం కాబట్టి, దేవుడు దీవించడు అని మనం అనకూడదు. ఆయన కోపంతో మనల్ని శిక్షించడం తప్పు అనీ ఆయన అన్యాయం చేసాడనీ మనం అనకూడదు. (మామూలు మనుషులు మాట్లాడినట్టు నేను మాట్లాడుతున్నాను.)
\v 6 దేవుడు తీర్పు చెప్పి ఉండకపోతే, ఆయన లోకానికి తీర్పు చెప్పడం సరి కాకపోవచ్చు గనక టి దేవుడు తీర్పు చెప్పకూడదని మనం కచ్చితంగా తేల్చి చెప్పకూడదు.
\s5
\v 7 "దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకుంటాడనే నిజం చాలా స్పష్టం అవుతుంది. ఉదాహరణగా, నేను ఒక అబద్ధం చెప్పాను అనుకోండి. దాని ఫలితంగా ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తారు. ఆయనకు కనికరం ఉంది కాబట్టి ప్రజలు ఆయన్ని పొగుడుతున్నారు. అందుకే నేను పాపం చేసినందుకు నన్ను శిక్షించాలని దేవుడు ఇక అనకూడదు.
\v 8 పౌలూ నువ్వు చెప్పేది నిజమైతే, అప్పుడు మనం ఆ విధమైన మంచి పనుల వంటి ఫలితాన్ని ఇవ్వడానికి చెడు పనులు చేయవచ్చు" అని కొందరు అనొచ్చు. అలా కొందరు మాట్లాడుతూ, నేను అలా మాట్లాడానని చెడ్డగా చెప్తూ నా మీద నింద వేస్తున్నారు. ఇలా నా గురించి మాట్లాడే వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. ఆయన శిక్షకు వాళ్ళు అర్హులే.
\s5
\p
\v 9 దేవుడు మనకు ఎంతో అనుకూలంగా వ్యవహరిస్తాడనీ యూదేతరులకు తక్కువ అనుకూలంగా వ్యవహరిస్తాడనీ మనం అనుకోవచ్చా? అలా మనం కచ్చితంగా చెప్పలేము. యూదులు, యూదేతరులు కూడా పాపం చేసారు కాబట్టి దేవుని శిక్షకు వాళ్ళు కూడా అర్హులే.
\v 10 లేఖనాల్లో - "ఎవరూ నీతిమంతుడు కాడు. ఒక్క నీతిమంతుడు కూడా లేడు" అని రాసిన మాటలు దీన్ని తెలుపుతున్నాయి.
\s5
\v 11 సరైన విధంగా ఎలా జీవించాలో ఎవరికీ తెలీదు. దేవుణ్ణి ఎలా వెదకాలో ఎవరికీ తెలీదు.
\p
\v 12 కచ్చితంగా అందరూ దేవుని నుండి తొలిగిపోయారు. వాళ్ళను భ్రష్టులుగా దేవుడు పరిగణించాడు. నీతిగా ప్రవర్తించే వాళ్ళు ఎవరూ లేరు. లేరు, ఒక్కరు కూడా లేరు.
\s5
\v 13 వారు తెరచిన సమాధి కంపు కొట్టినట్టు అసహ్యం కలిగించే మాటలు మాట్లాడతారు. తమ మాటలతో ప్రజలను మోసం చేస్తారు.
\q1 పాము విషం మనుషుల్ని గాయపరచినట్టే వాళ్ళు మాటలతో మనుషుల్ని గాయపరుస్తారు.
\q1
\v 14 వాళ్ళు ఆపకుండా ఇతరుల్ని శపిస్తూ క్రూరంగా మాట్లాడుతున్నారు.
\s5
\q1
\v 15 వాళ్ళు మనుషులను హత్య చేయడానికి ముందుంటారు.
\q1
\v 16 వాళ్ళు వెళ్ళిన ప్రతి చోట అంతా నాశనం చేస్తూ మనుషుల్ని బాధపెడతారు.
\q1
\v 17 ఇతరులతో సమాధానంగా జీవించడం వాళ్లకు తెలీదు.
\q1
\v 18 దేవుణ్ణి గౌరవించడానికి వాళ్ళు నిరాకరిస్తారు.
\s5
\p
\v 19 ఏమైనప్పటికి, ఈ ధర్మవిధుల ఆజ్ఞలు పొందిన వాళ్ళకు దాన్ని పాటించవలసిన అవసరం ఉన్నదని మాకు తెలుసు. దీని అర్థం - పాపం చేసినందుకు దేవుడు సంజాయిషీ అడిగినప్పుడు, యూదులు కానీ యూదేతరులు కానీ డానికి సంజాయిషీగా ఏమీ చెప్పలేరు.
\v 20 దేవుని ధర్మశాస్త్రం కోరినట్టు మనుషులు చేయడం వల్ల కాదు కానీ ఎవరూ అవి పూర్తిగా పాటించలేదు కాబట్టి వాళ్ళ పాపాల గురించి నమోదైన సమాచారాన్ని దేవుడు తుడిచివేస్తాడు. నిజానికి దేవుని ధర్మశాస్త్రం తెలియడం వల్ల మనం పాపం చేసామని స్పష్టంగా తెలుసుకున్నాం.
\s5
\p
\v 21 దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్తానికి లోబడడం మీద ఆధారపడి ఆయన మనల్ని ఆయనతో సమాధాన పరచలేదు. దేవుడు మన పాపాలను వేరే మార్గంలో క్షమిస్తాడని శాస్త్రాల్లో ప్రవక్తలు రాసారు.
\v 22 మనం యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచాము కాబట్టి దేవుడు మన పాపాల చిట్టాను చెరిపేసాడు. యూదులకూ యూదులు కానివారికీ దేవుని దృష్టిలో తేడా ఉండదు కాబట్టి క్రీస్తులో విశ్వాసముంచిన ప్రతి వ్యక్తి విషయంలో దేవుడు ఇలా చేస్తాడు.
\s5
\p
\v 23 మనుషులందరూ చెడ్డపనులు చేసిన వాళ్ళే. దేవుడు ఏర్పాటు చేసిన ఘనమైన లక్ష్యాలు సాధించడంలో ప్రతి ఒక్కరూ విఫలం అయ్యారు.
\v 24 దేవుడు మన పట్ల దయ చూపించి మన పాపాలు క్షమించడానికి మన పాపాల చిట్టా చెరిపేసాడు. క్రీస్తు యేసు మనల్ని విడిపించడం ద్వారా ఇది సాధించాడు.
\s5
\v 25 దేవుని కోపాన్నిమళ్ళించడానికి క్రీస్తు తన రక్తాన్ని చిందించి, చనిపోయాడని దేవుడు చూపించాడు. ఆయన మన కోసం చేసింది మనం నమ్మాలి. దేవుడు న్యాయంగా వ్యవహరించాడని క్రీస్తు బలియాగం తెలియ చేస్తుంది. అలా కాకపోతే, ఆయన న్యాయవంతుడని అనుకోకపోవచ్చు. దానికి కారణం దేవుడు సహనం ఉన్నవాడు కాబట్టి, మనుషులు గతంలో చేసిన పాపాలను ఆయన పట్టించుకోలేదు.
\v 26 మన కోసం మరణించడానికి క్రీస్తును దేవుడు నియమించాడు. అలా చేయడం ద్వారా ఆయన న్యాయవంతుడనీ, యేసులో నమ్మిన ప్రతి ఒక్కరి పాపాల చిట్టాని చెరిపివేయగల సామర్ధ్యం ఆయనకు ఉందని ఆయన చూపిస్తున్నాడు.
\s5
\p
\v 27 మనం మోషే ధర్మశాస్త్రానికి లోబడతాం కాబట్టి మన పాపాల చిట్టా దేవుడు చెరిపేస్తాడు అనేది అసలు కానే కాదు. కాబట్టి ఆ నియమాలకు మనం లోబడడం వల్ల దేవుడు మన పట్ల అనుకూలంగా ఉంటాడని మనం గొప్పలు చెప్పుకొనే అవకాశం లేదు. దీనికి బదులుగా క్రీస్తులో మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన పాపాల చిట్టాను చెరిపేస్తాడు.
\v 28 కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడే వ్యక్తిని కాదు కానీ క్రీస్తులో విశ్వాసం ఉంచిన వ్యక్తిని దేవుడు ఆయనతో సమాధానంగా ఉంచుతాడని స్పష్టం అవుతుంది.
\s5
\v 29 దేవుడు మిమ్మల్ని మాత్రమే అంగీకరిస్తాడని యూదులుగా ఉన్న మీరు కచ్చితంగా అనుకోకూడదు. ఆయన యూదులుకాని వాళ్ళను అంగీకరిస్తాడని మీరు కూడా గ్రహిస్తారు.
\v 30 యూదులుకాని వారిని ఆయన అంగీకరిస్తాడు ఎందుకంటే మీరు స్థిరంగా నమ్మినట్టుగా దేవుడు ఒక్కడే. ఆ దేవుడే యూదుల్ని సృష్టించాడు. సున్నతి పొందిన యూదుల్ని క్రీస్తులో విశ్వాసం ఉంచినందుకు దేవునితో సమాధాన పరచింది ఆయనే. యూదులుకాని వారిని సృష్టించింది కూడా ఆ దేవుడే. వీళ్ళు కూడా ఆయనలో విశ్వాసం ఉంచడంతో సున్నతి పొందకపోయినా వీళ్ళను సమాధానపరిచాడు.
\s5
\v 31 క్రీస్తులో విశ్వాసం ఉంచినందుకు తనతో సమాధానపరచింది దేవుడే అని మీరు అంటే, ధర్మశాస్త్రం ఉపయోగం లేనిదని దాని అర్ధమా? కచ్చితంగా కాదు. ధర్మశాస్త్రం నిజంగా చెల్లుతుంది.
\s5
\c 4
\p
\v 1 అబ్రాహాము మన యూదులు గౌరవించే పితరుడు. కాబట్టి అబ్రాహాముకు ఏమి జరిగిందో, మనం ఏమి నేర్చుకోవాలో దాని గురించి ఆలోచిద్దాం.
\v 2 అబ్రాహాము చేసిన మంచి పనుల వల్ల దేవుడు అతన్ని తనతో సమాధానపరచుకొని ఉంటే, ఆ విషయం గురించి ప్రజల మధ్య అబ్రాహాము గొప్పలు చెప్పుకుని ఉండేవాడు. (అయినప్పటికి దాని గురించి దేవుని దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి ఎలాటి కారణం ఉండేది కాదు.)
\v 3 లేఖనాల్లో రాసి ఉన్నది మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు అబ్రాహాముకు చేస్తానని ఇచ్చిన వాగ్దానం అతను నమ్మాడు. ఈ కారణంగా దేవుడు అబ్రాహాము తనతో సమాధానంగా ఉంటాడని భావించాడు.
\s5
\v 4 మనం చేసిన పనికి మనం జీతం తీసుకుంటే ఆ జీతం బహుమానం అవ్వదు కానీ మన సంపాదనగా భావిస్తాం. అలాగే దేవుని దయ పొందాలని మనం ఆయన కోసం ఏదొకటి చేసి బలవంతం పెడితే, అది బహుమానం అవ్వదు.
\v 5 కానీ వాస్తవానికి గతంలో ఆయన్ని గౌరవించని వాళ్ళను కూడా దేవుడు తనతో సమాధానపరచుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు ఆయనలో నమ్మకం ఉంచారు కాబట్టి వాళ్ళని దేవుడు తనతో సమాధానపరచుకున్నాడు.
\s5
\p
\v 6 అలాగే అసలు కష్టపడి సంపాదించకుండానే దేవుడు తనతో సమాధానపరచుకున్న వాళ్ళ గురించి దావీదు ఇలా రాసాడు -
\q1
\v 7 ఎవరి పాపాలను దేవుడు క్షమించాడో, ఎవరి పాపాలను ఆయన ఇక మీదట లెక్కచేయడో వాళ్ళకి ఎంత భాగ్యం!
\v 8 పాపాల చిట్టా ఇక ఉండని వాళ్ళకి ఎంత భాగ్యం!
\s5
\p
\v 9 ఇలాంటి భాగ్యం కలిగే అనుభవం మన యూదులకు మాత్రమే కాదు. యూదేతరులకు కూడా ఇలాంటి అనుభవం ఉంటుంది. "అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను" అని లేఖనాల్లో రాసి ఉన్న కారణం బట్టి మనకు ఇది తెలిసింది.
\v 10 దేవుడు అబ్రాహామును ఎప్పుడు తనతో సమాధానపరచుకున్నాడో ఆలోచించండి. అబ్రాహాము సున్నతి పొందక ముందే కానీ సున్నతి పొందాక కాదు.
\s5
\v 11 దేవుడు అబ్రాహామును అంగీకరించిన చాలా సంవత్సరాల తరువాత అబ్రాహామును సున్నతి చేసుకోమని ఆయన ఆజ్ఞాపించాడు. అబ్రాహాము అప్పటికే దేవునితో సమాధానంగా ఉన్నాడని, సున్నతి ఒక గుర్తుగా చూపడం అయ్యింది. కాబట్టి సున్నతి పొందనివాళ్లయినా, దేవునిలో విశ్వాసం ఉంచిన ప్రతి వారికి అబ్రాహాము పితరుడు అవుతాడు. ఈ విధంగా దేవుడు వీళ్ళందరూ తనతో సమాధానంగా ఉండాలని భావిస్తాడు.
\v 12 దేవుడు నిజమైన యూదులుగా ఉన్న మన అందరికీ అభ్రాహాము పితరుడుగా ఉంటాడని భావిస్తాడు. శరీరాలకు సున్నతి గుర్తు ఉన్న యూదులకు మాత్రమే కాదు కాని, చాలా ముఖ్యంగా మన పితరుడు అబ్రాహాము సున్నతి పొందడానికి ముందు దేవునిలో ఉన్నప్పుడు ఎలా జీవించాడో, అలాంటి జీవితం ఉన్న వాళ్ళ విషయంలో కూడా అలాగే భావిస్తాడు.
\s5
\p
\v 13 దేవుడు అబ్రాహాముకూ అతని సంతానానికీ భూమిని స్వాధీనం చేస్తానని చెప్పాడు. కానీ అబ్రాహాము ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడని వాగ్దానం చేయలేదు. దేవుడు చేసిన వాగ్దానం ఆయన తప్పకుండా నెరవేరుస్తాడనినమ్మాడు. కాబట్టి దేవుడు అబ్రాహామును తనతో సమాధానపరచుకున్నాడు.
\v 14 దేవుని ధర్మశాస్త్రానికి లోబడడం వల్ల ప్రజలు భూమిని స్వాధీనం చేసుకుంటే, అప్పుడు దేవునిలో విశ్వాసం ఉంచడం వల్ల ఉపయోగం లేదు, ఆయన వాగ్దానానికి అర్థం లేదు.
\v 15 వాస్తవానికి మనం ఏమి గుర్తుంచుకోవాలంటే, దేవుడు తన ధర్మశాస్త్రంలో సరిగ్గా లోబడని ప్రతివాడిని శిక్షిస్తాను అన్నాడు. అయినా ధర్మశాస్త్రం లేని వాళ్లకి దానికి లోబడకపోవడం అసంభవం అని కూడా మనం గుర్తుంచుకోవాలి.
\s5
\p
\v 16 ఆయన దయగలవాడు కాబట్టి దేవుడిలో నమ్మకం ఉంచడం చేత ఆయన ఇస్తానని వాగ్దానం ఇచ్చిన బహుమానాలను మనం పొందుతాం. దేవుని ధర్మశాస్త్రం ఉండి, ఆయనలో విశ్వాసముంచిన మన యూదీయ విశ్వాసులకూ దేవుని ధర్మశాస్త్రం లేకపోయినా అబ్రాహాములాగా ఆయనలో విశ్వాసం ఉంచిన యూదులు కానివారికీ నిజమైన అబ్రాహాము సంతానం అనబడే ప్రతి ఒక్కరికీ ఆయన వీటిని ఇస్తాడు. విశ్వాసులైన మనందరికీ అసలైన పితరుడిగా అబ్రాహాము ఉన్నాడని దేవుడు భావిస్తాడు.
\v 17 "అనేక జాతుల ప్రజలకు నిన్ను పితరుడిగా నేను చేస్తాను" అని దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాటలు లేఖనాలలో రాసి ఉంది. శూన్యం నుండి సృష్టిని చేసి, చనిపోయిన వాళ్ళను తిరిగి బ్రతికించిన దేవుడే ఈ వాగ్దానం అబ్రాహాముకు ప్రత్యక్షంగా ఇచ్చాడు.
\s5
\v 18 అబ్రాహాము, అతని భార్య పిల్లలను కనే వయసు దాటిపోయి ముసలివారు అయిపోయారు. తనకు సంతానం కలిగే భౌతిక కారణాలు కనిపించక పోయినా అతను దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరంగా నమ్మాడు. "నీ సంతానం ఆకాశంలోని నక్షత్రాల్లా ఉంటారు" అంటూ అనేక జాతులకు తండ్రిగా అవుతాడని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసాడు.
\p
\v 19 (అతనికి 100 సంవత్సరాల వయస్సు కాబట్టి) తన శరీరం తండ్రి అవ్వడానికి సహకరించదని అతనికి తెలిసినా, శారా ముసలితనాన్ని బట్టి బిడ్డను కనలేదని తెలిసినా, దేవుడు చేసిన వాగ్దానం గురించి అబ్రాహాము సందేహించలేదు.
\s5
\v 20 దేవుడు చేసిన వాగ్దానం గురించి అసలు అనుమానమే రాలేదు. దేవునిలో ఎంతో బలంగా నమ్మకం ఉంచాడు. దేవుడు నెరవేర్చబోయే వాగ్దానం విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు.
\v 21 దేవుడు ఏ విషయంలో వాగ్దానం చేసాడో అది తప్పకుండా చేస్తాడని అతను ఒప్పుకున్నాడు.
\v 22 అబ్రాహామును దేవుడు తనతో సమాధానపరచుకోడానికి కారణం అది.
\s5
\p
\v 23 "అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అతనిని దేవుడు తనతో సమాధానపరచుకున్నాడు" అని లేఖనాల్లో ఉన్న మాటలు కేవలం అబ్రాహాము గురించి మాత్రమే కాదు.
\v 24 మన యేసు ప్రభువు చనిపోయిన తరువాత ఆయన్ని తిరిగి బ్రతికించిన దేవునిలో నమ్మకం ఉంచడం వల్ల ఆయన తనతో సమాధానపరచుకునే మన అందరి గురించి లేఖనాల్లో రాసారు.
\v 25 మన చెడు పనుల కారణంగా దేవుడు యేసును చంపడానికి మనుషులకు అనుమతి ఇచ్చాడు. దేవుడు మనల్ని ఆయనతో సమాధానపరచుకోడానికి యేసును మళ్ళీ బ్రతికించాడు.
\s5
\c 5
\p
\v 1 మనం యేసు క్రీస్తు ప్రభువులో నమ్మకం ఉంచాము కాబట్టి దేవుడు మనల్ని ఆయనతో సమాధానంగా ఉంచాడు. అందుకే ఇప్పుడు మనం దేవునితో ప్రశాంతత కలిగి ఉన్నాం.
\v 2 క్ర్రీస్తు చేసిన కార్యం వల్ల దేవుడు ఎక్కడ మన పట్ల దయ చూపించగలడో అ తలుపును మన కోసం తెరచినట్టుగా ఉంది. అందుకే దేవుడు సంతోషంతో తన ఘనతను మనతో పంచుకుంటాడని మనం నమ్మకంతో ఎదురు చూస్తున్నాం కాబట్టి మనం దానికి సంతోషించాలి.
\s5
\v 3 యేసుతో మనం చేరాం కాబట్టి మనం హింస పొందినప్పుడు వాటిని ఓర్పుతో భరించడం నేర్చుకుంటున్నాం, అందుకే మనం కూడా సంతోషించాలి.
\v 4 మనం హింసను భరిస్తున్నప్పుడు దేవుడు దాన్ని ఆమోదిస్తాడని మనకు తెలుసు. దేవుడు ఆమోదించాడని మనకు తెలిసినప్పుడు ఆయన మన కోసం గొప్ప కార్యాలు చేస్తాడని మనం నమ్మకంతో ఎదురుచూస్తున్నాం.
\v 5 దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఎదురు చూసే వాటిని పొందుతామని మనం చాలా నమ్మకంతో ఉన్నాము. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన మనకు ఇచ్చిన పరిశుద్ధాత్మ మనకు అవగాహన కలిగిస్తున్నాడు.
\s5
\p
\v 6 మనల్ని మనం రక్షించుకోలేక పోయినప్పుడు మనం దేవుణ్ణి గౌరవించకపోయినప్పటికీ మనుషుల కోసం చనిపోయిన క్రీస్తును ఆ సమయంలో దేవుడు ఎన్నుకున్నాడు.
\v 7 మంచి వ్యక్తి అయినాకాని, ఇతరుల కోసం ఎవరైనా చనిపోవడం చాలా అరుదు. బహుశా ఒక మంచి వ్యక్తి కోసం అయితేనే చనిపోవడానికి ధైర్యం చేయవచ్చు.
\s5
\v 8 మనం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూనే ఉన్నాం. అయినాకానీ, క్రీస్తు మన కోసం చనిపోవడం ద్వారా మన మీద దేవునికి ఉన్న ప్రేమను మనకు చూపించాడు.
\v 9 మన పాపాల కోసం క్రీస్తు తన రక్తం చిందించి, మన కోసం చనిపోవడం వల్ల మన పాపాల విషయంలో దేవుని మహా కోపం నుండి క్రీస్తు మనల్ని మరింత కచ్చితంగా రక్షించి, దేవునితో సమాధానపరిచాడు.
\s5
\v 10 మనం ఆయనకు శత్రువులుగా ఉన్నప్పటికీ తన కుమారుడు మన కోసం చనిపోయిన కారణంగా దేవుడు మనల్ని తన స్నేహితులుగా చేసుకున్నాడు. క్రీస్తు మరణం నుండి తిరిగి బ్రతికి, ఇంకా మనల్ని రక్షించే పనిలో ఉన్నాడు కాబట్టి, దేవునితో మన బంధాలను దేవుడే పునరుద్ధరిస్తాడని ఇంకా కచ్చితంగా చెప్పగలం.
\v 11 అంతే కాదు, దేవుడు చేసిన కార్యానికి మనం ఆనందించాలి. మన యేసు క్రీస్తు ప్రభువు మన కోసం చనిపోయాడు కాబట్టి ఆయన దేవునితో మన సంబంధాలను పునరుద్ధరించాడు.
\s5
\p
\v 12 దేవుడు చేసిన ఆది మానవుడైన ఆదాము పూర్వం పాపం చేసిన కారణం బట్టి ప్రజలందరూ పాపాత్ములయ్యారు. పాపం చేసిన కారణంగా కాలక్రమేణా మరణించాడు. అప్పటి నుండి మానవులందరూ పాపాత్ములుగా జీవించి మరణించారు.
\v 13 మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వకముందు లోకంలోని మనుషులు పాపం చేశారు కానీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్న పాపాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు.
\s5
\v 14 ఆదాము జీవించినప్పటి కాలం నుండి మోషే జీవించిన కాలం వరకు ఉన్న మనుషులు కూడా పాపం చేశారు, దాని పర్యవసానంగా వాళ్ళు మరణించారు. ప్రతి వాళ్ళూ చనిపోయారు. ఆదాము చేసినట్టు దేవుని నుండి ప్రత్యక్ష ఆదేశం పొందని వాళ్ళూ చనిపోయారు. ఆదాము పాపం మనుషుల్ని ప్రభావితం చేసింది. అలాగే అతని తరువాత వచ్చిన క్రీస్తు, చేసిన కార్యం కూడా మనుషులందర్నీ ప్రభావితం చేస్తుంది.
\v 15 కానీ దేవుడు ఇచ్చే బహుమానం ఆదాము చేసిన పాపం వంటిది కాదు. ఆదాము పాపం చేసాడు కాబట్టి ప్రతి వారూ చనిపోతారు. కానీ మరొక మానవుడైన యేసు క్రీస్తు మన కోసం చనిపోవడం వల్ల దేవుడు మన మీద దయ చూపించాడు. మనకు అర్హత లేదు, అయినా సరే మనలో చాలా మందికి నిత్య జీవం అనే బహుమానం ఇస్తాడు.
\s5
\v 16 ఆదాము ఒక్కడు చేసిన పాపానికి విరుద్ధంగా ఉన్న దేవుని బహుమానంలో ఇంకొకటి ఉంది. ఆదాము పాపం చేసాడు కాబట్టి అతని తరువాత వచ్చిన వాళ్ళందరూ అతని తరువాత పాపం చేసిన వాళ్ళే. అందుకే మనుషులు అందరూ శిక్షకు అర్హులే అని దేవుడు ప్రకటించాడు. మన పాపాలు ఎన్నో ఉన్నప్పటికీ దయగల బహుమానంగా మనల్ని దేవుడు తనతో సమాధానపరచుకున్నాడు.
\v 17 ఆదాము ఒక్కడు చేసిన పని వల్ల మనుషులందరికి మరణం వచ్చింది. మనం అర్హులం కానప్పటికీ మనల్ని ఆయన తనతో సమాధానపరచుకున్నాడు. దేవుడు ఇచ్చిన ఆ దయగల గొప్ప బహుమానం మనలో చాలా మందికి అనుభవం అయ్యింది. క్రీస్తుతో కలిసి పరలోకంలో కచ్చితంగా రాజ్యం ఏలుతాం. అందుకు ఒక మనిషిగా యేసు క్రీస్తు చేసిన కార్యం కారణంగా ఇది జరుగుతుంది.
\s5
\p
\v 18 కాబట్టి, ఒక మనిషి - ఆదాము దేవుని ఆజ్ఞకు లోబడలేదు, దాని వల్ల మనుషులందరూ శిక్షకు అర్హులయ్యారు. అదే విధంగా ఒక మనిషి - యేసు న్యాయంగా నడుచుకుంటూ తను జీవించి ఉన్నంత కాలంలోనూ మరణంలోనూ కూడా దేవునికి లోబడడం ద్వారా దేవుడు మనలను ఆయనతో సమాధానపరచుకున్నాడు. జీవితాన్ని పునరుద్ధరించడానికి దేవుడు ప్రతి ఒక్కరిని తనతో సమాధానపరచుకున్నాడు.
\v 19 ఆదాము ఒక్కడు దేవునికి లోబడని కారణంగా చాలా మంది పాపులు అయ్యారు. అలాగే క్రీస్తు ఒక్కడు దేవునికి లోబడి, దేవునితో చాలా మందిని సమాధానపరచడానికి మరణించాడు.
\s5
\v 20 మనుషులు ఎంత ఘోరంగా పాపం చేస్తున్నారో తెలుసుకుంటారనే ఉద్దేశంతో దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ మనుషులు ఇంకా పాపం చేయడం ఎక్కువ అవ్వడం వల్ల, వాళ్లకు అర్హత లేకపోయినా దేవుడు వాళ్ళ పట్ల ఎంతో దయ చూపించడం కొనసాగించాడు.
\v 21 మనుషులు వాళ్ళ పాపం కారణంగా చనిపోకుండా, ఆయన దయగల బహుమానం వాళ్ళను ఆయనతో సమాధానంగా ఉంచుతుంది. మన యేసు క్రీస్తు ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి వాళ్ళు నిత్యం జీవించగలరు.
\s5
\c 6
\p
\v 1 నేను రాసిన దానికి జవాబిస్తూ, దేవుడు మన పట్ల దయ చూపిస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా ఎక్కువగా కనికరం చూపించేవాడు కాబట్టి ఆ క్రమంలో బహుశా మనం ఇంకా పాపం చేయడం కొనసాగించవచ్చు అని ఎవరైనా అనొచ్చు.
\v 2 అలా కచ్చితంగా కాదు. మనం చచ్చినవాళ్ళలాగా ఉన్నాం, ఇకనుంచి ఎవ్వరూ ఎలాంటి చెడుపనులు చెయ్యలేరు. కాబట్టి మనం పాపం చేయడం కొనసాగించకూడదు.
\v 3 యేసు క్రీస్తుతో ఐక్యమై మనం బాప్తిసం పొందినప్పుడు, క్రీస్తుతో కలిసి సిలువ మీద మనం చనిపోతూ ఉండడం దేవుడు చూసాడు. మీరు అది తప్పకుండా గ్రహించాలి.
\s5
\p
\v 4 అందుకే మనం బాప్తిసం తీసుకున్నప్పుడు క్రీస్తుతో సమాధిలో ఉండడం దేవుడు చూసాడు. తండ్రి అయిన దేవుడు తన శక్తిని ఉపయోగించి క్రీస్తును మరణం నుండి లేపాడు. అదే విధంగా, మనం జీవించడం కోసం కొత్త మార్గాన్ని ఆయన సాధ్యం చేసాడు.
\v 5 క్రీస్తు చనిపోయినప్పుడు మనం ఆయనతో చేరడం దేవుడు చూసి, ఆయనతో మరణం నుండి మనల్ని లేపాడు.
\s5
\v 6 మన పాప స్వభావానికి ముగింపు పెట్టే క్రమంలో క్రీస్తుతో పాటు సిలువ మీద పాపంతో మనం చనిపోవడం దేవుడు చూస్తాడు. దాని ఫలితంగా మనం ఇక పాపం చేయలేము.
\v 7 ఇలా ఎవరు చనిపోయి ఉన్నా సరే వాళ్ళు ఇక పాపం చేయలేరు.
\s5
\p
\v 8 క్రీస్తు చనిపోయినప్పుడు మనతో కలిసి చనిపోవడం దేవుడు చూసాడు కాబట్టి, మనం కూడా ఆయనతో జీవిస్తామని మనం నమ్ముతాము.
\v 9 క్రీస్తు చనిపోయిన తరువాత తిరిగి బ్రతకడానికి దేవుడు అనుమతించాడు. క్రీస్తు ఇక ఎప్పటికి మరణించడు. ఆయన్ని ఏదీ చంపలేదు.
\s5
\v 10 ఆయన చనిపోయినప్పుడు మన పాప లోకం నుండి విడుదల పొందాడు. కాని ఆయన మళ్ళీ జీవిస్తున్నాడు కాబట్టి దేవుని సేవించడానికి ఆయన జీవిస్తాడు.
\p
\v 11 అదే విధంగా దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో నిన్ను నువ్వు కూడా అలాగే చూసుకోవాలి - మీరు చనిపోయిన వాళ్ళు, ఇక ముందు పాపం చేయలేరు, కానీ మీరు కూడా జీవిస్తున్నవారు. క్రీస్తు యేసుతో మీరు చేరి, దేవుణ్ణి సేవించడానికి జీవిస్తున్నారు.
\s5
\v 12 అందుకే మీకు పాపం చేయాలని అనిపించినప్పుడు మీకు ఇష్టం అయ్యింది చేయడానికి మిమ్మల్ని మీరు అనుమతించకండి. మీ శరీరం ఏదో ఒక రోజు చనిపోతుందని గుర్తుంచుకోండి.
\v 13 చెడు చేయడానికి మీ శరీర భాగాన్ని దేన్నీ వాడొద్దు. దీనికి బదులుగా, చనిపోయిన వాళ్లకు చెందిన రాజ్యం నుండి ఇప్పుడు తిరిగి బ్రతికిన వ్యక్తిగా దేవునికి నువ్వు చూపించుకోవాలి. నీ శరీరంలోని ప్రతి భాగాన్ని దేవుని కోసం వాడాలి. నీతి కార్యాలు చేయడానికి నువ్వు ఆయన్ని అనుమతించు.
\v 14 నీకు పాపం చేయాలని అనిపించినా చేయొద్దు. మోషేకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం పాపం చేయడాన్ని అసలు ఆపలేకపోయింది. కాని ఇప్పుడు దేవుడు నిన్ను క్రమపరచి, పాపం చేయకుండా నీకు దయతో సహాయం చేస్తాడు.
\s5
\v 15 దీని నుండి మనం ఏమి ఆలోచించాలంటే దేవుడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు పాపాన్ని చేయడాన్ని ఆపలేకపోయాయి. దేవుడు ఇప్పుడు మన మీద దయ చూపిస్తూ ఉంటే దేవుడు మనల్ని పాపం చేయడం కొనసాగించడాన్ని అనుమతిస్తాడా? కచ్చితంగా కాదు!
\v 16 మీరు ఎవరికి అయినా లోబడాలి అనుకుంటే మీరు వాళ్లకి బానిసలు అవుతారు. పాపం చేయాలని అనిపించినప్పుడు మీరు దానికి లొంగిపోతే, మీరు పాపానికి బానిసలు అవుతారు. దాని ఫలితంగా చనిపోతారు. కాని మీరు దేవునికి లోబడితే, అప్పుడు మీరు ఆయనకు బానిసలు అవుతారు. దాని ఫలితంగా మీరు దేవుడు కోరిన మంచి పనులు చేస్తారు.
\s5
\v 17 గతంలో మీరు ఎలాంటి పాపం చేయాలనుకుంటే అలాంటి పాపం చేశారు. అప్పుడు మీరు పాపానికి బానిసలు. కానీ తరువాత మీరు క్రీస్తు బోధకు నిజంగా లోబడడం మొదలుపెట్టారు. అందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.
\v 18 కాబట్టి మీరు ఇక పాపం చేయకూడదు. ఇక పాపం మీ గురువు కాదు. మీరు ఇప్పుడు నీతి ఉన్నవారు, దేవునికి బానిసలు.
\s5
\p
\v 19 సామాన్య ప్రజలు అర్థం చేసుకునే విధానంలో నేను మీకు రాస్తున్నాను. గతంలో మీరు మీ కోరికలకు బానిసలు అయితే, మీరు అన్ని రకాల చెడు పనులు, అపవిత్రం అయినవీ చేశారు. కానీ ఇప్పుడు మీరు దేవుడు వ్యవహరించినట్టే న్యాయంగా వ్యవహరించండి. అప్పుడు ఆయన మిమ్మల్ని ప్రత్యేకించుకొని తన ప్రజలుగా చేసుకుంటాడు.
\v 20 గతంలో మీరు దేవుని శక్తిని, ఆయన నీతిని వదిలేసిన వాళ్ళలా ఉన్నారు (మీ చెడు మనసాక్షి మీకు ఏమి చెప్పిందో అవన్నీ చేశారు). అవన్నీ చేయాల్సినవి కాదు.
\v 21 అయినప్పటికీ మీరు చేశారు, దాని ఫలితంగా దేవుని నుండి విడిపోయారు. అలాంటివి చేయడంవల్ల మీకు ప్రయోజనం ఏమీ లేకుండా పోయింది. అది మీకు సిగ్గు తెచ్చి పెట్టింది.
\s5
\p
\v 22 కానీ ఇప్పుడు మీరు ఇక పాపం చేయకూడదు. ఆ విధంగా మీరు బానిసలు కాదు. మీరు దేవునికి బానిసలు. ఆయన సొంత ప్రజలుగా మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాడు. ఆయనతో మీరు ఎప్పటికీ జీవించడానికి ఆయన అనుమతిస్తాడు.
\v 23 తమ చెడు మనస్సు చెప్పేది చేసే వాళ్ళందరూ దాని పరిహారం పొందుతారు. ఆ పరిహారానికి పర్యవసానం మరణం. వీళ్ళు దేవునికి శాశ్వతంగా దూరం అయిపోతారు. కానీ దేవుని విషయంలో తన బానిసలకు ఎలాంటి జీతం దేవుడు ఇవ్వడు, దానికి బదులుగా ఉచిత బహుమానం ఇస్తాడు. నిత్యం ఆయనతో జీవించడానికి, మన ప్రభు క్రీస్తు యేసును చేరడానికి అనుమతిని ఇస్తాడు.
\s5
\c 7
\p
\v 1 నా తోటి విశ్వాసులారా, మీకు ధర్మశాస్త్రం గురించి తెలుసు. మనుషులు జీవించినంత కాలం మాత్రమే ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలి.
\s5
\v 2 ఉదాహరణకు ఒక స్త్రీ తన భర్త విషయంలో జీవించి ఉన్నంత వరకు అతనికి నమ్మకంగా ఉండాలి. కానీ ఆమె భర్త చనిపోతే, ఆమె వివాహిత అయినా ఇక వివాహ సంబంధ నియమం పాటించాల్సిన అవసరం లేదు. వివాహ సంబంధ నియమం నుండి ధర్మశాస్త్రం ఆమెకు విడుదల ఇస్తుంది.
\v 3 భర్త బ్రతికి ఉండగానే వేరొక పురుషుని దగ్గరికి ఆమె వెళ్తే, వ్యభిచారిణి అవుతుంది. కానీ ఆమె భర్త చనిపోతే, ఆమె ధర్మశాస్త్రానికి ఇక లోబడవలసిన అవసరం లేదు. అప్పుడు ఆమె ఇంకొక పురుషుని పెళ్ళి చేసుకుంటే ఆమె వ్యభిచారంలో ఉన్నట్టు కాదు.
\s5
\p
\v 4 అదే విధంగా నా సోదరి, సోదరులారా! యేసుతో మీరు ఆయన సిలువ మీద చనిపోయినప్పుడు దేవుని ధర్మశాస్త్రం మిమ్మల్ని అదుపు చేయలేదు. క్రీస్తును చేరుకోడానికి మీరు స్వేచ్ఛ పొందారు కాబట్టి మీరు దేవుని ఘనపరచగలరు. మీరు తిరిగి బ్రతికారు కాబట్టి మీరు ఈ విధంగా చేయగలరు. దేవుడు క్రీస్తును మరణం నుండి లేపాడు, మిమ్మల్ని క్రీస్తుతో చేర్చాడు.
\v 5 మన చెడు ఆలోచనలు చెప్పినట్టుగా మనం చేసినపుడు ధర్మశాస్త్రం నేర్చుకున్నప్పటికీ మనకు ఇంకా ఇంకా పాపం చెయ్యాలనిపిస్తుంది. అలా చేసిన చెడు పనుల వల్ల దేవుడు మనల్ని తన నుండి శాశ్వతంగా వేరు చేయడానికి దారి తీస్తుంది.
\s5
\v 6 కానీ ఇప్పుడు మోషే ధర్మశాస్త్రానికి లోబడవలసిన అవసరం లేకుండా దేవుడు మనల్ని విడిపించాడు. మనం చనిపోతే మనం ఏమి చెయ్యాలో ధర్మశాస్త్రం మనకు ఇక చెప్పదు. దేవుడు మనకు చేసిన కార్యాన్ని బట్టి పాత పద్ధతి ప్రకారం ధర్మశాస్త్రం అవసరం లేకుండా, పరిశుద్ధాత్మ మనకు చూపించిన విధంగా కొత్త పద్ధతిలో మనం దేవుని ఆరాధించవచ్చు.
\s5
\p
\v 7 ప్రజలు దేవుని ధర్మశాస్త్రాన్ని తెలుసుకుంటే, పాపం ఎక్కువగా చేస్తారని అనుకోవచ్చా? అలా అనుకుంటే అందులోని నియమాలన్నీ చెడ్డవి అవుతాయి. అలా అస్సలు కానే కాదు. ధర్మశాస్త్రం చెడ్డది కాదు. ధర్మశాస్త్రం నేను తెలుసుకునేంత వరకు పాపం అంటే ఏమిటో నాకు తెలీదు, ఇది నిజం. ఉదాహరణగా, "నీది కాని దానిని నువ్వు ఆశించకూడదు" అని ధర్మ శాస్త్రం చెప్పింది. నాది కానిది ఆశపడడం తప్పు అని, నేను ధర్మశాస్త్రం తెలుసుకునే వరకు నాకు తెలీదు.
\v 8 ఆ ఆజ్ఞ ఏమి చెప్తుందంటే, ఇతరులకు చెందిన వస్తువులను నేను కావాలనుకొనే నా పాపపు కోరిక చాలా రకాలైన లైంగిక వాంఛలకు నేను లోను కావడానికి కారణం అయ్యింది. మనం చేసే పాపపు పనులను అరికట్టడానికి ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం చేయాలనే కోరిక మనల్ని ప్రేరేపించలేదు.
\s5
\p
\v 9 అంతకు ముందు దేవుని ధర్మశాస్త్రంలో ఏముందో నాకు తెలియనప్పుడు నేను ఏమి చేస్తున్నానో తెలియదు కాబట్టి నాలో ఆందోళన లేకుండా నేను పాపం చేసాను. కానీ దేవుడు తన ధర్మశాస్త్రం ఇచ్చాడని నాకు తెలిసినప్పుడు, నేను పాపం చేస్తున్నానని అకస్మాత్తుగా గ్రహించాను.
\v 10 దేవుని నుండి నేను వేరు పడ్డానని కూడా గ్రహించాను. నేను ధర్మశాస్త్రం పాటిస్తే నిత్య జీవం పొందడానికి అనుమతి కోరుకుంటున్న నన్ను దానికి బదులుగా మరణానికి నడిపిస్తుంది.
\s5
\p
\v 11 నేను పాపం చేయాలని అనుకున్నప్పుడు, నేను ధర్మశాస్త్రానికి లోబడితే చాలు నిత్యం జీవిస్తానని అనుకున్నాను. అదే సమయంలో నేను పాపం చేస్తూనే ఉండొచ్చని అనుకున్నాను. కానీ నేను తప్పుగా అనుకున్నాను. నిజానికి, నేను ధర్మశాస్త్రానికి నిజంగా లోబడలేదు కాబట్టి దేవుడు నన్ను తన నుండి ఎప్పటికీ వేరు చేస్తాడు.
\v 12 కాబట్టి దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం కచ్చితంగా మంచిదే. దేవుడు మనకు పాటించమని ఆజ్ఞాపించింది అంతా దోషం లేనిదీ న్యాయమైనదీ మంచిది.
\s5
\p
\v 13 "దేవుడు మోషేకు ఇచ్చిన ఆ మంచి ధర్మ విధుల ఫలితంగా దేవుని నుండి వేరయ్యాం" అని ఎవరో ఒకరు అభ్యంతరం చెప్పవచ్చు. "కచ్చితంగా ఆ విధులు అలా చేయలేదు" అని నేను జవాబిస్తాను. కానీ బదులుగా, ఆ మంచి ధర్మ విధులు పాపం చేయడానికి ప్రేరణ కలిగించాయి. ఆ ప్రేరణకు ఫలితమే నన్ను దేవుని నుండి వేరు చేసింది. దేవుడు ఆజ్ఞాపించింది నేను తెలుసుకున్నాను కాబట్టి, నేను చేసేది పాపం అనే నిజం నాకు తెలిసింది.
\p
\v 14 దేవుని నుండి ధర్మశాస్త్రం వచ్చిందని మనకు తెలిసాక మన తీరు మారిపోయింది. పాపం వైపు మొగ్గుచూపే ధోరణిలో ఉంటున్న మనిషిని నేను. పాపం చేయాలనే బలమైన కోరిక నన్ను బలవంతంగా దానికి బానిసను చేసింది కాబట్టి, నా కోరికలు నన్ను చేయమని చెప్పినవన్నీ చేసాను.
\s5
\v 15 నేను చేసే పనులు ఎందుకు చేస్తున్నానో చాలావరకు నాకు అర్థంకావు. కొన్నిసార్లు మంచి పనులు చేయాలని అనుకుంటాను కానీ అవి చేయను. కొన్నిసార్లు నేను దేనిని అసహ్యించుకుంటానో ఆ చెడ్డ పనులనే చేస్తాను.
\v 16 నేను చెడ్డ పనులు చేయకూడదు అనుకుంటాను, అయినా చేస్తాను. దేవుని ధర్మశాస్త్రం నాకు సరి అయిన దారి చూపిస్తుందని ఒప్పుకుంటాను.
\s5
\v 17 కాబట్టి నేను పాపం చేయాలనే ఉద్దేశంతో నేను చేయట్లేదు. బదులుగా నాలో ఉన్న పాపం చేయాలనే కోరిక కారణంగా నేను పాపం చేస్తున్నాను.
\p
\v 18 నా సొంత ధోరణిని అనుసరిస్తూ ఉన్నప్పుడు నేను ఏ మంచి చేయలేను అని నాకు తెలుసు. మంచినే నేను చేయాలనుకుంటాను కాని చేయలేను కాబట్టి ఇది నాకు తెలుసు.
\s5
\v 19 నేను చేయాలనుకునే మంచి పనులు నేను చేయను. బదులుగా, చేయకూడదు అనుకున్న చెడ్డ పనులు నేను చేస్తాను.
\v 20 నేను చేయడానికి ఇష్టపడని చెడ్డ పనులు నేను చేసినప్పుడు, ఆ పనులు చేసేది నిజంగా నేను కాదు. నాతో పాపం చేయించేది నా పాపపు పద్ధతి మాత్రమే.
\v 21 మంచి చేయాలని నేను అనుకున్నప్పుడు నాలోని చెడు కోరిక వచ్చి నన్ను మంచి పని చేయకుండా చేస్తుంది అని తరువాత నేను తెలుసుకున్నాను.
\s5
\v 22 నేను నా ఈ నూతన వైఖరిలో దేవుని ధర్మశాస్త్రం గురించి చాలా సంతోషిస్తున్నాను.
\p
\v 23 అయినా నా శరీరంలో వేరే శక్తి ఉన్నట్టు నేను గ్రహించాను. అది నా మనస్సులో నేను కోరుకున్నది చేయకుండా వ్యతిరేకిస్తుంది. నా పాత ధోరణి నేను ఏమి చేయాలని అనుకుంటుందో దానినే నాతో చేయిస్తుంది.
\s5
\v 24 ఇది నేను ఆలోచించినప్పుడు నేను చాలా దౌర్భాగ్యుడినని అనిపిస్తుంది. దేవుని నుండి నేను వేరు కాకుండా ఉండడానికి, నన్ను నా శరీర వాంఛల అదుపు నుండి నన్ను విడిపించే ఒకరు నాకు కావాలి.
\v 25 మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మన శరీర కోరికల అదుపు నుండి మనల్ని విడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మన మనస్సులతో దేవుని ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ నా పాత పాపపు ధోరణి వల్ల నేను తరచుగా పాపం చేయాలనే కోరికల అదుపులో కూడా ఉంటాను.
\s5
\c 8
\p
\v 1 క్రీస్తు యేసుతో చేరిన వాళ్ళను దేవుడు నిందించడు, శిక్షించడు.
\v 2 దేవుని ఆత్మ కారణంగా క్రీస్తుతో చేరాము కాబట్టి కొత్త మార్గంలో జీవిస్తాం. ఈ పద్ధతిలో పాపం గురించి ఆలోచన వచ్చినా ఇక నేను పాపం చేయను. దేవుని నుండి ఇక విడిపోను.
\s5
\v 3 దేవునితో జీవించే క్రమంలో దేవుని ధర్మశాస్త్రానికి లోబడడానికి మనం ప్రయత్నించాం. పాపం చేయడం మానేయాలని అనుకున్నాం కానీ అలా అనుకోవడం వల్ల ప్రయోజనం దొరకలేదు. అందుకే పాపానికి ప్రాయశ్చిత్తం చెల్లించడానికి తన సొంత కుమారుణ్ణి దేవుడు ఈ లోకానికి పంపి మనకు సహాయం చేసాడు. పాపం చేసే మన శరీరం లాంటి శరీరంతో తన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మన పాపాల కోసం బలిగా తనను తాను అర్పించుకోడానికి వచ్చాడు. ఆయన ఇది చేసినప్పుడు మన పాపాలు నిజంగానే చెడ్డవి అనీ పాపం చేసిన వాళ్ళు శిక్షకు అర్హులు అనీ మనకు చూపించాడు.
\p
\v 4 కనుక ఇప్పుడు దేవుడు తన ధర్మశాస్త్రంలో కోరినవన్నీ మనం నేరవేర్చగలం. ఇది మన పాత చెడ్డ ధోరణిలో కొనసాగుతూ చేయలేము కానీ మనం జీవించాలని దేవుని ఆత్మ అనుకున్న మార్గం ద్వారా మనం చేయగలం.
\v 5 చెడు ధోరణితో జీవించే వాళ్ళు అలాంటి వైఖరి మీద శ్రద్ధ ఉంచుతూ ఆలోచిస్తారు. కాని దేవుని ఆత్మ ఇష్టపడే పద్ధతి ప్రకారం జీవించే వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచిస్తారు.
\s5
\v 6 చెడు ధోరణిలోని కోరికలతో ఆలోచించి, ఆందోళన చెందేవాళ్ళు నిత్యం జీవించలేరు. కానీ దేవుని ఆత్మ కోరుకునేది కావాలనుకునేవాళ్ళు శాంతితో, నిత్యం జీవిస్తారు.
\p
\v 7 నేను ఇది వివరిస్తాను. చెడు ధోరణిలోని కోరికలతో ఉన్నవాళ్ళు దేవుడికి విరుద్ధంగా ప్రవర్తిస్తారు. వాళ్ళు ఆయన విధులకు లోబడరు. నిజానికి ఆయన ధర్మశాస్త్రానికి వాళ్ళు లోబడలేరు.
\v 8 వాళ్ళ చెడ్డ ధోరణి చెప్పింది చేసే వాళ్ళు దేవుని సంతోష పెట్టలేరు.
\s5
\v 9 కానీ పాత చెడ్డ ధోరణి మనల్ని అదుపు చేయనివ్వకూడదు. బదులుగా, దేవుని ఆత్మ మనలో నివసిస్తాడు కాబట్టి, దేవుని ఆత్మను మనల్ని అదుపు చేయనివ్వాలి. క్రీస్తు నుండి వచ్చిన ఆత్మ మనుషుల్లో నివసించకపోతే వాళ్ళు ఆయనకు చెందరు.
\v 10 కానీ క్రీస్తు తన ఆత్మ ద్వారా మీలో నివసిస్తుంటే, మీ శరీరాలు చనిపోయినట్టు దేవుడు చూస్తాడు. అందుకే మీరు ఇక పాపం చేయరు. మీ ఆత్మలు బ్రతకడం ఆయన చూస్తాడు కాబట్టి ఆయనతో మిమ్మల్ని సమాధానంతో ఉంచుతాడు.
\s5
\v 11 యేసు చనిపోయిన తరువాత దేవుడు యేసును బ్రతికించాడు. ఆయన ఆత్మ మీలో నివసిస్తుంది కాబట్టి ఇప్పుడు చనిపోయే మీ శరీరాలను కూడా దేవుడు తిరిగి బ్రతికిస్తాడు. క్రీస్తు యేసు చనిపోయాక తిరిగి బ్రతికించాడు, ఆయన ఆత్మ ద్వారా ఆయన మిమ్మల్ని మళ్ళీ బ్రతికిస్తాడు.
\s5
\p
\v 12 కాబట్టి నా తోటి విశ్వాసులారా! ఆత్మ మనకు సూచించినట్టు జీవించడానికి మనం బద్ధులం. మన పాత ధోరణి కోరినట్టుగా జీవించడానికి మనం బద్ధులం కాదు.
\v 13 మీ పాత ధోరణి కోరినట్టు మీరు చేస్తే మీరు నిత్యం దేవునితో జీవించలేరు. కాని ఆత్మ అలాంటి పనులు చేయకుండా మిమ్మల్ని ఆపితే అప్పుడు మీరు నిత్యం జీవిస్తారు.
\s5
\v 14 దేవుని ఆత్మకు లోబడిన వాళ్ళు దేవుని పిల్లలు.
\v 15 పిరికితనంతో జీవించే ఆత్మను మీరు పొందుకోలేదు. మీరు యజమానులకు భయపడే బానిసల వంటి వాళ్ళు కాదు. దీనికి విరుద్ధంగా దేవుడు మీకు తన ఆత్మను ఇచ్చాడు. ఆయన ఆత్మ మనల్ని దేవుడి పిల్లలుగా చేసింది. ఆ ఆత్మ ఇప్పుడు, "నువ్వు నా తండ్రివి!" అని దేవునికి మొరబెట్టడానికి సహాయం చేస్తుంది.
\s5
\v 16 మనం దేవుని పిల్లలమని మన ఆత్మ చెప్తుండగా దేవుడి ఆత్మ తనకు తానే నిర్ధారిస్తాడు.
\v 17 మనం దేవుడి పిల్లలం కాబట్టి మనం కూడా ఒక రోజున దేవుడు చేసిన వాగ్దానాన్ని పొందుకుంటాం. క్రీస్తుతో దీన్ని మనం పొందుకుంటాం. కానీ దేవుడు మనల్ని గౌరవించాలంటే క్రీస్తు చేసినట్టు మనం కూడా మంచిని చేసినందుకు హింస పొందాలి.
\s5
\p
\v 18 దేవుడు వెల్లడి చేసే భవిషత్ వైభవం కోసం కనిపెడుతూ ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొనే హింస మీద శ్రద్ధ పెట్టకూడదని నేను అనుకుంటున్నాను.
\v 19 దేవుడు సృష్టించినవి అన్నీ ఆయన అసలైన పిల్లలు ఎవరో వెల్లడి చేసే సమయం కోసం ఎదురు చూస్తున్నాయి.
\s5
\v 20 దేవుని సృష్టి అయిన మానవుడు ఆయన ఉద్దేశించినట్టు సాధించలేకపోయాడు. వాళ్ళు విఫలం అవ్వాలని అనుకోవడం కారణం కాదు. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుడు కచ్చితమైన వాడు కాబట్టి ఆయన వాళ్ళని అలా చేసాడు.
\v 21 ఆయన సృష్టించినవి ఒక రోజున ఇక చనిపోవు, కుళ్ళిపోవు , రాలిపోవు. ఆయన దాని నుండి వాటికి స్వేచ్ఛ కలిగించే క్రమంలో అద్భుతమైనవి ఆయన తన పిల్లలకూ అదే చేస్తాడు.
\v 22 ఇప్పటి వరకు దేవుని సృష్టి అంతా కలిసి ఆయన అవే అద్భుతాలు చేయాలని మూలుగుతున్నాయి. ఇది ఒక స్త్రీ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పడే ప్రసవ వేదనలా ఉంది.
\s5
\v 23 దేవుని సృష్టే కాదు, మనం కూడా లోలోపల మూలుగుతూనే ఉన్నాం. దేవుడు మనకు బహుమతిగా ఇచ్చిన ఆత్మను మనం కలిగి ఉన్నాం. దేవుడు మనకు ఇచ్చే ప్రతిదాని కోసం ఎదురుచూస్తూ కూడా మనం లోలోపల సణుగుతూనే ఉంటాము. దేవుడు దత్తత తీసుకున్న పిల్లలంగా మనం మన పూర్తి హక్కులు స్వీకరించే సమయం కోసం ఆత్రంగా ఎదురుచూసేటప్పుడు కూడా మనం మూలుగుతూనే ఉంటాము. అందుకని, భూమిపై మనకు ఆటంకం కలిగించే సంగతుల నుండి ఆయన మన శరీరాలను విడిపించుకుంటాడు. ఆయన మనకు కొత్త శరీరాలను ఇవ్వడం ద్వారా దీన్ని చేస్తాడు.
\v 24 మనము ఆయనపై నమ్మకం ఉంచాము, అందుకే దేవుడు మనల్ని రక్షించాడు. మనం ఇప్పుడు ఎదురుచూస్తున్న వస్తువులను మనం కలిగి ఉంటే, ఇకపై వాటి కోసం వేచి చూడాల్సిన పని లేదు. అన్నింటికంటే మీరు పొందాలని ఎదురుచూస్తున్న ఏదైనా మీరు కలిగి ఉంటే కచ్చితంగా మీరు వాటికోసం వేచి ఉండాల్సిన పని లేదు.
\v 25 కాని, మనకు ఇంకా రాని వాటికోసం మనం ఎంతో ఆత్రంగా, ఓపికగా ఎదురుచూస్తూనే ఉంటాం.
\s5
\p
\v 26 అదేవిధంగా మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తాడు. మనకి ఎలా ప్రార్థన చేయాలో సరిగ్గా తెలియదు. కాని, దేవుని ఆత్మకి తెలుసు. ఆయన మాటలలో చెప్పలేని మూలుగులతో మన కోసం ప్రార్థన చేస్తాడు.
\v 27 మన అంతర్గత ధోరణిని మన మనసుని చూసే దేవుడు ఆయన ఆత్మ కోరుకునేది ఏమిటో అర్థం చేసుకోగలడు. దేవుడు ఎలాగైతే ప్రార్ధించాలని ఆయన ఆత్మను కోరుకున్నాడో ఆలాగే ఆ ఆత్మ మన కోసం ప్రార్ధిస్తున్నాడు.
\s5
\p
\v 28 ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తున్న వారు, వారికి జరిగే అన్ని విషయాలను దేవుడు మంచిగానే చేస్తాడని వారికి తెలుసు. ఆయన ఎన్నుకున్నవారి కోసమే ఆయన ఇలా చేస్తాడు ఎందుకంటే ఆయన చేయాలనుకున్నది ఇదే.
\v 29 మనము దేవునిలో విశ్వాసము ఉంచుతామనీ ఆయన కుమారుని లక్షణాలను మనం కలిగి ఉంటాం అనీ దేవునికి ముందుగానే తెలుసు. దాని ఫలితంగా క్రీస్తు దేవుని ప్రథమ పుత్రుడుగా ఎవరైతే ఆయన పిల్లలుగా ఉంటారో వారు క్రీస్తు యొక్క అనేకమంది సహోదరులుగా అయ్యారు.
\v 30 తన కుమారుడిలాగా ఎవరు ఉంటారో దేవుడు ముందే నిర్ణయించుకున్నాడు, వాళ్ళు తనతో ఉండాలని వారిని కూడా పిలిచాడు. ఆయన ఎవరినైతే తనతో ఉండాలని పిలిచాడో, వారిని ఆయనతో సరిగ్గా ఉండేలా చేసాడు. ఇంకా ఆయన ఎవరినైతే తనతో సరిగ్గా ఉండేలా చేసాడో, వారికి దేవుడు ఘనతను కూడా ఇస్తాడు.
\s5
\v 31 కాబట్టి నేను మీకు చెప్పేది ఏమిటంటే ఈ సంగతులను బట్టి దేవుడు మన కొరకు ఏమి చేస్తాడో అది మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మన తరుపున ఉన్నాడు మనపై ఎవరు గెలవలేరు.
\v 32 దేవుడు తన సొంత కొడుకుని కూడా విడిచి పెట్టలేదు. బదులుగా, ఆయన మనందరి కోసం చనిపోవడం వల్ల మనం లాభం పొందుతామని నమ్మి ఆయనలో విశ్వాసం ఉంచడానికి తన కుమారుడిని క్రూరంగా చంపటానికి ఇతరులకు అప్పగించాడు. ఎందుకంటే ఆయన కోసం జీవించటానికి మనకి కావలిసినవన్నీ కచ్చితంగా ఇవ్వటానికి అలా చేసాడు.
\s5
\v 33 దేవుడు మనలను ఆయనకే చెందినవారిగా ఎన్నుకున్నాడు కాబట్టి, తప్పు చేసామని దేవుని ఎదుట ఎవరూ మనపై నిందలు వేయలేరు. మనలను తనతో సమాధానపరచుకునేవాడు ఆయనే.
\v 34 ఇకపై మనల్ని ఎవరూ ఖండించలేరు. క్రీస్తు ఒక్కడే మన కొరకు చనిపోయాడు అంతకంటే ఎక్కువగా ఆయన చావు నుండి తిరిగి లేచాడు. ఇంకా మహిమగల స్థలంలో ఉండి దేవునితో కలిసి పరిపాలన చేస్తున్నాడు. ఆయనే మన కోసం వేడుకుంటున్నాడు.
\s5
\v 35 ఎవరైనా మనకు హాని చేసినా మనల్నిబాధించినా మనకి తినడానికి ఏమి లేకపోయినా మనకు సరైన బట్టలు లేకపోయినా మనం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటున్నా లేదా ఎవరైనా మనల్ని చంపాలని చూసినా, క్రీస్తు మనలను ప్రేమించకుండా ఎవ్వరూ, ఏదీ అసలు ఆపలేదు.
\v 36 ఇలాంటి సంగతులు మనకు కూడా జరగవచ్చు. లేఖనాలలో రాసినట్లు దావీదు దేవునితో చెప్పాడు, "మేము నీ ప్రజలుగా ఉన్నందున, మిగిలినవారు పదేపదే మమ్మల్ని చంపటానికి ప్రయత్నిస్తున్నారు. కసాయివాడు గొర్రెలూ జంతువులూ చంపడానికే అనుకున్నట్టు, చంపించుకోవడానికే మేము ఉన్నట్టుగా వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు."
\s5
\v 37 ఇలాంటి చెడ్డ సంగతులన్నీ మాకు జరిగినప్పటికీ క్రీస్తు మమ్మల్ని ప్రేమించి సహాయం చేస్తునాడు కాబట్టి వీటన్నిటిపై మేము పూర్తి విజయాన్ని పొందాము.
\p
\v 38 నేను నిశ్చయంగా నమ్మేదేమంటే, చావైనా - బతుకైనా, దేవదూతలైనా - దయ్యాలైనా, ఇప్పుడున్నవైనా - రాబోయేవైనా, శక్తిగల జీవులులైనా,
\v 39 ఆకాశం పైనగానీ - కిందగాని ఉన్నశక్తిగల జీవులైనా, సృష్టిలోని మరేదైనా సరే, దేవుని ప్రేమ నుండి మనల్ని వేరు చేయలేవు. మన ప్రభువైన యేసు క్రీస్తుని మన కొరకు చనిపోవడానికి పంపడం ద్వారా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చూపించాడు.
\s5
\c 9
\p
\v 1 నేను క్రీస్తుతో కలిసి ఉన్నందున నేను మీకు నిజమే చెపుతాను. అబద్ధం చెప్పడం లేదు. నా మనస్సాక్షి నేను చెప్తున్నదాన్ని ధృవీకరిస్తుంది ఎందుకంటే పరిశుద్దాత్మ నన్ను ఏలుతున్నాడు.
\v 2 నా తోటి ఇశ్రాయేలీయుల గురించి నేను కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నానని మీకు చెప్తున్నాను.
\s5
\v 3 దేవుడు నన్ను శపించడానికి నాకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఇంకా నేను క్రీస్తుకు దూరంగా ఉంటే నా తోటి ఇశ్రాయేలీయులు, నా బంధువులూ క్రీస్తును నమ్ముతారు అంటే , నేను ఎప్పటికీ ఆయనకు దూరంగానే ఉంటాను.
\v 4 వారు కూడా నాలాగే ఇశ్రాయేలీయులు. తన పిల్లలుగా ఉండడానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. ఆయన ఎంత ఆశ్చర్యకరుడో వారికే ఆయన చూపించాడు. వారితోనే ఆయన తన నిబంధనలను చేసాడు. వారికే తన ధర్మశాస్త్రం ఇచ్చాడు. వారే దేవుణ్ణి ఆరాధించేవారై ఉన్నారు. దేవుడు చాలా సంగతులను వారికే వాగ్దానం చేసాడు.
\v 5 మన జాతిని మొదలుపెట్టటానికి దేవుడే మన పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను ఎన్నుకొన్నాడు. ఈ మన ఇశ్రాయేలీయుల నుండే క్రీస్తు ఒక మనుష్యుడిగా పుట్టాడు. ఆయన దేవుడు. ఎప్పటికీ మనం స్తుతించడానికి ఆయన యోగ్యమైనవాడు. ఇది ముమ్మాటికి నిజం.
\s5
\p
\v 6 దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేశాడు, వారి వారసులందరికి తన దీవెనలు ఉంటాయని. కాని, నా తోటి ఇశ్రాయేలీయులు చాలామంది క్రీస్తుని తిరస్కరించారు. అయితే దేవుడు వాగ్దానం చేసిన పనులను చేయడంలో విఫలమయ్యాడని ఇది రుజువు చేయదు. ఎందుకంటే, ఇది యాకోబు నుండి వచ్చిన వారసులని కాదు, లేక మనుషులు తమనుతామే ఇశ్రాయేలీయులమని పిలుచుకోవడం కాదు కాని దేవుడే వారిని తన ప్రజలుగా పరిగణించాడు.
\v 7 అబ్రాహాముకు పుట్టిన వారంతా నిజంగా అబ్రాహాము వారసులుగా దేవుడు చూడలేదు. బదులుగా కొంతమందిని మాత్రమే అబ్రాహాముకు నిజమైన వారసులుగా దేవుడు పరిగణించాడు. ఆయన అబ్రాహాముతో చెప్పిన ఈ మాటలు తెలియచేస్తాయి: "నీ వారసులకు నిజమైన తండ్రిగా ఇస్సాకు మాత్రమే ఉంటాడు కాని నీ ఇతర కొడుకులు కారు."
\s5
\v 8 నా ఉద్దేశ్యం ఏమిటంటే, అబ్రాహాము వారసులనందరినీ దేవుడు తన సొంత పిల్లలనుగా అంగీకరించలేదు. బదులుగా అబ్రాహాముకు వాగ్దానం చేసినప్పుడు ఆయన మనసులో ఎవరైతే ఉన్నారో, వారినే దేవుడు అబ్రాహాము వారసులుగా, తన సొంత పిల్లలుగా అనుకున్నాడు.
\v 9 ఇదే దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసాడు: "వచ్చే యేడాది నేను తిరిగి నీ దగ్గరకు వస్తా, అప్పుడు నీ భార్య శారా ఒక కొడుకుని కంటుంది."
\s5
\v 10 అబ్రాహాము కొడుకు, ఇస్సాకు భార్య రిబ్కా కవలపిల్లలను కనేటప్పుడు కూడా ఇదే జరిగింది.
\v 11 వారు పుట్టకముందే, మంచి చెడులు ఏదీ చేయకముందే ఆమెకు దేవుడి నుండి ఒక సందేశం అందింది. (దేవుడు తన ఇష్టానుసారంగానే ప్రజలను ఎన్నుకుంటాడనీ
\v 12 వారు చేసే మంచి, చెడ్డ పనుల ప్రకారం వారిని పిలవడని ఈ సందేశం వల్ల మనకు తెలుస్తుంది.) "నీ పెద్ద కొడుకు నీ చిన్న కొడుకుకి సేవ చేస్తాడు." అని ఆమెకు దేవుడు చెప్పాడు.
\v 13 ఇదే దేవుడు లేఖనాలలో చెప్పాడు, "చిన్న కొడుకైన యాకోబుని నేను ఎన్నుకున్నాను. పెద్దవాడు ఏశావుని తిరస్కరించాను."
\s5
\p
\v 14 ఎవరైనా నన్ను అడగొచ్చు "కొంతమందిని మాత్రమే ఎన్నుకోవడానికి దేవుడు అన్యాయస్థుడా?" నేను వారికి సమాధానం ఇస్తూ, "దేవుడు ఎప్పటికి అన్యాయస్థుడు కాదు."
\v 15 దేవుడు మోషేతో చెప్పాడు, "నేను జాలిపడి ఎంచుకున్న ఎవరికైనా సహాయం చేస్తాను."
\v 16 దేవుడే మనుష్యులను ఎన్నుకుంటాడు. అంతేకాని వారిని దేవుడు ఎన్నుకోవాలని కోరుకున్నందువల్ల కానీ, ఆయనను సంతోషపెట్టటానికి ఎంతో ప్రయాసపడినందువల్ల కానీ కాదు.
\s5
\v 17 దేవుడు ఫరోతో చెప్పిన మాటలను మోషే గుర్తుపెట్టుకొన్నాడు. "ఇందుకే నేను నిన్ను ఐగుప్తుకు రాజుగా చేసాను. నేను నీతో పోరాడాలి, దాంతో ఈ లోకంలోని ప్రతిఒక్కరు నా ప్రతిష్టను గౌరవించడానికి సహాయం చేస్తారు."
\v 18 కాబట్టి , దేవుడు ఎవరిని కనికరించాలి అని అనుకుంటాడో వారిని కనికరిస్తాడు, ఎవరిని ఫరోలా కఠిన పరచాలి అని అనుకుంటాడో వారిని కఠిన పరుస్తాడు.
\s5
\p
\v 19 ఒకవేళ మీలో ఒకరు నాతో, "మనుష్యులందరూ ఏంచేయాలో దేవుడు ఎప్పుడో నిర్ణయించేస్తే, ఆయన అనుకున్నదాన్ని ఎవరూ వ్యతిరేకించరు. అప్పుడు తప్పులు చేస్తున్నవారిని దేవుడు శిక్షించడం సరికాదు కదా." అని అడిగితే,
\v 20 నేను వారితో "మీరు కేవలము మనుషులు మాత్రమే. దేవుణ్ణి విమర్శించేటంతటి జ్ఞానం మీకు లేదు. ఆయన మట్టి కుండలు తయారు చేసే మనిషిలాంటివాడు. ఆ కుండ, ""నన్ను ఎందుకు ఇలా చేసావు?"" అని తయారీదారుని అడగడానికి హక్కు లేదు."
\v 21 బదులుగా ఆ కుమ్మరి కొంత మట్టి ముద్దను తీసుకుని అందులో కొంత భాగముతో అందరూ చాల విలువైనదిగా చూసే ఒక అందమైన కుండనూ చేయవచ్చు. మిగిలిన ముద్దతో అందరూ ప్రతిరోజు వాడుకునే కుండనూ చేయవచ్చు. కచ్చితంగా దేవునికి అదే హక్కు ఉంది.
\s5
\v 22 దేవుడు పాపం గురించి కోపంగా ఉన్నానని చూపించాలనుకుంటాడు. అలా పాపం చేసినవారిని ఆయన తీవ్రంగా శిక్షించగలనని అందరికీ స్పష్టంగా తెలియచేయాలనుకుంటాడు. కానీ, తనకు కోపం తెప్పించీ, నాశనం కావటానికి అర్హులైన మనుష్యులను దేవుడు చాలా శాంతంగా భరిస్తున్నాడు.
\v 23 దేవుడు సహనంతో ఉన్నాడు. ఆయన ఎవరిపై దయ చూపించాడో వారి గురించి ఎంత అద్భుతంగా వ్యవహరిస్తాడో ఆయన స్పష్టంగా తెలియచేస్తున్నాడు. వారు ఆయనతో నివసించడానికి ముందునుండీ సిద్దం చేస్తున్నాడు.
\v 24 అంటే, ఆయన యూదులను మాత్రమే కాదు యూదేతరులను కూడా ఎంచుకున్నాడు.
\s5
\v 25 యూదులు, యూదేతరులు ఈ రెండిటి నుండి ఎన్నుకునే హక్కు దేవునికి ఉంది. ప్రవక్త హోషేయ రాశాడు:
\q "నా ప్రజలు కాని చాలామంది నా ప్రజలే అని నేను చెప్తున్నాను.
\q ఇంతకుముందు నేను ప్రేమించని చాలామంది ప్రజలను ఇప్పుడు ప్రేమిస్తున్నానని చెప్తున్నాను."
\p
\v 26 ఇంకొక ప్రవక్త రాసాడు: "మీరు నా ప్రజలు కాదు అని దేవుడు ఇంతకుమునుపు ఎవరితో చెప్పాడో,
\q అదే స్థలాలలో వారు దేవుని పిల్లలు అవుతారని చెపుతారు."
\s5
\p
\v 27 ఇశ్రాయేలీయుల గురించి యెషయా కూడా ఆశ్చర్య పోయాడు. "ఇశ్రాయేలీయులు సముద్రం పక్కన ఇసుక రేణువుల వలె లెక్కపెట్టలేనంతమంది ఉన్నప్పటికీ వారిలో కొద్దిమంది మాత్రమే రక్షించబడతారు,
\v 28 ఎందుకంటే దేవుడు చేస్తానని చెప్పినట్లు ఆ దేశంలో నివసించే ప్రజలను ఆయన పూర్తిగా, వేగంగా శిక్షిస్తాడు."
\p
\v 29 యెషయా ఇంకా ఏం రాసాడంటే, "పరలోకపు సైన్యాల ప్రభువు మన వారసులలో కొంతమందిని జీవించడం కోసం దయతో అనుమతించకపోతే, మనం కూడా పూర్తిగా నాశనమైపోయిన సొదోమ గోమొర్ర పట్టణాలలోని ప్రజలవలె ఉంటాము."
\s5
\p
\v 30 మనం దీన్ని ఇంతటితో ముగిద్దాం. యూదేతరులు పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించినప్పటికీ, వారు క్రీస్తు నమ్మకం ఉంచితే దేవుడు వారిని తనతోనే ఉంచుకుంటాడు.
\v 31 కాని ఇశ్రాయేలు ప్రజలు దేవుని చట్టాలను పాటించడం ద్వారా పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించారు. కాని వారు చేయలేకపోయారు.
\s5
\v 32 వారు చేయలేకపోయారు ఎందుకంటే, వారు దేవుణ్ణి అంగీకరించటానికి కొన్ని పనులు చేశారు. వారు క్రీస్తు చనిపోతాడని ఊహించలేదు. ఇంకా యేసు చావుని వారు నమ్మలేదు. ఇదే వారు చేసిన పెద్ద పొరబాటు.
\v 33 ఒక ప్రవక్త ఇదే జరుగుతుందని చెప్పాడు. "వినండి, నేను ఇశ్రాయేల్ లో ఒక రాయిలాంటి వాడిని ఉంచాను. వాని వల్ల ప్రజలు పొరబాట్లు చేస్తారు. అతను చేసేది ప్రజలకు కోపం తెప్పిస్తుంది. అయినప్పటికీ, ఆయనను నమ్మేవారు సిగ్గుపడరు."
\s5
\c 10
\p
\v 1 నా తోటి విశ్వాసులారా, నేను ఎంతో కోరుకునేది ఇంకా నమ్మకంతో ప్రార్థించేది దేవుడు నా సొంత ప్రజలైన యూదులను రక్షిస్తాడు.
\v 2 నేను వారి గురించి నిజాయితీగా ప్రకటిస్తున్నాను. వారు దేవుణ్ణి దృఢంగా అనుసరిస్తున్నప్పటికీ సరైన మార్గంలో ఆయనను ఎలా అనుసరించాలో వారికి అర్థం కావటం లేదు.
\v 3 దేవుడు ప్రజలను తనతో ఎలా ఉంచుకుంటున్నాడో వారికి తెలియదు. వారు తమకు తామే దేవునితో సరిదిద్దుకోవాలని కోరుకుంటారు. అందువల్ల దేవుడు తమకోసం ఏమి కోరుకుంటున్నాడో వారు అంగీకరించరు.
\s5
\v 4 తనను విశ్వసించే ప్రతి ఒక్కరిని దేవునితో సరిగ్గా ఉంచటానికి క్రీస్తు చట్టాన్ని పాటించాడు. అందుకే చట్టం ఇక అవసరం లేదు.
\p
\v 5 దేవుని చట్టాన్ని పాటించటానికి ప్రయత్నించిన ప్రజల గురించి మోషే రాశాడు. "వీరు చట్టం కోరుకునే పనులను సంపూర్ణంగా చేసి శాశ్వతంగా జీవించాలనుకోనేవారు."
\s5
\v 6 వీరంతా క్రీస్తును నమ్మినందున దేవుడు కూడా తనకుతానే వారిని నమ్మాడు. వారితో మోషే మాట్లాడుతూ, "స్వర్గానికి వెళ్ళటానికి ఎవరూ అంతగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు." ఎందుకంటే క్రీస్తే కిందికి దిగి వచ్చాడు.
\v 7 మోషే ఇది కూడా వారికి చెప్తున్నాడు, "మనకోసం క్రీస్తును చనిపోయినవారి దగ్గరనుండి తిరిగి తీసుకురావటానికి మనం మళ్ళీ చనిపోయిన వారు ఉన్న చోటికి వెళ్ళడానికి ఎవరూ ప్రయత్నించనక్కర్లేదు."
\s5
\v 8 బదులుగా, మోషే రాసినట్టు క్రీస్తుని నమ్మినవారు ఇలా చెప్తారు, "మీరు దేవుని సందేశం గురించి చాలా తేలికగా తెలుసుకోవచ్చు. మీరు దాని గురించి మాట్లాడనూ వచ్చు అలోచించనూ వచ్చు." ఇదే మనం ప్రకటించాల్సిన సందేశం. అందరూ క్రీస్తుని నమ్మాలి.
\p
\v 9 ఈ సందేశం ఏమిటంటే, యేసు ప్రభువు అని మీలో ఎవరైనా ధృవీకరిస్తే ఇంకా దేవుడు ఆయనను మృతులలోనుండి లేపాడని మీరు నిజంగా నమ్మితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు.
\v 10 ఈ సంగతులను ప్రజలు నమ్మితే , దేవుడు వారితోనే జీవిస్తాడు. యేసు ప్రభువు అని బహిరంగంగా ఎవరైతే చెప్తారో దేవుడు వారిని రక్షిస్తాడు.
\s5
\v 11 క్రీస్తు గురించి లేఖనాలలో రాసి ఉంది. "ఎవరైతే ఆయనను నమ్ముతారో వారు ఒక్క నాటికీ నిరుత్సాహపడరు, సిగ్గుపడరు."
\v 12 ఈ విధంగా దేవుడు యూదులను, యూదేతరులను ఒకేలాగా చూసాడు. ఎందుకంటే ఆయనను నమ్మిన వారికందరకు ఆయన ఒక్కడే ప్రభువు. ఆయనను సహాయం అడిగిన వారందరికి ఆయన తప్పక సహాయం చేస్తాడు.
\v 13 ఇది వాక్యంలో చెప్పినట్టుగానే ఉంది, "ప్రభువైన దేవుడు తనను అడిగిన వారందరినీ రక్షిస్తాడు."
\s5
\v 14 చాలామంది క్రీస్తును నమ్మరు. ఇంకా కొంతమంది వారు ఎందుకు నమ్మటం లేదో వివరించటానికి ప్రయత్నిస్తుంటారు. వారు ఇలా చెప్తుంటారు, "ప్రజలు మొదట క్రీస్తుని నమ్మకపోతే వారికి సహాయం చేయమని ఆయనను కచ్చితంగా అడగలేరు. వారు ఆయన గురించి వినకపోతే కచ్చితంగా ఆయనను నమ్మలేరు. ఎవరైనా ఆయన గురించి వారికి బోధించకపోతే వారు కచ్చితంగా ఆయన గురించి వినలేరు."
\v 15 క్రీస్తు గురించి బోధించడానికి వారి దగ్గరకు వెళ్ళేవారిని దేవుడు పంపితేనేగాని వారు వెళ్ళలేరు. కాని కొంతమంది నమ్మినవారు వారికి బోధించితే అది వాక్యంలో చెప్పినట్టుగా ఉంటుంది. "ప్రజలు వచ్చి శుభవార్త తెచ్చినప్పుడు అది చాలా అద్భుతంగా ఉంటుంది."
\s5
\v 16 అలాంటి సంగతులు చెప్పేవారికి నేను ఈ విధంగా జవాబు చెప్తాను. క్రీస్తు గురించిన సందేశాన్ని బోధించడానికి దేవుడు ప్రజలను ఎప్పుడో పంపేశాడు. కాని ఇశ్రాయేలు ప్రజలందరూ సువార్త వినడానికి శ్రద్ద చూపలేదు. ఇది యెషయాకు చాలా నిరుత్సాహంగా అనిపించి ఇలా అన్నాడు," ప్రభూ, మేము బోధించేది ఎవరు విన్నారు?"
\p
\v 17 కాబట్టి నేను అనేది ఏమిటంటే , ప్రజలు క్రీస్తుని గురించి వింటున్నారు గనక ఆయనను నమ్ముతున్నారు. కొందరు క్రీస్తు గురించి బోధిస్తున్నారు గనక వారు వింటున్నారు.
\s5
\v 18 కాని ఎవరైనా ఆ ప్రజలతో, "ఇశ్రాయేలీయులు ఈ శుభవార్తను విన్నారు గదా" అంటే నేను ఏమి చెబుతానంటే, "అవును అవశ్యం. లేఖనం చెబుతున్నది దీన్ని గురించే.
\q ప్రపంచమంతటా నివసిస్తున్న వారందరూ సృష్టిని చూసారు.
\q దానిని బట్టే దేవుడు ఎవరో వారికి రుజువు అవుతుంది.
\q ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలలో నివసించే ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకున్నారు."
\s5
\p
\v 19 ఇంకా చెప్పాలంటే, ఇశ్రాయేలీయులు ఈ శుభవార్తను నిజంగానే విన్నారు, వారు అర్థం చేసుకున్నారు కూడా. కానీ వారు దానిని నమ్మడానికి నిరాకరించారు. ఇలా ప్రజలను హెచ్చరించిన మొదటి వ్యక్తి మోషే అని గుర్తుకు తెచ్చుకోండి. దేవుడు చెప్పినదాన్ని మోషే వారితో అన్నాడు, "యూదేతర దేశాలు నిజమైన దేశాలు కాదని మీరు అనుకుంటున్నారు. కానీ వాటిల్లో కొన్ని నన్ను నమ్ముతాయి. నేను వారిని దీవిస్తాను. అప్పుడు మీరు వారిపై అసూయపడతారు, ఇంకా వారితో కోపంగా ఉంటారు. మీరు ఊహించని ప్రజలు నన్ను అర్థం చేసుకుంటారు."
\s5
\v 20 దేవుడు ఎంతో నిర్భయంగా యెషయా ద్వారా చెప్పిన మాటలను కూడా గుర్తు తెచ్చుకోండి, "నన్ను తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించని యూదేతరులు నన్ను కచ్చితంగా కనుగొంటారు. నన్ను అడగని వారికి నేను ఎలా ఉన్నానో తప్పక తెలియచేస్తాను."
\p
\v 21 కానీ దేవుడు ఇశ్రాయేలీయుల గురించి కూడా మాట్లాడాడు. ఆయన వారి గురించి చెప్తూ, "నాపై అవిధేయత చూపి తిరుగుబాటు చేసిన మనుష్యులందరు నా దగ్గరకు తిరిగి రావాలని ఆహ్వానిస్తూ నేను నా చేతులు ఇంకా చాపి ఉన్నాను."
\s5
\c 11
\p
\v 1 ఎవరైనా నన్ను, "దేవుడు తన ప్రజలైన యూదులను వదిలేశాడా" అని అడిగితే, నా జవాబు ఇలా ఉంటుంది, "ఎప్పటికీ అలా జరగదు. గుర్తుంచుకోండి, నేను కూడా ఇశ్రాయేలు ప్రజలకు చెందినవాడినే. అబ్రాహాము వారసుడినే. బెన్యామీను గోత్రం వాడినే. అయినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు.
\v 2 దేవుడు చాలాకాలం క్రితమే తాను ఏర్పాటు చేసుకుని ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించిన తన ప్రజలను ఆయన తిరస్కరించలేదు. ఈ ఇశ్రాయేలు ప్రజల గురించి ఒకసారి ఏలీయా పొరపాటున దేవునికి చాడీలు చెప్పటం గుర్తుతెచ్చుకోండి. అదే వాక్యంలో చెప్తుంది.
\v 3 "ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపేశారు, నీ బలిపీఠమును నాశనం చేశారు. నిన్ను నమ్మినవారిలో నేనొక్కడినే మిగిలి ఉన్నాను. ఇప్పుడు వారు నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నారు."
\s5
\p
\v 4 దేవుడు అతనికి ఇలా జవాబిచ్చాడు, "నాకు నమ్మకంగా ఉండి మిగిలిపొయినది నీవొక్కడివే కాదు. ఇశ్రాయేలులో 7 వేల మంది పురుషులను నా కోసమే ఉండడానికి నేను జాగ్రత్త తీసుకున్నాను. వారు అబద్ద దేవుడైన బయలును పూజించేవారు కాదు."
\v 5 అలాగే, ఈ సమయంలో యూదులలో మిగిలిపోయిన ఒక విశ్వాసుల గుంపు కూడా ఉంది. ఏ విధంగాను మనకు అర్హత లేకపోయినా దేవుడు కేవలం ఆయన దయవలన మనల్ని విశ్వాసులుగా ఎన్నిక చేశాడు.
\s5
\p
\v 6 ఆయన ఎన్నిక చేసిన వారిపట్ల ఆయన దయ చూపించాడు అంటే, వారంతా మంచి పనులు చేసారని కాదు. మంచి పనులు చేసిన వారిని దేవుడు ఎన్నిక చేసుకొంటే ఇంక ఆయన మనపట్ల దయ చూపించాల్సిన అవసరత ఉండదు.
\p
\v 7 దేవుడు ఇశ్రాయేలీయులలో కొంతమందిని మాత్రమే ఎన్నిక చేసుకొంటే, యూదులలో చాలామంది వారు వెతుకుతున్నదాన్ని పొందలేకపోయారని మనకి తెలుస్తుంది. (దేవుడు ఎన్నిక చేసుకున్న వారు కొందరు పొందారు.) చాలామంది యూదులు దేవుడు చేబుతున్నదానిని అర్థం చేసుకోవడానికి ఇష్టం చూపించలేదు.
\v 8 ప్రవక్త యెషయా ఇలా రాసాడు, "దేవుడు వారిని మొండివారిగా చేసాడు. క్రీస్తు గురించిన నిజం వారు అర్థం చేసుకోగలరు కాని వారు చేయరు. దేవుడు మాట్లాడుతుండగా వారు లోబడాలి కాని వారు లోబడరు. ఈ రోజు వరకూ అది అలాగే ఉంది."
\s5
\p
\v 9 రాజైన దావీదు చెప్పింది ఈ యూదులు గుర్తుచేస్తున్నారు. తన శత్రువు ఇంద్రియాలను పనిచేయకుండా ఉంచమని దావీదు దేవుడిని అడిగినప్పుడు, "వలలు లేదా ఉచ్చులలో పడి ఉన్న జంతువులలాగా వారిని తెలివితక్కువ వారినిగా చెయ్యి. అయినా వారు విందుల వద్ద సురక్షితంగా ఉన్నట్లు అనుకుంటారు. కాని ఆ విందులు వారికి పరీక్షా సమయాలుగా ఉండాలి. అప్పుడు వారు పాపం చేస్తారు. దాంతో నువ్వు వారిని నాశనం చేయవచ్చు.
\q
\v 10 ప్రమాదం వచ్చినప్పుడు వారు చూడకుందురు గాక. వారి కష్టాలవల్ల నువ్వు వారిని ఎప్పుడూ బాధపెడతావు గాక."
\s5
\p
\v 11 నన్ను ఎవరైనా "క్రీస్తుని నమ్మకపోవడం వలననే యూదులు పాపం చేసి ఉంటారా, వారు ఎప్పటికీ దేవునికి దూరంగానే ఉంటారా?" అని అడిగితే, నేను వారికి జవాబిస్తూ, "లేదు. వారు ఎప్పటికీ తమని తాము దేవునితో వేరుచేసుకోలేరు. బదులుగా వారు పాపం చేసి ఉన్నారు. వారు అసూయపడేలా దేవుడు యూదేతరులను రక్షించి దీవిస్తున్న విధం చూసీ వారు కూడా దేవుణ్ణి రక్షించమని అడుగుతారు."
\v 12 యూదులు క్రీస్తుని తిరస్కరించినందువల్ల దేవుడు ప్రపంచంలోని మిగిలిన వారిని ఎంతో ఎక్కువగా దీవించి ఆయనను నమ్మటానికి అవకాశాలను ఇచ్చాడు. యూదులు ఆధ్యాత్మికంగా విఫలమైనందువల్ల దేవుడు యూదేతరులను ఎక్కువగా దీవించాడు. అదే నిజమైతే దేవుడు ఏర్పాటు చేసుకున్న యూదులందరూ క్రీస్తుని నమ్మితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించండి.
\s5
\p
\v 13 ఇప్పుడు నేను యూదేతరులైన మీకు చెప్తున్నాను. నేను మీకు పరిచారకుడిగా ఉన్నాను. దేవుడు నాకు అప్పగించిన ఈ పనిని నేను ఎంతో గౌరవిస్తున్నాను.
\v 14 నేను పడుతున్న నా కష్టం చూసి నా తోటి యూదులు అసూయపడతారని అనుకుంటున్నాను. కాని అందువల్ల వారిలో కొంతమందైనా నమ్మి రక్షణ పొందుతారని ఆశిస్తున్నాను.
\s5
\v 15 నా తోటి యూదులు క్రీస్తుని నమ్మకపోవడం వలన దేవుడు వారిని తృణీకరించాడు. దానివల్ల ఆయన ప్రపంచంలోని మిగిలిన ప్రజలతో సమాధానంగా ఉన్నాడు. ఒకవేళ చాలామంది యూదులు క్రీస్తుని నమ్మకపోతే ఎం జరుగుతుందో చూడండి. ఆ తర్వాత వారంతా ఆయనలో విశ్వాసం ఉంచితే ఎంత గొప్ప సంగతులు జరుగుతాయో చూడండి. అప్పుడు వారంతా చనిపోయిన రాజ్యం నుండి లేచినట్టుగా ఉంటుంది.
\v 16 ఒక పిండి ముద్దలోనుండి కొంతభాగం తీసి రొట్టె చేసి దేవునికి అర్పిస్తే అది ఆయనకే చెందుతుంది. యూదులు దేవునికి చెందినవారు. ఎందుకంటే వారి పితరులూ దేవునికి చెందివారే. ఒక చెట్టులో వేరు దేవునికి చెందినది అయితే దాని కొమ్మలు కూడా ఆయనకే చెందుతాయి. అలాగే మన గొప్ప యూదు పితరులు దేవునికి చెందినవారు కాబట్టి ఎదో ఒకరోజున వీరంతా దేవునికి చెందుతారు.
\s5
\p
\v 17 మనుషులు ఎండిన కొమ్మలను నరికినట్టుగా దేవుడు చాలమంది యూదులను తృణీకరించాడు. దేవుడు అంగీకరించిన యూదేతరులైన మీలో ప్రతి ఒక్కరు సాగుచేయని ఒలీవ కొమ్మ వలే ఉండి, సాగుచేసిన ఒలీవ చెట్టుకి అంటుకట్టబడి ఉన్నారు. సాగుచేసిన ఒలీవ చెట్టు వేరు మొదలు నుండి కొమ్మలు ఎలా లాభం పొందుతాయో మీరు కూడా మన మొదటి యూదు పితరులనుండి ఆశీర్వాదాలను పొందేలా దేవుడు చేసాడు.
\v 18 అయినప్పటికీ యూదులను దేవుడు తృణీకరించినా ఎవరో వచ్చి చెట్టునుండి కొమ్మలు నరికివేసినట్టుగా ఉన్నాకూడా యూదేతరులైన మీరు మాత్రం వారిని ద్వేషించకూడదు. దేవుడు మిమ్మల్ని ఎలా రక్షించాడో మీకు మీరు గొప్పలు చెప్పుకోవాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. కొమ్మలు వేరును పోషించవు. వేరులే కొమ్మలను పోషిస్తాయి. అలాగే, మీరు యూదుల నుండి తీసుకున్నదానివల్లనే దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు యూదులకు ఉపయోగపడేది ఏదీ వారికి ఇవ్వలేదు.
\s5
\v 19 ఒకవేళ మీరు నాతో అనొచ్చు "మనుషులు చెట్టు నుండి ఎండిన కొమ్మలు నరికినట్టుగా దేవుడు యూదులను తృణీకరించాడేమో. ఎందుకంటే, మనుషులు అడవిలోని ఒలీవ చెట్టు నుండి కొమ్మలు తెచ్చి మంచి చెట్టుకి అంటుకట్టినట్టుగా యూదేతరులైన మనల్ని అంగీకరించటానికి దేవుడు అలా చేసి ఉండవచ్చు."
\v 20 ఇది నిజం. క్రీస్తుని వారు నమ్మలేదు కాబట్టే దేవుడు వారిని తృణీకరించాడు. మీరైతే క్రీస్తుని నమ్మినందువల్లనే గట్టిగా నిలబడగలుగుతున్నారు. కాబట్టి గర్వపడకండి. బదులుగా విధేయతతో నిండి ఉండండి.
\v 21 చెట్టు వేరు నుండి సహజంగా కొమ్మలు ఎలా పెరుగుతాయో అలా యూదులు పెరిగినా, వారు క్రీస్తునందు నమ్మకం లేకపోతే దేవుడు వారిని వదిలిపెట్టడు. మీరూ నమ్మకపోతే మిమ్మల్నీ వదిలిపెట్టడు.
\s5
\p
\v 22 దేవుడు దయతో ఉంటాడు, కఠినంగా కూడా ఉంటాడు. క్రీస్తుని నమ్మని యూదులతో ఆయన కఠినంగా ఉంటాడు. మీ పట్ల దయ కలిగి ఉంటాడు. కానీ మీరూ క్రీస్తుని నమ్మకపోతే మీతోనూ ఆయన కఠినంగా ఉంటాడు.
\s5
\p
\v 23 ఒకవేళ యూదులు క్రీస్తుని నమ్మితే దేవుడు వారిని తిరిగి చెట్టుకి అంటుకడతాడు. దేవుడు అలా చేయగలడు కూడా.
\v 24 యూదేతరులైన మీరు ఇంతకుముందు దేవునికి దూరంగా ఉండి దేవుడు యూదులను ఆశీర్వదించిన విధానం నుండి మీరు లాభం పొందారు. అది ఎలాగంటే, ఎవ్వరూ నాటకుండా అడవిలో పెరిగిన ఒలీవ చెట్టునుండి కొమ్మలు తీసుకోవడం లాంటిది. మనుషులు సహజంగా చేసే పనులకు భిన్నంగా ఒక సాగుచేసిన ఒలీవ చెట్టులోకి దానిని ఉంచడం. యూదులు ఎప్పుడో దేవునికి చెందినవారు గనుక ఆయన వారిని తిరిగి చేర్చుకోవడానికి సిద్దంగా ఉంటాడు. ఎవరో కొట్టివేసిన అసలు కొమ్మలను తిరిగి అదే ఒలీవ చేట్టులోకి ఉంచడం లాంటిదే ఇది.
\s5
\p
\v 25 నా తోటి యూదులు కాని విశ్వాసులారా, మీకు అన్నీ తెలుసునని అనుకోకుండా ఉండాలంటే ఈ రహస్య సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కచ్చితంగా కోరుతున్నాను. దేవుడు ఎన్నుకున్న యూదేతరులందరూ యేసులో విశ్వాసముంచే వరకూ చాలామంది ఇశ్రాయేలీయులు ఇలాగే మొండివారుగానే ఉంటారు.
\s5
\p
\v 26 అప్పుడు దేవుడు తన నిజమైన ప్రజలను రక్షిస్తాడు. తర్వాత లేఖనాలలో రాసిన ఈ మాటలు నిజమౌతాయి.
\p "ఆయన ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేవాడు యూదులలోనుండి వస్తాడు. ఆయనే దేవుని ప్రజల పాపాలను క్షమిస్తాడు."
\p
\v 27 ఇంకా దేవుడు చెప్తున్నాడు.
\p "వారితో నేను చేసుకున్న నిబంధన ఒకటే ఏమిటంటే నేను వారి పాపాలను క్షమిస్తాను."
\s5
\p
\v 28 యూదులు క్రీస్తును గురించిన మంచి వార్తను తిరస్కరించారు. అందుకు దేవుడు వారిని తన శత్రువులుగా చూస్తున్నాడు. కాని అదే మీ యూదేతరులకు మేలు జరిగింది. ఎందుకంటే, దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వారి పితరులకు వాగ్దానం చేసినందున దేవుడు వారిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు.
\v 29 ఆయన వారికి ఇస్తానని వాగ్దానం చేసిన దాని గురించి ఇంకా తన సొంత ప్రజలుగా వారిని ఎలా పిలిచాడనే దాని గురించి ఆయన ఎప్పటికీ మనసు మార్చుకోలేదు.
\s5
\v 30 మీరు ఒకప్పుడు దేవునికి అవిధేయత చూపారు, కాని ఇప్పుడు యూదులు ఆయనకు అవిధేయత చూపినందున ఆయన మీపట్ల దయ కలిగి ఉన్నాడు.
\v 31 అలాగే ఇప్పుడు వారు దేవునికి అవిధేయత చూపారు. ఫలితం ఏమిటంటే, ఆయన మీ పట్ల ఎలా దయతో ఉన్నాడో మళ్ళీ వారిపట్ల కూడా దయ చూపిస్తూ ఉన్నాడు.
\v 32 ప్రజలందరూ, యూదులు, యూదులు కానివాళ్ళు అందరూ ఆయనకు అవిధేయత చూపారని దేవుడు ప్రకటించాడు. ఇంకా నిరూపించాడు. ఎందుకంటే దేవుడు మనందరి పట్ల దయతో ఉండాలని కోరుకుంటున్నట్టుగా ప్రకటించాడు.
\s5
\p
\v 33 దేవుడు చేసిన తెలివైన పనులు, ఆయనకు ఎప్పుడు తెలిసినవి ఎంత గొప్పవని నేను ఆశ్చర్యపోతున్నాను. వాటిని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం ఎవరి తరమూ కాదు.
\v 34 లేఖనాలలో చెప్పింది నాకు గుర్తుకు వస్తుంది. "ప్రభువు ఆలోచించేది ఎవరికీ తెలియదు. ఆయనకు సలహాలు చెప్పగలిగే వారెవరు."
\s5
\p
\v 35 "ఆయన దగ్గర నుండి తిరిగి పొందాలని ముందుగా ఆయనకు ఇచ్చేవాడెవడు?"
\v 36 దేవుడే సమస్తాన్నీ సృష్టించాడు. ఆయన అన్నిటినీ నడిపించేవాడు కూడా. ఆయన అన్నింటిని సృష్టించడానికి కారణం వారు ఆయనను స్తుతించడమే. యుగయుగాలకు ఆయనకే మహిమ కలుగును గాక. ఆమెన్.
\s5
\c 12
\p
\v 1 నా తోటి విశ్వాసులారా, దేవుడు మీ పట్ల అన్ని విధాలుగా దయ కలిగి ఉన్నందున, మీకు మీరే సజీవంగా ఆయనకు సమర్పించుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ సమర్పణ దేవునికి ఇష్టంగా ఉండి ఆయనను సంతోషపరిచేదిగా ఉండాలి. ఆయనను ఆరాధించడానికి ఇదే సరైన మార్గం.
\v 2 మీరు ఎలా ప్రవర్తించాలో అవిశ్వాసులచేత చెప్పించుకోవద్దు. బదులుగా దేవుడే మీ ఆలోచనా విధానాన్నిమార్చటానికీ క్రొత్తగా చేయటానికీ ఆయనకే అవకాశం ఇవ్వండి. దానివలన ఆయన మీరు ఏమి చేయాలని కోరుకుంటున్నాడో మీకు తెలుస్తుంది. ఆయన్ని ఎలా సంతోషపెట్టాలో, ఆయన స్వయంగా వ్యవహరించే మార్గాల్లో మీరు ఎలా ఉండాలో మీకు తెలుస్తుంది.
\s5
\p
\v 3 దేవుడు నాకు అర్హత లేకపోయినా నన్ను తన పరిచారకుడిగా నియమించుకున్నాడు. అందువల్ల ఇది నేను మీ అందరితో చెప్పాలనుకున్నాను. మీకు మీరే మంచివారని అనుకోవద్దు. బదులుగా దేవుడు ఆయనపై నమ్మకం ఉంచడానికి మిమ్మల్ని ఎలా అనుమతించాడో ఆ విధంగానే మీ గురించి మీరే తగినరీతిలో ఆలోచించుకోండి.
\s5
\p
\v 4 ఒక వ్యక్తికి ఒకే శరీరం ఉండి అనేక అవయవాలను కలిగి ఉంటుంది. అన్నీ అవయవాలు శరీరానికి అవసరమే కాని, అవన్నీ ఒకే విధంగా పని చేయవు.
\v 5 అదే విధంగా మనం అనేకులం ఉన్నప్పటికీ ఒకే గుంపుగా కలిసి ఉన్నాము. ఎందుకంటే మనం క్రీస్తులో కలిసి ఉండి, ఒకరికొకరం చెంది ఉన్నాం.
\s5
\v 6 దేవుడు మనల్ని ఒకరొకరికి భిన్నంగా చేసాడు. మనలో ప్రతి ఒక్కరు భిన్నమైన పనులను చేస్తాము. ఆ పనులను మనం ఆత్రుతతో సంతోషంతో చేయాలి. దేవుని సందేశాలను ఇతరులకు ఇచ్చేవారు మనలో ఉంటే వారు దేవునిపై మనకున్న నమ్మకానికి తగినట్టుగా మాట్లాడాలి.
\v 7 ఇతరులకు సేవ చేయటానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసాడో వారు అదే చేయాలి. ఆయన సత్యాన్ని బోధించాలని దేవుడు ఎవరిని ఏర్పాటు చేసాడో వారు అదే చేయాలి.
\v 8 ఇతరులను ప్రోత్సహించాలని దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసాడో వారు నిండు మనసుతో దానిని చేయాలి. ఇతరులకు ఇవ్వడానికి దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసాడో వారు వెనక్కి తగ్గకుండా అలానే చేయాలి. ఇతరులను సంరక్షించాలని దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసాడో వారు జాగ్రత్తగా చేయాలి. అవసరతలో ఉన్నవారికి సహాయం చేయాలని దేవుడు ఎవరిని ఏర్పాటు చేసాడో వారు సంతోషంతో చేయాలి.
\s5
\p
\v 9 మనుష్యులను ప్రేమిస్తే హృదయపూర్వకంగా ప్రేమించాలి. చెడుని ద్వేషించాలి. దేవుడు మంచిగా చూసేదానిని మీరూ ఆత్రుతతో కొనసాగించండి.
\v 10 మీ సొంత కుటుంబంలోని వారిని మీరు ప్రేమించినట్టే మీరూ ఒకరికొకరు ప్రేమించుకోండి. అలా చేయడంలో మీరు మొదటివారిగా ఉండాలి.
\s5
\p
\v 11 సోమరులుగా ఉండొద్దు. దేవుణ్ణి సేవించడంలో ఆత్రుతగా ఉండండి. ప్రభువుకి సేవ చేస్తున్నప్పుడు ఉత్సాహంగా ఉండండి.
\v 12 దేవుడు మీకోసం చేయబోయే దానిని గురించి నమ్మకంతో ఎదురు చూస్తున్నారు గనుక సంతోషించండి. హింసల పాలైనప్పుడు సహనంతో ఉండండి. ప్రార్థన చేస్తూ ఉండండి. నిరుత్సాహపడకండి.
\v 13 దేవుని ప్రజలు ఎవరికైనా ఏదైనా లేకపోతే మీకున్న దానిని వారితో పంచుకోండి. ఇతరులను ఆదరించడంలో ఆసక్తి కలిగి ఉండండి.
\s5
\p
\v 14 మీరు యేసుని విశ్వసించారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా హింసిస్తుంటే వారియందు దయగా ఉండమని దేవుణ్ణి వేడుకొండి. వారికి చెడు విషయాలు జరగాలని ఆయనను అడగొద్దు.
\v 15 వారు సంతోషంగా ఉంటే వారితోపాటు మీరు సంతోషంగా ఉండండి. వారు విచారంగా ఉంటే మీరూ వారితో విచారంగా ఉండండి.
\v 16 మీకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇతరులకు కూడా అదే కోరుకోండి. మీ ఆలోచనలలో కూడా గర్వపడకండి. ముఖ్యులు కానివారితో కూడా స్నేహం చేయండి. మీకు మీరే తెలివైనవారుగా ఎంచుకోవద్దు.
\s5
\p
\v 17 మీకు ఎవరైనా కీడు చేసినట్లైతే మీరు వారికి తిరిగి కీడు తలపెట్టవద్దు. మనుష్యులందరికీ మంచిది అని తెలిసే విధంగా నడచుకోండి.
\v 18 మీరు పరిస్థితులను అర్థం చేసుకుని సాధ్యమైనంత వరకు ఇతరులతో సమాధానంగా జీవించండి.
\s5
\p
\v 19 నేను ప్రేమిస్తున్న నా తోటి విశ్వాసులారా, మనుషులు మీకు చేసిన కీడుకు ప్రతిగా మీరు వారికి కీడు చేయవద్దు. వారిని శిక్షించడం దేవునికే వదిలెయ్యండి. లేఖనాలు చెప్తున్నాయి, "కీడు చేసేవారికి నేను తిరిగి చెల్లిస్తాను. అలా చెల్లించడం నా హక్కు, అని ప్రభువు చెప్తున్నాడు."
\v 20 మీకు కీడు చేసిన వారికి మీరు తిరిగి కీడు చేయకుండా లేఖనాలు బోధించిన రీతిగా చేయండి. "మీ శత్రువులు ఆకలిగా ఉంటే వారికి భోజనం పెట్టండి. వారికి దాహంగా ఉంటే తాగడానికి నీరు ఇవ్వండి. అలా చేయడం వలన మీరు వారికి సిగ్గుతో కూడిన బాధను కలిగించవచ్చు. ఇంకా మీ పట్ల వారి వైఖరిని కూడా మార్చుకోవచ్చు."
\v 21 ఇతరులు మీకు చేసిన కీడు గురించి ఆలోచించవద్దు. దానికి బదులుగా వారు మీకు చేసిన దానికన్నాఎక్కువ మంచిని వారికి చేయండి.
\s5
\c 13
\p
\v 1 విశ్వాసులందరూ ప్రభుత్వ అధికారులకు తప్పక లోబడాలి. దేవుడే వారికి ఆ అధికారాన్ని ఇచ్చాడని గుర్తుంచుకోండి. ఇంకా, ఇప్పుడున్న ఆ అధికారులందరినీ దేవుడే నియమించాడు.
\v 2 కాబట్టి ఎవరైతే ఆ అధికారులను ఎదిరిస్తారో వారు దేవుని ఏర్పాటుని ఎదిరించినట్టే. ఇంకా, ఆ అధికారులను ఎదిరిస్తే వారి ద్వారానే శిక్షించబడతారు.
\s5
\p
\v 3 మంచి పనులు చేసేవారు అధికారులకు భయపడాల్సిన పని లేదు. చెడ్డ పనులు చేసేవారే భయపడాలి. కాబట్టి మీలో ఎవరైనా మంచి చేస్తే వారు మిమ్మల్ని శిక్షించే బదులు మెచ్చుకుంటారు.
\v 4 దేవునికి సేవ చేయడానికే అధికారులందరూ ఉన్నారు. అంతేకాకుండా మీలో ప్రతి ఒక్కరికి కూడా వారు సహాయం చేస్తారు. మీలో ఎవరైనా చెడు చేస్తే మీరు తప్పక వారికి భయపడాల్సిందే. చెడు చేసే వారిని శిక్షించడం ద్వారా అధికారులు దేవునికి సేవ చేస్తున్నారు.
\v 5 కాబట్టి, అధికారులకు మీరు లోబడి ఉండటం చాలా అవసరం. ఎందుకంటే, మీరు వారికి లోబడకపోతే మిమ్మల్ని శిక్షిస్తారు అంతేకాకుండా మీలో మీకు తెలుసు మీరు వారికి లోబడి ఉండాలని.
\s5
\p
\v 6 ఈ కారణం వల్లనే మీరు పన్నులు కూడా కడుతున్నారు. అధికారులు నిరంతరం తమ పనిని చేస్తూ దేవునికి సేవ చేస్తూన్నారు.
\v 7 అధికారులకు ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే అది వారికి ఇచ్చేయ్యండి. మీరు పన్నులు చెల్లించాల్సిన వారికి పన్నులు చెల్లించండి. మీరు వస్తువులపై సుంకాలు చెల్లించాల్సిన వారికి సుంకాలు చెల్లించండి. మర్యాద ఇవ్వాల్సి ఉంటే మర్యాదను , గౌరవం ఇవ్వాల్సి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.
\s5
\p
\v 8 మీరు చెల్లించాల్సిన అప్పులు ఏమైనా ఉంటే చెల్లించెయ్యండి. మీరు ఎప్పటికీ చెల్లించనక్కరలేని అప్పు ఏదైనా ఉంటే అది మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడమే. ఎవరైతే పొరుగువాడిని ప్రేమిస్తారో వారే దేవుని ధర్మశాస్త్రాన్ని నేరవేర్చినవారు అవుతారు.
\v 9 దేవుని ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. వ్యభిచరించవద్దు, ఎవరిని చంపొద్దు, దొంగతనం చేయొద్దు, ఇతరులకు చెందినవాటిని కోరుకోవద్దు మొదలైనవి. కాని ఈ ఆజ్ఞలన్నింటిలోని సారాంశం తీసుకొంటే, "నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాడిని ప్రేమించు" అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి.
\v 10 నీ చుట్టూ ఉన్నవారిని నువ్వు ప్రేమించితే ఇంక నువ్వు ఎవ్వరికీ కీడు చేయవు. కాబట్టి ఎవరైతే ఇతరులను ప్రేమిస్తారో వారు దేవుని ఆజ్ఞలను నేరవేర్చినవారు అవుతారు.
\s5
\p
\v 11 మనం జీవిస్తున్న ఈ కాలంలో సమయం ఎంత ముఖ్యమో మీకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్పినదానిని చేయండి. నిద్ర నుండి మేల్కొన్న మనుషులుగా మీరు పూర్తిగా చురుకుగా, అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇదేనని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ దుఃఖం, పాపం నుండి క్రీస్తు మనలను విడుదల చేసే సమయం దగ్గరలోనే ఉంది. మనం క్రీస్తుని నమ్ముకున్న దానికంటే ఇప్పుడు ఆ సమయం దగ్గరగా ఉంది.
\v 12 ఈ లోకంలో జీవించే కాలం చాలావరకు ముగిసిపోయింది. క్రీస్తు తిరిగి వచ్చే కాలం దగ్గరలో ఉంది. మనుషులు చీకటిలో చేయాలని చూసే చెడు పనులను మనం చేయటం ఆపెయ్యాలి. శత్రువులను ఎదిరించడానికి సైనికులు తమ ఆయుధాలను ధరింఛి ఎప్పుడూ సిద్దంగా ఉన్నట్టు మనం కూడా చెడును ఎదిరించడానికి సహాయపడే పనులను ఎప్పుడూ చేస్తుండాలి.
\s5
\p
\v 13 క్రీస్తు తిరిగి వచ్చే సమయం ఎప్పుడో వచ్చేసింది అన్నట్లుగా మనం మర్యాదగా నడచుకోవాలి. మద్యపానం చేయకూడదు. ఇతరులతో కలిసి చెడు పనులను చేయకూడదు. ఎలాంటి లైంగిక అనైతికత, క్రూరమైన ఇంద్రియ ప్రవర్తనకు పాల్పడకూడదు. పోట్లాడకూడదు. ఇతరులను చూసి అసూయ పడకూడదు.
\v 14 దానికి బదులుగా మనం ప్రభువైన యేసుక్రీస్తులా ఉండి ఆయన ఎలా ఉంటాడో ఇతరులకు చూపించాలి. మీ పాత దుష్ట స్వభావం చేయాలనుకునే పనులను మీరు చేయాలనుకోవడం ఆపెయ్యాలి.
\s5
\c 14
\p
\v 1 కొంతమంది తప్పుగా అనుకునే కొన్ని పనులను చేయడానికి దేవుడు వారిని అనుమతిస్తాడో లేదో కచ్చితంగా తెలియని వారిని అంగీకరించండి. కాని మీరు వారిని అంగీకరించినప్పుడు వారు అలోచిస్తున్నవాటి గురించి వారితో వాదం పెట్టుకోవద్దు. వారు అడిగే ప్రశ్నలు అన్నీ కేవలం వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే.
\v 2 కొంతమంది మనుషులు అన్ని రకాల ఆహార పదార్థాలు తినవచ్చని నమ్ముతారు. ఇంకా కొంతమంది కొన్ని ఆహార పదార్ధాలను తినటం దేవునికి ఇష్టం లేదని నమ్ముతారు. అందుకే వారు కూరగాయలను మాత్రమే తినాలని నమ్ముతారు.
\s5
\p
\v 3 అన్ని రకాల ఆహారాలను తినడం సరైనదే అని నమ్మేవారు అలా తినని వారిని తృణీకరించకూడదు. ఇంకా, అన్ని రకాల ఆహారాన్ని తినడం సరి కాదు అని భావించేవారు ఎవరైనా అలా తినేవారిని ఖండించకూడదు. ఎందుకంటే దేవుడు వారిని కూడా అంగీకరించాడు.
\v 4 వేరొకరి సేవకుని విషయంలో నువ్వు న్యాయం చెప్పడం తప్పు. మనందరం దేవుని సేవకులం కాబట్టి దేవుడే మనందరికీ యజమాని. ఆ మనుషులు తప్పు చేసారా లేదా అని నిర్ణయించేది దేవుడు ఒక్కడే. ఈ విషయంలో ఎవరూ మరొకరిని తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే ఆయన వారిని తనకు నమ్మకంగా ఉంచగలడు.
\s5
\p
\v 5 కొంతమంది మనుషులు ఒక రోజు కంటే మరొక రోజు పవిత్రమైనదని నమ్ముతారు. మరి కొంతమంది దేవుణ్ణి ఆరాధించడానికి అన్ని రోజులూ మంచివే అని నమ్ముతారు. ఇలాంటి విషయాలలో ప్రతి ఒక్కరూ ఇతరుల కోసం కాకుండా తమ కోసమే ఆలోచించుకుని, దృఢంగా నిర్ణయించుకోవాలి.
\v 6 వారంలో ఒక కచ్చితమైన రోజున దేవుణ్ణి ఆరాధించాలని నమ్మేవారికి, అదే రోజు ఆయనను ఆరాధించడం ఆయనను గౌరవించడమే. ఇంకా అన్ని రకాల ఆహారాన్ని తినడం సరైనదే అని నమ్మేవారికి ఆ ఆహారాన్ని తింటున్నప్పుడు ప్రభువుని గౌరవిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. అలాగే కొన్నిరకాల ఆహారపదార్ధాలను తిననివారు కూడా, ఆ ఆహారాన్ని తినడం లేదని ప్రభువుని గౌరవిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. కాబట్టి ఈ మనుషులు వేరే విధంగా ఆలోచిస్తున్నప్పటికీ వారిది తప్పు కాదు.
\s5
\p
\v 7 మనలో ఎవరూ మనల్ని మనమే సంతోషపెట్టుకోవడానికి మాత్రమే జీవించకూడదు. మనం చనిపోయినప్పుడు కూడా మనం మాత్రమే నష్టపోతామని ఎవరూ అనుకోకూడదు.
\v 8 మనం జీవించి ఉన్నప్పుడు మనం దేవునికి చెందినవారము కనుక ఆయననే సంతోషపరచాలి కానీ, మనల్ని మనం కాదు. మనము చనిపోయినప్పుడు కూడా ప్రభువును సంతోషపర్చడానికే ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం జీవించినా చనిపోయినా ప్రభువునే సంతోషపరచాలి. ఎందుకంటే మనము ఆయనకు చెందినవారము.
\v 9 బ్రతికి ఉన్నవారికీ చనిపోయిన వారికీ ప్రభువుగా ఉండి అందరూ తనకు లోబడి ఉండాలనే క్రీస్తు మనకోసం చనిపోయి తిరిగి లేచాడు.
\s5
\p
\v 10 కొన్ని నియమాలు మాత్రమే పాటించే మీరు, మీ తోటి విశ్వాసులు వాటికి లోబడకపోతే దేవుడు వారిని శిక్షిస్తాడు అని చెప్పడం చాలా అవమానకరం. కాని దేవుడు మనలో ప్రతి ఒక్కరికీ తీర్పు తీరుస్తాడు.
\v 11 అది మనకు ఎలా తెలిసింది అంటే ఈ విషయం లేఖనాలలో రాయబడింది.
\q "ప్రతి ఒక్కరూ నా ముందు మోకరిల్లాలి.
\q ప్రతి ఒక్కరూ నన్ను స్తుతించాలి."
\s5
\p
\v 12 కాబట్టి మనం ప్రతి ఒక్కరం ఏమి చేసామో దేవునికి చెప్పవలసి ఉంటుంది. ఇంకా దానిని ఆయన ఆమోదించాడో లేదో ఆయనే నిర్ణయించాలి.
\p
\v 13 ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చేది దేవుడే కాబట్టి మన తోటి విశ్వాసులలో కొంతమందిని దేవుడు శిక్షించాలని అనడం మనం మానేయాలి. దానికి బదులుగా, మన సహోదరుడు గానీ సహోదరి గానీ పాపం చేయడానికి కారణంగా మనం ఉండకూడదని నిర్ణయించుకోవాలి. ఇంకా వారికి క్రీస్తుపై నమ్మకం పోకుండా చూసుకోవాలి.
\s5
\p
\v 14 నేను యేసు ప్రభువుతో కలిసి ఉన్నందున తినడానికి ఏదీ అపవిత్రం కాదని కచ్చితంగా అనుకుంటున్నాను. కాని మనుషులు ఏదైనా తినడం తప్పు అని అనుకుంటే వారికి అది తప్పుగానే ఉంటుంది. కాబట్టి వారిని అది తినమని బలవంతం చేయవద్దు.
\v 15 నీ తోటి విశ్వాసి తప్పు అని భావించే ఆహారాన్ని నువ్వు తింటుంటే అతడు దేవునికి విధేయత చూపడం మానేయవచ్చు. మీరు అతన్ని ప్రేమించలేకపోవచ్చు. నీ తోటి విశ్వాసులు ఎవ్వరైనా క్రీస్తునందు విశ్వాసం లేకుండా పోవడానికి నువ్వు కారణంగా ఉండ వద్దు. ఎందుకంటే క్రీస్తు వారికోసం కూడా చనిపోయాడు.
\s5
\v 16 అదే విధంగా నీకు మంచిగా అనిపించిన దేనినీ కూడా నీ తోటి విశ్వాసులకు చేయవద్దు, అది వారికి చెడు గానే ఉంటుంది.
\v 17 మనం ఎలా జీవించాలో దేవుడు నిర్ణయిస్తున్నప్పుడు, ఏమి తినాలో ఏమి తాగాలో వాటి గురించి చింతించకండి. ఆయనకు ఎలా లోబడి ఉండాలీ దానికి సరియిన మార్గం ఏదీ ఒకరికొకరం సమాధానంతో ఎలా ఉండాలి పరిశుదాత్మలో ఎలా సంతోషించాలీ అని మనం ఆలోచించాలి.
\s5
\v 18 ఈ విధంగా చేస్తూ దేవునికి సేవ చేసి ఆయనను సంతోషపరిస్తే మిగిలినవారు కూడా వారిని గౌరవిస్తారు.
\p
\v 19 కాబట్టి మనం మన తోటి క్రైస్తవులలో శాంతిని కలిగించే విధంగా జీవించడానికి తీవ్రంగా ప్రయత్నించాలి. మనం ఒకరికొకరం సహాయం చేసుకోవడానికీ క్రీస్తునందు నమ్మిక ఉంచి ఆయనకు లోబడి ఉండడానికీ తప్పక ప్రయత్నం చెయ్యాలి.
\s5
\v 20 మీరు ఏదైనా ఒక రకమైన ఆహారం నచ్చడం వల్ల ఎవరైనా విశ్వాసికి దేవుడు చేసిన సహాయాన్ని నాశనం చేయవద్దు. దేవుడు మనకు అన్ని రకాల ఆహార పదార్ధాలను తినమని అనుమతినిచ్చాడు అనేది నిజం. ఇతర విశ్వాసులు మీరు తినే ఆహారాన్ని చూసి తప్పుగా అనుకుంటే మీరు అతను తప్పు అని అనుకున్నది చేయమని అతన్ని ప్రోత్సహిస్తున్నారు.
\v 21 మాంసం తినడం, ద్రాక్షారసం తాగటం, ఇంకా మరేదైనా సరే, నీ తోటి విశ్వాసులు ఆటంకంగా భావించి దేవునిపై నమ్మకాని వదిలేస్తే, దాన్ని మానివేయడం మంచిది.
\s5
\v 22 మీరు ఏమి చేయాలో దేవునికే వదిలెయ్యండి. కాని మీరు నమ్మేదాన్ని ఇతరులు అంగీకరించాలని వారిని బలవంతం చేయటానికి ప్రయత్నం చెయ్యొద్దు. ఏది సరైనది ఏది సరికాదు అనే నీ నమ్మకాలలో నీకు అనుమానాలు లేకపోతే నువ్వే దేవుణ్ణి సంతోషపరచు.
\v 23 కాని, కొన్నిరకాల ఆహార పదార్ధాలను తింటే దేవుడు సంతోషపడడని కొంతమంది విశ్వాసులు నమ్ముతారు. వారు సరైనది అని నమ్మిన దానిని చేయకపోతే వారు తప్పు చేస్తున్నట్టే అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏదైనా పనిని ఆమోదించాడని తెలియకుండా మనం ఆ పనిని చేస్తే మనం పాపం చేసినట్టే.
\s5
\c 15
\p
\v 1 ఇతర విశ్వాసులు చేసే పనులు కంటే చాలా ఎక్కువ పనులు చేయటానికి దేవుడు మనకే అనుమతి ఇస్తాడని మనలో ఉన్న విశ్వాసులు ఎక్కువమంది నమ్ముతారు. మనం వారితో ఓపికతో ఉండాలి, ఇంకా వారి అసౌకర్యాన్ని అనుమతించాలి. మనల్ని మనం సంతోషపరచుకోవడం కంటే ఇలా చేయటం చాలా ముఖ్యం.
\v 2 మనలో ప్రతి ఒక్కరూ మన తోటి విశ్వాసులు సంతోషపడే పనులను చేయాలి. వారికి సహాయం చేయాలి. క్రీస్తులో నమ్మకముంచేలా వారిని ప్రోత్చహించాలి.
\s5
\v 3 క్రీస్తు మనకు ఒక ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఆయన వలె మనం మన తోటి విశ్వాసులను సంతోషపెట్టాలి. తనకు తాను సంతోష పడడానికి ఆయన ఏమీ చేసుకోలేదు. దానికి విరుద్ధంగా ఇతరులు తనను నిందిస్తున్నా, ఆయన మాత్రం దేవుణ్ణి సంతోషపెట్టటానికే ప్రయత్నించాడు అని లేఖనాలు చెప్తున్నాయి, "మనుషులు నిన్ను అవమానించినప్పుడు వారు నన్ను అవమానించినట్టుగానే ఉంది."
\v 4 లేఖనాలలో రాసిన అన్ని విషయాలూ మనకు బోధించడానికే ఉన్నాయి. వాటి ద్వారా మనం కష్టాలలో కూడా ఓపికతో ఉండొచ్చు. ఈ విధంగా దేవుడు చేసిన వాగ్దానాలన్నీ మన కోసం ఆయన నెరవేరుస్తాడని మనం ఎప్పుడూ ఆశించాలని లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి.
\s5
\v 5 దేవుడు మీకు సహనాన్నీ, ప్రోత్సాహాన్నీ ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ యేసుక్రీస్తులా ఒకరికొకరు శాంతితో జీవించాలి.
\v 6 మీరు ఇలా చేసి మనందరం కలిసి మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచాలి.
\p
\v 7 రోమ్ లో ఉన్న విశ్వాసులైన మీ అందరికి నేను చెప్తున్నాను. మీరు ఒకరిని ఒకడు చేర్చుకోండి. మీరు అలా చేస్తే, మీరు క్రీస్తులానే ఉన్నారని మనుష్యులందరూ చూసి వారు దేవుణ్ణి మహిమ పరుస్తారు. క్రీస్తు మిమ్మల్ని ఎలాగైతే చేర్చుకున్నాడో అలాగే మీరూ ఒకరిని ఒకడు చేర్చుకోండి.
\s5
\v 8 దేవుని గురించిన సత్యం తెలియడానికి క్రీస్తే మనకు సహాయం చేసాడని మీరు గుర్తుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మన పూర్వీకులకు తాను చేస్తానని వాగ్దానం చేసిన ప్రతిదాన్ని నిజం చేయడానికి వచ్చాడు.
\v 9 కాని ఆయన యూదేతరుల కోసం కూడా వచ్చాడు. అందుకే వారు దేవుని దయ కొరకు ఆయనను స్తుతిస్తున్నారు. లేఖనాలలో దేవుని కృపను గురించి రాసిన దానిని దావీదు దేవునితో చెప్తున్నాడు. "ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామ సంకీర్తనం చేస్తాను."
\s5
\v 10 ఇంకా మోషే కూడా రాసాడు, "యూదేతరులారా, ఆయన ప్రజలైన మాతో కలిసి సంతోషించండి."
\v 11 దావీదు లేఖనాలలో రాసాడు, "యూదేతరులందరూ ప్రభువును స్తుతించండి. ప్రజలంతా ఆయనను కొనియాడతారు."
\s5
\v 12 యెషయా రాసాడు, "రాజైన దావీదు వారసుడు యూదేతరులను ఏలడానికి వస్తాడు. ఆయనలో యూదేతరులు నమ్మకం పెట్టుకుంటారు."
\s5
\p
\v 13 దేవుడు వాగ్దానం చేసినట్టుగా ఆయన మీ కొరకు చేస్తాడని మీరు నమ్మకంగా ఎదురుచూడాలని నేను ప్రార్ధిస్తున్నాను. మీరు ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు ఆయన మిమ్మల్ని పూర్తిగా ఆనందంగా ప్రశాంతంగా ఉంచాలని నేను ప్రార్ధిస్తున్నాను. దేవుడు వాగ్దానం చేసినవాటిని తప్పక ఇస్తాడని పరిశుద్దాత్మ మీకు మరింత నమ్మకాన్ని కలిగిస్తున్నాడు.
\s5
\p
\v 14 నా తోటి విశ్వాసులారా, మీకు మీరు మంచి మార్గంలో ఉండి ఇతరులపట్ల కూడా మంచిగా ప్రవర్తించారని నాకు పూర్తిగా తెలుసు. మీరు ఆ పని చేసారు. ఎందుకంటే దేవుడు కోరుకుంటున్నట్టుగా మీకు అన్నీ పూర్తిగా తెలియాలి ఇంకా మీరు ఒకరినొకరు బోధించగలగాలి.
\s5
\v 15 అయినా నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని మరింత ధైర్యం తెచ్చుకుని రాస్తున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నాకు అర్హత లేకపోయినా యేసుక్రీస్తు సేవకుడినయ్యాను కాబట్టి నేను మీకు ఇది రాస్తున్నాను.
\v 16 యూదేతరుల మధ్యలో నేను యేసుక్రీస్తు పనిచేయటానికి దేవుడు నన్ను ఇలా చేసాడు. ఆయన సువార్తను ప్రకటించడానికి దేవుడు నన్ను ఒక యాజకునిగా నియమించాడు. క్రీస్తును నమ్మటానికి సిద్ధపడిన యూదేతరులను ఆయన అంగీకరిస్తాడు. వారు పరిశుద్దాత్మ వలన పవిత్రమై దేవునికి ఇష్టమైన అర్పణలాగా ఉన్నారు.
\s5
\p
\v 17 కాగా, క్రీస్తు యేసును బట్టి దేవుని సేవ విషయాల్లో నాకు సంతోషంగానే ఉంది.
\v 18 క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గురించి నేను ధైర్యంగా మాట్లాడతాను. అదేమిటంటే యూదేతరులు లోబడేలా మాటల చేతా, క్రియల చేతా
\v 19 సూచనల చేతా ఇతర సంగతుల చేతా క్రీస్తు సువార్తను వారికి బోధించాను. పరిశుద్ధాత్మ శక్తి చేత నేను ఇదంతా చేసాను. ఈ విధంగా యెరూషలేముతో ప్రారంభించి చుట్టుపట్ల అన్ని ప్రదేశాల్లో, ఇల్లూరికు ప్రాంతం వరకూ క్రీస్తు సువార్తను పూర్తిగా ప్రకటించాను.
\s5
\v 20 నేను సువార్తను ప్రకటించేందుకు క్రీస్తు నామం తెలియని చోట్ల సువార్త ప్రకటించాలని ఎంతో ఆశతో ఉన్నాను. ఇలా ఎందుకు చేసానంటే ఇంకొకరు మొదలుపెట్టిన పనిని నేను కొనసాగించకూడదని నా ఆలోచన. వేరొకడు వేసిన పునాది మీద ఇల్లు కట్టడం నాకు ఇష్టం లేదు.
\v 21 దానికి విరుద్దంగా, నేను యూదేతరులకు బోధించేవాడిని. దీన్ని గురించి ఇలా రాసి ఉంది. "ఆయన గూర్చి ఎవరికి సమాచారం అందలేదో వారు చూస్తారు, ఎవరు వినలేదో వారు గ్రహిస్తారు."
\s5
\p
\v 22 ఈ కారణం వల్లనే నేను మీ దగ్గరికి రాకుండా నాకు చాలాసార్లు ఆటంకం కలిగింది.
\v 23 ఇక ఈ ప్రాంతాల్లో నేను వెళ్ళవలసిన స్థలం మిగిలి లేదు కాబట్టి, అనేక సంవత్సరాలుగా మీ దగ్గరికి రావాలని ఎంతో ఆశతో ఉన్నాను.
\s5
\v 24 కాబట్టి నేను స్పెయిను దేశానికి ప్రయాణించినప్పుడు దారిలో ముందు మిమ్మల్ని చూసి, మీ సహవాసంలో కొద్ది సమయం ఆనందిస్తాను.
\v 25 కాని ఇప్పుడు నేను మిమ్మల్ని కలవలేను. అయితే యెరూషలేములోని దేవుని ప్రజల కోసం కొంత డబ్బు వారికి ఇవ్వటానికి వెళ్తున్నాను.
\s5
\v 26 ఎందుకంటే యెరూషలేములోని పరిశుద్ధుల్లో పేదల కోసం మాసిదోనియ, అకయ విశ్వాసులు కొంత చందా పంపడానికి ఇష్టపడ్డారు.
\v 27 వీరు చాలా ఇష్టంగా ఆ పనిని వారికి వారే చేశారు. నిజానికి వారు యెరూషలేములోని దేవుని ప్రజలకు రుణపడి ఉన్నారు. ఎలాగంటే యూదేతరులు వారి ఆధ్యాత్మిక విషయాల్లో యూదువిశ్వాసులు ఎంతో సహాయం చేసారు. క్రీస్తుని గురించిన సువార్తను వారు యూదు విశ్వాసుల వల్లనే విన్నారు. కాబట్టి శరీర సంబంధమైన విషయాల్లో యూదేతరులు వారికి సహాయం చేయడం సబబే.
\s5
\v 28 నేను ఈ డబ్బుని వారికప్పగించి నా పని ముగించిన తరువాత నేను యెరూషలేమును విడిచి రోములో ఉన్న మిమ్మల్ని కలిసి మీ పట్టణం మీదుగా స్పెయినుకు ప్రయాణం చేస్తాను.
\v 29 నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు, క్రీస్తు సంపూర్ణమైన దీవెనలతో వస్తానని నాకు తెలుసు.
\s5
\p
\v 30 మీరు దేవునికి చేసే ప్రార్థనల్లో నా కోసం నాతో కలిసి పోరాడమని మన యేసు క్రీస్తు ప్రభువును బట్టి, ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలుతున్నాను.
\v 31 నేను యూదయలోని అవిశ్వాసుల చేతుల్లో నుండి తప్పించుకోగలిగేలా, యెరూషలేములో ఉన్న పరిశుద్ధులు నేను తీసుకెళ్ళిన డబ్బును సంతోషంతో అంగీకరించేలా ప్రార్ధించండి.
\v 32 దేవుని చిత్తమైతే నేను సంతోషంతో మీ దగ్గరికి వచ్చి, మీతో కలిసి సేద దీరడానికి వీలు కలిగేలా ప్రార్ధించండి.
\s5
\v 33 సమాధానకర్త అయిన దేవుడు మీకందరికీ తోడుగా ఉండు గాక. ఆమేన్‌.
\s5
\c 16
\p
\v 1 ఈ ఉత్తరం ద్వారా మన సాటి విశ్వాసి అయిన ఫీబేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆమే ఈ ఉత్తరం మీ దగ్గరకు తీసుకు వస్తున్నది. ఆమె కెంక్రేయ సంఘంలో పరిచారిక.
\v 2 మీరు మాతో ప్రభువులో కలిసి ఉన్నారు గనక ఆమెను చేర్చుకోండి. ఎందుకంటే దేవుని ప్రజలు సాటి విశ్వాసులకు ఆతిథ్యం ఇస్తుండాలి. ఆమెకు అవసరమైనవన్నీ ఇచ్చి సహకరించమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈమె నాతో సహా అనేకమందికి తోడ్పడింది.
\s5
\p
\v 3 క్రీస్తు యేసులో ప్రిస్కిల్లకు, అకులకు నా అభివందనాలు చెప్పండి. వారు నాతో యేసు క్రీస్తు పనిలో పాల్గొన్నారు.
\v 4 నాకోసం ప్రాణాలు ఫణంగా పెట్టడానికి సైతం సిద్ధపడ్డారు. నా ప్రాణాలు కాపాడినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి ఇంట్లో ఆరాధనకు సమావేశమయ్యే వారందరికీ వందనాలు చెప్పండి. నేనే కాదు యూదేతర సంఘాలన్నీ వీరి పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాయి.
\p
\v 5 నా మిత్రుడు ఎపైనెటుకు అభివందనాలు. ఆసియా రాష్ట్రంలో మొట్టమొదటగా క్రీస్తును నమ్ముకున్న వాడు ఇతడే.
\s5
\v 6 మీకు సహాయం చెయ్యడానికి క్రీస్తు కోసం ఎంతో కష్టపడిన మరియను అడిగానని చెప్పండి.
\p
\v 7 నా సాటి యూదులు, నాతోబాటు జైల్లో ఉన్న అంద్రొనీకు, అతని సతీమణి యూనీయలకు కూడా అదే మాట చెప్పండి. వీరు అపొస్తలులకు చిర పరిచితులు. నాకంటే ముందే క్రీస్తులో నమ్మకం ఉంచిన వారు.
\p
\v 8 ప్రభువులో నాకు ప్రియమైన అంప్లీయతుకు అభివందనాలు.
\s5
\p
\v 9 క్రీస్తు కోసం మనతో కలిసి పాటు పడిన ఊర్బానుకు, నా ప్రియ స్నేహితుడు స్టాకుకు అభివందనాలు.
\p
\v 10 క్రీస్తు అభిమానాన్ని చూరగొన్న అపెల్లెకు వందనాలు తెలుపుతున్నాను. అరిస్టొబూలు కుటుంబంలో ఉన్న విశ్వాసులకు నా వందనాలు చెప్పండి.
\p
\v 11 నా బంధువు హెరోదియోనుకు అభివందనాలు. నార్కిస్సు కుటుంబంలో ప్రభువుకు చెందిన వారికి అభివందనాలు.
\s5
\p
\v 12 త్రుపైనాకు, ఆమె చెల్లెలు త్రుఫోసాకు ఇదే మాట చెప్పడి. వీళ్ళు ప్రభువు కోసం చెమటోడ్చి పని చేశారు. ప్రియమైన పెర్సిసుకు కూడా నా అభివందనాలు పంపుతున్నాను. ఆమె ప్రభువులో ఎంతో కష్టపడింది.
\p
\v 13 రూఫస్ కు అభివందనాలు. అతడు అసమాన క్రైస్తవుడు. అతని తల్లికి కూడా వందనాలు. ఆమె నన్నూ సొంత కొడుకులాగా చూసుకుంది.
\p
\v 14 అసుంక్రితు, ప్లెగో, హెర్మే, పత్రొబ, హెర్మా, వారితో కూడా ఆరాధించే సోదరులకు కూడా అభివందనాలు పంపుతున్నానని చెప్పండి.
\s5
\p
\v 15 పిలొలొగుకు, యూలియాకు, నేరియకు, అతని సోదరికీ, ఒలుంపాకు వారితో కూడా ఆరాధనకు సమకూడే అందరికీ అభివందనాలు.
\p
\v 16 మీరు కలిసినప్పుడు పవిత్రంగా ఆప్యాయంగా పలకరించుకోండి. క్రీస్తుకు చెందిన అసెంబ్లీలన్నిటిలోని విశ్వాసులు మీకు వందనాలు చెబుతున్నారు.
\s5
\p
\v 17 నా తోటి విశ్వాసులారా, మీలో చీలికలు తెచ్చే వారి విషయం జాగ్రత్తగా ఉండండి. మీరు దేవుణ్ణి సన్మానించకుండా వారు మీకు అడ్డు తగులుతున్నారు. అలాటి వారికి దూరంగా ఉండండి.
\v 18 వారు యేసు క్రీస్తు భక్తులు కాదు. తమ సొంత కోరికలు తీర్చుకోవడమే వారి ధ్యేయం. తేనె పూసిన కత్తి వంటి ఇచ్చకం మాటలు మాట్లాడుతూ వారు మనుషులను బుట్టలో వేసుకుంటారు. వారు తంటాలమారులనీ దుర్బోధకులనీ మనుషులు గ్రహించరు.
\s5
\v 19 ఇవన్నీ మీరు పాటిస్తే సువార్తలో క్రీస్తు చెప్పిన వాటికి మీరు లోబడినట్టే. మిమ్మల్ని గురించి నేను సంతోషిస్తాను. మీరు కూడా చురుకుగా మంచిదేదో గుర్తించి దుర్మార్గతకు దూరంగా ఉండాలి.
\v 20 మీరు ఇవన్నీ చేస్తే దేవుడు మీకు శాంతి ప్రసాదిస్తాడు. త్వరలో మీ అధికారం చొప్పున ఆయన సాతాను పనిని పటాపంచలు చేస్తాడు. మన యేసు క్రీస్తు ప్రభువు కృప మీకు తోడై ఉండు గాక.
\s5
\p
\v 21 నా సహచరుడు తిమోతి, నా జాతివారైన లూకియ, యాసోను, సోసిపత్రు మీకు అభివందనాలు చెబుతున్నారు.
\p
\v 22 ఈ ఉత్తరాన్ని పౌలు చెబుతుండగా స్వదస్తూరితో రాసిన తెర్తియు అనే నేను ప్రభువులో మీకు అభివందనాలు చెబుతున్నాను.
\s5
\p
\v 23 పౌలు అనే నేను ప్రస్తుతం గాయి ఇంట్లో ఉంటున్నాను. అసెంబ్లీ ఈ ఇంట్లోనే ఆరాధనకు కలుసుకుంటారు. అతడు కూడా మీకు వందనాలు చెబుతున్నాడు. నగర కోశాధికారి ఎరస్తు, మన సోదరుడు క్వర్తు కూడా వందనాలు చెబుతున్నారు.
\p
\v 24 మన యేసు క్రీస్తు ప్రభువు కృప మీకు తోడుగా ఉండు గాక. ఆమెన్.
\s5
\p
\v 25 మనకు ముందటి యుగాల్లో వెల్లడి పరచకుండా ఇప్పుడు యేసు క్రీస్తు సువార్తను నా ద్వారా ప్రకటించిన దేవుడు మిమ్మల్ని అత్మసంబంధంగా బలపరచు గాక.
\v 26 ఇప్పుడు లేఖనాలు చెప్పిన దాని ప్రకారం ఆయన దాన్ని బహిర్గతం చేసి అన్ని జాతుల ప్రజలూ క్రీస్తును నమ్ముకుని ఆయనకు విధేయులయ్యేలా చేశాడు.
\s5
\v 27 ఏకైక జ్ఞాని అయిన దేవునికి క్రీస్తు మన కోసం చేసిన దాన్ని బట్టి నిరంతరం స్తుతి కలుగు గాక. ఆమెన్.

819
47-1CO.usfm Normal file
View File

@ -0,0 +1,819 @@
\id 1CO - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక
\toc1 కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక
\toc2 కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక
\toc3 1co
\mt1 కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక
\s5
\c 1
\p
\v 1 పౌలు, అనే నేను ఈ లేఖ మన తోటి విశ్వాసి అయిన సొస్తెనేసుతో కలిసి రాస్తున్నాను. దేవుడు తనకు నచ్చిన విధంగా యేసుక్రీస్తు అపొస్తలుడుగా ఉండటానికి పిలిచాడు.
\v 2 కొరింతులో ఉన్న దేవుని సంఘానికి చెందిన నీకు ఈ లేఖ పంపుతున్నాను. నువ్వు యేసు వాడవు కనుక నిన్ను పవిత్రునిగా చేశాడు. నీతోపాటు ప్రభువైన యేసు నామంలో ప్రార్థించే వారందరినీ పవిత్రులని పిలిచాడు.
\v 3 మన తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు నీకు కృప, శాంతి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను.
\m
\s5
\v 4 మీ గురించి ఆలోచించిన ప్రతిసారీ యేసుక్రీస్తును మనకు దయచేసి మనపై కృపను చూపిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
\v 5 ఉదాహరణకు మనం చెప్పే, మనకు తెలిసిన అన్ని విషయాలు యేసు కలుగజేసినవే.
\v 6 ఈ విధంగా యేసు గురించి చెప్పిన ప్రతి విషయం నిజం అయ్యింది.
\m
\s5
\v 7 ఆ కారణం చేత మనం దేవుని ఆత్మ నుంచి ఎలాంటి ప్రతిఫలం ఆశించక, యేసు దర్శనం కోసం ఎదురుచూస్తున్నాము.
\v 8 యేసు తిరిగి వచ్చే సమయానికి నిన్ను ఎవరూ నిందించకుండా చివరి వరకు దేవునిలో స్థిరంగా ఉండేలా ఆయన నిన్ను బలపరుస్తాడు.
\m
\v 9 ఆ విధంగా దేవుడు తన మాటను నిలబెట్టుకుంటున్నాడు. మన ప్రభువు, తన కుమారుడైన యేసుక్రీస్తును తెలుసుకుని, ప్రేమించడానికి దేవుడు మనలను పిలిచాడు.
\m
\s5
\v 10 సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నేను మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, మీరంతా ఒకటిగా మాట్లాడుతూ, మీలో మీకు విభేదాలు లేకుండా, ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో కలిసి ఉండండి.
\v 11 మీలో మీకు విభేదాలు ఉన్నాయని క్లోయె ఇంటివారి ద్వారా నాకు తెలిసింది.
\m
\s5
\v 12 మీలో ఒకడు "నేను పౌలు వర్గం," ఒకడు "నేను అపొల్లో వర్గం," మరొకడు "నేను పేతురు వర్గం" "నేను క్రీస్తు వర్గం" అని రకరకాలుగా చెప్పుకుంటున్నారని విన్నాను.
\v 13 క్రీస్తు ముక్కలుగా అయిపోయాడా? పౌలు మీ కొరకు సిలువ అనుభవించాడా? పౌలు నామంలో మీరు బాప్తిసం పొందారా.
\m
\s5
\v 14 నేను క్రిస్పుకు, గాయికి తప్ప మీకెవరికీ బాప్తిసం ఇవ్వనందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
\v 15 ఎందుకంటే వారు నా శిష్యులుగా ఉంటారని నేను బాప్తిసం ఇచ్చానని ఎవ్వరూ చెప్పుకోకూడదు.
\v 16 స్తెఫను ఇంటి వారికి కూడా బాప్తిసమిచ్చాను. వీరికి తప్ప ఇంకా ఎవరికీ బాప్తిసం ఇచ్చినట్టు నాకు తెలియదు.
\m
\s5
\v 17 క్రీస్తు నన్ను బాప్తిసం ఇవ్వడానికి పంపలేదు, దేవుని శుభవార్త చెప్పడానికి పంపాడు, మానవ జ్ఞానంతో కాకుండా, ఆయన సిలువ మరణం , దాని శక్తితో సువార్త చెప్పడానికి పంపాడు.
\s5
\p
\v 18 నశించిన వారికి దేవుని కార్యాలు అర్థం కావు. యేసు వారి కోసం సిలువపై మరణించాడు, కానీ వారికి అది అర్థం కాదు. కానీ దేవుని వల్ల రక్షణ పొంది తిరిగి జీవం పొందిన వారికి అది దేవుని శక్తి.
\v 19 ఒక ప్రవక్త ఇలా రాసాడు:
\q "జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేస్తాను. వివేకుల తెలివిని వ్యర్థం చేస్తాను.
\s5
\p
\v 20 "లోకంలో జ్ఞానులు ఎక్కడున్నారు? మేధావులు ఎక్కడున్నారు? వారికి దేవుని గురించి ఏమీ తెలియదు. వారి లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రి తనంగా చేశాడు కదా?"
\p
\v 21 లోకం తన జ్ఞానం ద్వారా దేవుణ్ణి తెలుసుకోలేక పోయింది కాబట్టి, సువార్త ప్రకటన అనే వెర్రితనం ద్వారా నమ్మేవారిని రక్షించడానికి దేవుడు దయతో అనుగ్రహించాడు.
\s5
\p
\v 22 యూదులు ఎవరినైనా నమ్మే ముందు వారికి అద్భుతాలు చూపించాలి. వారు కొత్త విధానాల ద్వారా జ్ఞానం కావాలని వెతుకుతున్నారు.
\v 23 అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. అయితే యూదులకు సిలువ మరణం శాపం తెచ్చిపెడుతుందని నమ్మకం. అలాగే గ్రీకులకు కూడా అది బుద్ధిహీనతగా అనిపించింది.
\s5
\p
\v 24 దేవునిచే పిలవబడిన మనమైతే, ఆయనను తెలుసుకోగలం. ఆ సువార్తలో మనకొరకు చనిపోవడానికై క్రీస్తును పంపించడంలో దేవుడు చూపిన బల వివేకాలు కనబడతాయి. ఈ శుభవార్త ఒక జాతి, ఒక ప్రాంతం వారికి మాత్రమే కాదు. ఎందుకంటే యేసుకు యూదులైనా ఇతర దేశస్తులైనా , భూమి మీద అన్ని జాతులు ఒకటే.
\v 25 బుద్ధిహీనంగా కనిపించే దేవుని కార్యాలు మానవుల అత్యున్నత మేధస్సు గల వాటికంటే తెలివైనవి. దేవుని బలహీన కార్యాలు మానవుల్లో మహా బలమైన వాని కన్నా బలమైనవి.
\s5
\p
\v 26 సోదర సోదరీలారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును గమనించండి. మీరు ఏమీ ప్రాధాన్యత లేనివారని గమనించండి. మీలో లోకం దృష్టిలో మేధావులు, జ్ఞానులు, ఉన్నత కులీనులు ఎంతో మంది లేరు కదా.
\v 27 దేవుడు తెలివైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బుద్ధిహీనుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, బలవంతుల్ని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనుల్ని ఏర్పాటు చేసుకున్నాడు.
\s5
\p
\v 28 అవిశ్వాసులు వేటినైతే విలువ లేనివిగా చూస్తారో, వారు సిగ్గుపడేలా దేవుడు ఆ విలువలేని వాటినే ఎంచుకుంటాడు.
\v 29 ఎందుకంటే ఏ మనిషి తనను తాను కీర్తించుకోకుండా దేవుడినే ఘనపరచాలని ఇలా చేశాడు.
\s5
\p
\v 30 దేవుడు చేసిన దానివల్ల మనం యేసుతో ఉన్నాము, ఆయన ఎంత జ్ఞానవంతుడో మనల్నితనతో పాటు ఉంచుకుని కాపాడుకోవడం ద్వారా తెలిసింది.
\v 31 లేఖనాలలో ఇలా రాసి ఉంది.
\q "అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి."
\s5
\c 2
\p
\v 1 సోదరీ సోదరులారా, నేను మీ దగ్గరికి వచ్చి మాటకారితనాన్నీ , జ్ఞానులు చెప్పిన విషయాలను గానీ ప్రదర్శించ లేదు, దేవుని గురించిన సత్యాన్ని బోధించాను.
\v 2 నేను యేసు గురించి, ఆయన సిలువ మరణం గురించి తప్ప వేరే ఏ విషయం గురించి మీతో మాట్లాడకూడదని తీర్మానించుకున్నాను.
\s5
\p
\v 3 నేను మీతో ఉన్నప్పుడు ఎంత బలహీనుడిగా, మనస్సులో భయంతో, వణుకుతూ ఉండేవాడినో మీరు చూశారు.
\v 4 కానీ మీరు నా బోధ విన్నప్పుడు, నేను ముందుగా సిద్ధపడి చెప్పిన వాటి లాగా కాకుండా, దేవుని ఆత్మ ప్రేరణతో నా జీవితంలో యేసు చేసిన అద్భుత కార్యాల ద్వారా నేను సత్యాన్ని బోధించడం చూశారు.
\v 5 నేను ఈ విధంగా ఎందుకు చెప్పానంటే, మీరు మనిషి జ్ఞానం వలన కాకుండా పరిశుద్ధాత్మ శక్తి వలన దేవుణ్ణి నమ్మాలని.
\s5
\p
\v 6 కాని మనం దేవుని యందు జ్ఞానం కలిగిన వారికి బోధిస్తున్నాము. ఆ జ్ఞానం ఈ లోకానికి చెందినది కాదు, త్వరలోనే అంతమైపోయే రాజులు, అధికారులది కూడా కాదు.
\v 7 అది దేవుని రహస్య జ్ఞానం. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు ఈ లోకాన్ని సృష్టించకముందే మనల్ని ఒకరోజు ఘనపరచడానికి సృష్టించాడు.
\s5
\p
\v 8 అయితే దాని గురించి ఈ లోకాధికారులు ఎవరికీ తెలియదు. అది వాళ్ళకి తెలిసి ఉంటే మహిమగల ప్రభువుని సిలువ వేసేవారు కాదు.
\v 9 దాన్ని గురించి లేఖనాలలో,
\q "దేవుడు తనను ప్రేమించేవారి కోసం ఏం సిద్ధపరిచాడో
\q అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు,
\q మానవ ఊహకు అందవు" అని రాసి ఉంది.
\m
\s5
\v 10 మనకు దేవుడు ఆ విషయాలను తన ఆత్మ ద్వారా చూపించాడు. కాగా ఆ ఆత్మకు అన్ని విషయాలూ , చివరికి దేవుని లోతైన రహస్యాలు కూడా తెలుసు.
\v 11 ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తిలోని ఆత్మకే తప్ప వేరే ఎవ్వరికీ తెలియవు. అలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు.
\s5
\p
\v 12 దేవుడు మనకిచ్చిన ఆత్మ ఈ లోకం నుండి వచ్చినది కాదు, దేవుని నుండి వచ్చినది. ఆ ఆత్మ మనకు దేవుడు ఉచితంగా ఇచ్చిన వాటిని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.
\v 13 వాటిని ఈ లోకసంబంధమైన జ్ఞానం కలిగిన వాళ్ళు అర్థం చేసుకోలేరు, దేవుని జ్ఞానం కలిగిన వారు మాత్రమే అర్థం చేసుకోగలరు.
\s5
\p
\v 14 అయితే దేవుని గురించి తెలియని వారికి ఈ విషయాలు అర్థం కావు. వారికి అవి తెలివితక్కువ మాటలుగా అనిపిస్తాయి. ఒకవేళ వారు ఆ విషయాలు అర్థం చేసుకోవాలన్నా వారికి అర్థం కావు, ఎందుకంటే అవి దేవుని జ్ఞానం ఉన్నవారికే అర్ధమవుతాయి.
\v 15 అయితే దేవుణ్ణి తెలిసినవాడు అన్నింటిని అంచనా వేయగలడు. కాని దేవుణ్ణి అంచనా వేయడం ఆయన అంగీకరించడు.
\v 16 ఒక ప్రవక్త ఇలా రాసాడు,
\q "ప్రభువు మనసు గ్రహించి ఆయనకు ఎవరు బోధించగలరు? మనకైతే ప్రభువు మనసు ఉంది."
\s5
\c 3
\p
\v 1 సోదరీ సోదరులారా, నేను మీతో ఉన్నప్పుడు దేవుని గురించి గ్రహించలేని సత్యాలు మాట్లాడలేదు. క్రీస్తులో పసిబిడ్డలతో మాట్లాడిన విధంగా మాట్లాడవలసి వచ్చింది.
\v 2 ఒక తల్లి తన పిల్లలను పాలతో పెంచినట్లుగా, నేను మీకు సులువైన విషయాలు చెప్పాను. బలమైన ఆహారం కొరకు మీరు ఇంకా సిద్ధంగా లేరు. అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టలేము కదా.
\s5
\p
\v 3 క్రైస్తవులు అయినప్పటికీ మీరు అవిశ్వాసుల్లాగా ప్రవర్తిస్తున్నందుకు నేను అలా అన్నాను. ఎందుకంటే మీ మధ్య అసూయ, ద్వేషాలు ఉన్నాయి. మీలో మీరు గొడవలు పడుతూ అవిశ్వాసులుగానే ఉన్నారు కదా.
\v 4 మీలో కొందరు పౌలు చెప్పిన విధంగా పాటిస్తున్నాము అని, మరికొందరు అపొల్లోను అనుసరిస్తున్నాము అని అంటున్నారు. కాని మీరు అవిశ్వాసుల్లాగా ప్రవర్తిస్తున్నారు.
\p
\v 5 దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలును బట్టి పౌలు ఎవరు? అపొల్లో ఎవరు? మేము దేవుని సేవకులం, ఆయన మాకు అప్పగించిన దాన్ని బట్టి మేము ఆయన్ని సేవిస్తున్నాము.
\s5
\p
\v 6 నేను మీలో దేవుని వాక్యం అనే విత్తనం నాటాను, అపొల్లో విశ్వాసజలం పోసి పెంచాడు. కాని దేవుడు మాత్రమే మీలో ఆత్మీయ ఎదుగుదల ఇవ్వగలడు.
\v 7 మళ్ళీ చెబుతున్నాను, "విత్తనం నాటేవాడూ, వాటికి నీళ్ళు పోసేవాడూ ముఖ్యం కాదు. దానికి ఎదుగుదల ఇచ్చే దేవుడు ముఖ్యం. మీరు ఆయన నాటిన తోటవంటి వారు."
\s5
\p
\v 8 నాటేవాడు, నీరు పోసేవాడు ఒకే పని కోసం పనిచేస్తున్నారు, కాని పిండి కొద్దీ రొట్టె అన్నట్టు ప్రతిఫలం ఎవరి కష్టాన్ని బట్టి వారికి వస్తుంది.
\v 9 మేము దేవునికి చెందినవాళ్ళం, ఆయన కొరకు పని చేస్తున్నాం. కాని మీరు మాత్రం దేవుని పొలంలో పెరుగుతున్న వాళ్ళు, మీరు దేవుని కట్టడం.
\s5
\p
\v 10 నేను దేవుడి పని చెయ్యడానికి ఆయన నాకు ఈ నైపుణ్యం ఇచ్చాడు. నేను మీ మధ్యలో ఒక గొప్ప నిర్మాణకునిగా పని చేశాను. నా తర్వాత వేరే ఒకరు దానిమీద నిర్మిస్తారు. అయితే ప్రతి ఒకరు తాము ఏ విధంగా కడుతున్నామో జాగ్రతగా చూసుకోవాలి.
\v 11 ముందు వేసిన పునాది కాకుండా, వేరే పునాది ఎవరు వేయలేరు. పునాది యేసు క్రీస్తే.
\s5
\p
\v 12 పునాది పైన కట్టే నిర్మాణకుల వంటి వాళ్ళం మనం. ఈ పునాది మీద బంగారం, వెండి, విలువైన రాళ్ళను వాడొచ్చు, లేక పనికిరాని చెక్క, చెత్త పరకలు, గడ్డి లాంటివి కూడా వాడొచ్చు.
\v 13 ఆయన కోసం మనం చేసిన పనులను బట్టి తీర్పు తీరుస్తాడు. మన పనులను పరీక్షించడానికి ఆయన అగ్నిని పంపుతాడు, అది ప్రతి ఒక్కరి పనినీ పరీక్షిస్తుంది.
\s5
\p
\v 14 మనం కట్టిన దాన్ని అగ్ని పరీక్షించిన తర్వాత అది నిలబడుతుందో లేదో అన్న దాన్ని బట్టి మనకు ప్రతిఫలం ఉంటుంది.
\v 15 ఎవరి పని అయితే కాలిపోతుందో, అతనికి ప్రతిఫలం అందదు. కాని అతని పని పూర్తిగా కాలిపోయినా , దేవుడు అతణ్ణి కాపాడగలడు.
\s5
\p
\v 16 మీరు దేవుని నివాస స్థలమనీ, దేవుని ఆలయమనీ, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా?
\v 17 ఆయన ఆలయాన్ని నాశనం చేసేవారిని, దేవుడు నాశనం చేస్తానని వాగ్ధానం ఇచ్చాడు. ఎందుకంటే ఆ ఆలయం దేవునిది మాత్రమే. అదే వాగ్దానంతో ఆయన మిమ్మల్ని కూడా కాపాడతాడు, ఎందుకంటే మీరు దేవుని ఆలయం.
\s5
\p
\v 18 ఎవరూ తమను తాము మోసగించుకోవద్దు. ఎవరైనా తమకి గొప్ప జ్ఞానం ఉందనీ, అవిశ్వాసులు సైతం దాన్ని మెచ్చుకుంటున్నారనీ అనుకుంటుంటే, అతను జాగ్రత్తగా ఉండాలి. అవిశ్వాసులు మెచ్చే విషయాలు మీరు వదిలేయండి. వారు మిమ్మల్ని అజ్ఞానులు అనుకున్నా ఫరవాలేదు. ఎందుకంటే అదే నిజమైన దేవుని జ్ఞానం.
\q
\v 19 ఈ లోక జ్ఞానం దేవుని దృష్టిలో తెలివి తక్కువతనమే. "జ్ఞానులను వారి కుట్రల్లోనే ఆయన పట్టుకుంటాడు”
\q
\v 20 "జ్ఞానుల ఆలోచనలు వ్యర్థం అని ప్రభువుకు తెలుసు” అని లేఖనాల్లో రాసి ఉంది కదా.
\s5
\p
\v 21 కాబట్టి క్రైస్తవ నాయకులు గురించి గొప్పలు చెప్పుకోవడం మానండి. ఎందుకంటే అన్నీ దేవుడు ఇచ్చినవే కదా.
\v 22 పౌలైనా, అపొల్లో అయినా, పేతురు అయినా, లోకమైనా, జీవమైనా, మరణమైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, దేవుడు సృష్టి ఏదైనా అన్నీ మీవే కదా.
\v 23 మీరు క్రీస్తుకు చెందిన వాళ్ళు, క్రీస్తు దేవునికి చెందినవాడు.
\s5
\c 4
\p
\v 1 కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని క్రీస్తు సేవకులమనీ, దేవుని శుభవార్త రహస్యాలను మోసుకొచ్చేవారమనీ పరిగణించాలి.
\v 2 నమ్మకంగా మనం దేవుని పనులు చెయ్యాలి, ఎందుకంటే మనం చెయ్యగలమని దేవుడు నమ్మాడు.
\s5
\p
\v 3 మనుషులు గాని, న్యాయస్థానం గాని నాకు తీర్పు తీర్చడం అనేది నాకు చాలా చిన్న విషయం. నన్ను నేనే తీర్పు తీర్చుకోవడం అంత విలువైనదని భావించను.
\v 4 నేను తప్పు చేశాను అని ఒప్పుకునేవారు ఎవరూ లేరు, అంత మాత్రంచేత నేను ఏమీ తప్పు చెయ్యనట్టు కాదు. నాకు ప్రభువే తీర్పు తీర్చేవాడు.
\s5
\p
\v 5 కాబట్టి ఆ సమయం, అంటే ప్రభువు వచ్చేవరకు మనం దేనిని గురించి తీర్పు తీర్చవద్దు. ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చి సరైన తీర్పు తీర్చగలడు, ఎందుకంటే ఆయనకి మన జీవితం తెరిచిన పుస్తకం. ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికీ వారికి తగిన ప్రతిఫలం దక్కుతుంది.
\s5
\p
\v 6 సోదరీ సోదరులారా, మనం పాటించాల్సిన నియమం ఏమిటంటే, "రాసి ఉన్నవాటిని మించి వెళ్లవద్దు." నేనూ అపోల్లో వాటిని బట్టే జీవిస్తూ, మా జీవితమే ఒక ఆదర్శంగా ఉంచి మీకు బోధిస్తున్నాము. మీరు ఒకరి మీద ఒకరు పెట్రేగి పోకూడదని ఇలా బోధిస్తున్నాము.
\v 7 మీకు, ఇతర విశ్వాసులకు ఏమీ తేడా ఉండదు. మీరు పొందినదంతా ఉచిత బహుమానమే. ఇతరుల కంటే మీరు గొప్పేమీ కాదు. మనమందరం సమానమే.
\s5
\p
\v 8 ఇప్పటికే మీకు అవసరమైనవన్నీ మీరు సంపాదించుకున్నారంటనే, ధనవంతులయ్యారంటనే, మా ప్రమేయం లేకుండానే మీరు రాజులైపోయారంటే మంచిదే మరి! మీరు రాజులు కావడం మంచిదేగా, మేము కూడా మీతో కలిసి పాలించవచ్చు!
\v 9 నిజానికి దేవుడు క్రీస్తు అపొస్తలులమైన మమ్మల్ని యుద్ధం తరువాత బందీల ఊరేగింపులో చివరి వరసలో ఉంచి నడిపిస్తున్నట్టు ఉంది. మేము మరణశిక్ష పొందిన వారిలా ఉన్నామని నాకనిపిస్తున్నది. మేము లోకమంతటికీ, అంటే దేవదూతలకూ మనుషులకూ ఒక చోద్యంలా ఉన్నాము.
\s5
\p
\v 10 మేము క్రీస్తు కోసం జీవిస్తున్నాం కాబట్టి ఇతరులు మమ్మల్ని బుద్దిహీనులుగా, తమను తాము తెలివైన వాళ్ళుగా భావిస్తారు. మేము బలం లేని వాళ్ళం, మీరు బలమైనవారు. మీరు ఘనులు. మేము అందరిచేతా అవమానం పొందిన వాళ్ళం.
\v 11 ఈ సమయం వరకు మేము ఆకలి దాహంతో అలమటిస్తున్నాము. మా పేదరికం వల్ల మాకు సరైన బట్టలు కూడా లేవు. అధికారులు మమ్మల్ని దారుణంగా కొట్టారు. నిలువ నీడ కూడా లేని వాళ్ళం.
\s5
\p
\v 12 మాకు రెక్కాడితే గానీ డొక్కాడదు. మమ్మల్ని ఇతరులు నిందించినా మేము వారిని ఆశీర్వదిస్తున్నాం. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంటున్నాం.
\v 13 మా గురించి వారు అబద్దాలు చెప్పినా మేము వారితో మంచిగా ఉంటున్నాము. అయినా సరే వారు మమ్మల్ని లోకంలోని మురికిగా, కుప్పలో పారేసిన చెత్తలా చూస్తున్నారు.
\s5
\p
\v 14 ఒక తండ్రి తన పిల్లల్ని సరిదిద్దినట్టుగా నేను మిమ్మల్ని సరిదిద్దాలి అనుకుంటున్నాను. అంతేకానీ మిమ్మల్ని సిగ్గుపరచడానికి కాదు.
\v 15 ఎందుకంటే క్రీస్తు గురించి చెప్పడానికి మీకు పదివేలమంది ఉన్నా, ఒకే ఒక ఆత్మీయ తండ్రి ఉంటాడు. నేను చెప్పిన శుభవార్త మీరు నమ్మినప్పుడు నేను క్రీస్తులో మీ తండ్రిని అయ్యాను.
\v 16 అందుకే నా ఉదాహరణను పాటించండి.
\s5
\p
\v 17 అందుకే ప్రభువులో నాకు ప్రియమైన, నమ్మకమైన నా కొడుకు లాంటివాడైన తిమోతిని మీ దగ్గరికి పంపాను. అతడు నేను ఏ విధంగా ప్రతి స్థలంలో, ప్రతి సంఘంలో ఏమి బోధిస్తున్నానో, వాటిని క్రీస్తులో ఏ విధంగా అనుసరిస్తున్నానో, మీకు జ్ఞాపకం చేస్తాడు.
\p
\v 18 నేను మీ దగ్గరికి రాననుకుని కొందరు మిడిసిపడుతున్నారు.
\s5
\p
\v 19 కానీ నేను అక్కడికి తిరిగి రావాలని దేవుడు భావిస్తే, త్వరలో వస్తాను. అక్కడ గర్వంతో మాట్లాడే వారి మాటలు కాకుండా, వారికి దేవుని బలం ఉందో లేదో తెలుసుకుంటాను.
\v 20 దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు, అది దేవుని శక్తి.
\v 21 నేను మీకు ఏమి చెయ్యాలి? నేను మిమ్మల్ని తీవ్రంగా శిక్షించడానికి రావాలా? లేక ప్రేమతో, మృదువైన మనసుతో రావాలా?
\s5
\c 5
\p
\v 1 మీ మధ్య వ్యభిచారం అనే పాపం ఉన్నదనీ మీ సంఘంలో కొందరు చెప్పడం మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యతో సంబంధం పెట్టుకున్నాడంట గదా. ఇలాంటి వ్యభిచారం అవిశ్వాసుల్లో సైతం కనిపించదు.
\v 2 ఇలా ఉండి కూడా మీరు అహంకారంతో ఉన్నారు. నిజానికి మీరు ఆ పాపానికి బాగా విలపించాలి కదా. ఇలాంటి పని చేసిన వాడిని మీ సంఘం నుండి వెలివేయాలి.
\s5
\p
\v 3 నేను మీకు శారీరకంగా దూరంగా ఉన్నప్పటికీ ఆత్మపరంగా మీతోనే ఉన్నాను. నేను మీతో ఉన్నట్టుగానే ఆ పని చేసినవాడి విషయంలో ఇప్పటికే తీర్పు తీర్చాను.
\v 4 మీరు యేసు ప్రభు నామంలో ఆరాధనకు సమకూడినప్పుడు, ఆయన శక్తి ద్వారా నేను నా ఆత్మా మీతో ఉండగా,
\v 5 మీరు అతని శరీరం మాత్రమే నాశనం చేయగలవాడైన సాతానుకు అప్పగించండి, కాగా ప్రభువు వచ్చే రోజున అతని ఆత్మకు విమోచన కలుగుతుంది.
\s5
\p
\v 6 మీరు మిమ్మల్ని మీరు పొగడుకోవడం మంచిది కాదు. ఎలాగైతే పులిపిండి కొంచమే అయినా అది పిండి ముద్దను ఎలా ఉబ్బేలా చేస్తుందో, ఈ చెడు కూడా అలాంటిదే.
\v 7 పాపం కూడా పులిపిండి లాంటిదే. మీరు పాత పులిపిండిని పారెయ్యాలి. లేకపోతే మీ మొత్తం పిండి పాడైపోతుంది. మీరు కూడా పులియని పిండి లాంటివారు. అయితే పస్కా పండుగలో క్రీస్తు మన పస్కా బలిపశువు గనక పిండిముద్దను పులిపిండికి దూరంగా ఉంచుతాం.
\v 8 కాబట్టి మనం పస్కా పండుగ జరుపుకుని శుద్ధీకరణ నియమాలు పాటిద్దాం. చెడు నడవడితో, దుష్టత్వంతో కూడిన పాత పులిపిండిని పారవేసి, దేవునికి లోబడి, అందరితో సత్యం మాట్లాడి పండగను జరుపుకుందాం. మనం అలా చేస్తే పులిపిండి లేని రొట్టెలా ఉంటాము.
\s5
\p
\v 9 వ్యభిచారులతో సహవాసం చేయవద్దని నా ఉత్తరంలో మీకు రాశాను.
\v 10 అయితే ఈ లోకానికి చెందిన అనైతికమైన అవిశ్వాసులు, దురాశపరులు, దోచుకునేవారు, విగ్రహాలను పూజించేవారు, ఇలాటి వారితో ఏ మాత్రం సహవాసం చేయవద్దని కాదు. అలా ఉండాలంటే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వస్తుంది.
\s5
\p
\v 11 నేను చెప్పేది ఏమిటంటే, అక్రమ సంబంధాలు పెట్టుకునే తోటి విశ్వాసులతో మీరు స్నేహం చెయ్యకండి. అంతేకాదు దురాశపరులు, విగ్రహాలను పూజించే వాళ్ళూ, ఇతరులను దూషించే వాళ్ళూ, తాగుబోతులూ, మోసగాళ్ళతో కూడా దూరంగా ఉండండి. అలాంటి వారితో స్నేహమే కాదు, వారితో కనీసం కలిసి భోజనం కూడా చెయ్యకూడదు.
\v 12 సంఘానికి బయట ఉన్నవారికి నేనెందుకు తీర్పు తీర్చాలి, సంఘం లోపలి వారికి తీర్పు తీర్చడమే నా బాధ్యత.
\v 13 సంఘానికి బయట ఉన్నవారికి దేవుడే తీర్పు తీరుస్తాడు.
\q "మీ మధ్య ఉన్న ఆ దుర్మార్గుడిని మీరు తొలగించండి" అని లేఖనాలలో ఆజ్ఞ ఉంది.
\s5
\c 6
\p
\v 1 మీలో ఒకరితో ఒకరికి ఏమైనా గొడవ ఉంటే మీరు ఆ గొడవ విషయం గురించి అవిశ్వాసి అయిన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళకండి. దేవుడు ఏర్పాటు చేసిన తోటి విశ్వాసుల దగ్గరికి వెళ్ళండి.
\v 2 దేవునికి చెందినవారే ఈ లోకానికి తీర్పు తీరుస్తారని మీకు తెలియదా? మీరు ఈ లోకానికి తీర్పు తీర్చే వారిలా ఉన్నారు. మీరు చిన్న చిన్న విషయాలను పరిష్కరించుకోలేరా?
\v 3 మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని మీరు తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఈ లోకసంబంధమైన విషయాలను సవ్యంగా తీర్పు తీర్చగలగాలి.
\s5
\p
\v 4 మీరు జీవితంలో ముఖ్యమైన విషయాలను పరిష్కరించుకోగలినప్పుడు, మీ మధ్య వివాదాలను పరిష్కరించడానికి అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళకూడదు.
\v 5 మీరు సిగ్గుపడాలని ఇలా చెబుతున్నాను. క్రైస్తవ సోదరీ సోదరుల మధ్య విభేదాలను పరిష్కరించగలిగే బుద్ధిమంతుడు ఈ సంఘంలో ఎవరో ఒకరు ఉండిఉంటారు గదా?
\v 6 అయితే మీలో కొంత మంది విశ్వాసులు ఒకరిని ఒకరు నిందించుకుంటూ అవిశ్వాసి అయిన న్యాయాధికారి దగ్గరికి వెళ్తున్నారు.
\s5
\p
\v 7 మీకు ఎవరితోనైన గొడవ ఉంది అంటే, మీరు చెయ్యవలసింది మీరు చెయ్యలేదు అని అర్థం. ఆ సోదరి లేక సోదరుడిని మీ మీద విజయం సాధించనివ్వండి.
\v 8 అలా కాకుండా మీరు ఇతరులను మోసంచేసి తప్పు చేశారు. మీ సొంత సొదరీ సోదరులను మోసం చేశారు.
\s5
\p
\v 9 అవినీతిపరులు దేవుని రాజ్యానికి చెందిన వారు కాదని మీరు అర్థం చేసుకోండి. వారిని నమ్మకండి. లైంగిక పాపాలు చేసేవారు, దేవుడిని కాకుండా విగ్రహాలను పూజించేవారు, పెళ్లిని లక్ష్యపెట్టనివారు, వ్యభిచారులు, పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకునేవారు,
\v 10 దొంగతనం చేసేవారు, ఆశబోతులు, అబద్దాలాడేవారు, ఇతరులను మోసం చేసేవారు. వాళ్ళు ఎవరూ దేవుని రాజ్యానికి చెందరు.
\v 11 మీలో కొందరు అవి చేసేవారే, కాని దేవుడు మిమ్మల్ని ఆ పాపాల నుండి శుభ్రపరచి, మిమ్మల్ని తనకోసం ప్రత్యేకించుకున్నాడు. ఆయన ఇదంతా క్రీస్తు యేసు ప్రభు నామంలో, పరిశుద్ధాత్మ ద్వారా చేశాడు.
\s5
\p
\v 12 "నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి, ఏమైనా చేసే స్వేచ్ఛ నాకు ఉంది" అని కొందరు అంటారు. నిజమే. కానీ కొన్నిటికి మనకు అనుమతి ఉన్నంత మాత్రాన అవన్నీ మనకు మేలుకరం కాదు. ఏది చేయడానికైనా నాకు స్వేచ్ఛ ఉంది కానీ దేనికీ నేను బానిసైపోను.
\v 13 అన్నాన్ని జీర్ణించు కోడానికి కడుపూ, కడుపు జీర్ణించుకోవడం కోసం అన్నమూ ఉన్నాయి అంటారు కదా. కానీ దేవుడు త్వరలోనే అన్నాన్నీ సామాన్య దేహ ధర్మాలనూ కూడా లేకుండా చేస్తాడు. అన్నం, కడుపు అనడంలో లైంగిక సంబంధాల గురించే ఆ మాటలు అంటున్నారు. అయితే ప్రభువు మన శరీరాలను చేసింది లైంగిక అవినీతి కోసం కాదు. శరీరం ప్రభువును సేవించడం కోసమే. ప్రభువు శరీరానికి పోషణ దయచేస్తాడు.
\s5
\p
\v 14 ఎలాగైతే దేవుడు యేసు క్రీస్తును మరణం నుండి లేపాడో, అలాగే మనల్ని కూడా ఆయన శక్తితో లేపుతాడు.
\p
\v 15 మీ శరీరాలు క్రీస్తుకు చెంది ఉన్నాయని మీకు తెలియాలి. అలాంటి శరీర భాగాలను తీసుకుపోయి వేశ్యతో కలుపుతారా? అలా ఎన్నటికీ జరగకూడదు.
\s5
\p
\v 16 వేశ్యతో కలిసేవాడు ఆమెతో ఏకం అవుతాడని మీరు అర్థం చేసుకోండి. "వారిద్దరూ ఒకే శరీరం అవుతారు” అని వివాహం గురించి లేఖనాలలో రాసి ఉంది కదా.
\v 17 అదే విధంగా, ప్రభువుతో కలిసినవాడు ఆయనతో ఒకే ఆత్మ అవుతాడు.
\s5
\p
\v 18 మీరు లైంగిక పాపం చెయ్యాల్సి వస్తే, దాని నుండి వీలైనంత త్వరగా పారిపోండి. మనిషి చేసే ప్రతి పాపం తన శరీరానికి బయట చేసేవే. ఆ పాపాలు చేస్తున్నవాడు తన సొంత శరీరానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.
\s5
\p
\v 19 మీలో నివసించే పరిశుద్ధాత్మకు మీ శరీరం ఆలయమని మీరు గ్రహించాలి. ఆయనను దేవుడే అనుగ్రహించాడు. మీరు మీ సొంతం కాదు.
\v 20 దేవుడు ఆయన కుమారుని ప్రాణాన్ని వెలగా చెల్లించి మిమ్మల్ని కొన్నాడు. కాబట్టి మీ శరీరంతో చేసే ప్రతిదానిలోనూ ఆయనను ఘనపరచండి.
\s5
\c 7
\p
\v 1 పెళ్ళి అయిన విశ్వాసులు ఎలా జీవించాలి అనే దాని విషయం మీరు నాకు కొన్ని ప్రశ్నలు రాసారు. వారికి నా జవాబు ఇది. భార్యతో కాపురానికి దూరంగా ఉండవలసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి.
\v 2 అయితే పురుషులు తరచూ లైంగిక పాపంలో పడే శోధనకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి ప్రతి భర్తకు తన సొంత భార్య ఉండాలి. అలాగే ప్రతి భార్యకు సొంత భర్త ఉండాలి.
\s5
\p
\v 3 పెళ్లి అయిన ప్రతి విశ్వాసీ తన భర్త లేక భార్యతో సంసార ధర్మం జరిగించే హక్కు కలిగి ఉంటారు.
\v 4 భర్తకు తన సొంత శరీరం మీద ఉన్న అధికారాన్ని అతడు తన భార్యకు ఇస్తాడు. అలాగే భార్య కూడా తన దేహం పై అదుపు భర్తకు ఇస్తుంది.
\s5
\p
\v 5 ప్రార్థన చేయడానికి వీలు కోసం తాత్కాలికంగా విడిగా ఉండడం కోసం మాత్రమే పరస్పర అంగీకారంతో భార్యాభర్తలు లైంగిక కలయికకు దూరంగా ఉండవచ్చు. అది అయి పోయిన తరువాత మళ్ళీ కలుసుకోవచ్చు. మిమ్మల్ని మీరు నిగ్రహించుకోలేరు కనుక సాతాను మిమ్మల్ని శోధనలో పడవేయకుండా చూసుకోండి.
\p
\v 6 పెళ్లి చేసుకునే విషయంలో నేనేమీ మీకు ఆజ్ఞ ఇవ్వడం లేదు. కాని పెళ్లి చేసుకున్న, చేసుకోవాలనుకుంటున్నన వారిగురించి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
\v 7 ఇందుకు నేనే మీకు ఉదాహరణ: నేను ఒంటి వాణ్ణి. కొన్నిసార్లు మీరందరూ దేవుని సేవ కోసం ఒంటిగాళ్ళుగా ఉంటే ఎంత బావుండును అనుకుంటాను. కాని దేవుడు తన పిల్లలకి రకరకాల సామర్థ్యాలు ఇస్తాడు. కొందరిని వివాహితులుగా ఉండేలా మరి కొందరిని ఒంటరివాళ్ళుగా ఉండే వీలు ఇస్తాడు.
\s5
\p
\v 8 మీలో పెళ్లి కాని వారు, వితంతువులు నాలాగా ఒంటరిగా ఉంటేనే మంచిదని నేను అంటాను.
\v 9 అయితే ఒంటరిగా ఉండటం మీకు కష్టంగా ఉంటే పెళ్లి చేసుకోండి. ఎందుకంటే కామవాంఛలతో ఉండటంకన్నా పెళ్లి చేసుకుంటేనే మంచిది.
\s5
\p
\v 10 పెళ్ళైన వారికి దేవుడు తన ఆజ్ఞలు ఇచ్చాడు. "భార్య తన భర్త నుండి వేరు కాకూడదు."
\v 11 ఒక వేళ వేరైతే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యకి విడాకులు ఇవ్వకూడదు.
\s5
\p
\v 12 నేను ఇప్పుడు చెప్పేది నా మాటే గానీ దేవుని ఆజ్ఞ కాదు, ఒకవేళ నీ భార్య అవిశ్వాసి అయితే నీతో ఉండాలని కోరితే ఆమెను విడిచిపెట్టకండి.
\v 13 అలాగే నువ్వు స్త్రీవైతే విశ్వాసి కాని నీ భర్తను విడిచిపెట్టకూడదు.
\v 14 అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్య వల్ల పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. ఇదే విషయం మీ పిల్లలకి కూడా వర్తిస్తుంది. కానీ ఇప్పుడు వారు పవిత్రులే.
\s5
\p
\v 15 ఒకవేళ అవిశ్వాసి అయిన నీ భార్య లేదా భర్త మిమ్మల్ని విడిచిపెట్టాలి అనుకుంటే వారిని వెళ్ళనివ్వండి, అప్పుడు తన పెళ్లినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు
\v 16 అవిశ్వాసి అయిన జీవిత భాగస్వామివల్ల నువ్వు దేవుని పని చెయ్యగలవో లేదో నీకు తెలియదు. మీ ద్వారా మీ జీవిత భాగస్వామిని దేవుడు కాపాడతాడు అని మీకు తెలియదు.
\s5
\p
\v 17 మనం దేవుని పిలుపుకు లోబడి ఉండాలి, దేవుడు మనకి అప్పగించిన జీవితం జీవించాలి. ప్రతి సంఘం దీన్ని పాటించాలి.
\v 18 ఒకవేళ ఎవరైనా దేవునిచే రక్షణ పొందక ముందు సున్నతి పొంది ఉంటే, అతను ఆ సున్నతి గుర్తులు పోగొట్టుకోనక్కర లేదు. ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వస్తే, అతడు సున్నతి పొందనక్కర లేదు.
\v 19 సున్నతి పొందాడో లేదో ముఖ్యం కాదు. దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నామా లేదా అనేదే ముఖ్యం.
\s5
\p
\v 20 ఎవరు ఏ స్థితిలో ఉండగా పిలుపు పొందారో ఆ స్థితిలోనే ఉండండి.
\v 21 నిన్ను దేవుడు రక్షించే నాటికి నువ్వు బానిసవైతే, బాధపడకు. అయితే నీకు స్వేచ్ఛ పొందడానికి అవకాశం ఉంటే స్వేచ్ఛ పొందడమే మంచిది.
\v 22 ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదే విధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందినవాడు క్రీస్తుకు బానిస.
\v 23 దేవుడు నిన్ను ఆయన కుమారుడినే వెలగా చెల్లించి కొన్నాడు, నీ స్వతంత్రం విలువైనది. కాబట్టి మనుషులకు బానిస కావొద్దు.
\v 24 క్రీస్తునందు సోదరీ సోదరులారా, దేవుని పిలుపుకు ముందు మనం ఏ స్ధితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉందాం.
\s5
\p
\v 25 పెళ్లి కానివారి విషయంలో ప్రభువు నుండి నాకు ఎలాటి ఆజ్ఞ లేదు కనుక, ప్రభువు కృప చేత నమ్మదగినవాడిగా ఉన్న నేను నా అభిప్రాయం చెప్తాను.
\v 26 మనకి రాబోతున్న కష్ట సమయాలను బట్టి, దేవుడు పిలిచే సమయానికి మనం ఉన్న స్థితిలోనే ఉంటే మంచిదని నా అభిప్రాయం.
\s5
\p
\v 27 పెళ్ళైన వారు తమ భార్యలను విడిచిపెట్టకండి, పెళ్లి కానివారు భార్య కావాలని కోరవద్దు.
\v 28 ఆడవారు గాని, మగవారు గాని, ఒకవేళ నీవు పెళ్ళి చేసుకున్నా పాపమేమీ చేసినట్టు కాదు. అయితే పెళ్లి చేసుకుంటే లోకాంతర కష్టాలు కలుగుతాయి. అవి మీకు కలగకుండా ఉండాలని నా కోరిక.
\s5
\p
\v 29 సోదరీ సోదరులారా, నేను చెప్పేది ఏమిటంటే, ప్రస్తుత కాలంలో సమయం కొద్దిగానే ఉంది, కష్టం తరుముకొస్తూ ఉంది. కాబట్టి ఇక ముందు భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా ఉండాలి.
\v 30 శోకంలో ఉన్నవారు ఏడవకూడదు. అద్భుత కార్యాల వల్ల సంతోషించే వారు సంతోషించనట్టు ఉండాలి. ఏదైనా కొనేవారు తాము కొన్నది తమది కానట్టు, వారి దగ్గర ఏమి లేనట్టు ఉండాలి.
\v 31 ఈ లోక వ్యవహారాలు సాగించేవారు లోకంతో తమకేమీ సంబంధం లేనట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోక వ్యవస్థ కృంగిపోతూ ఉంది.
\s5
\p
\v 32 మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్లి కాని వ్యక్తి దేవునికి ముఖ్యమైన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు. అతను దేవుణ్ణి సేవిస్తూ, ఆయనికి కావాల్సిన పనులు చేస్తుంటాడు.
\v 33 కాని పెళ్ళైన వాడు, ఈ లోక విషయాలు గురించి శ్రద్ధ కలిగి ఉండటమే కాకుండా తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అనే దృష్టి కూడా ఉంటుంది.
\v 34 అందుచేత పెళ్ళైన మగాళ్ళు వారు చెయ్యాల్సిన పనుల్లో కొన్ని చేస్తారు. అదే విధంగా వితంతువులకి, పెళ్లి కాని స్త్రీకి తేడా ఉంది. విశ్వాసి అయిన పెళ్లి కాని స్త్రీ తన శరీరంతో ఆత్మతో పూర్తిగా దేవుని కార్యాల కోసం గడపడానికి శ్రద్ధ కలిగి ఉంటుంది. కాని పెళ్ళైన స్త్రీకి తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది.
\s5
\p
\v 35 మీకు సులువుగా ఉండాలని ఇది చెప్తున్నా. మీకు ఆటంకంగా ఉండాలని కాదు. పెళ్ళైన వారు సంసార ఝంఝాటంలో పడిపోయి చింతల పాలు కాకుండా సులభంగా దేవుని సేవ చెయ్యాలని ఈ విషయాలు చెప్తున్నాను.
\s5
\p
\v 36 ఒకవ్యక్తి తాను పెళ్లి చేసుకోవాల్సిన స్త్రీకి పెళ్లీడు మించి పోవటం వల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావిస్తే, అతడు తన ఇష్ట ప్రకారం చేయవచ్చు. అది పాపం కానే కాదు.
\v 37 అయితే ఎవరైనా పెళ్లి చేసుకోకూడదని బలంగా నిశ్చయించుకొని, తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడయితే, అతడు చేసేదీ మంచి పనే.
\v 38 కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని అసలు పెళ్ళే చేసుకోను అని నిర్ణయించుకున్న వాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.
\s5
\p
\v 39 భార్య తన భర్త బ్రతికి ఉన్నంత వరకూ అతనితోనే ఉండాలి. భర్త మరణిస్తే ఆమెకు ఇష్టం వచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు, కాని ఆ వ్యక్తి విశ్వాసి అయ్యుండాలి.
\v 40 అయితే ఒక వితంతువు మళ్ళీ పెళ్లి చేసుకోకపోతేనే ఆమెకు మంచిది అని నా నమ్మకం. ఈ విషయంలో దేవుని ఆత్మ నాలో ఉందని నా నమ్మకం.
\s5
\c 8
\p
\v 1 విగ్రహాలకు బలి అర్పించే ఆహారాన్ని తినడం అనే ప్రశ్నకు: మనమంతా తెలివైన వారమని మనకి తెలుసు. నీకు అన్నీ తెలుసు అనుకుంటే నీలో గర్వం పెరుగుతుంది. కాని నువ్వు ఇతరులను ప్రేమిస్తే, నువ్వు వాళ్ళని విశ్వాసంలో బలంగా చెయ్యగలవు.
\v 2 నిజం ఏమిటంటే ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అనుకుంటే, అతను నేర్చుకోవలసిన విధేయత అతడింకా నేర్చుకోలేదు అని అర్థం.
\v 3 నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవునికి నువ్వు తెలుస్తావు.
\s5
\p
\v 4 ఇప్పుడు విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే, కొందరు చెప్పినట్టు "ఈ లోకంలో విగ్రహంలో దేవుడు లేడు." అదే విధంగా మోషే చెప్పినట్లు, "ఒకే ఒక్క దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు."
\v 5 దేవుళ్ళు, ప్రభువులు అని అందరూ పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో, భూమి మీదా దేవుళ్ళనే వారు ఎంతోమంది ఉన్నారని కొందరు అంటున్నారు.
\v 6 అయితే మనం ఇలా చెప్పగలం,
\q మనకైతే ఒకే దేవుడున్నాడు.
\q ఆయన తండ్రి అయిన దేవుడు.
\q ఆయన నుండి సమస్తమూ కలిగింది.
\q ఆయన కోసమే మనమున్నాం.
\q అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
\s5
\p
\v 7 అయితే ఈ విషయం అందరికి తెలియదు. కొందరు ఇంతకుముందు విగ్రహాలను ఆరాధించేవాళ్ళు కాబట్టి, వాటికి అర్పించిన ఆహార పదార్ధాలను తింటే వాటిని పూజించినట్టే అని అనుకుంటారు. వాళ్ళ అభిప్రాయం క్రీస్తు మీద బలహీనంగా ఉండటం వల్ల ఆ ఆహారం తింటే వాళ్ళు విగ్రహాలను పూజిస్తున్నాం అని అనుకుంటారు.
\s5
\p
\v 8 మనం తినే ఆహారం మనల్ని దేవుని దృష్టిలో మంచిగా లేదా చెడుగా చెయ్యవని మనకు తెలుసు.
\v 9 అయితే మనకి క్రీస్తులో సోదరీ సోదరులు ముఖ్యం. మనం ఏదైనా తినొచ్చు కాని ఆ విషయం వల్ల మన విశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి.
\v 10 విగ్రహాలకు ప్రాణం లేదు, అవి దేవుళ్ళు కావు అని మనకి తెలుసు. కాని మంచికీ చెడుకూ తేడా తెలియని వాళ్ళు విగ్రహాలు పెట్టిన స్థలంలో ఉంచిన ఆహరం తింటే మీరు విగ్రహారాధనని ప్రోత్సహిస్తున్నారని వాళ్ళు అనుకుంటారు.
\s5
\p
\v 11 ఆ విధంగా విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని మీరు తినడం విశ్వాసంలో బలహీనులుగా ఉన్నవారు చూస్తే, నీకున్న బలం వాళ్ళకి లేదు కాబట్టి ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో ఆ బలహీనుడైన విశ్వాసి నీ తెలివి వలన పాడైపోతాడు.
\v 12 ఈ విధంగా మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా, విశ్వాసంలో బలహీనమైన వారిని బాధపెట్టడం ద్వారా, మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.
\v 13 కాబట్టి నా భోజనం నా సోదరీసోదరులు విశ్వాసంలో కాలు జారడానికి కారణమైతే, వాళ్ళకి అభ్యంతరం కలిగించకుండా ఉండేలా నేను ఎన్నటికీ మాంసాహారం తినను.
\s5
\c 9
\p
\v 1 నేను చేస్తున్న పనిని విమర్శించే వాళ్లకు ఇదే నా సమాధానం: నేను ప్రభువైన యేసుని చూసిన అపొస్తలుడిని. నాకు స్వేచ్ఛ ఉంది. నేను చేసిన పనికి ఫలితం మీరే. నా పనితనానికి మీరే నిదర్శనం.
\v 2 నేను నిజమైన అపొస్తలుణ్ణి కానని కొందరు అనుకున్నా నేనే మీకు అసలైన అపొస్తలుణ్ణి. ప్రభువు నన్ను నియమించుకున్న దానికి రుజువుగా మీరే ఇందుకు సాక్షులు.
\s5
\p
\v 3 నా పరిచర్య నిమిత్తం విశ్వాసులైన మీరు ఇచ్చే డబ్బు వాడుకోకపోవడంచేత నేను నిజమైన అపొస్తలుణ్ణి కానని అంటున్న వారికి నేనిచ్చే జవాబు ఇదే.
\v 4 ఆ డబ్బు వాడుకునే హక్కు మాకు తప్పకుండా ఉంటుంది.
\v 5 ప్రభువు సోదరుడు, కేఫా, మిగిలిన అపొస్తలుల వలే విశ్వాసులైన తమ భార్యలను వెంటబెట్టుకుని ప్రయాణాలు చేసే హక్కు మాకూ ఉంది.
\v 6 నేనూ, బర్నబా మాత్రమే మాకోసం మేమే సంపాదించుకోవాలని చెప్పే అధికారం ఎవరికీ లేదు.
\s5
\p
\v 7 తన సొంత ఖర్చులు భరించుకుంటూ ఎవ్వరూ సైన్యంలో పనిచెయ్యరు. ద్రాక్ష తోట నాటి దాని పండ్లు తినకుండా, ద్రాక్షరసం తాగకుండా ఎవరు ఉంటారు? పశువుల మందను పోషిస్తూ వాటి పాలు తాగకుండా ఎవరు ఉంటారు?
\p
\v 8 ఇది కనీస జ్ఞానం. చట్టం కూడా ఇదే చెబుతుంది.
\s5
\p
\v 9 మోషే చట్టం ఇలా చెబుతుంది, "ధాన్యం నూర్చే ఎద్దు ఏమీ తినకుండా దాని మూతి కట్టివేయవద్దు." ఈ విషయంలో దేవునికి ఇంకా ఎక్కువ పట్టింపు ఉంది.
\v 10 ఈ చట్టం మన కోసమే. మోషే చెబుతున్నది ఏమిటంటే, పంట నూర్చే ఎద్దుకు పంట ఫలాన్ని తినే హక్కు ఉన్నట్టే, ఏదైనా పని చేస్తున్న వ్యక్తికి దాని నుండి ప్రతిఫలం పొందే హక్కు ఉంటుంది.
\v 11 మేము సువార్త అనే విత్తనాలు మీకోసం చల్లినప్పుడు, మీ నుండి మా పని కోసం డబ్బు స్వీకరించడంలో తప్పు ఏమీ లేదు.
\s5
\p
\v 12 వేరే వ్యక్తులు మీ నుండి ఇలాటి సహాయం పొందుతున్నప్పుడు, మాకింకా ఎక్కువ అధికారం ఉంటుంది కదా.
\p అయినప్పటికీ మాకు ఆ అధికారం ఉన్నప్పటికీ మేము మీనుండి ఏమీ ఆశించడం లేదు. బదులుగా క్రీస్తు సువార్తకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అన్నిటినీ భరిస్తున్నాం.
\v 13 దేవాలయంలో పనిచేసేవాళ్ళు దేవుడికి అర్పించిన వాటిలో నుండి కొంత తమ సొంత అవసరాలకు వాడుకుంటారని మీకు తెలుసు. దేవుని సొమ్ము వాళ్ళు వాడుకుంటారు.
\v 14 అదే విధంగా సువార్త ప్రకటించేవాళ్ళు సువార్త ద్వారానే తమ జీవనం గడపాలని ప్రభువు నియమించాడు. దేవునికి ఇవ్వబడిన దాని నుండి కొంత భాగం వాళ్ళు పొందుతారు.
\s5
\p
\v 15 అయితే నా కోసం నేనేమీ హక్కుగా భావించి అడగడం లేదు. ఆ కారణం చేత ఇప్పుడు నేను ఈ విషయం రాయడం లేదు. మీ నుంచి ఎన్నడూ నేనేమి అడుగలేదని నేను గర్వంగా చెప్పొచ్చు. మీరు నాకు చెల్లించాల్సిన దాని గురించి నేను ఎన్నడూ అడుగలేదు, దానికంటే మరణమే మేలు.
\v 16 నేను సువార్త ప్రకటించే విషయంలో గర్వించడానికి ఎలాంటి కారణం లేదు. సువార్త ప్రకటన నా బాధ్యతగా భావిస్తున్నాను. దేవుని పిలుపుకు లోబడి నేనా పని చేయకపోతే నాకు కన్నీళ్ళే మిగులుతాయి.
\s5
\p
\v 17 నా ఇష్టపూర్తిగా నేను సువార్త ప్రకటిస్తున్నాను. నాకు గొప్ప బహుమతి దొరుకుతుంది. ప్రభువు నాకు ఆ పని అప్పగించాడు కనుక నన్ను ఎవ్వరూ ఒత్తిడి చేయకపోయినా నేను ప్రభుకు కోసం ఆ పని చేస్తాను.
\v 18 అలాంటప్పుడు దేవుని నుండి నాకు వచ్చే బహుమానం ఏమిటి? నా సువార్త ప్రకటనలో నాకు వచ్చే ప్రతిఫలం వాడుకోకుండా నేను సువార్త ఉచితంగా ప్రకటించడమే నాకు బహుమానం.
\s5
\p
\v 19 నేను ఎవ్వరికీ లోబడనవసరం లేదు. అయితే నేను అందరికీ సేవకుణ్ణి. క్రీస్తు కోసం అనేకులను సంపాదించడానికి నన్ను నేను సేవకుడుగా మలుచుకున్నాను.
\v 20 యూదుల మధ్యలో పరిచర్య చేస్తున్నప్పుడు యూదుడుగా ఉన్నాను. ధర్మశాస్త్రం పాటించే వాళ్ళను క్రీస్తు కోసం సంపాదించడానికి నేను ధర్మశాస్త్రం పాటించకపోయినా, దానికి లోబడినట్టు ఉన్నాను.
\s5
\p
\v 21 ధర్మశాస్త్రం పాటించని యూదులు కానివారి విషయంలో నేను వాళ్ళలాగే ఉన్నాను. నేను దేవుని విషయంలో ధర్మశాస్త్రం లేనివాణ్ణి కాను. క్రీస్తుకు చెందినా ధర్మశాస్త్రం నాకు ఉంది. అయితే ధర్మశాస్త్రం లేనివాళ్ళ కోసం ధర్మశాస్త్రం లేనట్టుగానే ఉన్నాను.
\v 22 చట్టాలు, ధర్మాల విషయంలో బలహీనులుగా ఉన్నవాళ్ళ కోసం బలహీనుడనయ్యాను. వాళ్ళు క్రీస్తుపై నమ్మకముంచాలని అలా చేశాను. కొందరైనా రక్షణ పొందాలని అన్ని రకాల ప్రజల పద్ధతులతో కలిసిపోయి దేవుడు నియమించిన పని జరిగించాను.
\v 23 క్రీస్తు సువార్త ప్రకటన కోసం ఇదంతా చేస్తాను. ఫలితంగా, సువార్త ప్రకటన తెచ్చే ఉత్తమ ఫలాలలో నేనూ భాగస్వామి అవుతాను.
\s5
\p
\v 24 పరుగు పందెంలో పాల్గొనే వారంతా పరిగెత్తుతారు గాని బహుమానం మాత్రం ఒక్కడికే వస్తుందని మీకు తెలుసు కదా! కాబట్టి అదే విధంగా మీరూ బహుమానం కోసం పరుగెత్తండి.
\v 25 అంతే కాక పందెంలో పరిగెత్తే ప్రతి ఒక్కడూ అన్ని విషయాల్లో ఆత్మనిగ్రహం కలిగి ఉంటాడు. వారు త్వరగా ఎండిపోయి వాడిపోయే ఆకుల కిరీటం కోసం పరిగెత్తితే, మనం అక్షయమైన కిరీటం కోసం ఆత్మ నిగ్రహంతో పరిగెత్తుతాము.
\v 26 కాబట్టి నేను గమ్యం లేని వాడిలా పరుగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు.
\v 27 ఇతరులకు ప్రకటించిన తరువాత ఒకవేళ నేనే అర్హత కోల్పోతానేమోనని నా శరీరాన్ని నలగగొట్టి, దాన్ని నాకు లోబరచుకొంటున్నాను.
\s5
\c 10
\p
\v 1 సోదరీ సోదరులారా, మీకు గుర్తుందా, దేవుణ్ణి అనుసరించిన మన యూదు పితరులను ఆయన పగటివేళ మేఘం తోడుగా ఐగుప్తు నుండి బయటికి నడిపించాడు. వారు ఎర్ర సముద్రం మధ్య ఆరిన నేలపై నడిచారు.
\v 2 మనమందరం క్రీస్తులో బాప్తీసం పొందినట్టు వాళ్ళు మోషే నాయకత్వంలో సముద్రంలో మేఘాల కింద బాప్తిసం పొందారు.
\v 3 పరలోకం నుండి దేవుడు వాళ్లకు ఆధ్యాత్మిక మన్నా అనుగ్రహించగా వాళ్ళు భుజించారు.
\v 4 మోషే బండను కొట్టగా ప్రవహించిన ఆత్మ సంబంధమైన నీరు తాగారు. ఆ బండ క్రీస్తే.
\s5
\p
\v 5 అయితే వారిలో అనేకులు దేవునికి అవిధేయులై వేరే దేవుళ్ళను పూజించి ఆయన ఉగ్రతకు లోనయ్యారు. అందువల్ల వాళ్ళు చనిపోగా వాళ్ళ శవాలు అరణ్యంలోనే చెల్లాచెదరుగా రాలిపోయాయి.
\p
\v 6 వాళ్ళు చేసినట్టుగా మనం చెడ్డ పనులు చేయకుండా ఉండడానికి ఇప్పుడు మనకొక ఉదాహరణగా ఆ సంగతులు మన ముందు నిలిచాయి.
\s5
\p
\v 7 మన పూర్వీకులలో కొందరు విగ్రహాలను పూజించారు. లేఖనాలలో రాసి ఉన్న ప్రకారం, "ప్రజలు తాగడం కోసం, తినడం కోసం, నాట్యం చేయడం కోసం, కామ కార్యకలాపాలు కొనసాగించడం కోసం లేచారు" అని రాసి ఉంది.
\v 8 మన యూదు పూర్వికులు తమ కామ కార్యకలాపాలను బట్టి ఒకే రోజు 23,000 మంది చనిపోయారు.
\s5
\p
\v 9 క్రీస్తుకు అవిధేయులై ఆయన అధికారాన్ని పరీక్షించకుండా ఉందాం. అలా చేసి మన పూర్వికులు ఒక్క రోజులోనే విష సర్పాల కాటుకు బలైపోయారు.
\v 10 దేవుడు అనుగ్రహించే వాటి విషయం సణుగుకోవద్దు. అలా చేసి మన పూర్వికులలో కొందరు దూత చేతిలో హతమయ్యారు.
\s5
\p
\v 11 ఈ సంగతులన్నీ వారికి జరిగినది మనకు ఉదాహరణలుగా ఉండడానికే. వాటిని గ్రహించి ఈ చివరి రోజుల్లో మనం బుద్ధి తెచ్చుకోడానికి అవి రాసి ఉన్నాయి.
\v 12 కాబట్టి నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, నువ్వు గనక స్థిరంగా నిలబడి ఉన్నానని భావిస్తే, పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త వహించు.
\v 13 మీరు ఎదుర్కొంటున్న శోధనలు అందరికీ కలిగేవే. మీరు సహించలేనంత బలమైన శోధనలు మీకు కలగనివ్వనని ఆయన వాగ్దానం చేశాడు. అలాంటి శోధన ఎదురైనా దాని నుండి తప్పించుకోనే మార్గం కూడా ఆయన చూపిస్తాడు.
\s5
\p
\v 14 కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు ఎంత దూరంగా పారిపోతే అంత మంచిది.
\p
\v 15 ఎలా జీవిస్తున్నామో అని జాగ్రత్తగా తమను తాము పరీక్షించుకొనే మనుషులతో నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నేనేమి చెప్తున్నానో దాని గురించి ఆలోచించండి.
\v 16 మనం స్తుతులు చెల్లించే ఆ పాత్రలో ఉన్న ద్రాక్షరసాన్ని తాగినప్పుడు క్రీస్తు రక్తంలో మనం ఒక భాగం అవుతున్నాం. మనం రొట్టెను విరుస్తున్నప్పుడు, క్రీస్తు శరీరంలో మనం ఒక భాగం అవుతున్నాం.
\v 17 అక్కడ ఒకే ఒక్క రొట్టె మాత్రమే ఉంది మనం చాలా మందిమిగా ఉన్నప్పటికీ మనమంతా కలిసి ఒకే శరీరం లాగా ఒకే ఒక్క రొట్టెను తీసుకొని కలిసి తింటున్నాం.
\s5
\p
\v 18 ఇశ్రాయేలు ప్రజానీకం గురించి ఆలోచించండి. బలిపీఠం దగ్గర అర్పించిన అర్పణలు తినేవారు బలిపీఠం లో భాగం అవుతున్నారు.
\v 19 కాబట్టి విగ్రహాలు నిజమైనవి కావనీ, వాటికి అర్పించిన అర్పణలకి ప్రత్యేకత ఏమీ లేదనీ నేను చెప్తున్నాను. అయినప్పటికీ ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన సమస్యలు ఉన్నాయి.
\s5
\v 20 నా అభిప్రాయం ఏమిటంటే ఒక యూదేతరుడు అర్పణలు అర్పించేటప్పుడు అతడు దయ్యాలకే వాటిని అర్పిస్తాడు గానీ, దేవునికి ఎంతమాత్రం కాదు. కాబట్టి మీరు దయ్యాలతో దేనినీ పంచుకోవాలని నేను కోరుకోవడం లేదు.
\v 21 మీరు ప్రభువు పాత్రలో ఉన్నది తాగి తరవాత మళ్ళీ దయ్యాల పాత్రలో ఉన్నది తాగకూడదు. ప్రభురాత్రి భోజనాన్ని తీసుకున్న తరవాత మళ్ళీ దయ్యాలతో భోజనం చేయకూడదు.
\v 22 అలా చేయడం వల్ల మీ రాజభక్తిలో ఉన్న ద్వంద్వ వైఖరి ప్రభువుకు రోషం తెప్పిస్తుంది. మీరు ఆయన కంటే బలమైన వాళ్ళేమీ కాదు.
\s5
\p
\v 23 కొంతమంది అంటారు, "అన్నీ న్యాయ సమ్మతమైన నియమాలే” అని. కానీ అన్నీ మన క్షేమం కోసం, ఇతరుల క్షేమం కోసం చేయగలిగేవిగా ఉండవు. అవును, "అన్నీ న్యాయ సమ్మతమైన నియమాలే” కానీ అన్నీ మనుషులు తమ జీవితాల్లో దేవునిలో బలంగా ఎదగడానికి సహాయపడవు.
\v 24 మీ క్షేమం కోసం మాత్రమే పని చేయకండి. ఇతరుల క్షేమం గురించి కూడా పని చేయండి. ఈ రకంగా మనందరం ప్రతి ఒక్కరికీ సాయపడుతూ ఉండాలి.
\s5
\v 25 బజారులో దొరికే ఏ మాంసమైనా విగ్రహాలకు దానిని అర్పించారా లేదా అని ఆరా తీయకుండానే మీరు కొనవచ్చు, తినవచ్చు. ఇదే మన నియమం.
\v 26 కీర్తనకారుడు చెప్తున్నట్టుగా, "భూమీ, అందులో ఉన్న సమస్తమూ ప్రభువువే."
\v 27 ఒక యూదేతర అవిశ్వాసి మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, వెళ్లాలని మీకూ కోరికగా ఉంటే వెళ్ళండి. అతడు మీకు ఏది వడ్డిస్తే అది తినండి. అతణ్ణి ఈ పదార్థాలను ఎక్కడ కొన్నారని ఆరా తీయమని దేవుడు అడగడు.
\s5
\v 28 అయితే ఎవరైనా నీతో, "గుడి దగ్గర విగ్రహాలకు అర్పించిన ఆహార పదార్థాల్ని కొని తెచ్చాము” అని చెబితే మీకు వడ్డించిన ఆ వ్యక్తి క్షేమం కోసం, ఆ వ్యక్తి తప్పొప్పుల మధ్య సందిగ్థంలో పడకుండా ఉండేలాగా అలాటివాటిని మీరు తినవద్దు.
\v 29 మీకు దాని విషయంలో మీ స్వంత ఆలోచన ఏమిటి అనేదానికంటే ఆ తప్పొప్పుల విషయంలో ఎదుటి వ్యక్తి ఆలోచన ఏమిటి అని ఆలోచించాలి. ఇతరులు నమ్మేది తప్పా, ఒప్పా అనేదాని మీద నా వ్యక్తిగత ఎంపికలు మారవు.
\v 30 ఆ భోజనాన్ని నేను కృతజ్ఞతలు చెప్పి ఆనందిస్తూ తిన్నట్టైతే ఇతరులు ఎవరూ నన్ను తప్పు పట్టడానికి నేను ఆస్కారం ఇవ్వను.
\s5
\p
\v 31 ఇక్కడ నియమం ఏమిటంటే, మీకిచ్చినది ఏదైనా సరే, అది భోజనం అయినా, పానీయం అయినా, ఏది చేసినా సరే, దేవునికే ఘనత కలిగేలా సమస్తం చేయండి.
\v 32 ఈ విషయాల్లో యూదుల్ని గానీ, గ్రీసు దేశస్తుల్ని గానీ దేవుని సంఘంలో ఉన్నవాళ్ళని గానీ ఇబ్బంది పెట్టవద్దు.
\v 33 సాధ్యమైనంత వరకూ ఏదో విధంగా ప్రతి ఒక్కరినీ సంతోష పెట్టడమే ధ్యేయంగా నేను పని చేస్తున్నాను. ఇది నా స్వంత లాభం ఆశించి చేయడం లేదు, ఇతరులకు సహాయం చేయడం వల్ల దేవుడు వాళ్ళని రక్షించ గలిగేలా వారిని సిద్ధపరచ డానికి ప్రయత్నిస్తున్నాను.
\s5
\c 11
\p
\v 1 నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్నట్టుగా మీరు నాలాగా ఉండండి.
\p
\v 2 మీరు చేసే అన్ని పనుల్లో నన్ను గుర్తు చేసుకుంటూ, నేను మీకు చెప్పిన ముఖ్యమైన బోధలన్నీ కచ్చితంగా పాటిస్తూ ఉన్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.
\v 3 క్రీస్తుకు ప్రతి పురుషుడి మీదా అధికారం ఉందనీ, అలాగే పురుషుడికి స్త్రీ మీద అధికారం ఉందనీ అలాగే క్రీస్తు మీద దేవునికి అధికారం ఉందనీ మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.
\v 4 కాబట్టి ఏ పురుషుడైనా ప్రార్థన చేసేటప్పుడు గానీ దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు గానీ తలను కప్పుకుంటే తనను తను అవమానించుకున్నట్టే.
\s5
\v 5 అయితే ఒక స్త్రీ ప్రార్థన చేసేటప్పుడు గానీ దేవుని సువార్తను ప్రకటించే టప్పుడు గానీ తన తలను కప్పుకోక పోతే తనను తానే అవమానించు కున్నట్టు. ఆమె గుండు చేయించుకున్నట్టే.
\v 6 ఎవరైనా ఒక స్త్రీ తన తలను కప్పుకోడానికి ఒప్పుకోకపోతే ఆమె పురుషుడి లాగా తన జుట్టుని కత్తిరించు కోవాలి. అయితే మీకు బాగా తెలుసు, జుట్టు కత్తిరించుకోవడం, గుండు చేసుకోవడం ఒక స్త్రీకి అవమానం. కాబట్టి వీటన్నిటికీ బదులుగా స్త్రీ తన తలను కప్పుకోవాలి.
\s5
\v 7 పురుషుడు తన తల కప్పుకోకూడదు. ఎందుకంటే పురుషుణ్ణి దేవుడు తన పోలికలో చేశాడు. కాబట్టి పురుషుడు కొంతవరకు దేవుని ప్రతిబింబిస్తాడు. కానీ స్త్రీలు పురుషులు ఎలా ఉంటారో కొంతవరకు అలా ఉంటారు.
\v 8 దేవుడు పురుషుడైన ఆదామును, స్త్రీ అయిన అవ్వనుండి చేయలేదు. ఆదాము నుండే అవ్వను చేశాడు.
\s5
\v 9 దేవుడు పురుషుణ్ణి స్త్రీకి సహాయంగా ఉండడానికి చేయలేదు గానీ, పురుషుడికి సహాయంగా ఉండడం కోసమే స్త్రీని చేశాడు.
\v 10 ఈ కారణం గానే స్త్రీలు తమ అధికారానికి సూచనగా దేవుని దూతల కారణంగా కూడా తప్పనిసరిగా తమ తలను కప్పుకోవాలి.
\s5
\p
\v 11 అయితే ప్రభువుతో కలిసి జీవిస్తున్నప్పుడు స్త్రీలకు సహాయంగా పురుషులు అవసరం, పురుషులకు సహాయంగా స్త్రీలు అవసరం.
\v 12 ఎందుకంటే దేవుడు పురుషుడి నుండి స్త్రీని తయారు చేశాడు. అదే కాదు, పురుషుడు స్త్రీనుండే పుట్టాడు. వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధారపడతారు. అయితే ఇవన్నీ దేవుని నుండే కలిగాయి.
\s5
\v 13 మీకు మీరే ప్రశ్నించుకోండి. స్త్రీ తన తలను కప్పుకోకుండా దేవునికి ప్రార్థన చేయడం ఆమెకు సరైనదేనా?
\v 14 పురుషుడు జుట్టును పొడవుగా పెంచుకోవడం అతనికి అవమానం అని ప్రకృతి కూడా మనకి తెలుపుతుంది.
\v 15 అయితే స్త్రీ పొడవైన వెంట్రుకలు పెంచుకోవడం వల్ల ఆమె అందం ఎక్కువవుతుందని ప్రకృతి కూడా మనకి తెలియజేస్తుంది. తన అందాన్ని కప్పుకోడానికి దేవుడే ఆమెకు ఆ తల వెంట్రుకలు ఇచ్చాడు.
\v 16 ఈ విషయం గురించి సంఘంలో ఎవరైనా వాదం పెట్టుకోవాలి అనుకుంటే దీన్ని మించి వేరే రకమైన ఆచారం గానీ, అభిప్రాయం గానీ దేవుని సంఘంలో గానీ, మాలో గానీ లేదని తెలుసుకోవాలి.
\s5
\p
\v 17 నేను ప్రభురాత్రి భోజనం విషయంలో మీరు చేస్తున్న దాని గురించి మిమ్మల్ని ఏమీ మెచ్చుకోవడం లేదు. మీరు భోజనానికి అందరూ కలిసి వచ్చినప్పుడు ఒకళ్ళ నొకళ్ళు ప్రోత్సహించు కోవడం, సహాయం చేసుకోవడం మానేసి ఆ సంఘ సహవాసాన్ని మరీ అధ్వాన్నంగా చేసేస్తున్నారు.
\v 18 మొట్ట మొదటిగా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే మీరు సమావేశం అయినప్పుడు రక రకాలైన ముఠా తగాదాలతో వస్తున్నారు. ఈ విషయాలు నాకు చాల మంది చెప్పారు. వాళ్ళు చెప్పింది నిజమే.
\v 19 మీలో మీకు ఇలా రక రకాల గుంపులూ, భిన్నాభిప్రాయాలూ ఉండడమే మంచిది అనిపిస్తుంది. దీనివల్ల గౌరవం పొందడానికి ఎవరు అర్హులో, ఎవరు కారో పరీక్షించి తెలుసుకోవచ్చు.
\s5
\v 20 మీరు సమావేశ మైనప్పుడు ప్రభు రాత్రి భోజనాన్ని చేయడం లేదు.
\v 21 మీరు భోజనం చేసేటప్పుడు ముందు వచ్చిన వ్యక్తే ఇతరుల కోసం కనిపెట్టకుండా మొత్తం భోజనం అంతా తినేస్తున్నాడు. దీనివల్ల ఒకడు బాగా ఆకలితో ఉంటే, ఇంకొకడు బాగా తినీ బాగా ద్రాక్ష రసం తాగీ మత్తులో తూగుతున్నాడు.
\v 22 మీకు తినడానికి ఇల్లే లేనట్టుగా ఉన్నారు. మీరు సంఘాన్ని అవమాన పరుస్తున్నారు. మీరెందుకు సమావేశం అవుతున్నారో ఆ ఉద్దేశానికే విలువ లేకుండా చేస్తున్నారు. పేదవారిని మీరు హీనంగా చూస్తున్నారు. ఇదేమీ మంచి పద్ధతి కాదు. ఇది చాలా అవమానకరమైన విషయం.
\s5
\p
\v 23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు దగ్గర నుండే పొందాను, ప్రభువు తన శత్రువులకు తనను అప్పగించుకొనే రాత్రి ఆయన ఒక రొట్టెను పట్టుకొని
\v 24 కృతజ్ఞతలు చెప్పిన తరవాత దానిని విరిచి, "ఇది మీ కోసమే ఉన్న నా శరీరం, ఇలా చేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి” అని చెప్పాడు.
\s5
\v 25 అలాగే భోజనం చేశాక ఆయన ఒక పాత్రను పట్టుకొని, "ఈ పాత్ర నా రక్తం వల్ల వచ్చిన కొత్త నిబంధన. మీరు దీన్ని తాగుతున్న ప్రతిసారీ నన్ను జ్ఞాపకం చేసుకోండి” అని చెప్పాడు.
\v 26 మీరు రొట్టె తిని, ద్రాక్ష రసం తాగే ప్రతిసారీ ప్రభువు మరణాన్ని ఆయన తిరిగి వచ్చేవరకూ ప్రకటిస్తారు.
\s5
\p
\v 27 ప్రభు రాత్రి భోజన వేడుకకు వచ్చే వాళ్ళందరూ, అందులో భాగస్వాములైనట్టు. దేవునికి మహిమ తేవాలనే అక్కడికి రావాలి. ఎవరైతే రొట్టె తినడానికీ, పాత్రలోనిది తాగడానికీ వస్తున్నారో, వాళ్ళు తప్పకుండ దేవుని మహిమ కోసమే దాన్ని ఆచరించాలి. ఎవరైతే రొట్టె, ద్రాక్షరసాలను అగౌరవ పరుస్తారో వాళ్ళు ప్రభువు శరీరం, రక్తం విషయంలో దోషులు అవుతారు.
\v 28 కాబట్టి ప్రభు రాత్రి సంస్కారాన్ని తీసుకొనే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. అలా చేసిన తరవాతే రొట్టెని తిని, ద్రాక్షరసాన్ని తాగాలి.
\v 29 ప్రభువు శరీరం అని ఆలోచించకుండా, తిని తాగే వాడు తన మీదికే శిక్షను కొని తెచ్చుకుంటున్నాడు.
\v 30 ప్రభువు శరీరం విషయంలో మీరు ప్రవర్తించే తీరు వల్ల మీలో ఎంతో మంది శారీరికంగా రోగులుగా ఉన్నారు. కొంత మందైతే చనిపోయారు కూడా.
\s5
\v 31 ప్రభు రాత్రి సంస్కారాన్ని ఆచరించేటప్పుడు ముందుగా మనల్ని మనం పరీక్షించు కొనేట్టయితే దేవుడు మనల్ని తీర్పు తీర్చడు.
\v 32 అయితే ప్రభువు మనల్ని విమర్శించి శిక్షించి నప్పుడు ఆయన మనల్ని సరిదిద్దడానికే అలా చేస్తాడు. ఆ విధంగా దేవునిపై తిరుగుబాటు చేసిన లోకంతో పాటు మనం శిక్షకు గురికాకుండా చేస్తాడు.
\s5
\p
\v 33 నా తోటి విశ్వాసులారా, ప్రభు రాత్రి భోజనానికి మీరు సమావేశం అయినప్పుడు ఒకరికోసం ఒకరు కనిపెట్టండి.
\v 34 మీలో ఎవరికైనా ఆకలేస్తే మీ ఇళ్ళ దగ్గర తినేసి రండి. అలా చేయడం వల్ల సంఘంగా అందరూ సమకూడినప్పుడు దేవుడు క్రమశిక్షణ లో పెట్టే పరిస్థితిని మీరు తీసుకు రారు. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు మీరు రాసిన ఇతర విషయాల గురించి సూచనలు చేస్తాను.
\s5
\c 12
\p
\v 1 సోదర సోదరీలారా, ఇప్పుడు ఆత్మ వరాల గురించి నన్ను చెప్పనీయండి. వాటిని మీరు ఎలా ఉపయోగించాలో తెలియజేయాలి అనుకుంటున్నాను.
\v 2 గతంలో మీరు విగ్రహాలను పూజించిన రోజుల్లో, అవి ఒక్క మాట కూడా మాట్లాడలేవనీ, అవి మిమ్మల్ని పూర్తిగా దారి తప్పించాయనీ ఒకసారి గుర్తు చేసుకోండి.
\v 3 దేవుని ఆత్మ "యేసే ప్రభువు” అని ప్రకటించడానికి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళెవ్వరూ "యేసు శాపగ్రస్తుడు” అని చెప్పరు.
\s5
\p
\v 4 దేవుని ఆత్మ ఒక్కడే గానీ ఆయన తన ప్రజలకు అనేక ఆత్మ వరాలు ఇస్తాడు.
\v 5 దేవుణ్ణి సేవించడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి గానీ ప్రభువు ఒక్కడే.
\v 6 దేవుని రాజ్యంలో పరిచర్య చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి గానీ ఆయన కోసం పనిచేయడానికి తన ప్రజలకు శక్తినిచ్చే వాడు మాత్రం దేవుడే.
\s5
\p
\v 7 దేవుడు ప్రతి విశ్వాసీ ఎంతో కొంత ఆత్మ శక్తి కలిగి, దానిని కనపరచ గలిగేలా సహాయం చేస్తాడు. అందరూ తనను నమ్మాలనీ, తనను మహిమ పరచాలనే ఉద్దేశంతో దేవుడు విశ్వాసులందరికీ ఈ విధంగా సహాయం చేస్తాడు.
\v 8 ఆ ఆత్మ ఒక వ్యక్తికి దేవుని జ్ఞానంతో ఒక సందేశాన్ని ప్రకటించే సామర్ధ్యం ఇస్తే, మరొక వ్యక్తికి ఆ జ్ఞానాన్ని ఇతరులకు అందించే సామర్ధ్యం ఇస్తాడు.
\s5
\v 9 దేవుని ఆత్మ ఒక విశ్వాసికి దేవుని అద్భుత కార్యాన్ని విశ్వసించే సామర్ధ్యాన్ని, అదే ఆత్మ మరొక వ్యక్తికి ఇతరుల స్వస్థత కోసం దేవునికి ప్రార్థించే సామర్ధ్యాన్ని ఇస్తాడు.
\v 10 ఆ ఆత్మే కొంతమంది విశ్వాసులకు అనేకులు దేవుణ్ణి మహిమ పరిచేలా అద్భుతాలు చేయగలిగే సామర్ధ్యం ఇస్తాడు. కొంతమంది విశ్వాసులకు దేవుని నుండి వచ్చిన ప్రవచనాలు పలికే సామర్ధ్యం ఇస్తాడు, మరి కొంతమందికి దేవున్ని మహిమపరచే ఆత్మలను, మహిమపరచని ఆత్మలను గ్రహించగలిగే సామర్ధ్యం ఇస్తాడు. మరి కొంతమందికి వివిధ రకాల భాషల్లో మాట్లాడే సామర్ధ్యాన్నీ, ఇంకొందరికి ఆ భాషల అర్ధాన్ని మన స్వంత భాషలో వివరించే సామర్ధ్యాన్నీ ఇస్తాడు.
\v 11 అదే ఆత్మ మళ్ళీ రక రకాల వరాలను ఆయన ఎంచుకున్న వ్యక్తులకు ప్రత్యేకంగా ఇవ్వడం మనం చూస్తాం.
\s5
\p
\v 12 మనిషి శరీరంలో ఎన్నో అవయవాలున్నా శరీరం ఒక్కటే. అయితే ప్రతి అవయవం శరీరాన్ని సంపూర్ణం చేస్తుంది. క్రీస్తు విషయం లో కూడా ఇంతే.
\v 13 మనం బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు ఆత్మ చేతనే పొందాం. మనలో ప్రతి ఒక్కరం క్రీస్తు శరీరంలో కలిసి భాగం అయ్యాం. మనం ముందు, వెనకలు ఎలాంటివైనా సరే, ఇందులో ఎలాంటి తేడా లేదు. యూదుడైనా, గ్రీకు వాడైనా, బానిసైనా, స్వతంత్రుడైనా మనలో ప్రతి ఒక్కరం పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందాం.
\s5
\p
\v 14 గుర్తుంచుకోండి, శరీరం అంటే ఒకే ఒక్క అవయవం కాదు. ఒక్క శరీరాన్ని తయారు చేయడానికి ఎన్నో అవయవాలు కలిసి పని చేయాలి. అప్పుడే ఒక శరీరం అవుతుంది.
\v 15 నీ కాలు ఒకవేళ, "నీతో నేను చెయ్యిని కాదు కాబట్టి, నేను నీ శరీరంలో భాగం కాదు” అంటే అది శరీరంలో నీ చెయ్యిలాగా ఉండదు కాబట్టి శరీరంలో భాగం కాకుండా పోతుందా ఏంటి?
\v 16 ఒకవేళ చెవి నీతో, "నేను నీ కన్నుని కాదు కాబట్టి ఆ కారణంగా నీ శరీరంలో నాకు స్థానం లేదు” అని చెబితే అది నీ కన్నులాగా లేదు కాబట్టి నీ శరీరంలో భాగం కాకుండా పోతుందా ఏంటి?
\v 17 నీ శరీరం అంతా కన్నే అయితే వినడానికి అక్కడ ఏమీ ఉండదు. నీ శరీరం అంతా చెవే ఉన్నట్టయితే చూడ్డానికి అక్కడ ఏమీ ఉండదు.
\s5
\v 18 అయితే దేవుడు శరీరంలో ఉన్న అన్ని అవయవాల్నీ కలిపి ఒక్కటిగా అమర్చాడు. ఆయన రూపకల్పన చేసినట్టుగా అవి పని చేస్తున్నాయంతే. ప్రతి అవయవమూ అవసరమే.
\v 19 మనలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఒకే రకమైన అవయవాలుగా ఉంటే మనకి అసలు శరీరం అనేదే ఉండదు.
\v 20 మనందరం ఎంతోమందిమి. అవయవాలు ఎన్నో ఉన్నాయి. అయితే శరీరం మాత్రం ఒక్కటే.
\s5
\v 21 మీ శరీరంలో కన్ను, "నువ్వు నాకు అవసరం లేదు” అని చేతితో చెప్పలేదు. తప్పకుండా చెయ్యి అవసరమే. తల పాదాలతో, "నువ్వు నాకు అక్కరలేదు” అని చెప్పడానికి వీలు లేదు.
\v 22 శరీరంలో బలహీనంగా కనిపించే అవయవాలు కూడా శరీరం మొత్తానికి ఎంతో అవసరం.
\v 23 శరీరంలో ఇతరులు చూడ్డానికి సిగ్గుపడే కొన్ని అవయవాల విషయంలో మనం ఎంతో జాగ్రత్త తీసుకొని వాటిని కప్పుకుంటాం. ఇలా చేయడం వల్ల మనం వాటి విషయంలో మరింత గౌరవం చూపుతున్నాం.
\v 24 అయితే దేవుడు అలాంటి ప్రత్యేకమైన అవయవాలను తక్కువ ప్రాధాన్యత ఉన్న వాటితో జత కలిపాడు. అంతే కాదు, దేవుడు ఎక్కువగా ప్రదర్శించలేని అలాంటి అవయవాలకు అవి కూడా శరీరంలోని భాగాలు కాబట్టి వాటికి ఎక్కువ ఘనతనిస్తాడు.
\s5
\v 25 ఆ విధంగా దేవుడు శరీరం అంతటికీ గౌరవం ఇచ్చాడు. అలా చేయడం వల్ల సంఘంలో వివాదాలు రావు. క్రీస్తు శరీరంలో ఉన్న ప్రతి విశ్వాసీ దాని ఉద్దేశాలతో, హోదాతో, వరాలతో, సామర్ధ్యాలతో సంబంధం లేకుండా శరీరంలోని ఇతర విశ్వాసుల విషయంలో అదే ప్రేమ, అదే శ్రద్ధ చూప గలుగుతారా?
\v 26 ఎందుకంటే మనందరం ఒకే శరీరం కాబట్టి ఒక అవయవం బాధ పడితే మిగిలిన అవయవాలన్నీ బాధ పడతాయి. ఒక విశ్వాసి వల్ల క్రీస్తుకు మహిమ కలిగితే శరీరంలో ఉన్న విశ్వాసులంతా కలిసి సంతోషిస్తారు.
\p
\v 27 ఇప్పుడు మీరు క్రీస్తు శరీరం కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఆ శరీరానికి చెందిన అవయవాలు.
\s5
\v 28 దేవుడు సంఘానికి ప్రజలను కూడా వరాలుగా ఇచ్చాడు. సంఘానికి మొదటిగా అపోస్తలుల్నీ రెండవదిగా ప్రవక్తల్నీ, మూడోది బోధకుల్నీ తరవాత అద్భుతాలు చేసే వాళ్ళనీ, స్వస్థతలు చేసే వాళ్ళనీ, ఉపచారం చేసే వాళ్ళనీ, అజమాయిషీ చేసే వాళ్ళనీ, ఆత్మ అనుగ్రహించిన వివిధ రకాల భాషలు మాట్లాడే వాళ్ళనీ, ఇచ్చాడు.
\v 29 మనందరం అపోస్తలులం కాదు, అందరూ ప్రవక్తలు కాదు, అందరూ బోధకులు కాదు, అందరూ అద్భుతాలు చేయరు.
\s5
\v 30 అందరం స్వస్తతలు చేయలేము, అందరం ప్రత్యేకమైన భాషలు మాట్లాడలేం, అందరం ఇతర భాషల్లోకి సందేశాలను అనువదించలేము.
\v 31 అయితే శ్రేష్టమైన వరాల కోసం ఆసక్తిగా వెదకండి. ఇప్పుడు నేను వీటన్నిటిని మించిన సర్వ శ్రేష్టమైన మార్గాన్ని మీకు చూపిస్తాను.
\s5
\c 13
\p
\v 1 ఎదుటివారిని ఆశ్చర్య చకితుల్ని చేసి, నాకు అనుకూలమైన పనులు చేసేలా వారిని ఒప్పించ గలిగేలా మాట్లాడినా, ఒకవేళ దేవదూతల భాషతో మాట్లాడినా సరే, మనుషులపై ప్రేమ లేకపోతే మాత్రం నా మాటలన్నీ శబ్దం చేసే గంట లాగా, గణ గణ మని మోగే కంచు తాళం లాగా విలువ లేకుండా ఉంటాయి.
\v 2 దేవుని కోసం ప్రవచించ గలిగినా, దేవుని మర్మాలను వివరించి చెప్పగలిగినా పర్వతాలను పెళ్ళగించే విశ్వాసం దేవునిపై ఉంచగలిగినా సరే, నేను మనుషుల్ని ప్రేమించకపోతే మాత్రం విలువ లేని వాడినే.
\v 3 నాకున్నదంతా పేదలను పోషించడానికి ధారపోసినా, ఎవరినో కాపాడడానికి నా శరీరం కాలిపోయేంతగా నేను త్యాగం చేసినా సరే, మనుషుల్ని ప్రేమించలేక పోతే మాత్రం వీటి వలన నేనేమీ సంపాదించుకోలేను.
\s5
\p
\v 4 మీరు నిజంగా ఇతరుల్ని ప్రేమించ గలిగితే కష్టాలను సంతోషంగా ఓపికతో సహిస్తారు. మీరు నిజంగా ప్రేమిస్తే, ఇతరుల విషయంలో దయ కలిగి ఉంటారు. మీరు నిజంగా ప్రేమిస్తే ఇతరులు ఎంత సంపాదించుకున్నా మీకేమీ లేకపోయినా సరే మీరు అసూయ పడరు. మీరు నిజంగా ప్రేమిస్తే మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోరు, గర్వంతో మిడిసిపడరు.
\v 5 మీరు ఇతరుల్ని నిజంగా ప్రేమిస్తే మీరు వాళ్ళని నిందించరు. కేవలం మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకోడానికే జీవించరు. ఇతరులు ఏమి చేసినా మీరు తొందరపడి కోపం తెచ్చుకోరు. ఇతరులు మీ విషయంలో చేసిన తప్పుల్ని మీ మనసులో ఉంచుకోరు.
\v 6 మీరు నిజంగా ఇతరుల్ని ప్రేమిస్తే, ఎవరైనా చెడ్డ పనులు చేస్తుంటే మీరు సంతోషంగా ఉండలేరు. అయితే ఎవరైనా దేవునికి నమ్మకస్తులుగా ఉంటే మీరెంతో సంతోషిస్తారు.
\v 7 మీరు నిజంగా ప్రేమిస్తే జరిగే వాటన్నిటినీ భరిస్తారు. దేవుడు తన ప్రజలకు మేలు చేస్తాడని నమ్మి ఆశతో ఎదురు చూస్తారు. ఏది జరిగినా, దేవున్నే నమ్ముతారు. మీరు ఎలాంటి కష్టాలు ఎదురైనా, దేవునికే విధేయులై ఉంటారు.
\s5
\p
\v 8 మీరు నిజంగా ప్రేమిస్తే మీరు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. ఎవరైతే దేవుని ప్రవచనాలు చెప్పగలరో, కొత్త భాషలు మాట్లాడగలరో, ఎవరైతే దాగి ఉన్న మర్మాలు గ్రహించగలరో, ఇవన్నీ కొంతకాలం మట్టుకే ఉంటాయి. ఇలా చేయడం వాళ్ళు ఒక రోజు ఆపేస్తారు.
\v 9 ఇప్పుడు ఈ జీవితంలో మనకు తెలిసింది కొంచెం మాత్రమే. దేవుని సందేశాన్ని ప్రకటిస్తున్న వాళ్ళు కొంతవరకు మాత్రమే చేస్తారు.
\v 10 అయితే విషయాలన్నీ పరిపూర్ణం అయినప్పుడు పాక్షికంగా ఉన్నవీ, అసంపూర్ణంగా ఉన్నవన్నీ అంతమై పోతాయి.
\s5
\v 11 నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, చిన్న పిల్లాడిలా మాట్లాడాను. చిన్న పిల్లాడిలాగా ఆలోచించాను, చిన్న పిల్లవాడు చేసే నిర్ణయాలు చేశాను. అయితే పెద్దవాడైనప్పుడు చిన్న పిల్లాడి చేష్టలు మానేశాను. పెద్దవాడిలా ఉండటం మొదలు పెట్టాను.
\v 12 క్రీస్తును గురించి ఇంతవరకు ఏం అర్థం చేసుకున్నామో అది అసంపూర్ణం మాత్రమే. అయితే క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన్ని మనం ముఖా ముఖిగా చూస్తాం. వాస్తవంగా ఇప్పుడు కొంత మాత్రమే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మన గురించి ఆయనకు పూర్తిగా తెలిసినట్టుగా మనం కూడా ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటాం.
\v 13 మనం క్రీస్తును విశ్వసించడం, ఆయన వాగ్దానం చేసినవన్నీ కచ్చితంగా చేస్తాడనే ఆశాభావం కలిగి ఉండడం దేవుణ్ణీ, మన పక్కవాళ్ళని ప్రేమించడం, ఈ మూడూ చాలా ముఖ్యమైనవి. అయితే ఈ మూడింటిలో గొప్పదీ, ఉత్తమమైందీ ప్రేమే.
\s5
\c 14
\p
\v 1 నేను ఎలా ఇతరుల్ని ప్రేమించాలో అని మీ తోటి విశ్వాసుల్ని బలపరిచే వరాల కోసమని నేను పోరాడుతున్నాను. ముఖ్యంగా దైవ సందేశాలను ప్రకటించే వరం కోసం ప్రయాసపడండి.
\v 2 ఒక వ్యక్తి ఆత్మతో తెలియని భాషలో మాట్లాడినప్పుడు అతడు అక్కడి ప్రజలతో మాట్లాడటం లేదు. ఎందుకంటే ఆ భాషను ఎవరూ అర్థం చేసుకోలేరు కాబట్టి అతడు దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఆత్మ నడిపిస్తుండగా అతడు విషయాలను దేవునితోనే చెప్తున్నాడు.
\v 3 ఇంకో పక్క ప్రవక్త, దేవుని నుండి వచ్చిన సందేశాన్ని నేరుగా ప్రజలకు ప్రకటిస్తున్నాడు. వాళ్ళని బలపరచడానికీ, స్థిరంగా నిలిచి ఉండేలా సహాయపడడానికీ, కష్టాల్లో కూడా సంతోషంగా ఉండేలా వారిని ఆదరించడానికీ ప్రకటిస్తున్నాడు.
\v 4 ఆత్మ సహాయంతో భాషలతో మాట్లాడే వ్యక్తి తన వ్యక్తిగత క్షేమాభివృద్ధికీ, తన ఆత్మీయ జీవితం ఎదగడానికీ భాషలతో మాట్లాడుతున్నాడు. అయితే దైవ సందేశాన్ని ప్రకటించే వ్యక్తి ప్రతి ఒక్కరి క్షేమాభివృద్ధికీ, విశ్వాస జీవితం బలపడడానికీ, ప్రతి ఒక్కరికీ ఆదరణ, ఓదార్పు కలగడానికి సహాయపడతాడు.
\s5
\p
\v 5 ఇప్పుడు మీరందరూ అలాంటి భాషలు మాట్లాడాలని కోరుకుంటున్నాను. గానీ దానికంటే మరింత గొప్ప వరం దేవుడు తెలియచేసిన సందేశాలను ప్రకటించే వరం. ఆ వరాన్ని మీరందరూ కోరుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎవరైతే దేవుని నుండి వచ్చిన సందేశాలను ప్రకటిస్తారో వాళ్ళు తమ తోటి విశ్వాసుల్ని బలపరచడానికి సహాయపడిన వాళ్ళవుతారు. ఆ కారణంగా తెలియని భాషలతో సందేశాన్ని ప్రకటించే వాళ్ళ కంటే ఈ పని చాలా గొప్పది. ఎందుకంటే తెలియని భాషలతో మాట్లాడేవానికి అర్థం చెప్పేవాడు ఇంకొకడు ఉంటేనే తప్ప ఆ సందేశాలు ఎవరికీ అర్థం కావు.
\p
\v 6 నేను మీ దగ్గరకు మీకు తెలియని భాషలతో మాట్లాడుతూ వచ్చాననుకోండి. అది మీకేమైనా సహాయపడుతుందా? అది బూడిదలో పోసిన పన్నీరే కదా? నేను వచ్చి మీతో మాట్లాడి మీ మనసులో ఉన్న విషయాలు తెలుసుకుంటే తప్ప మీకేవిధంగానూ నేను సహాయపడలేను. లేకపోతే మీకు తెలియని సత్యాన్ని అర్ధమయ్యేలా చెపితే తప్ప ఇంతకు ముందెప్పుడూ మీరు వినని సందేశాన్ని ప్రకటించి, లేక ఇంతకు ముందెప్పుడూ మీరు నేర్చుకోని నియమాన్ని మీకు అర్ధమయ్యే భాషలో మాట్లాడితేనే తప్ప మీకు ఏవిధంగానూ సహాయపడలేను.
\s5
\v 7 ఎవరైనా, వేణువు గానీ, వీణ గాని (అవి ప్రాణమున్నవి కాదు) వాటి మీద ఉన్న స్వరాల మధ్య తేడా ఒక్కొక్కటీ వేరు వేరుగా స్వరాలు పలకకపోతే నేను వాయించే రాగం ఏమిటో ఎవరూ చెప్పలేరు.
\v 8 సైనికులు బాకాను పేలవంగా ఊదితే సైన్యానికి యుద్ధానికి సిద్ధపడాలో లేదో ఏమీ అర్థం కాదు.
\v 9 ఎవరూ అర్థం చేసుకోలేని మాటలు పలికితే ఇలాగే ఉంటుంది. మీరేమి చెప్పారో ఎవరికీ అర్థం కాదు.
\s5
\v 10 ఈ లోకంలో చాలా భాషలు ఉన్నాయి. ఆ భాషలు తెలిసిన వాళ్లకి అవి అర్ధమవుతాయి.
\v 11 కానీ ఎవరి భాష అయినా నాకు అర్థం కాకపోతే నేను అతనికి ఒక విదేశీయుడి లాగా ఉంటాను. అతడు కూడా నాకు అలాగే ఉంటాడు.
\s5
\v 12 కాబట్టి ఆత్మ మీలో బాగా పని చేయాలని కోరుకుంటే సంఘంలో ఉన్న విశ్వాసులు క్రీస్తును విశ్వసించి ఆయనకు లోబడేలాగా వాళ్ళకి సహాయం చేయడానికి ప్రయత్నించండి.
\v 13 అందువల్ల దేవుడు మీకిచ్చిన తెలియని భాషలో మీరేం చెప్తారో దాని అర్థం చెప్పే సామర్ధ్యం కూడా దేవుడు మీకివ్వాలని దేవుణ్ణి ప్రార్థించండి.
\v 14 ఎవరైనా అలాంటి భాషలో ప్రార్థన చేస్తే అతని ఆత్మ కచ్చితంగా ప్రార్ధిస్తుంది గానీ అతని మనసు మాత్రం ప్రార్ధించదు.
\s5
\v 15 కాబట్టి మనం తప్పకుండా మన ఆత్మతో, మన మనసుతో కూడా ప్రార్ధించాలి. దేవుని స్తుతించే విషయంలో కూడా అంతే.
\v 16 మీరు మీ ఆత్మతోనే దేవుని స్తుతించాలని మీరు పట్టుబడితే గనక మీరేం మాట్లాడుతున్నారో బయటివాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అంతే కాదు, వాళ్ళెప్పటికీ మీరు చెప్పే ఆ సందేశాన్ని అంగీకరించలేరు.
\s5
\v 17 ఒకవేళ మీరు ఆత్మతో స్తుతులు చెల్లిస్తే అది మీకు మేలుకరమే గానీ మీరు సహ విశ్వాసులకు ఏమాత్రం సహాయం చేయలేరు.
\v 18 మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలతో మాట్లాడు తున్నందుకు దేవునికి వందనాలు చెబుతున్నాను.
\v 19 కానీ సంఘంలో ఆత్మతో తెలియని భాషతో పది వేల మాటలు పలకడం కన్నా ఇతరులకు అందులో ఉన్న ఉపదేశం అర్థం అయ్యేలాగా నా మనసుతో ఐదు మాటలు పలకడం మేలు.
\s5
\p
\v 20 సోదర సోదరీల్లారా, మీరు పెద్దల్లాగా ఆలోచించాలి. అయితే మీరు చెడ్డ విషయాల గురించి ఆలోచించేటప్పుడు చిన్న పిల్లల్లాగా ఆలోచించాలి. మీ ఆలోచన తెలివిగా ఉండాలి.
\v 21 ధర్మశాస్త్రంలో ఇలా రాసి ఉంది, - "దేవుడు ఇలా చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో నేను మాట్లాడతాను. పురుషులు, ఎవరైతే తెలియని భాషలో మాట్లాడతారో, వాళ్ళ ద్వారా నేను మాట్లాడ తాను. నా ప్రజలు నన్ను అర్థం చేసుకోరు."
\s5
\p
\v 22 కాబట్టి దేవుడు ఒక విశ్వాసికి ఇచ్చిన ఒక్క భాషతో అతడు మాట్లాడినట్లైతే, ఆ మాటలు విన్న ఒక అవిశ్వాసిని ఇది ప్రభావితం చెయ్యొచ్చు. అయితే ఒక విశ్వాసి దేవుని నుండి వచ్చిన సందేశాన్ని చెప్తే అది ఇతర విశ్వాసుల్ని ప్రభావితం చేస్తుంది.
\v 23 ఒక చోట విశ్వాసులంతా కలుసుకొని ఒక్కక్కళ్ళు ఒక్కొక్క భాషతో మాట్లాడుతుంటే అది ఎంత గందరగోళంగా ఉంటుందో మీరు చూడవచ్చు. ఏ అవిశ్వాసి అయినా అది విన్నప్పుడు వాళ్ళని పిచ్చోళ్ళు అనకుండా మానడు.
\s5
\v 24 అయితే మీరందరూ దేవుడిచ్చిన సత్య సందేశాలను ప్రకటిస్తూ ఉంటే అవిశ్వాసు లెవరైనా లోపలికి వచ్చి ఆ సందేశం విని దేవునికి వ్యతిరేకంగా పాపం చేశానని ఒకవేళ అతడు గ్రహించవచ్చు.
\v 25 ఈ అవిశ్వాసి తనలో ఉన్న లోతైన మనస్సాక్షిని గుర్తిస్తాడు. అతడు సాష్టాంగపడి భయంతో, ఆశ్చర్యంతో దేవుణ్ణి స్తుతించి నిజంగా మీలో దేవుడున్నాడని ప్రకటిస్తాడు.
\s5
\p
\v 26 సోదర సోదరీల్లారా దేవుని ఆరాధించడానికి మీరు వచ్చినప్పుడు ఇలా చేయాలి, ప్రతి ఒక్కళ్ళూ కీర్తన పాడాలి లేకపోతే లేఖన భాగాలలో నుండి ఏదైనా ఉపదేశం చెయ్యాలి. దేవుడు మీతో చెప్పినది ఏదైనా సరే, అది తెలియని భాషలో సందేశం అయినా, దానికి అర్థం చెప్పడం అయినా చెయ్యాలి. మీరు క్రీస్తు సంఘం కాబట్టి మీరేం చేసినా కలిసికట్టుగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాలి.
\v 27 ఎవరైనా ఆత్మ సహాయంతో తెలియని భాషలో మాట్లాడడానికి ఇష్టపడితే అక్కడ అలాంటి వ్యక్తులు ఇద్దరు లేక ముగ్గురి కన్నా మించకుండా ఉండాలి. వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి. ఆ సందేశాలకు ఎవరైనా ఒకళ్ళు అర్థం చెప్పాలి.
\v 28 అయితే ఆ సందేశాలను ఆనువదించే వాళ్ళు ఎవరూ లేకపోతే ఆ తెలియని భాషలో సందేశం చెప్పేవాళ్ళు మౌనంగా ఉండి, వాళ్ళు దేవునితో మాత్రమే మాట్లాడాలి.
\s5
\p
\v 29 దేవునినుండి వచ్చిన సందేశాన్ని ప్రకటించాలి అనుకునేవాళ్లు ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే ఉండాలి. మిగిలిన వాళ్ళంతా, వాళ్ళు చెప్పిన సందేశాలు లేఖనాలను అనుసరించి ఏమి చెప్తున్నాయో విమర్శనాత్మకంగా పరిశీలించాలి.
\v 30 అయితే సంఘంలో కూర్చుని ఉన్న మరెవరికైనా దేవుడు ఏదైనా వెల్లడి చేస్తే సందేశాన్ని వెల్లడిస్తున్న వ్యక్తి మాట్లాడ్డం ఆపేయాలి. ఇలా చేయడం వల్ల విశ్వాసులంతా ఆ సందేశం లోని అర్ధాన్ని వినగలుగుతారు.
\s5
\v 31 వాళ్ళలో ప్రతి ఒక్కరూ అలా దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటించాలి. అయితే వాళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు క్రమాన్ని అనుసరించి అలా చేయాలి. ఇలా చేయడం వల్ల విశ్వాసులందరూ నేర్చుకొనేలా, దేవుణ్ణి ఇంకొంత మెరుగ్గా ప్రేమించడానికి ధైర్యాన్ని, ప్రాత్సాహాన్ని పొందుతారు.
\v 32 దేవుడిచ్చిన సందేశాన్ని నిజంగా ప్రకటించే వారి ఆత్మ వారి స్వాధీనంలో ఉంటుంది.
\v 33 దేవుడు శాంతినీ నెమ్మదినీ కలిగించేవాడే గాని, గందరగోళాన్ని కలిగించే వాడు కాదు. ఈ తరవాతి ప్రశ్న కూడా ప్రతి సంఘంలోని దేవుని ప్రజలకు ఇలాంటి జవాబే ఇచ్చింది.
\s5
\v 34 సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి. వాళ్ళు మాట్లాడడానికి అనుమతి లేదు. దేవుడిచ్చిన సందేశాన్ని ప్రకటిస్తున్న వాళ్లకు అడ్డు తగలకూడదు. వాళ్ళు ఎప్పుడూ భర్తలకు లోబడి ఉండాలి. ఇదే విషయాన్ని ధర్మశాస్త్రం కూడా చెప్తుంది.
\v 35 స్త్రీలు ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే ఆరాధనను ఆటంక పరిచే బదులు ఇంట్లో భర్తల దగ్గర నేర్చుకోవాలి. స్త్రీలు సంఘ కార్యక్రమాలకు అడ్డు తగలడం తమ భర్తలకు అవమానం.
\v 36 దేవుడు ఎవరి చేత మనకు ఆయన వాక్కును ఇచ్చాడో, ఆ ప్రజలు మీరేనా? మీరొక్కరి వల్లనే దేవుని వాక్కు వచ్చిందా?
\s5
\v 37 మీలో ఎవరైనా ప్రవక్తననీ ఆత్మీయ వ్యక్తిననీ తలస్తే నేనిక్కడ రాస్తున్న విషయాలు ప్రభువు ఆజ్ఞాపించినవనీ, వాటిని కచ్చితంగా అనుసరించాలనీ మీరు అంగీకరించాలి.
\v 38 ఎవరైతే నేను రాసిన వాటిని పట్టించుకోరో, మీ సంఘాల్లో మీరు కూడా వారిని పట్టించుకోకండి.
\s5
\p
\v 39 కాబట్టి సోదర సోదరీల్లారా, దేవుడిచ్చిన సందేశాన్ని సంఘానికి ప్రకటించే వరానికై ఉవ్విళ్ళూరండి. దేవుడిచ్చిన తెలియని భాషలో సందేశాన్ని ప్రకటించే వాళ్ళను ఆపకండి.
\v 40 సంఘ ఆరాధన అంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో మర్యాదగా క్రమంగా జరపండి.
\s5
\c 15
\p
\v 1 సోదరీ సోదరుల్లారా, ఇప్పుడు నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు మళ్ళీ గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ సువార్తను మీరు నమ్మి దాని ప్రకారం ఇప్పుడు జీవిస్తున్నారు.
\v 2 ఈ సువార్త మిమ్మల్ని రక్షించింది. మీరు నిజంగా నమ్మక పోతే తప్ప మీరు దానిని గట్టిగా పట్టుకున్నంత కాలం అది మిమ్మల్ని రక్షిస్తుంది.
\s5
\p
\v 3 లేఖనాల్లో ముందే రాసి ఉన్నట్టు క్రీస్తు మన పాపాల గురించి చనిపోయాడని ఇతరులు నాకు చెప్పిన ఉపదేశాన్ని మొదటిగా మీకే తెలియజేశాను.
\v 4 అంతే గాక ఆయన్ని సమాధి చేశారనీ, మూడవ రోజు ఆయన్ని దేవుడు తిరిగి లేపాడనీ, ఇలా లేఖనాల్లో ఎలా రాసి ఉంటే అలా అన్నీ జరిగాయి.
\s5
\v 5 తరవాత ఆయన కేఫాకు (పేతురుకు) కనిపించాడు. తరవాత మిగిలిన అపోస్తలులందరికీ కనిపించాడు.
\v 6 ఆ తరవాత ఆయన ఐదు వందల కంటే ఎక్కువగా ఉన్న ప్రభువు సంఘంలో సమావేశమై ఉన్న సోదరీ సోదరులకు కనిపించాడు. వాళ్ళలో కొంతమంది చనిపోయినా చాలామంది ఇప్పటికీ జీవించే ఉన్నారు. మీరు వాళ్ళను అడిగి దాని గురించి తెలుసుకోవచ్చు.
\v 7 తరవాత ఆయన యాకోబుకు కనిపించాడు. ఇంకోసారి అపోస్తలులందరికీ కనిపించాడు.
\s5
\v 8 ఇతర అపోస్తులలతో సమానుణ్ణి కాకపోయినా చివరికి నాకు కూడా కనిపించాడు.
\v 9 నేను అపోస్తలులందరిలో చాలా అల్పుడిని. క్రీస్తు సంఘాన్ని ఘోరంగా హింసించాను. అపోస్తలుడుగా ఉండడానికి నేను తగను.
\s5
\v 10 అయితే దేవుడు నా విషయంలో అమితమైన దయ చూపించాడు. ఇప్పుడు నేను అపోస్తలుడిని. ఆయన నాద్వారా ఎన్నో మంచి పనులు జరిగించాడు. నిజంగా అందరు అపోస్తలులకంటే నేను ఎంతో కష్టపడి పని చేశాను. అయితే ఇప్పటికీ నాకై నేను చేసింది ఏమీ లేదు. దేవుడే నాకు బలం ఇచ్చి ఆ పనులు జరిగించాడు.
\v 11 కాబట్టి నేనుగానీ ఇతర అపోస్తలులు గానీ, ఎవరైనా సరే క్రీస్తు సువార్తను ప్రకటించాం. మీరు మమ్మల్ని నమ్మారు.
\s5
\p
\v 12 అయితే ఇప్పుడు మీలో కొంతమంది చనిపోయిన వాళ్ళు తిరిగి లేవరని చెప్తున్నారు. ఇది ఎంతమాత్రం నిజం కాదు. ఎందుకంటే క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచాడని మేము మీకు ప్రకటించాం.
\v 13 చనిపోయిన వాళ్ళు ఎవరూ తిరిగి బతకరు అనుకుంటే అప్పుడు దేవుడు కూడా క్రీస్తుని లేపకుండానే ఉండేవాడు.
\v 14 ఆయన క్రీస్తును మృతులలోనుండి లేపకపోతే మనం ప్రకటించేదానికి అర్థమే లేదు. అంతే కాదు, దేనికోసం క్రీస్తును నమ్ముతున్నామో ఆ విశ్వాసం వల్ల మీ జీవంలో గానీ మరణంలో గానీ మీకు ప్రయోజనం ఏమీ లేదు.
\s5
\v 15 దానికి తోడు చనిపోయిన వాళ్ళు నిజంగా తిరిగి లేవకపోతే దేవుని గురించి ప్రజల దృష్టిలో మేము అబద్ధాలకోరులం అవుతాం.
\v 16 మళ్ళీ చెప్తున్నాను, చనిపోయిన వాళ్ళెవ్వరూ తిరిగి లేవకపోతే దేవుడు క్రీస్తును కూడా లేపలేదు.
\v 17 దేవుడు క్రీస్తును లేపకపోతే మీరు నమ్మేదంతా వ్యర్ధం. మీరు పాపం చేశారు కాబట్టి దేవుడు ఇప్పటికీ మిమ్మల్ని దోషులుగానే చూస్తున్నాడు. మీరింకా మీ పాపాల్లోనే ఉన్నారన్న మాట.
\s5
\v 18 అదే పరిస్థితి అయితే క్రీస్తులో విశ్వాసం ఉంచి చనిపోయిన వాళ్లకు కూడా తిరిగి లేస్తామనే ఆశ లేకుండానే చనిపోయారన్నమాట. వాళ్ళు కూడా నశించిపోయినట్టే.
\v 19 ఈ జీవితంలో మాత్రమే క్రీస్తులో మన నిరీక్షణ ఉంటే మనం చనిపోయిన తరవాత ఇంకా ఆయన నుండి ఆశించేది ఇంకేమీ లేదన్నమాట. ఇంక మనం ఒక అబద్ధాన్ని నమ్మామని ప్రజలంతా మనపై జాలి పడడానికి మనం అర్హులం అన్నమాట.
\s5
\v 20 నిజానికి, దేవుడు క్రీస్తును చనిపోయిన వాళ్ళలో నుండి లేపాడు. మరణం నుండి దేవుడు లేచిన వారందరిలో ఆయనే మొదటివాడు.
\v 21 ఆదాము అనే ఒకే ఒక్క వ్యక్తి చేసిన పాపం వల్ల ఈ లోకంలో ఉన్న ప్రతివాడూ చనిపోతాడు. అయినప్పటికీ ఏసుక్రీస్తు అనే ఒకే ఒక వ్యక్తి చేసిన పని వల్ల చనిపోయిన వాళ్ళంతా తిరిగి బతుకుతారు.
\s5
\v 22 అందువల్ల, అంటే ఆదాము చేసిన పాపం వల్ల అందరూ ఏవిధంగా చావుకు లోనయ్యారో అలాగే క్రీస్తు చేసిన పని వల్ల అందరూ తిరిగి జీవిస్తారు.
\v 23 అయితే ఒక కచ్చితమైన క్రమంలో వాళ్ళు మరణం నుండి తిరిగి లేస్తారు. మొట్టమొదట క్రీస్తు మృతుల్లోనుండి తిరిగి లేస్తాడు. ఆ తరవాత ఆయన ఈ భూమి మీదికి తిరిగి వచ్చినప్పుడు ఆయనకీ చెందిన అందరూ మృతుల్లో నుండి తిరిగి లేచి క్రీస్తుతో పాటు కలుస్తారు.
\s5
\v 24 క్రీస్తు ఈ లోకాన్ని తండ్రి దేవుని పాలనకు అప్పగించినప్పుడు ఈ లోకం అంతమై పోతుంది. ఈ లోకంలోని పరిపాలకుల హోదాలూ, సమస్తాన్నీ పాలించే అధికారాల్నీ, సింహాసనాలనూ, బలాన్నీ క్రీస్తు రద్దు చేసినప్పుడు ఈ భూమి అంతమై పోతుంది.
\v 25 దేవుడు క్రీస్తు శత్రువు లందరినీ జయించి, ఇంక వాళ్ళకి అధికారం, బలం లేదని వాళ్ళని క్రీస్తు పాదాల దగ్గర పడేసేటంత వరకూ ఆయన పరిపాలించాలి.
\v 26 దేవుడు నాశనం చేసే చిట్టచివరి శత్రువు మరణం.
\s5
\v 27 లేఖనాలు చెప్పినట్టు, "సమస్తాన్నీ దేవుడు ఆయన పాదాల కింద ఉంచాడు." కానీ సమస్తం అనే మాటలో దేవుడు తప్ప మిగిలినవన్నీ ఆయన పాదాల కింద ఉన్నాయన్నది స్పష్టం అవుతుంది.
\v 28 దేవుడు సమస్త అధికారాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచిన తరవాత కుమారుడు కూడా తండ్రి దేవుడే అందరికీ అన్నిటిలో సర్వాధికారిగా ఉండడం కోసం తానే ఆయనకీ లోబడతాడు.
\s5
\p
\v 29 కొంతమంది చెప్పినట్టుగా మృతుల పునరుత్థానం లేకపోతే కొందరు చేస్తున్నట్టుగా చనిపోయిన వారికోసం బాప్తిసం పొందడంలో అర్థమే లేదు. దేవుడు చనిపోయిన వాళ్ళను తిరిగి లేపి తన వెంట తీసుకు రాకపోతే ఇక్కడ చనిపోయిన వాళ్ళ కోసం బాప్తిసం తీసుకోడానికి సరైన కారణమే లేదు.
\v 30 మృతుల పునరుత్థానం లేకపోతే ఇప్పుడు మేం చేస్తున్నట్టుగా సువార్త ప్రకటించడం దిన దిన గండంగా మా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇంకా బతకనక్కర లేదు.
\s5
\v 31 నా సోదరీ సోదరులారా, మీ గురించి నేను గర్వపడు తున్నాను. మన ప్రభువైన ఏసుక్రీస్తు ముందు అతిశయించ గలిగే నా ఆస్తి మీరే. ఏ రొజుకారోజు నేను చనిపోయే ప్రమాదం లో ఉన్నాను.
\v 32 దేవుడు చనిపోయిన వాళ్ళను తిరిగి బతికించక పోతే ఎఫెసులో ఆ క్రూర మృగాలతో నేను పోరాడింది అంతా గాలికి ప్రయాస పడినట్టు అన్నమాట. "ఈ రోజే తిని తాగుదాము రండి, ఎందుకంటే రేపు మనం చనిపోతాం అని కవులు రాసింది ఈ విషయంలో నిజమే కావచ్చు.
\s5
\v 33 మోసపోకండి. "అప్పుడు మీకున్న చెడ్డ స్నేహితులు మంచి దారిలోకి రావడానికి ఏమాత్రం లెక్క చేయరు."
\v 34 కాబట్టి తెలివిగా ఉండండి. మంచి ప్రవర్తన కలిగి జీవించండి. పాపంలో జీవించకండి. మీలో కొంతమందికి దేవుడంటే ఎవరో కూడా తెలియనే తెలీదు. మీకు సిగ్గు రావాలని ఎలా చెబుతున్నాను.
\s5
\p
\v 35 "చనిపోయిన వాళ్ళు ఎలా లేస్తారు? వాళ్లకి ఎలాంటి శరీరం ఉంటుంది?" అని ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు.
\v 36 మీకసలు ఏమీ తెలీదు! భూమిలో మీరు నాటిన ఏ విత్తనమైనా సరే, చనిపోతేనే గాని మొలకెత్తదనే వాస్తవం గురించి మీరు ఆలోచించడం లేదు.
\s5
\v 37 ఒక రైతు నాటింది అది పెరిగి బయటికి వచ్చిందీ ఒకేలా కనిపించదు. అది వట్టి విత్తనం మాత్రమే. తరవాత అది పూర్తి భిన్నంగా మారిపోతుంది.
\v 38 దేవుడు దానికి ఆయన ఎంచుకున్న తన ఇష్టమైన ఒక కొత్త రూపాన్ని ఇస్తాడు. ప్రతి విత్తనం భూమిలో నాటినప్పుడు వాటికి ఆయన వేరు వేరు శరీరాలను ఇస్తాడు.
\v 39 అయితే భూమి మీద ఉన్న అన్ని జీవులూ ఒకేలా ఉండవు. వాటిలో మనుషులు, రకరకాల జంతువులు, పక్షులు, చేపలు ఉంటాయి. వాటన్నిటిలో చాలా వ్యత్యాసం ఉంటుంది.
\s5
\v 40 పరలోకంలో కూడా రకరకాల వస్తువులు ఉంటాయి. ఆకాశంలో ఉన్నవాటికీ, భూమి మీద ఉన్నవాటికీ, వాటి స్వభావంలో హస్తిమశకాంతరం ఉంది.
\v 41 అక్కడ ప్రకాశించే సూర్యుడికి ఒక స్వభావం, మృదువుగా ఉన్న చంద్రుడికి ఇంకొ స్వభావం ఉంటుంది. నక్షత్రాలకు కూడా వేరు స్వభావం ఉంటుంది. అయితే నక్షత్రాలలో కూడా ఒకదానికీ మరొక దానికీ వేరు వేరు స్వభావం ఉంటుంది.
\s5
\p
\v 42 అదే విధంగా మనుషులు మరణం నుండి తరిగి లేచినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఏదైతే భూమి లోపలి వెళ్లిందో అది చనిపోయింది. అయితే ఏదైతే మళ్ళీ తిరిగి జీవించిందో అది ఇంకా ఎప్పటికీ మరణించదు.
\v 43 అది భూమిలోకి వెళ్ళినప్పుడు మట్టిలో ఉంటుంది. కానీ దేవుడు దానిని తిరిగి లేపినప్పుడు అది మహిమతో, బలంతో పెరుగుతుంది.
\v 44 భూమిలోకి వెళ్ళేది భూమికి సంబంధించింది, మృతుల్లో నుండి తిరిగి లేచేది దేవుని శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి అక్కడ భూమికి సంబంధించినవీ ఉన్నాయి, దేవుని శక్తి కలిగి నిత్యం నిలిచిపోయేవీ ఉన్నాయి.
\s5
\p
\v 45 కాబట్టి, "మొదటి మనిషైన ఆదాము జీవించే ప్రాణి అయ్యి తన పిల్లలకూ వారసులకూ జీవితాన్ని ఇచ్చాడు” అని లేఖనాలు చెప్తున్నాయి. అయితే రెండవ ఆదాము క్రీస్తు తన ప్రజలకు దేవుని శక్తినీ, నిత్యమైన జీవితాన్నీ ఇచ్చాడు.
\v 46 భూమికి సంబంధించింది ఏదో అది మొదట వచ్చింది. అది ప్రకృతి సంబంధమైంది. దేవుడికి సంబంధించింది ఏదో తరవాత వచ్చింది. అది ఆత్మ సంబంధమైంది.
\s5
\v 47 మొదటి మానవుడు ఆదాము ఈ భూమికి చెందినవాడు. అతడు మట్టినుండి తయారయ్యాడు. అయితే రెండవ మానవుడు క్రీస్తు పరలోకానికి చెందినవాడు.
\v 48 మట్టి నుండి తయారైన వాళ్ళంతా మట్టినుండి తయారైన ఆదాము లాంటి వాళ్ళే. పరలోకానికి చెందిన వాళ్ళంతా పరలోకం నుండి వచ్చిన క్రీస్తు లాంటి వాళ్ళే.
\v 49 దేవుడు మట్టినుండి మనల్ని మనిషిగా తయారు చేసినట్టు గానే పరలోకం నుండి వచ్చిన మనిషిగా కూడా ఆయన మనల్ని తయారు చేస్తాడు.
\s5
\p
\v 50 సోదరీ సోదరులారా, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఒకానొక రోజు చనిపోయే వాళ్ళు తమను పరిపాలించే దేవుడు వాళ్ళ కిస్తానని వాగ్దానం చేసిన వాటిని పొందలేరు. నశించిపోయేవి నశించని వాటిగా మారలేవు.
\v 51 చూడండి, దేవుడు మనకి తెలీకుండా, రహస్యంగా దాచి ఉంచిన విషయాలను మీకు చెప్తాను, విశ్వాసులందరూ చనిపోరు కానీ దేవుడే మనందరినీ మారుస్తాడు.
\s5
\v 52 ఆయన ఒక్క క్షణంలో ఒకడు తన కనురెప్పలు వేసినంత వేగంగా దేవుని దూతలు ఆఖరి బూర ఊదగానే ఆయన మనల్ని మార్చేస్తాడు. వారు ఆ బూర ఊదుతారు. అప్పుడు దేవుడు చనిపోయిన వాళ్ళను మళ్ళీ ఇంకెన్నడూ చనిపోని విధంగా వారిని తిరిగి లేపుతాడు.
\v 53 ఈ శరీరాలు చనిపోతాయి. అయితే దేవుడు మళ్ళీ ఇంకెప్పుడూ చనిపోకుండా ఉండేలాగా ఆయన చేస్తాడు. వాళ్ళు మళ్ళీ ఇంకెన్నడూ చనిపోరు. ఈ శరీరాలు ఇప్పుడు నాశనం అయిపోయినా సరే, దేవుడు వాళ్ళను నూతనంగా మళ్ళీ మరణం లేని శరీరంగా చేస్తాడు.
\s5
\v 54 ఇది జరిగినప్పుడు ఈ లేఖనాలు నెరవేరతాయి.
\q "దేవుడు మరణాన్ని సమూల నాశనం చేశాడు."
\q
\v 55 "మరణం ఇంకెప్పుడూ గెలవదు!
\q మరణ వేదన తొలగించి వేశాడు."
\s5
\p
\v 56 మనం చనిపోయేటప్పుడు ఈ పాపమే మనకెంతో బాధ కలిగించింది. ధర్మశాస్త్రం వల్లే పాపం మన జీవితాల్లో ప్రవేశించింది.
\v 57 అయితే ఇప్పుడు ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరణం మీద మనకు విజయం కలిగించాడు. అందుకే ఇప్పుడు ఆయనకీ స్తుతి.
\s5
\p
\v 58 కాబట్టి ప్రియమైన సోదరీ సోదరుల్లారా, విశ్వాసంలో స్థిరంగా, నిలకడగా మీ జీవితంలో మిమ్మల్ని ఎవరూ కదిలించ లేనివాళ్ళుగా ఉండి అంతకంతకు ప్రభువు పనిలో ముందుకు సాగండి. ఆయన కోసం మీరు చేసేది ఏదైనా సరే, ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
\s5
\c 16
\p
\v 1 యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల కోసం పోగుచేస్తున్న డబ్బు విషయంలో మీ ప్రశ్నలకు ఇప్పుడు జవాబు చెప్పాలనుకుంటున్నాను. గలతీ సంఘాల విశ్వాసులకు నేనేం చేయాలని చెప్పానో కచ్చితంగా మీరు కూడా అదే చేయండి.
\v 2 ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కరు మీకు వీలైనంత మట్టుకు కొంత డబ్బును పక్కన పెట్టండి. అలా చేస్తే నేను వచ్చినప్పుడు ఇంకెలాంటి వసూళ్ళూ చేయాల్సిన అవసరం ఉండదు.
\s5
\v 3 యెరూషలేముకు మీ కానుకలు తీసుకెళ్ళడం కోసం మీరెవరిని పంపాలనుకుంటే వాళ్ళను మీరే ఎంపిక చేసుకోవాలి. నేను అక్కడికి చేరుకున్నప్పుడు మీ కానుకల గురించిన ఉత్తరాలను వారితోపాటు పంపుతాను.
\v 4 ఒకవేళ వాళ్ళు నాతోపాటు కలిసి యెరూషలేముకు రావడం మంచిదైతే అలా చేయవచ్చు.
\s5
\p
\v 5 మాసిదోనియా ప్రాంతం గుండా ప్రయాణం చేసేటప్పుడు మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను.
\v 6 అప్పుడు ఒకవేళ మీ దగ్గర కొంత కాలం ఆగితే ఆగవచ్చు. ఒకవేళ శీతాకాలం అంతా కూడా గడుపుతానేమో మరి. అప్పుడు నేను వెళ్లబోయే ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళడానికి మీరు సహాయపడవచ్చు.
\s5
\v 7 కొన్ని రోజులు మాత్రమే మీ దగ్గర ఉండటం నాకిష్టం లేదు. మీతో సరిపడినంత సమయం గడపడానికీ, ఒకరి విషయంలో ఒకరు సహాయపడ గలిగేలా ప్రభువు నాకు అనుమతిస్తాడని ఎదురు చూస్తున్నాను.
\v 8 పెంతెకోస్తు పండుగ వరకు నేను ఎఫెసులో గడపాలని అనుకుంటున్నాను.
\v 9 ఎందుకంటే అక్కడ ఎంతో మంది ఇప్పటికీ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నా సరే, ప్రభువు నాకు అక్కడ ఒక ద్వారం తెరిచాడు.
\s5
\p
\v 10 ఇప్పుడు తిమోతి మీ దగ్గరకు వచ్చినప్పుడు అతడు దేనికీ మొహమాట పడకుండా ఉండేలా దయచేసి అతన్ని ప్రేమగా చూడండి. ఎందుకంటే అతడూ నాలాగే ప్రభువు పని చేస్తున్నాడు.
\v 11 ఎవ్వరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. అతడికి మీరెంత సహాయం చేయ గలిగితే అంత సహాయం చేయండి. శాంతితో నా దగ్గరకు చేరుకొనేలా అతన్ని శాంతితో సాగనంపండి. అతడితో బాటు ఇంకా ఇతర సోదరులు కూడా వస్తారని ఎదురు చూస్తున్నాను.
\p
\v 12 మన సోదరుడు అపోలో గురించి మీరు అడిగారు. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్న సోదరులతో కలిసి వెళ్ళమని అతన్ని చాలా బతిమిలాడాను గానీ ఇప్పుడు రావడం అతనికి ఇష్టం లేదు. అయితే అతనికి అవకాశం దొరికినప్పుడు ఇంకోసారి వస్తాడు.
\s5
\p
\v 13 జాగ్రత్తగా ఉండండి. మీ విశ్వాసం నుండి తొలగిపోవద్దు. పరిపక్వత చెందిన వ్యక్తుల్లాగా ప్రభువు కోసం పని చేయండి. బలవంతులుగా ఉండండి.
\v 14 మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.
\s5
\p
\v 15 స్తెఫను ఇంటిలో ఉన్నవాళ్ళు మీకు తెలుసు కదా! అకయ ప్రాంతంలో మొట్ట మొదటిగా ప్రభువును విశ్వసించిన వాళ్ళు వీళ్ళే. ప్రభువుకు చెందిన వారందరికీ సహాయం చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు.
\v 16 కాబట్టి సోదరీ సోదరులారా, అలాంటి వారికీ ప్రభువు పనిలో మాతో కలిసి కష్టపడి పని చేసే వాళ్ళందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.
\s5
\v 17 స్తెఫను, ఫోర్మునాతు, అకాయికు అనే వాళ్ళు కొరింతు నుండి రావడం సంతోషంగా ఉంది. వాళ్ళు రావడం వల్ల మీరు నాతో లేరనే కొరత తీరింది.
\v 18 వాళ్ళు నన్ను ప్రోత్సహించి నా ఆత్మకు ఎంతో సహాయకరంగా ఉన్నారు. వాళ్ళు మీకు కూడా సహాయ కరంగా ఉన్నారు. వాళ్ళు మీకు ఎంత సహాయం చేశారో మిగతావాళ్లకు కూడా చెప్పండి.
\s5
\p
\v 19 ఆసియా సంఘాల వాళ్ళు మీకు వందనాలు చెప్తున్నారు. అకుల, ప్రిస్కిల్ల వాళ్ళింట్లో కూడుకుంటున్న సంఘం వాళ్ళు కూడా మీరు ప్రభువు పని చేస్తున్నారని మీకెన్నో వందనాలు చెప్తున్నారు.
\v 20 మిగిలిన సోదరీ సోదరులందరూ మీకు వందనాలు చెప్తున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకళ్ళ నొకళ్ళు వందనాలు చెప్పుకోండి.
\s5
\p
\v 21 పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ వాక్యాన్ని రాస్తున్నాను.
\v 22 ఇంకా ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వాళ్ళ మీదే ఆ శాపం ఉంటుంది. ఓ ప్రభువా, రండి!
\v 23 మనకు అర్హత లేని యేసు ప్రభువు కృప మీకు తోడుగా ఉంటుంది గాక.
\v 24 నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, క్రీస్తు యేసులో ఉన్న మిమ్మల్నందరినీ నేను ప్రేమిస్తున్నాను.

478
48-2CO.usfm Normal file
View File

@ -0,0 +1,478 @@
\id 2CO - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక
\toc1 కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక
\toc2 కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక
\toc3 2co
\mt1 కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక
\s5
\c 1
\p
\v 1 మన సోదరుడు తిమోతీతో కలిసి పౌలు అనే నేను రాస్తున్న ఉత్తరం. తనను సేవించడానికి, దేవుని అభీష్టాన్ని ఆచరించడానికి క్రీస్తు యేసు నన్ను పంపాడు. మేము ఈ పత్రిక కొరింతు నగరంలో దేవుని ప్రజలుగా సమకూడుతున్న వారికీ, దేవుడు అకయ ప్రాంతమంతటా తనకోసం ప్రత్యేకించుకున్న పరిశుద్ధులందరికీ పంపుతున్నాం.
\v 2 మన తండ్రి అయిన దేవుని నుండీ, యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు ప్రేమ, శాంతిసమాధానాలు ధారాళంగా కలుగు గాక.
\s5
\p
\v 3 మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. మనయెడల ఆయన దయాకరుడు, అన్ని విధాలా ఆదరించే దేవుడు.
\v 4 మాకెలాంటి కష్టం వచ్చినా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాపై చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా బాగుచేయగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.
\s5
\v 5 లెక్కకు మించి క్రీస్తు పడిన బాధలు మా అనుభవంలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ కొలతకందనంతగా అధికం అవుతూ ఉంది.
\v 6 మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసమే. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ బాగు కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి, దేవుని కొరకు కనిపెట్టడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది.
\v 7 మీరు మా కష్టాలను ఎలా పంచుకుంటున్నారో అలాగే దేవుడు మాపై చూపుతున్న ఆదరణను కూడా పంచుకుంటున్నారని మాకు తెలుసు. అందుచేత మీకు ఏమేమి జరుగుతుందో తేటగా తెలుసు.
\s5
\p
\v 8 సోదర, సోదరీమణులారా ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియాలి. అవి మాకు దుర్భరం అనిపించాయి. అసలు మేము చచ్చిపోతామేమో అన్నంత పని అయింది.
\v 9 మాకు మరణదండన విధించారు. వాళ్ళ చేతిలో చావు కోసం మేము ఎదురు చూస్తున్నాం. అయితే ఆ మరణ దండన చనిపోయిన వారిని తిరిగి జీవింపచేయగల దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచరాదని నేర్పించింది.
\v 10 అలాంటి భయంకరమైన ఆపదల నుండి ఆయన మమ్మల్ని రక్షించాడు, మళ్లీ మళ్ళీ రక్షిస్తాడు. ఆయన మీద మా నమ్మకమంతా పెట్టుకున్నాము. ఎడతెగక మమ్మల్ని తప్పిస్తాడు.
\s5
\v 11 మీరు మా కోసం మీ ప్రార్థన ద్వారా సహాయం చేస్తూ ఉంటే ఆయన దీన్ని చేస్తాడు. అనేకమంది ప్రార్థనల వల్ల దేవుడు మమ్మల్ని కనికరించినందుకు చాలామంది మా తరపున ధన్యవాదాలు చెబుతారు.
\s5
\v 12 ప్రజలందరి యెడల నీతిగా, నిజాయితీగా ఎలాటి మోసానికి తావు లేకుండా జీవించామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ లోకంలో దేవుని స్వజనమై, ఆయనయందు ప్రగాడ విశ్వాసం కలిగి జీవించాం. అది ఆయన వరమే. ఈ లోకపు విలువలూ, సాంప్రదాయాలూ మేము ఏమాత్రం అనుసరించలేదు. మా పనుల ఎంపికలో ఈ లోకపు జ్ఞానానికి చెవియెగ్గలేదు. బదులుగా దేవుడే మా బతుకు బండినీ, మార్గాన్నీ నిజాయితీగా, పరిశుద్ధంగా చేశాడు.
\v 13 నా ఉత్తరాలు మీరు చదివారు. నేను రాసిన దానిని మీరు కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఏదో ఒక రోజున మీరు మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు.
\v 14 మేము మీకు కొంతవరకు తెలుసు. కానీ ప్రభువైన యేసు వచ్చిన రోజున ఆయన సమక్షంలో మేము మీకు చాలా గర్వ కారణంగా ఉంటామని, మీరూ మాకు గర్వకారణంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను.
\s5
\p
\v 15 నేను అనుకున్నట్లు కచ్చితంగా జరిగివుంటే, ఇంతకు మునుపు నేను మొదటిగా మీ దగ్గరకు రావాలని కోరుకున్నాను. అలా రెండు పర్యటనల వల్ల మీరు మేలు పొందవచ్చు అనుకున్నాను.
\v 16 నేను మాసిదోనియకు వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ మార్గంలో రెండు సార్లూ మిమ్మల్ని కలుసుకునేలా యోచించాను. అప్పుడు మీరు నన్ను యూదయకు పంపిస్తారని అనుకున్నాను.
\s5
\v 17 ఈ విధంగా నా మనసులో ప్రణాళిక తయారు చేసుకున్నాను. నేను మీకు అవును అని ఒకసారీ కాదు అని మరోసారీ చెప్పలేదు. అవిశ్వాసులు తరచుగా చేసే ప్రయత్నాలు నేను చేయలేదు.
\v 18 అయితే నమ్మదగిన దేవుడు మనల్ని నడిపిస్తాడు. అలాగే మేము కూడా మిమ్మల్ని కలవరపెట్టము. మేము మా ప్రణాళికను తయారు చేసుకుని వాటి ప్రకారంగానే ఉన్నాము.
\s5
\v 19 నాతో కలిసి సిల్వాను, తిమోతి మీకు ప్రకటించిన దేవుడి కుమారుడైన యేసు క్రీస్తు నుండే మేము మీతో "అవును” అని పలికినది వచ్చింది. ఆయనలో ఎప్పుడూ ఎలాంటి గందరగోళం వుండదు. ఆయన "అవును” అని చెప్పి, తరువాత "కాదు” అనేవాడు కాదు. వీటన్నిటికంటే ఆయనలోనుండి ఎప్పుడూ సాధారణంగా "అవును” అనే సమాధానం వస్తుంది.
\v 20 దేవుని వాగ్దానాలు నిజమైనవి. ఎందుకంటే అవి ఆయన నుండి వచ్చాయి. ఆయన అవును అనే సమాధానానికి మా నిర్ధారణను జోడిస్తున్నాము. మనం దేవుని కీర్తి గూర్చి చెబుతున్నాం. అవును, ఇది నిజం.
\s5
\v 21 క్రీస్తు సంబంధంలో మమ్ములను మీతో కలిపి స్థాపించిన వాడు దేవుడే. ప్రజలకు సువార్త ప్రకటించడానికి మనల్ని పంపిన వాడు ఆయనే.
\v 22 ఆయన తన అధికారిక ముద్రను మనపై వేశాడు. కాబట్టి ఆయన మనల్ని అంగీకరించాడని ప్రజలకు తెలుస్తుంది. మనలో నివసించే ఆత్మను ఆయన మనకు ఇచ్చాడు. ఇంతకంటే ఇంకా ఎక్కువైన మేలులే చేస్తానని శాశ్వతమైన వాగ్దానాన్ని ఆయన చేశాడు.
\s5
\v 23 కొరింతులోని క్రైస్తవులకు నేను రాకపోవడానికి గల కారణం దేవుడే తనకు తానుగా మీకు తప్పక తెలియ చేస్తాడు. మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే వరకూ నాకోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు.
\v 24 మేము దేవునిలో విశ్వాసం ఉంచడం గూర్చి ఆజ్ఞలు ఇచ్చే యజమానుల్లాంటి వారం కాము. అయినప్పటికీ మేము మీతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాం. తద్వారా ఏం జరిగినా దేవునిపై నమ్మకం ఉంచడం ఎలాగో నేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఆయనను విశ్వసించడంలోని ఆనందం పొందవచ్చు.
\s5
\c 2
\p
\v 1 చివరిసారి నేను కొరింతుకు వచ్చినపుడు నా మాటలు మిమ్మల్ని గాయపరిచాయని నాకు తెలుసు. ఈసారి తిరిగి మీ దగ్గరికి వచ్చినపుడు అది పునరావృతం కాకూడదని నిశ్చయించుకున్నాను.
\v 2 క్రితం సారి నా రాక వల్ల ఎంతో బాధపడిన మీరు, నిజానికి నన్నెంతో సంతోష పెడతారనుకున్నాను. అలాంటిది నేనే అక్కడికి వచ్చి మిమ్మల్ని నొప్పించేలా మాట్లాడాల్సి వచ్చింది.
\s5
\v 3 ఇంకోసారి నేను మీ దగ్గరకు వచ్చినపుడు మిమ్మల్నిబట్టి నాకు దుఃఖం కలుగకూడదని నేను ఆ ఉత్తరం రాశాను. వాస్తవానికి మీరు నా ఆనంద కారకులవ్వాలి. నిశ్చయంగా మనందరి సంతోషానికి కారణాలు ఉన్నాయి.
\v 4 గాయపడిన నా హృదయంలో బాధ ఇప్పటికీ అలానే ఉంది. కన్నీరు మున్నీరై పోతున్నాను. ఇంకెప్పుడూ మిమ్మల్ని బాధ పెట్టను. మీ పట్ల నాకున్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని, ఎంతో బాధతో, హృదయ వేదనతో, కన్నీళ్ళతో ఆ ఉత్తరం రాశాను.
\s5
\p
\v 5 పాపం చేసిన ఆ మనిషి నన్ను మాత్రమే కాదు, తన పాడు పని మీ అందర్నీ కూడా బాధపెట్టింది.
\v 6 అతనిని, అతని చెడుతనాన్ని గురించి ఏమి చెయ్యాలో మనందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఇప్పటికే మీలో చాలామంది అతనికి విధించిన శిక్ష చాలు.
\v 7 ఇకమీదట అతనిని క్షమించి దయతో ఆదరించడం మంచిది. అలా చేయకపోతే అతను మరింత వేదనతో క్రుంగి పోయి మీరు తనను మరెన్నటికీ క్షమించరు అనుకునే ప్రమాదముంది.
\s5
\v 8 అందుచేత విశ్వాసులందరి సమక్షంలో అతనికి మీ ప్రేమను వెల్లడించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను.
\v 9 మీరు ఈ విషయంలో దేవునికి విధేయులై సమస్యను చక్కదిద్దుతారో లేదో అని మిమ్మల్ని పరీక్షించేందుకే అలా రాశాను.
\s5
\v 10 మీరు క్షమించిన వానిని నేను కూడా క్షమించాను. దేన్నయితే నేను క్షమించానో అది ఎంత చిన్నదైనప్పటికీ, మీ యెడల నా ప్రేమనుబట్టే. క్రీస్తు నా ముందు ఉన్నట్టే నేను ఇలా క్షమించగలిగాను.
\v 11 చెడు చేసిన ఇతనిని క్షమించడం ద్వారా మనం సాతాను కుయుక్తిలో పడి మరింత కీడు జరుగకుండా చేయగలుగుతాము. వాడి పన్నాగాలూ, అబద్ధాలూ మనకు తెలియనివా?
\s5
\p
\v 12 మేము త్రోయ పట్టణానికి వచ్చినప్పుడు క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించడానికి ప్రభువు మాకు ఎన్నో ద్వారాలు తెరిచాడు. అయినప్పటికీ,
\v 13 మన సోదరుడు తీతు అక్కడ కనిపించకపోవడంతో నాకు మనశ్శాంతి లేక, అక్కడి విశ్వాసుల దగ్గర సెలవు తీసుకుని మాసిదోనియకు బయలుదేరాను.
\s5
\p
\v 14 క్రీస్తుతో మనందరం పొత్తు కలిశాం, అందుకోసం దేవునికి కృతజ్ఞతలు. క్రీస్తు ఎప్పుడూ విజయ కేతనం ఎగురవేస్తూ తన ఊరేగింపులో మమ్మల్ని నడిపిస్తున్నాడు.
\v 15 ఈ క్రీస్తు తన జ్ఞాన పరిమళాన్ని విమోచన పొందుతున్న వారి మధ్య, నాశనమైపోతున్న వారి మధ్య అంతటా మా ద్వారా గుబాళించేలా, మరి ముఖ్యంగా దేవునికే చెందేలా చేస్తున్నాడు. ఆయనకు మా ధన్యవాదాలు.
\s5
\v 16 దేవుడు మరణానికి నియమించిన వారికి క్రీస్తు వాసన చచ్చిన శవం వాసనగా అనిపిస్తుంది. అయితే దేవుడు రక్షించిన వారికి, మరణాన్ని జయించిన ఈ క్రీస్తు, తమను మరణం నుండి లేపి జీవింప చేసేవానిగా, జీవపు సువాసనగా ఉన్నాడు. ఇలాంటి సువాసన నిజానికి ఈయన కాక ఇంకెవరు వ్యాపింప చేయగలరు.
\v 17 దేవుని వాక్యాన్ని లాభం కోసం చాలామంది ఊరూరూ తిరుగుతూ అమ్మేస్తున్నారు. మేము అలాంటి వాళ్ళం కాదు. దేవుని ప్రసన్నత కోసం ఆయన మాట చొప్పున మేము ఎంత శ్రమైనా ఓర్చి పని చేయగలం. మేము క్రీస్తును గూర్చి మాట్లాడుతాం, క్రీస్తును ఎలుగెత్తి చాటుతాం. ఎందుకంటే మా ప్రతి కదలికలోనూ ఆయన కనుల ముందే ఉన్నామని, ఆయనతో ఏకమై ఉన్నామని మాకు తెలుసు.
\s5
\c 3
\p
\v 1 మేము మీకు బాగా తెలుసు, మమ్మల్ని నమ్మాలి. కొంతమందికి అవసరమైనట్టు, మీకు గానీ, మీ నుండి గానీ పరిచయ లేఖలు మాకు అవసరమా? మా గురించి మీకు తెలియంది ఏముంది? అంతా తెలుసు.
\v 2 మీ విషయం అంటారా! మా పరిచయ లేఖ మీరే. ఈ లేఖ మా హృదయాల మీద రాసి ఉండగా, ప్రజలందరూ మాపై మీరు ఉంచిన నమ్మకాన్ని తెలుసుకుని చదువుకోగలుగుతున్నారు.
\v 3 అది మీ జీవిత విధానం, రాతి పలక మీద సిరాతో రాసింది కాదు. మెత్తని హృదయాలు అనే పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో, మా సేవ ద్వారా క్రీస్తు రాసిన ఉత్తరంగా మీరు కనబడుతున్నారు.
\s5
\p
\v 4 క్రీస్తు ద్వారా మీ మధ్య మాచే దేవుడు జరిగించిన ఈ పరిచర్య విషయాలను స్థిరచిత్తంతో రాశాను. వాటి యధార్దత దేవునికి తెలుసు.
\v 5 మావల్ల ఏదైనా అవుతుందని ఆలోచించడానికి మేము సమర్థులమని కాదు. మా సామర్ధ్యం దేవుని నుండే కలిగింది.
\v 6 ఆయనే తన కొత్త ఒడంబడికకు సేవకులుగా, ప్రజలకు దానిని వివరించడానికి మాకు అర్హత కలిగించాడు. వ్రాత రూపంలో ఉండి, అందులో ఉన్న ప్రతి నియమానికీ విధేయత చూపాలని, యూదులతో చేసిన తన పాత ఒడంబడిక లాంటిది కాదు. దేవుడు మనకు తన ఆత్మను అనుగ్రహిస్తున్నాడు అని ప్రకటిస్తున్న ఆత్మ మూలమైన శుభవార్తకే మేము సేవకులం. ఎందుకంటే అక్షరం, విధేయత చూపని వానిని దేవుని నుండి ఎప్పటికీ దూరం చేస్తుంది. అంటే చంపుతుంది. కానీ ఆత్మ బ్రతికిస్తుంది. ఎలాగంటే, తన కొత్త ఒడంబడిక ద్వారా, ప్రజలు తన ఆత్మను పొంది నిత్యం జీవించేటట్లు చేస్తాడు.
\s5
\p
\v 7 దేవుడు రాతి పలకల మీద వ్రాసి, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం , మరణాన్ని వెంట తెచ్చింది. ఇలాంటి మరణ కారణమైన ధర్మశాస్త్రం కూడా దేవుని సన్నిధికాంతితో ప్రకాశించింది. ఆ ప్రభతో మోషే ముఖం ఎంతగా వెలిగి పోయిందంటే, ఇశ్రాయేలీయులు అతని ముఖాన్ని నేరుగా చూడలేక పోయారు. అలా మోషే ముఖంపై ప్రకాశించిన వెలుగు క్రమంగా సన్నగిల్లుతూ వచ్చింది.
\v 8 అలాంటిది, ఆత్మ సంబంధమైన సేవ మరి ఇంకెంత గొప్పగా వెలుగుతూ ఉంటుందో గదా!
\s5
\v 9 ప్రతి వాని విషయంలో మరణ కారణమైన ధర్మశాస్త్రమే దేవుని ప్రభతో ఇంతలా వెలిగిపోతుంటే, స్వయానా ఆ దేవుడే మనల్ని తనతో సమాధాన పరచుకున్నప్పుడు, దేవుని ప్రకాశం మనలో ఇంకెంత గొప్పగా వెలుగుతుందో!
\p
\v 10 ధర్మశాస్త్ర సంబంధమైన వెలుగు ఒకప్పుడు వైభవంగా ఉండేది. కానీ దేవుడు మనల్ని సరిచేసి, తనతో సమాధాన పరుచుకున్న కార్యంతో ఆ వెలుగును పోల్చినపుడు, ఏమాత్రం వైభవం లేనిదిగా కనబడుతుంది. దాని స్థానంలో దేవుడు చేసిన కార్యం అపారమైన వైభవాన్ని సంతరించుకుంది.
\v 11 గతించి పోయే ధర్మశాస్త్రమే గొప్పగా ఉంటే, దాని స్థానంలో వచ్చి, ఎప్పటికీ నిలిచిపోయేది ఇంకా ఎక్కువ గొప్పగా ఉంటుంది గదా!
\s5
\v 12 మేము అపోస్తలులం, మా భవిష్యత్తు విషయంలో దేవుడిని నమ్మిన వారం. కాబట్టి చాలా గొప్ప భరోసాతో ఉన్నాం.
\p
\v 13 తేజోహీనమౌతున్న తన ముఖాన్ని ఇశ్రాయేల్ ప్రజలు గమనించడం ఇష్టంలేని మోషే, ముసుగు ధరించినట్టు మేము లేము.
\s5
\v 14 ఇశ్రాయేల్ ప్రజలు చాలా కాలం క్రితమే దేవుడిని నమ్మకుండా తిరస్కరించారు. ఇప్పటికీ, ప్రాచీన ధర్మం చదువుతున్నప్పుడల్లా, ఇశ్రాయేల్ వారు, ఆ ముసుగునే ధరించినట్టు ఉన్నారు. క్రీస్తును చేరుకున్న క్షణంలోనే ఆ ముసుగు తొలగిపోతుంది కదా.
\v 15 అవును, ఈ నాటికీ, వారు మోషే ధర్మశాస్త్రం చదువుతున్న ప్రతిసారీ, వాళ్ళ మనసులపై ఆ ముసుగు ధరించే ఉంటున్నారు.
\v 16 ఎవరైనా ప్రభువు వైపుకు తిరిగితే, అప్పుడు మాత్రం, దేవుడే ఆ ముసుగును తొలగిస్తాడు.
\s5
\p
\v 17 ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటాడో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది.
\v 18 విశ్వాసులమైన మనమంతా ముసుకు లేని ముఖాలతో ప్రభువు వైభవాన్ని చూస్తూ, అదే వైభవంతో, ఆయన పోలిక లోకి క్రమక్రమంగా మారుతూ ఉన్నాము. ఇది ఆత్మరూపి అయిన ప్రభువు ద్వారా జరుగుతుంది.
\s5
\c 4
\p
\v 1 దేవుడి నుంచి కనికరం ఎలా పొందామో అలానే బాధ్యతాయుతమైన ఈ సేవ కూడా పొందాము, కాబట్టి నిరుత్సాహపడము.
\v 2 సిగ్గుపడే పనులేవీ చేయకుండా మేము జాగ్రత్త పడుతున్నాము. మాలో ఎలాటి దాపరికమూ లేదు. దేవుడు చేయని వాగ్దానాన్ని, కుయుక్తితో చేస్తాడని మాట ఇవ్వం. ఆయన సందేశాన్ని వక్రీకరించి మాకు అనుకూలంగా ప్రకటించం. ప్రతివాడి మనస్సాక్షికీ, దేవుడి ముందు నిలబడినట్టుగా మమ్మల్ని మేమే అప్పగించుకొంటూ సత్యం ప్రకటిస్తున్నాము.
\s5
\v 3 ఒకవేళ మేము ప్రకటిస్తున్న సువార్త ముసుగేసినట్టు అగోచరంగా ఉంది అంటే అది కేవలం దేవునికి దూరమై నాశనమై పోతున్నవారికే.
\v 4 దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపే సువార్త వెలుగు, వారి అవిశ్వాసం వలన చూడలేకుండా, ఈ లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు.
\s5
\v 5 కాబట్టి ఎలాంటి దుష్టత్వం నుండైనా మిమ్మల్ని విడిపించే వారమైనట్టు మమ్మల్ని మేము ప్రకటించుకోకుండా, క్రీస్తు యేసును మా ప్రభువుగా, ఆ యేసుతో ఏకమైన వారిమై, మీ కోసం పనివాళ్ళమై ప్రకటిస్తున్నాము.
\v 6 "చీకట్లో నుండి వెలుగు ప్రకాశిస్తుంది” అని చెప్పిన దేవుడే తన జ్ఞాన వైభవపు వెలుగును ఇవ్వడానికి మా హృదయాల్లో ప్రకాశించాడు. కాబట్టి నమ్మికతో యేసు క్రీస్తు దరి చేరినపుడు, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో మనం తెలుసుకుంటాము.
\s5
\p
\v 7 దేవుని నుండి వచ్చిన ఈ అమూల్యమైన బహుమానం ఇప్పుడు మట్టి కుండల్లాంటి బలహీనమైన మా శరీరాలలో సంపదగా మాకు లభించింది. కాబట్టి ఈ అత్యధికమైన శక్తి దేవునిదే తప్ప మాది కాదు అని స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ విషయమై మాకెలాంటి అవగాహనారాహిత్యమూ లేదు.
\v 8 ఎన్నో రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవడం లేదు. ఎటూ పాలుబోని పరిస్థితులు ఎదురైనప్పటికీ కృంగిపోవడం లేదు.
\v 9 కొందరు మాకు హాని తలపెడుతున్నారు. కానీ ఒక్కనాటికీ ఒంటరి వాళ్ళం కాదు. కొందరైతే మమ్మల్ని కొట్టి పడేశారు కానీ ప్రతిసారీతిరిగి లేచాం.
\v 10 తరచూ యేసు మరణం లాంటి మరణ గండాలు మాకు సంభవించాయి. అయినా, యేసు సజీవుడు గనక, ఆ యేసు జీవం మా దేహాల్లో కనబడేలా ప్రాణాలతో తిరిగి లేచాం.
\s5
\v 11 మేమిప్పుడు జీవించి ఉన్నప్పటికీ, యేసును బోధిస్తున్న కారణాన, ఏదో ఒక రోజు ఈ మనుషుల చేతిలో మా మరణం పొంచి వుందని సదా జ్ఞాపకముంచుకుంటాం. యేసు జీవించి ఉన్నాడనీ, ఏదో ఒక రోజు చావుకు లోనయ్యే మా ఈ శరీరాలను ఇప్పుడు బలపరుస్తున్నాడనీ ప్రజలందరికీ అర్ధమయ్యేలా, దేవుడు మాకు శ్రమలను అనుమతిస్తున్నాడు.
\v 12 ఈ విధంగా మాలో నిరంతర శ్రమలూ, ఆనక చావూ సంభవించినప్పటికీ, వాటి పర్యవసానం ఇప్పుడు మీరందరూ నిత్యజీవ గ్రహీతలయ్యారు.
\s5
\v 13 మేము అధైర్యపడలేదు. పవిత్ర లేఖనాల్లో "దేవుడిని నమ్మాను, కాబట్టే మాట్లాడుతున్నాను." అని వ్రాసిన మనిషిలాగ మేము ఉన్నాం. మేము దేవుడిని నమ్మాం, అంతేకాక ఆయన మాకొరకు ఏం చేశాడో అది మాట్లాడుతాం కూడా.
\v 14 ప్రభువైన యేసును మరణం నుండి లేపిన దేవుడు, యేసుతో మమ్మల్ని కూడా లేపుతాడు. ఆ యేసు మీతో సహా మమ్మల్ని దేవుడు ఉండే చోటుకు చేరుస్తాడని మాకు తెలుసు.
\v 15 నా శ్రమల అంతిమ ఉద్దేశ్యం మీకు సాయపడడమే. దీని వలన ప్రజలు దేవుని ప్రేమను తాము సయితం పొందగలమని, ఇతోధికంగా తెలుసుకోవడమే కాకుండా, ఆయనను మరింతగా శ్లాఘిస్తారు.
\s5
\p
\v 16 మా దేహాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నా లోలోపల ప్రతి రోజూ దేవుడు మమ్మల్ని కొత్తవారినిగా చేస్తున్నాడు. అందుచేత మేము నిరుత్సాహపడడం లేదు.
\v 17 క్షణమాత్రం ఉండే స్వల్ప బాధ, దానికి ఎన్నో రెట్లు అధికమైన అద్భుతమైన వైభవానికి మమ్మల్ని సిద్ధం చేస్తూ ఉంది. అది ఎప్పటికీ ఉండే వైభవం, ఏ ఒక్కడూ కొలవనూ లేడూ, వివరించనూ లేడు.
\v 18 కళ్ళెదుట కనిపించే వాటికోసం మేము కనిపెట్టుకుని లేము కానీ, ఈ కళ్ళకు కనిపించని వాటి కోసం చూడాలని కాచుకుని ఉన్నాం. కళ్ళ ముందుండి చూస్తున్నవైతే తాత్కాలిక మైనవే, అదే అగుపించనివైతే నిత్యమైనవి.
\s5
\c 5
\p
\v 1 భూలోక నివాసులమైన మనం నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం తాత్కాలిక నివాసమే. చిరకాలం ఉండని డేరాలు చివికిపోయినట్టు, అది నశిస్తే, పరలోకంలో మనం నివసించటానికి దేవుడు ఒక శాశ్వత భవనం సిద్దం చేసాడు. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు.
\v 2 ఈ శరీరంతో ఉన్నంతకాలం శ్రమ అనుభవిస్తాం. శాశ్వతకాలం దేవునితో ఉండబోయే సమయంలో మనకు లభించే ఆ శరీరం కోసం తరచూ ఆశగా మూలుగుతున్నాం.
\v 3 ఎందుకంటే దేవుడు మనకు కొత్త దేహాలను ధరింప చేస్తున్నప్పుడు, అది మనకు నూతన వస్త్రధారణా సమయం.
\s5
\p
\v 4 అశాశ్వతమైన దేహాలలో జీవిస్తూ, పదే పదే మూలుగుతున్న మనం, దాని నుండి విడుదల కోరుకుంటున్నాం. అంతమాత్రాన శరీరం అక్కర్లేదు అని కాదు. పరలోకంలో మనకివ్వబోయే నూతన శరీరాలను స్వీకరించాలన్న కోరికే ఈ మూలుగంతా. ఏదో ఒక రోజు చావుకు లోనయ్యే ఈ దేహం అకస్మాత్తుగా మరెప్పటికీ మరణం లేని శరీరంగా మారిపోవాలని మా ఆశ.
\v 5 దీని కోసం మనల్నీ, మనకోసం నిత్య నూతన దేహాలనూ సిద్ధపరచినవాడు దేవుడే. అందుకు ఆయన తన ఆత్మను మనకు హామీగా ఇచ్చాడు.
\s5
\p
\v 6 దేవుని ఆత్మ మనలో నివాసం చేయడం వలన, మనకు నూతన దేహాలను ఆయన ఇస్తాడనే నమ్మకం ఎప్పుడూ తప్పక కలుగుతుంది. ఈ భూమిమీద, ఈ శరీరంలో మనం నివసిస్తున్నంత కాలం, పరలోకంలోని ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు.
\v 7 కంటికి కనిపించే వాటిని బట్టి కాక విశ్వాసంతోనే మనం నడచుకుంటున్నాము.
\v 8 ఈ దేహాన్ని విడిచి పెట్టి ప్రభువు దగ్గర నివసించడానికి ఇష్టపడుతున్నాం కాబట్టి ఆయన దగ్గర ఉన్నట్టే నిబ్బరంగా ఉన్నాం.
\s5
\v 9 అందుచేత దేహంలో ఉన్నా దేహాన్ని విడిచినా, ఆయనకు ఇష్టులంగా ఉండాలనేదే మా లక్ష్యం.
\v 10 మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి. ఎందుకంటే ప్రతివాడూ దేహంతో జరిగించిన వాటి ప్రకారం, అవి మంచివైనా చెడ్డవైనా, వాటికి తగినట్టుగా ప్రతిఫలం పొందాలి.
\s5
\p
\v 11 కాబట్టి మేము ప్రభువు పట్ల భయభక్తులంటే ఏంటో తెలిసిన వారంగా, ప్రజలకు ఆయన ఎలాంటి వాడో చెప్పి ఒప్పిస్తున్నాము. మేమేంటో దేవుడు స్పష్టంగా చూస్తున్నాడు. మీ మనస్సాక్షికి కూడా అది స్పష్టంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము
\v 12 మాకు మేమే దేవుని నిజమైన సేవకులమని మీ ఎదుట మళ్ళీ, మళ్ళీ మెప్పు కోసం ప్రయత్నించడంలేదు. హృదయంలో ఉన్న విషయాలను బట్టి కాక పై రూపాన్ని బట్టే అతిశయించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా, మేము ఎలాంటి వారమో మీకు అర్థం అవ్వాలనీ, మా విషయమై మీరు అతిశయించాలనీ భావిస్తున్నాము.
\s5
\v 13 కొంత మంది మాకు మతి తప్పింది అనుకుంటున్నారు. అయినా సరే, దేవుని మెప్పు తప్ప మరేదీ కోరం. ఇంకోవైపు నేను కటువుగా మాట్లాడుతున్నట్టూ, ప్రవర్తిస్తున్నట్టూ మీకు అనిపిస్తే అది కూడా మంచిదే. మీ మేలు కోరి అలా చేశామని మీకు అర్ధమైతే చాలు.
\v 14 క్రీస్తు అంటే మాకున్న ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తూ ఉంది. ఎలాగంటే, అందరి కోసం క్రీస్తు చనిపోయాడు కాబట్టి మనందరం ఆయనతోపాటూ చనిపోయామనే విషయం కచ్చితం.
\v 15 క్రీస్తు మరణించింది అందరికోసం. అందుకే, జీవిస్తున్న వారందరూ ఇక నుంచి తమ కోసం బతకకుండా, తమ పాపాలకోసం చనిపోయి, దేవుడు లేపగా సజీవంగా తిరిగి లేచిన క్రీస్తు కోసమే బతకాలి.
\s5
\p
\v 16 మాకోసం మేము ఇక మీదట బ్రతకం. ఈ కారణం చేత ఇప్పటి నుండి మేము ఎవరితోనూ ఈ లోక ప్రమాణాల ప్రకారం వ్యవహరించం. ఒకప్పుడు మేము క్రీస్తును ఈ లోక ప్రమాణాలనుబట్టే చూశాం. అయితే క్రీస్తును వెంబడిస్తూ ఉన్న మేము ఇకమీదట అలా వ్యవహరించం.
\v 17 కాబట్టి ఎవరైనా క్రీస్తుతో ఏకమై, విశ్వాసులై ఉంటే వారు కొత్త సృష్టి. పాతవన్నీ గతించి పోయాయి. చూడూ, నీలో దేవుడు సమస్తమూ కొత్తగా చేశాడు.
\s5
\v 18 ఈ బహుమతులన్నీ దేవుడే ఇచ్చాడు. ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని, మనం ఇక ఎన్నటికీ ఆయన శత్రువులం కాకుండా చేశాడు. క్రీస్తు సిలువ ద్వారా ఇప్పుడు మనకు దేవునితో శాంతి కలిగింది. దేవుడే సిలువ చెంతకు ప్రజలని తీసుకువస్తూ, తాను వారికి చేరువౌతూ ఆ సమాధాన పరచే బాధ్యతాయుతమైన సేవను మాకిచ్చాడు.
\v 19 క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు ఎలా లోకానికి శాంతిని ఏర్పాటు చేశాడన్నదే దేవుణ్ణి, ప్రజలను జతపరుస్తున్న సువార్త. దేవుడు వారి అతిక్రమాల్ని వారి మీద మోపడంలేదు. బదులుగా క్రీస్తు మన అతిక్రమాలను పరిహరించి శాంతి కర్తగా దేవుణ్ణి, ప్రజల్నీ ఏకం చేస్తున్నాడు.
\s5
\v 20 కాబట్టి మేము దేవుడు నిర్ణయించిన క్రీస్తు ప్రతినిధులం. దేవుడు మా ద్వారా మిమ్మల్ని బతిమాలుతున్నట్టే, మేమాయన తరపున మిమ్మల్ని బతిమాలుతున్నాము. క్రీస్తు ద్వారా ఆయనని మీతో శాంతి నెలకొల్పనియ్యండి. మిమ్మల్ని తన దగ్గరకు చేర్చుకోనివ్వండి.
\v 21 పాపమెరుగని యేసును మన సమస్త పాపాల నిమిత్తం, దేవుడు శిక్షించాడు. మన పాపాలన్నీ యేసే చేసినట్టుగా ఆయన్ని శిక్షించాడు. క్రీస్తుతో మనకున్న దగ్గరి బంధుత్వాన్ని బట్టి, మన పాప అపరాధం మన మీద ఇక లేదని ప్రకటించాడు.
\s5
\c 6
\p
\v 1 మేము దేవునితో కలిసి పనిచేస్తూ దేవుని ప్రేమను తేలికగా ఎంచవద్దనీ, కృపను వ్యర్ధం చేసుకో వద్దనీ, మిమ్మల్ని వేడుకొంటున్నాము.
\v 2 దేవుడు,
\q "నేను కరుణించిన సమయంలోనూ, కటాక్షించిన సమయంలోనూ మీ ప్రార్థన విన్నాను.
\q నేను రక్షణ కార్యం ముగించిన దినాన్న మీకు సాయం చేసాను." అని చెప్తున్నాడు.
\m చూడండి, దేవుడు కరుణను కుమ్మరిస్తున్నాడు. ఇది కరుణా సమయం, అనుకూల సమయం. ఇదే రక్షణ దినం.
\p
\v 3 ముఖ్యంగా మా సువార్త ప్రకటన అను మా సేవపై ఎవని వల్లా, ఎలాంటి నిందా పడకూడదని, ఏ విషయంలోనూ చెడు ప్రోత్సహించం.
\s5
\v 4 పదే పదే మేము అన్ని విషయాలలో దేవుని సేవకులమని మమ్మును మేము రుజువు చేసుకుంటూ ఉన్నాము. బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అన్ని కఠిన సమయాలలో ఓర్చుకున్నాము. గాయపరిచిన వారి మధ్య ధైర్యంగా నిలబడ్డాము.
\v 5 మమ్మల్ని విపరీతంగా కొట్టారు. మిగతా వారినైతే జైళ్లలో పడేశారు. మమ్మల్ని సాకుగా చూపించి అల్లరి మూకలు చెలరేగాయి. చాలా సార్లు సుదీర్ఘమైన నిద్ర లేని రాత్రులు గడిపాము. నామ మాత్రంగా ఆహారం దొరికేది. విపరీతమైన కాయ కష్టం చేయాల్సి వచ్చేది. అయినా ఎంతో సహనం చూపాం.
\v 6 అయినప్పటికీ వీటన్నిటిలో స్వచ్ఛంగా ఉన్నాం. స్థిరమైన జ్ఞానం కలిగి, మా ఈ శ్రమలన్నిటిలో దేవుడనుగ్రహించు విడుదల కోసం దీర్ఘశాంతంతో ఎదురు చూడగలుగుతున్నాం. మాపై ఉన్న క్రీస్తు దయ అంతా ఇంతా కాదు. నిండైన పరిశుద్ధాత్మతో, ఇతరులపై నిష్కపటమైన ప్రేమ చూపిస్తున్నాం.
\v 7 దేవుని సత్యవాక్య క్రమంలో నడుస్తూ, ఆయనచే శక్తిని పొందుతున్నాం. క్రీస్తు వలన దేవుడు, మమ్మల్ని తనతో సమాధాన పరచుకున్నాడు. నిరంతరం మేము నమ్ముతున్న సత్యమిదే. ఇది ఒక సైనికుడు, కవచం ధరించి, కుడి ఎడమల రెండు చేతుల్లోనూ ఆయుధాలతో ఉన్నట్టు.
\s5
\v 8 ఘనతలో ఘనహీనతలో, అపవాదుల్లో ప్రశంసల్లో మేము ఒకేలా పని చేస్తున్నాం. మేము యథార్థవంతులమే, అయినా మోసం చేస్తున్నామనే నింద మా మీద ఉంది.
\v 9 అనామకుల్లాగా మేము ఉంటున్నా, కొద్దిమందికి మేమేమిటో తెలుసు, వారి మధ్య సుప్రసిద్ధులమే. క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటిస్తున్నందుకు, కొంతమంది మమ్మల్ని, అన్యాయంగా చంపాలని చూశారు. చట్టప్రకారం మాలో మరణదండనకు తగిన నేరం ఎవరూ కనుగొనలేదు.
\v 10 మా జీవనమంతా ఏడుపే కానీ ఎప్పుడూ ఆనందిస్తూనే ఉన్నాం. దరిద్రులంగా కనబడుతున్నా, మాలో ఉన్న సువార్త అనే నిధి సాయంతో అనేకమందిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాం. ఏమీ లేని వాళ్ళంగా కనబడుతున్నా, నిజానికి అన్నీ ఉన్నవాళ్ళమే.
\s5
\p
\v 11 కొరింతులో ఉన్న మా తోటి విశ్వాసులారా, సత్యం సంపూర్ణంగా మీకు వివరించాం, విశాల హృదయంతో, ధారాళమైన ప్రేమ చూపించాం,
\v 12 మీ విషయంలో ఏమాత్రం సంకుచితంగా లేము. అయినా, మమ్మల్ని ప్రేమించడానికి మీరెందుకో అయిష్టంగా కనబడుతున్నారు.
\v 13 మేము చేసినట్టే మీరూ చేయండి. మీ ప్రేమను ఆశిస్తున్నాను. నా పిల్లలకు చెప్పినట్టు చెబుతున్నాను.
\s5
\v 14 క్రీస్తును నమ్మని అవిశ్వాసులతో మీరు జతకట్టి, విశ్వాసులకు తగని పనులు చేయొద్దు. తమకు తోచినట్టు ఉంటూ, దేవుని ధర్మాన్ని లెక్క చేయని వాళ్ళతో, ఆయన ప్రమాణాలూ, నియమాలే శ్వాసగా ఉంటున్న వాళ్లకీ పోలికే లేదు. చీకటి, వెలుగులు కలిసుండే ప్రసక్తే లేదు.
\v 15 భూతంతో క్రీస్తు ఏ రకంగానూ సమ్మతించడు. దేవుని నమ్మిన వాడికి, నమ్మని వాడితో ఎలాటి సహచర్యమూ ఉండదు.
\v 16 దేవుని ఆలయానికి విగ్రహాలు తేకూడదు. మన దేహాలే జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు.
\q "నేను నా ప్రజలలో నివసిస్తాను.
\q నేను వారి మధ్యలో సంచరిస్తాను.
\q నేను వారి దేవుడుగా ఉంటాను.
\q వారు నా ప్రజలుగా ఉంటారు."
\s5
\p
\v 17 కాబట్టి, మీరు అవిశ్వాసుల మధ్యనుండి బయటికి వచ్చి,
\q ప్రత్యేకంగా ఉండండి, అని ప్రభువు చెబుతున్నాడు.
\q "మీరు నన్ను ఆరాధించకుండా మిమ్మల్ని అసమర్ధులను చేసే అపవిత్రమైనది ఏదీ దరి చేర నివ్వకండి.
\q నేను మిమ్మల్ని మనసారా చేర్చుకుంటాను,
\q1
\v 18 మీకు తండ్రిగా ఉంటాను,
\q1 మీరు నాకు కొడుకులుగా కూతుళ్ళుగా ఉంటారు
\m అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు.
\s5
\c 7
\p
\v 1 ప్రియులారా, మనకు దేవుడు చేసిన ఈ వాగ్దానాలు ఉన్నాయి, కాబట్టి మనం శరీరంతో చేసే పనులైనా, మనసులో ఉద్దేశించిన విషయాలైనా దేవుణ్ణి ఆరాధించడానికి అడ్డుపడుతుంటే వాటిని మానుకోవాలి. దేవుని మీద భయభక్తులతో, ఆయన సన్నిధిలో వణుకుతూ మన దేహాలకీ, మనసులకీ మురికి అంటకుండా ఉండాలని ప్రయత్నిద్దాం.
\s5
\v 2 మమ్మల్ని మీ హృదయాల్లో చేర్చుకోండి. మా గురించి మీరు ఎలాంటి విషయాలు విన్నారో తెలీదు, అయినా మేమెవరికీ ఏ హాని చేయలేదు. ఎవరికీ అపకారం తలపెట్టలేదు. ఎవరినీ స్వార్థానికి వినియోగించుకోలేదు.
\v 3 మీమీద నింద మోపాలని నేనిలా అనడం లేదు. మీరు మా హృదయాల్లో ఉన్నారు. మీతో పాటు చావడానికైనా జీవించడానికైనా సిద్ధంగా ఉన్నామని నేను ముందే చెప్పాను.
\v 4 నేను మిమ్మల్ని ప్రేమించడం మాత్రమే కాదు మీ గురించి నేనెంతో గర్విస్తున్నాను. మాకెన్ని బాధలున్నా సరే, మిమ్మల్ని బట్టి ఆనందంతో పొంగి పోతున్నాను.
\s5
\p
\v 5 మేము మాసిదోనియలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మా శరీరాలకు ఎంత మాత్రం విశ్రాంతి దొరకలేదు, అలిసిపోయాం. అన్నివైపులా మాకు కష్టాలే. బయటివారి వల్ల ఎన్నో తిప్పలు పడ్డాం. చాలా విషయాలు భయపెట్టాయి.
\v 6 కానీ కృంగినప్పుడల్లా ఆదరించే దేవుడు, తీతు రాక ద్వారా మమ్మల్ని ఆదరించాడు.
\v 7 తీతు రాక వలన మాత్రమే కాక, అతడు మీ దగ్గర ఉన్నప్పుడు పొందిన ఆదరణ వలన కూడా దేవుడు మమ్మల్ని భాగ్యవంతుల్ని చేసాడు. మాపై ఉన్న మీ అభిమానం, మా శ్రమలనుబట్టి మా పట్ల మీ దుఃఖం, మరి ముఖ్యంగా నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తి మాకు తెలియజేశాడు. కాబట్టి నేను మరెక్కువగా ఆనందించాను.
\s5
\p
\v 8 నా లేఖ మీకు దుఃఖం కలిగించినా, అది రాయక తప్పలేదు. రాస్తున్నప్పుడు చింతించాను, కానీ రాసిన విషయాలు క్రైస్తవ సమాజంలో ఉన్న ఇబ్బందులను ఎదుర్కోవడానికి మీకు చాలా ఉపయోగపడతాయి. మీ ఈ చింత ఎక్కువ కాలం ఉండబోదని నాకు తెలుసు.
\v 9 కాని ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది. మీరు నా లేఖ చదివి విచారించినందుకు కాదు గానీ, మీ విచారం మిమ్మల్ని ఆయాసపెడుతున్న పాపం నుండి మీరు విముఖులై పశ్చాత్తాపపడేలా చేసింది. దీన్నిబట్టి మీరు దైవిక విచారాన్ని అనుభవించారు. అందువలన పోగొట్టుకున్న దానికంటే పొందినదే ఎక్కువ.
\v 10 ఈ విధమైన దైవిక విచారం పశ్చాత్తాపాన్ని తెస్తుంది. దాని వలన ఒకడు పాపం నుండి దూరంగా పోతాడు, ఆపై అతనికి దేవుని రక్షణ లభిస్తుంది. చివరకు ప్రజలు సంతోషిస్తారు. ఇంకోవైపు ప్రకృతి సంబంధమైన చింత, పాపం వలన వచ్చిన దుఃఖం. ఇందులో చిక్కుబడిన వారిని మరణానికే తీసుకెళుతుంది.
\s5
\v 11 దేవుని వలన కలిగిన ఈ దుఃఖం ఇప్పుడు ఎంత మేలు చేసిందో చూడండి. నాకు మీరు నిర్దోషులమని తెలియ చెప్పాలనుకున్నారు. ఆ నేరారోపణ వల్ల మీరెంతో వ్యసనపడ్డారు. ఎలా అతను ఇంత పాపానికి ఒడిగట్టాడూ, అని మీరు కలత చెందారు. తప్పక న్యాయం జరగాలనే ఆశ మీలో కలిగింది. దైవిక విచారం మీలో ఎలాంటి పట్టుదల తెచ్చిందో చూడండి. మొత్తానికీ ఆ విషయంలో అన్ని విధాలుగా మీరు నిర్దోషులని నిరూపించుకున్నారు.
\v 12 నేను మీకు రాసినా ఆ చెడ్డ పని చేసినవాడి కోసం రాయలేదు. వాడి వలన అన్యాయం పొందిన వాడి కోసం కూడా రాయలేదు. మాపట్ల మీకున్న నమ్మకత్వం దొడ్డదని తెలియ చెప్పేందుకే రాశాను. మాపై మీకున్న నమ్మకం దేవునికి తెలుసు.
\s5
\p
\v 13 వీటన్నిటితో మాకెంతో ప్రోత్సాహం లభించింది. అంతే కాదు, తీతు పొందిన ఆనందం ద్వారా మాకు మరెక్కువ ఆనందం కలిగింది. ఆయనకు మీరు విశ్రాంతినిచ్చారనీ, సాయపడ్డారనీ తీతు మాతో అన్నాడు.
\v 14 ఎందుకంటే నేనతనికి మీ గురించి గొప్పగా చెప్పిన విషయాల్లో, అతను మీదగ్గరకు వచ్చినపుడు మీరు నన్ను సిగ్గుపరచలేదు. మేము మీ గురించి తీతుకు గొప్పగా చెప్పినదంతా వాస్తవమని మీరు రుజువు చేశారు.
\s5
\v 15 మీరు ఎంత ఆసక్తిగా దేవుణ్ణి వెంబడిస్తున్నారో స్వయంగా చూసిన తీతు మీరు అతన్ని చేర్చుకొని విధేయత చూపిన సంగతి జ్ఞాపకం చేసుకున్నపుడు, దేవుని పవిత్రతనుబట్టి మీరు భయంతోనూ, దేవుని ఘనతనుబట్టి అతనిని వణుకుతోనూ చేర్చుకున్నారనీ అతనికి మీ పట్ల ప్రేమ అధికమయ్యింది.
\v 16 ప్రతి విషయంలో మీ గురించి నాకు ఉన్న నమ్మకాన్ని బట్టి నేను ఆనందభరితుడినయ్యాను.
\s5
\c 8
\p
\v 1 సోదరీ సోదరులారా, మాసిదోనియ సంఘాలలో ప్రీతిగా దేవుడు జరిగిస్తున్న పనులూ, వారి మధ్య అద్భుతమైన రీతిలో ఆయన చూపిన కృపను గూర్చి మీకు తెలియాలని అనుకుంటున్నాం.
\v 2 అక్కడి విశ్వాసులు ఎన్ని కఠిన పరీక్షలు ఎదురైనా సంతోషంగా నిలిచారు. కడుపేద వారైనప్పటికీ యెరూషలేము విశ్వాసుల కోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని సేకరించారు.
\s5
\v 3 ఇవ్వగలిగినంతా ఇచ్చారు, అందుకు నేనే సాక్ష్యం. కొంతమందైతే తమ అక్కర పక్కనపెట్టి, ఎలాగైనా సాయపడాలని త్యాగపూరితంగా ఇచ్చారు.
\v 4 పరిశుద్ధుల సేవ నిమిత్తం సేకరిస్తున్నప్పుడు, ఆ పనిలో తమకు కూడా భాగం ఇవ్వాలని మరీ మరీ బతిమాలారు. ఇలా చేసి దేవుడు తన కోసం ప్రత్యేకించుకున్న ఆ సహ విశ్వాసులకు సాయపడగలమని భావించారు.
\v 5 వారు ఇలా ఇవ్వగలుగుతారని మేము తలంచనేలేదు. కానీ వారు మొదట ప్రభువుకూ, తరువాత దేవుని సంకల్పం వలన మాకూ తమను తామే అప్పగించుకున్నారు.
\s5
\p
\v 6 కాబట్టి సహాయపడడం కోసం చేస్తున్న ధన సమీకరణను మీ దగ్గర తీతు ఇప్పటికే మొదలు పెట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నందున ఈ కృపా పరిచర్యను తుదమట్టుకూ చేపట్టమని మేము అతన్ని కోరాము.
\v 7 మీరు ప్రతి విషయంలో అంటే దేవుని పట్ల విశ్వాసంలో, ఉపదేశాన్ని స్వీకరించే విషయంలో, జ్ఞాన సముపార్జనలో, మొదలు పెట్టిన పని చివరి వరకూ శ్రద్ధగా చేయడంలో, ధైర్యం చెప్పడంలో, అంతటిలో మీకు మా పట్ల ఉన్న ప్రేమలో ఎలా రాణిస్తున్నారో అలానే మీరు ఈ కృపా పరిచర్యలో కూడా తప్పక రాణించండి.
\s5
\p
\v 8 ఆజ్ఞలా మీతో చెప్పడం లేదు. కానీ సహాయ కార్యక్రమాలలో ఇతరుల శ్రద్ధాసక్తులు మీకు తెలియజేసి, వారికంటే మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షిస్తున్నాను.
\v 9 మీకు మన యేసు క్రీస్తు ప్రభువు దయ తెలుసు గదా? ఆయన సమస్తమూ కలిగి ఉండీ తన పేదరికం వలన మీరు ధనవంతులు కావాలని, మీ కోసం తన సమస్తాన్ని ఇచ్చి పేదవాడయ్యాడు.
\s5
\v 10 ఈ విషయంలో మిమ్మల్ని ప్రోత్సాహపరిచే సలహా ఇస్తాను. ఏడాది క్రితం ఈ పని చేయాలని ఎంతో ఆతురతతో మొదలు పెట్టారు.
\v 11 కాబట్టి మీరిప్పుడు ఆ పని త్వరపడి పూర్తి చేయండి. పని చేయాలనే ఆశ, ఉత్సాహం అప్పుడు మీకెలా ఉన్నాయో ఆ విధంగానే వీలైనంత త్వరగా మీరిప్పుడు దాన్ని ముగింపుకు తీసుకు రండి.
\v 12 అసలు ఈ పని చేయాలనే శ్రద్ధ ఉంటే దేవుని ఆమోదం తప్పక దొరుకుతుంది. మీకున్న దాన్ని బట్టి దానం చేసి ఈ పనిని తప్పక పూర్తీ చేయండి. ఒక వ్యక్తి, తనకున్న దాన్ని బట్టే గానీ లేని దాన్ని బట్టి చేయలేడు.
\s5
\v 13 ఇతరుల బాధ ఉపశమనం చేసి మీకు భారంగా ఉండాలని ఇలా చెప్పడం కాదు కానీ, ఇతరులను ఆదుకోవడం మంచిదని మా ఉద్దేశ్యం.
\v 14 ప్రస్తుతం మీ సమృద్ధి వారి అవసరానికీ మరొకప్పుడు వారి సమృద్ధి మీ అవసరానికీ ఉపయోగపడాలని ఇలా చెబుతున్నాను.
\v 15 పవిత్ర లేఖనాల లో
\q "ఎక్కువ ఉన్న వాడికి ఏమీ మిగల్లేదు.
\q1 తక్కువ ఉన్న వాడికి కొదువ లేదు” అని రాసి ఉంది.
\s5
\p
\v 16 మీ పట్ల నాకున్న ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి వందనాలు.
\v 17 అతడు మా విన్నపాన్ని అంగీకరించడమే గాక దాని గురించి ఎంతో ఆసక్తితో తన ఇష్టప్రకారమే మీ దగ్గరికి వస్తున్నాడు.
\s5
\v 18 క్రైస్తవ సంఘాలన్నిటిలో సువార్త ప్రకటించే పనిలో ప్రసిద్ధి చెందిన సోదరుణ్ణి అతనితో పంపిస్తున్నాం. సువార్త చక్కగా ఉపదేశిస్తున్నందున సంఘాలన్నీ అతన్ని మెచ్చుకుంటున్నాయి.
\v 19 క్రైస్తవ సమాజంలోని విశ్వాసులందరూ అతన్ని మాకు తోడుగా యెరుషలేము వరకూ వెళ్ళమనీ, మీరూ ఇంకా ఇతరులూ ఇచ్చిందంతా అక్కడివారికి ఇవ్వడంలో సాయపడమనీ అడిగారు. ఈ విరాళం ద్వారా విశ్వాసులమైన మన మధ్య సహాయ సహకారాలు పదిమందికీ తెలిసేలా, దేవుడిని ఘనపరిచేలా వుండాలని మా అభీష్టం.
\s5
\p
\v 20 మీ దాతృత్వాన్ని బట్టి మేము సేకరిస్తున్న ఈ విరాళాల విషయంలో ఎవరూ మమ్మల్ని విమర్శించకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నాం.
\v 21 ఎందుకంటే ప్రభువు దృష్టిలోనే కాక మనుషుల దృష్టిలో కూడా గౌరవించదగిన వాటినే చేయాలని, దాపరికం లేని యోగ్యమైన మార్గాన్ని ఎంచుకోవడంలో మేము జాగ్రత్త పడుతున్నాం.
\s5
\v 22 వారితో కూడా మరొక సోదరుణ్ణి మేము పంపుతున్నాం. అతన్ని చాలా విషయాల్లో చాలా సార్లు పరీక్షించి, ఆసక్తి గలవాడని గ్రహించాం. అతనికి మీమీద నమ్మకం కుదిరింది. అతడిప్పుడు మరింత ఆసక్తితో ఉన్నాడు.
\v 23 తీతు విషయంలోనైతే, అతడు నా సేవలో భాగస్థుడు, మీ విషయంలో నా జత పనివాడు. మన ప్రాంతంలోని క్రైస్తవ సంఘాలు మాతో యెరూషలేము ప్రయాణానికి ఎంపికచేసిన సోదరులయితే అందరి మన్ననలు పొందుతూ క్రీస్తుకు మహిమ తెచ్చేవారిగా ఉన్నారు.
\v 24 కాబట్టి వారికి మీ ప్రేమ చూపించండి. ఇతర సంఘాల్లో మీ గురించి మేము ఎందుకు గొప్పగా చెప్పకుండా ఉండలేకపోయామో వారికి రుజువు చేయండి.
\s5
\c 9
\p
\v 1 దేవుడు తనకోసం ప్రత్యేక పరుచుకున్న యెరూషలేములోని పరిశుద్ధుల కోసమైన ఈ ద్రవ్య సేకరణ గురించి ఇంతకంటే ఎక్కువ నేను మీకు రాయనవసరం లేదు.
\v 2 ఇతరులకు సాయం చేయడానికి మీకున్న ఆసక్తి నాకు తెలుసు. దాన్ని గురించి మాసిదోనియ ప్రజల ముందు మిమ్మల్ని పొగిడాను గదా! పోయిన సంవత్సరం నుండి అకయ ప్రాంతం వారు సిద్ధంగా ఉన్నారని వారికి చెప్పాను. మీ ఆసక్తి వారిలో చాలా మందిని ఈ విరాళాలకోసం ప్రోత్సహించింది.
\s5
\v 3 మాకంటే ముందుగా మేము పంపిస్తున్న సహోదరులు మిమ్మల్ని కలిసినపుడు మీ గురించి మేము గొప్పగా చెప్పిన సంగతులు అక్షర సత్యాలని తెలుసుకుంటారు. ఈపాటికే విరాళసేకరణ పూర్తి చేసి నేను చెప్పినట్టు మీరు సిద్దంగా ఉంటే ఇంకొకళ్ళకి నేను ఇచ్చిన మాట వ్యర్థం కాకూడదనీ సోదరులను పంపాను.
\v 4 ఒకవేళ నా ప్రయాణం కాస్త ఆలస్యమైతే మాసిదోనియ వారెవరైనా నాతో వచ్చే అవకాశం ఉంది. వారు వచ్చి, ఇస్తామని మీరు చెప్పినదానికి పూర్తి సిద్ధంగా లేరని, ఏదో కొంచమే సిద్ధం చేశారనీ తెలుసుకుంటే మీకే కాదు, మీ మీద ఇంత నమ్మకం ఉంచిన మాకు కూడా అవమానం.
\v 5 అందుచేత సోదరులు ముందుగానే మీ దగ్గరికి వచ్చి పూర్వం మీరు వాగ్దానం చేసిన విరాళం పోగుచేయడంలో మిమ్మల్ని ప్రోత్సహించడం అవసరమని నేను భావించాను. అప్పుడు మీ విరాళం మా బలవంతం మీద ఇచ్చినట్టు కాకుండా మీకై మీరు స్వచ్ఛందంగా ఇచ్చినట్టు ఉంటుందని నేను నమ్ముతున్నాను.
\s5
\p
\v 6 "కొద్దిగా చల్లేవాడు కొద్ది పంట కోస్తాడు. విస్తారంగా చల్లేవాడు విస్తారమైన పంట కోస్తాడు." అలాగే మీరు కొద్ది సాయమే చేశారనుకోండీ దేవుని నుండి కొద్దిపాటి దీవెనలే పొందుతారు అనీ, అదే మనఃపూర్వకంగా, ఉత్సాహంగా ఇచ్చారనుకొండీ దేవుని అనేక దీవెనలు స్వీకరిస్తారనీ దీన్ని బట్టి చెప్పవచ్చు.
\v 7 సణుక్కోకుండా బలవంతం లేకుండా తన హృదయంలో మొదట నిశ్చయించుకున్న ప్రకారం ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. అప్పుడు ఒకరి ఒత్తిడివల్ల ఇవ్వాల్సి వస్తోందన్న భావన ఉండదు. హృదయంలో ఎలాటి విచారం లేకుండా ఆ పని చేయగలుగుతారు. ఎందుకంటే, దేవుడు ఉత్సాహంగా ఇచ్చే వ్యక్తిని ప్రేమిస్తాడు.
\s5
\v 8 నానా విధాలుగా దేవుడు మీకు నజరానాలు ఇతోధికంగా ఇస్తాడు. అందువల్ల మీరు కొరత లేకుండా ఉండడమే కాకుండా చాలినన్ని మంచిపనులు చేయగలుగుతారు.
\v 9 దీని గురించి
\q "అతడు ఉద్దేశించిన సంగతులు సర్వత్రా శుభాలే.
\q అతడు వారి అక్కర కొద్దీ తన సంపద దరిద్రులకు పంచి ఇచ్చాడు.
\q అతని పనులు ఎప్పటికీ నిలిచి ఉంటాయి” అని లేఖనంలో రాసి ఉంది.
\s5
\p
\v 10 విత్తనాలు చల్లేవారికి విత్తనాన్నీ భోజనం సిద్దపరిచేవాడు తినడానికి ఆహారాన్నీ దయచేసే దేవుడు, మీకు విత్తనాన్ని దయచేసి ఇతరుల అవసరాలు తీర్చగలిగేంతగా వృద్ధి చేస్తాడు.
\v 11 అనేక విధాలుగా దేవుడు మిమ్మల్ని భాగ్యవంతుల్ని చేస్తాడు. ఆ కారణాన మీలో దాతృత్వం పరిమళిస్తుంది. పొందిన వారందరూ మా పని ద్వారా దేవుడు మీలో వెల్లడించిన ఔదార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్తారు.
\s5
\p
\v 12 అక్కరలో ఉన్న క్రైస్తవ సహోదరీ సహోదరుల కోసం మాత్రమే కాక పెద్ద సంఖ్యలో విశ్వాసులు సైతం దేవునికి కృతజ్ఞత చెప్పేటట్లు ఈ ద్రవ్య సేకరణను అంగీకరించాము.
\v 13 మీరు ఆరంభించిన ఈ సేవ ద్వారా మీ యోగ్యత కనబడుతుంది. దేవుడు పలికిన క్రీస్తు సువార్తను ఒప్పుకొని ఆయనకి విధేయులై, ఇంత ఉదారంగా అందరికీ పంచిపెట్టడం బట్టి, మీరు కూడా దేవుణ్ణి మహిమ పరుస్తారు.
\v 14 మీ ద్వారా పొందిన వారు మీ పట్ల దేవుడు కనపరచిన అత్యధికమైన కృపను చూసి, వారు మీ కోసం ప్రార్థన చేస్తూ, మిమ్మల్ని చూడాలని ఎంతో కోరికతో ఉన్నారు.
\v 15 వర్ణింప శక్యం గాని దేవుని బహుమానానికి ధన్యవాదాలు.
\s5
\c 10
\p
\v 1 పౌలు అనే నేను క్రీస్తులో ఉన్న సాత్వీకంతో, మృదుత్వంతో మీకు స్వయంగా విన్నపం చేస్తున్నాను. ఆయనే నన్ను ఈ రీతిగా మలిచాడు. మీతో ఉన్నపుడు దీనునిగా సంకోచిస్తూ ఉన్న నేను, దూరాన మీరు లేనపుడు జంకూ గొంకూ లేకుండా ఈ లేఖ రాస్తూ ప్రబలమైన ధైర్యంతో ఉన్నాను.
\v 2 మేము శరీరానుసారంగా నడుస్తున్నామని కొందరంటున్నారు. అలాంటి వారితో నేను విభేదించి ధైర్యంతో వ్యవహరించాలని అనుకుంటున్నాను. అయితే మీతో ఉన్నపుడు నేనలా ఉండకుండాా చేయమని మిమ్మల్ని బతిమాలుతున్నాను.
\s5
\v 3 మేము శరీరంతో జీవిస్తున్నా యుద్ధ సమయంలో సైనికులు శరీరానుసారంగా పోరాడుతున్నట్టు శరీర నియమాలతో పోరాటం చేయం.
\v 4 మేము యుద్ధం చేస్తున్నప్పుడు వాడే ఆయుధాలు ఈ లోక సంబంధమైనవి కావు. మనుషులచే చేయబడినవి అంతకంటే కావు. దేవునిచే అనుగ్రహించబడినవి. ఈ ఆయుధాలు అత్యంత శక్తివంతమైనవి, మనుషుల్ని పక్కదోవ పట్టించే కపట తర్కాలను ఓడించే దైవ శక్తి వాటికి ఉంది.
\s5
\v 5 ఈ విధంగా ఈ ఆయుధాలతో దేవుని జ్ఞానాన్ని అడ్డగించే తప్పుడు వాదాలతో కూడిన ప్రతి ఆటంకాన్నీ నాశనం చేయగలం. దేవుని గూర్చిన అనుభవజ్ఞానం నుండి ప్రతి వానినీ దూరం చేసేవే ఈ తర్కాలు. దేవుడు అలాంటి ప్రతి ఆలోచననూ అవిధేయతనూ పట్టి వశపరచుకున్నప్పుడు వారు వెనుతిరిగి క్రీస్తుకు లోబడేలా చేస్తున్నాడు.
\v 6 మీ అంతట మీరే క్రీస్తుకు విధేయులైన పిదప మిగిలిన వారి అవిధేయతంతటినీ శిక్షించడానికి సిద్ధపడి ఉన్నాం.
\s5
\p
\v 7 మీ ముందున్న వాస్తవాలను స్పష్టంగా చూడండి. మీలో ఎవరికైనా విశ్వాసం ఉండి, తాను క్రీస్తు వాడినని నమ్మకం కుదిరితే, అతనెలా క్రీస్తువాడో మేము కూడా అలానే క్రీస్తు వారిమని తాను గుర్తుంచుకోవాలి.
\v 8 మీ నాశనం కోసం కాక మిమ్మల్ని కట్టడానికే అపోస్తలుడుగా ఉండడానికి ప్రభువు ఇచ్చిన అధికారాన్ని గురించి నాకై నేను కాస్త ఎక్కువ అతిశయంగా చెప్పుకోవడం మీకు అతిగా అనిపించినా సిగ్గుపడను.
\s5
\v 9 నేను రాసే ఉత్తరాలు చదువుతున్నప్పుడు కాస్త కఠినంగా ఉన్నప్పటికీ అవి మిమ్మల్ని భయపెట్టేలా ఉండకూడదు. అలా మీరు భయపడాలని నేను ఆశించ లేదు.
\v 10 నన్నెరిగిన కొందరు నా ఉత్తరాలు చదివి ఇలా అంటారు, "అతని ఉత్తరాలు గంభీరంగా బలీయంగా ఉన్నాయి అశ్రద్ధ చేయడం మంచిది కాదు, కానీ పౌలు మనతో ఉన్నప్పుడు అతని శరీరం బలహీనంగానూ, మాటలు చప్పగానూ ఉంటాయి."
\s5
\v 11 అలాంటి వారు తెలుసుకోవలసింది ఏంటంటే మేము మీతో లేనపుడు ఉత్తరాల్లో రాసిన ప్రకారం ఏమి చెప్పామో మేము మీతో ఉన్నప్పుడూ అలానే ప్రవర్తిస్తాము.
\p
\v 12 తమను తామే మెచ్చుకొనే వారిలో ఒకరిగా ఉండడానికి గానీ వారితో పోల్చుకోడానికి గానీ మేము తెగించం. అయితే వారు తమకు తాము ఒకరిని బట్టి మరొకరు బేరీజు వేసుకుంటూ ఒకరితో ఒకరు పోల్చుకుంటూ ఉంటే వారు తెలివిలేని పని చేస్తున్నారు అనడానికి అదే రుజువు.
\s5
\v 13 మేమైతే దేవుడు మాకు అనుగ్రహించిన స్థాయికి మించి అతిశయపడం. మిమ్మల్ని చేరగలిగేలా దేవుడు మాకు ఏ పని నిర్దేశిస్తే అదే చేస్తాం. ఏది ఏమైనా మీరు దేవుడు మాకిచ్చిన పనిలో భాగస్తులే.
\v 14 మేము మీ దగ్గరికి వచ్చినపుడు దేవుడు మాకు అనుగ్రహించిన పని మట్టుకే చేస్తూ అంతకు మించి మా హద్దులు మీరలేదు. క్రీస్తు సువార్త మోసుకుంటూ మీ దాకా మొట్టమొదట వచ్చింది మేమే.
\s5
\v 15 మేము మా హద్దు మీరి ఇతరుల కష్ట ఫలంలో మాకు వంతు ఉన్నట్టూ, ఆ పని మేమే చేసినట్టూ అతిశయపడము. అయితే మీ విశ్వాసం అభివృద్ధి అయ్యే కొద్దీ మా పరిధిలో మా కర్తవ్య నిర్వహణా భాద్యత ఇంకా ఎక్కువ అవుతుందని ఆశిస్తున్నాము.
\v 16 మీకు అవతల ఉన్న ప్రాంతాల్లో కూడా మీ ద్వారా సువార్త ప్రకటించాలనీ మా ఆశ. దేవుని సేవకులు తమ పరిధిలో చేస్తున్న పని గురించి మేమే దాన్ని జరిగించినట్టూ, మాకే పేరు రావాలన్నట్టూ అతిశయించం.
\s5
\v 17 అయితే,
\q "అతిశయించేవాడు ప్రభువులోనే అతిశయించాలి." అని పవిత్ర లేఖనాలు చెప్తున్నాయి.
\p
\v 18 ప్రభువు మెచ్చుకొనే వాడే యోగ్యుడు. అతనికి దేవుని బహుమానం ప్రాప్తిస్తుంది. గానీ తనను తానే మెచ్చుకొనేవాడు యోగ్యుడు కాడు. అతనికి దేవునిచే మెప్పు కలుగదు.
\s5
\c 11
\p
\v 1 తన గొప్ప తాను చెప్పుకోవడం బుద్ధి హీనతే. నేను ఇప్పుడు చేస్తున్నది అదే. నా బుద్దిహీనతను మరి కొంత కాలం దయతో సహించమని కోరుతున్నాను, నిజానికి మీరు సహిస్తూనే ఉన్నారు.
\v 2 మీకు కావలి కాస్తూ దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని పదిలంగా చూసుకుంటాడో అలాగే నేనూ చూసుకోవాలనుకొంటున్నాను. ఒక తండ్రికి ఉన్నట్లు మీ పట్ల నాకు దైవిక రోషం ఉంది. ఎందుకంటే వివాహ బంధంలో పవిత్ర కన్యగా ఒక్క భర్తకే, అంటే క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను.
\s5
\v 3 అయితే, ఆలోచించే కొద్దీ ఎవరైనా మిమ్మల్ని కుయుక్తిగా తప్పుదోవ పట్టిస్తున్నారేమో అని భయం వెంటాడుతోంది. సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీరూ ఎవని మోసంలోనైనా చిక్కినపుడు, క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి మీ మనసులు తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.
\v 4 ఎందుకంటే ఎవరైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాక మరొకరిని ప్రకటించినా, లేక దేవునినుండి మీరు పొందని వేరొక ఆత్మను పొందాలని బోధించినా , మీరు మొదట విన్న సువార్తకు భిన్నంగా వేరొక సువార్త మీకు వినిపించినా, మీరు వాటిని ఖండించక బాగానే సహిస్తున్నారు.
\s5
\v 5 పైగా గురువులుగా చెలామణీ అవుతున్న అలాంటి వారికి ప్రజలు గొప్పతనం అంటగడుతున్నప్పుడు, ఆ "గొప్ప అపొస్తలుల” కంటే నేనేమాత్రం తక్కువ వాణ్ణి కానని అనుకుంటున్నాను.
\v 6 అద్భుతమైన ప్రసంగాలు చేయడంకోసం నేనెప్పుడూ తర్ఫీదు పొందలేదు. అయితే దైవ జ్ఞానం మెండుగా వుందని మాత్రం నికరంగా చెప్పగలను. నా మాటల్ని బట్టి మీరు ఆ విషయం గ్రహించే ఉంటారు.
\s5
\p
\v 7 మీకు దేవుని సువార్త ఉచితంగా ప్రకటిస్తూ మిమ్మల్ని హెచ్చించడానికి నన్ను నేనే తగ్గించుకొని తప్పు చేశానా?
\v 8 ఇతర విశ్వాస సమాజాల ధన సహాయంతో మీకు సేవ చేయగలిగాను. వారి నుంచి పైకం తీసుకుని, నేను ఒక విధంగా ఆ సంఘాలను దోచుకున్నాను. చిల్లి గవ్వ కూడా మీ దగ్గర ఆశించలేదు.
\v 9 నేను మీతో ఉన్నప్పుడు నాకు అక్కర కలిగితే మీలో ఎవరి మీదా భారం మోపలేదు. మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చిన సోదరులు నా అవసరాలు తీర్చారు. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండాా చూసుకున్నాను. ఇంకా అలానే చేస్తూ ఉంటాను.
\s5
\v 10 క్రీస్తును గూర్చిన సత్యం సంపూర్ణంగా ప్రకటించడమే కాక ఆయనకి నేను చేస్తున్న సేవ కూడా వివరిస్తున్నాను. అకయ ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఈ విషయాన్ని సాంతం గ్రహించేలా చేస్తాను.
\v 11 మీ ధనాన్ని ముట్టుకోనంత మాత్రాన మిమ్మల్ని ద్వేషిస్తున్నానని కాదు. నిజంగా అలాంటి ఆలోచనకి తావివ్వకండి. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో దేవునికే ఎరుక.
\s5
\p
\v 12 మీ సేవలో ఇలాగే ఎడతెగక ఉంటూ కొందరిని నిరోధిస్తాను. ఎందుకంటే, కొందరు సేవ విషయాల్లో మాలాగే మాతో సమానులై ఉన్నట్టు అనిపించుకోవాలని లేనిది ఉన్నట్టు పై పై మెరుగులతో తమని తాము హెచ్చుగా చూపించు కుంటున్నారు. అలాంటి వారిని క్షమించేది లేదు.
\v 13 అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు. దేవుడిచేత పంపబడ్డామని చెప్పుకుంటూ తిరుగుతున్న మోసకారి సేవకులు. అబద్దాలనే ఆధారంగా చేసుకుని పనిచేస్తూ పైకి మాత్రం స్వయానా క్రీస్తుచే ఎన్నుకోబడిన శిష్యులుగా అపోస్తలులుగా నటిస్తున్నారు.
\s5
\v 14 ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా దేవుని సముఖపు వెలుగుతో దూత వేషం వేసుకుంటాడు.
\v 15 అందుచేత, వాడి సేవకులు కూడా నీతిగల పరిచారకుల్లాగా వేషం వేసుకోవడం వింతేమీ కాదు. దేవుడు వారిని తగినట్టుగా శిక్షిస్తాడు.
\s5
\p
\v 16 మళ్ళీ చెబుతున్నాను. నేను బుద్ధిహీనుడినని ఎవరూ అనుకోవద్దు. అలా అనుకుంటే, నేను ఇంకొంచెం అతిశయపడేలా కొనసాగుతాను.
\v 17 గొప్పలు చెప్పుకుంటూ అతిశయపడుతున్న నేను, ఈ విషయాలు ప్రభువు మాటగా చెప్పడం లేదు, ఒక బుద్ధిహీనుడిలా చెబుతున్నాను.
\v 18 చాలామంది శరీరానుసారంగా అతిశయిస్తున్నారు. మంచిది, నేనూ అతిశయిస్తాను.
\s5
\v 19 మీరు చాలా తెలివైన వాళ్ళు. నిజానికి నా బుద్ధిహీనతని ఆనందంతో సహిస్తున్నారు.
\v 20 ఇలా ఎందుకు అంటున్నానంటే, ఎవరైనా మిమ్మల్ని బానిసలుగా చూస్తున్నా మీరు ఓర్చుకుంటున్నారు , మీలో విభేదాలు కలిగించినా మౌనంగా వెంబడిస్తున్నారు, వారి సొంత ప్రయోజనాల్ని ఆశించి మిమ్మల్ని వశం చేసుకున్నా తలూపుతున్నారు, తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటున్నా ఆమోదిస్తున్నారు, చెంప దెబ్బ గట్టిగా కొట్టినా మీరు ఏమీ అనక మిన్నకున్నారు. వాస్తవానికి ఇందులో వివేకం ఏమాత్రం లేదు.
\v 21 తిమోతీ గానీ నేను గానీ వారు చేసినట్టు చేయలేని బలహీనులమని సిగ్గుతో చెబుతున్నాను. అయితే, ఎవరైనా ఎపుడైనా అలా చేస్తూ బడాయిలు పోతుంటే - బుద్ధిహీనుడిలా మాట్లాడుతున్నాను - నేనూ అలాగే అతిశయించగలను.
\s5
\v 22 వారు స్వచ్చమైన హెబ్రీయులా? నేను కూడా స్వచ్చమైన హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రాహాము సంతానమా? నేను కూడా.
\v 23 వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను, వారు క్రీస్తు సేవకులా? వారందరికంటే చాలా ఎక్కువగా కష్టపడ్డాను. అనేక సార్లు చెరసాల పాలయ్యాను. లెక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాను. అనేకమార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను.
\s5
\v 24 యూదుల చేత ఐదు సార్లు "ఒకటి తక్కువ నలభై” కొరడా దెబ్బలు తిన్నాను. ప్రతిసారి కొన ప్రాణంతో వదిలారు.
\v 25 నన్ను బంధించిన వాళ్ళు మూడు సార్లు బెత్తాలతో కొట్టారు. ఒకసారి చంపేయడానికి రాళ్లతో కొట్టారు. మూడుసార్లు నేనెక్కిన ఓడలు సముద్రపు తుఫాన్ల తాకిడికి పగిలిపోయాయి కొట్టుకుపోయాను. ఒకసారైతే ఒక పగలు, ఒక రాత్రి నడిసముద్రంలో సహాయం కోసం ఎదురుచూస్తూ గడిపాను.
\v 26 తరచుగా ప్రయాణాల్లో అపాయాలకు గురయ్యాను. నదుల్లో సంభవించే అపాయాలూ, దోపిడీ దొంగల వలన అపాయాలూ, నా సొంత ప్రజల వలన అపాయాలూ, యూదేతరుల వలన అపాయాలూ, పట్టణాల్లో అపాయాలూ, అరణ్యాల్లో అపాయాలూ, సముద్రంలో అపాయాలూ, మనల్ని మోసగించిన కపట సోదరుల వల్ల అపాయాలూ నాకు ఎదురయ్యాయి.
\s5
\v 27 కష్ట పడ్డాను. వేదన అనుభవించాను. నిద్ర కరువైన అనేక రాత్రులు గడిపాను. చలితో, ఆకలి దప్పులతో, తినడానికి ఏమీ లేక, చాలీ చాలని బట్టలతో ఉన్నాను.
\v 28 వీటికి తోడు యేసు క్రీస్తును వెంబడిస్తున్న సంఘాలన్నిటిని గూర్చిన దిగులు, వారు ఎలా ఉన్నారో నన్నఆలోచన రోజూ నా మీద భారంగా ఉంది.
\v 29 మీలో ఒకడు బలహీనుడైతే, నేనూ బలహీనుణ్ణి కాకుండా ఉండగలనా? ఒకడు ఇతరుల వల్ల పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా?
\s5
\p
\v 30 అతిశయపడాల్సి వస్తే నేను దుర్భలుడనని నా బలహీనతలు స్పష్టం చేస్తున్నపుడు వాటిలోనే అతిశయిస్తాను.
\v 31 ఎప్పటికీ స్తుతి పాత్రుడైన మన యేసు ప్రభువు తండ్రి అయిన దేవునికి ప్రతివారూ, ప్రతిదీ స్తోత్రములు చెల్లించుదురు గాక! నేను అబద్ధమాడడం లేదని ఆ దేవ దేవునికి తెలుసు.
\s5
\v 32 దమస్కులో అరెత అనే రాజు కింద ఉన్న అధికారి నన్ను పట్టుకోవడం కోసం దమస్కు పట్టణం చుట్టూ కాపలా పెట్టాడు
\v 33 అప్పుడు నా మిత్రులు నన్ను గంపలో వుంచి గోడ కిటికీ గుండా పట్టణం వెలుపల దించితే అతని చేతికి చిక్కకుండా తప్పించుకున్నాను.
\s5
\c 12
\p
\v 1 ప్రభువు అనుగ్రహించిన దర్శనాలూ, ప్రత్యక్షతలూ నన్ను నేను సమర్ధించుకోవడానికి అన్నట్టు దాని వలన ప్రయోజనమేమీ రాదని తెలిసినా బడాయిగా మీకు తెలియజేస్తాను.
\v 2 క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు. అది నేనే. పద్నాలుగు సంవత్సరాల క్రితం దేవుడు నన్ను అత్యున్నత ఆకాశానికి కొనిపోయాడు.
\s5
\v 3 నేను శరీరంతో వెళ్ళానో లేక శరీరం లేకుండా వెళ్ళానో నాకు తెలియదు. దేవునికే తెలుసు.
\v 4 దేవుడు నన్ను ఆనంద నివాసం అని పిలవబడుతున్న ఉన్నత స్థలంలోకి కొనిపోయాడు. నేనక్కడ పలకడానికి వీలు కాని అతి పవిత్రమైన విషయాలు విన్నాను.
\p
\v 5 అలాంటి అనుభవాలతో నేను అతిశయించగలను. కానీ, నేను కాదు దేవుడే సమస్త సంభవానికీ కారకుడు. నేనయితే బలహీనుడను. నా బలహీనతల విషయంలో దేవుడు నాలో ఉండి ఎలా పని చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో అదే నా అతిశయ కారణం. అది తప్ప నాకు నేనుగా అతిశయించను.
\s5
\v 6 ఒకవేళ అతిశయించాలనుకొన్నా అది తెలివి తక్కువతనమేమీ కాదు. ఎందుకంటే నేను సత్యమే చెబుతున్నాను. కానీ ఎవరైనా నాలో చూసినదాని కంటే, నేను చెప్పింది విన్నదాని కంటే నన్ను ఎక్కువ ఘనంగా ఎంచకుండా ఉండేలా అతిశయించడం మానుకుంటాను.
\v 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు అసాధారణమైనవి కాబట్టి నేను గర్వంతో రెచ్చిపోకుండా దేవుడు నా దేహంలో ఒక ముల్లు పెట్టాడు. అది నన్ను బాధించడానికి, అతిశయించకుండా ఉండటానికి ఉన్న సాతాను దూత.
\s5
\v 8 అది నా దగ్గర నుండి తొలగిపోవాలని దాని గురించి మూడు సార్లు ప్రభువును బతిమాలాను.
\v 9 అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, "దానిని పోగొట్టను. నా కృప నీకు చాలు. నా ప్రేమ, నా సన్నిధి తోడుగా ఉండడమే నీకు ముఖ్యం. నీ బలహీనతలోనే నా అత్యున్నత బలం పరిపూర్ణమవుతుంది." కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నన్ను బలవంతుణ్ణి చేసేలా, నేను నా బలహీనతల్లోనే అతిశయిస్తాను.
\p
\v 10 క్రీస్తు నా పాలిట ఉండగా దేన్నైనా నేను ఎదుర్కోగలను. అది నేను అశక్తుడుగా ఉన్నప్పుడైనా, ఒకరు నన్ను తిరస్కరించినపుడైనా, నేను నానా అగచాట్లు పడుతున్నప్పుడైనా, వారు నన్ను అంతమొందించాలని ప్రయత్నించినపుడైనా, ఇలాంటి పలురకాల శ్రమలు ఎన్ని సంభవించినా, పరిస్థితి ఎలాంటిదైనా నేను అశక్తుడనై నిలిచినపుడు అప్పుడే నేను బలవంతుడిని.
\s5
\p
\v 11 ఇలా రాస్తూ నన్ను నేనే మెచ్చుకుంటున్నాను. కానీ తప్పదు ఎందుకంటే, నాపై మీకు నమ్మకం కలగాలి. నేను వట్టివాడినైనా ఆ "గొప్ప అపొస్తలుల” కంటే ఏ మాత్రం తక్కువ వాణ్ణి కాను.
\v 12 అసలైన అపొస్తలునికి ఉండాల్సిన గురుతులు మీకు చూపెట్టాను. దేవుడు నా ద్వారా సూచకక్రియలూ అద్భుతాలూ మహత్కార్యాలూ కనపరిచాడు. నేను యేసు క్రీస్తును సేవిస్తున్నాను అనడానికి రుజువులివే.
\v 13 నాకు ఇతర క్రైస్తవ సమూహాలు ఎంత ముఖ్యమో మీరూ అంతే ముఖ్యం. వారికీ మీకూ ఒకే ఒక్క తేడా ఏంటంటే, ధన సహాయం వారినుంచే పొందాను తప్ప మిమ్మల్ని కోరనూ లేదూ, మీ నుంచి పొందనూ లేదు. అందుకు నన్ను క్షమించండి.
\s5
\p
\v 14 కాబట్టి ఈ మాట వినండి. ఇప్పుడు ఈ మూడవసారి మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు ఇంతకు ముందు లాగే మీకు భారంగా ఉండను, మిమ్మల్ని అడగను. మీకేముందో అది నాకు అక్కరలేదు. నాకు మీరే కావాలి. తల్లిదండ్రుల కోసం పిల్లలు సొమ్ము చెల్లించరు. కానీ తల్లిదండ్రులే పిల్లల కోసం దాచి ఖర్చు పెడతారు. ఈ సూత్రం మన కుటుంబాలలో ఉన్నదని మీకు విదితమే.
\v 15 కాబట్టి మీ కోసం ఎంతో ఆనందంగా ఖర్చు చేస్తాను. మీకోసం నా ప్రాణం ఖర్చయిపోయినా పరవాలేదు. మీపై నా ప్రేమ అంతకంతకూ అధికమౌతుంటే మీరు నన్ను ఇంతకంటే ఎక్కువగా ప్రేమించరా?
\s5
\p
\v 16 అదలా ఉంచండి. నేను మీకు భారంగా ఉండడం ఇష్టం లేక మీ నుంచి ద్రవ్యాన్ని ఆశించలేదు. గానీ నేను యుక్తిగా మాయోపాయం చేత మిమ్మల్ని పట్టుకోవడం కోసం అలా చేశానని అని చెబుతారేమో!
\v 17 ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను మీ దగ్గరికి పంపిన వారిని మీ నుండి ధనాన్ని సేకరించమని గానీ, నా దగ్గరకు తెమ్మని గానీ నేను ఎప్పుడూ అడగలేదు.
\v 18 ఉదాహరణకి మీ దగ్గరికి వెళ్ళమని తీతును ప్రోత్సహించాను. అతనితో వేరొక సోదరుని పంపాను. తీతు తన ఖర్చుల నిమిత్తం మీ దగ్గర ఏమైనా సంపాదించాడా? తీతూ ఆ వేరొక సహోదరుడూ నేను మీతో ఉన్నట్లే ఉన్నారు కాదా! మేము ఏక మనసుతో ఏక విధానంతో ప్రవర్తించలేదా? మీరు మా కొరకు ఎలాటి ఖర్చూ పెట్టవలసి రాలేదు.
\s5
\p
\v 19 మేమింత వరకూ మా ఈ లేఖా ముఖంగా మా పక్షాన మేము వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టిలో క్రీస్తును బట్టి మీ క్షేమాభివృద్ధి కోసం అంటే, ఆయనపై మీకున్న విశ్వాసం దృఢపరచడం కోసం ఇవన్నీ చెబుతున్నాం.
\s5
\v 20 నేను వచ్చినప్పుడు మీరు నేను ఆశించినట్టుగా నాకు ఇష్టులుగా ఉండరేమో అనీ, నేనంటే కూడా మీరు ఇష్టపడక నా మాటలను సైతం అంగీకరించరేమోననీ భయపడుతున్నాను. మీలో మీరు అతిగా వాగ్వాదాలకు చోటిస్తున్నారనీ, మీలో కొద్దిమందికి ఒకరంటే ఒకరికి పడదనీ, కొద్దిమంది మధ్య ద్వేష పూరిత వాతావరణం ఉందనీ సందేహిస్తున్నాను. ఇంకొంతమందైతే ఒకరికంటే ఒకరు ఎక్కువంటూ పోటీ తత్వాన్ని ప్రదర్శిస్తున్నారనీ, ఎదుటివారిని విమర్శించడంలోనే కాలం గడుపుతున్నారనీ, తమ సుఖం తప్ప మరేదీ పట్టని వారుగా ఉన్నారనీ భయపడుతున్నాను.
\v 21 నేను తిరిగి వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చుతాడేమో అనీ, గతంలో పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, ఇంద్రియలోలత్వం విషయాలలో పశ్చాత్తాపపడి, వాటినుండి దూరంగా తొలగని అనేకుల గురించి దుఖించాల్సి వస్తుందేమో అనీ భయపడుతున్నాను.
\s5
\c 13
\p
\v 1 ఇలాంటి విషయాలను పరిష్కరించడం కోసం మీ దగ్గరికి నేను రావడం ఇది మూడోసారి. ఇలాంటి వ్యవహారాలలో "ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి విషయం నిర్ధారణ కావాలి." అంతేకానీ ఏ ఒక్కరివల్లా కాదు అని పవిత్ర లేఖనాలు సూత్రప్రాయంగా చెప్తున్నాయి.
\v 2 నేను రెండవసారి వచ్చి మీ దగ్గర ఉన్నపుడు, పాపం చేసి విశ్వాసుల గుంపంతటి ఆగ్రహం రుచి చూసిన వారికీ, మిగతా వారందరికీ ముందే చెప్పినట్టు, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. మూడవసారి వచ్చినపుడు ఇలాంటి ఆరోపణలు ఉన్నవారిని వదిలి పెట్టను.
\s5
\v 3 క్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడని రుజువు కావాలని కోరుతున్నారు కాబట్టి ఈ విషయం మీకు చెబుతున్నాను. ఆయన మీ పట్ల బలహీనుడు కాడు, మీలో శక్తిశాలిగా తన పని జరిగిస్తూ ఉన్నాడు.
\v 4 క్రీస్తునే ఉదాహరణగా తీసుకుని నేర్చుకుందాము. బలహీనుడుగా ఉన్నప్పుడు ఆయనను సిలువ వేశారు అయినప్పటికీ, దేవుడు తన శక్తిని బట్టి ఆయనను సజీవుడుగా లేపాడు. మేము కూడా మా జీవన శైలిలో బలహీనులమైనా, మీలో కొంతమంది జరిగించిన పాపాల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం క్రీస్తు దృష్టాంతం మాలో నెరవేరుతూ, మేము దేవుని శక్తితో జీవం కలిగి ఉంటాము.
\s5
\p
\v 5 మీరు విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతలా తన కనికరాన్ని కుమ్మరిస్తున్నాడో మీకై మీరు తెలుసుకునేలా మీ నమ్మకాన్ని పరీక్షించుకోండి. మీలో క్రీస్తు నివసిస్తున్నాడో లేదో తెలుసుకునేలా మీ విశ్వాసాన్ని మీరే పరీక్షకు అప్పగించుకోండి. పరీక్షలో ఓడిపోకుండా ఉంటే క్రీస్తు మీ ప్రతి ఒక్కరిలో ఉన్నట్టు.
\v 6 మేమైతే ఈ పరీక్షలో గెలిచామనీ, క్రీస్తు మాలో నివసిస్తున్నాడనీ మీరు మమ్మల్ని చూసి ఈ సంగతులు తెలుసుకుంటారనీ ఆశిస్తున్నాను.
\s5
\v 7 మీరు ఏ చెడ్డ పనీ చేయకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మేము పరీక్ష నెగ్గాము కాబట్టి మీ ముందు యోగ్యులుగా కనబడాలని కాదు గానీ మీరు మా నుంచి మంచి విషయాలను గ్రహించి సరైన మార్గంలో నడుస్తారని. ఒకవేళ మేము అయోగ్యులంగా కనబడినా మీరు మంచినే చేసి గెలవాలని మా ఉద్దేశం.
\v 8 మా సమస్త కార్యాలూ సత్యాధీనంలో మాత్రమే జరుగుతాయి. మేము కేవలం సత్యం కోసమే గానీ సత్యానికి విరుద్ధంగా ఏమీ చెయ్యలేము.
\s5
\v 9 మేము బలహీనులమై ఉన్నా మీరు బలవంతులై ఉన్నారని సంతోషిస్తున్నాము. మీరు విశ్వాస, విధేయతలలో సంపూర్ణులు కావాలని ఎప్పుడూ ప్రార్థిస్తున్నాం.
\v 10 అందువల్లే నేను దూరంగా ఉండగానే ఈ సంగతులు రాస్తున్నాను. ఇలా రాయడం వల్ల నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నా అధికారం ఉపయోగించటంలో కాఠిన్యత చూపనవసరం ఉండదు. అపోస్తలుడిగా దేవుడు ఇచ్చిన ఈ అధికారం మిమ్మల్ని పడగొట్టడానికి కాక, కట్టడానికే ఇచ్చాడు.
\s5
\p
\v 11 చివరిగా, సోదరీ సోదరులారా, ఆనందించండి! దేవుడు అనుగ్రహించే ధైర్యాన్ని అలవరుచుకుంటూ మునుపటి ప్రవర్తన కంటే మెరుగైన ప్రవర్తనతో జీవించండి. ఒకరిని ఒకరు ఏక మనసు కలిగి ఓర్చుకుంటూ, ఒప్పుకుంటూ శాంతితో జీవించండి. మిమ్మల్ని ప్రేమించే దేవుడు శాంతి సమాధానాలను అనుగ్రహించి మీతో ఉంటాడు.
\v 12 ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా పూర్ణ మనస్సుతో ఒకర్నొకరు ఆహ్వానించుకోండి, అభినందించుకోండి.
\s5
\v 13 యేసు క్రీస్తు ప్రభువు నిండైన తన దయతో, తన సమస్త దీవెనలతో దీవించు గాక. దేవుడు తన ప్రేమంతటితో మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ మనస్సులకు కాపరియై ఏకాత్మను దయచేయును గాక.
\v 14 ప్రభువైన యేసు క్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడై యుండుగాక.

288
49-GAL.usfm Normal file
View File

@ -0,0 +1,288 @@
\id GAL - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h గలతీయులకు రాసిన పత్రిక
\toc1 గలతీయులకు రాసిన పత్రిక
\toc2 గలతీయులకు రాసిన పత్రిక
\toc3 gal
\mt1 గలతీయులకు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 గలతీ ప్రాంతంలో ఉన్న నా ప్రియమైన అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు పౌలనే నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. పౌలనే నేను అపోస్తలుడను. ఏ మనిషీ నన్ను అపోస్తలుడుగా చేయలేదు. అపోస్తలులలో ఒకడిగా నన్ను చేయమని దేవుడు ఎవరికీ చెప్పలేదు. నేను అపోస్తలుడను, ఎందుకంటే యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు నన్ను అపోస్తలులలో ఒకడిగా ఏర్పాటు చేశాడు.
\v 2 అవును సహోదరులారా, క్రీస్తు చనిపోయినప్పుడు తండ్రియైన దేవుడు మళ్ళీ ఆయనను బ్రతికించాడు. ఆయనే నన్ను అపోస్తలుడుగా నియమించాడు. నేనూ నా తోటి విశ్వాసులూ గలతీ ప్రాంత సంఘ విశ్వాసులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము.
\s5
\p
\v 3 మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తూ మీకు దయతో సహాయం చేయాలనీ, శాంతిని ప్రసాదించాలనీ నేను దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను.
\v 4 ఈ లోకంలోని ప్రజలు నడిచే చెడ్డదారుల్లో నుంచి మనల్ని దూరంగా తీసుకు రావడానికి క్రీస్తు తనకు తానుగా మన పాపాల కోసం బలిగా అర్పించుకున్నాడు. మన తండ్రియైన దేవుడు ఆయన్ని ఆ విధంగా చేయాలని కోరుకున్నాడు.
\v 5 ఇది గొప్ప సత్యం కాబట్టి ఇప్పుడు మనం ఎన్నటెన్నటికీ దేవునికి స్తుతులూ మహిమా చెల్లించాలి.
\s5
\p
\v 6 తనలో నమ్మకం ఉంచడానికి క్రీస్తు తన దయతో మిమ్మల్ని పిలిచాడని మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయనలో నమ్మకం ఉంచడం మానుకున్నారని తెలిసి నేను చాలా నివ్వెరబోతున్నాను. కొందరు ఇదే నిజమైన దేవుని సువార్త అని చెబుతుంటే మీరు ఆ భిన్న బోధలను నమ్ముతున్నారు.
\v 7 క్రీస్తు ఎన్నడూ మరో సువార్తను మనకు చెప్పలేదు. కానీ కొందరు మనుషులు మిమ్మల్ని తికమక పెడుతున్నారు. క్రీస్తును గూర్చిన సువార్తను తారుమారు చేయాలని చూస్తున్నారు. క్రీస్తు వేరే ఇంకేదో చెప్పాడని మిమ్మల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు.
\s5
\v 8 కానీ అపోస్తలులమైన మేము గానీ పరలోకంలో ఉండే దేవదూతలైనాగానీ వచ్చి, ఇంతకు ముందు చెప్పినది కాకుండా వేరే వార్తను సువార్త అని చెప్పినట్లయితే వారిని దేవుడు శాశ్వతంగా శిక్షించాలి.
\v 9 మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇప్పుడు మళ్ళీ చెపుతున్నాను. వేరెవరైనా మీరు నమ్మిన సువార్త కాకుండా వేరే సువార్తను బోధించి, ఇదే మంచిదని చెప్పారనుకోండీ, అలాంటి మనుషుల్ని శాశ్వతంగా శిక్షించాలని నేను దేవుణ్ణి అడుగుతాను.
\p
\v 10 నన్ను మనుషులు ఇష్టపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని ఆమోదమే నాకు కావాలి. నేను మనుషుల దయ కోసం ప్రయత్నం చేయను. నేను మనుషుల దయ కోసం ప్రయత్నిస్తే నిజంగా క్రైస్తవ సేవ చేయలేను. యథార్థ వాది లోక విరోధి కదా!
\s5
\p
\v 11 నా తోటి విశ్వాసులారా, నేను ప్రజలకు క్రీస్తును గూర్చి ప్రకటించిన సువార్త, కొంతమంది మనుషులు కపటంగా సృష్టించిన సువార్త ఒకటే కాదని మీరందరూ తెలుసుకోవాలి.
\v 12 ఈ సువార్తను నేను సాధారణ వ్యక్తుల నుండి నేర్చుకోలేదు. అలాంటి వ్యక్తులెవ్వరూ ఈ సువార్తను నాకు నేర్పలేదు. మన ప్రభువైన యేసు క్రీస్తు వారే ఈ సువార్తను తనకు తానుగా నాకు బోధించారు.
\s5
\p
\v 13 గతంలో యూదా మత పద్ధతుల్లో నేను దేవుణ్ణి ఆరాధించేవాణ్ణని నా గూర్చి మనుషులు మీకు చెప్పారు కదా. దేవుడే స్థాపించిన విశ్వాసుల సంఘాన్ని నిరంతరం హింసిస్తుండే వాణ్ని. మీ సంఘాలనూ మీ విశ్వాసులనూ నాశనం చేయడానికి నేను శతవిధాల ప్రయత్నం చేశాను.
\v 14 నా తరంలోని మిగతా యూదులందరి కంటే ఎక్కువగా యూదా మత విశ్వాసంలో దేవుణ్ణి ఆరాధించే వాణ్ణి. మిగతా యూదులలో మన పూర్వికులు ఏర్పాటు చేసి పాటించిన ఆచారాలను నిర్లక్ష్యం చేసి పాటించక పోతుంటే చూసి అగ్గి మీద గుగ్గిలమయ్యే వాడిని.
\s5
\v 15 నేను నా తల్లి కడుపులో ఉన్నప్పుడే దేవుడు తన సేవకు నన్ను ఎంపిక చేశాడు. ఆయన అలా చేయడానికి కారణం ఏంటంటే ఆయనకు నాపై దయ కలిగింది.
\v 16 యేసు ప్రభువు తన కుమారుడని ఆయన నాకు చూపించాడు. యూదేతరులు నివసిస్తున్న ప్రాంతాల్లో తన కుమారుడిని గూర్చిన సువార్తను ఇతరులకు చెప్పడానికి ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఈ సువార్త చక్కగా అర్థం చేసుకోవడానికి నాకు అందుబాటులో ఉన్న ఏ మనిషి దగ్గరకూ నేను వెంటనే వెళ్లలేదు.
\v 17 నేను దమస్కును వదిలి ఎక్కడకీ వెళ్ళలేదు. యెరూషలేములో నాకంటే ముందుగా అపోస్తలులుగా ఉన్న వ్యక్తులను చూడ్డానికి వెళ్ళలేదు. నేను అరేబియా అరణ్య ప్రాంతానికి వెళ్ళాను. తరవాత అక్కడ నుండి దమస్కు నగరానికి తిరిగి వచ్చాను.
\s5
\p
\v 18 దేవుడు ఈ సువార్తను నాకు వెల్లడి చేసిన మూడు సంవత్సరాల తర్వాత పేతురును కలవడానికి యెరూషలేముకు వెళ్లాను. అతనితో కలిసి 15 రోజులు ఉన్నాను.
\v 19 మన యేసు ప్రభువు తమ్ముడు యాకోబును చూశాను. యెరూషలేములోని విశ్వాస సంఘ నాయకుల్ని కూడా కలిశాను. అంతే తప్ప మిగతా అపోస్తలులనెవ్వరినీ నేను కలవలేదు.
\v 20 నేను మీకు రాస్తున్నదంతా సత్యమని దేవునికి తెలుసు.
\s5
\p
\v 21 తరువాత యెరూషలేము నుండి సిరియా, కిలికియా ప్రాంతాలకు వెళ్ళాను.
\v 22 యూదయ ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ సమాజంలోని వారెవ్వరూ అప్పటికి నన్ను చూడలేదు.
\v 23 వాళ్ళు గతంలో మనం విశ్వసించిన సువార్తను ఆపడానికి మనపై చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన పౌలు అనే వ్యక్తి ఇప్పుడు అదే సువార్త ప్రకటిస్తున్నాడని మాత్రమే ఇతరులు పదే పదే అనుకోవడం విన్నారు.
\v 24 నా విషయంలో దేవుడు చేసిన దాన్ని బట్టి వారందరూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు.
\s5
\c 2
\p
\v 1 పద్నాలుగు సంవత్సరాల తర్వాత నేను, తీతు, బర్నబా కలిసి మళ్ళీ యెరూషలేముకు వెళ్ళాము.
\v 2 దేవుడు మమ్మల్ని వెళ్ళమని చెప్పాడు కాబట్టే వెళ్ళాము. యూదేతరులు ఉండే ప్రాంతాల్లో నేను ప్రకటిస్తున్న సత్య సువార్తకు సంబంధించిన విషయాలను విశ్వాస సంఘాల్లో ముఖ్యమైన పెద్దలందరినీ ప్రత్యేకంగా సమావేశపరిచి వివరించాను. నేను బోధిస్తున్న విషయాలు వారందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నాయో లేవో నిర్ధారించుకోడానికి ఇలా చేశాను. నేను చేస్తున్న పని నిరుపయోగం కాలేదని నిర్ధారించుకోవాలని నా ఉద్దేశం.
\s5
\p
\v 3 నాతోపాటు ఉన్న తీతు సున్నతి లేని అన్యుడు. అతడు గ్రీసు దేశస్తుడు. అయితే అతడు సున్నతి చేసుకోవలసిన అవసరం లేదని ఆ పెద్దలు అనుకున్నారు.
\v 4 అయితే తీతు సున్నతి చేసుకోవలసిన అవసరం ఉందని చెప్పే వాళ్ళు నిజమైన విశ్వాసులు కారు. కానీ వాళ్ళు తోటివిశ్వాసుల్లాగా నటించారు. యూదా మత నియమాలనూ ఆచారాలనూ పాటించకుండా దేవుడికి ఎలా విధేయత చూపుతున్నామో తెలుసుకోవడానికి వాళ్ళు మమ్మల్ని నిశితంగా పరిశీలిస్తూ ఉండడం మేము గమనించాము. యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ ఆచారాల నుండి, నియమాల నుండి మనల్ని విడిపించాడని తెలిసినప్పటి నుండీ వాటిని మేము పాటించడం లేదు. ధర్మశాస్త్ర నియమాలకు మమ్మల్ని బానిసలుగా చేయాలని ఆ కపట విశ్వాసులు ప్రయత్నించారు.
\p
\v 5 సున్నతిని గూర్చి వారితో ఒక్క క్షణం కూడా మేము ఏకీభవించడానికి అంగీకరించలేదు. క్రీస్తును గూర్చిన సువార్త వల్ల మీరు లాభం పొందుతూ ఉండాలని మేము వారిని వ్యతిరేకించాము.
\s5
\v 6 అయితే నేను ప్రకటించడానికి అక్కడ పెద్దలమని చెప్పుకునే వాళ్ళెవ్వరూ ఏమీ అదనంగా చేర్చలేదు. ఈ పెద్దలు చాలా ప్రముఖమైన వ్యక్తులు. వాళ్ళు ఎవరైనా కానీ నేను పట్టించుకోను. ఎందుకంటే దేవుడు ఏ కొద్ది మంది విషయంలోనో పక్షపాతం చూపేవాడు కాదు.
\v 7 పేతురు యూదులకు సువార్త ప్రకటిస్తున్నట్లుగానే దేవుడు యూదేతరులకు సువార్తను ప్రకటించడానికి నాపై నమ్మకం ఉంచాడని ఆ పెద్దలకు అర్థం అయింది.
\v 8 యూదులకు దేవుని సందేశాన్ని తీసుకెళ్ళే బాధ్యతను అపోస్తలుడినైన నాకు కూడా దేవుడే అప్పగించాడు.
\s5
\v 9 ఈ ప్రత్యేకమైన పరిచర్య బాధ్యతను దేవుడు దయతో నాకు ఇచ్చాడని ఆ పెద్దలకి స్పష్టంగా అర్థం అయింది. క్రీస్తులో విశ్వాసముంచే వారందరికీ యాకోబు, పేతురు, యోహానులు మూల స్తంభాల్లాంటి ముఖ్యమైన పెద్దలు. వీళ్ళు అనేక మందికి తెలిసిన వాళ్ళు. అందరూ వీళ్ళను గౌరవిస్తారు. వాళ్ళు మాతో చేతులు కలిపారు. ఎందుకంటే మేము వారి తోటి దేవుని సేవకులమని భావించారు. సున్నతి ఉన్న యూదుల దగ్గరకు వాళ్ళని పంపినట్లే సున్నతి లేని యూదేతరుల దగ్గరకు మమ్మల్ని దేవుడు పంపాడని మేమందరం అంగీకరించాము.
\p
\v 10 యెరూషలేములో నివసిస్తున్న తోటి విశ్వాసుల్లోని పేదలకు సహాయం చేయడం మరవ వద్దని వాళ్ళు మమ్మల్ని అభ్యర్ధించారు. నేనూ ఎంతో ఆసక్తితో చేస్తున్నది కూడా సరిగ్గా ఇదే.
\s5
\p
\v 11 అయితే నేను అంతియొకయ నగరంలో ఉన్న సమయంలో పేతురు అక్కడికి వచ్చాడు. ఆ సమయంలో జరిగిన దాని విషయంలో పేతురు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అతడు అక్కడ చేస్తున్నది తప్పు అని ఎత్తి చూపాను.
\v 12 అసలు అక్కడ జరిగింది ఏంటంటే, పేతురు అంతియొకయకు వెళ్ళినపుడల్లా చేస్తున్నట్లుగానే యూదేతరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో యెరూషలేము విశ్వాస సంఘానికి పెద్ద అయిన యాకోబు తమను పంపాడని చెప్పుకుంటున్న కొంతమంది యూదులు అక్కడికి వచ్చారు. ఆ మనుషులు అక్కడికి వచ్చినపుడు పేతురు యూదేతరులతో కలిసి భోజనం చేస్తున్నాడు. వాళ్ళను చూసిన పేతురు భోజనం చేయడం ఆపివేసి దూరంగా జరిగిపోయాడు. వాళ్ళతో కలవలేదు. అంతేకాకుండా యూదేతరులతో కలవడం వల్ల యెరూషలేము నుంచి వచ్చిన యూదులు తనని విమర్శిస్తారని భయపడ్డాడు.
\s5
\v 13 అంతేకాకుండా పేతురు అలా చేయడం చూసిన అంతియొకయ లోని మిగతా యూదులు యూదేతర విశ్వాసుల్లోంచి తమకై తాము వేరుపడి పేతురు కపటంలో కలిసిపోయారు. వారిని చూసిన బర్నబా సైతం యూదేతరులతో కలవడం మానేశాడు.
\p
\v 14 క్రీస్తును గూర్చిన సువార్త సత్యాన్ని వాళ్ళు సరిగా అనుసరించడం లేదని నాకు అప్పుడు అర్థం అయింది. అప్పుడు తోటి విశ్వాసులందరూ కలిసి వచ్చినపుడు అందరి ఎదుటా పేతురుతో నేను ఇలా చెప్పాను. "నువ్వు యూదుడివి అయిఉండి కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించని యూదేతరుడుగా జీవిస్తున్నావు. మరి యూదేతరుల్ని యూదుల్లా జీవించమని ఎలా ఒప్పిస్తావు?
\s5
\v 15 మనం యూదులుగా పుట్టాము. కానీ దేవుని ధర్మశాస్త్రం గూర్చి ఏమాత్రం తెలియని యూదేతర పాపులం కాదు.
\v 16 ఏ వ్యక్తీ దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా దేవుని దృష్టిలో న్యాయవంతుడు కాలేడని మనకు ఇప్పుడు తెలుసు. యేసు క్రీస్తులో నమ్మకం ఉంచిన వాణ్ణి మాత్రమే దేవుడు న్యాయవంతునిగా చేస్తాడు. మనలోని కొంతమంది యూదులం కూడా యేసు క్రీస్తులో నమ్మకం ఉంచాము. యేసు క్రీస్తులో నమ్మకం ఉంచాము కాబట్టి దేవుడు తన దృష్టిలో మనల్ని సరైన వారిగా ప్రకటిస్తాడు. అంతేకానీ దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నించామని కాదు. ధర్మశాస్త్రానికి విధేయత చూపించారు కాబట్టి మిమ్మల్ని సరైన వారిగా గుర్తిస్తానని తాను చెప్పలేదని దేవుడు చెప్పాడు.
\s5
\v 17 మనం పాపం చేసాము కాబట్టి ధర్మశాస్త్రం మనల్ని పాపులుగా నిర్ధారిస్తుంది. ఆ ధర్మశాస్త్రానికి విధేయత చూపడం మానివేసి యేసు క్రీస్తులో నమ్మకం ఉంచడం ద్వారా మనల్ని పాప విముక్తుల్నిగా మార్చమని దేవుణ్ణి అడిగాము. అయితే దీని అర్థం క్రీస్తు పాపానికి అనుకూలమైన వాడని కాదు, ఎంత మాత్రమూ కాదు.
\p
\v 18 అయితే నేను దేవునిలో నమ్మకం ఉంచి మళ్ళీ ధర్మ శాస్త్రానికి విధేయత చూపిస్తున్నాను కాబట్టి ఆయన దృష్టిలో నిర్దోషిగా మార్చమని అడగడం ఎలా ఉంటుందంటే, ఒకడు కూలిపోవడానికి సిద్దంగా ఉన్న తన పాత భవనాన్ని తానే కూల్చివేసి ఆ శిథిలాలతోనే మళ్ళీ దాన్ని నిర్మించడం లాంటిది. అలా దేవుని ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారని ప్రతి ఒక్కరికీ కనిపిస్తుంది.
\p
\v 19 దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపించడానికి ప్రయత్నించడం అంటే నేను మృత స్థితిలోకి మారడం లాంటిదే. నేను నమ్ముకున్న ధర్మశాస్త్రమే నన్ను చంపినట్లుగా ఉంది. ఆవిధంగా ధర్మశాస్త్ర విషయంలో చనిపోయిన నేను ఇక దేవుణ్ణి ఆరాధించడానికి జీవిస్తాను.
\s5
\v 20 క్రీస్తు సిలువపై మరణించినపుడే నా పాత జీవన విధానం ముగిసినట్లే. నేను ఎన్నటికీ నేనుగా నా జీవితాన్ని నడిపించను. నేను ఏవిధంగా జీవించాలనేది నా హృదయంలో జీవిస్తున్న క్రీస్తే నిర్ణయించి నడిపిస్తాడు. ఇక ఇప్పుడు నేను జీవిస్తూ ఏమి చేసినా కూడా దేవుని కుమారుడైన క్రీస్తులో నమ్మకం ఉంచి చేస్తాను. ఎందుకంటే ఆయన నన్ను ఎంతో ప్రేమించాడు. అంతే కాకుండా నేను చేసిన పాపాలనుంచి దేవుని క్షమను అందించడం కోసం తనను తాను బలి అర్పణగా సమర్పించుకున్నాడు.
\v 21 మళ్ళీ ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా దేవుడు మనల్ని నిర్దోషులుగా చేస్తాడని భావించి నేను దేవుడు ఇచ్చిన తన దయను ప్రక్కకు పెట్టలేను. ఒకవేళ ధర్మశాస్త్రమే మనల్ని నిర్దోషులుగా చేస్తే క్రీస్తు సిలువపై మరణించడం వ్యర్ధమే కదా!
\s5
\c 3
\p
\v 1 గలతీలో ఉన్న నా తోటి విశ్వాసులారా! మీరు చాలా అవివేకులు. కొందరు చెడ్డ మనస్తత్వంతో మిమ్మల్ని తమ చేతుల్లో కీలు బొమ్మలుగా చేసుకుని ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువుని వాళ్ళు ఎలా సిలువ వేశారో నేను సరిగానే మీకు చెప్పాను. కాదా?
\v 2 నాకు ఒక్క విషయం చెప్పండి, పరిశుద్దాత్మ మీ దగ్గరకు వచ్చాడు కదా. మీరు మోషే ధర్మ శాస్త్రానికి లోబడ్డారని వచ్చాడా లేక మీరు సత్య సువార్త విని క్రీస్తులో విశ్వాసం ఉంచడం వల్ల వచ్చాడా? క్రీస్తులో విశ్వాసం ఉంచడం వల్లనే గదా. కచ్చితంగా ఇదే జరిగింది.
\p
\v 3 మీరు ఇంత తెలివిమాలిన వారా! దేవుని ఆత్మ మీకు ఆవిధంగా అవకాశం ఇవ్వడం వల్లనే మీరు మొదటిగా క్రైస్తవులయ్యారు. కానీ ఇప్పుడు మీరు ధర్మ శాస్త్రానికి లోబడడానికి గట్టిగా ప్రయత్నించడం ద్వారా చనిపోయేవరకూ సాధ్యమైనంత విధేయత చూపించాలని అనుకుంటున్నారు. అలాగే కొనసాగాలని అనుకుంటున్నారు.
\s5
\v 4 క్రీస్తులో విశ్వాసం ఉంచిన తర్వాత మీరు అన్ని రకాల బాధలు, హింసలు అనుభవించారు. కానీ ఇప్పుడు ఆయనపై విశ్వాసం లేకపోవడం వల్ల మీరు అనుభవించిన ఆ శ్రమలకు బాధలకు ఏమాత్రం విలువలేకుండా చేశారు.
\v 5 ఇప్పుడు దేవుడు తన ఆత్మను ఉచితంగా మీకు ఇస్తూ, మీ మధ్య గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఇవన్నీ దేవుడు మీరు ధర్మ శాస్త్రానికి లోబడడం వల్ల చేస్తున్నాడని ఆలోచిస్తున్నారా? అది నిజం కాదని మీకు తెలుసు. ఎందుకంటే ఇవన్నీ క్రీస్తును గూర్చిన సువార్తను విని, ఆయనలో విశ్వాసం ఉంచడం వల్లనే జరిగాయని మీకు తెలుసు.
\s5
\p
\v 6 అబ్రాహాము ఏవైతే పొందాడని గ్రంథాలలో మోషే రాశాడో అదే ఇప్పుడు మీరు పొందుతున్నది. అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. దాని ఫలితంగా దేవుడు అబ్రాహాముని తన దృష్టిలో నీతిమంతుడుగా భావించాడు అని మోషే గ్రంథాల్లో రాశాడు.
\v 7 కాబట్టి మీరు అర్థం చేసుకోవలసినది ఏంటంటే, ఎందరైతే క్రీస్తులో విశ్వాసం ఉంచుతారో, వాళ్ళందరినీ దేవుడు రక్షించి, అబ్రాహాము వారసులుగా మారుస్తాడు.
\v 8 యూదేతరులు ఆయనలో విశ్వాసం ఉంచినపుడు, వాళ్ళను నీతిమంతులుగా దేవుడు మారుస్తాడని, అలా ఆయన మార్చక మునుపే ఆ విధంగా చేస్తాడనీ, తమ గ్రంథాల్లో ప్రవక్తలు రాశారు. దేవుడు ఈ సువార్తను అబ్రాహాముకు ముందే ప్రకటించాడు. దీన్ని గూర్చి గ్రంథంలో ఈ విధంగా రాశారు. నువ్వు చేసినదాని వల్ల ప్రపంచంలోని జన జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.
\v 9 కాబట్టి క్రీస్తులో విశ్వాసం ఉంచిన వాళ్ళందరినీ, దేవుడిలో విశ్వాసం ఉంచిన అబ్రాహాము తోపాటు ఆశీర్వదిస్తాడు అని దీని ద్వారా మనకు తెలుస్తుంది.
\s5
\v 10 తన ధర్మ శాస్త్రానికి విధేయత చూపించడం ద్వారా దేవుడి అనుగ్రహం పొందగలం అనుకునే వాళ్ళందరినీ దేవుడు నడిపిస్తాడు. లేఖనాల్లో "ధర్మశాస్త్ర గ్రంథంలో మోషే రాసిన నియమ నిబంధనలను నిరంతరంగా, పూర్తిగా పాటించకపోతే ప్రతి ఒక్కరినీ దేవుడు శాశ్వతంగా శిక్షిస్తాడు" అని రాసి ఉంది.
\v 11 అయితే దేవుడు నేను ఏ వ్యక్తినైనా నీతిమంతుడుగా ప్రకటిస్తాను. కానీ అది తన ధర్మ శాస్త్రానికి విధేయత చూపించడం మూలంగా కాదు అని చెప్పాడు. తనపై విశ్వాసం ఉంచారు కాబట్టి ఆ ప్రతి వ్యక్తినీ దేవుడు నీతిమంతుడని ప్రకటిస్తాడు. అలా ప్రకటించిన ప్రతి వ్యక్తీ నిత్యం జీవిస్తాడు అని మన లేఖనాల్లో చదువుకోవచ్చు.
\v 12 ఎవరైతే ధర్మ శాస్త్రానికి విధేయత చూపిస్తారో, వాళ్ళు క్రీస్తులో విశ్వాసం ఉంచరు. ధర్మశాస్త్రంలోని విషయాలను చేయడం ప్రారంభించి వాళ్ళు దానిలోని అన్నిటికీ విధేయత చూపించి అన్నిటినీ అనుసరిస్తూ చేయాలి.
\s5
\p
\v 13 ధర్మశాస్త్రంలో రాసినట్టు దేవుడు మనల్ని శపించకుండా క్రీస్తు కచ్చితంగా ఆపాడు. మన స్థానంలో క్రీస్తును దేవుడు శపించినప్పుడు ఇది జరిగింది. మాను మీద వ్రేలాడదీసే ప్రతివ్యక్తినీ దేవుడు శపిస్తాడు. అని లేఖనాల్ రాలో సినవి మీరు చదవొచ్చు.
\v 14 అబ్రాహామును దీవించినట్టే దేవుడు క్రీస్తులో విశ్వాసం ఉంచిన యూదేతరులను దీవించడం కోసం ఆయన క్రీస్తును శపించాడు. ఆ విధంగా యూదేతరులను దేవుడు దీవించాడు. కాబట్టి క్రీస్తులో విశ్వాసముంచిన అందరికీ ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన పరిశుద్దాత్మను మనం పొందవచ్చు.
\s5
\p
\v 15 నా తోటి విశ్వాసులారా, ఇద్దరి వ్యక్తుల మధ్య ఉన్న ఒప్పందం లాంటిదే దేవుని వాగ్దానం. ఒక్కసారి ఇద్దరు సంతకం చేసిన తరువాత దాన్ని ఎవ్వరూ రద్దు చేయలేరు, దానికి ఎలాటిదీ కలపలేరు.
\v 16 అబ్రాహాముకు, అతడి వారసుల్లో ప్రత్యేకమైన వాళ్ళకు దేవుడు వాగ్దానం చేశాడు. గ్రంథాలలో నీ వారసులకు అని చెప్పడం లేదు. నీ వారసులకు అంటే అనేకమంది వారసులు అనే అర్థం వస్తుంది. కానీ దానికి బదులుగా నీ వారసుడు అని గ్రంథాల్లో రాసారు. అంటే అర్థం కేవలం ఒక్కడే. ఆయన క్రీస్తే.
\s5
\v 17 నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే దేవుడు అబ్రాహాముతో ఏర్పాటు చేసిన ఒప్పంద వాగ్దానం, అతని తరువాత 430 సంవత్సరాలకు వచ్చిన మోషేకు ఇచ్చిన ధర్మ శాస్త్రం రద్దు చెయ్యలేదు.
\v 18 ఎందుకంటే మనం ఆయన ధర్మ శాస్త్రాన్ని పాటిస్తున్నందువల్ల అది శాశ్వతంగా నిలిచి ఉండే జీవం ఇస్తున్నట్టయితే దేవుడు అలా చేస్తానని అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చి ఉండే వాడు కాదు. అయితే నిజానికి దేవుడు అబ్రాహాముకు ఇస్తానని స్వేచ్ఛగా వాగ్దానం చేశాడు. కాబట్టే దేవుడు అతనికి ఈ బహుమతిని ఇచ్చాడు.
\s5
\p
\v 19 అయితే దేవుడు మనకు ఈ ధర్మశాస్త్రాన్ని ఎందుకని ఇచ్చాడు? మనందరం ఉద్దేశ్యపూర్వకంగానే దాన్ని మీరుతామని మనకు బోధించడానికే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అబ్రాహాము వారసులు వచ్చే సమయానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అబ్రాహాముకు ముందే చేసిన వాగ్దానానికి అర్హత పొందినవాడే ఆ వారసుడు. అతడు వచ్చేవరకూ దేవునికీ, ప్రజలకీ మధ్య ఒక వ్యక్తిలా నిల్చుని దేవదూతలు ధర్మశాస్త్రాన్ని రక్షిస్తూ అమలు పరిచారు.
\v 20 ఒక వ్యక్తి మరో వ్యక్తితో నేరుగా మాట్లాడుతున్నప్పుడు అక్కడ మధ్యవర్తి లేడు. అలాగే దేవుడు తనకు తానుగా అబ్రాహాముతో నేరుగా వాగ్దానాలు చేశాడు.
\s5
\p
\v 21 కాబట్టి దేవుడు స్వయంగా చేసిన వాగ్దానానికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రం మాట్లాడుతుందా? ససేమిరా మాట్లాడదు. ఒకవేళ ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తూ దేవునితోబాటు శాశ్వతంగా జీవిస్తుంటే, అప్పుడు కచ్చితంగా ఆయన దృష్టిలో నీతిమంతులుగా మనల్ని భావిస్తాడు.
\v 22 కానీ అది అసాధ్యం. దానికి బదులుగా మనం పాపం చేస్తున్నప్పుడు మనం జైల్లో ఉన్న ఖైదీగా ధర్మశాస్త్రం మనల్ని అన్ని విషయాల్లో నియంత్రిస్తుంది. కాబట్టి ఆ జైలునుండి మనల్ని విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, ఆయన యేసుక్రీస్తుపై విశ్వాసముంచిన వాళ్ళను గూర్చి మాట్లాడుతున్నాడు.
\s5
\v 23 క్రీస్తులో ప్రజలు ఎలా నమ్మకం ఉంచాలో అనే సువార్తను తెలియజేయక ముందు, మనల్ని జైల్లో ఉంచి ఎటూ కదలడానికి వీల్లేకుండా కాపలా కాసే సైనికుడిలా ధర్మశాస్త్రం ఉంది.
\v 24 తండ్రి తన చిన్న బిడ్డను సంరక్షించడానికి ఏర్పాటు చేసుకున్న సేవకుడితో తన చిన్న బిడ్డను జాగ్రత్తగా చూసుకోమని చెప్పినట్లుగా, క్రీస్తు వచ్చేదాకా మనల్ని పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిందే ఈ ధర్మశాస్త్రం. మనం క్రీస్తులో విశ్వాసం ఉంచితే, తన దృష్టిలో నీతిమంతులుగా ఇప్పుడు ఆయన ప్రకటించడానికి ఆయన ఇది అంతా చేశాడు.
\v 25 అయితే ఇప్పుడు మనం క్రీస్తులో విశ్వాసం ఉంచాము కాబట్టి ఇక మనపై దేవుని ధర్మశాస్త్ర పర్యవేక్షణ అవసరం లేదు.
\p
\v 26 మీరు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచినందువల్ల మీరందరూ దేవుని పిల్లలు కాబట్టి నేను ఇది అంతా చెప్తున్నాను.
\s5
\v 27 క్రీస్తులో విశ్వాసం ఉంచిన వారందరూ బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి మీరందరూ ఆయనతో కలిసి పోయారు. కాబట్టి క్రీస్తు జీవితపు వ్యక్తిత్వ లక్షణాలు అలవరుచుకోండి.
\v 28 మీరు విశ్వాసులైతే, మీరు యూదులైనా, యూదేతరులైనా సేవకులైనా యజమాని లేని స్వతంత్రులైనా, మగవారైనా, ఆడవారైనా ఎవరైనా దేవునికి పట్టింపు లేదు. ఎందుకంటే మీరందరూ కలిసి క్రీస్తుతో కలిసి పోయారు.
\v 29 ఇంకా వివరంగా మాట్లాడుకుంటే, మీరు క్రీస్తుకు చెందిన వారు అయినప్పటి నుండీ ఆయన మిమ్మల్ని అబ్రాహాము వారసులుగా చేస్తాడు. తద్వారా దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానాలన్నిటినీ మీరు పొందుతారు.
\s5
\c 4
\p
\v 1 ఇప్పుడు నేను మరింత ముందుకు వెళ్ళి పిల్లలు, వారసులు అంటే ఏమిటో వివరంగా చర్చిస్తాను. వారసుడంటే కుమారుడు. అతడు తన తండ్రికి ఉన్న ఆస్తి మొత్తాన్ని, తండ్రి తదనంతరం స్వాధీనం చేసుకుంటాడు. కానీ ఆ వారసుడు చిన్నపిల్లవానిగా ఉన్నంతకాలం, అతడిని ఒక సేవకుడిలానే ఇతరులు నియంత్రిస్తారు.
\v 2 ఇంతకు ముందే అతడి తండ్రి నిర్ణయించిన రోజు వచ్చేదాకా ఆ చిన్నపిల్లవాడిని ఇతరులు పర్యవేక్షిస్తూ సంరక్షిస్తూ, అతడి ఆస్తిని నిర్వహిస్తూ కాపాడతారు.
\s5
\v 3 ఆవిధంగానే మనం చిన్నపిల్లల్లా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలోని ప్రతిఒక్కరూ జీవిస్తూ, అనుసరిస్తున్న చెడు నియమాల కింద ఉన్నాము. యజమాని తన సేవకులను నియంత్రిస్తున్నట్లుగా ఈ నియమాలు అంటే ధర్మశాస్త్రం మనల్ని నియంత్రించింది.
\p
\v 4 కానీ దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు తన కుమారుడైన యేసును ఈ లోకంలోకి పంపాడు. యేసు ఒక సాధారణ స్త్రీ గర్భం నుంచి పుట్టాడు కాబట్టి ఆయన ఈ లోక సంబంధమైన ధర్మశాస్త్రాన్ని పాటించవలసి వచ్చింది.
\v 5 మనల్ని నియంత్రిస్తున్న ధర్మశాస్త్రం నుంచి రక్షించటానికి దేవుడు యేసును పంపాడు. మనల్ని తన సొంత పిల్లలుగా దత్తత చేసుకోవటానికి దేవుడు ఈ విధంగా చేశాడు.
\s5
\p
\v 6 ఇప్పుడు మీరందరూ దేవుని కుమారులు అయినందువల్ల, మనలో ప్రతి ఒక్కరిలో నివసించడానికి తన కుమారుని ఆత్మను ఆయన మనకు పంపాడు. ఇది దేవుని ఆత్మ కాబట్టి ఒక కుమారుడు తన తండ్రిని తండ్రీ, నాన్నా, నా ప్రియమైన తండ్రీ అంటూ పిలిచే అనుమతి దేవుడు మనకు ఇస్తున్నాడు. ఇదే మనం దేవుని కుమారులమని చూపిస్తుంది.
\v 7 కాబట్టి ఇక మీలో ఎవ్వరూ సేవకుల్లా ఉండకూడదనే దేవుడు ఈ విధంగా చేసాడు. మీలో ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలే. కాబట్టి మీరు దేవుని పిల్లలైనప్పటి నుంచీ, ఆయన తాను ఇస్తానని చేసిన వాగ్దానాలన్నిటినీ దేవుడు ఇస్తాడు. దేవుడే తనకు తానుగా ఇదంతా చేస్తాడు.
\s5
\p
\v 8 మీకు దేవుని గూర్చి తెలియనప్పుడు, నిజంగా ఉనికిలో లేని దేవుళ్ళను మీరు దేవుళ్ళుగా ఆరాధించారు. మీరు వాటికి బానిసలుగా ఉండేవారు.
\v 9 కానీ ఇప్పుడు అసలైన మీరు దేవుణ్ణి తెలుసుకున్నారు. అంతే కాక మీలో ప్రతి ఒక్కరూ దేవునికి తెలుసు అనడం సబబుగా ఉంటుంది. అయితే ఎందుకని మీరు మళ్ళీ వెనుకకు తిరిగి బలహీనమైనవీపనికిమాలినవీ అయిన ఈ లోక నియమాలను అనుసరిస్తున్నారు? మళ్ళీ మీరందరూ వాటి సేవకులుగా, బానిసలుగా మారాలని చూడడం లేదు కదా.
\s5
\p
\v 10 అయితే చూడడానికి మీరు ఆ విధంగా కోరుకుంటున్నట్టు కనిపిస్తున్నది. గతంలో ఇతరులు మీరు ఏమైతే చేయడం లేదని మిమ్మల్ని అవమానించారో, అంటే సంవత్సరాలు, నెలలు, ఋతువులు, ముహూర్తాలు అని చెప్పుకొంటున్న వాటిని మళ్ళీ మీరు అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
\v 11 నేను మీగురించి పుట్టెడు దుఃఖంతో ఉన్నాను. నేను మీ కోసం ఎంతో చెమటోడ్చాను. కానీ ఇప్పుడు ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు లాగా తోస్తున్నది.
\s5
\v 12 నా తోటి విశ్వాసులారా, నాలాగా మారమని మిమ్మల్ని గట్టిగా వేడుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ధర్మశాస్త్రం అదుపులో ఉంచుకునేందుకు ససేమిరా ఒప్పుకోను. ఈ ధర్మశాస్త్రం నుంచి నేను విడుదలైనప్పుడు, నేను మీలాంటి యూదేతరుడనయ్యాను. కాబట్టి మీరు కూడా ఇప్పుడు మళ్ళీ ఆరాధిస్తున్న దేవుళ్ళ నుంచి బయట పడండి. నేను మొదట మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు, మీరు నాకు ఎలాటి ఇబ్బంది, హాని కలిగించలేదు. కానీ ఇప్పుడు మీ గురించి దిగులు పడేలా చేస్తున్నారు.
\p
\v 13 నేను మొదటిసారి మీకు సువార్తను చెప్పినప్పుడు అనారోగ్యంతో ఉన్న సబ్గతి గుర్తుకు తెచ్చుకోండి.
\v 14 నేను అనారోగ్యంగా ఉన్న కారణంగా మీరు నన్ను నిర్లక్ష్యం చేయవచ్చు. కానీ మీరు నన్ను నిర్లక్ష్యం చేయలేదు. పైగా నన్ను దేవుని దగ్గరనుండి వచ్చిన దేవదూతనన్నట్టు స్వాగతించారు. యేసు క్రీస్తును స్వాగతించినట్టుగా నన్ను స్వాగతించారు.
\s5
\p
\v 15 అయితే ఇప్పుడు ఆ సంతోషమంతా ఏమైపోయింది? మీరు నాకు సహాయం చేయడానికి కొండమీది కోతినైనా తేగలరని నాకు కచ్చితంగా తెలుసు. నాకు అవసరం అనుకుంటే మీ కళ్ళు సైతం పీకి ఇచ్చేవారే.
\p
\v 16 ఈ కారణం చేత నేనెంతో చింతిస్తున్నాను. నేను మీకు క్రీస్తుని గూర్చిన నిజాన్ని చెప్పడం కొనసాగిస్తూ ఉన్నందువల్ల, నేను మీకు శత్రువునైనట్టు ఆలోచిస్తున్నారా ఏమిటి?
\s5
\v 17 యూదా ధర్మశాస్త్రాన్ని పాటించాలని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్న వాళ్ళు మీరు తమను అనుసరించేలా ప్రయత్నిస్తున్నారు. కానీ వారు ఇలా చేస్తున్నది మీ మంచి కోసం కాదు. నానుంచి వేరు చేయాలనేదే వారి కోరిక. ఎందుకంటే మీరు నన్ను కాకుండా వాళ్ళను అనుసరించాలని వారి దురుద్దేశం.
\v 18 సరే, మంచి పనులు చేయడానికి ఒత్తిడి చేస్తే మంచిదే. అయితే ఏం చేయాలో మీకు బోధిస్తున్న వాళ్ళు సరైన వ్యక్తులో కాదో ముందు నిర్ధారించుకోండి. నేను మీతో ఉన్నప్పుడే కాకుండా, లేనప్పుడు కూడా అస్తమానం ఇలా చేయండి.
\s5
\p
\v 19 మీరు నా పిల్లల వంటి వారు. కాబట్టి మళ్ళీ మీగూర్చి నేను వ్యాకులపడుతున్నాను. మీరు క్రీస్తులా మారేంతవరకూ ఇలాగే మీగూర్చి బాధ పడుతుంటాను.
\v 20 అంతేకాక ఇప్పుడు మీతోపాటు అక్కడ ఉండి మరింత సున్నితంగా మాట్లాడాలని ఉంది. ఎందుకంటే మీ గూర్చి ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచడం లేదు.
\s5
\p
\v 21 మళ్ళీ ఈ విషయాలను గూర్చి ఇంకా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. దేవుని ధర్మశాస్త్రం లోని అన్ని నియమాలకూ లోబడాలని మీలో కొందరు కోరుకుంటున్నారు. అయితే ధర్మశాస్త్రం ఏం చెబుతున్నదో మీరు నిజంగా శ్రద్ధగా గమనిస్తున్నారా?
\v 22 ధర్మశాస్త్రంలో అబ్రాహాము ఇద్దరు పిల్లలకు తండ్రి అని మనం చదువుతాము. తన దాసీ హాగరు ఒక కుమారుడికి జన్మనిస్తే, అతడి భార్య శారా మరో కుమారుడికి జన్మనిచ్చింది. ఈమె బానిస, దాసీ కాదు.
\v 23 దాసీ అయిన హాగరుకు పుట్టిన ఇష్మాయేలు పుట్టుక సాధారణమైనదే. కానీ సేవకురాలు కాని శారానుండి జన్మించిన ఇస్సాకు పుట్టుక అద్భుతం. ఎందుకంటే కుమారుణ్ణి ఇస్తానని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేసాడు.
\s5
\p
\v 24 ఇప్పుడు ఈ ఇద్దరు స్త్రీలు రెండు ఒప్పందాలకు గుర్తులు. సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మొదటి నిబంధన చేశాడు. ఈ నిబంధన ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్రానికి సేవకుల్లా జీవించాలి. కాబట్టి హాగరు అనే దాసీ ఈ నిబంధనకు గుర్తు.
\v 25 అంటే హాగరు అరేబియా దేశంలోని సీనాయి పర్వతానికి గుర్తు. అంతే కాకుండా ఈనాటి యెరూషలేము నగరానికి కూడా హాగరు గుర్తుగా ఉంది. అలా ఎందుకంటే యెరూషలేము బానిసత్వంలో ఉన్న తల్లిలా ఉంది. ఆమె, ఆమె పిల్లలూ అంటే ఆ ప్రజలందరూ బానిసల్లాంటి వారే. ఎందుకంటే సీనాయి పర్వతం వద్ద ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి వాళ్ళందరూ విధేయత చూపించాలి.
\s5
\p
\v 26 అయితే పైనున్న పరలోకంలో కొత్త యెరూషలేము ఉంది. ఆ నగరం క్రీస్తులో విశ్వాసముంచిన వాళ్ళందరికీ తల్లి లాంటిది. ఆ నగరంలో పూర్తి స్వేచ్ఛ ఉంది.
\v 27 పాత యెరూషలేము కంటే కొత్త యెరూషలేములో ఎక్కువమంది ప్రజలు ఉంటారు. ఎందుకంటే యెషయా ప్రవక్త రాశాడు గదా.
\q "యెరూషలేము నివాసులారా ఉప్పొంగి పొండి.
\q ఇప్పుడు పిల్లలు కనలేని స్త్రీ వలే
\q నిస్సంతుగా ఉన్నావు.
\q కానీ ఒక రోజు నీవు సంతోషంతో కేరింతాలు కొడతారు.
\q ఇపుడు మీకు పిల్లలు లేనప్పటికీ పిల్లలను కనలేని గొడ్రాలు లాగా దిక్కులేనట్టుగా ఉన్నప్పటికీ
\q నీకు గంపెడు సంతానం కలుగుతుంది.
\q భర్తతో కాపురం చేసే ఏ మహిళా కూడా కనలేనంతమంది."
\s5
\p
\v 28 నా తోటి విశ్వాసులారా, ఇప్పుడు మీరు దేవుని పిల్లలు అయ్యారు. ఎందుకంటే దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన దాన్ని మీరు విశ్వసించారు. మీరు దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించిన అబ్రాహాముకు పుట్టిన ఇస్సాకు వంటి వారు.
\v 29 కానీ అంతకు ముందే శారీరికంగా పుట్టిన అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలు. అతడు పరిశుద్దాత్మ కార్యం ద్వారా జన్మించిన ఇస్సాకును వేధించాడు. ఇప్పుడూ అలానే జరుగుతోంది. దేవుని ధర్మశాస్త్రానికి బానిసలైన ప్రజలు, క్రీస్తు చేసిన వాగ్దానం నమ్మిన మనల్ని హింసిస్తున్నారు.
\s5
\p
\v 30 కానీ గ్రంధాల్లో ఈ మాటలు ఉన్నాయి. బానిస కాక స్వతంత్రంగా ఉన్న స్త్రీకీ పుట్టిన వాడే తన తండ్రికి వారసుడు. బానిస కుమారుడికి ఎలాటి వారసత్వపు హక్కులూ లేవు. కాబట్టి ఆమెను, ఆమె కుమారుడినీ ఈ ప్రదేశం నుండి దూరంగా పంపి వేయండి.
\v 31 నాతోటి విశ్వాసులారా, మనం ఆ బానిస స్త్రీకి పుట్టిన వాళ్ళం కాము. మనం స్వేచ్ఛ గా ఉన్న స్త్రీకి పుట్టిన పిల్లలం.
\s5
\c 5
\p
\v 1 క్రీస్తు మనల్ని ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు కాబట్టి ఇక ధర్మశాస్త్రం ఎంతమాత్రం మనల్ని నియంత్రించలేదు. మిమ్మల్ని ఎవరైనా ధర్మశాస్త్రానికి మీరు బానిసలే అంటే వాళ్ళని వారించండి. ఇక ధర్మశాస్త్రం మిమ్మల్ని బానిసల్లా నియంత్రించనివ్వకండి.
\v 2 అపోస్తలుడైన పౌలు అను నేను ఇప్పుడు మీకు చెబుతున్న దానిని చాలా జాగ్రత్తగా పరిగణలోనికి తీసుకోండి. మీకు సున్నతి చేయడానికి మీరు ఎవరికైనా అవకాశం ఇస్తే, మీకోసం క్రీస్తు చేసినది మీకు ఏమాత్రం సహాయ పడదు.
\s5
\v 3 సున్నతి చేసుకున్న ప్రతి మనిషికీ నేను గంభీరమైన స్వరంతో ప్రకటిస్తున్నది ఏంటంటే దేవుని దృష్టిలో అతడు నీతిమంతుడిగా ప్రకటించాలి, అంటే అతడు ధర్మశాస్త్రాన్ని పూర్తి విధేయుడై పాటించాలి.
\v 4 మీరు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నిస్తున్నందున, దేవుడు మిమ్మల్ని తన దృష్టిలో నీతిమంతులుగా ప్రకటించాలని మీరు ఆశిస్తున్నట్లైతే, మీరు క్రీస్తులో నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకున్నట్లే. దేవుడు ఇకపై మీపట్ల ఎంతమాత్రమూ దయగా నడుచుకోడు.
\s5
\v 5 మనం క్రీస్తులో విశ్వసించడానికి దేవుని ఆత్మ వీలు కల్పిస్తుంది. అందువల్ల మనమందరం దేవుడు మనల్ని నీతిమంతులుగా ప్రకటించే రోజు కోసం ఆత్మా విశ్వాసంతో నమ్మకంతో ఎదురు చూస్తున్నాము.
\v 6 మనకు సున్నతి ఉందా, లేదా అనే దానిని గూర్చి దేవుడు ఎంతమాత్రం ఆందోళన పడదు. మనం క్రీస్తులో నమ్మకం ఉంచామా లేదా అనే దాన్ని గూర్చే దేవుడు ఆందోళన చెందుతున్నాడు. క్రీస్తులో నమ్మకం వుంచడం ఫలితంగా మనం ఇతరులను ప్రేమిస్తున్నాము. ఎందుకంటే మనం ఆయనలో నమ్మిక ఉంచిన వారం కాబట్టి.
\p
\v 7 మీరు చాలా బాగా క్రీస్తును వెంబడిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన నిజమైన సందేశాన్ని పాటించకుండా, మిమ్మల్ని ఆపిందెవరు?
\v 8 ఈ విధంగా మిమ్మల్ని ఆలోచించమని ఒప్పించినది మిమ్మల్ని ఎంచుకున్న దేవుడు కాదు.
\s5
\v 9 కొద్దిగా పులిసిన పదార్ధం రొట్టెల ముద్దనంతా పొంగచేస్తున్నట్లుగా, కొంతమంది బోధిస్తున్న ఈ తప్పుడు బోధలు మీ అందరికీ వ్యాపింపచేసే ప్రమాదముంది.
\v 10 మన ప్రభువైన యేసు, తన సత్య సువార్తను తప్ప మిగతాది మరేదైనా మిమ్మల్ని నమ్మకుండా చేస్తాడని నాకు కచ్చితంగా తెలుసు. ఈ తప్పుడు సందేశాన్ని బోధిస్తూ మిమ్మల్ని గందరగోళం చేస్తున్నది ఎవరైనా సరే, దేవుడు వాళ్ళని తప్పక శిక్షిస్తాడు.
\s5
\p
\v 11 కానీ నా తోటి విశ్వాసులారా, మీరు సున్నతి పొందాలని నేను ఇప్పటికీ బోధిస్తున్నట్టుగాఎవరైనా మీకు చెబుతున్నారా? నేను క్రీస్తును వెంబడించక మునుపు అలా బోధించినమాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఎంతమాత్రం ఆ విధంగా బోధించడం లేదు. వాళ్ళు నా గూర్చి చెబుతున్నది నిజం కాదు. అలా కాకుంటే ఇప్పుడు నన్ను ఎవరూ ఈ విధంగా హింస పెట్టేవారు కాదు కదా. నేను చెప్పేది ఏమిటంటే, క్రీస్తును వెంబడించాలంటే సున్నతి పొందాలని ఎవరన్నా ఆలోచిస్తే, ఇక క్రీస్తు సిలువపై మరణించడం వల్ల వచ్చిన లాభం ఏమిటి?
\v 12 మిమ్మల్ని గందరగోళ పరుస్తున్న వారు తమకు తాముగా అంగాన్ని నరికేసుకోవాలి!
\s5
\p
\v 13 నాతోటి విశ్వాసులారా, మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి దేవుడు పిలిచాడు. అయితే దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది మీరు యధేచ్చగా పాపం చేయడానికి అనుకోకండి. దీనికి బదులుగా ఒకరినొకరు ప్రేమిస్తూ, సహాయం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలా చేయడానికి స్వతంత్రులు.
\v 14 యేసు ప్రభువు ఏం చెప్పాడో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే ప్రతి ఒక్కరినీ ప్రేమించండి అనే వాక్యంలోనే ధర్మశాస్త్రం మొత్తం అర్థం ఉంది, అని ఆయన చెప్పాడు.
\v 15 అడవి జంతువుల్లా మీరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ, హాని చేసుకుంటూ పోతే, మీరు ఒకరినొకరు పూర్తిగా నాశనం చేసుకుంటారు.
\s5
\p
\v 16 కాబట్టి నేను మీకు చెప్పేదేమిటంటే, ఎప్పుడూ దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపించ నివ్వండి, మీరు ఇలా చేస్తే, అంటే దేవుని ఆత్మ నడిపింపులో ఉంటే, మీరు చేయాలనుకొనే పాపకృత్యాలు చేయరు.
\v 17 మీరు ఎప్పుడైతే పాపం చేయాలనుకుంటారో అప్పుడు దేవుని ఆత్మకు వ్యతిరేకంగా వెళుతున్నారు. దేవుని ఆత్మ మీ పాపపు కోరికలకు వ్యతిరేకం. ఈ రెండూ ఎప్పుడూ ఒక దానితో ఒకటి వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి. ఫలితంగా మీరు నిజంగా చేయాలని కోరుకునే మంచి పనులు మీరు ఎప్పుడూ చేయలేరు.
\v 18 అయితే దేవుని ఆత్మ నడిపిస్తున్నప్పుడు, ధర్మశాస్త్రం మిమ్మల్ని నియంత్రించలేదు.
\s5
\p
\v 19 పాపాన్ని గుర్తించడం చాలా సులభం. ఈ పాపాత్ములు అనైతికమైన లైంగిక చర్యలకు పాల్పడతారు. ఇవి సహజమైన పద్ధతికి వేరుగా విపరీతమైనవిగా ఉంటాయి. వాళ్ళు ఆశించేవి చట్టవిరుద్ధంగా ఉంటాయి.
\v 20 వాళ్ళు అబద్ద దేవుళ్ళను ఆరాధిస్తారు. ఆ దేవుళ్ళను సూచించే వస్తువులను కూడా ఆరాధిస్తారు. తమ కోసం పనిచేయడానికి దుష్ట శక్తులను వశం చేసుకోడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆ మనుషులు ఇతరులకు విరోధంగా ఉంటారు. ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. వాళ్ళు అసూయపరులు, కోపోద్రిక్తులు. ఇతరులకంటే తమను గొప్పవారిగా భావిస్తూ, ఎదుటి వాళ్ళు తమను అలా ఎంచాలని ప్రయత్నిస్తారు. ఎదుటి వాళ్ళు కోరుకునేది లెక్క చెయ్యరు. ఈ మనుషులు ఇతరులతో కలవరు. తమతో ఏకీభవించే వాళ్ళతోనే కలుస్తారు.
\v 21 ఎదుటి వాళ్లకి ఉన్నది తమది కావాలని కోరుకుంటారు. ఈ మనుషులు తాగుబోతులు. తాగి అల్లర్లు చేస్తారు. ఈ విధంగానే అందరూ ఆలోచించేలా చేస్తారు. కాబట్టి ఇంతకు మునుపు హెచ్చరించినట్టేలే ఇప్పుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాను. ఇలాటి పాతకాలను నిరంతరం ఆలోచిస్తూ, దాన్నే చేస్తూ ఉండేవారు దేవుడు రాబోయే కాలంలో తనను రాజుగా వెల్లడి పరుచుకునేటప్పుడు తన ప్రజల కోసం ఏర్పాటు చేసిన దాన్ని వాళ్ళు పొందలేరు.
\s5
\p
\v 22 అయితే క్రీస్తులో నమ్మకం పెంపారుతున్న కొద్దీ, మనం ఇతరులను ప్రేమించేలా దేవుని ఆత్మ మనపై ప్రభావం చూపుతాడు. మనం ఆనంద భరితులం, శాంతి కాముకులం, సహనశీలురం, దయామయులం, మంచి వాళ్ళం, ఇతరులు ఆధారపడదగిన వాళ్ళం.
\v 23 మనం సున్నితమనస్కులం. ప్రవర్తన అదుపులో ఉంచుకునే వాళ్ళం. ఈ వాలకానికీ పద్ధతికీ వ్యతిరేకమైన నియమం ఏదీ లేదు.
\v 24 అంతేకాక ఇప్పుడు క్రీస్తుకు చెందిన మనం గతంలో చేసిన ఈ చెడ్డ పనులు ఇప్పుడు చేయకుండా అదుపు చేసుకునే విధంగా యేసు క్రీస్తు ప్రభువు చేశాడు. మనం వాటిని సిలువకు మేకులతో కొట్టి వధించినట్టు అయింది.
\s5
\p
\v 25 మనం కొత్త మార్గంలో జీవించడానికి దేవుని ఆత్మ మనకు వీలు కల్పిస్తున్నప్పటి నుండీ దేవుని ఆత్మ నడిపింపులో మనం ప్రవర్తించాలి.
\v 26 స్వాతిశయం పనికి రాదు. ఒకరినొకరు కోపం రేపుకోకూడదు. అసూయ పడరాదు.
\s5
\c 6
\p
\v 1 నా తోటి విశ్వాసులారా, మన సోదరసోరీల్లో ఎవరన్నా తప్పు చేస్తున్నట్లుగా కనిపిస్తే దేవుని పరిశుద్దాత్మ నడిపింపులో ఉన్న మీరు వాళ్ళను సున్నితంగా గద్దించి సరిదిద్దాలి. ఇంకా చెప్పాలంటే, మీరు ఇతరులను సరిదిద్దుతున్నప్పుడు ముందుగా అసలు మీరు పాపంలో పడతారేమో జాగ్రత్తగా చూసుకోవాలి.
\v 2 అలాగే మన సోదరుడైనా సోదరైనా ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మీరు ఒకరి కొకరు సహాయ పడాలి. ఆవిధంగా చేయడం ద్వారా మీరు క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తున్న వారౌతారు.
\s5
\v 3 నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే తమను తాము గొప్ప వాళ్ళుగా ఆలోచించే వాళ్ళు కేవలం అవివేకులు.
\v 4 ప్రతి ఒక్కరూ తమను తాము నిరంతరం పరీక్షించుకోండి. మీరు ఆలోచిస్తున్న, చేస్తున్న పనులు అసలు మీకు ఆమోదయోగ్యంగా ఉన్నాయా లేదా అని నిర్ధారించుకోండి. మీకు మీరుగా చేసిన మంచి పనులను బట్టి గర్వపడవచ్చు. అంతే కానీ మరెవరో చేసినదానికన్నా నేను చేసినది బాగా ఉంది అని గర్వ పడటం మంచిది కాదు.
\v 5 నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీలో ప్రతిఒక్కరూ మీ వ్యక్తిగతమైన పనులను మీరే సొంతంగా చేయాలి.
\s5
\p
\v 6 మీ తోటి విశ్వాసులు మీకు దేవుని గూర్చిన సత్యాన్ని బోధించినప్పుడు మీరు మీకున్న వాటిని వారితో పంచుకోవాలి.
\v 7 మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఎవరూ దేవుణ్ణి మోసం చేయలేరు అని గుర్తు పెట్టుకోండి. ఒక రైతు ఎలాంటి విత్తనాలు చల్లాడో ఆ పంటనే పొందినట్టుగా, దేవుడు కూడా మనుషులు చేసిన పనుల ప్రకారమే వాళ్లకు తిరిగి ప్రతిఫలం ఇస్తాడు.
\v 8 తెలిసీ కావాలని పాపం చేసిన వాళ్ళకు దేవుడు నిత్య నరకాగ్నిని శిక్షగా విధిస్తాడు. కానీ దేవుని పరిశుద్ధాత్మను సంతోషపరిచేలా నడుచుకున్న వాళ్ళు దేవునితోపాటు నిత్యం జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుని పరిశుద్దాత్మ తమకు చెప్పినట్టుగా నడుచుకున్నారు.
\s5
\v 9 అయితే మనం దేవునికి నచ్చినదాన్ని అలిసిపోకుండా చేస్తుండాలి. ఎందుకంటే మనం చేస్తున్న మంచి పనులు ఎడతెగక చేస్తున్నట్లయితే చివరకు దేవుడు నిర్ణయించిన సమయంలో దానికి తగిన ప్రతిఫలం మనం పొందుతాము.
\v 10 కాబట్టి మనకు అవకాశం ఉన్నప్పుడల్లా ప్రజలందరికీ ఏది మంచిదో అది చేయాలి. ముఖ్యంగా మన తోటి విశ్వాసులకు తగినంత సహాయం చేయాలి.
\s5
\p
\v 11 ఈ లేఖలో ఈ చివరి భాగాన్ని నా సొంత చేతులతో రాస్తున్నాను. నా రాతలోని పెద్ద అక్షరాలను మీరు గమనించవచ్చు.
\v 12 కొంతమంది యూదు విశ్వాసులు మీకు సున్నతి చేయించాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని యూదు మతంలోకి మార్చామని ఇతర యూదులు వాళ్ళను గూర్చి గొప్పగా చెప్పుకోవాలని భావిస్తున్నారు. కానీ నిజానికి వాళ్ళు క్రీస్తు సిలువమీద మరణించాడని విశ్వసించిన తమ విశ్వాసాన్ని బట్టి ఇతరులు వాళ్ళని హింసించకుండా చూసుకోవడం కోసమే వాళ్ళు ఇలా చేస్తున్నారు.
\p
\v 13 నేను ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే అలా చేస్తున్న మనుషులు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించరు. అయినా కూడా వాళ్ళు మీకు సున్నతి చేయాలని చూస్తున్నారు. తాము యూదా మత విశ్వాసంలోకి ఎక్కువ మందిని మార్చామని ప్రగల్భాలు చెప్పుకోవడానికే ఇదంతా.
\s5
\v 14 అయినప్పటికీ నాకు నేనుగా దేన్నిగురించీ ఆ విధంగా ప్రగల్భాలు చెప్పుకోకూడదని గట్టి పట్టుదలతో ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు గురించీ ఆయన సిలువపై చేసిన బలియాగం గురించీ మాత్రమే నేను గర్వ పడతాను. ఆయన సిలువమీద మరణించినప్పుడే అవిశ్వాసుల కోర్కెలన్నింటినీ నా దృష్టిలో విలువ లేనట్లుగా ఆయన మార్చి వేసాడు. నా కోరికలన్నీ వాళ్ళ దృష్టిలో ఏ విలువా లేనట్లుగా ఆయన చేశాడు.
\v 15 ఎందుకంటే మనుషులు సున్నతి పొందారా లేదా అనేదాన్ని దేవుడు లెక్కచేయడు. వాళ్ళను కొత్త మనుషులుగా మార్చడానికే ఆయన ప్రాధాన్యత ఇస్తాడు.
\v 16 ఇలా జీవిస్తున్న వారందరి పట్లా దేవుడు దయగా వ్యవహరిస్తూ, శాంతిని ఇచ్చు గాక. దేవునికి చెందిన ఈ నిజమైన ఇశ్రాయేలు జాతి ఇటువంటి విశ్వాసులదే.
\s5
\p
\v 17 నేను చెప్పేది ఏమిటంటే యేసును గూర్చిన సత్యాన్ని ప్రకటిస్తున్నందువల్ల మనుషులు నన్ను ఎంతో హింసించారు. దాని ఫలితంగా మీ కొత్త బోధకుల్లాగా కాకుండా, నా శరీరంపై ఎన్నో గాయాల మచ్చలు అలానే ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలను గూర్చి ఎవ్వరూ నన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్ట వద్దు.
\p
\v 18 నా తోటి విశ్వాసులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ క్షేమం కలగజేయును గాక. ఆమేన్.

View File

@ -293,4 +293,4 @@
\s5
\p
\v 23 తండ్రియైన దేవుడు, ప్రభువైన యేసు క్రీస్తు నా సాటి విశ్వాసులైన మీకు శాంతి అనుగ్రహించి మీరు ఆయనపై విశ్వాసంలో కొనసాగుతూ మీరు ఒకరినొకరు ప్రేమించుకునేలా చెయ్యాలని ప్రార్థన చేస్తున్నాను.
\v 24 దేవుడు మీ పట్ల, మన ప్రభు యేసు క్రీస్తుపై నిత్య ప్రేమను కనపరిచే వాళ్ళందరిపట్ల కనికరం చూపడం కొనసాగించాలని నా ప్రార్థన.
\v 24 దేవుడు మీ పట్ల, మన ప్రభు యేసు క్రీస్తుపై నిత్య ప్రేమను కనపరిచే వాళ్ళందరిపట్ల కనికరం చూపడం కొనసాగించాలని నా ప్రార్థన.

201
51-PHP.usfm Normal file
View File

@ -0,0 +1,201 @@
\id PHP - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
\toc1 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
\toc2 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
\toc3 php
\mt1 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 ఫిలిప్పీ పట్టణంలో నివసిస్తున్న ప్రియమైన నా తోటి విశ్వాసులకు పౌలు అనే నేను రాస్తున్నాను. క్రీస్తు యేసు దాసులైన పౌలు, తిమోతి అనే మేము ఫిలిప్పీలో దేవుని కోసం ప్రత్యేకంగా ఉండి క్రీస్తు యేసుతో కలిసి ఉన్న మీకందరికీ ఈ ఉత్తరం పంపుతున్నాము. ఇంకా అక్కడ పని చేస్తున్న సంఘ నాయకులకూ పరిచారకులకూ కూడా ఈ ఉత్తరం పంపుతున్నాము.
\v 2 మన తండ్రి అయిన దేవుని నుండీ మన ప్రభువు యేసుక్రీస్తు నుండీ మీకు కృపా, శాంతీ కలగాలనీ ప్రార్థిస్తున్నాం.
\s5
\p
\v 3 నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకున్నప్పుడల్లా నా ప్రార్థనల్లో నా దేవునికి వందనాలు చెబుతాను.
\v 4 మీ కోసం నేను ప్రార్థించే ప్రతిసారీ చాలా సంతోష పడతాను.
\v 5 సువార్త ప్రకటించే విషయంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ మీరు నాతోనూ, తిమోతితోనూ కలిసి పని చేసినందుకు దేవునికి వందనాలు చెప్తున్నాను.
\v 6 దేవుడు మీ మధ్యలో చాలా మంచి పనులు చేస్తున్నాడని నాకు తెలుసు. యేసు క్రీస్తు తిరిగి వచ్చే రోజు వరకూ ఆ పనులను ఆయన కొనసాగించి పూర్తి చేస్తాడని నా గట్టి నమ్మకం.
\s5
\p
\v 7 మిమ్మల్ని గురించి నేనిలా భావించడం సబబే. ఎందుకంటే నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నేను ఖైదులో ఉన్నప్పుడూ, సువార్త పక్షంగా బహిరంగంగా వాదిస్తూ అది సత్యమని నిరూపిస్తున్నపుడూ మీరంతా దేవుడు నాకు దయతో అనుగ్రహించిన ఈ పని చేయటానికి నాతో భాగస్వాములుగా ఉన్నారు.
\v 8 మీతో కలిసి ఉండాలని నేను ఎంతగా కోరుకుంటున్నానో దేవుడికే తెలుసు. క్రీస్తు యేసు మనల్నందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాడో నేను మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నాను.
\s5
\p
\v 9 మీరు ఒకరినొకరు ఇంకా ఎక్కువగా ప్రేమించుకోవాలి. దేవుడు ఎందుకు అలా కోరుకుంటున్నాడో అది మీరు తెలుసుకుని అర్థం చేసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను.
\v 10 ఇంకా, మీరు దేన్ని విశ్వసించాలో శ్రేష్ఠమైన విషయాలను పరీక్షించి ఎలా తెలుసుకోవాలో దేవుడు మీకు జ్ఞానం ఇవ్వాలని కూడా నేను ప్రార్ధిస్తున్నాను. క్రీస్తు తిరిగి వచ్చే రోజున మీరు యథార్థంగా నిర్దోషంగా ఉండాలన్నదే నా ప్రార్థన.
\v 11 యేసు క్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని మంచివారిగా ప్రకటించినందున మీరు చేయగలిగే పనులను ఎప్పుడూ చేస్తారని కూడా నేను ప్రార్ధిస్తున్నాను. మీరు దేవుణ్ణి ఎలా గౌరవిస్తున్నారో అందరూ చూస్తారు.
\s5
\p
\v 12 నా తోటి విశ్వాసులారా, నేను అనుభవించిన కష్టాలు మనుష్యులకు శుభవార్తను ప్రకటించకుండా నన్ను ఆపలేదని మీరు తెలుసుకోవాలని నా అభిలాష. అంతేకాకుండా నా కష్టాల వల్లే ఇంకా ఎక్కువమంది క్రీస్తును గురించిన శుభవార్తను వినగలిగారు.
\v 13 ముఖ్యంగా నేను క్రీస్తును గురించిన శుభవార్తను ప్రకటించడం వల్లే నేను ఇలా ఖైదీగా అయ్యానని ఇక్కడున్న కావలి సైనికులకూ మిగిలిన వారికీ తెలిసిపోయింది.
\v 14 ఇంకా ఇక్కడి విశ్వాసులలో చాలామంది యేసు గురించిన శుభవార్తను మరింత ధైర్యంగా, నిర్భయంగా ప్రకటిస్తున్నారు. ఎందుకంటే వారు తమకు సహాయం చేసే ప్రభువును ఇంకా గట్టిగా నమ్మారు. వారు యేసు గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడతారు, ఎందుకంటే నేను సువార్త చెపుతూ జైలులో ఉండగా ప్రభువు నాకు సహాయం చేయడం వారు చూసారు.
\s5
\p
\v 15 కొంతమంది మనుషులు అసూయతో శుభవార్త ప్రకటిస్తున్నారు. విశ్వాసులందరూ నన్ను గౌరవించడం కన్నా వారినే ఎక్కువగా గౌరవించాలని వారి కోరిక. మరికొందరు కూడా శుభవార్త ప్రకటిస్తున్నారు. అయితే వారు క్రీస్తును ప్రేమించేవారు, ఇంకా శుభవార్త వినని మనుషులు వినాలని వారు కోరుకుంటున్నారు.
\v 16 దేవుడు నన్ను శుభవార్త వివరించడానికీ ఆయన గురించి బహిరంగంగా మాట్లాడడానికీ నియమించాడని క్రీస్తును తమ ప్రేమ మూలంగా ప్రకటించే వారికి తెలుసు.
\v 17 కాని, స్వార్ధపూరిత కారణాల వల్ల క్రీస్తు గురించిన శుభవార్త ప్రకటిస్తున్నవారు మంచి ఉద్దేశంతో ప్రకటించడం లేదు. నేను ఇక్కడ జైలులో ఉన్నప్పుడు ఇలా చెయ్యడం వల్ల నన్ను చాలా బాధ పెడుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు.
\s5
\p
\v 18 అయితేనేం? మంచి కారణాలవల్ల గానీ చెడ్డ కారణాలవల్ల గాని, ఎలాగైనా క్రీస్తును ప్రకటించడం మాత్రం జరుగుతూ ఉంది. మనుషులు క్రీస్తు గురించిన సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నందుకు నేను ఆనందిస్తున్నాను. ఇక ముందు కూడా నేను దానిలో ఆనందిస్తూనే ఉంటాను.
\v 19 దేవుడు నన్ను జైలు నుండి విడిపిస్తాడు అని నాకు తెలుసు. అందుకే నేను సంతోషిస్తాను. మీరు నా కోసం ప్రార్ధించడం వలన, యేసు క్రీస్తు ఆత్మ సాయం వలన, దేవుడు ఇదంతా చేసాడు.
\s5
\p
\v 20 నేను క్రీస్తుని విశ్వాసంతో గౌరవిస్తానని చాలా నమ్మకంగా ఎదురు చూస్తున్నందువల్ల ఇది జరుగుతుందని నాకు తెలుసు. అయితే, ఎప్పటి లాగానే ఇప్పుడు కూడా నా చావు వలన గానీ బ్రతుకు వల్ల గానీ క్రీస్తును నా శరీరంతో ఘనపరుస్తాను అనే ధైర్యం నాకు ఉంది.
\p
\v 21 నావరకైతే నేను క్రీస్తుని గౌరవించటానికే జీవిస్తున్నాను. కానీ నేను చనిపోతే అది నాకు ఇంకా మంచిది.
\s5
\v 22 అయినా ఈ లోకంలో నేను నా శరీరంతో నివసిస్తూ ఉంటేనే నేను ఇక్కడ క్రీస్తుకు సేవ చేయగలుగుతాను. అందువల్ల, నేను జీవించటానికి ఇష్టపడుతున్నానా లేదా చనిపోవాలనుకుంటున్నానా అనేది నాకు తోచడం లేదు.
\v 23 జీవించడమా, చావడమా ఏది ముఖ్యమో నేను తేల్చుకోలేక పోతున్నాను. నేను చనిపోయి ఈ లోకాన్ని విడిచి క్రీస్తుతోనే ఉండిపోవాలని నా కోరిక. ఎందుకంటే ఎవరికైనా క్రీస్తుతో ఉండడం అనేదే అన్నిటికంటే ఉత్తమం.
\v 24 అయినా నేను భూమి మీద బ్రతికి ఉండడం చాలా అవసరం. ఎందుకంటే నేను మీకు సాయం చేయటం మీకు ఎంతో అవసరం.
\s5
\v 25 ఈ విషయంలో నాకు నమ్మకం ఉన్నందున క్రీస్తులో మీరు మరింతగా సంతోషించడంలో విశ్వసించడంలో మీకు సహాయపడటానికి నేను మీ అందరితో బ్రతికి ఉంటానని నాకు తెలుసు.
\p
\v 26 నేను మళ్ళీ మీతో కలిసి ఉండటానికి క్రీస్తు యేసు నన్ను తీసుకు వచ్చినందుకు మీకు చాలా సంతోషం కలిగి ఉండొచ్చు.
\v 27 మరీ ముఖ్యంగా క్రీస్తు గురించిన శుభవార్తను మీరు గౌరవిస్తూ మీ చుట్టూ నివసిస్తున్న మనుష్యుల ముందు చక్కగా ప్రవర్తించండి. నేను వచ్చినా రాకపోయినా మీరు ఇలా జీవిస్తున్నారని తెలుసుకుని నేను సంతోషించేలా మీరు ఇది చెయ్యండి. శుభవార్త మనకు బోధించినట్టు మీరు అందరూ నమ్మి అలాగే జీవించటానికి మీరు ఎంతో కృషి చేస్తున్నట్టు ఆ మనుషులు నాకు చెప్పాలి.
\s5
\p
\v 28 మీకు వ్యతిరేకంగా ఉన్న మనుషులు మిమ్మల్ని భయపెట్టనివ్వకండి. మీరు ధైర్యంగా ఉండి వారిని ఎదిరించినప్పుడు దీని వల్ల దేవుడు మిమ్మల్ని రక్షించి, వారిని నాశనం చేస్తాడని తెలుస్తుంది.
\v 29 దేవుడు మీ పట్ల ఎంతో దయ కలిగి ఉన్నాడు. మీరు క్రీస్తు కోసం బాధలు పడటానికీ ఆయనపై నమ్మకం ఉంచటానికీ ఆయన మీకు అవకాశం కలిగిస్తున్నాడు.
\v 30 నేను ఫిలిప్పీలో సువార్తను వ్యతిరేకించే వారిని ఎలా ఎదిరించాల్సి వచ్చిందో మీరు చూసినట్టే ఇంకా అలాంటి మనుష్యులను ఇక్కడ కూడా ఎదిరించినట్టు మీరు విన్నట్టే మీరు అదే విధంగా ఎదిరించాల్సి ఉంది.
\s5
\c 2
\p
\v 1 క్రీస్తు మనలను ప్రోత్సహిస్తున్నందువల్లా మనలను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తూ, దేవుని ఆత్మ మనతో సహవాసం చేస్తున్నందువల్లా క్రీస్తు మన పట్ల దయ కలిగి ఉండడం వల్లా,
\v 2 నేను పూర్ణ సంతోషంతో ఈ పనులన్నింటినీ చేయగలుగుతున్నాను. మీరు ఒకరితో ఒకరు సమ్మతిస్తూ, ప్రేమ కలిగి ఏకగ్రీవంగా పని చేస్తూ, ఒకే ప్రయోజనం కోసం పాటుబడుతూ ఉండండి.
\s5
\v 3 ఇతరుల కన్నా మీకు మీరే ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన వారుగా ఎంచుకోవటానికి ప్రయత్నించవద్దు. ఇంకా మీరు చేస్తున్న దాని గురించి గొప్పలు చెప్పుకోవద్దు. దానికి బదులుగా వినయంగా ఉండండి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం కంటే ఇతరులను ఎక్కువగా గౌరవించండి.
\v 4 మీలో ప్రతివాడూ తన సొంత అవసరాలే కాకుండా ఇతరుల అవసరాలను కూడా పట్టించుకుని వారికి సహాయం చేస్తుండాలి.
\s5
\p
\v 5 క్రీస్తు యేసు ఎలా ఆలోచించాడో మీరూ అలానే ఆలోచించండి.
\q
\v 6 ఆయన దేవుని స్వభావం కలిగినవాడైనప్పటికీ
\q1 దేవునితో సమానంగా ఉండే అన్ని ప్రాధాన్యతలను ఉంచుకోవాలని పట్టుబట్ట లేదు.
\q
\v 7 అందుకు బదులుగా అన్నింటిని వదిలేసాడు.
\q సేవకుడి లక్షణాలు తీసుకున్నాడు.
\q ఆయన మనిషిగా అయ్యాడు. మనిషిగా అయినప్పుడు
\q
\v 8 తనను తాను తగ్గించుకుని, చనిపోవటానికి సిద్ధమయ్యేటంతగా లోబడ్డాడు. ఒక నేరస్తుడిలా చనిపోవడానికి అంటే సిలువకు వ్రేలాడటానికి కూడా సిద్ధపడ్డాడు.
\s5
\q1
\v 9 దేవుడి పట్ల క్రీస్తు చూపిన విధేయత వల్లే దేవుడు ఆయన్ని అత్యున్నతంగా హెచ్చించాడు.
\q ప్రాణం ఉన్న వారందరి కంటే ఎక్కువగా ఆయనను గౌరవించాడు.
\q
\v 10 అందుచేత ఎవరైనా "యేసు" అనే పేరు విన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆయనను గౌరవిస్తూ మోకరించాలి.
\q
\v 11 ప్రతి ఒక్కరూ ప్రతి చోటా ఆయనను కీర్తిస్తూ,
\q యేసు క్రీస్తును ప్రభువుగా అంగీకరించాలి. వారందరూ ఆయన గురించే తండ్రి అయిన దేవుణ్ణి మహిమ పరుస్తారు.
\s5
\p
\v 12 నా ప్రియ స్నేహితులారా, నేను మీ దగ్గర ఉన్నప్పుడు దేవునికి లోబడుతున్నట్టుగానే, మీతో లేనప్పుడు కూడా మరి ఎక్కువగా ఆయనకు లోబడి ఉండండి. విధేయత కలిగి ఉండండి. దేవుడు రక్షించిన వారిలాగా జీవించటానికి మీ వంతు కృషి చేయండి.
\v 13 దేవుడు మీ హృదయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన సంతోషపడేలా మీరు చేయాలనుకుంటున్న మంచి పనులన్నీ చేయండి.
\s5
\p
\v 14 మీరు చేసేవన్నీసణుగుడు లేకుండా వాదించకుండా చేయండి.
\v 15 మీరు దేవుని పిల్లలుగా అవిశ్వాసుల మధ్య జీవిస్తున్నారు కాబట్టి మీరు తప్పు చేయకూడదు, దాన్ని గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే ఈ మనుష్యులంతా మేక తోలు కప్పుకున్న తోడేలువంటి వారు. ఈలాంటి వక్రజనం మధ్య మీరు చీకటిలో ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలి.
\v 16 మిమ్మల్ని శాశ్వతంగా జీవింపచేసే సందేశంఫై నమ్మకం ఉంచండి. మీరు అలా చేస్తే క్రీస్తు తిరిగి వచ్చే రోజున నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే దీన్ని బట్టి నేను మీ మధ్య చేసిన పని వ్యర్ధం కాలేదని నాకు తెలుస్తుంది.
\s5
\p
\v 17 వారు నన్ను చంపినా నా రక్తాన్ని దేవునికి పానార్పణం చేసినట్టుగా అనుకుని నేను మీ అందరితో కలిసి ఆనందిస్తాను. మీరు దేవునిపై నమ్మకం ఉంచి ఆయన చేసిన త్యాగానికి నేను చేసింది అదనంగా కలుస్తుంది.
\v 18 అలాగే మీరు కూడా సంతోషిస్తూ నాతోబాటు ఆనందించండి.
\s5
\p
\v 19 యేసు ప్రభువు చిత్తమైతే త్వరలో తిమోతిని మీ దగ్గరికి పంపాలనుకుంటున్నాను. అతడు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు మీ జీవితాల్లో ఏమి చేస్తున్నాడో చెబితే విని ప్రోత్సాహం పొందాలని ఆశిస్తున్నాను.
\v 20 మీ గురించి తిమోతి పట్టించుకున్నంతగా పట్టించుకొనే వాడు నా దగ్గర ఎవరూ లేరు.
\v 21 నేను పంపిన మిగతా వారంతా తమ సొంత పనులే చూసుకుంటున్నారు. యేసు క్రీస్తు ముఖ్యమైనదిగా భావించే దాని గురించి వారు పెద్దగా పట్టించుకోవడం లేదు.
\s5
\v 22 తిమోతి తనను తాను రుజువు చేసుకున్నాడు. ఎందుకంటే, తండ్రికి కొడుకు ఎలా సేవ చేస్తాడో అలాగే అతడు నాతో సువార్త ప్రచారంలో సేవ చేశాడని మీకు తెలుసు.
\v 23 అందుచేత నాకు ఏం జరగబోతున్నదో తెలిసిన వెంటనే అతన్ని తప్పక మీ దగ్గరకు పంపాలనుకుంటున్నాను.
\v 24 ఇలా జరగాలని ప్రభువు కోరుకుంటున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వారు త్వరలో నన్ను విడుదల చేస్తారనీ నేను మీ దగ్గరకు వస్తాననీ నాకు ఇంకా నమ్మకం ఉంది.
\s5
\p
\v 25 నా తోటి విశ్వాసి, జత పనివాడు, క్రీస్తు యోధుడు, మీ ప్రతినిధి, నాకు అవసరమైనప్పుడు సేవ చేసేవాడు అయిన ఎపఫ్రొదితును మీ దగ్గరికి పంపడం అవసరమనుకున్నాను.
\v 26 అతడు జబ్బు పడ్డాడని మీకు తెలిసింది కాబట్టి అతడు మీ అందరితో కలిసి ఫిలిప్పీలో ఉండాలని చాలా బెంగగా ఉన్నాడు.
\v 27 నిజానికి అతడు చాలా జబ్బుపడి చావుకు దగ్గరగా వెళ్ళాడు కాని చనిపోలేదు. దేవుడు అతని మీద జాలి పడ్డాడు. అతని మీదే కాదు, గోరు చుట్టుపై రోకటిపోటు పడకుండా నా మీద కూడా జాలి చూపాడు.
\s5
\v 28 కాబట్టి మీరు అతన్ని మళ్ళీ చూసి సంతోషించేలా, నా విచారం తగ్గేలా అతన్ని త్వరపెట్టి పంపుతున్నాను.
\v 29 ప్రభువైన యేసు మనలను ప్రేమిస్తున్నాడు గనక ఎపఫ్రొదితును పూర్ణానందంతో ప్రభువు పేరిట చేర్చుకోండి. అతనినీ మిగిలిన విశ్వాసులనూ గౌరవించండి.
\v 30 ఎందుకంటే అతడు క్రీస్తు పనిలో దాదాపుగా ప్రాణాలు పోయినంత పని అయింది. నాకు సేవ చేయడానికీ మీరు తీర్చలేకపోయిన నా అవసరాలను మీ బదులు తీర్చడానికి, అతడు తన ప్రాణం సైతం లెక్కచేయలేదు.
\s5
\c 3
\p
\v 1 చివరిగా, నా తోటి విశ్వాసులారా, మీరు ప్రభువుకు చెందినవారు కాబట్టి సంతోషంలో కొనసాగండి. ఈ విషయాలనే మీకు మళ్ళీ రాయడంవల్ల నేనేమీ అలసిపోను. ఇది మీకు హాని చేయాలనుకునే వారి నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
\p
\v 2 ప్రమాదకరమైన అడవి కుక్కల్లాంటి మనుష్యుల గురించి జాగ్రత్తగా ఉండండి. యూదులు మనుష్యులను హింసించినట్లే అవి కూడా వారి శరీరాలను ముక్కలుగా చేస్తాయి.
\v 3 కాని మనకు దేవుని ఆత్మ నిజంగా ఆయనను ఆరాధించడానికి అవకాశం కల్పిస్తుంది. యేసుక్రీస్తుని మనం నమ్ముతాము కాబట్టి మనం సంతోషంగా ఉంటాం. మనుషులు పాటించే ఆచారాలు లేక వేడుకలు అర్థం లేనివి కాబట్టి మనకు వాటిపై నమ్మకం లేదు.
\s5
\v 4 మేము దేవునికి అంగీకారంగా ఉండాలని ఈ ఆచారాలు పాటించడం లేదు. అయినప్పటికీ అది నాకు ఉపయోగకరంగా ఉంటే నేను ఇంకా బాగా చేయగలను.
\p
\v 5 నేను పుట్టిన ఏడు రోజులకు నాకు సున్నతి చేసారు. ఇశ్రాయేలు జాతిలో పుట్టాను. బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి. మీరు నన్ను మించిన హీబ్రూ జాతి వాణ్ణి కనుగొనలేరు. నా పితరులంతా హెబ్రీయులే. ఇంకా ఒక పరిసయ్యుడిగా మా పూర్వికులు బోధించిన మోషే ధర్మశాస్త్ర చట్టాలకు నేను లోబడ్డాను.
\s5
\v 6 క్రీస్తు విశ్వాసులు ఈ చట్టానికి లోబడేలా చేసి వారిని బాధించడం చాలా ఇష్టంగా ఉండేది. నేను చట్టానికి అవిధేయుడనని నా గురించి ఎవ్వరూ ఎప్పుడూ చెప్పలేరు.
\p
\v 7 క్రీస్తు నన్ను మార్చినందువల్ల ఏవైతే నాకు లాభంగా ఉండేవో వాటన్నిటినీ క్రీస్తు కోసం పనికి రానివిగా ఎంచాను.
\s5
\v 8 వాస్తవంగా ఇప్పుడు మిగతా వాటన్నిటినీ నష్టంగా పనికి రానివిగా ఎంచుతున్నాను ఎందుకంటే నా ప్రభువైన యేసు క్రీస్తును తెలుసుకోవడమే ఎంతో శ్రేష్ఠమైన విషయం. క్రీస్తును సంపాదించడానికి మిగిలిన వాటన్నింటినీ నా జీవితంలో నుండి తీసివేసి వాటిని చెత్తతో సమానంగా ఎంచుకున్నాను.
\v 9 ఇప్పుడు నేను పూర్తిగా క్రీస్తుకి చెందినవాణ్ణి. ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల దేవుని దృష్టిలో నేను మంచివాడిగా ఉండలేనని నాకు తెలుసు. క్రీస్తుపై పూర్తి నమ్మిక ఉంచాను కాబట్టి దేవుడే నన్ను ఆయన దృష్టిలో మంచివాడిగా ప్రకటించాడు.
\v 10 నేను క్రీస్తును ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా, క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతికినప్పుడు దేవుడు ఎలా శక్తివంతంగా పనిచేసాడో, నేను నా జీవితంలో ఆయన పనిని అలా శక్తివంతంగా నిరంతరం చేయాలనుకుంటున్నాను. దేవునికి విధేయత చూపించి క్రీస్తు ఎలా బాధలు పొందాడో అలాగే నేను కూడా దేవునికి విధేయత చూపించటానికి నిరంతరం బాధలు పొందటానికి ఇష్టపడుతున్నాను. క్రీస్తు నా కోసం చనిపోయినప్పటికీ ఆయన కోసం చనిపోవడానికి నేను కూడా పూర్తిగా సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను.
\v 11 ఇవన్నీ ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసినట్టు ఆయన నన్ను మళ్ళీ బ్రతికించాలని నేను పూర్తిగా ఆశిస్తున్నాను.
\s5
\p
\v 12 ఈ విషయాలన్నీ నాకు ఇంకా పూర్తిగా జరిగాయని నేను చెప్పుకోవటం లేదు. కాని నేను వీటన్నింటినీ స్వీకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఈ విషయాల వల్లే యేసుక్రీస్తు నన్ను తన వాడిగా చేసుకున్నాడు.
\v 13 నా తోటి విశ్వాసులారా, ఈ విషయాలన్నీ నాకు ఇంకా పూర్తిగా జరిగాయని నేను అనుకోవటం లేదు. నేను పరిగెత్తేవాడిలాగా ఉన్నాను. నేను వెనక్కి తిరిగి చూడలేను ఎందుకంటే నేను ముగింపు గీత వైపుకే పరిగెత్తుతున్నాను.
\v 14 దేవునితో చిరకాలం జీవించి ఉండొచ్చు అనే బహుమానం కోసం నేను అలా పరిగెత్తుతున్నాను. దీని కోసమే దేవుడు నన్ను పిలిచాడు. దానిని యేసుక్రీస్తు సాధ్యపరిచాడు.
\s5
\v 15 కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్న మనం అలానే ఆలోచించాలని ప్రోత్సహిస్తున్నాను. మీలో ఎవరైనా వేరొక విధంగా ఆలోచిస్తుంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు.
\v 16 మన గురించి ఇప్పుడు ఏది నిజమైనా మనం ఎంత దూరం వచ్చినా ఇప్పటిదాకా మనం చేసినట్టుగానే క్రీస్తుపై ఇంకా ఎక్కువ నమ్మకం కలిగి ఉందాం.
\s5
\p
\v 17 నా తోటి విశ్వాసులారా, నాతో కలిసి ఉండండి, నాలాగా నడచుకోండి. నన్ను ఆదర్శంగా తీసుకుని నడుచుకునే వారిని జాగ్రత్తగా గమనించండి.
\v 18 చాలామంది క్రీస్తులో విశ్వాసం ఉందని చెబుతున్నా వారు నిజంగా ఆయన సిలువలో మన కోసం చేసిన దానిని వ్యతిరేకిస్తున్నారు. వీరిని గురించి మీతో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా విచారంతో దుఃఖంతో మళ్ళీ చెబుతున్నాను.
\v 19 దేవుడు వారిని చివర్లో నాశనం చేస్తాడు. ఎందుకంటే తినాలనే ఆశే వారి దేవుడు. వారు సిగ్గుతో జీవిస్తారు, లోక విషయాల గురించే ఆలోచిస్తారు.
\s5
\v 20 మనమైతే పరలోక పౌరులం. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు అక్కడ నుండే భూమి మీదికి తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం.
\v 21 ఆయన మన బలహీనమైన దేహాలను తన మహిమ గల దేహాలుగా మార్చివేస్తాడు. సమస్తాన్నీ ఏ శక్తితో ఆయన నియంత్రిస్తున్నాడో అదే శక్తితో ఇదంతా చేస్తాడు.
\s5
\c 4
\p
\v 1 నా ప్రియ సోదరులారా మీరంటే నాకెంతో ఇష్టం. మిమ్మల్ని చూడాలని చాలా ఆశగా ఉంది. మీరు నాకు సంతోషం కలిగించారు. దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తే దాని కారణం మీరే. నా ప్రియ మిత్రులారా, ఈ ఉత్తరంలో నేను మీకు వివరించినట్టు ప్రభువులో స్థిరంగా ఉండండి.
\p
\v 2 ప్రభువులో చేరి ఉన్నారు కాబట్టి యువొదియా, సుంటుకే, ఒకరికొకరు మనసు కలిసి ఉండమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఎందుకంటే మీరిద్దరూ ప్రభువులో చేరి ఉన్నారు.
\v 3 నా నమ్మకమైన సహకారీ, ఈ స్త్రీలకు సహాయం చేయమని నిన్ను కూడా బ్రతిమాలుతున్నాను. వారు క్లెమెంతుతో, నా మిగతా సహకారులతో సువార్త పనిలో నాతో ప్రయాసపడ్డారు కాబట్టి వారికి సహాయం చెయ్యి. వారి పేర్లు జీవ గ్రంథంలో రాసి ఉన్నాయి. వారందరూ ఎప్పటికీ నిలిచి ఉండేలా దేవుడే వారి పేర్లను జీవగ్రంథంలో రాసాడు.
\s5
\p
\v 4 ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.
\v 5 మీ మృదుస్వభావం అందరూ చూడాలి, ఎందుకంటే ప్రభువు దగ్గరగా ఉన్నాడు.
\v 6 దేని గురించీ ఆందోళన చెందకండి. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. మీకు ఏది కావాలో కచ్చితంగా అడగండి. మీకు సహాయం చేయమని అడగండి. ఆయన మీకు చేసిన వాటన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేయండి.
\v 7 అప్పుడు మనం అర్థం చేసుకోగలిగిన దానికంటే గొప్పదైన దేవుని శాంతి మనకు ఒక సైనికుడిలా యేసుక్రీస్తుతో మనం ఉండటం వల్ల మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.
\s5
\p
\v 8 చివరికి, నా తోటి విశ్వాసులారా , ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే ఎప్పుడూ తలపోస్తూ ఉండండి.
\v 9 మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూశారో, వాటినే ఎప్పుడూ చేయండి. అప్పుడు దేవుడు మీకు శాంతి ఇస్తాడు, ఎప్పుడూ మీతో ఉంటాడు.
\s5
\p
\v 10 నా గురించి మీరు ఇంతకాలానికి మళ్ళీ శ్రద్ధ వహించి నా కోసం డబ్బు పంపారని చాలా సంతోషించి ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేసాను. నిజానికి గతంలో మీరు నా గురించి ఆలోచించారు గానీ అది తెలియజేయటానికి మీకు సరైన అవకాశం దొరకలేదు.
\v 11 నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను.
\v 12 నాకు పేదరికంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. అన్ని పరిస్థితుల్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. అన్ని సమయాలలో సంతోషంగా ఎలా ఉండవచ్చో ఆ రహస్యం నాకు తెలుసు.
\v 13 నన్ను బలపరచే క్రీస్తు ద్వారా నేను ఏదైనా చేయగలను.
\s5
\v 14 అయినా నా కష్టాల్లో పాలు పంచుకోవడంలో మీరు మంచి పని చేశారు.
\p
\v 15 ఫిలిప్పీలో ఉన్న నా స్నేహితులారా, నేను సువార్త బోధించడం మొదలుపెట్టి మాసిదోనియ నుంచి బయలుదేరినప్పుడు మీ సంఘమొక్కటే నాకు సహాయం చేసి నన్ను ఆదుకున్నది. మరి ఏ విశ్వాసుల సంఘం నాకు సహాయం పంపలేదు, నాకు చేయూత ఇవ్వలేదు. ఈ సంగతి మీకే తెలుసు.
\v 16 ఇంకా నేను తెస్సలోనిక పట్టణంలో ఉన్నప్పుడు కూడా మీరు మాటిమాటికీ నా అవసరాలు తీర్చడానికి నాకు సహాయం చేశారు.
\v 17 నేను డబ్బు ఆశించి ఇలా చెప్పడం లేదు. మీరు ఇంతకంటే ఎక్కువ పనులు చేయాలని నా కోరిక. దేవుడే మిమ్మల్ని మెచ్చుకుంటాడు.
\s5
\p
\v 18 ఇప్పుడు నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు ద్వారా అందాయి. యాజకులు దేవునికి జంతువును అర్పణగా కాల్చినప్పుడు అవి ఇంపైన సువాసనగా ఎలా ఉంటాయో మీరు పంపిన వస్తువులు అలానే ఉన్నాయి.
\v 19 నేను సేవించే నా దేవుడు మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు. ఎందుకంటే మీరు పరలోక ఐశ్వర్యానికి అధిపతి అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన వాళ్ళు.
\v 20 కాబట్టి ఎప్పటికీ యుగ యుగాల వరకూ అద్భుతమైన కాంతిలో పరిపాలించే మన తండ్రిగా ఉన్న దేవుణ్ణి నరులంతా కొనియాడుదురు గాక. ఆమేన్‌.
\s5
\p
\v 21 పవిత్రులందరికీ క్రీస్తు యేసులో అభివందనాలు చెప్పండి. నాతో ఉన్న సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు.
\v 22 ఇక్కడున్న దేవుని ప్రజలందరూ అభినందనాలు తెలియచేస్తున్నారు. ముఖ్యంగా సీజర్ చక్రవర్తి రాజభవనంలో ఉన్న నా తోటి విశ్వాసులందరూ మీకు అభివందనాలు చెబుతున్నారు.
\p
\v 23 ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ అందరిపైనా ఉండాలని నా ఆకాంక్ష. ఆమెన్.

183
52-COL.usfm Normal file
View File

@ -0,0 +1,183 @@
\id COL - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h కొలస్సయులకు రాసిన పత్రిక
\toc1 కొలస్సయులకు రాసిన పత్రిక
\toc2 కొలస్సయులకు రాసిన పత్రిక
\toc3 col
\mt1 కొలస్సయులకు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 కొలస్సై పట్టణంలో ఉన్న ప్రియమైన నా తోటి విశ్వాసులకు పౌలు అనే నేను రాస్తున్నాను. దేవుని సంకల్పం ప్రకారం యేసు క్రీస్తుకు అపొస్తలుడైన పౌలు, క్రీస్తులో విశ్వాసముంచిన మన సోదరుడు తిమోతీ ఇద్దరం కలిసి ఈ ఉత్తరం మీకు పంపుతున్నాము.
\v 2 దేవుని కోసం ప్రత్యేకించబడిన వారికీ క్రీస్తులో విశ్వాసముంచిన సోదరులకూ ఈ ఉత్తరం పంపుతున్నాము. మన తండ్రి అయిన దేవుని నుండి కృపా శాంతీ మీకు కలుగు గాక!
\p
\v 3 మేము మీ గురించి ప్రార్థన చేసే ప్రతిసారీ మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
\s5
\v 4 మీరు క్రీస్తు యేసుపై నిలిపిన విశ్వాసాన్ని గురించీ పరిశుద్ధులందరి పట్ల మీరు చూపుతున్న ప్రేమను గురించీ మేము విని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
\v 5 పరలోకంలో దేవుడు మీకోసం భద్రంగా ఉంచిన కచ్చితమైన సంగతుల కోసం మీరు మీ తోటి విశ్వాసులను ప్రేమిస్తున్నారు. క్రీస్తు గురించిన నిజమైన సువార్త విన్నప్పుడు ఈ నిరీక్షణను గురించి మొదటిసారి మీరు విన్నారు.
\p
\v 6 కొలస్సై లో మీరు విన్న సువార్తను విశ్వాసులు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రకటిస్తున్నారు. ఇది మీరు విన్న మొదటి రోజు నుండే మీలో ఎలా పని చేసిందో అలానే జరిగింది. దేవుడు నిజంగా ఎంత దయగలవాడో మనకు అర్థం అయ్యింది. ఈ సువార్త బాగా ఎదుగుతున్న పొలం లోని పైరు వంటిది. అది పుష్కలంగా పంటనిస్తుంది.
\s5
\p
\v 7 ఎపఫ్రా మీకు ఈ సువార్తను బోధించాడు. అతన్ని మేము ప్రేమిస్తాము. ఎందుకంటే అతడు మాతోబాటు క్రీస్తుసేవ చేసాడు. ఇంకా మాకు బదులుగా ఆయనకు నమ్మకంతో పనిచేస్తున్నాడు.
\v 8 మీరు దేవుని ఆత్మతో నిండి దేవుణ్ణి, దేవుని ప్రజలను ఇతరులను కూడా ప్రేమిస్తున్నారని అతడు మాకు తెలియచేసాడు.
\s5
\p
\v 9 మీ ప్రేమ గురించి మేం విన్న రోజు నుండీ మేము మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు చేయాలనుకున్న ప్రతిదాన్నీ మీకు చూపించమనీ దేవుని ఆత్మ బోధించే దానిని మీరు అర్థం చేసుకొనేలా మీకు సంపూర్ణ జ్ఞానం ఇవ్వాలనీ మేము దేవుణ్ణి అడుగుతున్నాము.
\v 10 ఇతరులు దేవుణ్ణి గౌరవించడానికి సహాయపడేలా మీరు జీవించాలని మేము ప్రార్ధిస్తున్నాం. అప్పుడు దేవుడు మీ విషయంలో సంతోషపడతాడు. దేవుణ్ణి మరి ఎక్కువగా మీరు అర్థం చేసుకోవాలనీ ఆయన చేయమని చెప్పిన మంచి పనులన్నిటినీ మీరు చేయాలనీ మేము ప్రార్ధిస్తున్నాం.
\s5
\v 11 మహిమ ప్రభావాలతో కూడిన ఆయన శక్తి మిమ్మల్ని బలపరచాలనీ దాంతో ప్రతి కష్టాన్నీ మీరు సహనంతో భరించగలిగేలా మీ గురించి దేవుణ్ణి వేడుకుంటున్నాం.
\v 12 తనకోసం ప్రత్యేకించబడిన వారి వారసత్వంలో భాగం పంచుకోడానికి మనలను అర్హులుగా చేసిన తండ్రికి మీరు సంతోషంతో కృతజ్ఞతలు చెల్లించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మీరు ఆయన వెలుగు సన్నిధిలో ఉన్నప్పుడు మీ కోసం దాచి ఉంచిన వాటన్నిటినీ మీకు ఇవ్వాలని కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం.
\s5
\p
\v 13 తండ్రి అయిన దేవుడు మనలను చీకటి రాజ్యపు ఆధిపత్యం నుండి రక్షించి తన ప్రియ కుమారుడు మనలను పరిపాలించేలా చేసాడు.
\v 14 ఆయన కుమారుని ద్వారానే మనల్ని ఆ చెడు నుండి విడిపించి మన పాపాలను క్షమించాడు.
\s5
\v 15 దేవుణ్ణి మనం చూడకపోయినా ఎప్పుడైతే ఆ కుమారుడి గురించి తెలుసుకుంటామో అప్పుడే దేవుణ్ణి గురించి కూడా తెలుసుకోగలుగుతాము.
\v 16 తండ్రి కోరుకున్నట్టు కుమారుడు అన్నీ సృష్టించాడు. ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్నవన్నీ కంటికి కనిపించేదైనా, కనిపించని అన్ని రకాల దేవదూతలైనా, సింహాసనాలైనా, ఆధిపత్యాలైనా, ప్రభుత్వాలైనా, అధికారులైనా, సర్వమూ తండ్రి కోరుకున్నట్టుగా కుమారుడే అన్నీ సృష్టించాడు. అవి అన్నీ ఆయన కోసమే కలిగాయి.
\v 17 ఆయన ఇవేవీ ఉనికిలో లేనప్పుడే ఉన్నాడు. అన్నిటినీ ఆయనే ఒడిసి పట్టుకున్నాడు, అన్నిటికీ ఆధారం ఆయనే.
\s5
\v 18 శరీరాన్ని తల ఎలా నడిపిస్తుందో అలాగే ఆయనే సంఘాన్నీ విశ్వాసులనూ నడిపిస్తాడు. ఆయనే సంఘాన్ని మొదలుపెట్టాడు కాబట్టి ఆయనే దానిని పాలిస్తాడు. చనిపోయి సజీవుడిగా పరిపూర్ణ దేహంతో ఆయన లేచినవారిలో ఆయనే ప్రథముడు. కాబట్టి ఆయనే ప్రతి విషయంలోనూ అధికుడు.
\v 19 తాను పరిపూర్ణంగా క్రీస్తులో నివసించి సమస్తాన్నీ చేయాలని తండ్రి అయిన దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు.
\v 20 యేసు ద్వారా శాంతితో అన్నింటినీ తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు భూమిమీద, పరలోకంలో ఉన్న అన్ని విషయాలకూ అందరు మనుష్యులకూ శాంతినివ్వాలని అనుకున్నాడు. ఆయన తన కుమారుడిని సిలువలో చనిపోవటానికి అర్పించి ఆయన కార్చిన రక్తం ద్వారా ఈ కార్యం చేశాడు.
\s5
\p
\v 21 మీరు క్రీస్తుని నమ్మకముందు దేవుడు మిమ్మల్ని శత్రువులుగా భావించాడు. మీ చెడు ఆలోచనల వల్లా మీ చెడు పనుల వల్లా మీరు కూడా దేవునికి పరాయివారుగా ఉన్నారు.
\v 22 కాని ఇప్పుడు దేవుడు ఆయనకు, మీకు మధ్య శాంతిని నెలకొల్పి మిమ్మల్ని తన స్నేహితులుగా మలుచుకున్నాడు. యేసు చనిపోవడం ద్వారా తన శరీరాన్ని తన జీవితాన్ని మనకోసం వదులుకున్నప్పుడు ఆయన ఇది చేసాడు. ఇలా చేయడం వల్ల మనం దేవునికి సంబంధించిన వాళ్ళం కావడానికి వీలు కలిగింది. అయితే ఇప్పుడు ఆయన మనలో ఏ తప్పూ కనుగొనలేడు, మనల్ని నిందించడానికి ఏమీ ఉండదు.
\v 23 కానీ ఇది జరగాలంటే మీరు విశ్వాసంలో సుస్థిరంగా నిలిచి ఉండాలి. అప్పుడు మీరు రాతి మీద కట్టిన ఇల్లులా దృఢంగా ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు విన్న సువార్తలో దేవుడు మీ కోసం చేస్తానని చెప్పిన వాగ్దానాలపై ఏ కారణాల వల్ల కూడా నమ్మకం కోల్పోవద్దు. ఈ సువార్తనే పౌలు అనే నేను ప్రజలకు ప్రకటిస్తూ దేవుణ్ణి సేవిస్తున్నాను.
\s5
\p
\v 24 ఇప్పుడు మీ ప్రయోజనం కోసం నేను బాధలు పడుతున్నందుకు సంతోషిస్తున్నాను. అవును. క్రీస్తు శరీరం లాంటి సంఘం కోసం సహాయం చేయడానికి ఇంకా జరగబోయే సంగతుల కోసం కూడా నేను బాధలు పడటానికి సిద్దంగా ఉన్నాను.
\v 25 దేవుడే నన్ను ఆయన సేవకుడిగా చేసుకున్నాడు. చేయటానికి ఒక ప్రత్యేకమైన పనిని నాకు ఇచ్చాడు. యూదేతర ప్రజలైన మీలాంటి వారికి దేవుని సంపూర్ణ సువార్తను ప్రకటించడమే ఆ పని.
\p
\v 26 పూర్వకాలం నుండి తరతరాలుగా దేవుడు ఈ సువార్త వెల్లడించలేదు. అయితే ఇప్పుడు దేవుడు ఈ మర్మాన్నితన కోసం ప్రత్యేకించబడిన వారి కోసం తెలియజేశాడు.
\v 27 ఈ ప్రజలకే అంటే యూదులకు, యూదేతరులైన మీకు ఈ అద్భుత రహస్యాన్ని చెప్పడానికి దేవుడు ప్రణాళిక వేసాడు. ఆ రహస్యం ఇదే, క్రీస్తు మీలో నివసిస్తాడు, దేవుని మహిమలో మీకు భాగస్వామ్యం కావాలని మీరు ఆశించేలా మిమ్మల్ని చేస్తాడు.
\s5
\v 28 ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉండి, ఆయనను పూర్తిగా తెలుసుకుని ఆయనతో కలిసి ఉండాలని మేము జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ క్రీస్తు గురించి హెచ్చరిస్తున్నాం, బోధిస్తున్నాం.
\v 29 క్రీస్తు నాకు శక్తినిస్తున్నందువల్ల ఈ పని నేను బలంగా చేస్తున్నాను.
\s5
\c 2
\p
\v 1 మీ కోసమూ, లవొదికయ పట్టణంలోని వారి కోసమూ, నన్ను చూడని వారందరి కోసమూ నేను సహాయం చేయటానికి నా శాయశక్తులా పని చేస్తున్నానని మీరు తెలుసుకోవాలి.
\v 2 ఎందుకంటే నేను వారిని ప్రోత్సహించాలనీ మీలో మీరు ఒకరికొకరు ప్రేమించుకోవాలనీ మీరందరూ కలిసికట్టుగా ఉండాలనీ ఇది చేస్తున్నాను. మీరందరూ దేవుని గూర్చిన రహస్య సత్యాన్ని నమ్మకంగా పూర్తిగా అర్థం చేసుకోవాలని నా కోరిక. ఆ సత్యం క్రీస్తే.
\v 3 దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడో ఆయన ఎంత జ్ఞానవంతుడో అనేది మనం క్రీస్తు ద్వారానే తెలుసుకోగలం.
\s5
\p
\v 4 ఎవ్వరూ మిమ్మల్ని మోసం చేయకుండా ఉండాలని మీకు ఈ సంగతి చెబుతున్నాను.
\v 5 నేను భౌతికంగా మీకు దూరంగా ఉన్నా వాస్తవంగా మీతోనే ఉన్నట్టుగా మీ గురించి నేను ఆందోళన పడుతూనే ఉన్నాను. అయినా ఎవ్వరూ అడ్డగించలేని విధంగా మీరు క్రీస్తును వెంబడిస్తున్నారనీ విని వదలకుండా ఆయనపై మీరు చూపుతున్న బలమైన విశ్వాసాన్ని చూసి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను.
\s5
\p
\v 6 మీరు ప్రభువైన క్రీస్తు యేసుపై నమ్మకం ఉంచడం ద్వారా ఆయనను అంగీకరించిన విధంగానే ఆయనలో జీవిస్తూ ఉండండి.
\v 7 ఒక చెట్టు దాని వేళ్ళను భూమిలో లోతుగా ఎలా విస్తరింప చేస్తుందో అలాగే మీరు కూడా ప్రభువైన క్రీస్తు యేసుపై పూర్తిగా ఆధారపడండి. మనుషులు ఇళ్ళను గట్టి పునాదిపై ఎలా కట్టుకుంటారో అలానే మీరూ ఆయనను విశ్వసించడం నేర్చుకోండి. ఇంకా దేవునికి మీరు ఎప్పుడూ కృతజ్ఞతలు చెల్లించండి.
\s5
\p
\v 8 దేవుణ్ణి ఎలా గౌరవించాలో ఆ పద్ధతులు మనుషులు బోధించిన ప్రకారం మీరు పాటించాలి అని గానీ ఈ లోకంలోని వారు అనుసరించే వాటినే మీరు అనుసరించాలి అని గానీ చెప్పే వారిని మీరు నమ్మకండి. క్రీస్తుకే లోబడండి.
\v 9 ఎందుకంటే మనిషిగా వచ్చిన క్రీస్తు యేసే నిజమైన దేవుడు.
\s5
\p
\v 10 మీరు క్రీస్తులో చేరి ఉన్నందున మీకేది అవసరమో అన్నింటినీ దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్క మనిషినీ ఆత్మనూ దేవదూతలనూ పరిపాలిస్తున్నాడు.
\v 11 ఇది దేవుడే నీకు సున్నతి చేసినట్టుగా ఉంది. కాని ఇది మనిషి శరీరం నుండి ఒక మాంసం ముక్కను కత్తిరించినట్టు కాదు. దానికి బదులుగా మీలో ఉన్న పాపపు శక్తిని యేసు తీసివేసినట్టే. ఈ సున్నతి అంటే క్రీస్తు మీ పాపపు స్వభావాన్ని జయించి దాన్ని మీలోనుండి తీసివేయడమే.
\p
\v 12 మీరు బాప్తిసం పొందారు కాబట్టి మనుషులు క్రీస్తుని సమాధి చేసినప్పుడు వారు మిమ్మల్ని కూడా ఆయనతో సమాధి చేసారని దేవుడు భావించాడు. క్రీస్తు మళ్ళీ సజీవంగా లేచాడు. ఆయన మిమ్మల్ని కూడా తిరిగి లేపుతాడని మీరు నమ్మినందువల్ల మిమ్మల్ని కూడా ఆయన సజీవులుగా లేపాడు.
\s5
\v 13 మీరు ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినందువల్లా మీరు యూదులు కానందున ఆయనను ఆరాధించక పోవటం వల్లా దేవుడు మిమ్మల్ని మృతతుల్యులుగా చూసాడు. కాని ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మన పాపాలన్నీటినీ క్షమించాడు.
\v 14 మనం ఎంతో పాపం చేసాము కానీ దేవుడు మన పాపాలను క్షమించాడు. ఇది ఒక మనిషి తనకు అప్పు ఉన్న వాడిని క్షమించి వారు సంతకం చేసుకున్న అప్పు కాగితాలను చింపేసినట్టుగా ఉంటుంది. కాని దేవుడి విషయంలో చూస్తే మనం చేసిన పాపాలన్నీ రాసిన కాగితాలనూ మనం అతిక్రమించిన చట్టాలనూ అన్నిటినీ క్రీస్తు చనిపోయిన సిలువలో ఆయన వ్రేలాడదీసాడు.
\v 15 అంతేకాకుండా, దేవుడు ఈ లోక ప్రజలను పాలించే దురాత్మ జీవులను ఓడించాడు. ఆయన వారిని ఓడించాడని అందరికీ తెలియచేసాడు. ఖైదీలను వీధుల్లో ఊరేగింపుగా ఎలా తీసుకు పోతారో దేవుడు వారిని కూడా అలాగే చేశాడు.
\s5
\p
\v 16 కాబట్టి తినే విషయంలోనూ తాగే విషయంలోనూ పండగ రోజులూ, అమావాస్య, విశ్రాంతి దినం వంటి విషయాల్లోనూ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని ఎవరైనా అంటే మీరు పట్టించుకోకండి.
\v 17 ఈలాంటి నియమాలు, సంఘటనలు నిజంగా రాబోతున్న వాటికి నీడల్లాంటివి. ఆ రాబోతున్నవాడు క్రీస్తే.
\s5
\v 18 అలాంటి మనుష్యులే వినయాన్ని నటిస్తూ ఉంటారు. ఇంకా దేవతలను పూజించటం వారికి ఇష్టం. అలాగే చేయమని వారు మిమ్మల్ని బలవంతం చేస్తే లొంగకండి. మీరు గనక అలా చేస్తే క్రీస్తు మీకు వాగ్దానం చేసిన దానిని మీరు పోగొట్టుకుంటారు. ఈ మనుష్యులందరూ ఎప్పుడూ దర్శనాలు గురించి మాట్లాడుతూ దేవుడే వాటిని ఇచ్చి తమను చూడమని చెప్పాడని అంటారు. ఈ విషయాల గురించి వారు గొప్పలు చెప్పుకుంటారు.
\v 19 అలాంటి వ్యక్తులు క్రీస్తుతో లేరు. క్రీస్తే శరీరానికి శిరస్సు. ఆయనలో విశ్వాసముంచిన వారందరూ ఆ దేహమే. దేహం మొత్తం శిరస్సు మీద ఆధారపడుతుంది. ఆ శిరస్సే దేహంలోని ప్రతి భాగాన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎముకలనూ కీళ్ళను ఒక్కటిగా చేసి అన్నీ కలిసి పనిచేసేలా శిరస్సే చేస్తుంది. ఇంకా దానిని అభివృద్ది చేసేది మాత్రం దేవుడే.
\s5
\p
\v 20 క్రీస్తు చనిపోయినప్పుడు మీరు కూడా చనిపోయారని దేవుడు భావిస్తున్నాడు. ఇప్పుడు ఆ మనుష్యమాత్రులు చేసుకున్న నియమాలన్నీ దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో చూస్తున్నాయి. ఈ విషయాలలో ఏవీ మిమ్మల్నిఎప్పటికీ పరిపాలించలేవు. కాబట్టి వాటి కిందనే ఇంకా బ్రతుకుతున్నట్టుగా ఆ నియమాలకు మీరెందుకు లోబడి ఉండాలి?
\v 21 "అది పట్టుకోవద్దు, ఇది రుచి చూడవద్దు, ఇది ముట్టుకోవద్దు” లాంటి మనుషుల ఆజ్ఞలను ఎందుకు లెక్క చేయాలి? ఇలాంటి నియమాలకు మీరు ఇంకా లోబడి ఉండాలని ఆలోచించవద్దు.
\v 22 ఈ ఆజ్ఞలన్నీ లోకంలో మనుషులు ఉపయోగించడం కోసం చేసినవే. అవి నాశనమైపోయే విషయాలే. వాటిని తయారు చేసిందీ బోధించేదీ మనుషులే, దేవుడు కాదు.
\v 23 మనుషులు తమ సొంత జ్ఞానంతో దేవుణ్ణి ఆరాధించడానికి చేసుకున్నారు. అందుకనే కొన్నిసార్లు ఆ మనుషులు చాలా వినయంగా ఉంటారు. ఇంకా తమ శరీరాలను కొన్నిసార్లు గాయపరచుకుంటూ ఉంటారు. కానీ మనం గనక ఈ ఆజ్ఞలకు లోబడితే పాపం చేయాలనే కోరికను అడ్డుకోలేము.
\s5
\c 3
\p
\v 1 క్రీస్తు చనిపోయిన తర్వాత దేవుడు ఆయనను సజీవుడిగా తిరిగి లేపినట్టు మనల్ని కూడా ఆయన లేపాడు. క్రీస్తు మహా ఘనమైన గౌరవం, అధికారం ఉండే పరలోకంలో దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. మీరు కూడా అక్కడే ఉన్నట్టుగా ఉంటూ ఇక్కడ జీవించడానికి ప్రయత్నించాలి.
\v 2 క్రీస్తు పరలోకంలో మీకోసం దాచి ఉంచిన వాటినే కోరుకోండి. ఇక్కడ ఈ భూమిపై ఉన్న వాటి కోసం ఆశ పడకండి.
\v 3 ఎందుకంటే మీరు చనిపోయారు. ఇక ఎప్పటికీ ఈ భూమికి సంబంధించిన వారుగా దేవుడు మిమ్మల్ని చూడటం లేదు. మీరు క్షేమంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని క్రీస్తులో దాచి ఉంచాడు.
\p
\v 4 ఎప్పుడైతే దేవుడు క్రీస్తును ఆయన ప్రకాశమైన వెలుగులో భూమిపై ఉన్న ప్రతి ఒక్కరికీ వెల్లడి చేశాడో అప్పుడే ఆయన మిమ్మల్ని కూడా వెల్లడి చేశాడు ఎందుకంటే క్రీస్తు మిమ్మల్ని సజీవులుగా చేసాడు.
\s5
\p
\v 5 కాబట్టి, ఈ లోకంలో తప్పకుండా చంపేయాలనుకునే శత్రువుల వంటి మీ చెడు ఆశలను, కోరికలను గురించి ఆలోచించండి. వాటిని మీరు కచ్చితంగా తీసివేయాలి. వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను సంహరించండి.
\v 6 మనుషులు ఇలాంటి వాటిని చేయడం వల్లనే దేవుడు వారిపై కోపంతో ఉండి, వారు లోబడనందువల్లనే వారిని శిక్షిస్తాడు.
\p
\v 7 గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు మీరూ ఇవన్నీ చేస్తూ వచ్చారు. వారిలాగే ప్రవర్తించారు.
\v 8 కానీ ఇప్పుడు మీరు వాటన్నిటినీ చేయడం ఆపెయ్యాలి. ఒకరిమీద ఒకరు కోపపడకూడదు. ఇంకొకరికి మీరు సమస్యగా ఉండకూడదు. ఇతరులను నిందించడం అవమానకరమైన మాటలు మాట్లాడడం మీరు చేయకూడదు.
\s5
\v 9 ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. వీటిలో దేనినీ మీరు చేయవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక కొత్త మనిషిగా మారారు. మీరు ఈ చెడ్డ సంగతులను ఇక ఎప్పటికీ చేయకూడదు.
\v 10 మీరు ఒక నూతన వ్యక్తి. దేవుడు మిమ్మల్ని సృష్టించాడు, ఆయనలా మీరు ఉండాలని ఆయన గురించి మీరు ఇంకా బాగా తెలుసుకోనేలా ఆయన ఎప్పుడూ చేస్తుంటాడు.మీరు
\v 11 క్రీస్తుతో మనం కలిసి ఉన్నందువల్ల దేవుడు మనలను కొత్త వ్యక్తులనుగా చేశాడు. ఇంకా ఆయన ఎప్పుడూ మనలను కొత్తగా చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఎవరైనా యూదుడని కానీ యూదేతరుడని కానీ సున్నతి పొందాడా అని కానీ సున్నతి పొందలేదా అని కానీ పరదేశీయుడా లేక అనాగరికుడా అని కానీ బానిసా లేక బానిస కాదా అని కానీ ఇవేవీ ముఖ్యం కాదు. మీ అందరిలో ఉన్న క్రీస్తే అన్నింటికన్నా ముఖ్యమైనవాడు.
\s5
\p
\v 12 కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని తన ప్రజలనుగా ప్రత్యేక పరచి ప్రేమిస్తున్నందువల్ల మీరు సాత్వికంతో కనికరంతో దయతో ఇతరులకు సేవ చేయండి. వినయంతో సహనంతో ఒకరినొకరు సున్నితంగా చూసుకోండి.
\v 13 ఒకరినొకరు సహించుకోండి. ఎవరి మీదైనా చాడీలు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి. అలాగే మీరు ఒకరికొకరు క్షమించుకోండి.
\v 14 వీటన్నిటికంటే ముఖ్యంగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఎందుకంటే అలా చేయటం వల్ల మిమ్మల్ని మీరు పరిపూర్ణ బంధంలో ఇముడుతారు.
\s5
\p
\v 15 మీరు దేవునితోనూ ఒకరితో ఒకరూ సమాధానంతో జీవించేలా క్రీస్తు ఒక్కడే చేయగలిగాడు కాబట్టి ఎప్పుడూ సమాధానంగా ప్రవర్తించండి. ఇంకా ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞులై ఉండండి.
\v 16 మీరు జీవిస్తూ దేవునికి సేవ చేస్తున్నపుడు క్రీస్తు మీకు బోధించినట్టుగా ఎప్పుడూ ఆయనకు లోబడి ఉండండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ గానాలతోనూ దేవునికి పాటలు పాడుతూ ఆయనను కీర్తించండి.
\v 17 మాటతో గానీ పనులతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసును గౌరవించేలా చేయండి. ఇది చేస్తున్నప్పుడు తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.
\s5
\p
\v 18 భార్యలారా, మీ భర్తలకు లోబడండి. ప్రభువైన యేసు ఆజ్ఞాపించిన ప్రకారం ఇది తగినది.
\v 19 భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి. వారితో కటువుగా ఉండకండి.
\p
\v 20 పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. ఇది ప్రభువుకు ఇష్టంగా ఉంటుంది.
\v 21 తండ్రులారా, మీ పిల్లలు నిరుత్సాహపడకుండా ఉండేలా వారిలో కోపం కలిగించవద్దు.
\s5
\p
\v 22 బానిసలారా, ప్రతి విషయంలోనూ ఈ లోకంలో మీ యజమానులకు లోబడి ఉండండి. వాళ్ళు ఎప్పుడూ లోబడే ఉంటారని తమ యజమానులు అనుకోవాలని మీ పై అధికారులు గమనిస్తున్నపుడు మాత్రమే లోబడడం కాదు. ప్రభువైన యేసును మీరు గౌరవిస్తున్నారు కాబట్టి మీరు మీ యజమానులకు మనస్పూర్తిగా లోబడి ఉండండి.
\v 23 మీరు ఏ పని చేసినా హృదయపూర్వకంగా చేయండి. మనుషుల కోసం అని కాదు గానీ ప్రభువుకు చేస్తున్నట్టు భావించుకుని చేయండి.
\v 24 ఎందుకంటే ప్రభువు మీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభువు మీకు వాగ్దానం చేసిన వారసత్వంలోని భాగాన్ని మీరు అందుకుంటారు. మీరు సేవిస్తున్న యేసుక్రీస్తే మీకు నిజమైన యజమాని.
\v 25 దేవుడు ప్రతిఒక్కరికీ ఒకేలాగా తీర్పు తీరుస్తాడు. తప్పు చేసేవాడికి తాను చేసిన తప్పుకి తగిన శాస్తి జరుగుతుంది.
\s5
\c 4
\p
\v 1 యజమానులారా, పరలోకంలో మీకు కూడా యజమాని ఉన్నాడని గ్రహించి మీ దాసుల పట్ల న్యాయంగా వ్యవహరిస్తూ వారికి అవసరమైనవి అందజేయండి.
\s5
\p
\v 2 నిరంతరాయంగా ప్రార్థన చేస్తూ ఉండండి. బద్ధకస్తులుగా ఉండకుండా ప్రార్థన చేస్తూ, దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి.
\v 3 దేవుడు ప్రతి చోటా క్రీస్తు గురించిన రహస్యాన్ని వెల్లడిచేస్తూ ఉన్న విధంగా శుభవార్తను స్వేచ్ఛగా వివరించడానికి దేవుడు మాకు వీలు కల్పించేలా మా కోసం కలిసి ప్రార్థన చేయండి. ఈ శుభవార్తను మేము ప్రకటించిన కారణంగా నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను.
\v 4 నేను సంపూర్ణంగా శుభవార్తను వివరించగలిగేలా ప్రార్థన చేయండి.
\s5
\p
\v 5 ప్రతి క్షణాన్నీ విలువైనదిగా చూస్తూ, జ్ఞానం ఉపయోగిస్తూ అవిశ్వాసుల మధ్య వివేకంగా జీవించండి.
\v 6 యేసు ప్రభువులో విశ్వాసం లేని వాళ్ళతో ఎప్పుడూ ఆహ్లాదంగా, ఆసక్తిగా, దయగా మాట్లాడుతూ ఉండండి. అప్పుడు ప్రభువును గురించి ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడాలో మీరు తెలుసుకుంటారు.
\s5
\p
\v 7 నాకు ఏమి జరుగుతుందో తుకికు మీకు చెప్తాడు. అతడు యేసు ప్రభువును నాతో కలిసి సేవిస్తూ, నమ్మకంగా నాకు సాయం చేస్తున్నవాడు, నేను ప్రేమించే నా తోటి విశ్వాసి.
\v 8 మీరు మా గురించి తెలుసుకోవాలనీ అతడు మిమ్మల్ని ప్రోత్సహించాలనీ తుకికుకు ఈ ఉత్తరం ఇచ్చి పంపుతున్నాను.
\p
\v 9 మీ ఊరి వాడు, నేను ప్రేమించేవాడూ నమ్మకమైన తోటి విశ్వాసి అయిన ఒనేసిముతో అతన్ని పంపుతున్నాను. ఇక్కడ ఏమి జరుగుతుందో అదంతా వాళ్ళు మీకు చెప్తారు.
\s5
\p
\v 10 మార్కుతో నాతో కూడా జైలులో ఉన్నవాడూ బర్నబాకు దగ్గర బంధువూ అయిన అరిస్తార్కు మీకు శుభాలు చెప్తున్నాడు. మార్కు గురించి మీకు ముందే వివరించాను కాబట్టి, అతను మీ దగ్గరికి వస్తే అతన్ని ఆహ్వానించండి.
\p
\v 11 జస్టస్ అనే పేరు గల యేసు కూడా మీకు శుభాలు చెప్తున్నాడు. యేసు క్రీస్తు ద్వారా దేవుణ్ణి రాజుగా ప్రకటించడంలో నాతో కలిసి పనిచేసే ఈ ముగ్గురు మాత్రమే విశ్వాసులైన యూదులు. వాళ్ళు నాకు ఎంతో సాయం చేసి, నన్ను ప్రోత్సహించారు.
\s5
\p
\v 12 మీ ఊరి వాడు, క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు శుభాలు చెప్తున్నాడు. దేవుడు మనకు బోధించిందీ, వాగ్దానమిచ్చిందీ అంతా మీరు బలంగా నమ్మాలని అతడు మీ కోసం ఎంతో ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తున్నాడు.
\v 13 హియరాపొలిలో నివసిస్తున్న వాళ్ళ కోసం, లవొదికయలో ఉన్న వాళ్ళ కోసం అతను చాలా కష్టపడి పనిచేసాడని నేను చెప్పగలను.
\p
\v 14 నేను ప్రేమించే వైద్యుడు లూకా, దేమా మీకు శుభాలు తెల్పుతున్నారు.
\s5
\p
\v 15 లవొదికయలో నివసించే తోటి విశ్వాసులకు వందనాలు. నుంఫాకు, ఆమె ఇంటిలో సమకూడే విశ్వాసుల గుంపుకు నా వందనాలు.
\v 16 మీరు ఈ ఉత్తరం చదివాక, లవొదికయ సంఘంలో కూడా ఈ ఉత్తరం చదివించండి. లవొదికయ నుండి వచ్చిన ఉత్తరం కూడా చదవండి.
\v 17 దేవుడు తనకు ఇచ్చిన పనిని పూర్తిచేయాలని అర్కిప్పుకు చెప్పండి.
\s5
\p
\v 18 నా సొంత చేరాతతో పౌలు అనే నేను రాస్తున్నాను. జైలులో ఉన్న నన్ను జ్ఞాపకం ఉంచుకుని నా గురించి ప్రార్థన చేయండి. మీ అందరిపై మన యేసు క్రీస్తు ప్రభువు దయ చూపడం కొనసాగించాలని నా ప్రార్థన.

182
53-1TH.usfm Normal file
View File

@ -0,0 +1,182 @@
\id 1TH - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక
\toc1 తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక
\toc2 తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక
\toc3 1th
\mt1 తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక
\s5
\c 1
\p
\v 1 పౌలు అనే నేను ఈ ఉత్త్తరం రాస్తున్నాను. నాతోబాటు సిల్వాను, తిమోతి కూడా ఉన్నారు. తండ్రి అయిన దేవునితో, యేసు క్రీస్తు ప్రభువుతో చేరిన తెస్సలోనీక సంఘ విశ్వాసులకు మేము ఈ ఉత్తరాన్ని పంపుతున్నాము. దేవుడు మీపైన దయ చూపి శాంతిని ఇచ్చు గాక!
\s5
\p
\v 2 మేము ప్రార్థన చేస్తున్నపుడు మీ అందరి విషయంలో ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్తుంటాము.
\v 3 మీరు దేవునిలో విశ్వాసముంచి, మనుషుల్ని ప్రేమించి ఎంతో ఆదరంగా వాళ్లకు సాయం చేస్తున్నారు కాబట్టి మీరు మన తండ్రి అయిన దేవుని కోసం పని చేస్తున్నారని మేము జ్ఞాపకం ఉంచుకుంటూనే ఉన్నాం. మన యేసు క్రీస్తు ప్రభువు మీకు తెలుసు కాబట్టి మీకు భవిష్యత్తు మీద దృఢమైన విశ్వాసం ఉంది.
\s5
\v 4 తన ప్రజలుగా అవ్వాలని దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నాడని మాకు తెలుసు కాబట్టి, ఆయన ప్రేమించే నా తోటి విశ్వాసులుగా మీ గురించి దేవుడికి మేము వందనాలు చెప్తున్నాము.
\p
\v 5 మేము మీకు సువార్త చెప్పినప్పుడు అది మాటలకు మించి ఉంది కాబట్టి, ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడని మాకు తెలుసు. పరిశుద్ధాత్మ మీ మధ్య శక్తివంతంగా పనిచేస్తున్నాడు. మేము మీకు ఇచ్చే వర్తమానం నిజమైనదని ఆయన మనకు బలంగా హామీ ఇస్తున్నాడు. అదే విధంగా మేము ఎలా మాట్లాడామో మీకు తెలుసు. మీకు సాయం చేయాలనుకున్న క్రమంలో మేము మీతో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించామో మీకు తెలుసు.
\s5
\p
\v 6 ఇప్పుడు మీరు మా ఆదర్శాన్ని అనుసరిస్తూ, మేము జీవిస్తున్నట్టే మీరు కూడా జీవిస్తున్నారని విన్నాము. అంతకంటే ముఖ్యమైంది మన ప్రభువు జీవించిన విధానంలోనే మీరు కూడా జీవిస్తున్నారు. మీరు ఎన్నో కష్టాల, పరీక్షల గుండా వెళ్ళవలసి వచ్చింది. అయినా సరే పరిశుద్ధాత్మ నుండి మాత్రమే వచ్చే గొప్ప ఆనందంతో దేవుని ప్రేమ సందేశాన్ని మీరు పొందారు.
\v 7 మాసిదోనియా, అకయ రాష్ట్రాల్లో ఉన్న విశ్వాసులందరూ దేవునిలో నమ్మకం ఎలా ఉంచాలో మీరు నేర్చుకున్నట్టే, ఆయన్ని మీరు నమ్మినట్టే, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు.
\s5
\v 8 యేసు ప్రభువు నుండి మీరు చెప్పిన సందేశం ఇతరులు కూడా విన్నారు. వాళ్ళు కూడా మాసిదోనియ, అకయ అంతా నివసించే వాళ్లకు శుభవార్త ప్రకటించారు. అది మాత్రమే కాదు, మీరు దేవునిలో విశ్వాసం ఉంచారని దూర ప్రాంతాల వాళ్ళు కూడా విన్నారు. కాబట్టి మీ జీవితాల్లో దేవుడు ఏమి చేసాడో ప్రజలకి మేము చెప్పే అవసరం లేదు. మీ జీవితాలు తెరిచిన పుస్తకాలు.
\p
\v 9 మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మమ్మల్ని ఎంత హృదయ పూర్వకంగా ఆహ్వానించారో దూర ప్రాంతాల వాళ్ళు ఇతరులకి చెప్తున్నారు. అబద్ధ దేవుళ్ళను పూజించడం మీరు మానివేశారనీ జీవిస్తున్న ఏకైక దేవుణ్ణి సేవిస్తున్నారనీ ఒకే ఒక్క, నిజమైన దేవుడు ఆయనే అనీ వాళ్ళు కూడా సమాచారం అందించారు.
\v 10 పరలోకం నుండి భూమికి ఆయన కుమారుడు తిరిగి వస్తాడని మీరు కనిపెడుతూ ఎదురు చూస్తున్నారు అని కూడా వాళ్ళు చెప్పారు. ఆయన చనిపోయాక దేవుడు మళ్ళీ బ్రతికించాడని మీరు స్థిరంగా నమ్ముతున్నారు. లోకంలో ఉన్న వాళ్ళందర్నీ దేవుడు శిక్షించినప్పుడు, యేసులో విశ్వాసం ఉంచిన వాళ్ళని ఆయన రక్షిస్తాడని కూడా మీరు నమ్ముతున్నారు.
\s5
\c 2
\p
\v 1 నా తోటి విశ్వాసులారా, మీతో మేము గడిపిన సమయం చాలా విలువైనది.
\v 2 ఫిలిప్పీ నగర ప్రజలు మమ్మల్ని అవమానించి వేధింపులకి గురిచేసారని మీకు తెలుసు. మేము ధైర్యం పొందడానికి దేవుడు ఇలా జరిగించాడు. దీని ఫలితంగా, మీ ఊరి వారు కొందరు వ్యతిరేకించినా దేవుడు మమ్మల్ని పంపి, చెప్పమన్న శుభవార్త మీకు చెప్పాము.
\s5
\v 3 దేవుని ఉపదేశానికి లోబడమని మేము మిమ్మల్ని ప్రోత్సహించినప్పుడు మేము మీకు అబద్ధం ఏమీ చెప్పలేదు. నీతిమాలిన విధానంలో మీనుండి మేము ఏమీ పొందాలనుకోలేదు. మేము మిమ్మల్ని కానీ ఎవరినైనా కానీ మోసం చేయడానికి ప్రయత్నించలేదు.
\v 4 దీనికి విరుద్ధంగా, దేవుడు మమ్మల్ని పరీక్షించి, ఈ పని చేయడానికి సరైన వారుగా భావించాడు కాబట్టి మీకు శుభవార్త చెప్పడంలో దేవుడు మమ్మల్ని నమ్మాడు. మేము బోధించినప్పుడు వాళ్లకి ఇష్టమయ్యింది. మేము వాళ్లకి చెప్పలేదు. మన ఆలోచనలు అన్నిటికీ ఆయన తీర్పు తీర్చుతాడు కాబట్టి మేము ఏమి చెప్పాలని దేవుడు అనుకున్నాడో అదే చెప్పాము.
\s5
\p
\v 5 మీ దగ్గర నుండి ఏదో పొందాలని మేము ఎప్పుడూ మిమ్మల్ని పొగడలేదు. మీరు మాకు ఏదో ఇచ్చేలా ఒప్పించడానికి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇది నిజమని దేవునికి తెలుసు.
\p
\v 6 క్రీస్తు మమ్మల్ని పంపాడు కాబట్టి మేము మీతో ఉన్నప్పుడు మా జీవనోపాధికి కావలసినవి నమకూర్చమని మా హక్కుగా భావించి అడగవచ్చు. కానీ మేము మీ నుండి అలాటివి పొందడానికి ప్రయత్నించలేదు.
\s5
\v 7 ఒక తల్లి తన సొంత పిల్లలతో ఉన్నట్టు మీ మధ్య ఉన్నప్పుడు మేము మీతో మృదువుగా ఉన్నాము.
\v 8 మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన ఆ మంచి సందేశాన్ని మీతో వ్యక్తిగతంగా పంచుకోడం మాకు సంతోషం. మేము మిమ్మల్ని ఎంతో ప్రేమించడం మొదలు పెట్టాము కాబట్టి మేము చేయగలిగే సాయం చేయవచ్చని అనుకున్నాం కూడా.
\p
\v 9 నా తోటి విశ్వాసులారా! మేము అహర్నిశలు ఎంతో కష్టపడి పనిచేశామని గుర్తుంచుకోండి. దేవుని గురించిన శుభవార్త మీకు ప్రకటిస్తూ ఇలా చేసాము. ఇలా డబ్బు సంపాదించడం వల్ల మా అవసరాల కోసం మాకు ఇమ్మని ఎవరినీ మేము అడగవలసిన అవసరం లేదు.
\s5
\v 10 చాలా మంచిగా, సరైన దారిలో ఎవరూ విమర్శించలేని విధంగా విశ్వాసులైన మీ పట్ల మేము ఉన్నామని ఇద్దరికీ అంటే - దేవుడికీ మీకూ కూడా తెలుసు.
\v 11 ఒక తండ్రి తన పిల్లల్ని ప్రేమిస్తూ వాళ్ళ పట్ల నడుచుకున్నట్టు మేము మీలో ప్రతి ఒక్కరి పట్లా నడుచుకున్నాము అని మీకు తెలుసు.
\v 12 దేవుడు మహాద్భుత శక్తితో తనను కనపరచుకునే రాజుగా మీరు తన ప్రజలు కావడానికి మిమ్మల్ని పిలుచుకున్నాడు కాబట్టి దేవుని ప్రజలుగా జీవించేలా మిమ్మల్ని మేము గట్టిగా హెచ్చరించి, ప్రోత్సహిస్తున్నాము.
\s5
\p
\v 13 దేవుడు మనకు ఇచ్చిన మంచి సందేశాన్ని మేము మీకు చెప్పినప్పుడు మీరు విని దానిని నిజమైన దైవ సందేశంగా అంగీకరించారు. దీనికి మేము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మాకు మేము దీన్ని కొత్తగా కల్పించలేదు. ఈ సందేశాన్ని మీరు నమ్మిన కారణంగా దేవుడు మీ జీవితాలను మార్చుతూ ఉన్నందుకు కూడా మేము దేవునికి వందనాలు చెప్తున్నాము.
\s5
\p
\v 14 యూదయలోని సంఘ విశ్వాసుల్లాగా మీరు నడుచుకుంటున్నారు కాబట్టి ఈ విషయాలను గురించి మాకు కచ్చితంగా తెలుసు. వాళ్ళు కూడా క్రీస్తు యేసుతో చేరారు. క్రీస్తు కారణంగా వాళ్ళ జాతి మనుషులు వాళ్ళని వేధించినప్పుడు వాళ్ళు భరించినట్టే, మీ జాతివారు మిమ్మల్ని వేధించినప్పుడు మీరు కూడా భరిస్తున్నారు.
\v 15 ఆ యూదులు చాలా మంది ప్రవక్తలను, యేసు ప్రభువును కూడా చంపారు. చాలా పట్టణాలలో అవిశ్వాసులుగా ఉన్న ఇతర యూదులు మమ్మల్ని విడిచి పొమ్మని బలవంతపెట్టారు. మనుషులకు ఉత్తమం అయిన దానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశారు. వాళ్ళు నిజంగా దేవునికి కోపం తెప్పించారు.
\v 16 ఉదాహరణకు, యూదులు కానివారికి శుభవార్త చెప్పనివ్వకుండా ఆపేశారు. వాళ్ళని దేవుడు రక్షించడం వీళ్ళకి ఇష్టం లేదు. చివరికి దేవుడు వాళ్ళని శిక్షించే సమయం దాకా దేవుడు అనుమతించే దానికంటే అధికంగా వాళ్ళు పాపం చేశారు.
\s5
\p
\v 17 నా తోటి విశ్వాసులారా! మేము మీకు కొంత కాలం దూరంగా ఉన్నప్పుడు పిల్లల్ని కోల్పోయిన తలిదండ్రుల్లాగా ఉన్నాము. మీ దగ్గరికి రావాలని బలంగా కోరుకుంటున్నాము.
\v 18 నిజానికి నేను మిమ్మల్ని మళ్ళీ చూడడానికి రావాలని ప్రయత్నించాను. కానీ ప్రతిసారీ సాతాను అడ్డుకుంటున్నాడు.
\v 19 నిజానికి మీ కారణంగా దేవుని పని బాగా చేయాలనే ఆశ మాకు కలుగుతోంది. మేము గర్వపడేలా మీరు చేస్తున్నారు. మీ వల్ల దేవుని సేవ చేయడంలో విజయవంతం అవుతామని మా ఆశ. ప్రభు యేసు క్రీస్తు భూమికి తిరిగి వచ్చినప్పుడు మనకు ప్రతిఫలం ఇస్తాడనే ఆశ మీ వల్ల, ఇతరుల వల్ల మనకు కలుగుతుంది.
\v 20 నిజానికి మీ కారణంగానే ఇప్పుడు కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాము.
\s5
\c 3
\p
\v 1 దాని ఫలితంగా, మీ గురించి ఇక ఉండబట్ట లేక సిల్వాను, నేను ఎతెన్సులోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాం.
\v 2 మేము తిమోతిని మీ దగ్గరికి పంపాం. అతను మాకు సన్నిహిత సహచరుడు అనీ దేవుని ద్వారా క్రీస్తు గురించిన శుభవార్త ప్రకటిస్తున్నాడు అనీ మీకు తెలుసు. క్రీస్తులో మీరు బలమైన విశ్వాసం కొనసాగించాలని కోరడానికి అతన్ని మీ దగ్గరికి పంపుతున్నాం.
\v 3 మీరు పొందే హింసను బట్టి భయపడి మీలో ఎవరూ క్రీస్తుకు దూరం కాకూడదని మేము అనుకుంటున్నాము.
\s5
\v 4 మేము మీతో ఉన్నప్పుడు ఇతరులు మనల్ని బాధపెడతారని మేము మీకు చెప్తూనే వచ్చామని గుర్తు తెచ్చుకోండి, మీరు అనుకున్నదే జరిగింది.
\p
\v 5 క్రీస్తులో మీ విశ్వాసం స్థిరంగా ఉందో లేదో తెలియక ఆత్రుత అణుచుకోలేక తిమోతిని మీ దగ్గరికి పంపుతున్నాను. మనల్ని శోధించే సాతాను క్రీస్తులో నమ్మకం ఉంచకుండా అడ్డుకుంటూ ఉంటాడు కాబట్టి నేను ఆందోళన పడుతున్నాను. మీ కోసం మేము పడిన ప్రయాస అంతా అడవి కాసిన వెన్నెల అవుతుందేమోనని నా భయం.
\s5
\p
\v 6 కానీ ఇప్పుడు నేనూ సిల్వానూ ఉన్న చోటికి తిమోతి తిరిగి వచ్చాడు. మీరు క్రీస్తును ప్రేమించి, ఆయనలో మీ విశ్వాసం స్థిరంగా ఉంది అనే శుభవార్త మాకు చెప్పాడు. అంతే కాదు, మేము మిమ్మల్ని దర్శించాలని అనుకున్నట్టే మీరు కూడా మేము మమ్మల్ని దర్శించాలని ఎంతో కోరుకుంటున్నారనీ మమ్మల్ని సంతోషంగా గుర్తు చేసుకుంటున్నారని కూడా చెప్పాడు.
\p
\v 7 నా తోటి విశ్వాసులారా! మనుషులు మనకు చేసిన దానికి మనం హింస పొందుతున్నా మీరు ఇంకా క్రీస్తులో విశ్వాసంతో ఉన్నారని తిమోతి చెప్పడం వల్ల ఆదరణ పొందాము.
\s5
\v 8 యేసు ప్రభువులో మీకు చాలా విశ్వాసం ఉంది కాబట్టి మనం ఇప్పుడు కొత్త మార్గంలో జీవిస్తున్నట్టే.
\v 9 మీకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా చాలదు. మేము ప్రార్థన చేసినప్పుడు మిమ్మల్ని బట్టి మా ఉత్సాహం రెట్టింపు అవుతుంది.
\v 10 క్రీస్తులోని విశ్వాసంతో మీరు మరింతగా బలపడడానికి సాయం అందించేలా, మేము మిమ్మల్ని దర్శించడానికి వీలు కలిగించమని మేము దేవుణ్ణి నిరంతరం మనస్పూర్తిగా అడుగుతున్నాము.
\s5
\v 11 మీ దగ్గరికి మళ్ళీ రావడానికి సాధ్యం చేయమని మన తండ్రి అయిన దేవుడికి , మన యేసు ప్రభువుకు మేము ప్రార్థన చేస్తున్నాము.
\p
\v 12 మేము మిమ్మల్ని ఇంకా ప్రేమించడం కొనసాగించినట్టే, మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఇతరుల్ని కూడా ఇంకా ఇంకా ప్రేమించడానికి యేసు ప్రభువు మీకు సాయం చేసేలా మీ కోసం మేము ప్రార్థన చేస్తున్నాము.
\v 13 మీరు యేసుప్రభువును మరింతగా సంతోషపెట్టాలనుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని ఎవరూ విమర్శించలేని విధంగా మీరు ఆయనలా రూపాంతరం పొందాలని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ యేసు, ఆయనకి చెందిన వాళ్ళు ఆయనతో కలిసి భూమికి వచ్చినప్పుడు ఆయన మీ విషయంలో సంతోషపడతాడని మేము ఇలా ప్రార్థన చేస్తున్నాము.
\s5
\c 4
\p
\v 1 నా తోటి విశ్వాసులారా! ఇతర విషయాలు మీకు నేను రాయాల్సి ఉంది.
\v 2 దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మీ జీవితాలు నడుపుకోవాలని నేను మిమ్మల్ని బతిమాలుతున్నాను. నేను ఇలా కోరుతున్నప్పుడు, యేసు ప్రభువు మిమ్మల్ని అదే విధంగా నడుచుకోవాలని కోరుతున్నట్టే. యేసుప్రభువు మీకు ఏమి చెప్పమని మాకు చెప్పాడో అదే చేయమని మేము మీకు బోధించాము. మీ జీవితాలు అలాగే నడుపుకుంటూ ఉన్నారని మాకు తెలుసు, కానీ అంతకన్నా ఎక్కువగా అభివృద్ది పొందాలని బలంగా కోరుకుంటున్నాను.
\s5
\p
\v 3 మీరు పాపం చెయ్యకుండా ఉండాలనీ, పూర్తిగా దేవునికి చెందినవాళ్ళలాగా మీ జీవితాలు కనిపించాలనీ ఆయన కోరుకుంటున్నాడు. మీరు లైంగిక ఆకృత్యాలకు దూరంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు.
\v 4 మీలో ప్రతి ఒక్కరూ భార్యతో ఎలా జీవించాలో, ఆమెను ఎలా గౌరవించాలో, ఆమెకు వ్యతిరేకంగా పాపం చేయకుండా ఎలా ఉండాలో తెలుసుకోవాలి.
\v 5 దేవుడంటే తెలియని యూదేతరుల్లాగా మీ కామవాంఛలను తృప్తిపరచడానికి ఆమెను ఉపయోగించుకోకూడదు.
\v 6 మీ తోటి విశ్వాసులుగా ఉన్న స్త్రీకైనా పురుషునికైనా వ్యతిరేకంగా మీలో ఎవరూ పాపం చేయకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ మీ లైంగిక కోరికలను అదుపులో పెట్టుకోవాలి. లైంగిక అవినీతి కార్యాలు చేసే వాళ్ళను యేసు ప్రభువు శిక్షిస్తాడని ఇంతకు ముందు నేను మిమ్మల్ని గట్టిగా హెచ్చరించిన విషయం జ్ఞాపకం తెచ్చుకోండి.
\s5
\v 7 విశ్వాసులుగా దేవుడు మనల్ని ఎంచుకున్నప్పుడు, మనం లైంగిక అవినీతి మార్గంలో నడుచుకోవడం ఆయన ఇష్టపడడు. పాపం చేయని వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు.
\p
\v 8 ఒక మనిషిగా నేను బోధించిన దానిని నిర్లక్ష్యం చేసే వాళ్లను నేను హెచ్చరిస్తున్నాను. ఇది దేవుని ఆజ్ఞ కాబట్టి వాళ్ళు దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తున్నారు. పాపం చేయని ఆత్మను మీలో నివసించడానికి దేవుడు పంపించాడని జ్ఞాపకం తెచ్చుకోండి.
\s5
\p
\v 9 మీ తోటి విశ్వాసులను ప్రేమించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకోవాలో దేవుడు మీకు ముందే నేర్పించాడు కాబట్టి దీని గురించి మీకు ఎవరూ రాయనక్కరలేదు.
\v 10 ఇప్పటికే మాసిదోనియా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోని మీ తోటి విశ్వాసులను మీరు ప్రేమిస్తున్నారని ఋజువు చూపిస్తున్నారు. అయినా, నా తోటి విశ్వాసులారా, మీరు ఒకరినొకరు ఇంకా ఇంకా ప్రేమించుకోవాలని కోరుతున్నాను.
\v 11 ఇతరుల విషయాల్లో మీరు అనవసరంగా జోక్యం చేసుకోకుండా మీ సొంత విషయాలు చూసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించమని మిమ్మల్ని కోరుతున్నాము. ఇలా జీవించమని ముందు కూడా మీకు నేర్పించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి.
\v 12 మీరు ఇలాంటివి చేయడం వల్ల అవిశ్వాసులు మీ మర్యాదతో కూడిన ప్రవర్తన గుర్తిస్తారు. మీ అవసరాలకు ఇతరులపై ఆధారపడనవసరం లేదు.
\s5
\p
\v 13 నా తోటి విశ్వాసులారా, ఇప్పుడు చనిపోయిన మన తోటి విశ్వాసులకు ఏమి జరుగుతుందో దాని గురించి మీకు అవగాహన కల్పించాలని అనుకుంటున్నాను. మీరు అవిశ్వాసుల్లాగా ఉండకూడదు. చనిపోయాక తిరిగి బ్రతుకుతారని వాళ్ళు అనుకోరు కాబట్టి వాళ్ళు తీవ్ర శోకంలో మునిగి పోతారు.
\v 14 యేసు చనిపోయి మళ్ళీ బ్రతకడానికి తిరిగి లేచాడని విశ్వాసులుగా ఉన్న మనకు తెలుసు. యేసుతో చేరిన వాళ్ళని దేవుడు మళ్ళీ జీవింపజేస్తాడని కూడా మనకు తెలుసు. ఆయన వాళ్ళను యేసుతో కూడా తిరిగి తీసుకువస్తాడు.
\p
\v 15 నేను మీకు చెప్పేది యేసు ప్రభువు నాకు వెల్లడి చేశాడు కాబట్టి ఈ విషయం మీకు రాస్తున్నాను. యేసు మళ్ళీ వచ్చినప్పుడు చనిపోయిన వారికంటే ముందే యేసును కలుసుకుంటామని కొందరు అనుకుంటారు, అది నిజం కాదు.
\s5
\p
\v 16 నేను ఇది ఎందుకు రాస్తున్నాను అంటే యేసు ప్రభువు తనకు తానే పరలోకం నుండి దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చినప్పుడు, మన విశ్వాసులందరినీ తిరిగి లేవమని ఆజ్ఞాపిస్తాడు. ప్రధాన దూత గొప్ప స్వరంతో చెప్తుండగా, ఇంకొక దూత దేవుని పక్షంగా బూర ఊదుతాడు. అప్పుడు మొట్టమొదటగా ఏమి జరుగుతుందంటే క్రీస్తుతో చేరిన వాళ్ళందరూ తిరిగి బ్రతుకుతారు.
\v 17 దాని తరువాత, భూమిపై ఇంకా నివసిస్తూ విశ్వాసులుగా ఉన్న మన అందరినీ దేవుడు మేఘాల్లోకి తీసుకుపోతాడు. చనిపోయిన ఇతర విశ్వాసుల్ని మనం అక్కడ కలుసుకుంటాము. మనం అందరం కలిసి యేసు ప్రభువును ఆకాశంలో కలుసుకుంటాము. మనమందరం ఎప్పటికీ ఆయనతోనే ఉంటాము.
\v 18 ఇదంతా నిజమే కాబట్టి ఈ బోధను ఒకరితో ఒకరు పంచుకుంటూ ప్రోత్సహించుకోండి.
\s5
\c 5
\p
\v 1 నా తోటి విశ్వాసులారా! యేసు ప్రభువు తిరిగి వచ్చే సమయం గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నిజానికి దాని గురించి నేను మీకు రాయవలసిన అవసరం లేదు.
\v 2 ఊహించని సమయంలో యేసు ప్రభువు తిరిగి వస్తాడని మీకు తెలుసు కాబట్టి దాని గురించి మీకు కచ్చితమైన అవగాహన ఉందని మీకే తెలుసు. రాత్రిపూట దొంగ ఎలా వస్తాడో ఎవరూ ఊహించలేనట్టే, ఆయన రాక ఎప్పుడు వస్తుందో మనుషులు తెలుసుకోలేరు.
\p
\v 3 ఏదో ఒక సమయంలో, "అంతా ప్రశాంతంగా ఉంది, మనమంతా క్షేమం" అని మనుషులు అనుకొనే సమయంలో, అకస్మాత్తుగా దేవుడు వచ్చి కఠినంగా శిక్షిస్తాడు. గర్భవతికి పురిటి నొప్పులు వస్తే ఆ నొప్పులను ఎవరూ ఆపలేనట్టే, దేవుని నుండి తప్పించుకొనే దారి వాళ్లకు దొరకదు.
\s5
\v 4 కానీ నా తోటి విశ్వాసులారా! దేవుని గురించిన సత్యం మీకు తెలుసు కాబట్టి మీరు చీకటిలో జీవించే వాళ్ళలాగా కాదు. అందుకే యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన కోసం మీరు సిద్ధంగా ఉంటారు.
\v 5 మీరు రాత్రి చీకటికి చెందినవారు కాదు, పగటి వెలుగుకు చెందినవారు.
\v 6 అందుకే విశ్వాసులం అయిన మనం జరుగుతున్న విషయాలను గురించి తెలుసుకుంటూ ఉండాలి. మనల్ని మనం అదుపులో ఉంచుకుంటూ యేసు రాక కోసం సిద్ధంగా ఉండాలి.
\p
\v 7 రాత్రి సమయంలో ఏమి జరుగుతుందో తెలియకుండా మనుషులు నిద్రపోతున్నప్పుడు, మనుషులు తాగి ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది.
\s5
\v 8 కానీ విశ్వాసులమైన మనం పగటికి చెందిన వాళ్ళం, అందుకే మనల్ని అదుపులో ఉంచుకుందాం. సైనికుల్లాగా ఉందాం. వాళ్ళు తమ ఛాతీని కవచంతో భద్రపరచుకున్నట్టు, క్రీస్తులో విశ్వాసం ఉంచి, ఆయన్ని ప్రేమిస్తూ మనల్ని భద్రపరచుకుందాం. వాళ్ళు హెల్మెట్లతో తమ తలలు భద్రపరచుకున్నట్టు, చెడుతనం నుండి క్రీస్తు మనల్ని రక్షించాలని కోరుకుంటూ మనల్ని భద్రపరచుకుందాం.
\p
\v 9 ఆయన శిక్షించే వాళ్ళల్లో మనం ఉండాలని దేవుడు మనల్ని ఎంచుకోలేదు. యేసు క్రీస్తు మన కోసం చేసిన కార్యాన్ని మనం నమ్ముతున్నాం కాబట్టి, ఆయన మనల్ని రక్షించాలని నిర్ణయించుకున్నాడు.
\v 10 మనం బ్రతికి ఉన్నా చనిపోయినా ఆయన భూమికి తిరిగి వచ్చినప్పుడు ఆయనతో కలిసి జీవించాలనే ఉద్దేశంతో మన పాపాలకు పరిహారంగా యేసు మరణించాడు.
\v 11 ఇది నిజం అని మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్నట్టుగానే ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం కొనసాగించండి.
\s5
\p
\v 12 నా తోటి విశ్వాసులారా! మీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళను నాయకులుగా మీరు గుర్తించాలని మేము కోరుతున్నాము. మీరు విశ్వాసంలో ఎదగడానికి వాళ్ళు ఎంత ప్రయాసపడుతూ ఉన్నారో మీరు చూసారా! ఈ నాయకుల్ని మీ తోటి విశ్వాసుల్లాగా చూస్తూ, వాళ్ళ పట్ల మర్యాదగా నడుచుకోవాలని దీని అర్థం. వీళ్ళు ప్రభువు కోసం ఎలా జీవించాలో దారి చూపిస్తూ మీకు నేర్పిస్తారు.
\v 13 వాళ్ళు చేసే పనిని బట్టి మీరు వాళ్ళను ప్రేమిస్తారు కాబట్టి, వాళ్ళను గౌరవించమని కూడా చెప్తున్నాము. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించాలని మేము వేడుకుంటున్నాము.
\p
\v 14 నా తోటి విశ్వాసులారా! పని చేయకుండా ఇతరుల నుండి ఆశిస్తూ సోమరులుగా బ్రతికే వాళ్ళను హెచ్చరించమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాను.
\p భయపడే విశ్వాసుల్ని ప్రోత్సహించండి.
\p బలహీనంగా ఉన్న వాళ్ళందరికీ ఏదొక విధంగా సహాయం చేయండి.
\p ప్రతి ఒక్కరి పట్ల సహనంతో ఉండమని కూడా మేము వేడుకుంటున్నాము.
\s5
\p
\v 15 మీకు ఎవరైనా కీడు చేసినా మీరు వాళ్లకి ప్రతి కీడు చేయొద్దు. మీరు ఒకరి పట్ల ఒకరు ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ మేలైనదే చేయడానికి ప్రయత్నం చేయాలి.
\p
\v 16 అన్ని సమయాల్లో ఆనందంగా ఉండండి.
\p
\v 17 నిరంతరం ప్రార్థన చేయండి.
\p
\v 18 అన్ని పరిస్థితులలో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. క్రీస్తు యేసు చేసిన కార్యాన్ని బట్టి మీరు ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
\s5
\p
\v 19 దేవుని ఆత్మ మీ మధ్య పనిచేయనీయకుండా చేయవద్దు.
\v 20 ఉదాహరణకు, పరిశుద్ధాత్మ ఎవరికైనా ఏమైనా చెప్తే దాన్ని తృణీకరించొద్దు.
\v 21 అలాంటి సందేశాలు అన్నిటినీ పరీక్షించండి. మంచి వాటిని అంగీకరించి వాటికి లోబడండి.
\v 22 చెడు సంబంధమైన సందేశాలకు లోబడొద్దు.
\s5
\p
\v 23 దేవుడు మీలో ఎలాంటి తప్పిదం లేకుండా చేసి, మీకు శాంతిని ఇస్తాడు. అప్పుడు మీరు పాపం చేయరు. యేసు ప్రభువు భూమికి తిరిగి వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని పాపం చేయకుండా ఉంచును గాక!
\p
\v 24 దేవుడు తన ప్రజలుగా మిమ్మల్ని పిలిచాడు కాబట్టి, అలా మీకు సహాయం చేస్తూ ఉంటాడని మీరు కచ్చితంగా నమ్మవచ్చు.
\s5
\p
\v 25 నా తోటి విశ్వాసులారా! నా కోసం, సిల్వాను కోసం, తిమోతి కోసం ప్రార్థన చేయండి.
\v 26 విశ్వాసులుగా మీరు కలిసి సమకూడినప్పుడు తోటి విశ్వాసులను ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకోండి.
\p
\v 27 మీ మధ్య విశ్వాసులందరూ ఉన్నప్పుడు ఈ ఉత్తరం తప్పకుండా చదివి వినిపించండి. ఇప్పుడు దేవుడు మాట్లాడినా నేను మీకు చెప్పిందే చెప్తాడు.
\p
\v 28 మీ అందరి పట్ల మన యేసు క్రీస్తు ప్రభువు కృప చూపడం కొనసాగించును గాక!

98
54-2TH.usfm Normal file
View File

@ -0,0 +1,98 @@
\id 2TH - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక
\toc1 తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక
\toc2 తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక
\toc3 2th
\mt1 తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక
\s5
\c 1
\p
\v 1 మన తండ్రి అయిన దేవుణ్ణి, యేసు క్రీస్తు ప్రభువును నమ్మిన తెస్సలోనిక నగరంలోని విశ్వాసుల సంఘానికి పౌలు, సిల్వాను, తిమోతి ఈ ఉత్తరం రాస్తున్నాము.
\v 2 తండ్రి అయిన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీ పట్ల కృప చూపిస్తూ మీకు శాంతిని ఇవ్వడం కొనసాగించాలని మేము ప్రార్థన చేస్తున్నాము.
\s5
\p
\v 3 మా తోటి విశ్వాసులారా! మీలో ప్రతి ఒక్కరూ ఒకరిని ఒకరు మరింతగా ప్రేమించుకుంటూ, యేసు ప్రభువులో విశ్వాసం పెంచుకుంటూ ఉన్నందుకు మేము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.
\v 4 దీని ఫలితంగా, దేవునికి చెందిన ఇతర విశ్వాసుల సంఘాల్లో మీ గురించి గర్వంగా చెప్తున్నాము. మీరు ఎంత ఓర్పుగా ఉంటున్నారో, ఇతరులు మిమ్మల్ని తరచుగా ఎంతో ఇబ్బంది పెడుతున్నా యేసు ప్రభువులో మీరు విశ్వాసాన్ని ఎలా కొనసాగిస్తున్నారో మేము వాళ్లకి చెప్తున్నాము.
\p
\v 5 మీరు ఆ ఇబ్బందులను భరిస్తున్నారు కాబట్టి దేవుడు ప్రజలందరికీ న్యాయం తీర్చుతాడని స్పష్టంగా మీకు తెలుసు. మీరు ఆయనలో విశ్వాసం ఉంచి బాధలు పడుతున్నారు కాబట్టి ఆయన ఏలుబడిలో మీరు నిత్యం ఉంటారని ప్రతి ఒక్కరికీ ఆయన వెల్లడిస్తాడు.
\s5
\v 6 మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళకి దేవుడు కచ్చితంగా ఇబ్బంది కలిగిస్తాడు. ఇలా చేయడం ఆయనకు సరైనదే.
\v 7 మిమ్మల్ని కష్టాల గుండా తేవడం వల్ల ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు. అది ఆయన సరైనదిగానే పరిగణిస్తాడు. యేసు ప్రభువు తన శక్తివంతమైన దూతలతో పరలోకం నుండి తిరిగి వచ్చినప్పుడు ఆయన మీకు, మాకు కూడా ప్రతిఫలం ఇస్తాడు.
\v 8 అప్పుడు మన యేసు ప్రభువు గురించిన శుభవార్త అంగీకరించకుండా నిరాకరించిన వాళ్ళని, తనకు నమ్మకంగా లేని వాళ్ళని ఆయన దావానలంతో శిక్షిస్తాడు.
\s5
\p
\v 9 మన యేసు ప్రభువు గొప్ప శక్తితో అలాటి వారిని తాను ఏలుతున్న చోటు నుండి దూరంగా తరిమి వేసి, శాశ్వతంగా నాశనం చేస్తాడు.
\v 10 దేవుడు నిర్ణయించిన సమయంలో యేసు ప్రభువు పరలోకం నుండి తిరిగి వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. దీని ఫలితంగా, మనమంతా ఆయనను స్తుతిస్తూ, ఆయన్ని చూసి ఆశ్చర్యపోతాము. మేము వివరించిన విధంగా మీరు నమ్మారు కాబట్టి మీరు కూడా అక్కడే ఉంటారు.
\s5
\p
\v 11 ఈ విధంగా యేసును మీరు స్తుతించాలని మేము కూడా మీకోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాము. మీరు జీవించాలని దేవుడు మిమ్మల్ని పిలిచిన కొత్త మార్గంలో జీవించడానికి మీరు అర్హులయ్యేలా మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు కోరుకున్న ప్రతి దానిలో మీరు మంచి చేయగలిగేలా ఆయన చేయాలని కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. ఆయన శక్తిమంతుడు కాబట్టి, ఆయనలో మీరు విశ్వాసముంచిన కారణంగా ప్రతి విధమైన మంచి పనినీ మీరు చేయగలిగేలా ఆయన చేస్తాడు.
\v 12 మీరు యేసు ప్రభువును స్తుతించాలనీ ఆయన మిమ్మల్ని ఘనపరచాలనీ మేము ఇలా ప్రార్థన చేస్తున్నాము. మనం ఆరాధించే దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు మీపైన కృప చూపిస్తాడు కాబట్టి ఇది జరుగుతుంది.
\s5
\c 2
\p
\v 1 యేసు క్రీస్తు ప్రభువు తిరిగి వచ్చే సమయం గురించి, యేసుతో మనల్ని దేవుడు సమకూర్చడం గురించి నేను మీకు ఇప్పుడు రాయాలనుకుంటున్నాను.
\v 2 నా తోటి విశ్వాసులారా! యేసు ప్రభువు భూమికి తిరిగి రావడం ఇప్పటికే జరిగిపోయిందని మీకు వచ్చిన ఏ సందేశం గురించి అయినా సరే జాగ్రత్త పడమని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. అది దేవుని ఆత్మ తనకు బయలు పరిచాడని ఎవరైనా ఇచ్చే సందేశం కావచ్చు. లేదా ఎవరో ఒకరు నేను రాసిన ఉత్తరంలో ఉన్న సంగతి అని చెప్పవచ్చు.
\s5
\v 3 ఎవరైనా మిమ్మల్ని ఇలాంటి సందేశంతో నమ్మించి, ఒప్పించాలని ప్రయత్నిస్తే అంగీకరించకండి.
\p ప్రభువు వెంటనే రాడు. మొదట చాలామంది దేవునికి వ్యతిరేకం అవుతారు. దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా పాపం చేసే వాడికీ దేవుడు నాశనం చేసే వాడికీ వాళ్ళు లోబడి, వాడిని అంగీకరిస్తారు.
\v 4 దేవునికి పెద్ద శత్రువు వాడే. ప్రజలు దేవునిగా పరిగణిస్తున్న ఆయనకు వాడు వ్యతిరేకంగా గర్వంగా పనిచేస్తాడు. దీని ఫలితంగా, దేవుని ఆలయంలోకి ప్రవేశించి, ఏలడానికి కూర్చుంటాడు. తననే దేవుడిగా బహిరంగంగా ప్రకటించుకుంటాడు.
\s5
\p
\v 5 నేను తెస్సలోనీకలో మీతో ఉన్నప్పుడు ఈ విషయాలు మీతో చెప్తూనే ఉన్నానని చెప్పగలను.
\v 6 ఇప్పుడైతే అందరికీ తనను వెల్లడి పరచుకోనియ్యకుండా అతడిని అడ్డగిస్తున్నది ఏదో ఉందని మీకు కూడా తెలుసు. దేవుడు వాడికి అనుమతిని ఇచ్చే సమయం వరకు వాడు తనను కనపరచుకోలేడు.
\v 7 అయినా దేవుని నియమాలను ప్రజలు నిరాకరించేలా ఇప్పటికే సాతాను రహస్యంగా పనిచేస్తూ ఉన్నా, తనను ప్రదర్శించుకోవాలని అనుకుంటున్న ఈ మనిషిని అడ్డుకునేవాడిని దేవుడు తొలగించే వరకు అతన్ని అడ్డుకోవడం కొనసాగుతూనే ఉంటుంది.
\s5
\p
\v 8 ఆ తరవాత దేవుని నియమాలను పూర్తిగా తిరస్కరించిన ఈ మనిషి ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ తనను కనపరచుకోడానికి దేవుడు అనుమతిస్తాడు.యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ప్రతివారికీ తనను కనుపరచుకుంటూ, ఆ మనిషిని పూర్తిగా శక్తిహీనుణ్ణి చేస్తాడు. తరవాత వాడు నాశనం కావాలని యేసు ప్రభువు ఒక్క ఆజ్ఞ ఇస్తాడు.
\v 9 కానీ వాణ్ణి యేసు నాశనం చేయక ముందు సాతాను వాడికి చాలా గొప్ప శక్తినిస్తాడు. దాని ఫలితంగా వాడు అన్ని రకాల ఆశ్చర్యకార్యాలూ, అద్భుతాలూ చేస్తాడు. అవన్నీ చేయడానికి వాడికి ఆ సామర్ధ్యాన్ని దేవుడే ఇచ్చాడని చాలామంది నమ్ముతారు.
\p
\v 10 కీడు కలిగించేవి చేయడం ద్వారా ఆ మనిషి నాశనానికి గురయ్యే వాళ్ళని పూర్తిగా మోసగిస్తాడు. యేసు ఎలా వాళ్ళని రక్షించగలడో, దాని గురించిన నిజమైన సందేశాన్ని వాళ్ళు ఇష్టపడకుండా తిరస్కరించిన కారణంగా వాడు వాళ్ళని మోసం చేయగలిగాడు.
\s5
\v 11 వాళ్ళను సులభంగా మోసగించడానికి ఈ మనిషిని దేవుడు నియమించడం వల్ల ఈ మనిషి తన గురించి చెప్పిన అబద్ధాలను వాళ్ళు నమ్ముతారు.
\v 12 ఫలితంగా, చెడు చేసి ఆనందిస్తూ క్రీస్తు గురించిన సత్యాన్ని నమ్మకుండా తిరస్కరించిన అందరికీ దేవుడు తీర్పు తీర్చి, శిక్షిస్తాడు.
\s5
\p
\v 13 మా తోటి విశ్వాసులారా! మీరు యేసు ప్రభువును ప్రేమించే వారు. మిమ్మల్ని బట్టి మేము దేవునికి వందనాలు చెప్తున్నాము. యేసును గురించిన సత్యాన్ని విశ్వసించే వారిలోనూ దేవుడు రక్షించాలి అనుకునే వారిలోనూ మొదటి వారిగా ఉండాలనీ ఆయన మిమ్మల్ని తన కోసం తన ఆత్మ ద్వారా ప్రత్యేకపరచుకోవాలనీ మిమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి, మేము ఇలా కృతజ్ఞతలు చెప్తున్నాము.
\v 14 మన యేసు క్రీస్తు ప్రభువును దేవుడు ఘనపరచిన విధంగా మిమ్మల్ని కూడా దేవుడు ఘనపరిచే క్రమంలో క్రీస్తు గురించిన సందేశం మేము మీకు ప్రకటించిన ఫలితంగా మిమ్మల్ని ఆయన ఎన్నుకున్నాడు. అందుకే మేము దేవునికి వందనాలు చెప్తున్నాము.
\p
\v 15 అందుకే మా తోటి విశ్వాసులారా! క్రీస్తులో బలమైన విశ్వాసంతో కొనసాగండి. మేము మీకు రాసిన, చెప్పిన, బోధించిన నిజమైన విషయాలను విశ్వసించడం కొనసాగించండి.
\s5
\v 16 మనల్ని ప్రేమించి, ఆయన దయ చొప్పున ఆయన నుండి మంచి వాటిని పొందాలని మనలను నిత్యం ప్రోత్సహించిన తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకు మేము ప్రార్థన చేస్తున్నాము.
\v 17 దేవుడు, యేసు క్రీస్తు కలసి మిమ్మల్ని ప్రోత్సహించుదురు గాక! మంచి చెప్తూ, చేస్తూ ఉండేలా మిమ్మల్ని కొనసాగింపజేయు గాక!
\s5
\c 3
\p
\v 1 నా తోటి విశ్వాసులారా! ఇతర విషయాలకు వస్తే, మీరు అంగీకరించినట్టు యేసు ప్రభువును గురించిన మా సందేశాన్ని ఇతరులు కూడా తొందరగా విని, దానిని గౌరవించేలా మా కోసం ఇంకా ఇంకా ప్రార్థన చేయండి.
\v 2 ప్రభువులో విశ్వాసం అందరికీ ఉండదు. మాకు చెడు చేస్తూఉండే వాళ్ళను మాకు దూరంగా ఉంచేలా కూడా ప్రార్థన చేయండి.
\v 3 ఏది ఏమయినా యేసు ప్రభువు నమ్మదగినవాడు. అందుకే మీరు తప్పకుండా బలంగా ముందుకు కొనసాగేలా చేస్తాడు. చెడ్డ వాళ్ళ నుండి, సాతాను నుండి కూడా మిమ్మల్ని తప్పకుండా కాపాడతాడు.
\s5
\v 4 మనం అందరం యేసు ప్రభువుతో చేరాము కాబట్టి, మేము మీకు ఆజ్ఞాపించిన వాటికి మీరు విధేయత చూపారనీ, ఈ ఉత్తరంలో మేము ఆజ్ఞాపిస్తున్న వాటికీ విధేయత చూపిస్తారనీ మేము నమ్ముతున్నాము.
\v 5 దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, క్రీస్తు మీ కోసం ఎంత హింస భరించాడో మీరు తెలుసుకోవడంలో మీకు సహాయం చెయ్యాలని మన యేసు ప్రభువుకు మేము ప్రార్థన చేస్తున్నాము.
\s5
\p
\v 6 మా తోటి విశ్వాసులారా! యేసుప్రభువే స్వయంగా మీతో చెబుతున్నట్టుగా అనుకుంటూ ఇది వినండి. పని చేయకుండా బద్ధకస్తులుగా ఉన్నవాళ్ళతో ఎలాటి సంబంధం పెట్టుకోవద్దని మీకు ఆజ్ఞాపిస్తున్నాము. ఇతరులు మాకు బోధించగా విని మేము మీకు బోధించిన విధంగా తమ జీవితాలను నిర్వహించుకోలేని వాళ్లకు దూరంగా ఉండండి.
\v 7 మేము ఎలా ప్రవర్తిస్తామో మీరు కూడా అలాగే ప్రవర్తిస్తారు. మీ మధ్య మేము ఉంటుండగా పని చేయకుండా మీ చుట్టూ ఊరికే కూర్చో లేదు కాబట్టి ఇది మీకు చెప్తున్నాము.
\v 8 మీ దగ్గర మేమెలా ప్రవర్తించామో మీరు తెలుసుకోవాలనీ, మీరూ అలాగే ప్రవర్తించాలనీ మేము చెప్తున్నాం. మీ దగ్గర ఉన్నప్పుడు మేము డబ్బు చెల్ల్లించకుండా ఎవరి దగ్గరా భోజనం చెయ్యలేదు. ఈ క్రమంలో మా అవసరాలకు ఎవరిపైనా ఆధారపడలేదు.
\v 9 నేను అపోస్తలుడను కాబట్టి మీపై ఆధారపడే హక్కు నాకు ఎప్పుడూ ఉంది, కానీ మీకు మంచి ఉదాహరణలుగా ఉండాలని మేము కష్టపడి పనిచేసాము. ఆ క్రమంలో మేము నడుచుకున్నట్టు మీరు కూడా నడుచుకోవాలి.
\s5
\p
\v 10 మేము మీతో ఉండగా ఏ తోటి విశ్వాసి అయినా పని చేయడానికి నిరాకరిస్తే, వాడికి భోజనం పెట్టవద్దని నేను మీకు ఆజ్ఞాపిస్తూనే ఉన్నానని గుర్తు చేసుకోండి.
\v 11 మీలో ఎవరో బద్ధకస్తులుగా ఉంటూ, పని చేయడం లేదని నాకు కొందరు చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇది రాస్తున్నాను. అది మాత్రమే కాదు, వాళ్ళు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉన్నారు.
\v 12 ఇలా పని చేయని తోటి విశ్వాసులకు యేసు ప్రభువే చెప్తున్నాడని భావిస్తూ వాళ్ళ పనిని వాళ్ళు చూసుకుంటూ, జీవించడానికి సొంతగా సంపాదించుకుంటూ వాళ్ళ పోషణ చూసుకోవాలని బతిమాలుకుంటున్నాను.
\s5
\p
\v 13 తోటి విశ్వాసులారా! సరైనది చేయడానికి ఎప్పుడూ విసుక్కోవద్దు.
\p
\v 14 ఈ ఉత్తరంలో రాసిన దానికి ఏ విశ్వాసి అయినా లోబడకపోతే అతన్ని కనిపెట్టండి. అతను సిగ్గుపడేలా అతనితో కలిసి ఉండవద్దు.
\v 15 అతన్ని శత్రువులా భావించకండి. మీ తోటి విశ్వాసులను హెచ్చరించినట్టు హెచ్చరించండి.
\s5
\p
\v 16 తన ప్రజలకు శాంతిని ఇచ్చే మన ప్రభువే ప్రతి పరిస్థితిలో మీకు ఎప్పుడూ శాంతిని కలిగించాలని నా ప్రార్థన. మన యేసు ప్రభువు మీకు సహాయం చేయడం కొనసాగించాలని నా ప్రార్థన.
\p
\v 17 రాసే వాడి నుండి కలం తీసుకుని పౌలు అనే నేను స్వయంగా రాస్తున్నాను. నా ఉత్తరాలన్నిటిలో మీకు నేనే రాసానని తెలియాలని నేను ఇలా చేసి, నా ఉత్తరాలన్నిటినీ ముగిస్తాను.
\v 18 యేసు క్రీస్తు ప్రభువు కృప మీ అందరి పైన కొనసాగాలని నా ప్రార్థన.

233
55-1TI.usfm Normal file
View File

@ -0,0 +1,233 @@
\id 1TI - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h తిమోతికి రాసిన మొదటి పత్రిక
\toc1 తిమోతికి రాసిన మొదటి పత్రిక
\toc2 తిమోతికి రాసిన మొదటి పత్రిక
\toc3 1ti
\mt1 తిమోతికి రాసిన మొదటి పత్రిక
\s5
\c 1
\p
\v 1 తిమోతీ, పౌలు అనే నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. మెస్సీయ అయిన యేసు ఆజ్ఞాపించి, ఆయన ప్రతినిధిగా నన్ను నియమించుకున్నట్టు నీకు తెలుసు. మనల్ని రక్షించిన యేసు రాకడ కోసం మనం నమ్మకంగా ఎదురు చూస్తున్నాము.
\p
\v 2 తిమోతీ, నా బోధను బట్టి ప్రభువైన మెస్సీయను విశ్వసించిన నువ్వు నా నిజమైన కొడుకులాంటి వాడవు. నీ ఆత్మలో తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు నుండి కృప, కనికరం నిరంతరం కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను.
\s5
\v 3 నేను మాసిదోనియకు వెళ్తూ నిన్ను కోరినట్టుగా ఎఫెసులోనే ఉండు. అక్కడే ఉండి ప్రజలకు తప్పుడు సిద్దాంతాలు బోధిస్తున్న వాళ్ళను అదుపు చేస్తూ అలా చేయవద్దని వాళ్ళను ఆజ్ఞాపించు.
\v 4 వివాదాలకు కారణమయ్యే ముసలమ్మ ముచ్చట్లు, అంతూ పొంతూలేని వంశావళులపై దృష్టి నిలిపే వాళ్ళను ఖండితంగా నిరోధించు. ఇలాంటి విషయాలు దేవుణ్ణి నమ్మిన మనకు ఏ విధంగానూ ఉపయోగపడవు.
\s5
\p
\v 5 ఇలాంటి వాటిని నిరోధించడం మనుషులు మన నిజమైన బోధ ద్వారా ఒకరినొకరు ప్రేమించుకొనేందుకు, మంచి జరగాలని కోరుకొనేందుకు, దేవుడు మెచ్చిన క్రియలు తాము జరిగించేందుకు కారణమౌతుంది.
\v 6 ఇలాంటి మంచి పనులు చేయడానికి కొందరు నిరాకరించి, వ్యర్ధమైన బోధలు చేయడానికి మక్కువ చూపుతున్నారు.
\v 7 వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే బోధలుగా ఉండాలని కోరుకుంటున్నారు గానీ వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారో, ఏ విషయాలు నిజమని నమ్ముతున్నారో వాళ్లకే అర్థం కాదు.
\p
\v 8 అయితే మోషే ధర్మశాస్త్రాన్ని తగిన రీతిలో ఉపయోగిస్తే అది ఎంత ప్రయోజనమో మనకు తెలుసు.
\s5
\p
\v 9 దేవుని చట్టాలు మంచి వారికి తీర్పు తీర్చడానికి గాక వాటిని అగౌరవపరిచే వాళ్ళకి, దేవుణ్ణి ఘనపరచని వాళ్ళకి, తల్లితండ్రులను చంపే హంతకులకి వర్తిస్తాయి.
\v 10 ఆ చట్టాలు వ్యభిచారులు, స్వలింగ సంపర్కులు, అబద్ద సాక్షం చెప్పేవారు, అబద్ధికులు, నిజమైన బోధకు విరుద్ధంగా నడిచే వాళ్ళకి వర్తిస్తాయి.
\v 11 ఈ మహిమగల సువార్తను మహిమగల దివ్య ప్రభువు నాకు అప్పగించాడు.
\s5
\p
\v 12 నన్ను నమ్మి బలపరిచి తన సేవకు నియమించుకున్న ప్రభువైన క్రీస్తు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాను.
\v 13 అంతకు ముందు దేవుణ్ణి దూషించి ఆయన భక్తులను హింసించాను, అయితే తెలియక అవిశ్వాసంతో చేసాను కాబట్టి క్షమాపణ పొందాను.
\v 14 మన ప్రభువు నేను చేసిన చెడు కార్యాలను క్షమించి అర్హతలేని నాకు తన క్పపను దయచేసి తన వాడిగా చేసుకున్నాడు.
\s5
\p
\v 15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడనే సందేశం మనమందరం పూర్తిగా నమ్మాలి, అలాంటి పాపుల్లో నేను మొదటి వాణ్ణి.
\v 16 అందరికంటే పెద్ద పాపినైన నన్ను క్షమించి నిత్య జీవం ఇవ్వడం ద్వారా యేసు క్రీస్తు తన పూర్తి ఓర్పును నాలో కనపడేలా చేసాడు. నా క్షమాపణను ఒక ఉదాహరణలా చేసాడు.
\p
\v 17 అందుకే మనం నిత్యముండే రాజూ, అమరుడు అయిన ఏకైక దేవునికి మహిమ ఘనత చెల్లిద్దాం.
\s5
\p
\v 18 నా కొడుకులాంటి తిమోతీ, గతంలో నిన్ను గురించి చెప్పిన ప్రవచనాలకు అనుగుణంగానే ఈ సూచనలు నీకు ఇస్తున్నాను. వాటిని పాటిస్తే అబద్ద బోధకులపై మంచి పోరాటం చేయగలుగుతావు.
\v 19 యేసు ప్రభువుపై విశ్వాసముంచి సరైన పనులు మాత్రమే చెయ్యండి. అలా చెయ్యకుండా దేవునితో సంబంధం చెడగొట్టుకున్న చాలామందిని గుర్తుంచుకో.
\v 20 హుమెనై, అలెగ్జాండర్ అలాటివారే. వారు దేవుణ్ణి దూషించడం మానుకునేలా వాళ్ళని సాతానుకు అప్పగించాను.
\s5
\c 2
\p
\v 1 నేను విశ్వాసులను కోరుకునే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరి కోసం దేవుణ్ణి ప్రార్థించండి. వాళ్ళ అవసరాలు తీరేలా, వాళ్ళు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేలా వాళ్ళ కోసం నిరంతరం ప్రార్థించండి.
\v 2 రాజుల కోసం, అధికారంలో ఉన్నవారి కోసం ప్రార్థించండి. అప్పుడు మనం శాంతి సమానత్వాలతో దేవుని దృష్టిలో నీతిగా, సక్రమంగా జీవించగలుగుతాము.
\v 3 ఇలాంటి ప్రార్థన మన రక్షకుడైన దేవునికి సంతోషం కలిగిస్తుంది.
\v 4 మానవులంతా రక్షణ పొందాలని ప్రతి ఒక్కరూ సత్య వాక్యం తెలుసుకుని ఆయనను అంగీకరించాలని ఆయన కోరుతున్నాడు.
\s5
\p
\v 5 దేవుడు ఒక్కడే, మానవులను దేవుని చెంతకు చేర్చేదీ ఒక్కడే. ఆయనే మానవ రూపం దాల్చిన మెస్సీయ అయిన యేసు.
\v 6 మానవుల విమోచన వెలగా ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. సరియైన సమయంలో దేవుడు మానవుల రక్షణను ఆమోదించాడు.
\v 7 దేవుని సువార్త సందేశం ప్రకటించేవానిగా ఆయన నన్ను నియమించుకున్నాడు. క్రీస్తు ప్రభువుకు చెందినవాడిగా నేను నిజం చెబుతున్నాను, అబద్ధాలు చెప్పడం లేదు. యూదులు కానివాళ్ళు నిజమైన దేవుని సత్యాలు తెలుసుకుని ఆయనను విశ్వసించాలని వారికి కూడా బోధించాను.
\s5
\p
\v 8 అందువల్ల అన్ని స్థలాల్లోని పురుషులు దేవుణ్ణి సంతోషపరిచే విధంగా జీవిస్తూ ఆయనను ఆరాధించాలని కోరుతున్నాను. అలా చేస్తే ఒకరిపై ఒకరు కోపతాపాలు లేకుండా ప్రతి ఒక్కరూ శాంతి సమాధానాలతో ఉండగలుగుతారు.
\v 9 అలాగే స్త్రీలు కూడా నిరాడంబరమైన, మర్యాదపూర్వకమైన దుస్తులు ధరించుకోవాలి. అందంగా కనబడడం కోసం జడలతో, బంగారంతో, ముత్యాలతో చాలా ఖరీదైన వస్త్రాలతో అలంకరించుకోకూడదు.
\v 10 భక్తిపరులుగా కనబడాలని చూసే స్త్రీలకు తగినట్టుగా తమ మంచి పనులతో తమను తాము అలంకరించుకోవాలి.
\s5
\p
\v 11 సంఘ సమావేశాల్లో స్త్రీలు మౌనంగా ఉండి విధేయతతో నాయకుల నుండి నేర్చుకోవాలి.
\v 12 స్త్రీలు బోధించడాన్ని, పురుషులపై అధికారం చెలాయించడాన్ని నేను అంగీకరించను. స్త్రీలు మౌనంగా ఉండి వినడమే మంచిది.
\s5
\p
\v 13 దేవుడు మొదటగా ఆదామును, తరువాత హవ్వను సృష్టించాడు గదా.
\v 14 దేవుడు చెయ్యకూడదు అని చెప్పినదాన్ని చేసి సాతాను చేతిలో పూర్తిగా మోసపోయినది హవ్వే కానీ ఆదాము కాదు.
\v 15 అయినా స్త్రీలు దేవునిలో విశ్వాసముంచి, ఇతరులను ప్రేమిస్తూ, ఆయనకు ఇష్టులై ఉంటే బిడ్డలను కనే సమయంలో దేవుడు వారిని కాపాడతాడు.
\s5
\c 3
\p
\v 1 విశ్వాసుల గుంపుకు ఎవరైనా నాయకుడుగా ఉండాలని కోరుకుంటే, అతడు ఘనమైన పనిని కోరుకుంటున్నాడు అని ప్రతి ఒక్కరూ అంగీకరించవచ్చు.
\v 2 ఈ కారణాన నాయకుడుగా ఉండాలనుకునే వాడు అపనిందకు చోటివ్వకుండా మంచి పనులు జరిగించేవాడై ఉండాలి. అతడు ఏక పత్నీవ్రతుడై ఉండాలి. మితిమీరి ఎలాంటి పనులూ చేయకూడదు. మంచి ఆలోచనలు కలిగి ఉండి చక్కని ప్రవర్తనతో నడుచుకోవాలి. అతిథులను గౌరవిస్తూ ఇతరులకు బోధించేవాడుగా ఉండాలి.
\v 3 అతడు తాగుబోతు కాక, వివాదాలకు దూరంగా ఉండాలి. సాధు స్వభావం కలిగి ఉండి కలహాల, గొడవల జోలికి పోకూడదు. అతనికి డబ్బుపై మోజు ఉండకూడదు.
\s5
\p
\v 4 అతడు తన సొంత కుటుంబాన్ని గుట్టుగా గౌరవ మర్యాదలతో నడుపుకోవాలి. పిల్లలు అతనికి చెప్పుచేతల్లో ఉంటూ, గౌరవిస్తూ ఉండాలి.
\v 5 తన కుటుంబాన్ని సవ్యంగా నిర్వహించుకోలేని వాడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు?
\s5
\p
\v 6 కొత్తగా విశ్వాసి అయినవాణ్ణి విశ్వాసుల గుంపుకు నాయకుడుగా నియమించవద్దు. ఎందుకంటే అతడు గర్వంగా ప్రవర్తించవచ్చు. అప్పుడు అపవాదితో పాటు దేవుని తీర్పుకు గురౌతాడేమో.
\v 7 విశ్వాసులు కానివారు సహితం అతణ్ణి గురించి మంచి అభిప్రాయం కలిగి ఉండేలా అతని ప్రవర్తన ఉండాలి. మనుషులు వల వేసి జంతువులను పట్టినట్టు, అపవాది వలలో పడకుండా అతనిపై ఎవ్వరూ నిందలు మోపరాదు.
\s5
\p
\v 8 అదే విధంగా, నాయకులకు సహాయకుడిగా ఉండేవారు గంభీరంగా ప్రవర్తించాలి. వారి మాటల్లో నిజాయితీ ఉండాలి. అతడు తాగుబోతు కాకూడదు. ధన వ్యామోహం గలవాడుగా ఉండకూడదు.
\v 9 దేవుడు వెల్లడించిన సువార్త సత్యాన్ని విశ్వసిస్తూ దాని ప్రకారం నడుచుకునేవాడై ఉండాలి.
\v 10 నాయకులుగా ఉండగోరిన వాళ్ళను పరీక్షించినట్టే వీళ్ళ నడవడిని కూడా పరీక్షించి, అంతా సవ్యంగా ఉన్నప్పుడు సహాయకులుగా నియమించవచ్చు.
\s5
\p
\v 11 అలాగే వాళ్ళ భార్యలు కూడా గౌరవానికి పాత్రులుగా ఉండి, ఇతరుల గురించి చెడ్డ మాటలు మాట్లాడకుండా, మితిమీరి ప్రవర్తించకుండా ఉండాలి. ప్రతి విషయంలోనూ నమ్మకస్తులుగా ఉండాలి.
\v 12 సహాయకుడిగా నియమితుడయ్యే వాడు తన భార్య పట్ల నమ్మకంగా ఉండాలి. అతడు తన పిల్లల, ఇంటిలోని ఇతర వ్యక్తుల విషయం జాగ్రత్త వహిస్తూ వాళ్ళను రుజు మార్గంలో నడిపించాలి.
\v 13 పరిచారకులుగా మంచి సేవ చేస్తూ, తాము నమ్మిన క్రీస్తు యేసును గురించి ధైర్యంగా ప్రకటించే సహాయకులు ప్రజల మన్ననలు పొందుతారు.
\s5
\p
\v 14 త్వరలో నేను నీ దగ్గరికి రావాలని ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ విషయాలు నీకు రాస్తున్నాను.
\v 15 నేను నీ దగ్గరికి త్వరగా రాలేని పక్షంలో, దేవుని ఇంట్లో విశ్వాసుల నడవడి, సజీవుడైన దేవుని సంఘంలో విశ్వాసుల ప్రవర్తన గురించి నీవు తెలుసుకోవాలి. వాళ్ళు సత్య సందేశాన్ని నమ్మి, దానిని బోధించ వలసినవారు.
\s5
\p
\v 16 దేవుడు వెల్లడి పరచిన సందేశం ఇది. ఈ సంగతులు మన ఊహకు అందని అద్భుతమైన సత్యాలని ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు.
\q క్రీస్తు ప్రభువు మానవ శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడు.
\q ఇది వాస్తవమని పరిశుద్దాత్మ రుజువు చేశాడు.
\q దేవదూతలు ఆయనను చూశారు.
\q విశ్వాసులు ఆయన గురించి ప్రపంచమంతటా ప్రచారం చేశారు.
\q లోకంలో అనేక ప్రాంతాల వారు ఆయనను నమ్మారు.
\q మహిమా ప్రభావాలతో దేవుడు ఆయనను పరలోకానికి కొనిపోయాడు.
\s5
\c 4
\p
\v 1 పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది యేసును గురించిన నిజ విశ్వాసాన్ని విడిచిపెట్టి, ప్రజలను మోసగించే ఆత్మలను, అబద్ద బోధకులు దురాత్మల ద్వారా చేస్తున్న తప్పుడు బోధలను నమ్ముతారు.
\v 2 వీళ్ళు అబద్దీకులు, నిజాలే బోధిస్తున్నట్టు నటిస్తూ ఉంటారు. వాళ్ళు తమ మనస్సాక్షి గద్దింపుకు లోబడరు.
\s5
\p
\v 3 విశ్వాసులు పెళ్లి చేసుకోవడాన్ని వాళ్ళు అంగీకరించరు. దేవునికి స్తుతులు చెల్లించి భుజించేలా ఆయన సృష్టించిన ఆహార పదార్థాలలో కొన్నింటిని తినకూడదని చెబుతారు. దేవుణ్ణి నమ్మిన మనకు నిజం తెలుసు కాబట్టి మనం వాటిని తింటున్నాము.
\v 4 దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే, దేవునికి స్తుతులు చెల్లించి తీసుకున్నది ఏదీ నిషేధం కాదు.
\v 5 మనం ఆయన మాట నమ్మి, ఆయనకు ప్రార్థించి తీసుకున్న ఆహారం ఆయన అంగీకరిస్తాడు.
\s5
\p
\v 6 ఈ సంగతులను తోటి విశ్వాసులకు వివరించడం ద్వారా ప్రభువైన క్రీస్తుకు సేవ చేసినవాడవౌతావు. నువ్వు అనుసరించే విశ్వాస వాక్యాలతో మంచి ఉపదేశంతో ఎదుగుతూ క్రీస్తు యేసుకు మంచి సేవకుడివి అనిపించుకుంటావు.
\v 7 పనికిమాలిన ముసలమ్మ ముచ్చట్లు వదిలిపెట్టి దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధన చేసుకో.
\v 8 శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది.
\s5
\p
\v 9 నేను రాస్తున్న ఈ విషయాలన్నిటి మీదా నువ్వు పూర్తిగా ఆధారపడవచ్చు. ఇది నమ్మదగిన సందేశం.
\v 10 ఈ కారణం చేత, మనం శాయశక్తులా కష్టపడుతున్నాం. ఎందుకంటే దేవుడు చేసిన వాగ్దానం మన విషయంలో పూర్తిగా నెరవేరుతుందని మనం నమ్మకంతో ఎదురుచూస్తున్నాం.
\s5
\p
\v 11 ఈ విషయాలు బోధించి, ఆజ్ఞాపించు.
\p
\v 12 నీ యౌవనాన్ని బట్టి ఎవరూ నిన్ను చులకన చేయనియ్యకు. నీ మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, విశ్వాసులకు ఆదర్శంగా ఉండు.
\v 13 నేను తిరిగి వచ్చేవరకు విశ్వాసుల సమక్షంలో వాక్యం చదవడంలో, బోధలో, దేవునికి లోబడమని హెచ్చరించడంలో స్థిరంగా నిలబడు.
\s5
\p
\v 14 నీకున్న వరాన్ని ఉపయోగించడంలో నమ్మకంగా ఉండు. పెద్దలు నీ మీద చేతులుంచినపుడు ప్రవచనం ద్వారా నీవు పొందిన ఆత్మ వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
\v 15 నేను నీకు బోధించిన ఈ సంగతులను సాధన చెయ్యి. ఇతరులకు యేసు అనుచరుడుగా నీ అభివృద్ది కనుగొనేలా నీ ప్రవర్తన ఉండాలి.
\v 16 నీ ప్రవర్తన గురించీ, ఉపదేశం గురించీ జాగ్రత్త వహించు. వీటిలో నిలకడగా ఉండు. నీవు అలా చేసినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే కాకుండా నీ ఉపదేశం విన్న వారిని కూడా రక్షించుకుంటావు.
\s5
\c 5
\p
\v 1 నీకంటే వయసులో పెద్దవాణ్ణి కఠినంగా కాక, సున్నితంగా మందలించు. అతనిని నీ తండ్రిగా భావించి హెచ్చరించు. యువకులను నీ సోదరులుగా భావించి వారికి మంచిని బోధించు.
\v 2 నీకన్నావయసులో పెద్దవారైన స్త్రీని తల్లిలా భావించి వాళ్లకు తగిన సూచనలివ్వు. యువతులను నీ అక్కచెల్లెళ్ళుగా భావించి హెచ్చరించు. ఇవన్నీ చేస్తున్నపుడు నువ్వు సరైన దారిలో ఉంటావు.
\s5
\p
\v 3 ఎలాంటి ఆసరా లేని నిజమైన వితంతువులకు సహాయం అందించేలా ఉండాలనేది సంఘం లక్ష్యంగా ఉండేలా చూడు.
\v 4 ఒకవేళ ఆ వితంతువుకి పిల్లలు లేదా మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నప్పుడు ఇతర సత్కార్యాలు చేసే ముందు ఆ ఇంటివారే వాళ్ళని చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన పెద్దవాళ్ళ ఋణం తీర్చుకోవచ్చు, అదే దేవునికి ఇష్టం.
\s5
\v 5 ఒక ఒంటరి వితంతువుకి ఎవ్వరి సహాయమూ లేకపోతే, ఆమె దేవుని వైపు మాత్రమే సహాయం కోసం చూస్తూ నిజాయితీగా ప్రార్థన చేస్తుంది.
\v 6 అయితే విలాసాల్లో బ్రతకాలి అనుకునే వితంతువు శారీరకంగా బ్రతికి ఉన్నా చచ్చినట్టే.
\s5
\v 7 వారి ప్రవర్తన చెడుగా ఉన్నప్పుడు వారికి సరైన విషయాలు బోధించు.
\v 8 ఎవడైనా తన బంధువులను, మరి ముఖ్యంగా తన సొంత ఇంటి వారి బాగోగులు చూసుకోపోతే అతను మనం నమ్మే వాటిని తిరస్కరించాడన్న మాట. అలాటివాడు అవిశ్వాసికన్నా చెడ్డవాడు.
\s5
\p
\v 9 అరవై ఏళ్ళ వయస్సు నిండి, గతంలో ఒక్క పురుషుడికి మాత్రమే భార్యగా ఉన్న స్త్రీని మాత్రమే వితంతువుల గుంపులో చేర్చవచ్చు.
\v 10 ఆమె మంచి పనుల్లో పేరుగాంచి ఉండాలి, తన పిల్లలను మంచిగా పెంచాలి, విశ్వాసులకు సేవ చేసి ఉండాలి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసి ఉండాలి. ప్రతి మంచి పనికీ సిద్ధంగా ఉండాలి, అలాటి వారు వితంతువుల జాబితాలో ఉండవచ్చు.
\s5
\p
\v 11 కాని పడుచు వితంతువులను లెక్కలో చేర్చవద్దు, యేసు క్రీస్తుకు విరోధంగా వారి కోరికలు అదుపు తప్పితే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు.
\v 12 ఇలా వారు తమ ప్రధాన నిర్ణయం వదిలేసి తమ మీదకు అపరాధం తెచ్చుకుంటారు.
\v 13 ఇవే కాకుండా వారు ఇంటింటికీ తిరుగుతూ, ఏ పనీ చెయ్యకుండా ముసలమ్మ ముచ్చట్లు చెబుతూ ఇతరుల విషయాల్లో తల దూర్చేవారిలా తయారవుతారు.
\s5
\p
\v 14 అందువలన వారు ఆ వితంతువుల గుంపులో చేరకుండా పెళ్లి చేసుకుని పిల్లల ఆలనా పాలనా చూస్తూ ఇల్లు గడుపుకోవాలి, ఇలా చెయ్యడం ద్వారా శత్రువైన సాతానుకు నిందించే అవకాశం ఇవ్వకుండా ఉండవచ్చు.
\v 15 ఇప్పటికే కొంతమంది యువతులు యేసును కాదని సాతాను దారిలో వెళ్ళిపోయారు, అందుకే ఇలా రాస్తున్నాను.
\p
\v 16 ఏ విశ్వాసి ఇంట్లోనైనా వితంతువులు ఉంటే, వారి గురించిన భారం సంఘానికి వదిలేయకుండా ఆమే వారికి సహాయం చెయ్యాలి.
\s5
\p
\v 17 చక్కగా నడిపించే పెద్దలను, ముఖ్యంగా వాక్యం బోధించే వారికి, వాక్య బోధనలో కష్టపడే వారికి విశ్వాసులు ఎక్కువగా గౌరవం ఇవ్వాలి.
\v 18 ఇది సరైనది అని మనకు తెలుసు. ఎందుకంటే, "కళ్ళెం నూర్చే ఎద్దు నోటిని గడ్డి తిననీయకుండా చిక్కం తగిలించ వద్దు." అని మోషే లేఖనాల్లో రాశాడు. అలాగే యేసు "కష్టపడి పనిచేసిన పనివాడికి జీతం డబ్బులు ఆపవద్దు" అని చెప్పాడు.
\s5
\p
\v 19 ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే తప్ప సంఘ పెద్దపై మోపిన నిందను ఆలకించవద్దు.
\v 20 పాపంలో కొనసాగుతున్న వ్యక్తులను ప్రజలందరి ఎదుటా గద్దించు. అలా చేస్తే మిగతావాళ్ళు ఆ పాపం చేయడానికి జంకుతారు.
\s5
\p
\v 21 దేవుని ఎదుటా, ప్రభువైన క్రీస్తు ఎదుటా, దేవుడు ఎన్నుకున్న దూతల ఎదుటా నేను నీకు బోధించిన సూచనలను తుచ తప్పకుండా అనుసరించు. ఎలాంటి పక్షపాతం చూపకుండా అందరికీ తీర్పు తీర్చు.
\p
\v 22 పెద్దలను ఎంపిక చేసే సమయంలో తొందర పడవద్దు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా పాపంలో ఉన్నట్టయితే ఆ పాపంలో నీకు కూడా పాలు ఉంటుంది. కాబట్టి వాళ్ళను పరీక్షించడానికి కావలసినంత సమయం తీసుకో. ఈ విషయంలో నిన్ను నువ్వు పవిత్రంగా ఉంచుకో.
\s5
\p
\v 23 తిమోతీ, ఇక నుండి మంచినీళ్ళు మాత్రమే కాక, నీ కడుపులో తరచుగా వచ్చే నొప్పి కోసం కొద్దిగా ద్రాక్షారసం తాగుతూ ఉండు.
\v 24 గుర్తుంచుకో, కొందరు చేసే పాపాలు తేలిగ్గా అందరికీ తెలిసిపోయి త్వరలోనే శిక్షకు గురౌతారు. మరికొందరు రహస్యంగా చేసే పాపాలు చాలా కాలానికిగానీ బట్టబయలు కావు.
\v 25 అదే విధంగా కొందరు చేసే మంచి పనులు అందరికీ తెలిసిపోతాయి. కొందరు రహస్యంగా చేసే మంచి పనులు, దానాలు కొంత కాలం గడిచిన తరువాత గానీ బయటపడవు.
\s5
\c 6
\p
\v 1 బానిసలుగా ఉన్న విశ్వాసులు తమ యజమానులను అన్ని విధాలుగా గౌరవించాలి. ఆ విధంగా చేయడం వల్ల దేవుని నామం, ఆయన బోధ హేళనకు గురి కాకుండా ఉంటాయి.
\p
\v 2 క్రీస్తును విశ్వసించిన యజమానుల దగ్గర పనిచేసే బానిసలు తమ యజమానులు ప్రభువులో తమ సోదరులే కదా అని వారిని చిన్నచూపు చూడకూడదు. తాము సేవించేది తమ ప్రేమకు పాత్రులైన విశ్వాసులనే అని ఇంకా బాగా వారికి సేవ చేయాలి. ఈ సంగతులు బోధిస్తూ వారిని హెచ్చరించు.
\s5
\p
\v 3 కొందరు అసత్య విషయాలు బోధిస్తున్నారు. ఆధార పడదగ్గ ప్రభువైన క్రీస్తు బోధలను వాళ్ళు అంగీకరించరు. దేవుణ్ణి సంతోషపరిచే రీతిలో జీవించాలనే బోధను వాళ్ళు తృణీకరిస్తారు.
\v 4 ఈ వ్యక్తులు గర్విష్టులై ప్రాముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోలేరు. వాళ్ళు బహిరంగంగా అనవసరమైన విషయాల గురించి వాదులాటలు పెట్టుకుంటారు. ఇతరులను ద్వేషిస్తారు. ఇతరులతో తగవులు పెట్టుకుంటూ, చెడ్డ మాటలు పలుకుతుంటారు. చెడ్డ తలంపులతో ఇతరులను అనుమానిస్తూ ఉంటారు.
\v 5 వాళ్ళు సత్య సందేశాన్ని తృణీకరించారు గనుక వాళ్ళ ఆలోచనా విధానం పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఫలితంగా దైవభక్తి కలిగి ఉండడం ధన సంపాదనకు మార్గమని భావిస్తుంటారు.
\s5
\p
\v 6 అయితే మనకున్న దానితో సంతృప్తి కలిగిన దైవభక్తి ఎంతో లాభకరం.
\v 7 మనం పుట్టినప్పుడు ఏమీ తీసుకు రాలేదు, అలాగే మనం చనిపోయినప్పుడు ఏమీ తీసుకు వెళ్ళడం సాధ్యం కాదు.
\v 8 కాబట్టి మనకున్న తిండి, దుస్తులతో సంతృప్తి కలిగి ఉందాం.
\s5
\p
\v 9 అయితే కొందరు ధనవంతులుగా ఉండాలనే యావ కలిగి ఉంటారు. డబ్బు సంపాదన కోసం అడ్డ దారులు తొక్కుతారు. అప్పుడు తప్పించుకోలేని తీవ్ర పరిణామాలు వారికి ఎదురౌతాయి. వాళ్ళు అజ్ఞానంతో హానికరమైన దురాశల్లో పడిపోతారు. చివరికి ఇవన్నీ వాళ్ళను నాశనంలోకి నడిపిస్తాయి.
\v 10 డబ్బు సంపాదించాలన్న దురాశతో మనుషులు నానా గడ్డీ కరుస్తారు. కొందరు డబ్బు సంపాదనలో పడిపోయి తమ విశ్వాసం నుండి తొలగిపోయి తమ నెత్తిమీద తామే నిప్పులు పోసుకుంటారు.
\s5
\p
\v 11 అయితే దేవుని సేవకుడివైన నువ్వు డబ్బుపై వ్యామోహం వదిలి మంచి పనులు చేస్తూ, దేవుణ్ణి సంతోషపరిచే వాడిగా జీవించు. దేవునిపై నమ్మకముంచి ఇతరులను ప్రేమించు. కష్ట పరిస్థితులను ఓపికతో సహించు. ఇతరులతో అన్నివేళలా మృదువుగా ప్రవర్తించు.
\v 12 కష్టాలు ఎదురైనా నువ్వు నమ్మిన దాని కోసం స్థిరంగా నిలబడు. నీకోసం దేవుడు సిద్ధపరిచిన నిత్యజీవమనే బహుమానం కోసం ప్రతిరోజూ నిరీక్షణ కలిగి ఉండు. అనేకుల ఎదుట సువార్త ప్రకటిస్తున్నప్పుడు నువ్వు క్రీస్తుకు చెందినవాడివని గుర్తుంచుకో.
\s5
\p
\v 13 దేవుడు సమస్తానికీ జీవం అనుగ్రహించాడు. ఇదే సత్యాన్ని యేసు పొంతి పిలాతు ఎదుట ధైర్యంగా ప్రకటించాడు.
\v 14 క్రీస్తు ప్రభువు మనల్ని చూస్తున్నాడు. మనం చెప్పేది వింటున్నాడు. కనుక నువ్వు ఇతరులు నీపై వేలెత్తి చూపకుండా ఉండేలా నిర్దోషంగా ప్రవర్తిస్తూ ఆయన తిరిగి వచ్చేంత వరకూ దేవునికి లోబడుతూ జీవించు.
\s5
\p
\v 15 నిర్ణీత సమయలో దేవుడు యేసును తిరిగి పంపిస్తాడు. లోకంలో రాజులు, అధికారులు ఆయన పాలనకు లోబడతారు. ఆయనే అద్భుతకరుడైన రాజు.
\v 16 ఆయన మరణం లేనివాడుగా, పరలోకంలో ఎవ్వరూ సమీపించలేని ప్రకాశవంతమైన వెలుగులో నివసిస్తున్నాడు. మనుషులంతా ఆయనను ఘనపరచి, ప్రభావవంతమైన ఆయన పాలనలో ఉండాలని నా కోరిక.
\s5
\p
\v 17 ధనవంతులైన విశ్వాసులు తమకున్న ధనాన్ని బట్టి గర్వించకూడదని బోధించు. వాళ్ళు నమ్ముకున్న సిరిసంపదలు కలకాలం వాళ్ళతో ఉండవు. అయితే సమృద్ధిగా శాశ్వత కాలం నిలిచి ఉండే ఆనందకరమైన జీవం కోసం దేవునిపై నమ్మకం ఉంచాలని బోధించు.
\v 18 ఇంకా, మంచి పనులు చెయ్యమని బోధించు. ఎక్కువగా ధనం పోగు చేసుకోవడం కంటే ఎక్కువ మంచి పనులు చెయ్యాలని కోరుకోవాలి. తమకున్న సిరిసంపదలను ఇతరులకు దానం చేసే గుణం వాళ్ళు అలవర్చుకోవాలి.
\v 19 అలా చేసినట్టైతే పరలోకంలో తమ కోసం గొప్ప ధన నిధిని సమకూర్చుకున్న వారు అవుతారు. ఇలాంటి మంచి పనులు చేసి తమకు దేవుడు అనుగ్రహించబోయే నిత్య జీవానికి సిద్ధపడతారు. అదే నిజమైన జీవితం.
\s5
\p
\v 20 తిమోతీ, ప్రభువు నీకు అనుగ్రహించిన నిజ సందేశాన్ని జాగ్రత్తగా కాపాడుకో. దేవుని దృష్టికి ఆమోదం కాని మాటలు చెప్పే వాళ్ళను దూరంగా ఉంచు. తామే జ్ఞానం గలవారమని గొప్పలు చెప్పుకుంటూ మనం బోధించిన దానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకు దూరంగా ఉండు.
\v 21 కొందరు ఇలాంటి విషయాలు బోధిస్తూ, దేవుని గురించిన తమ విశ్వాసం నుండి తొలగిపోయారు. దేవుని కృప మీ అందరికి తోడై ఉండునుగాక.

View File

@ -97,4 +97,4 @@
\s5
\v 14 ఇలాగే మనవాళ్లు తమంతట తామే అవసరతలలో వున్న ప్రజలందరికి మేలు చేసేలా చూడు. ఇలా చేస్తే వాళ్ళ జీవితాలు దేవునికి ఉపయోగకరంగా ఉంటాయి.
\s5
\v 15 తీతూ, నాతో ఉన్నవారందరూ నీకు వందనాలు చెబుతున్నారు. విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని ప్రేమిస్తున్న మన స్నేహితులందరికీ మా నమస్కారాలు. దేవుడు తనదైన గొప్ప కరుణ మన అందరి యెడలా చూపును గాక.
\v 15 తీతూ, నాతో ఉన్నవారందరూ నీకు వందనాలు చెబుతున్నారు. విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని ప్రేమిస్తున్న మన స్నేహితులందరికీ మా నమస్కారాలు. దేవుడు తనదైన గొప్ప కరుణ మన అందరి యెడలా చూపును గాక.

View File

@ -49,4 +49,4 @@
\v 23 క్రీస్తు యేసు కోసం నాతో పాటు ఖైదీగా ఉన్న ఎపఫ్రా మీకు శుభం అని చెప్తున్నాడు.
\p
\v 24 అలానే నా జత పనివారు మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా నీకు సంతోషంతో నమస్కారాలు చెబుతున్నారు.
\v 25 మన ప్రభువైన యేసు క్రీస్తు ఎంత దయామయుడో తెలుసుకుని మీరందరూ నిత్యమూ ఆనందించాలని ప్రార్థిస్తాను. ఆమెన్.
\v 25 మన ప్రభువైన యేసు క్రీస్తు ఎంత దయామయుడో తెలుసుకుని మీరందరూ నిత్యమూ ఆనందించాలని ప్రార్థిస్తాను. ఆమెన్.

681
59-HEB.usfm Normal file
View File

@ -0,0 +1,681 @@
\id HEB - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h హెబ్రీయులకు రాసిన పత్రిక
\toc1 హెబ్రీయులకు రాసిన పత్రిక
\toc2 హెబ్రీయులకు రాసిన పత్రిక
\toc3 heb
\mt1 హెబ్రీయులకు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 పూర్వకాలంలో దేవుడు అనేక సమయాల్లో, అనేక విధాలుగా మన పూర్వికులతో మాట్లాడాడు. ఏమి చేయాలో, ఏమి మాట్లాడాలో, ఏమి రాయాలో తన ప్రవక్తలకు చెప్పాడు.
\v 2 అయితే ఈ చివరి రోజుల్లో దేవుడు తన సొంత కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆ కుమారుణ్ణి అంతటికీ వారసుడిగా నియమించాడు. కుమారుని ద్వారా ఈ లోకాన్ని సృష్టించాడు.
\v 3 కుమారుణ్ణి చూడడం ద్వారా దేవుడు ఎంత అద్భుతమైనవాడో తెలుసుకోవచ్చు. దేవుడు నిజంగా ఎలాటి వాడో కుమారుడు చూపిస్తున్నాడు. ఆయన తన బల ప్రభావాల ద్వారా సమస్తాన్నీ నిర్వహిస్తున్నాడు. ప్రజల పాపాల కోసం ఆయన తనను తాను అర్పించుకున్న తరువాత, సజీవుడై తిరిగి లేచి దేవుడు రాజుగా ఏలుతున్న మహోన్నతమైన పరలోకంలో దేవుని పక్కన కూర్చున్నాడు.
\s5
\p
\v 4 ఆయన జరిగించి చూపిన గొప్ప కార్యం వల్ల దేవదూతల కంటే ఘనమైన స్థానం వారసత్వంగా పొంది "దేవుని కుమారుడు" అనే పేరు పొందాడు.
\v 5 "నువ్వు నా కుమారుడివి!
\q ఈ రోజు నేను నీ తండ్రినని ప్రకటిస్తున్నాను!"
\p అని దేవుడు ఏ దేవదూత గురించి అయినా చెప్పినట్టు లేఖనాల్లో ఎవ్వరూ రాయలేదు.
\s5
\p
\v 6 అంతేగాక, ఆయన తన ఏకైక కుమారుణ్ణి లోకంలోకి తీసుకువచ్చినప్పుడు,
\q "దేవదూతలందరూ కుమారుణ్ణి తప్పక ఆరాధించాలి" అంటూ ఆజ్ఞాపించడం ద్వారా కుమారుణ్ణి గౌరవించాడు.
\p
\v 7 లేఖనాల్లో ఆయన తన దూతల గురించి చెబుతూ,
\q "దేవుడు దూతలను వాయువులుగా,
\q తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకునేవాడు" అని పలికాడు.
\s5
\p
\v 8 అయితే దేవుడు తన కుమారుణ్ణి గురించి ఇంకా ఇలా అన్నాడు,
\q "నువ్వు కలకాలం పరిపాలించే రాజువు.
\q నీ పరిపాలన నీతి న్యాయాలతో నిండి ఉండేది."
\q
\v 9 నువ్వు ప్రజల నీతి కార్యాలను ప్రేమించి, వారి పాప క్రియలను అసహ్యించుకుంటావు.
\q కాబట్టి దేవా, నీవు ఆరాధించే నీ దేవుడు నీతో ఉన్నవారందరికంటే నీకు ఎక్కువ ఆనందం కలిగిస్తాడు.
\s5
\p
\v 10 కుమారుడు దూతల కంటే ఉన్నతుడు అని కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఒకరు రాసినట్టు,
\q "ప్రభూ, ఆరంభంలో నువ్వు భూమిని సృష్టించావు.
\q ఆకాశంలో ఉండే నక్షత్రాలతో సహా విశ్వమంతటినీ నువ్వే నిర్మించావు.
\q
\v 11 ఇవేవీ శాశ్వతంగా నిలిచి ఉండేవి కావు, అయితే నువ్వు కలకాలం జీవించి ఉంటావు.
\q బట్టలు ఎలా మాసిపోతాయో అవి కూడా అలా మాసిపోతాయి.
\q
\v 12 పాత బట్టలను మార్చివేసినట్టు నువ్వు వాటిని చుట్టి పడేస్తావు.
\q ఒకడు కొత్త బట్టలు ధరించినట్టు,
\q నువ్వు విశ్వంలోని సమస్తాన్నీ నూతనంగా మారుస్తావు.
\q కానీ నువ్వు శాశ్వత కాలం ఒకేలా ఉంటావు!"
\s5
\p
\v 13 దేవుడు తన కుమారునితో చెప్పినట్టు ఎన్నడూ ఏ దూతతోనూ ఇలా చెప్పలేదు,
\q "నీ శత్రువులందరినీ ఓడించి నీ దాసులుగా చేస్తాను,
\q అతి ప్రాముఖ్యమైన నా తరువాతి స్థానంలో కూర్చుని నాతో కలిసి పరిపాలించు."
\p
\v 14 ఈ దూతలు కేవలం దేవుడు అనుగ్రహించిన రక్షణ పొంది శాశ్వత జీవం పొందబోయే విశ్వాసులకు పరిచర్య చేయడానికి దేవుడు వాగ్దానం ప్రకారం నియమించబడిన ఆత్మలు మాత్రమే.
\s5
\c 2
\p
\v 1 కాబట్టి దేవుని కుమారుణ్ణి గురించి మనం విన్న సంగతులపై మన నమ్మకం సన్నగిల్లిపోకుండా ఉండేందుకు ఆ విషయాలపై ఎక్కువ శ్రద్ధ నిలిపి ఉంచాలి.
\s5
\v 2 దేవదూతలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన దేవుని చట్టాలు నమ్మదగినవి. వాటికి అవిధేయులైన ఇశ్రాయేలు ప్రజలు దేవుని శిక్షకు గురయ్యారు.
\v 3 మనం దేవుని నుండి తప్పించుకోలేం. ఆయన ఇచ్చిన ప్రాముఖ్యమైన రక్షణ సందేశాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం తప్పక శిక్షకు గురౌతాం. ఆ సందేశాన్ని మొదట ప్రభువైన యేసే ప్రకటించాడు. అది విన్న ఆయన శిష్యులు దానిని రుజువు పరిచారు.
\v 4 విశ్వాసులు అద్భుతాలు, సూచక క్రియలు జరిగించడానికి తన శక్తి వారికి అనుగ్రహించడం ద్వారా దీన్ని ఖాయం చేశాడు. ఆయన కోరినట్టు పరిశుద్ధాత్మ కూడా కృపా వరాలు పంచి ఇచ్చాడు.
\s5
\p
\v 5 మనం మాట్లాడుతున్న ఈ రాబోతున్న లోకాన్ని దేవుడు దూతల ఆధీనంలో ఉంచలేదు.
\v 6 దీన్ని గూర్చి ఒక వ్యక్తి లేఖనాల్లో ఒకచోట ఇలా చెప్పాడు,
\q "నువ్వు మనిషి గురించి తలంచుకోవడానికి వాడు ఎంతటివాడు!
\q ఒక మనిషిని పట్టించుకోవడానికి అసలు వాడేపాటివాడు!
\s5
\q
\v 7 నువ్వు మనుషుల్ని దేవదూతలకంటే కొంచెం తక్కువగా చేశావు,
\q ప్రజలు తమ రాజుని గౌరవించినట్టు నువ్వు వాళ్ళని సన్మానించావు.
\q
\v 8 ప్రతిదానినీ వాళ్ళ ఆధీనంలో ఉంచావు."
\q మానవజాతి సమస్తాన్నీ పరిపాలిస్తుంది. అంటే మనిషి ఆధీనంలో లేకుండా ఏదీ లేదు. అయితే ఇప్పుడు సమస్తమూ మానవజాతి వశం కావడం మనం చూడడం లేదు.
\s5
\p
\v 9 అయితే దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మనకు తెలుసు. ఆయన హింసలు పొంది చనిపోయినందున దేవుడు ఆయనను అందరికంటే గొప్పవానిగా చేశాడు. యేసు అందరి కోసం చనిపోయాడు గనుక దేవుడు ఆయనను రాజుగా నియమించాడు. దేవుని కనికరం చొప్పున ఇదంతా జరిగింది.
\p
\v 10 సమస్తమూ ఆయన ద్వారా ఉనికిలో ఉన్నాయి, సమస్తమూ ఆయన వలన కలుగుతున్నాయి. అనేకమంది కుమారుల్ని మహిమలోకి తీసుకు రావడం కోసం వారి రక్షణ కర్తను ఆయన పొందే బాధల ద్వారా సంపూర్ణుణ్ణి చేయడం దేవుని సంకల్పం.
\s5
\v 11 సమస్తానికీ మూలమైన దేవుని వద్దకు ప్రజలను చేర్చడానికి, దేవుని ఎదుట పవిత్రులుగా ప్రకటించడానికి యేసు పని చేస్తున్నాడు. అలాంటి వారిని తన సొంత అన్నదమ్ములని, అక్కచెల్లెళ్ళని పిలవడానికి ఆయన ఏమాత్రం సంకోచించడు.
\v 12 క్రీస్తు దేవునితో పలికిన మాటలు కీర్తనకారుడు రాశాడు,
\q "నీ గొప్పదనాన్ని నేను నా సోదరులకు ప్రకటిస్తాను.
\q విశ్వాసుల సమాజం మధ్యలో నిన్ను స్తుతిస్తూ పాటలు పాడతాను."
\s5
\p
\v 13 మరో లేఖన భాగంలో వేరొక ప్రవక్త క్రీస్తు దేవుని గూర్చి పలికిన మాటలు రాసాడు,
\q "నేను ఆయనలో నమ్మకముంచుతాను."
\p వేరొక లేఖన భాగంలో,
\q "ఇదిగో, నేను, దేవుడు నాకిచ్చిన పిల్లలు" అని క్రీస్తు దేవునితో చెప్పినట్టు ఉన్నది.
\p
\v 14 కనుక దేవుడు తన కుమారులు అని పిలిచిన మనుషుల్లాగా యేసు కూడా మనిషిగా వచ్చాడు. మనుషులను మరణ భయానికి గురిచేసే శక్తి సాతానుకి ఉంది. యేసు తాను చనిపోయి, తిరిగి లేవడం ద్వారా మరణ బలం ఉన్న సాతానుని శక్తిహీనుడుగా చేశాడు.
\v 15 మరణ భయం నుండి మనలను విడిపించడానికి యేసు ఇలా చేశాడు.
\s5
\v 16 ఆయన దేవదూతలకు సహాయం చేయడానికి రాలేదు. తనపై విశ్వాసముంచిన అబ్రాహాముకు సహాయం చేసినట్టు మన కోసం వచ్చాడు.
\v 17 తన మానవ సోదరుల్లో ఒకడుగా, కచ్చితంగా మనలాంటి వాడిగానే దేవుడు యేసును చేశాడు. కరుణ గల ప్రధాన యాజకుడిగా ఉండడానికీ, ప్రజల పాపాలకు క్షమాపణ సాధించడానికీ ఆయన తన సోదరుల్లో ఒకడిగా మారాడు.
\v 18 యేసు శోధనలకు గురి అయి హింసలు సహించాడు గనుక శోధనలు ఎదుర్కొనేవారికి సహాయం చేయగల సామర్ధ్యం ఆయనకే ఉంది.
\s5
\c 3
\p
\v 1 నా తోటి విశ్వాసులారా, దేవుడు మిమ్మల్ని ఎన్నుకుని తన కోసం ఏర్పరచుకున్నాడు. యేసు విషయం గమనించండి. దేవుని అపోస్తలుడైన యేసు విశ్వాసులైన మనకందరికీ ప్రధాన యాజకుడుగా దేవుని సముఖంలో ఉన్నాడు.
\v 2 మోషే నమ్మకంగా దేవుని కుటుంబం అయిన ప్రజలకు సేవ చేసినట్టే ఈయన కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నాడు.
\v 3 ఇప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఇల్లు కట్టినట్టు దేవుడు సమస్తాన్నీ నిర్మించాడు. మోషే కంటే ఎక్కువ కీర్తి ప్రతిష్టలకు ఈయన యోగ్యుడిగా ఎంచబడ్డాడు.
\v 4 ఎందుకంటే నిర్మాణం అయిన ఇంటి కంటే దానిని నిర్మించిన వాడికే ఎక్కువ గౌరవం దక్కుతుంది.
\s5
\v 5 ఒక సేవకుడు తన యజమానికి నమ్మకంగా సేవ చేసినట్టు, మోషే దేవునికి నమ్మకంగా సేవ చేసి దేవుని ప్రజలకు సహాయం చేశాడు. దేవుడు భవిష్యత్తులో చెప్పే వాటికి సాక్షమివ్వడానికి మోషే ఒక సేవకుడిగా దేవుని ఇంట్లో నమ్మకమైనవాడుగా ఉన్నాడు.
\v 6 అయితే దేవుని కుమారుడిగా క్రీస్తు దేవుని ప్రజలను పరిపాలిస్తున్నాడు. దేవుడు మనకు వాగ్దానం చేసిన వాటిని పొందడానికి ఎదురుచూస్తూ క్రీస్తులో నమ్మకముంచి మనం ధైర్యంగా కొనసాగవచ్చు.
\s5
\p
\v 7 కాబట్టి పరిశుద్దాత్మ కీర్తనకారుణ్ణి ప్రేరేపించి ఇశ్రాయేలు ప్రజల గురించి లేఖనాల్లో ఇలా రాయించాడు:
\q "ఇప్పుడు దేవుడు చెబుతున్నది మీరు విన్నట్టయితే,
\v 8 అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు తిరుగుబాటు చేసిన మీ పితరుల్లాగా మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు."
\s5
\p
\v 9 అక్కడ మీ పితరులు మళ్ళీ మళ్ళీ నన్ను శోధించినప్పటికీ నేను వారిపట్ల సహనం వహించి, వారికి అనేక గొప్ప కార్యాలు చేశాను.
\p
\v 10 ఆ 40 సంవత్సరాల ప్రయాణ సమయంలో వారిపై నేను కోపం తెచ్చుకుని, "ఈ ప్రజలు నాపై ఎప్పుడూ విశ్వాసం చూపించలేదు. నేను వాళ్ళ జీవితాలను ఎలా నడిపించాలని కోరుకుంటున్నానో వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు."
\p
\v 11 అందువల్ల నేను వాళ్ళపై కోపంతో "వాళ్ళు విశ్రాంతిగా నివసించటానికి నేను వాళ్ళకు ఇస్తానని చెప్పిన కనాను ప్రదేశానికి వాళ్ళని చేరనివ్వను" అని ప్రకటించాను.
\s5
\p
\v 12 కాబట్టి సహోదరులారా, దేవునికి అవిధేయులయ్యేలా చేసే చెడ్డ తలంపులు మీ జీవితాలలో చొరబడకుండా ఉండేలా జాగ్రత్త వహించండి.
\v 13 ప్రతిరోజూ సమయం ఉండగానే మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. అలా చెయ్యకపోతే మీలో కొందరు కఠిన మనస్కులై ఇతరులను పాపంలోకి నడిపించవచ్చు.
\s5
\p
\v 14 ఆరంభం నుండి మన అంతం వరకూ మనం క్రీస్తుపై మనకున్న స్థిర విశ్వాసంపై ఆధారపడి ఉండటం వల్ల మనం ఇప్పుడు క్రీస్తులో భాగస్వాములం అయ్యాం.
\v 15 లేఖనాల్లో దేవుడు కీర్తనకారుడి ద్వారా ఇలా చెబుతున్నాడు
\q "ఇప్పుడు మీరు నిర్ల్యక్షం చేయకుండా జాగ్రత్తగా నేను చెప్పే మాటలు వినండి. మీ పితరులు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు."
\s5
\p
\v 16 గుర్తుచేసుకోండి, దేవుడు తమతో పలికిన మాటలు విని కూడా ఆయనపై తిరుగుబాటు చేసిందెవరు? మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి బయటకు నడిచిన దేవుని ప్రజలే కదా.
\v 17 నలభై ఏళ్ళు దేవుడు ఎవరి మీద కోపగించుకున్నాడు? పాపం చేసిన దేవుని ప్రజల మీదనే కదా. వాళ్ళ శవాలను ఎడారిలోనే పాతిపెట్టారు.
\v 18 "నేను వాళ్ళను చేరుస్తానని చెప్పిన కనానులోనికి ఎన్నటికీ చేరుకోలేరు" అని దేవుడు ఎవరిని గూర్చి చెప్పాడు? తనకు అవిధేయులైన ఇశ్రాయేలు ప్రజల గురించే అని గుర్తు చేసుకోండి.
\v 19 దీన్ని బట్టి అవిశ్వాసం మూలంగానే వాళ్ళు ఆయన ఇస్తానని చెప్పిన వాగ్దాన భూమికి ప్రవేశించలేకపోయారని మనకు తెలుస్తుంది.
\s5
\c 4
\p
\v 1 దేవుడు మనకిచ్చిన నిత్య జీవంలో ప్రవేశం అనే వాగ్దానం ఇంకా కొనసాగుతూనే ఉంది. మీలో ఎవరైనా ఆ వాగ్దానం పొందకుండా వెనకబడి పోతారేమోనని జాగ్రత్త పడండి.
\v 2 ఇశ్రాయేలు ప్రజలు విన్న విధంగానే మనం కూడా దేవుణ్ణి గూర్చిన మాటలు, ఆయన చేసిన వాగ్దానం విన్నాం. అయితే ఈ సందేశం విన్నవాళ్ళు దేవునిపై విశ్వాసం ఉంచకుండా, లోబడకుండా ఉండడం వల్ల అది వాళ్లకు ఎలాంటి ప్రయోజనం కలిగించలేకపోయింది.
\s5
\p
\v 3 అవును, మనలో విశ్వసించే ప్రతివాడూ నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాం. విశ్వసించని వాళ్లకు ప్రవేశం దక్కదు. ఎందుకంటే, "నేను ఇశ్రాయేలు ప్రజలపై కోపంగా ఉన్నాను. ఆ ప్రజలు నేను అనుగ్రహించే విశ్రాంతిలో ప్రవేశించరు" అని ఆయన దీన్ని గూర్చి చెప్పాడు. సృష్టి కార్యం ముగించిన తరువాత ఆయన ప్రణాళికలోని ఈ విశ్రాంతి స్థలం సిద్ధపరచానని దేవుడు చెప్పాడు.
\p
\v 4 ఆయన ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడని లేఖనాలు చెబుతున్నది నిజమే.
\q "దేవుడు తన పనులన్నీ ముగించి, ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు."
\p
\v 5 అయితే నేను ఇంతకుముందు ప్రస్తావించిన విషయం మరొకసారి గమనించండి. ఆయన ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ.
\q "ఆ ప్రజలు నేను అనుగ్రహించే విశ్రాంతిలో ప్రవేశించరు" అని చెప్పాడు.
\s5
\p
\v 6 కాబట్టి దేవుని విశ్రాంతి కొందరు ప్రవేశించడానికి ఏర్పడిందన్నది స్పష్టం. అయితే దేవుని వాగ్దానం విన్న ఇశ్రాయేలు ప్రజలు దేవునిపై విశ్వాసం ఉంచడానికి నిరాకరించిన కారణంగా దానిలో ప్రవేశించలేక పోయారు.
\v 7 అయితే దేవుడు విశ్రాంతి స్థలంలోనికి ప్రవేశానికి మరొక సమయం సిద్ధం చేశాడు. ఆ సమయం నేడే! ఇది నిజమని మనకు తెలుసు. ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో దేవునిపై తిరుగుబాటు చేసిన తరువాత, నేను ముందుగా ప్రస్తావించిన విధంగా ఆయన రాజైన దావీదు ద్వారా ఇలా రాయించాడు,
\q "నేడే మీ హృదయాలను కఠినపరచుకోకుండా ఆయన మాటకు లోబడండి."
\s5
\p
\v 8 ఒకవేళ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు విశ్రాంతి ఇవ్వగలిగితే దేవుడు మరొక విశ్రాంతి దినం గురించి చెప్పేవాడు కాదు. ఆయన వేరొక విశ్రాంతి గురించి వాగ్దానం చేశాడు.
\v 9 దేవుడు సృష్టి కార్యంలో తన పనులన్నీ చేసి ముగించి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నట్టే ఆయన ప్రజలకు విశ్రాంతిలో ప్రవేశించే సమయం వస్తుంది.
\v 10 ఎందుకంటే దేవుడు సమస్తాన్నీ సృష్టించి తన పనులన్నీ చేసి ముగించి విశ్రాంతి తీసుకున్నట్లే ఆయన విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన పనులన్నీ ముగించి విశ్రాంతిలో ప్రవేశిస్తాడు.
\p
\v 11 కాబట్టి, మనలో ఎవ్వరమూ ఇతరుల వలే అవిశ్వాసంలో పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆత్రుత పడదాం.
\s5
\p
\v 12 ఎందుకంటే దేవుని మాట సజీవమైనది, శక్తిగలది, రెండు అంచులు ఉన్న ఎలాంటి కత్తి కంటే కూడా పదునుగా ఉండేది. అది ప్రాణం నుండి ఆత్మనూ, కీళ్ళ నుండి మూలుగనూ విభజించగలిగేంత శక్తి గలదిగా ఉంటుంది. అది మన హృదయాల్లో దాగి ఉన్న మంచి, చెడు తలంపులను నిర్ణయించి, మన ఆలోచనలపైనా ఉద్దేశాలపైనా తీర్పు చెప్పగలదు.
\v 13 ప్రతి ఒక్కరి గురించీ, ప్రతి విషయమూ దేవునికి తెలుసు. ఆయనకు కనిపించకుండా ఉండేది ఏదీ లేదు. ఆయన మనం చేసే పనులన్నీ చూస్తాడు. ఆయనకు సమస్తమూ బట్టబయలే. మనమంతా తప్పక దేవుని ఎదుట నిలబడి మన జీవితం ఎలా గడిపామో ఆయనకు లెక్క అప్పజెప్పాలి.
\s5
\p
\v 14 ఆకాశాలగుండా ఎక్కి వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆయనే దేవుని కుమారుడైన యేసు. కాబట్టి మన నమ్మకం క్రీస్తు యేసు పైనే అని బాహాటంగా, ధైర్యంగా ప్రకటిద్దాం.
\p
\v 15 మన బలహీనతల పట్ల మన ప్రధాన యాజకుడికి సానుభూతి ఉంది. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. సాతాను ఆయనను పాపం చేసేలా శోధించాడు. అయితే ఆయన పాపం లేనివాడుగా ఉన్నాడు.
\v 16 కాబట్టి పరలోకం నుండి మనలను పరిపాలిస్తూ, అయోగ్యులమైన మనకు తన కృప కనికరాలను అనుగ్రహిస్తున్న క్రీస్తు దగ్గరికి ధైర్యంగా వెళ్దాం.
\s5
\c 5
\p
\v 1 ప్రతి ప్రధాన యాజకుని విషయంలోనూ దేవుడు ప్రజలలో నుండే ఒక వ్యక్తిని ఎంపిక చేస్తాడు. ఈ వ్యక్తి ప్రజల పక్షంగా దేవునికి సేవ చేస్తాడు. ప్రజల పాపాల నిమిత్తం అర్పణలు, జంతు బలులు అతడే అర్పిస్తాడు.
\v 2 ప్రధాన యాజకుడు దేవుణ్ణి గురించి పూర్తి అవగాహన లేనివారి పట్ల, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినవారి పట్ల దయ కలిగి ఉంటాడు. ఎందుకంటే, అతడు కూడా పాపం విషయంలో బలహీనుడే.
\v 3 ఫలితంగా అతడు కూడా ఇతర ప్రజల వలే తన పాపాల నిమిత్తం జంతు బలులు అర్పించాలి.
\s5
\p
\v 4 అయితే ఏ ఒక్కరూ కూడా తాను ప్రధాన యాజకుడు అయినందుకు అతిశయించకూడదు. దేవుడు ఆహారోనును ప్రధాన యాజకునిగా చేసుకున్నట్లే, మీలో ప్రతి ఒక్కరినీ యాజకునిగా ఎంపిక చేసుకుంటున్నాడు.
\v 5 ఆ విధంగానే, క్రీస్తు తాను ప్రధాన యాజకుడు అయినందుకు తనను తాను గొప్పచేసుకోలేదు. దేవుడే ఆయనను నియమించాడు. ఈ విషయం గురించి కీర్తనకారుడు లేఖనంలో ఇలా రాశాడు:
\q "నువ్వు నా కుమారుడివి.
\q నేను నీ తండ్రినని ప్రకటిస్తున్నాను."
\s5
\p
\v 6 అలాగే మరో లేఖన భాగంలో కీర్తనకారుడు,
\q "నువ్వు మెల్కీసెదెకు వరసలో కలకాలం ఉండే యాజకుడివి" అన్నాడు.
\s5
\p
\v 7 క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుణ్ణి ప్రార్ధిస్తూ, కన్నీళ్ళతో ఎలుగెత్తి దేవునికి మొరపెట్టాడు. తనను రక్షించగల దేవుణ్ణి వేడుకున్నాడు. క్రీస్తు తనకు విధేయుడై తనను ప్రార్ధించినందున దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు.
\v 8 ఆయన దేవుని కుమారుడై ఉండి తాను పొందిన బాధల ద్వారా దేవునికి ఎలా విధేయత చూపించాలో నేర్చుకున్నాడు.
\s5
\p
\v 9 దేవుడు కోరినట్టు ఆయన అన్ని విషయాల్లో పరిపూర్ణత సాధించి, నేడు తనకు విధేయులయ్యే వాళ్ళందరి నిత్య రక్షణకు కారకుడయ్యాడు.
\v 10 ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు క్రమంలో దేవుడు ఆయనను మన ప్రధాన యాజకుడిగా నియమించాడు.
\p
\v 11 క్రీస్తు మెల్కీసెదెకును ఎలా పోలి ఉన్నాడో మరింత వివరంగా మీకు చెప్పాలని ఉంది. దీన్ని వివరించడం నాకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని విని, అర్థం చేసుకోవడానికి మీరు ఇబ్బంది పడతారు.
\s5
\p
\v 12 మీరు ఇంతకుముందే బోధకులుగా మారి దేవుని సత్యాలు ఇతరులకు బోధించవలసిన స్థితిలో ఉండవలసింది. అయితే ఇంకా మరొకరు దేవుని మాటల్లోని ఓనమాలు మీకు నేర్పించవలసి వస్తున్నది. చంటి పిల్లలవలె పాలు తాగే స్థితిలోనే మీరు ఉన్నారు. బలమైన ఆహారం వంటి కష్టతరమైన సంగతులు నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు.
\v 13 గుర్తుంచుకోండి, కేవలం ప్రాథమిక సత్యాలు నేర్చుకునే ప్రతివాడూ పాలు మాత్రమే తాగే చంటి పిల్లవాడే. కాబట్టి అతడు నీతికి సంబంధించిన విషయాల్లో అనుభవం లేనివాడుగా ఉన్నాడు.
\v 14 ఎదిగిన వాళ్ళు పుష్టికరమైన ఆహారం తీసుకుంటున్నట్టు దేవుణ్ణి గూర్చిన కష్టతరమైన ఆత్మీయ సత్యాలు గ్రహించగలరు. వయస్సు వచ్చిన పెద్దవారు తమ సాధన చేత మంచి ఏదో, చెడు ఏదో వివేచించగలిగి, మంచీ చెడూ తేడా తెలుసుకోవడంలో శిక్షణ పొంది ఉంటారు.
\s5
\c 6
\p
\v 1 కాబట్టి క్రీస్తు గురించి విశ్వాసులు మొదట్లో తెలుసుకున్న విషయాలను గూర్చి చర్చించుకుంటూ కాలం గడపడం మానివేద్దాం. చావుకు దారి తీసే పాప కార్యాలు చేయకుండా ఉండడం, దేవుణ్ణి నమ్మడం ఎలా అనే విషయాలు వాటిలో కొన్ని.
\v 2 ఇవికాక అనేకమైన విషయాలు మేము బోధించాం: వివిధ రకాల బాప్తీసాలు, మనం తరచుగా ఒకరి తలపై ఒకరు చేతులుంచి ప్రార్ధిస్తున్న విధానం; దేవుడు చనిపోయిన మనలను తిరిగి లేపి ప్రతి ఒక్కరికీ తీర్పు తీరుస్తాడనే విషయాలు, మొదలైనవి.
\v 3 ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఈ విషయాలు తరువాత మళ్ళీ చర్చించుకుందాం. అయితే ఇప్పుడు అర్థం చేసుకోవడానికి కష్టతరమైన విషయాలు మనంమాట్లాడుకోవాలి. ఏమి జరిగినా అన్ని సమయాల్లో క్రీస్తుపై మన నమ్మకం కోల్పోకుండా ఉండడానికి ఇవి మనకు సహాయం చేస్తాయి.
\s5
\p
\v 4 కొందరు తమ జీవితాల్లో తమ పాపాల నుండి మళ్ళుకుని, దేవుని వెలుగును పొంది, దేవుని నుంచి మంచి అనుభవాలు పొంది, పరిశుద్ధాత్మలో భాగం పొందిన తరువాత ఒకవేళ మార్గం విడిచి తప్పిపోతే వారిని తిరిగి పశ్చాత్తాప పడేలా చేయడం అసాధ్యం.
\v 5 వాళ్ళు దేవుని వాక్కు ఫలాలను, రాబోయే కాలపు ఆత్మీయ శక్తులను అనుభవించినవాళ్ళు.
\v 6 అయితే ఇప్పుడు వాళ్ళు క్రీస్తును తృణీకరిస్తున్నారు. ఇలాంటి వాళ్ళను తమ పాపాల నుంచి మళ్ళించి, దేవుణ్ణి నమ్ముకునేలా చేయడం ఎవరివల్లా కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని కుమారుణ్ణి మళ్ళీసిలువకు మేకులతో కొడుతున్నారు. ఇతరులు క్రీస్తును ద్వేషించడానికి కారణమౌతున్నారు.
\s5
\p
\v 7 ఈ సంగతి ఆలోచించండి. నేల తరచుగా కురిసే వాన నీటిలో తడిసి తనను దున్నిన రైతులకు ప్రయోజనకరమైన పంటలు ఇస్తూ దేవుని దీవెనలు పొందుతుంది.
\v 8 అయితే ముళ్ళూ, ముళ్ళ పొదలూ ఆ నేలపై మొలిస్తే అది పనికిరానిదై నిస్సారమౌతుంది. అది శాపానికి గురై ఆ మొక్కలన్నీ అగ్నికి ఆహుతి కావలసి వస్తుంది. దేవునికి అవిధేయులైన ప్రజలకు కూడా ఇదే గతి పడుతుంది.
\s5
\p
\v 9 ప్రియమైన స్నేహితులారా, క్రీస్తుని తిరస్కరించవద్దని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అయితే మీరు మాత్రం అంతకంటే మంచి స్థితిలోనే ఉన్నారనీ, రక్షణకు సంబంధించిన విషయాల్లో మెరుగుగానే ఉన్నారనీ గట్టిగా నమ్ముతున్నాను.
\v 10 దేవుడు అన్నివేళలా న్యాయవంతుడు. ఆయన కోసం మీరు చేసిన దానినంతటినీ ఆయన మరచిపోడు. మీరు మీ తోటి విశ్వాసులను ప్రేమించి వాళ్లకు మీరు చేసిన, చేస్తున్న ఉపకారాలకు ఆయన తప్పక ప్రతిఫలం అనుగ్రహిస్తాడు.
\s5
\v 11 మీలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు చూపిస్తున్న ప్రేమానురాగాలను మీ జీవితాంతం కొనసాగించడానికి కృషి చేసి దేవుడు నీకు వాగ్దానం చేసిన ప్రతిఫలం పొందాలన్నది నా ప్రగాఢ వాంఛ.
\v 12 మీరు సోమరిపోతులుగా ఉండడం నాకు ఇష్టం లేదు. దేవుణ్ణి నమ్మి ఆయన వాగ్దానాల కోసం సహనంతో కనిపెట్టి వాటిని సంపాదించుకున్న ఇతర విశ్వాసులను అనుకరించాలన్నది నా అభిలాష.
\s5
\p
\v 13 అబ్రాహాము విషయంలో గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు ప్రమాణం చేసినప్పుడు తనకంటే గొప్పవాడు ఎవరూ లేరు గనక దేవుడు తన మీద తానే ఒట్టు పెట్టున్నాడు.
\v 14 "నేను నిన్ను తప్పక దీవించి నీ వంశాన్ని అభివృద్ది చేస్తాను" అని ఆయన అబ్రాహాముకు వాగ్దానం చేశాడు.
\v 15 అబ్రాహాము దేవుని వాగ్దాన నేరవేర్పు కోసం ఓపికగా కనిపెట్టాడు. దేవుడు తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు.
\s5
\v 16 కొన్నిసార్లు మనుషులు తమకంటే గొప్పవారి మీద ఒట్టు పెట్టుకుంటారు. తాము చేసిన ప్రమాణం నెరవేర్చకపోతే ఆ పెద్ద వారు తమను శిక్షించ వచ్చని చెబుతారు. ఈ విధంగా వివాదాలు పరిష్కారం అవుతాయి.
\v 17 దేవుడు తాను చేసిన వాగ్దానం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు తనపై తానే ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు.
\p
\v 18 మనకు ప్రోత్సాహంగా ఉండడానికి ఆయన అలా చేశాడు. మార్పు లేని రెండు విషయాలు ఆయన చేశాడు. మనకు సహాయం చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. దేవుడు అబద్ధం ఆడడు. ఎన్నడూ దోషిగా నిలబడడు. అందువల్ల మనం నమ్మకంగా ఆయన ఇచ్చిన వాగ్దానాల నెరవేర్పు కోసం ఆయన చెంతకు చేరవచ్చు.
\s5
\p
\v 19 అవును, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు పొందడానికి మనం నమ్మకంగా ఎదురుచూడవచ్చు. ఇది ఓడను స్థిరంగా నిలిపి ఉంచే లంగరు వంటిది. దేవాలయంలో లోపలి తెరలో ప్రవేశించి దేవుని సన్నిధిలో నిలిచే ప్రధాన యాజకుణ్ణి పోలిన యేసుపై స్థిరంగా మన ఆశాభావం నిలిపి ఉంచవచ్చు.
\v 20 మనం కూడా దేవుని సన్నిధానం లో ప్రవేశించడానికి మనకు మార్గం సిద్ధం చేయడానికి ఆయన ముందుగా అక్కడికి చేరాడు. ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు వలే యేసు మన తరపున కలకాలం ఉండే ప్రధాన యాజకుడు అయ్యాడు.
\s5
\c 7
\p
\v 1 ఇప్పుడు నేను మెల్కీసెదెకు గురించి వివరంగా చెబుతాను. సర్వలోకాన్నీ పరిపాలించే దేవుని యాజకుడైన అతడు షాలేము పట్టణానికి రాజు. నలుగురు రాజులను ఓడించి తిరిగి వస్తున్న అబ్రాహామును, అతని మనుషులను మెల్కీసెదెకు కలుసుకుని అబ్రాహామును ఆశీర్వదించాడు.
\v 2 అప్పుడు అబ్రాహాము యుద్ధంలో తాను కొల్లగొట్టిన సొత్తు నుండి పదవ భాగం మెల్కీసెదెకుకు సమర్పించాడు. మొదటగా, మెల్కీసెదెకు అనే పేరుకు "నీతికి రాజు" అని అర్థం. షాలేము అంటే "శాంతి" అని అర్థం. అతని పేరుకు "శాంతియుతంగా పాలించే రాజు" అని అర్థం.
\v 3 అతని పూర్వీకులు, తల్లిదండ్రులు ఎవరో, అతడు ఎప్పుడు పుట్టాడో, ఎప్పుడు చనిపోయాడో ఎలాంటి ఆధారాలూ లేవు. దేవుని కుమారునిగా ఇతడు కలకాలం యాజకుడుగా కొనసాగాడు.
\s5
\p
\v 4 మెల్కీసెదెకు ఎంత గొప్పవాడో గమనించండి. మన పూర్వికుడైన అబ్రాహాము యుద్ధంలో తాను కొల్లగొట్టిన శ్రేష్ఠమైన సొమ్ములో పదవ భాగం ఇతనికి ఇచ్చాడు.
\v 5 , ఇతర గోత్రాల ప్రజలు అబ్రాహాము సంతతి వారైనప్పటికీ, వారి దగ్గర లేవీ వంశం యాజకులు పదవ వంతును కానుకగా స్వీకరించాలని దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది.
\v 6 కానీ లేవీ వంశంతో ఎలాంటి సంబంధమూ లేని మెల్కీసెదెకు అబ్రాహాము దగ్గర పదో వంతు కానుకలు స్వీకరించి అబ్రాహామును ఆశీర్వదించాడు.
\s5
\v 7 మెల్కీసెదెకు వంటి ప్రముఖుడైన వ్యక్తి తనకంటే తక్కువవాడైన అబ్రాహామును ఆశీర్వదించినట్టు ఇక్కడ చూస్తాం. కనుక అబ్రాహాము కంటే మెల్కీసెదెకు గొప్పవాడని మనకు తెలుస్తున్నది.
\p
\v 8 లేవీ క్రమంలో యాజకుడుగా ఉండి కానుకలు స్వీకరించేవాడు ఏదో ఒకరోజు చనిపోతాడు. అయితే అబ్రాహాము కానుకను స్వీకరించిన వాడు శాశ్వతంగా జీవిస్తూ ఉన్నట్టుగా ఉంది. అతని మరణం గురించి లేఖనంలో ఎక్కడా రాసి లేదు.
\v 9 తమ పూర్వికుడైన అబ్రాహాము మెల్కీసెదెకును తనకంటే గొప్పవాడుగా గౌరవించి పదవ భాగం కానుకగా చెల్లించిన విధంగా లేవి, అతని వారసులకు ప్రజలు పదవ వంతు చెల్లిస్తూ వచ్చారు.
\v 10 ఎందుకంటే మెల్కీసెదెకును అబ్రాహామును కలుసుకున్నప్పుడు లేవి, అతని వారసులు అబ్రాహాము సంతతిగా భవిషత్తులో అతనికి పుట్టబోతున్నారు.
\s5
\p
\v 11 లేవీయులు యాజకులుగా ఉన్న సమయంలోనే దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అహరోను వారసుడైన లేవి వంశీకులు ప్రజల తిరుగుబాటుకు విరుగుడుగా దేవుని క్షమాపణ మార్గం కల్పిస్తూ వచ్చారు. అహరోను తరువాత వచ్చిన యాజకులు ఇందుకు చాలినవాళ్ళు. మరి ఇక మెల్కీసెదెకు వంటి యాజకుని అవసరం ఏమిటి?
\v 12 ఇకపై ఇలాంటి యాజకుల అవసరం లేదని మనకు తెలుసు. ఎందుకంటే, మెల్కీసెదెకు వంటి కొత్త యాజకుడు మనకోసం వచ్చాడు. ఈ కొత్త యాజకుని నియామకం తరువాత దేవుడు తన చట్టాలను కూడా మార్పు చెయ్యాలి.
\s5
\p
\v 13 యేసు గురించి నేను మాట్లాడుతున్నాను. ఆయన లేవి వంశం నుండి వచ్చినవాడు కాదు, యూదా వంశాంకురం. ఈ వంశం వారెవరూ యాజక వృత్తి నిర్వహించలేదు.
\v 14 యాజక ధర్మం నిర్వహణ విషయంలో మోషే ఎన్నడూ ప్రస్తావించని యూదా వంశంలో నుండి మన ప్రభువు వచ్చాడు.
\s5
\v 15 లేవి వంశం నుండి వచ్చిన యాజకులు సరిపోయినవారు కారని మనం తెలుసుకున్నాం. కాబట్టి మరింత స్పష్టంగా మెల్కీసెదెకు వంటి యాజకుడు మనకోసం వచ్చాడు.
\v 16 ఆ యాజకుడు యేసు. ఈయన దేవుని చట్టాల నెరవేర్పు కోసం లేవి వంశం ఆధారంగా వచ్చిన వాడు కాదు. ఈయన ఎన్నటికీ నాశనం కాని జీవానికి ఉన్న శక్తి ఆధారంగా వచ్చాడు.
\v 17 "నువ్వు కలకాలం మెల్కీసెదెకు క్రమంలో నిలిచి ఉండే యాజకుడివి" అని దేవుడు తన కుమారుని విషయంలో నిర్ధారించిన క్రమం నుండి వచ్చాడు.
\s5
\p
\v 18 పాపులైన ప్రజలను ఈ యాజకులు పవిత్రులుగా తీర్చలేకపోయారు గనుక దేవుడు ఈ విషయంలో ముందుగా ఇచ్చిన ఆజ్ఞను పక్కనబెట్టాడు.
\v 19 దేవుడు మోషేకిచ్చిన చట్టాల మూలంగా ఏ ఒక్కరూ నీతిమంతులుగా దేవుని లెక్కలోకి రాలేకపోయారు. మరోపక్క దేవుడు తనపై నమ్మకముంచి తనను సమీపించడానికి మరింత శ్రేష్టమైన మార్గం సిద్ధపరిచాడు.
\s5
\v 20 అయితే ఆయన క్రీస్తును యాజకుడుగా నియమించినప్పుడు దాన్ని గంభీరమైన శపథం ద్వారా స్థిరపరిచాడు. లేవీ గోత్ర యాజకుల విషయంలో ఇలాటి శపథం లేదు.
\v 21 దేవుడు క్రీస్తును యాజకుడుగా నియమించినప్పుడు ఈ మాటల్ని కీర్తనకారుడు లేఖనాల్లో ఇలా రాశాడు.
\q "నువ్వు కలకాలం యాజకుడుగా ఉంటావని
\q ఆయన గంభీరంగా చేసిన ప్రకటన విషయంలో
\q ఆయన ఎప్పటికీ మనసు మార్చుకోడు."
\s5
\p
\v 22 అందువల్ల పాత ఒడంబడిక కంటే కొత్త ఒడంబడిక మరింత శ్రేష్టంగా ఉంటుందని స్వయంగా యేసే హామీ ఇస్తున్నాడు.
\p
\v 23 యాజకులు ఎల్లకాలం యాజకులుగానే కచ్చితంగా ఉండలేరు. ఎందుకంటే వాళ్ళు చనిపోతారు. కాబట్టి ఆ చనిపోయిన యాజకుని స్థానాన్ని ఎంతో మంది ఒకరి తర్వాత ఒకరు భర్తీ చేస్తూ ఉంటారు.
\v 24 అయితే యేసు మాత్రం నిరంతరం జీవించేవాడు కాబట్టి ఆయన నిరంతరం ప్రధాన యాజకుడుగానే కొనసాగుతాడు.
\s5
\v 25 కాబట్టి యేసు తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారిని సంపూర్ణంగా, శాశ్వతంగా రక్షించడానికి సమర్ధుడుగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళని క్షమించమనీ సురక్షితంగా ఉంచమనీ దేవునికి విజ్ఞాపన చేయడానికి చిరకాలం జీవించే ఉంటాడు.
\p
\v 26 యేసు మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు. ఆయన కల్మషం అంటని పరిశుద్ధుడు. తప్పు లేనివాడు. నిర్దోషి. పాపుల మధ్యలో జీవిస్తున్న ఆయన్ని దేవుడు ఇప్పుడు ప్రత్యేకపరచి ఉన్నతమైన పరలోకానికి తీసుకువెళ్ళాడు.
\s5
\v 27 యూదీయ యాజకులు రోజు తర్వాత రోజు, సంవత్సరం తర్వాత సంవత్సరం జంతువుల్ని బలి అర్పించవలసిందే. వాళ్ళు మొదట తమ స్వంత పాపాల కోసం బలి అర్పించాలి. తర్వాత ఇతరుల పాపాల కోసం బలులు అర్పించాలి.
\p అయితే యేసులో ఎలాటి పాపం లేదు కాబట్టి ఆయన తన కోసం బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఆయన చేయాల్సిందల్లా ప్రజలను రక్షించడానికి ఒక్కసారే తనకు తానే బలిగా అర్పించుకోవడమే. కచ్చితంగా ఆయన అదే చేశాడు.
\v 28 మనకు ఇలాంటి ప్రధాన యాజకుడే కావాలి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించిన విధంగా నియమించిన ప్రధాన యాజకులు మనుషులందరిలాగే పాపం చేశారు. దేవుడు మోషేకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు తన కుమారుడినే ప్రధాన యాజకుడుగా నియమిస్తానని గంభీరంగా ప్రకటించాడు. ఇప్పుడు దేవుని కుమారుడుగా యేసు నిత్యమూ జీవించే పరిపూర్ణమైన ప్రధాన యాజకుడు.
\s5
\c 8
\p
\v 1 నేను రాసిన దానంతటిలో చాలా ప్రాముఖ్యమైన భాగం ఏమిటంటే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పరలోకంలో రాజుగా పరిపాలించడానికి ఆసీనుడై ఉన్నాడు.
\v 2 పరలోకంలో వాస్తవమైన ఆరాధనా స్థలం అయిన పరిశుద్ధ గర్భాలయంలో ఆయన పరిచర్య చేస్తాడు. అది నిజమైన ప్రత్యక్ష గుడారం, మోషే నెలకొల్పిన మానవ నిర్మిత ప్రత్యక్ష గుడారం కాదు. ఈ గుడారాన్ని ప్రభువే నిర్మించాడు.
\s5
\p
\v 3 ప్రజల పాపాల కోసం కానుకలూ, బలులూ అర్పించడానికి ప్రతి ప్రధాన యాజకుడినీ దేవుడే నియమిస్తాడు. అలాగే క్రీస్తు ప్రధాన యాజకుడైనప్పటి నుండీ ఆయన కూడా ఏదో ఒకటి అర్పించవలసి ఉంది.
\v 4 ఇప్పుడు క్రీస్తు భూమిపై ఉన్నట్టయితే ధర్మశాస్త్రం నియమాలను అనుసరించి కానుకలూ, బలులూ అర్పించే ప్రధాన యాజకునిలాగా ఉండనే ఉండదు. ఎందుకంటే అలాంటి యాజకులు ఇక్కడే ఉన్నారు.
\p
\v 5 మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మిస్తున్నప్పుడు "సీనాయి పర్వతం మీద నీకు ఏమి చూపించానో కచ్చితంగా దాని ప్రకారమే అంతా చేయాలి” అని దేవుడు చెప్పాడు.
\s5
\v 6 యూదీయ యాజకులు చేసే దానికంటే క్రీస్తు ఇప్పుడు అంతకన్నా మరింత మేలైన విధంగా పరిచర్య చేస్తాడు. అలాగే దేవుడు తన ప్రజల పక్షంగా ఇచ్చిన వాగ్దానాలు, చేసిన ఒప్పందాలూ, దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం కంటే కూడా శ్రేష్టమైనవి.
\p
\v 7 రెండవ ఒప్పందాన్ని దేవుడు నిర్ణయించాల్సి వచ్చింది. ఎందుకంటే మొదటి ఒప్పందం తప్పుల తడక అయ్యింది.
\s5
\v 8 ఇశ్రాయేలీయులు ఆ మొదటి ఒప్పందానికి లోబడక పోవడం వల్ల దేవుడు వాళ్ళని దోషులుగా ప్రకటించాడు. ఆయన కొత్త ఒప్పందం చేయాలని కోరాడు. దీన్ని గురించి ఒక ప్రవక్త ఇలా రాశాడు,
\q "ప్రభువు చెప్తున్నాడు, వినండి! సమయం ఆసన్నం అయింది.
\q ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజల పక్షంగా ఒక కొత్త ఒప్పందాన్ని చేసే రోజులు వస్తున్నాయి.
\q
\v 9 ఆ ఒప్పందం ఇంతకు ముందు వాళ్ళ పితరులతో చేసిన ఒప్పందంలాగా ఉండదు.
\q వాళ్ళను ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు ఒక తండ్రి చంటి బిడ్డను నడిపించినట్టు వాళ్ళని నడిపించాడు.
\q వాళ్ళు ఆ ఒప్పందం పట్ల తమ విధేయతను కొనసాగించలేదు.
\q కాబట్టి వాళ్ళని ఒంటరిగా వదిలేశాను," అని ప్రభువు చెప్పాడు.
\s5
\q
\v 10 మొదటి ఒప్పందం ముగిసిన తరవాత ప్రభువు ఇలా చెప్పాడు. "ఇశ్రాయేలీయులతో చేసే ఒప్పందం ఇదే.
\q వాళ్ళు నా శాసనాల్ని అర్థం చేసుకొనేలా చేస్తాను.
\q అలాగే వాళ్ళు నిజంగా విధేయత చూపేలా చేస్తాను.
\q నేను వాళ్లకు దేవుడుగా ఉంటాను. వాళ్ళు నాకు ప్రజలుగా ఉంటారు.
\s5
\v 11 తమ ఇరుగు పొరుగు వాళ్ళకు ఎవడూ ఉపదేశం చేసే అవసరం ఉండదు.
\q అలాగే "ప్రభువును తెలుసుకో" అని ఎవడూ తన తోటి సోదరుడికి చెప్పనక్కర లేదు.
\q ఎందుకంటే నా ప్రజలందరూ నన్ను గుర్తిస్తారు.
\q నా ప్రజల్లో చిన్నవాళ్ళ నుండి పెద్ద వాళ్ళ వరకు ముఖ్యులైన వాళ్ళంతా నన్ను తెలుసుకుంటారు.
\q
\v 12 వాళ్ళు చేసిన దుష్ట కార్యాల విషయంలో కరుణ చూపించి క్షమిస్తాను.
\q వాళ్ళ పాపాల విషయంలో వాళ్ళని ఇంకా దోషులుగా పరిగణించను."
\s5
\p
\v 13 దేవుడు ఒక కొత్త ఒప్పందాన్ని చేస్తున్నానని చెప్పినప్పటినుండి, మొదటి ఒప్పందం పాతదనీ, అది ఇక మీదట ఆచరణలో ఉండదనీ, అది తొందరలోనే సమసిపోతుందనీ ఆయన భావించాడని మనకు తెలుసు.
\s5
\c 9
\p
\v 1 మొదటి ఒప్పందం ప్రకారం దేవుడు ఇశ్రాయేలీయులకు ఆరాధన ఎలా చేయాలనే విషయంలో నియమాలను విధించి, ఆరాధనా స్థలాన్ని సిద్ధం చేయమని వారికి చెప్పాడు.
\v 2 ఇశ్రాయేలీయులు సిద్ధపరచిన పవిత్ర స్థలమే ప్రత్యక్ష గుడారం. దాని ముందు గదిలో ఒక దీపస్తంభం, దేవుని ఎదుట పెట్టిన రొట్టెల బల్ల ఉంచారు. ఆ గదిని పరిశుద్ధ స్థలం అని పిలిచారు.
\s5
\v 3 పరిశుద్ధ స్థలంలో ఒక పక్కన తెర వెనుక భాగంలో ఇంకొక గది ఉంది. దానిని అతి పరిశుద్ధ స్థలం అని పిలిచారు.
\p
\v 4 అందులో ధూపం వేయడానికి బంగారంతో చేసిన బలిపీఠం ఉంది, అంతే కాకుండా నిబంధన మందసం కూడా అక్కడ ఉంది. దాని అన్ని ప్రక్కలా బంగారంతో పొదిగి ఉంది. అందులో మన్నా అని పిలిచే ఆహారం ఉన్న బంగారు పాత్ర ఉంది. దేవుని నిజమైన యాజకుడని నిరూపించే అహరోను చేతి కర్ర కూడా అందులో ఉంది. దేవుడు రాసి ఇచ్చిన పది ఆజ్ఞల రాతి పలకలు కూడా అందులో ఉన్నాయి.
\v 5 ఆ మందసం పెట్టె మీద దేవుని మహిమకు గుర్తుగా రెక్కలు ఉన్న జీవుల ఆకృతులు ఉన్నాయి. ప్రధాన యాజకుడు ప్రజల పాపాల కోసం బలి అర్పించిన రక్తాన్ని చల్లే చోట ఆ ప్రతిమల రెక్కలు మందసం పెట్టె మూతను కప్పుతూ ఉన్నాయి. ఈ విషయాల గురించి ఇప్పుడు వివరంగా రాయడం కుదరదు.
\s5
\p
\v 6 వీటన్నిటినీ సిద్ధం చేశాక ఇశ్రాయేలు యాజకులు వాడుక ప్రకారం ప్రత్యక్ష గుడారంలోని ముందు గదిలోకి వెళ్లి సేవలు చేస్తారు.
\v 7 లోపలి గదిలోకి మాత్రం ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒక్కసారే వెళ్తాడు. అతడు ఎప్పుడూ జంతువుల్ని బలి ఇచ్చిన రక్తం తీసుకు వెళ్తాడు. ఆ రక్తాన్ని తాను చేసిన పాపాల కోసమూ, ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాల కోసమూ దేవునికి అర్పిస్తాడు. అంతేగాక ఈ అర్పణ పాపాలు చేస్తున్నామనే స్పృహ కూడా లేకుండా పాపంలో నిలిచి ఉండేవాళ్ళ కోసం కూడా అర్పిస్తారు.
\s5
\v 8 ఆ కారణం చేత మొదటి గది ఇంకా ఉనికిలో ఉండడం వల్ల సాధారణ ప్రజల కోసం లోపలి గదిలోకి, అంటే అతి పరిశుద్ధ స్థలం లోకి వెళ్ళే దారిని దేవుడు వెల్లడి చేయలేదని పరిశుద్ధాత్మ స్పష్టం చేస్తున్నాడు. అప్పట్లో యూదులు ఇంకా పాత పద్ధతిలోనే బలులు అర్పించినందుకు సాధారణ ప్రజలు దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి దారిని దేవుడు వెల్లడి చేయలేదు.
\p
\v 9 ఇప్పుడు మనం జీవిస్తున్న కాలానికి ఆ గుడారం ఉదాహరణగా ఉంది. ప్రత్యక్ష గుడారంలో అర్పించిన అర్పణలూ, కానుకలూ, ఒక వ్యక్తిని పూర్తిగా చెడు మార్గం నుండి మంచి మార్గంలోకి నడిపించి, దేవుణ్ణి సంతోషపెట్టేలా ఎప్పుడూ సరైనదే మన హృదయాలలో నుంచి వచ్చేలా చెయ్యలేకపోయాయి
\v 10 ఏం తినాలి, ఏం తాగాలి, దేనిని ప్రక్షాళన చేసుకోవాలి అనే నియమాలన్నీ శరీరానికి సంబంధించినవి. ఇవన్నీ దేవుడు మనతో కొత్త ఒప్పందం చేసుకొనే వరకే. ఆ కొత్త ఒప్పందంతోనే మళ్ళీ ఆయన సమస్తాన్నీ సరైన మార్గంలో పెట్టి బాగు చేస్తాడు.
\s5
\p
\v 11 అయితే క్రీస్తు మన ప్రధాన యాజకుడుగా వచ్చి ఇప్పుడు మనకు దక్కిన మంచి విషయాలను తీసుకొచ్చాడు. తరవాత ఆయన పరలోకంలో ఉన్న ప్రత్యక్ష గుడారం లాంటి దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయాడు. అయితే ఈ పరలోకం మోషే భూమి మీద తయారు చేసిన ప్రత్యక్ష గుడారం లాంటిది కాదు. ఇది చాలా విశాలమైంది, పూర్తిగా సంపూర్ణ మైంది. ఇది మనుషుల ఆలోచనతో తయారైంది కాదు.
\p
\v 12 ప్రతి సంవత్సరం ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళినప్పుడు అతడు మేకల, దూడల రక్తాన్ని తీసుకెళ్ళి అర్పిస్తాడు. కాని క్రీస్తు అలా చేయడు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడం అయితే ఉంది గానీ, ఒకే ఒక్క సారి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన సిలువ మీద తన స్వంత రక్తాన్ని ఒక్కసారే అర్పించేశాడు. అలా చేయడం వల్ల మన పాపాల కోసం శాశ్వతంగా వెల చెల్లించేశాడు.
\s5
\p
\v 13 యాజకులు మేకల, దూడల రక్తాన్నీ, ఎర్ర ఆవు దూడ దహనం తరవాత వచ్చిన బూడిదనూ నీళ్ళలో కలిపి, వడకట్టిన ఆ నీటిని ప్రజల మీద జల్లుతారు. ఇలా ఆచారపరంగా దీన్ని చేయడం వల్ల అపవిత్రులైన ఆ ప్రజలను అప్పుడు తనను ఆరాధించడానికి దేవుడు అంగీకరిస్తాడని వాళ్ళు చెప్తారు.
\v 14 ఇదే గనుక నిజమైతే, క్రీస్తు రక్తం వల్ల ఇంకెంత ఎక్కువగా శుద్ధి జరుగుతుందో కదా! నిత్యమైన ఆత్మ వల్ల ఆయన ఎలాంటి కళంకం లేకుండా తనకు తానే దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన రక్తం మన మనస్సాక్షిని పనికిమాలిన ఆచారాలనుండి పవిత్రం చేసి జీవం గలిగిన దేవుణ్ణి సేవించడానికి మనల్ని శుద్ధి చేస్తుంది.
\p
\v 15 క్రీస్తు తనకు తానే దేవునికి బలిగా అర్పించుకోవడం వల్ల దేవుని నుండి ఒక కొత్త ఒప్పందం తీసుకురావడానికి వీలైంది. మొదటి ఒప్పందం ముసుగులో మనుషులు చేసిన పాపాల నుండి విడిపించి స్వతంత్రులుగా చేయడానికి ఆయన తన మరణం ద్వారా వెల చెల్లించాడు. ఆయన ఇలా చేయడం వల్ల ఎవరిని ఆయన పిల్లలని పిలిచాడో వాళ్ళు దేవుడు హామీ ఇచ్చిన వారసత్వాన్ని శాశ్వతంగా పొందుతారు.
\s5
\p
\v 16 ఒప్పందం అనేది ఒక వీలునామా లాంటిది. వీలునామా విషయానికి వస్తే దానిలో రాసిన అంశాలన్నీ ఆచరణలోకి రావాలంటే ఆ వీలునామా రాసిన వ్యక్తి చనిపోయాడని ఎవరో ఒకరు రుజువు చేయాలి.
\v 17 ఆ వీలునామా రాసిన వ్యక్తి చనిపోయినప్పుడు అది అమల్లోకి వస్తుంది గానీ, అతడు ఇంకా బతికి ఉంటే మాత్రం అది అమల్లోకి రాదు.
\s5
\p
\v 18 అలాగే యాజకులు జంతువుల్ని బలి ఇచ్చినప్పుడు ప్రవహించిన రక్తం వల్లే దేవుడు మొదటి ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చాడు.
\v 19 మోషే ధర్మశాస్త్రంలో ఉన్న అన్ని ఆజ్ఞలనూ ఇశ్రాయేలు ప్రజలకి ప్రకటించిన తరవాత కోడె దూడల, మేకల రక్తాన్ని నీళ్ళతో కలిపాడు. తరవాత చిన్న హిస్సోపు కొమ్మను ఎర్రని ఉన్నితో కట్టి దానిని రక్తంలో ముంచాడు. దానిని తీసుకొని దేవుని ఆజ్ఞలు ఉన్న ధర్మశాస్త్ర గ్రంథం చుట్ట మీద చల్లాడు. తరవాత మరికొంత రక్తం తీసుకొని ప్రజలందరి మీదా చల్లాడు.
\v 20 అప్పుడు అతడు వాళ్ళతో "దేవుడు విధేయత చూపమని ఆజ్ఞాపించిన ఈ ఒప్పందాన్ని ఈ రక్తమే అమల్లోకి తెస్తుంది" అని చెప్పాడు.
\s5
\p
\v 21 అలాగే ప్రత్యక్ష గుడారం మీదా, అందులో ఉపయోగించే ప్రతి వస్తువు మీదా ఆ రక్తాన్ని చల్లాడు.
\v 22 ఇలా చల్లడం వల్ల దాదాపు అంతా శుద్ధి అవుతుంది. అదే ధర్మశాస్త్రంలో రాశారు. వారు ఒక జంతువును బలి ఇచ్చి దాని రక్తం చిందించకపోతే వారి పాపాలను దేవుడు క్షమించడు.
\s5
\p
\v 23 జంతువుల బలి ద్వారా వస్తువులను శుద్ధి చేయడం తప్పని సరిగా యాజకులు చేయాల్సిందే. ఎందుకంటే పరలోకంలో క్రీస్తు ఏం చేస్తాడో దానికి ఇది ఒక సూచనగా ఉంది. కానీ అసలు పరలోకానికి చెందిన వస్తువులు దేవుడు శుద్ధి చేయాల్సి వస్తే వీటికంటే శ్రేష్టమైన బలులు జరగాలి.
\v 24 అందువల్ల క్రీస్తు మనుషుల చేతులతో తయారు చేసిన పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించలేదు. అది కేవలం నిజమైన పరిశుద్ధ స్థలానికి సాదృశ్యం మాత్రమే. దానికి బదులు ఆయన నేరుగా పరలోకంలోకే ప్రవేశించి దేవుని సన్నిధిలో మనకు ప్రతినిధిగా ఉన్నాడు.
\s5
\p
\v 25 సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు తనది కాని వేరే రక్తాన్ని తీసుకొని బలి అర్పించడానికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. అయితే క్రీస్తు పరలోకంలోకి ప్రవేశించినప్పుడు తనను అర్పించుకోడానికి అలా మళ్ళీ మళ్ళీ వెళ్ళలేదు.
\v 26 ఒకవేళ అదే గనుక అయితే దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పటి నుండి అనేక సార్లు పదే పదే హింస పొందుతూ తన రక్తాన్ని కార్చవలసి వచ్చేది. కానీ క్రీస్తు ఈ చివరి కాలంలో ప్రత్యక్షమై తనను తాను ఒక్కసారే బలిగా అర్పించుకోవడం వల్ల దేవుడు కూడా ఒక్క సారే మన పాపాలన్నీ క్షమించి మనల్ని మరెన్నటికీ తన తీర్పులోకి తీసుకు రాడు.
\s5
\p
\v 27 మనుషులంతా ఎప్పుడో ఒకప్పుడు చనిపోతారు. ఆ తరవాత వాళ్ళ పాపాలకు దేవుడు తీర్పు తీరుస్తాడు.
\v 28 అదే విధంగా క్రీస్తు తన స్వంత వాళ్లైన అనేకమంది పాపాల కోసం వాళ్ళ స్థానంలో శిక్ష అనుభవించి చనిపోయి ఒక్క సారే తనను తానే బలిగా అర్పించుకున్నాడు. ఆయన మళ్ళీ రెండో సారి భూమి మీదకు వస్తాడు. అయితే ఈసారి మళ్ళీ పాపం చేసిన వాళ్ళ కోసం బలి కావడానికి కాదు, ఆయన రాకడ కోసం ఓపికగా ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళని రక్షించడానికి.
\s5
\c 10
\p
\v 1 దేవుడు భవిష్యత్తులో చేసే శ్రేష్టమైన విషయాన్ని ధర్మశాస్త్రం అంత స్పష్టంగా చూపించదు. ధర్మశాస్త్రం వేరొక దానికి నీడలా ఉంది, అది నిజ స్వరూపం కాదు. ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతి సంవత్సరం ఒకే రకమైన బలులు అర్పిస్తూ ఉంటే, ధర్మశాస్త్రం వాళ్ళను ఎప్పటికీ పరిపూర్ణం చెయ్యలేదు.
\v 2 ఈ బలులు అర్పించడానికి వచ్చిన వారి పాపాలను దేవుడు తీసేసి ఉంటే వాళ్ళు తాము ఇంకా పాపులమని భావించరు. కాబట్టి వాళ్ళు తప్పకుండా బలులు అర్పించడం మానేస్తారు కదా. ఆరాధిస్తున్న వారు ఒక్కసారే తమ పాపాల నుండి శుద్ధి అయ్యేవారు కదా! తమ గురించిన ఆలోచనల్లో వాళ్ళు ఎంతో నెమ్మది పొందేవాళ్ళు కదా!
\v 3 అంతే కాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళు అర్పించే బలులు తాము ఇంకా తమ పాపాల విషయంలో దోషులుగా ఉన్నట్టు గుర్తు చేస్తాయి.
\v 4 కాబట్టి మనం అర్పించే ఎద్దులు, మేకల్లాటి జంతువుల్ని దేవునికి అర్పించినా సరే, వాటి రక్తం చిందించడం ఆయన చూసినా సరే, అది ఏమాత్రం మనం దోషులు కాకుండా ఆపలేదు.
\s5
\p
\v 5 అందువల్ల క్రీస్తుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన తండ్రితో ఇలా అన్నాడు.
\q "బలులు అర్పణలు నీవు అడగలేదు,
\q కానీ అర్పించడానికి నాకు ఒక శరీరాన్ని సిద్ధం చేశావు.
\q
\v 6 ప్రజలు దహించిన జంతువుల్ని నీకు అర్పించినా ఆ జంతు బలులు నిన్ను సంతోషపెట్టవు.
\q అంతే కాదు, ఇంకా ఇతర బలులు కూడా నిన్ను సంతోషపెట్టలేవు."
\q
\v 7 ఈ కారణం వల్ల నేను ఇలా అన్నాను, "నా దేవా, విను!
\q నేనేమి చెయ్యాలని నువ్వు కోరుతున్నావో అలాగే చెయ్యడానికి నేను వచ్చాను.
\q నా గురించి గ్రంథంలో రాసిన ప్రకారం నీ ఇష్టాన్ని చేయడానికి నేనున్నాను."
\s5
\p
\v 8 పైన చెప్పినట్టుగా క్రీస్తు ఇలా అన్నాడు, "పాపం చేసిన వాళ్ళ కోసం యాజకులు అర్పించే బలులు గానీ, అర్పణలు గానీ, జంతువులు గానీ దహన బలులు గానీ, పాప పరిహారం కోసం చేసే మరే ఇతర బలులు గానీ నువ్వు కోరుకోవు. అవి నిన్ను సంతోషపెట్టవు. దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారమే వాటిని అర్పించినా అవి నిన్ను సంతోషపెట్టవు."
\v 9 అప్పుడు, క్రీస్తు ప్రజల పాపాల కోసం తనను తానే బలిగా అర్పించుకొనే విషయం గురించి ఆయన "విను, నువ్వేది చెప్తే అది చెయ్యడానికే నేను వచ్చాను” అన్నాడు. అలా పాపాల కోసం బలులు అర్పించే మొదటి ప్రక్రియను పక్కకు నెట్టి క్రీస్తే తనకు తాను బలిగా అర్పించుకొనే రెండవ మార్గాన్ని నెలకొల్పడానికి దేవుడు ఆ విధంగా చేశాడు.
\p
\v 10 యేసుక్రీస్తు దేవుడి అభీష్టం మేరకు ఏమి చెయ్యమన్నా చెయ్యడానికి సిద్ధంగా ఉన్న కారణం చేత దేవుడు తన కోసం మనల్ని ప్రత్యేకపరిచాడు. యేసు క్రీస్తు తన స్వంత శరీరాన్ని పదే పదే కాకుండా ఒక్కసారే బలిగా అర్పించినప్పుడు ఈ రెండవ ప్రక్రియ అమలు జరిగింది.
\s5
\p
\v 11 యాజకుడు ప్రతి రోజూ బలిపీఠం ముందు నిలబడి ఒకేరకమైన బలులు, ఆచార కాండలు, అదేపనిగా చేస్తూ ఉంటాడు. అయితే అవి ఏ ఒక్కరి పాపాన్ని ఎన్నటికీ తీసివేయలేవు.
\v 12 అయితే క్రీస్తు మన పాపాల కోసం అర్పించిన బలి మాత్రం శాశ్వతంగా సరిపోతుంది. అంతే కాదు, ఆ బలిని ఒక్కసారే అర్పించేశాడు. ఇక పదే పదే బలులు అర్పించనక్కర లేదు. దీని తరవాత ఆయన అత్యున్నత గౌరవ స్థానంలో పాలించడానికి దేవుని పక్కన కూర్చున్నాడు.
\v 13 ఇప్పటినుండీ, దేవుడు తన శత్రువులనందరినీ పూర్తిగా ఓడించే వరకూ కనిపెడుతూ ఉన్నాడు.
\v 14 ఆయన తనను తాను అర్పించుకున్న ఒకే ఒక్క బలి ద్వారా, శుద్ధి పొందిన వారిని శాశ్వతంగా దేవుడు పరిపూర్ణులుగా చేశాడు.
\s5
\p
\v 15 ఇది సత్యమని దీని గురించి పరిశుద్ధాత్మ కూడా మనకి సాక్షమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు,
\q
\v 16 నా ప్రజల పక్షంగా నేను చేసిన మొదటి ఒప్పందం సమయం ముగిసిపోయింది.
\q వాళ్ళ పక్షంగా ఇప్పుడు ఒక కొత్త ఒప్పందం చేస్తాను.
\q వాళ్ళ కోసం నేను దీన్ని చేస్తాను” అని ప్రభువు చెప్తున్నాడు.
\q నా శాసనాన్ని వాళ్ళు అర్థం చేసుకొనేలా చేస్తాను.
\q వాళ్ళు నా శాసనాలకు విధేయత చూపేలా చేస్తాను."
\s5
\p
\v 17 తరవాత ఆయన ఇలా అన్నాడు,
\q "వాళ్ళ పాపాలను నేను క్షమిస్తాను,
\q వాళ్ళ పాపాలనూ అక్రమాలనూ ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను, వాళ్ళు పాపులుగా ఎప్పటికీ ఉండరు."
\p
\v 18 దేవుడు ఎవరి పాపాలనైనా క్షమించినప్పుడు ఆ వ్యక్తి తన లోటును భర్తీ చేసుకోడానికి ఇంకా ఎలాంటి, ఏ రకమైన బలులూ అర్పించాల్సిన పని లేదు.
\s5
\p
\v 19 కాబట్టి నా సహ విశ్వాసులారా, యేసు మనకోసం తన స్వంత రక్తాన్ని చిందించి తన పనిని సంపూర్తి చేశాడని మనం నమ్ముతున్నాం కాబట్టి మనం దేవుని సన్నిధికి సూచనగా ఉన్న ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలం లోకి ధైర్యంగా వెళ్ళగలం.
\v 20 ఒక కొత్త మార్గం ద్వారా ఎక్కడైతే నిత్యం జీవిస్తామో ఆ దేవుని సన్నిధి లోకి వెళ్ళే అనుమతిని ఆయన మనకి కలిగించాడు. ఈ కొత్త మార్గం మనకోసం చనిపోయిన యేసే.
\v 21 క్రీస్తు మనపై పరిపాలన చేసే గొప్ప ప్రధాన యాజకుడు. మనం దేవుని ప్రజలం.
\p
\v 22 కాబట్టి మనం విశ్వాసం విషయంలో యథార్థంగా సంపూర్ణ నిశ్చయతతో దేవుణ్ణి సమీపించాలి. మనం పాపం చేసిన తరవాత మన ఆలోచనలను నిర్మలం చేసేవాడు ఆయనే. ఇదెలా ఉంటుందంటే మన ఆలోచనల మీద స్వంత రక్తాన్ని చల్లి మన కోరికలను పవిత్రం చేసినట్గా మన శరీరాన్ని స్వచ్చమైన నీటితో కడిగినట్టుగా ఉంటుంది.
\s5
\p
\v 23 మనం నమ్మిన దానిని చలించకుండా గట్టిగా చెప్తూ ఉండాలి. దేవుడు ఆయన వాగ్దానం చేసినవన్నీ నమ్మకంగా చేస్తాడు. మనం అవి జరుగుతాయని సంపూర్ణ నిశ్చయంతో, ఆశతో ఉండాలి.
\v 24 అమితంగా ఒకళ్ళ నొకళ్ళు ప్రేమించుకోడానికీ మంచి పనులు చేయడానికీ ఒకళ్ళ నొకళ్ళు ప్రేరేపించుకుందాం.
\v 25 కొంత మంది చేస్తున్నట్టుగా ప్రభువును ఆరాధించడానికి సమాజంగా సమకూడటం మానకూడదు. దానికి బదులుగా మనలో ప్రతి ఒక్కరూ ఇతరుల్ని ప్రోత్సహించాలి. ప్రభువు రాకడ సమీపంగా ఉందని మనకు తెలుసు కాబట్టి ఆ రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా ఎక్కువగా ఒకళ్ళ నొకళ్ళు పురికొల్పుకుందాం.
\s5
\p
\v 26 క్రీస్తు గురించిన సత్యాన్ని అనుభవించిన తరవాత కూడా బాహాటంగా అలవాటు ప్రకారం పాపం చేస్తే ఇక ఏ రకమైన బలులు కూడా మనకి సహాయం చేయలేవు. ఆ పాపాలకు ఇక బలులు ఉండవు.
\v 27 అంతే కాకుండా ఇంక మనల్ని దేవుడు తీర్పు తీరుస్తాడనే భయంతో ఎదురు చూడాలి. ఎందుకంటే ఆయన ప్రచండమైన అగ్నితో తన శత్రువులందరినీ న్యాయంగా శిక్షిస్తాడు.
\s5
\p
\v 28 మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఎవడైనా ఉల్లంఘిస్తే ఇద్దరో ముగ్గురో అతని మీద చెప్పిన సాక్ష్యం ప్రకారం ఎలాంటి దయా దాక్షిణ్యాలు లేకుండా అతన్ని చంపాల్సిందే.
\v 29 ఇది చాలా తీవ్రమైన శిక్ష. అయితే క్రీస్తు దేవుని కుమారుడు, దేవుడు కూడా. ఎవరైనా దేవుడు చేసిన ఒప్పందాన్ని తిరస్కరించి ఆయన చిందించిన రక్తాన్ని హేయమైందిగా ఎంచి, తన పాపాలను శుద్ధి చేసి, క్షమించిన ఆ రక్తాన్నీ, తన పట్ల కృపాభరితంగా వ్యవహరించిన దేవుని ఆత్మనూ తిరస్కరిస్తే వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.
\s5
\p
\v 30 "పాపం చేసిన వాళ్ళని శిక్షించే హక్కు, అధికారం నాకే ఉన్నాయి, చేసిన దానికి తగిన శిక్ష నేనే వాళ్లకి ఇస్తాను" అని దేవుడు చెప్పాడని మనకు తెలుసు. "ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు"అని మోషే రాశాడు.
\v 31 జీవం గల సర్వ శక్తిమంతుడైన దేవుడు మిమ్మల్ని ముట్టడించి శిక్షించడం ఎంతో భయానకం!
\s5
\p
\v 32 మీరు క్రీస్తు గురించిన సత్యాన్ని మొదటిసారి అర్థం చేసుకున్న సమయాన్ని గుర్తు చేసుకోండి. మీరు ఎన్నో కష్టాలు ఓర్చుకున్నారు. మీరు ఎంత హింస ఎదుర్కొన్నా, దేవునిలో మీ విశ్వాసాన్ని కొనసాగించారు.
\v 33 మనుషులు బహిరంగంగా మిమ్మల్ని అవమానపరిచారు. కొన్నిసార్లు మిమ్మల్ని హింసకు గురి చేశారు. కొన్నిసార్లు మీ సాటి విశ్వాసులకు కలిగిన శ్రమల వల్ల మీరూ కష్టాల పాలయ్యారు.
\v 34 క్రీస్తును నమ్మినందుకు జైలు పాలైన వారి విషయంలో మీరు దయగా ఉండడమే కాకుండా అవిశ్వాసులు మీ ఆస్తి పాస్తులను లాగేసుకున్నా మీరు సంతోషంగా అంగీకరించారు. మీరు ఇలా ఎందుకు చేశారంటే పరలోకంలో మీకు శాశ్వతంగా ఆస్తి ఉందనీ, ఇక్కడ లాగేసుకొన్న ఆస్తిపాస్తుల కంటే ఆ పరలోకపు ఆస్తి చాలా గొప్పదనీ మీకు బాగా తెలుసు.
\s5
\p
\v 35 కాబట్టి వాళ్ళు మిమ్మల్ని హింసించినా సరే, నిరుత్సాహ పడవద్దు. అలా మీరు ఆయనలో విశ్వాసముంచుతూ ఓపికతో ఉంటే మీకు ఆయన గొప్ప బహుమతులిస్తాడు.
\v 36 ఇలా మీరు గనక ఓపికగా ఆయనలో విశ్వాసాన్ని కొనసాగిస్తూ, ఆయన కోరినట్టుగా చేయడం వల్ల ఆయన వాగ్దానం చేసిన వాటిని మీకు ఇస్తాడు.
\v 37 క్రీస్తు గురించి దేవుడు పలికిన మాటల్ని ఒక ప్రవక్త ఇలా రాశాడు,
\q "ఇక కొద్ది కాలంలోనే నేను వాగ్దానం చేసినవాడు తప్పకుండా వస్తాడు.
\q ఆయన ఆలస్యం చేసేవాడు కాదు.
\s5
\p
\v 38 "ఎవరు నాకు సంబంధించిన వాళ్ళో ఎవరు మంచి ప్రవర్తన కలిగి ఉంటారో, వాళ్ళు నాలో విశ్వాసాన్ని కొనసాగిస్తూ జీవిస్తారు.
\q ఒకవేళ వాళ్ళు గనుక పిరికితనంతో నన్ను విశ్వసించడం మానేసి వెనకడుగు వేస్తే
\q నేను వాళ్ళ గురించి సంతోషించను."
\p
\v 39 అయితే మనం పిరికి వాళ్ళంగా ఉండి దేవుడి చేతిలో నాశనానికి గురి కాకుండా ఆయనపై నమ్మకం ఉంచి ఆయన ద్వారా నిత్యం జీవించేలా రక్షణ పొందే వాళ్ళంగా ఉన్నాం.
\s5
\c 11
\p
\v 1 మనుషులు దేవుణ్ణి నమ్మి తాము ఎదురు చూస్తున్న వాటిని ఆయన కచ్చితంగా ఇస్తాడనీ, తాము వాటిని పొందుతామనీ నిశ్చయత కలిగి ఉండడమే విశ్వాసం. విశ్వాసం అంటే కొన్ని విషయాలు ఇప్పుడు కాకపోయినా, అవి కంటికి కనబడక పోయినా, ఎప్పటికైనా జరగడం తప్పనిసరిగా చూస్తామని మనుషులు నమ్మడం.
\v 2 ఎందుకంటే మన పూర్వికులు దేవుణ్ణి నమ్మారు. ఆయన వాళ్ళను ఆమోదించాడు.
\p
\v 3 మనం దేవుణ్ణి నమ్మాము కాబట్టి దేవుడు ఒక్క ఆజ్ఞ ఇవ్వడం ద్వారా ఈ విశ్వమంతా ఉనికిలోకి వచ్చిందని మనం అర్థం చేసుకున్నాం. కాబట్టి మనం విశ్వంలో ఇప్పుడు చూస్తున్న విషయాలు ఇంతకు ముందే ఉనికిలో ఉన్నవాటినుండి తయారైనవి కావు.
\s5
\v 4 ఆదాము కొడుకు హేబెలు దేవుణ్ణి నమ్మడం వల్ల తన అన్న కయీను అర్పణ కంటే శ్రేష్టమైన అర్పణ చెల్లించాడు. దేవుడు హేబెలు అర్పణ గురించి గొప్పగా మాట్లాడి అతడు నీతిమంతుడని ప్రకటించాడు. హేబెలు చనిపోయినప్పటికీ అతడు దేవుణ్ణి నమ్మిన విషయం గురించి మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం.
\s5
\p
\v 5 హనోకు దేవుణ్ణి నమ్మడం వల్ల దేవుడు అతణ్ణి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. హనోకు చనిపోలేదు, దేవుడే అతణ్ణి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి అతడు ఎవరికీ కనిపించకుండా పోయాడు. దేవుడు అతణ్ణి తీసుకుని వెళ్లక ముందు హనోకు తనను సంతోషపెట్టాడని అతని గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు.
\v 6 ఇప్పుడు మనుషులు దేవుణ్ణి సంతోషపెట్టడం సాధ్యమే. కేవలం వాళ్ళు దేవుణ్ణి నమ్మితే చాలు. ఎందుకంటే ఎవరైనా దేవుడి దగ్గరకి రావాలంటే మొట్టమొదటగా దేవుడున్నాడనీ, తనను తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్లకి ఆయన ప్రతిఫలం ఇస్తాడనీ నమ్మాలి.
\s5
\p
\v 7 దేవుడు జలప్రళయం పంపిస్తానని నోవహును హెచ్చరించాడు. ఇంతకు ముందెప్పుడూ నోవహు దానిని చూడలేదు. అయితే నోవహు ఆయన్ని నమ్మాడు. ఆయనపై పూజ్యభావంతో దేవుని మాటతో ఒక ఓడ కట్టి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అతడు ఇలా చేయడం వల్ల మిగిలిన ప్రజలు దేవుడిచ్చే శిక్షకు తగిన వారు అని లోకానికి చూపించాడు. నోవహు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుడికి నచ్చిన వ్యక్తి అయ్యాడు.
\s5
\p
\v 8 దేవుడు అబ్రాహామును పిలిచి అతనికి, అతని వారసులకు ఇవ్వబోయే స్థలానికి వెళ్ళమన్నాడు. అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఆ మాటకి లోబడి తన దేశాన్ని వదిలి తానెక్కడికి వెళ్తున్నాడో తెలియక పోయినప్పటికీ అక్కడికి వెళ్ళాడు.
\v 9 అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుడు వారసత్వంగా ఇస్తానని వాగ్దానం చేసిన ఆ దేశంలో పరదేశిగా నివసించాడు. అబ్రాహాము గుడారాల్లో నివసించాడు. అతని కొడుకు ఇస్సాకు, మనవడు యాకోబు కూడా అలాగే నివసించారు. అబ్రాహాముకు ఇస్తానని వాగ్దానం చేసిన వాటిని ఇస్సాకు, యాకోబులకు కూడా ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
\v 10 దేవుడే స్వయంగా శిల్పిగా ఉండి నిర్మించే ఆ శాశ్వత నగరం కోసం అబ్రాహాము ఎదురు చూశాడు.
\s5
\p
\v 11 శారా వృద్ధాప్యం వల్ల పిల్లల్ని కనే శక్తి లేకపోయినా సరే, విశ్వాసం వల్ల కొడుకుని కనడానికి శక్తి పొందింది. ఎందుకంటే ఆమెకు కొడుకు పుడతాడని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఆమెకు తెలుసు.
\v 12 అబ్రాహాము పిల్లల్ని కనే స్థితిలో లేకపోయినా దేవుడు వాగ్దానం చేసినట్టే ఆ ఒక్క మనిషి నుండి ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్ర తీరంలో ఇసుక రేణువుల్లాగా లెక్క లేనంత మంది వారసులు పుట్టుకొచ్చారు.
\s5
\p
\v 13 వాళ్ళు దేవునిలో నమ్మకం ఉంచుతూనే ఈ మనుషులంతా చనిపోయారు. దేవుడు వాళ్లకి ఇస్తానని వాగ్దానం చేసిన వాటిని ఇంకా పొందకుండానే దూరం నుండే వాటిని చూసేసినట్టుగా సంతోషించారు. తాము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదన్నట్టుగా ఇక్కడ తాత్కాలికంగా ఉంటున్నట్టుగా ఒప్పుకున్నారు.
\v 14 ఇలాంటి విషయాలు చెప్తున్న వాళ్ళు తాము తమ నిజమైన స్వదేశం కోసం ఆశ పెట్టుకుని ఉన్నట్టుగా తెలుస్తుంది.
\s5
\p
\v 15 ఒకవేళ వాళ్ళు విడిచి వచ్చిన దేశం గురించి ఆలోచిస్తున్నట్టైతే, వాళ్ళు తిరిగి ఆ దేశానికే వెళ్ళడానికి అవకాశం ఉంది.
\v 16 కానీ వాళ్ళు నివసించడానికి మరింత శ్రేష్టమైన దేశాన్ని కోరుకున్నారు. వాళ్ళు పరలోకంలో ఉండే ఒక ఇంటిని కోరుకున్నారు. కాబట్టి దేవుడు వారు తనతోబాటు నివసించడానికి ఒక పట్టణాన్ని సిద్ధం చేశాడు. అంతే కాదు, తాను వాళ్ళ దేవుడనని చెప్పుకోడానికి ఎంతో సంతోషిస్తున్నాడు.
\s5
\p
\v 17 అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుడు అతణ్ణి తీవ్రంగా పరీక్షకు గురి చేసినప్పుడు అతడు తన కొడుకు ఇస్సాకును చంపి బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుడు అతనికి కొడుకును ఇస్తానని వాగ్దానం చేసి ఇచ్చిన ఆ ఒకే ఒక్క కొడుకుని, తన స్వంత భార్య ద్వారా పుట్టిన వాణ్ణి అబ్రాహాము బలిగా అర్పించబోతున్నాడు.
\v 18 ఆ కొడుకు గురించే దేవుడు ఇలా చెప్పాడు, "ఇస్సాకు నుండే నీకు వారసులు వస్తారు."
\v 19 అబ్రాహాము ఆ వాగ్దానం నెరవేరుతుందని నమ్మాడు. ఒక వేళ అతడు తన కొడుకుని బలిగా అర్పించినా చనిపోయిన ఇస్సాకును దేవుడు తిరిగి బతికించ గలడు. చెప్పాలంటే అబ్రాహాము చనిపోయిన వాణ్ణి తిరిగి పొందాడు.
\s5
\p
\v 20 ఇస్సాకు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి దేవుడు తాను చనిపోయిన తరవాత తన కొడుకులైన యాకోబు, ఏశావుల్ని దీవించాలని ప్రార్థన చేశాడు.
\p
\v 21 యాకోబు దేవుణ్ణి నమ్మాడు గాబట్టి అతడు చనిపోయే ముందు తన కొడుకైన యోసేపు ఇద్దరు కుమారుల భవిష్యత్తులో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని ప్రార్థించాడు. చనిపోక ముందు అతడు తన చేతి కర్ర మీద ఆనుకొని దేవుణ్ణి ఆరాధించాడు.
\v 22 యాకోబు దేవుణ్ణి నమ్మాడు కాబట్టి తన అంతిమ సమయంలో ఇశ్రాయేలీయులు భవిష్యత్తులో ఐగుప్తు నుండి స్వదేశానికి పయనమయ్యే విషయం గురించి మాట్లాడాడు. ఐగుప్తు వదిలి వెళ్ళే సమయంలో తన ఎముకల్ని వాళ్ళతోబాటు తన దేశానికి తీసుకు వెళ్ళమని తన సంతానానికి సూచించాడు.
\s5
\p
\v 23 మోషే తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్మారు కాబట్టి తమకు కొడుకు పుట్టిన తరవాత అతడు అందంగా ఉండడం చూసి అతణ్ణి మూడు నెలలు దాచిపెట్టారు. ఇశ్రాయేలు సంతానమైన మగ పిల్లలందరినీ చంపమని ఆజ్ఞాపించిన ఐగుప్తు రాజుకు కూడా వాళ్ళ భయపడలేదు.
\v 24 ఫరో రాకుమారి మోషేని పెంచి పెద్ద చేసింది. మోషే పెరిగి పెద్దవాడయ్యాక అతడు దేవుణ్ణి నమ్మాడు, "ఫరో కుమార్తె కొడుకు" అనిపించుకోడానికి ఇష్టపడలేదు. రాజభోగాలు అనుభవించడానికి నిరాకరించాడు.
\v 25 రాజ మందిరంలో కొద్ది కాలం పాప జీవితాన్ని అనుభవించే కంటే దేవుని ప్రజలతో దీర్ఘ కాలం ఇతరుల చేత అవమానం భరించడం లోనే గొప్పదనం ఉందని నిర్ణయించుకున్నాడు.
\v 26 క్రీస్తు కోసం హింసలు అనుభవించడమే ఫరో కుటుంబం లోని ఐశ్వర్యాన్ని పొందడం కంటే దేవుని దృష్టిలో మరింత శ్రేష్టమని అతడు భావించాడు. దేవుడు భవిష్యత్తులో ఇచ్చే శాశ్వతమైన బహుమానం కోసం అతడు ఎదురు చూశాడు.
\s5
\p
\v 27 మోషే దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అతడు ఐగుప్తును విడిచిపెట్టాడు. ఐగుప్తునుంచి వెళ్ళిపోవడం వల్ల రాజుకు కోపం వస్తుందని కూడా భయపడలేదు. ఇతరులెవ్వరూ చూడలేక పోయిన దేవుణ్ణి అతడు చూస్తూ ఉన్నట్టుగా అతడు ముందుకు వెళ్ళిపోయాడు.
\v 28 మోషే దేవుణ్ణి నమ్మాడు కాబట్టి తన స్వంత ప్రజలను రక్షించ గలిగాడు. దేవుడు పస్కా గురించి ఇచ్చిన ఆజ్ఞకు లోబడ్డాడు. అదే చివరికి ప్రతి సంవత్సరం ఆచరించే పండగ అయింది. గొర్రెల్ని చంపి వాటి రక్తాన్ని తమ ద్వారబంధాల మీద పూయమనీ, అలా పూయడం వల్ల మరణ దూత ఆ రక్తం చూసి, ఇశ్రాయేలీయుల ఇళ్ళలో ఉన్న తొలిచూలు సంతానాన్ని చంపకుండా దాటి పోతాడనీ దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించాడు.
\s5
\p
\v 29 ఇశ్రాయేలీయులు దేవుణ్ణి నమ్మారు కాబట్టి ఎర్ర సముద్రం గుండా నడిచినప్పుడు కూడా వాళ్ళు పొడి నేల మీద నడిచారు. ఐగుప్తు సైన్యం కూడా వాళ్ళ లాగే సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించింది. అయితే సముద్రం మళ్ళీ మామూలుగా ప్రవహించి వాళ్ళని ముంచివేసింది.
\p
\v 30 ఇశ్రాయేలీయులు దేవుణ్ణి నమ్మారు కాబట్టి ఏడు రోజులు యెరికో గోడల చుట్టూ కవాతు చేసిన తరవాత ఆ నగర ప్రాకారాలు కూలిపోయాయి.
\p
\v 31 రాహాబు ఒక వేశ్య. అయితే ఆమె దేవుణ్ణి నమ్మింది కాబట్టి దేవుని నమ్మని యెరికో ప్రజలతో బాటు ఆమె నాశనం కాకుండా తప్పించుకుంది. యెహోషువ ఆ నగర నాశనానికి వ్యూహం రచించడానికి గూఢచారుల్ని పంపాడు. రాహాబు వారిని సమాధానంగా తన ఇంటిలోకి ఆహ్వానించడం వలన దేవుడు ఆమెను రక్షించాడు.
\s5
\p
\v 32 ఇంకా ఏమి చెప్పను? దేవుణ్ణి నమ్మిన ఇంకా ఎంత మందిని గురించి చెప్పాలో తెలియడం లేదు. గిద్యోను, బారాకు, సంసోను, ఎఫ్తా, దావీదు, సమూయేలు, ఇంకా ఎందరో ఇతర ప్రవక్తలు, వీళ్ళందరి గురించీ చెప్పాలంటే చాలా సమయం పడుతుంది.
\v 33 వాళ్ళు దేవుణ్ణి నమ్మారు కాబట్టి వీళ్ళలో కొంత మంది గొప్ప పనులు చేశారు, కొంతమంది శక్తివంతులైన రాజుల చేతిలోనుండి రాజ్యాలను గెల్చుకొని స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది ఇశ్రాయేలును పరిపాలించి, ప్రజలకు, జాతులకు న్యాయం జరిగించారు. కొంతమంది దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన వాటిని పొందారు. కొంతమంది సింహాల నోళ్ళు మూయించారు.
\v 34 కొంతమంది అగ్ని నుండి తప్పించుకున్నారు. కొంతమంది కత్తి పోట్లను తప్పించుకున్నారు, కొంతమంది రోగాలనుంచి స్వస్థత పొందారు. కొంతమంది యుద్ధాల్లో పోరాడి శక్తివంతులయ్యారు. కొంతమంది విదేశీ సైన్యాలను తరిమికొట్టారు.
\s5
\p
\v 35 దేవుణ్ణి నమ్మిన కొంతమంది స్త్రీలు తమ రక్త సంబంధుల్ని దేవుడు బతికించగా తిరిగి పొందారు. అయితే కొంతమంది దేవుణ్ణి నమ్మడం వల్ల చనిపోయే వరకు చిత్రహింసలు భరించారు. వాళ్ళు ఎందుకు అలా భరించారంటే, "దేవుణ్ణి నమ్మడం మానేస్తే మిమ్మల్ని విడుదల చేస్తాం" అని శత్రువులు అన్నపుడు అలా చేయడానికి వాళ్ళు తిరస్కరించారు. అలా ఈ లోకంలో బతకడం కంటే దేవునితో శాశ్వతంగా జీవించాలని వాళ్ళు కోరుకున్నారు.
\v 36 ఇంకా కొందరు దేవుణ్ణి నమ్మడం వల్ల వెక్కిరింతలకు గురి అయ్యారు. కొంతమంది కొరడా దెబ్బలకు తమ వీపులు చూపారు. కొందరు సంకెళ్ళను, ఖైదును కూడా సహించారు.
\v 37 కొంతమంది విశ్వాసులను రాళ్ళతో కొట్టి చంపారు. కొంతమంది విశ్వాసులను రంపాలతో కోశారు. కొందరిని కత్తులతో చంపారు. దేవుణ్ణి నమ్మిన కొంతమంది గొర్రెల, మేకల చర్మాలు కట్టుకొని తిరిగారు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ప్రజలు ప్రతి నిత్యం వాళ్ళని అణచివేస్తూ హాని చేస్తూ ఉన్నారు.
\v 38 ఈ లోకంలో ఉన్న ఇలాంటి వాళ్లకు, దేవుణ్ణి నమ్మినందుకు హింసలు అనుభవిస్తున్న వాళ్లకు ఈ లోకపు మనుషులతో కలిసి నివసించడానికి అర్హత లేదు. వీళ్ళలో కొంతమంది ఎడారుల్లో కొండల్లో తిరుగుతూ గడిపారు. కొంతమంది గుహల్లో, భూమి కింద సొరంగాల్లో బతికారు.
\s5
\p
\v 39 వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించి దేవుడు వాళ్ళని ఆమోదించాడు గానీ తాను వాగ్దానం చేసింది మాత్రం వాళ్లకి ఇవ్వలేదు.
\v 40 వాగ్దానం చేసిన దానిని వెంటనే ఇవ్వడం కంటే ఆలస్యంగా ఇవ్వడమే మరింత మేలైనదని దేవుడికి ముందుగానే తెలుసు. మనం లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కాదు కాబట్టి వాళ్ళూ మనమూ కలిసినప్పుడే దేవుడు ఇవ్వాలనుకున్నది పొందుతాం.
\s5
\c 12
\p
\v 1 దేవుణ్ణి నమ్మాము అని రుజువు చేసుకున్న ఇలాంటి వాళ్ళు ఎంతోమంది గురించి మనకి తెలుసు. కాబట్టి మనల్ని కృంగదీసే బరువులన్నిటినీ వదిలేసి మనల్ని పట్టుకు వేలాడే ప్రతి పాపాన్నీ వదిలించుకుందాం. దేవుడు మనకు ఇచ్చి చేయమని చెప్పే ప్రతిదాన్నీ చివరి వరకూ చేస్తూ మన పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తుదాం.
\v 2 యేసును గురించి ఆలోచిస్తూ మన పూర్తి ధ్యాస అంతా ఆయన మీద పెడదాం. ఆయనే మనల్ని నడిపించేవాడు, మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసేవాడు. ఆయనే సిలువలో భయంకరమైన హింస అంతా భరించి తనను అవమాన పరుస్తున్న వాళ్ళని ఎంత మాత్రం లెక్క చెయ్యలేదు. తరవాత భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోయే ఆనందం కోసమే వీటన్నిటినీ ఆయన భరించాడు. ప్రస్తుతం ఎక్కడైతే దేవుని అధికారం ఉందో ఆ పరలోకంలో ఆయన దేవుని కుడివైపున కూర్చుని ఉన్నాడు.
\p
\v 3 పాపాత్ములైన ప్రజలు అసహ్యకరంగా ఆయనకు వ్యతిరేకంగా చేసిన దాన్నంతా యేసు ఓపికగా భరించాడు. యేసు ఆదర్శాన్ని చూసి మీ హృదయాలనూ, మనసులనూని బలపరచుకోండి. దీనివల్ల ఇంక మీరు దేవుణ్ణి వదలిపెట్టరు, నిరుత్సాహపడరు.
\s5
\p
\v 4 పాపం విషయంలో మీరు శోధనలు ఎదుర్కొంటూ వాటికి వ్యతిరేకంగా మీరు ఆ పాపాన్ని అడ్డుకొనే విషయంలో పెనుగులాడేటప్పుడు యేసు చేసినంతగా ఇంతవరకు మీరు రక్తం కార్చలేదు, చనిపోలేదు.
\v 5 సొలోమోను తన కుమారుడికి చెప్పిన ఈ మాటలుని మరచిపోవద్దు. దేవుని పిల్లలుగా అవే మాటలతో ఆయన మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు: "నా కుమారుడా, ప్రభువు నిన్ను క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు మనసు పెట్టు. ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు నిరుత్సాహ పడవద్దు.
\q
\v 6 ఎందుకంటే ప్రభువు ప్రేమించిన ప్రతివాడినీ క్రమశిక్షణలో పెడతాడు.
\q తన స్వంత వాళ్ళు అనిపించిన ప్రతివాడినీ ఆయన తీవ్రంగా సరి చేస్తాడు."
\s5
\p
\v 7 దేవుడు మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి హింసలు భరించడం ఒకవేళ అవసరమేమో. ఆయన మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టినప్పుడు, పిల్లల్ని సరిదిద్దే ఒక తండ్రిలాగా, మిమ్మల్ని తన పిల్లల్లాగా ఆయన భావిస్తాడు. తండ్రులందరూ తమ పిల్లల్ని క్రమశిక్షణలో పెడతారు.
\v 8 కాబట్టి ఒకవేళ దేవుడు మిమ్మల్ని తన పిల్లలుగా భావించి క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు మీకు అలాంటి అనుభవమే లేకపోతే మీరు ఆయన నిజమైన పిల్లలు కాదన్నమాట. అప్పుడు మీరు క్రమశిక్షణ చేసే తండ్రి లేని అక్రమ సంతానం అన్నమాట.
\s5
\p
\v 9 ఇంకా చెప్పాలంటే ఈ లోకంలోని తండ్రులు మనం చిన్న వాళ్ళంగా ఉన్నప్పుడు మనల్ని క్రమశిక్షణలో పెడతారు. వాళ్ళు అలా చేసినందుకు మనం వాళ్ళని గౌరవించాం. అయితే అంతకన్నా ఎక్కువైన మన ఆత్మీయ తండ్రి మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు మనం అంతకన్నా ఎక్కువగా దాని కింద ఉండడానికి సిద్ధంగా ఉంటే మనం శాశ్వతంగా జీవిస్తాం.
\v 10 మన తండ్రులు వాళ్లకి మంచిది అని తోచింది కొంతకాలం మనకి నేర్పించి క్రమశిక్షణలో పెంచారు. అయితే దేవుడెప్పుడూ తన పరిశుద్ధతను పంచుకోడానికి మన మంచి కోసమే మనల్ని క్రమశిక్షణలో పెడుతూ మనకి సహాయపడతాడు.
\v 11 దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు దానిలో సంతోషం ఏమీ ఉండదు. పైపెచ్చు అది మనకు బాధాకరంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఈ క్రమశిక్షణను అలవాటు చేసుకుంటారో వాళ్ళు యథార్థంగా జీవించడం నేర్చుకుంటారు. అది మనసుకు శాంతినిస్తుంది.
\s5
\p
\v 12 కాబట్టి ఆత్మీయంగా అలసిపోయినట్టుగా చేతలుడిగిపోయినట్టుగా ఉండడం మాని దేవుని క్రమశిక్షణ మిమ్మల్ని పునరుజ్జీవింపజేస్తుందని నమ్మండి.
\v 13 క్రీస్తును అనుకరిస్తూ ముందుకు కదలండి. దానివల్ల బలహీనంగా ఉన్న విశ్వాసులు మిమ్మల్ని చూసి ఆత్మీయంగా బలం తెచ్చుకొని క్రీస్తులో నమ్మకం ఉంచడం వల్ల చచ్చుబడిపోకుండా ఉంటారు. అప్పుడు ఆత్మీయంగా గాయపడి పనికి రాకుండా ఉన్న మోకాళ్ళు తిరిగి బలం పుంజుకుంటాయి.
\s5
\p
\v 14 మనుషులందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించండి. పరిశుద్ధంగా ఉండడానికి మీ శాయశక్తులా ప్రయత్నించండి. ఎందుకంటే పరిశుద్ధంగా లేకపోతే ఎవరూ దేవుణ్ణి చూడలేరు.
\v 15 మీలో ప్రతి ఒక్కళ్ళూ దేవుడు మన విషయంలో చేసే కృపాకార్యాన్ని అనుభవించేలా చూసుకోవాలి. దేవుని కృపా కార్యాలకు మనం తగినవాళ్ళం కాదు. మీలో ఎవరూ ఇతరుల విషయంలో చెడుగా ప్రవర్తించకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఆ పాపం చిన్న వేరులాగా మొలకెత్తి తరవాత పెద్ద వృక్షమై విశ్వాసులెంతోమంది పాపం చేయడానికి దారి తీస్తుంది.
\v 16 ఏశావు లాగా అనైతికంగా అవిధేయులుగా ఉండకండి. అతడు ఒక్క పూట భోజనం కోసం తన పెద్ద కుమారుడి హక్కును మార్చేసుకున్నాడు.
\v 17 ఆ తరవాత ఏశావు తన తండ్రి ఇస్సాకు నుండి దీవెనలు పొందాలని ఆశపడి, ఆ హక్కును మళ్ళీ పొందాలని ఆశించాడు. ఏశావు కోరినట్టుగా చేయడానికి ఇస్సాకు ఒప్పుకోలేదు. ఏశావు తాను చేసిన దానిని మార్చుకోవాలని కన్నీళ్ళతో ప్రయత్నించినా పరిస్థితుల్ని చక్కదిద్దే దారి లేకపోయింది.
\s5
\p
\v 18 ఇక దేవుని విషయానికొస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్న సీనాయి కొండలాంటి అనుభవాలు మీకెదురు కాలేదు. స్వయంగా దేవుడే దిగి వచ్చిన ఆ సీనాయి కొండను ముట్టుకోవద్దని దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అగ్నితో మండుతూ ఉన్న కొండ దగ్గరకు వచ్చారు. మబ్బుగా, చీకటిగా ఉంది భయంకరమైన తుఫాను అక్కడ ఉంది.
\v 19 వాళ్ళు అక్కడ బాకా శబ్దం విన్నారు. తరవాత దేవుడు పలికిన మాటలు విన్నారు. అవి చాలా శక్తివంతమైన మాటలు. కాబట్టి వాళ్ళు ఇలా ఇంకెప్పుడూ తమతో మాట్లాడవద్దని దేవుణ్ణి బతిమాలుకున్నారు.
\v 20 అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే, "ఎవరైనా సరే, ఒక వ్యక్తి గానీ, జంతువు గానీ ఈ పర్వతాన్ని ముట్టుకుంటే గనక వాళ్ళని తప్పకుండా మీరు చంపేయాలి." దీనికే ఇశ్రాయేలు ప్రజలు భయపడి పోయారు.
\v 21 నిజంగా పర్వతం మీద ఏం జరిగిందో చూసిన తరవాత మోషే భయపడి పోయి "నేనెంతో వణుకుతున్నాను, హడలిపోయాను” అన్నాడు.
\s5
\p
\v 22 ఇప్పుడు మీరు పరలోకంలో నివసించే ఆ దేవుని సన్నిధికి అంటే, పరలోకపు "కొత్త యెరూషలేము” కు వచ్చారు. ఇది ఇశ్రాయేలులో సీయోను కొండ మీద కట్టిన ఈ భూలోకపు యెరూషలేములో మీ పితరులు ఆరాధించినట్టుగా ఉంది. లెక్క పెట్టలేనంత మంది దూతలు గుమిగూడి ఉత్సహించే చోటికి మీరు వచ్చారు.
\p
\v 23 జేష్ఠ కుమారుని ఆధిక్యతలు పొందిన విశ్వాసులందరూ ఉన్న సమాజానికి, ఎవరి పేర్లయితే దేవుడు పరలోకంలో నమోదు చేశాడో అలాంటి చోటికి మీరు వచ్చారు. ప్రతి ఒక్కరికీ న్యాయం తీర్చే దేవుని దగ్గరకి మీరు వచ్చారు. దేవుని ప్రజల ఆత్మల దగ్గరకి మీరు వచ్చారు. ఈ ప్రజలు చనిపోక ముందు భూలోకంలో సత్ప్రవర్తనతో జీవించారు. ఇప్పుడు దేవుడు ఈ పరలోకంలో వాళ్ళని పరిపూర్ణులుగా చేశాడు.
\v 24 దేవుడికీ మనకూ మధ్య ఒక కొత్త ఒప్పందం అమర్చి పెట్టిన యేసు ప్రభువు దగ్గరికి మీరు వచ్చారు. ఆయన సిలువలో చనిపోయినప్పుడు ప్రవహించిన రక్తం వల్ల ఈ కొత్త ఒప్పందం జరిగింది. ఈ రక్తం వల్లే దేవుడు మనల్ని క్షమించడం సాధ్యం అయ్యింది. హేబెలు రక్తం కంటే యేసు రక్తం మనకు శ్రేష్టమైన వాగ్దానాలను స్థిరపరచింది.
\s5
\p
\v 25 దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని నిరాకరించకుండా జాగ్రత్త పడండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని హెచ్చరికలు వినకుండా పెడచెవిని పెట్టడం వల్ల దేవుని శిక్ష నుండి తప్పించుకోలేక పోయారు. ఆయన పరలోకం నుండి చెప్తున్న మాటల్ని, హెచ్చరికల్ని, మనం గనక తిరస్కరిస్తే, కచ్చితంగా శిక్షను తప్పించుకోలేం.
\v 26 సీనాయి పర్వతం నుండి దేవుడు పలికిన మాటలకు భూమి వణికిపోయింది. అయితే ఇప్పుడు ఆయన మళ్ళీ ఒక వాగ్దానం చేస్తున్నాడు: "ఇంకొకసారి నేను భూమినే కాదు, ఆకాశాలను కూడా వణికిస్తాను."
\s5
\p
\v 27 "మళ్ళీ”, "ఇంకొకసారి” అనే మాటలు దేవుడు భూమి మీద ఉన్నవాటినీ, ఆయన చేసిన సృష్టినంతటినీ కదిలించి తీసివేస్తాడని సూచిస్తున్నాయి. పరలోకంలో ఉన్న కదలనివి శాశ్వతంగా ఉండడం కోసం ఆయన ఇలా చేయొచ్చు.
\v 28 కాబట్టి మనం ఆయన రాజ్యంలో సభ్యులుగా ఉండబోతున్నాం. ఏదీ మనల్ని కదలించలేదు. అందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ రాజ్యంలో ఆయన్ని ఆరాధించడం ద్వారా ఆయనకు చెందాల్సిన గొప్ప ఘనతనూ, గౌరవాన్నీ ఆపాదించడం ద్వారా ఆయన్ని సంతోషపెడదాం.
\v 29 మనం ఆరాధించే దేవుడు అపవిత్రమైన ప్రతిదాన్నీ దహించే అగ్నిలాంటి వాడు!
\s5
\c 13
\p
\v 1 మీ సాటి విశ్వాసుల్ని ప్రేమిస్తూ ఉండండి.
\v 2 అవసరంలో ఉన్న యాత్రికులకు ఆతిథ్యం ఇవ్వడం విస్మరించకండి. అపరిచితుల్ని ఆహ్వానించే క్రమంలో కొంతమంది తెలియకుండానే దేవదూతల్ని కూడా తమ ఇంటికి ఆహ్వానించారు.
\s5
\p
\v 3 విశ్వాసులు కావడం వల్ల చెరసాల పాలైన వాళ్లకు సహాయం చేయడం మర్చిపోకండి. వాళ్ళతో పాటు హింసలు పొందుతున్నట్టు గా భావించి వాళ్ళను పరామర్శ చేయండి.
\p
\v 4 వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు ప్రతి విషయంలో ఒకళ్ళ నొకళ్ళు గౌరవించుకొని పవిత్రంగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు నమ్మకస్తులుగా కట్టుబడి ఉండండి. లైంగిక అవినీతిపరుల్నీ, వ్యభిచారుల్నీ దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు.
\s5
\p
\v 5 ఎప్పుడూ డబ్బు యావ లేకుండా జీవించండి. ఎక్కువ ఉన్నా, కొంచెమే ఉన్నా, ఎంత ఉన్నా సంతోషంగా ఉండండి. మోషే ద్వారా దేవుడు రాసిన మాటలు గుర్తు చేసుకోండి:
\q "నేను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను.
\q నేను నీకు సమకూర్చి పెట్టడం ఎప్పుడూ మానను."
\p
\v 6 కాబట్టి కీర్తనకారుడు చెప్పినట్టు మనం ధైర్యంగా ఇలా చెప్పగలం,
\q "ప్రభువే నాకు సహాయుడుగా ఉండగా ఇక నేను ఏమాత్రం భయపడను! దేవుడు నాకు సహాయం చేయకుండా మనుషులు ఎవరూ అడ్డుపడ లేరు."
\s5
\p
\v 7 మీ ఆత్మీయ నాయకులు క్రీస్తు గురించిన దేవ సువార్తను మీకు బోధించారు. వాళ్ళు మార్గదర్శకులుగా ఎలాంటి జీవితం గడిపారో, ఎలా వాళ్ళు క్రీస్తును నమ్మారో జ్ఞాపకం చేసుకోండి.
\v 8 యేసు క్రీస్తు నిన్న, ఇప్పుడు, ఎప్పుడూ ఉన్నట్టుగా శాశ్వతంగా ఒకేలాగా ఉంటాడు.
\s5
\p
\v 9 ఇతరులు దేవుని గురించి చెప్పే రక రకాల విషయాలు మిమ్మల్ని తప్పుదారి పట్టించనివ్వకండి. మేమెప్పుడూ మీకు కొత్త విషయాలు బోధించలేదు. దేవుని కృపా కార్యాలతోనే మనకు నిజమైన బలం వస్తుంది గానీ ఏది తినొచ్చు, ఏది తినకూడదు అనే రక రకాల నియమాలు ఆచరించడం వల్ల ఏమీ రాదు.
\p
\v 10 ప్రత్యక్ష గుడారంలో పని చేసేవాళ్లకి క్రీస్తును ఆరాధించే మన బలిపీఠం దగ్గర తినే హక్కు లేదు.
\v 11 పాపాల గురించి బలి అర్పించిన జంతువుల రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు తెచ్చిన తరవాత వేరే వ్యక్తులు మిగిలిన ఆ జంతు కళేబరాన్ని శిబిరం బయట కాల్చివేస్తారు.
\s5
\p
\v 12 అదే విధంగా మనల్ని తన ప్రజలుగా చేసుకోవడం కోసం మరి ముఖ్యంగా దేవునికి ప్రత్యేక పరచడానికి యేసు ప్రభువు కూడా యెరూషలేము నగర ద్వారం బయట హింసలపాలై చనిపోయాడు. మన పాపాలకు బలిగా తన స్వంత రక్తాన్ని చిందించడం ద్వారా దీన్ని జరిగించాడు.
\p
\v 13 కాబట్టి మనం రక్షణ పొందాలంటే యేసు దగ్గరకు వెళ్ళాలి. మన నియమాలనూ, ఆచారాలనూ పక్కన పెట్టి, మనుషులు యేసును అవమానించినట్టుగానే మనం కూడా అవమానాల పలు కావాలి.
\v 14 ఇక్కడ లోకంలో విశ్వాసులమైన మనకు యెరూషలేము లాంటి పట్టణం లేదు, శాశ్వతంగా నిలిచిపోయే పరలోక పట్టణం కోసం మనం ఎదురుచుస్తున్నాము.
\s5
\p
\v 15 యేసు మనకోసం చనిపోయాడు కాబట్టి మనం ఎప్పుడూ ఆయన్ని స్తుతించాలి. జంతుబలులకు బదులుగా మనం ఆయనకి ఇవ్వగలిగే బలి ఇదే. మనం క్రీస్తును నమ్ముతున్నామని బహిరంగంగా ఇతరులకు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
\p
\v 16 ఇతరుల కోసం ఎప్పుడూ మంచి పనులు చేయండి. మీకున్నది ఇతరులతో పంచుకోండి. ఎందుకంటే ఇలాంటి పనులు చేయడమే దేవునికి మీరర్పించే ఇష్టమైన బలి.
\p
\v 17 మీ నాయకులకు లోబడి ఉండండి. వాళ్ళు ఏది చెప్తే అది చేయండి. ఎందుకంటే మొదటి నుండీ వాళ్ళే మీ యోగక్షేమాలు చూస్తున్నవాళ్ళు. ఒకానొక రోజు వాళ్ళు తాము చేసిన దానిని దేవుడు అంగీకరించాడా లేదా అని ఆయన ముందు నిలబడాల్సి ఉంటుంది. వాళ్లకి లోబడండి. అప్పుడే వాళ్ళు మీ ఆత్మలను కావలి కాసే పనిని విచారంగా కాకుండా సంతోషంగా చేస్తారు. వాళ్లకి విచారం కలిగిస్తే అది మీకు ఎంత మాత్రం మంచిది కాదు.
\s5
\p
\v 18 నా గురించీ, నాతో ఉన్నవాళ్ళ గురించీ ప్రార్థన చేయండి. నేను దేవునికి ఏవిధంగానూ అసంతృప్తి కలిగించ లేదని నాకు కచ్చితంగా తెలుసు. ప్రతి విషయంలో యోగ్యంగా జీవించడానికే ప్రయత్నించాను.
\v 19 మీ దగ్గరికి రావడానికి ఎలాంటి అడ్డంకులు కలగకుండా నా గురించి బలంగా ప్రార్థన చేయమని మిమ్మల్ని బతిమిలాడుతున్నాను.
\s5
\p
\v 20 యేసు ప్రభువు మనకు సమస్తం సమకూర్చి పెడతాడు, మనల్ని కాపాడతాడు, గొర్రెల కాపరి గొర్రెల్ని నడిపించినట్టుగా మనల్ని నడిపిస్తాడు. మనకు మనశ్శాంతి నిచ్చే దేవుడు యేసు ప్రభువును మృతుల్లో నుండి లేపాడు. క్రీస్తు సిలువలో చనిపోయి కార్చిన రక్తం వల్ల మనతో నిత్యమైన ఒప్పందాన్ని సుస్థిరం చేశాడు.
\v 21 కాబట్టి ప్రతి మంచి విషయంలో ఆయన కోరినట్టుగా ఆయన ఇష్టాన్ని జరిగించడానికి మిమ్మల్ని ఆయన సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాను. మనకోసం తనకు తానే అర్పించుకొన్న యేసును మనం వెంబడించడాన్ని గమనిస్తూ ఆయన దృష్టిలో ఇష్టమైన వాటిని యేసు క్రీస్తు ద్వారా మనలో జరిగిస్తాడు. ప్రజలందరూ యేసు క్రీస్తును నిత్యమూ స్తుతిస్తారు గాక, ఆమెన్!
\s5
\p
\v 22 నా సాటి విశ్వాసులారా, ఈ చిన్న ఉత్తరంలో రాసిన మాటల్ని ఓపికగా గమనించండి. కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడానికే ఈ మాటలు రాస్తున్నాను.
\p
\v 23 మన సాటి విశ్వాసి తిమోతి చెరసాల నుండి విడుదల అయ్యాడు. ఇది మీకు తెలియాలని చెప్తున్నాను. అతడు నా దగ్గరకి తొందరగా వస్తే నేను మిమ్మల్ని చూడడానికి వచ్చేటప్పుడు నాతోబాటు వస్తాడు.
\s5
\p
\v 24 మీ పట్టణంలో దేవునికి చెందిన మీ ఆత్మీయ నాయకులకూ మీ సాటి విశ్వాసులందరికీ నా వందనాలు తెలియజేయండి. ఇక్కడ ఉన్న విశ్వాసులందరూ ఇటలీ నుండి వచ్చిన విశ్వాసులందరూ మీకు వందనాలు తెలుపుతున్నారు.
\p
\v 25 దేవుడు మిమ్మల్ని తన కృపతో ప్రేమించి కాపాడును గాక.

211
60-JAS.usfm Normal file
View File

@ -0,0 +1,211 @@
\id JAS - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h యాకోబు రాసిన పత్రిక
\toc1 యాకోబు రాసిన పత్రిక
\toc2 యాకోబు రాసిన పత్రిక
\toc3 jas
\mt1 యాకోబు రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కట్టుబడి దేవునికి సేవ చేస్తున్నవాడనైన యాకోబు అనే నేను క్రీస్తులో విశ్వాసముంచి ప్రపంచమంతటికీ చెదిరిపోయిన ఇశ్రాయేలు పన్నెండు వంశాల వారికి ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
\p
\v 2 నా తోటి విశ్వాసుల్లారా రక రకాల హింసలను, కష్టాలను మీరు అనుభవిస్తున్నప్పుడు అది అంతా సంతోషంగానే పరిగణించండి.
\v 3 మీకు కలిగే హింసలలో కష్టాలలో దేవునిలో నమ్మిక ఉంచడం ద్వారా ఆ నమ్మికే మీకు కలిగే మరిన్ని హింసలను, కష్టాలను భరించడం ఎలానో నేర్పిస్తుందని అర్థం చేసుకోండి.
\s5
\v 4 మీరు పొందే హింసలనూ, కష్టాలనూ చివరివరకూ భరించడం ద్వారా క్రీస్తును అన్ని విషయాలలోనూ మీరు అనుసరించిన వారు కావొచ్చు. అప్పుడు మీరు మంచి చేయడంలో ఎంతమాత్రమూ తప్పి పోరు.
\v 5 ఏం చేయాలో తెలుసుకోవాలని మీలో ఎవరైనా అనుకుంటే అతడు ధారాళంగా ఇచ్చే దేవుణ్ణి అడగాలి. దేవుడు ఎవరైనా తన దగ్గరికి వచ్చి ఏదైనా అడిగితే ఆయన ఎంత మాత్రమూ వాళ్ళపై కోప్పడడు.
\s5
\p
\v 6 అయితే మీరు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన తప్పక జవాబు ఇస్తాడని నమ్మాలి. అంతే కానీ ఆయన నాకు జవాబు ఇస్తాడో లేదో, ప్రతి సారీ సహాయం చేస్తాడో లేదో అని అనుమాన పడకూడదు. ఎందుకంటే ఎవరైతే దేవుని అనుగ్రహంపై నిత్యం అనుమానపడతారో వాళ్ళు దేవుణ్ణి అనుసరించేవారు కారు. అటువంటి వ్యక్తులు సముద్రపు అలలు గాలికి ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి కొట్టుకుపోతూ ఉన్నట్టు ఎప్పుడూ ఒకే దిశలో సాగలేనివాళ్ళుగా ఉంటారు.
\v 7 నిజానికి అటువంటి అనుమానం ఉన్న వారు తాము కోరింది ఏదైనా ప్రభువైన దేవుడు చేస్తాడని ఆలోచించటం వ్యర్ధం.
\v 8 వారు యేసును అనుసరించాలా లేదా అని నిర్ణయించుకోలేని వాళ్ళు. వీరు తాము చేస్తామని చెప్పింది చేయని వారు.
\s5
\p
\v 9 విశ్వాసుల్లో పేదలైన వాళ్ళు తప్పక సంతోషించాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళని సన్మానించాడు.
\v 10 విశ్వాసుల్లో ధనవంతులైన వాళ్ళు తప్పక సంతోషించాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళను వినయవంతులుగా అణుకువతో వుండే వాళ్ళుగా చేశాడు. వాళ్ళ అణుకువతనం వాళ్ళని యేసు క్రీస్తులో నమ్మిక ఉంచడానికి సహాయ పడుతుంది. ఎందుకంటే అడివి గడ్డి పువ్వు వాడిపోయినట్టు వాళ్ళ ఐశ్వర్యం ఏదో ఒక నాడు వాళ్ళ దగ్గిరనుండి వెళ్లిపోవచ్చు.
\v 11 సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎండ వేడిమి పెరుగుతున్నకొద్దీ ఆ వేడి గాలులకు ఆ పూల మొక్కల్లోని తడిని ఆ గాలులు పీల్చివేయడం వల్ల ఆ పూవులు వాడిపోయి తలలు వాలుస్తాయి. చివరకు ఆ మొక్క అందవిహీనమై చనిపోతుంది. చనిపోయిన పూల మొక్కలానే ధనవంతులైన మనుషులు తమ సంపాదనలో పడి చనిపోతారు.
\s5
\v 12 కష్టమైన దారుల్లో నడుస్తూ భరిస్తున్న వాళ్ళను దేవుడు గొప్పగా సన్మానిస్తాడు. ఎందుకంటే తనను ప్రేమించే వాళ్ళందరికీ ఆయన చేసిన వాగ్దానం ప్రకారం దేవుడు వాళ్ళందరికీ ప్రతిఫలంగా నిత్యజీవాన్ని ఇస్తాడు.
\p
\v 13 మనం పాపపు ఆలోచనతో ప్రలోభాలకు లోనైనపుడు దేవుడే మనల్ని పాపపు ప్రలోభాలతో శోధిస్తున్నాడని అనుకోరాదు. ఎందుకంటే దేవుణ్ణి చెడు చేయటానికి ఎవరూ ప్రేరేపించలేరు. అలాగే దేవుడు ఎవర్నీ చెడు చెయ్యమని ప్రేరేపించడానికి ప్రయత్నించడు.
\s5
\v 14 అయితే ప్రతిఒక్కరూ చెడు చెయ్యాలని అనుకుంటున్నారు కాబట్టే, వాళ్ళు ఆ పాపపు ఉచ్చులో పడ్డవాళ్ళలా పాపపు పనులు చేస్తారు.
\v 15 పాపపు కార్యాలు చేయాలని కోరిక మనసులో ఉన్నవాళ్ళు కాబట్టే, వాళ్ళు ఆ కార్యాలు చేయడం ప్రారంభిస్తారు. వీళ్ళకు అలాటివి చేయడం ఒక అలవాటుగా మారిపోతుంది. అయితే వీళ్ళు తమ పాపపు స్వభావం నుంచి తప్పుకోక పోతే వాళ్ళు దేవునికి ఇక ఎప్పటికీ దూరం అవుతారు.
\p
\v 16 నేను ప్రేమిస్తున్న నా తోటి విశ్వాసుల్లారా, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం మానండి.
\s5
\v 17 పరిపూర్ణమైనదీ నిజంగా మంచిదీ అయిన ప్రతి బహుమతీ పరలోకంలోఉన్న మన తండ్రి అయిన దేవుని నుండి వస్తుంది. ఆయన మన జీవితాలకు వెలుగిచ్చే నిజమైన దేవుడు. మన నీడ కనిపించి, మళ్ళీ అదృశ్యమైపోయినట్టుగా ఈ సృష్టిలోనివి మారి పోతాయి. కానీ దేవుడు ఎన్నడూ మారని వాడు. ఆయన ఎప్పుడూ మంచి వాడే.
\p
\v 18 మనం ఆయన సత్య సువార్తలో నమ్మిక ఉంచినప్పుడు, మనకు ఆత్మీయ జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసులో విశ్వాసముంచిన విశ్వాసులు నిజమైన ఆత్మీయ జీవితాన్ని పొందిన మొదటి వ్యక్తులు అయ్యారు. ఈ ఆత్మీయ జీవితం యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే ఇవ్వగలడు.
\s5
\p
\v 19 నేను ప్రేమిస్తున్న నా తోటి విశ్వాసుల్లారా, దేవుని సత్య సువార్తకు మీలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని మీకు తెలుసు. మీరు మీ సొంత ఆలోచనలతో తొందరపడి మాట్లాడకూడదు. అలాగే ప్రతి విషయానికీ త్వరపడి కోప్పడటం తగదు.
\v 20 ఎందుకంటే మనం ఇలా ప్రతిదానికీ కోప్పడుతుంటే, మనం చేయాలని దేవుడు కోరుకున్న నీతికరమైన పనులు మనము చేయలేము.
\v 21 కాబట్టి అన్ని రకాల పాపకృత్యాలు చేయటం మానండి. దేవుడు మీ అంతరంగాలలో నాటిన సువార్తను వినయంతో అంగీకరించండి. ఎందుకంటే ఆయన మాత్రమే మిమ్మల్ని రక్షించే శక్తి ఉన్న వాడు.
\s5
\p
\v 22 తన సువార్తలో దేవుడు మీకు ఆజ్ఞాపించినది చేయండి. ఆయన చెప్పినది విని ఊరుకోవద్దు. ఎందుకంటే ఆయన చెప్పినది వినటం మాత్రమే చేసి, దానిని పాటించని వ్యక్తులు దేవుడు తమను రక్షిస్తాడని తప్పుగా ఆలోచిస్తున్నారు.
\v 23 కొంతమంది దేవుని సువార్త వింటారు. కానీ ఆ సువార్త ఏం చెబుతుందో దాని ప్రకారం చేయరు. ఇలాంటి వ్యక్తులందరూ తమ ముఖాన్ని అద్దంలో చూసుకొని అవతలకు వెళ్ళగానే మర్చిపోయే వ్యక్తులు.
\v 24 ఆ వ్యక్తి తనను తాను అద్దంలో చూసుకున్నప్పటికీ అతడు అద్దం ముందునుంచి అవతలకు వెళ్ళగానే తాను ఎలా ఉన్నాడో వెంటనే మర్చిపోయిన వాడిలా అవుతాడు.
\p
\v 25 అయితే పరిపూర్ణమైనదీ, మనుషులను స్వతంత్రులనుగా చేసేదీ దేవుడు కోరుతున్నదీ అయిన దాన్ని స్వచ్చందంగా చేసేలా ప్రేరేపించే శక్తివంతమైన దేవుని సువార్తను ఇతరులు నిశితంగా పరిశీలిస్తున్నారు. వాళ్ళు దేవుని సువార్తను ఎదో వినీ విననట్టు కాక దాన్ని మర్చిపోకుండా కొనసాగిస్తూ దేవుడు చేయమని చెప్పినట్టు చేస్తే వాళ్ళు చేసే పనులవల్ల దేవుడు తప్పక వాళ్ళను ఆశీర్వదిస్తాడు.
\s5
\p
\v 26 కొంతమంది తాము దేవుణ్ణి సరిగ్గానే ఆరాధిస్తున్నామని అనుకుంటున్నారు. కానీ వారి నోటివెంట చెడ్డ మాటలు, బూతులూ అలవాటుగా, అలవోకగా వస్తుంటాయి. అటువంటి వ్యక్తులు తాము దేవుణ్ణి సరిగ్గానే ఆరాధిస్తున్నామని అనుకోవటం చాలా తప్పు. వీళ్ళు ఈ విధంగానే చేస్తూ దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఫలితం లేదు.
\v 27 దేవుడు మనకు చెప్పిన విషయాలలోఒకటేమిటంటే కష్టాలలోను హింసలలోను ఉన్నఅనాధలను వితంతువులను జాగ్రత్తగా చూసుకోవడం. దేవునికి విధేయత చూపించని వాళ్ళలా కాకుండా అనైతికంగా ఆలోచించకుండా, ప్రవర్తించకుండా దేవుడు చెప్పినట్లు చేస్తూ అనాధలపట్ల, వితంతువుల పట్ల దయగా ఉన్న వాళ్ళు మన తండ్రి అయిన దేవుణ్ణి నిజంగా ఆరాధించే వాళ్ళు. వాళ్ళనే దేవుడు ఆమోదిస్తాడు.
\s5
\c 2
\p
\v 1 నా సోదరి, సొదరులారా, మీరు కొంతమందిని మిగతా వాళ్ళకంటే గొప్పవాళ్ళుగా భావించి గౌరవించడం చేయవద్దు. అందరినీ సమానంగానే గౌరవించి, ప్రేమించండి. అలాగే అందరికంటే అన్నిటికంటే మహోన్నతుడైన మన ప్రభువైన యేసుక్రీస్తులో నమ్మిక ఉంచండి.
\v 2 ఉదాహరణకు, ఒకవేళ ఒకవ్యక్తి చేతికి బంగారు ఉంగరాలు ధరించి, ఖరీదైన బట్టలు ధరించి మీ సమావేశ మందిరాల్లోకి వచ్చాడు అనుకోండి, అదే సమయంలో పేదవాడైన ఒకవ్యక్తి కూడా చిరిగిన బట్టలతో లోపలికి వస్తున్నాడు అనుకోండి.
\v 3 అప్పుడు మీరు ఖరీదైన బట్టలు ధరించిన వ్యక్తితో దయచేసి ఇక్కడకు రండి, ఈ చక్కని కుర్చీలో ముందు వరసలో కూర్చోండి అంటూ ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టారని అనుకుందాము. అదే సమయంలో పేదవాడితో నువ్వు అలా దూరంగా నిలబడు, లేదా ఒక ప్రక్కన నేల మీద కూర్చో అంటూ అతణ్ణి చిన్నచూపు చూస్తూ విసుక్కున్నారనుకోండి
\v 4 మీరు చూపిస్తున్న ఈ తేడాతో ఒకరితో నొకరు తీర్పు తీర్చుకున్నారు.
\s5
\p
\v 5 నేను ప్రేమిస్తున్న నా సోదరి, సోదరుల్లారా నేను చెబుతున్న మాటలను వినండి. ఎలాటి విలువ, గౌరవం లేని వాళ్ళుగా కనిపిస్తున్న ఈ పేదవాళ్ళను దేవుడు తనపై ఎంతో గొప్ప నమ్మిక ఉన్నవాళ్ళుగా ఎంచుకున్నాడు. అందువల్ల ఆయన ప్రతి ఒక్కరినీ, ప్రతి దాన్నీ పాలించేటప్పుడు, ఆయన వీళ్ళకు గొప్ప అధికారాలను, బహుమతులను ఇస్తాడు. తనను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఇలాగే ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు.
\v 6 అయితే మీరు పేదవాళ్ళను అవమానిస్తారు. అయితే మిమ్మల్ని అనేక బాధలకు గురి చేసేది ఈ ధనవంతులే, పేదవాళ్ళు కాదు. ఒకసారి దీన్ని గూర్చి ఆలోచించండి. ఈ ధనవంతులు మిమ్మల్ని బలవంతంగా న్యాయ స్థానాలకు ఈడ్చి, న్యాయమూర్తుల ముందు మీపై అనేక నిందారోపణలను చేస్తారు.
\v 7 మన ప్రభువైన యేసుక్రీస్తు మన స్తుతులకు పూర్తిగా అర్హుడు. మనం ఆయనకు చెందిన వాళ్ళం కాగా, అలాంటి మన ప్రభువైన యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా చెడుగా మన ఎదుటే మాట్లాడే వాళ్ళే ఈ ధనవంతులు.
\s5
\p
\v 8 మన వాళ్ళు లేఖనాల్లో రాసిన ధర్మశాస్త్రాన్ని మీరు పాటిస్తున్నట్టయితే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి అనే ఆజ్ఞను మీరు చూస్తారు. మీరు ఇతరులను, మీ పొరుగు వాళ్ళను ప్రేమిస్తే మీరు సరైన విధంగా ప్రవర్తిస్తున్నట్టు అవుతుంది.
\v 9 అలా కాకుండా మీరు కొంతమందినే ఎక్కువగా గౌరవిస్తే, మీరు తప్పు చేస్తున్నారు. దేవుడు చేయమని మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనం పాటించకపోతే, ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించలేదు కాబట్టి, ఆయన మనల్ని వ్యతిరేకిస్తాడు.
\s5
\p
\v 10 దేవుని ధర్మశాస్త్రంలోని ఏదో ఒక ఆజ్ఞను మాత్రమే పాటించకుండా, మిగతా అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నప్పటికీ దేవుడు అలాంటి వాళ్ళను మొత్తం ధర్మశాస్త్రాన్ని మీరిన వారుగానే భావించి దోషులుగా తీర్పు తీరుస్తాడు.
\v 11 ఉదాహరణకు దేవుడు వ్యభిచారం చేయవద్దని చెప్పాడు. అయితే దానితో పాటు దేవుడు హత్య చేయరాదని కూడా చెప్పాడు. అయితే మీరు వ్యభిచారం చేయకపోయినప్పటికీ, ఎవరినైనా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించినట్టే.
\s5
\p
\v 12 దేవుని ధర్మశాస్త్రం ప్రకారం మన పాపాలకు తగిన శిక్ష విధించకుండా తప్పించుకునే మార్గం ఏమిటంటే, ఎప్పుడూ ఇతరులతో సరైన విధంగా మాట్లాడటం, వాళ్ళతో సరైన విధంగా ప్రవర్తించటం.
\v 13 ఎందుకంటే మనలో ఎవరైతే ఇతరులతో దయగా ప్రవర్తించకుండా ఉంటారో, దేవుడు తీర్పు తీర్చేటప్పుడు, వాళ్ళ పట్ల దయగా వ్యవహరించడు. అయితే మనం ఇతరులతో దయగా ప్రవర్తిస్తే, అప్పుడు మనకు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు మనం ఎలాటి భయం లేకుండా ఉండవచ్చు.
\s5
\p
\v 14 నా సహోదరి, సహోదరుల్లారా, కొంతమంది వ్యక్తులు నేను ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను అంటారు. కానీ వాళ్ళు మంచి పనులు చేయరు. వాళ్ళ మాటలకూ చేతలకు పొంతన ఉండదు. వాళ్ళు నమ్ముతున్నామని చెబుతున్న మాటలు వాళ్ళకు ఎలాటి మంచీ చేయవు. వాళ్ళు తమ నమ్మికను మాటల్లో మాత్రమే చూపిస్తే, అటువంటి వాళ్ళను దేవుడు కచ్చితంగా రక్షించడు.
\v 15 మీకు అర్ధమయ్యేలా నేను ఒక ఉదాహరణ చెబుతాను. మన సహోదరుడో, సహోదరియో అనుదినం ఆహరం లేకుండా, బట్టలు లేకుండా ఉన్నారనుకుందాం.
\v 16 మీలో ఒకరు వాళ్ళతో "బాధ పడకండి, దూరంగా వెళ్ళండి, చలి కాచుకోండి. మీకు కావలసిన ఆహారాన్ని, బట్టలను సంపాదించుకోండి" అంటూ వాళ్ళ శరీరాలను కాపాడుకోవడానికి కావలసిన వాటిని ఇవ్వకుండా, వట్టి మాటలు చెప్పినందువల్ల వాళ్ళకు ఏం ప్రయోజనం?
\v 17 అదే విధంగా ఇతరులకు, మీ పొరుగు వాళ్ళకు ఉపయోగపడే మంచి పనులు మీరు చేయకుండా, క్రీస్తులో నమ్మిక ఉంచామని వట్టిమాటలే మీరు చెబుతుంటే, చనిపోయిన శవం ఎందుకు పనికిరానట్లుగానే, ఆ మాటలు ఎందుకు పనికి వచ్చేవి కావు. అంటే మీకు నిజంగా క్రీస్తులో నమ్మిక లేదు.
\s5
\p
\v 18 అయితే కొంతమంది నాతో ఇలా చెప్పవచ్చు. దేవుడు కొంతమందిని తనలో కేవలం విశ్వాసముంచడం ద్వారానే రక్షిస్తాడు. అలాగే ఇతరులకు వాళ్ళు చేసిన మంచి పనులను బట్టి రక్షిస్తున్నాడు అని అంటున్నారు. అయితే ఇతరులకు మంచి పనులతో ఉపయోగపడకుండా దేవుడిలో నిజంగా నమ్మిక ఉంచామని మీరు నాకు రుజువు పరచలేరు. కానీ ఇతరులకు మంచి పనుల చేస్తూ ఉపయోగపడటం ద్వారా నేను నిజంగా దేవుడులో నమ్మిక ఉంచానని మీకు నిరూపించవచ్చని అలాంటి వారికి సమాధానం చెబుతున్నాను.
\p
\v 19 నేను చెబుతున్న ఈ విషయాలను గూర్చి ఆలోచించండి. ఈ లోకంలో నిజంగా జీవిస్తున్న వాడు ఆయన ఒక్కడే అని మీరు నమ్ముతున్నారు. మీరు ఆ విధంగా నమ్మడం సరైనదే, అయితే దయ్యాలు కూడా అదే విధంగా నమ్ముతున్నాయి. వాటికి కూడా దేవుడు నిజంగా ఎప్పుడూ జీవిస్తాడని తెలుసు కాబట్టే, తమను శిక్షిస్తాడని తెలుసు. అందుకే ఆయన్ని తలుచుకొని భయంతో వణుకుతున్నాయి.
\p
\v 20 తెలివిలేని మనుషులారా, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అని ఎవరైనా చెబుతూ, మంచి పనులు చేయకపొతే, ఆ మాటలు అతనికి ఏవిధంగానూ ఉపయోగపడవని నేను మీకు రుజువులతో సహా చెప్పగలను.
\s5
\p
\v 21 మనమందరం మన పూర్వికుడైన అబ్రాహామును ఎంతో గౌరవిస్తాము. అతడు దేవుడు తనకు చేయమని చెప్పిన దాన్ని పాటించటానికి ప్రయత్నించాడు. అతడు తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై దేవుని కోసం బలి ఇవ్వడానికి ప్రయత్నించాడు. అతడు దేవుడు తనకు చెప్పినది పాటించటానికి ప్రయత్నించాడు. కాబట్టే దేవుడు అతణ్ణి నీతిమంతుడిగా పరిగణించాడు.
\v 22 ఈ విధంగా అబ్రాహాము దేవునిలో నమ్మిక ఉంచాడు. ఆయన చెప్పినది పాటించి, విధేయత చూపించాడు. అతడు ఆయనకు విధేయత చూపించినప్పుడు, అతడు దేవునిలో ఎందుకోసం నమ్మిక ఉంచాడో, దాన్ని అతడు చేసి ముగించాడు.
\v 23 అబ్రాహాము నిజంగా దేవునిలో నమ్మిక ఉంచాడు. అందువల్లే దేవుడు అతణ్ణి సరైన పనులు చేసే వ్యక్తిగా, నీతిమంతుడిగా చూశాడని మన గ్రంథాల్లో రాసినట్లుగా ఇది జరిగింది. అంతే కాకుండా అబ్రాహాము నా స్నేహితుడు అని కూడా దేవుడు చెప్పాడు.
\p
\v 24 అబ్రాహాము ఉదాహరణ నుంచి మనం గ్రహించేది ఏమిటంటే వ్యక్తులు చేసిన మంచి పనులను బట్టే దేవుడు వాళ్ళను నీతిమంతులుగా భావిస్తాడని, అంతే తప్ప ఆయనలో కేవలం నమ్మకం ఉంచడం వల్ల కాదని మీరు గ్రహించవచ్చు.
\s5
\v 25 అదే విధంగా రాహాబు చేసిన మంచి పనిని బట్టే, దేవుడు ఆమెను నీతిమంతురాలుగా భావించాడు. ఆమె ఒక వేశ్య అయినా కూడా ఆ దేశాన్ని వేగు చూడటానికి వచ్చిన ఇశ్రాయేలు దూతలకు, వాళ్ళు వచ్చిన దారిలో కాకుండా, మరొక దారిలో నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకు సహాయపడింది.
\p
\v 26 ఒక వ్యక్తి ఇక శ్వాస తీసుకోవడం లేనప్పుడు, అతడి శరీరం చనిపోయినట్టే, అది ఇక దేనికీ పనికి రానిదే. అదే విధంగా నేను దేవుణ్ణి నమ్ముతున్నానని చెప్పే వ్యక్తి, ఆ నమ్మిక చొప్పున ఏ మంచీ చేయని వాడైతే దేవునికి అతడు ఎందుకూ పనికి రానివాడే.
\s5
\c 3
\p
\v 1 నా సహోదరీ సహోదరులారా, మీలో చాలా మంది దేవుని వాక్యాన్ని బోధించే బోధకులుగా మారాలని కోరుకోవద్దు. ఎందుకంటే తీర్పు తీర్చే దేవుడు ఇతరుల కంటే బోధకులమైన మనకే తీవ్రమైన తీర్పు తీరుస్తాడని మీకు తెలుసు.
\v 2 మనం అనేక విషయాలలో తప్పులు చేస్తున్నాము. కాని ఎవరైతే తమ మాటలను నియంత్రించుకుంటారో వారే దేవుని సంకల్పంలో ఉంటారు. అలాంటి వాళ్ళే తమ చేతలన్నింటినీ నియంత్రిస్తారు.
\s5
\v 3 దీనికి ఒక ఉదాహరణ ఇస్తాను. గుర్రం మనం చెప్పినట్లే వినే విధంగా చేసుకోవడానికి ఒక చిన్న లోహం ముక్కను గుర్రం నోటిలో పెడతాము. దానితో గుర్రం భారీ శరీరాన్ని మనకు కావలసిన విధంగా ఎటుకావాలంటే అటు తిప్పవచ్చు.
\v 4 ఒకసారి పెద్ద ఓడలను గూర్చి ఆలోచించండి. ఆ ఓడ ఎంత పెద్దదైనప్పటికీ, పెద్ద, పెద్ద గాలుల వలన కదిలిపోతున్నప్పటికీ, చాలా చిన్న చుక్కానితో ఆ ఓడను తిప్పుకొని ఎటు వెళ్ళాలనుకుంటున్నామో, అటు నడిపించవచ్చు.
\s5
\v 5 అదే విధంగా మన నాలుక ఎంత చిన్నదైనప్పటికి, ఆ నాలుకను మనం నియత్రించకపోతే, మన నోటి నుంచి వచ్చే పెద్ద, పెద్ద మాటల ద్వారా మనుషులకు గొప్ప హాని చేస్తాము. ఎంత చిన్న మంట పెద్ద అడివి కాలిపోవడానికి కారణం అవుతుందో ఒకసారి ఆలోచించండి.
\p
\v 6 చిన్న చిన్న అగ్ని కీలలే అడివినంతా కాల్చినట్లుగా, మనం మాట్లాడే చెడ్డ మాటలే అనేకమంది మనుషుల జీవితాలను నాశనం చేస్తాయి. మనలో ఎంత చెడు దాగి ఉందో, మనం మాట్లాడే మాటలే బహిర్గతం చేస్తాయి. మన ఆలోచనలనూ, పనులన్నిటినీ మన మాటలే కలుషితం చేస్తాయి. ఏ విధంగానైతే అగ్ని కీలలు తేలిగ్గా తమ చుట్టు ప్రక్కల ప్రాంతమంతటినీ కాలిపోవడానికి కారణం అవుతాయో, సరిగ్గా అలాగే మన కుమారులు, కుమార్తెలు, వాళ్ళ వారసులు తమ మిగతా జీవితమంతా చెడ్డపనులు చేయాలనుకునేలా మనం మాట్లాడే మాటల కారణంగా ప్రభావితం అవుతున్నారు. మనం చెడు మాటలు మాట్లాడేలా సాతాను తనంతట తాను మనల్ని ప్రభావితం చేస్తాడు.
\s5
\p
\v 7 మనుషులు నీటిలో జీవించే ప్రాణుల్ని, నేలమీద ప్రాకే, నడిచే అన్ని రకాల ప్రాణుల్ని, పక్షుల్ని, అడవి జంతువుల్ని ఇలా అన్ని రకాల ప్రాణుల్ని మచ్చిక చేసుకున్నప్పటికిని,
\v 8 వాటిని మచ్చిక చేసుకున్నట్టుగా, ఎవ్వరు కూడా తమ మాటల్ని నియంత్రించుకోలేక పోతున్నారు. మనం మాట్లాడే మాటలు అదుపులేని చెడుతనంతో నిండి ఉంటాయి. మన మాటలు మనిషి ప్రాణం తీసే కాలకూట విషంలా గొప్ప హాని చేస్తాయి.
\s5
\v 9 మన తండ్రి, మన ప్రభువు అయిన దేవుణ్ణి స్తుతించటానికి మనం మన నాలుకను ఉపయోగిస్తాము. అయితే అదే నాలుకను ఉపయోగించి మనుషులకు చెడు చేయమని దేవుణ్ణి అడుగుతాము. అది తప్పు. ఎందుకంటే దేవుడు మనుషుల్ని తనలానే రూపించాడు.
\p
\v 10 మనం దేవుణ్ణి స్తుతిస్తాము కానీ అదే నోటితో ఇతరులకు చెడు జరగాలని కోరుకుంటాము. నా సహోదరి, సహోదరులారా, ఈ విధంగా ఉండకూడదు.
\s5
\v 11 ఒకే నీటి బుగ్గ నుంచి మంచినీరు, చేదునీరు బయటకు రావు.
\v 12 నా సోదరి సహోదరులారా, అంజూరు చెట్టుకు ఒలీవలు కాయవు. అలాగే ద్రాక్ష చెట్టుకు అంజూరాలు కాయవు. ఉప్పునీటి బుగ్గ నుంచి మంచి నీరు ఉబకదు. అదే విధంగా మంచిమాటలే మనం మాట్లాడాలి. చెడుమాటలు మాట్లాడరాదు.
\s5
\p
\v 13 మీలో ఎవరైనా తాము జ్ఞానవంతులమని, ఎక్కువ తెలిసిన వాళ్ళమని అనుకుంటే మీరు ఎప్పుడూ మంచిమార్గంలో ఇతరులతో మంచిగా ప్రవర్తిస్తూ, మీరు నిజంగా జ్ఞానవంతులు కావడం వల్ల మీ మంచి పనుల ఫలితాలను మనుషులకు అందించాలి. ఇతరుల పట్ల సున్నితంగా ప్రవర్తించటానికి మనకున్న జ్ఞానంతో సహాయపడాలి.
\v 14 కానీ మీరు ఇతరుల పట్ల అసూయ పడుతూ, వాళ్ళకు వ్యతిరేకంగా అబద్ధాలు చెబుతూ, వాళ్ళకు చెడు చేస్తూ మరోవైపు జ్ఞానవంతుల్లాగా నటించకూడదు. అలాంటి బడాయి పనులు చేయడం ద్వారా మీరు చెబుతున్నదేమిటంటే, ఏది అసలైన నిజమో అది అబద్ధంగా అవుతుంది.
\s5
\p
\v 15 దేవుడు మిమ్మల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా కాకుండా, ఈ విధంగా ఆలోచన చేసేవాళ్ళు జ్ఞానవంతులు కారు. దానికి బదులుగా వీళ్ళు ఆయన్ని గౌరవించని మనుషుల్లా ఆలోచిస్తూ, ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు తమ సొంత స్వార్ధ, చెడ్డ కోరికల ప్రకారం ఆలోచిస్తూ, ప్రవర్తిస్తున్నారు. సాతాను వీళ్ళు ఏం చేయాలని కోరుకుంటున్నాడో, వాటిని చేస్తున్నారు.
\v 16 ఈ విధంగా ఆలోచించే వ్యక్తులు తమను తాము నియత్రించుకోలేరని గుర్తుంచుకోండి. వీళ్ళు ఇతర మనుషులంటే అసూయతో ఉంటారు. తాము చేస్తున్నది సరైనదే అనేలా ప్రవర్తిస్తారు. ప్రతి విధమైన చెడ్డ పనులు చేస్తారు.
\p
\v 17 పరలోకంలో ఉన్న దేవుడే మనల్ని జ్ఞానవంతులుగా చేస్తాడు. అన్నిటికంటే ముందుగా ఆయన మనకు నైతికంగా, స్వచ్ఛంగా ఉండాలని బోధిస్తాడు. ఇతరులతో స్నేహంగా, సమాధానంగా, శాంతిగా ఉండటాన్ని ఆయన మనకు నేర్పిస్తాడు. ఇతరుల పట్ల దయగా ఉండాలని వాళ్ళకు సహాయపడాలని ఆయన మనకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. అర్హతలేని వాళ్ళకి కూడా దయ చూపాలని ఆయన మనకు బోధిస్తాడు. శాశ్వత ఫలాలను ఇచ్చే మంచి పనులను చేయమని ఆయన మనకు బోధిస్తాడు. ఎదుటివాళ్ళకు మంచి చేయడం ఆపవద్దని, అందరితోను నిజాయితీగా ఉండాలని ఆయన మనకు బోధిస్తాడు.
\v 18 ఇతరులపట్ల శాంతియుతంగా ప్రవర్తించే వాళ్ళతో, అవతలి వాళ్ళు కూడా అదేవిధంగా శాంతియుతంగా ప్రవర్తిస్తారని, దాని ఫలితంగా వీళ్ళందరూ కలిసిమెలిసి జీవిస్తూ ఒకరితో నొకరు మంచి పద్దతుల్లో జీవిస్తారు.
\s5
\c 4
\p
\v 1 మీరు ఎందుకు ఒకరితోనొకరు పోట్లాడుకుంటూ ఘర్షణ పడుతున్నారో ఇప్పుడు నేను మీకు చెబుతాను. మీలో ప్రతి ఒక్కరూ మీ స్వంత సంతోషాలకోసం పాపపు పనులు చెయ్యాలనే కోరుకుంటున్నారు. అవి తోటి విశ్వాసులను సంతోష పెట్టవు.
\v 2 మీరు కోరుకునేవి ఎన్నో ఉన్నాయి. కానీ మీరు ఆ విషయాలను పొందలేరు. కాబట్టే వాటిని పొందకుండా అడ్డుపడుతున్న వాళ్ళను చంపాలని కోరుకుంటున్నారు. అయితే మీరు కోరుకున్న వాటిని పొందలేకపోతున్నారు కాబట్టే, మీరు ఒకరితోనొకరు గొడవపడుతూ, కొట్లాడుకుంటున్నారు. మీరు మీకు కావలసిన వాటి కోసం దేవుణ్ణి అడగలేదు. కాబట్టే మీరు కోరుకున్నవి పొందలేకపోతున్నారు.
\v 3 మీరు ఆయన్ని అడిగినా కూడా, మీరు అడిగినది మీకు ఇవ్వడు. ఎందుకంటే మీరు మీ దురుద్దేశాల కోసం, చెడ్డ మార్గాల్లో మీకు మీరు సుఖభోగాలు అనుభవించాలని, దేవుణ్ణి అడుగుతారు. అందుకే మీకు అవి అందని ద్రాక్ష పళ్ళు.
\s5
\p
\v 4 ఒక స్త్రీ తన భర్తపట్ల నమ్మకంగా లేనట్టుగానే , మీరు దేవుని పట్ల ద్రోహులై ఆయనకు ఏమాత్రం విధేయత చూపించడం లేదు. దుర్మార్గులై, చెడ్డగా ప్రవర్తించే వాళ్ళందరూ ఈ లోకానికి చెందినవాళ్ళే. వీళ్ళు దేవునికి శత్రువులు. బహుశా మీరు ఈ విషయాలను గ్రహించి ఉండరు.
\v 5 మన జీవితాలు దేవుణ్ణి సంతోషపెట్టేలా జీవించాలని, ఆయన మనలో ఉంచిన ఆత్మ మన కోసం ఆరాటపడుతుందని లేఖనాల్లో దేవుడు మన కోసం ఏ కారణంతో చెప్పాడో దాని గూర్చి మీరు ఎంతమాత్రం ఆలోచించరు.
\s5
\v 6 కానీ శక్తిమంతుడైన దేవుడు మన పట్ల చాలా దయగా ఉంటాడు. అందుకే మనం పాపం చేయకుండా ఉండటానికి మనకు సహాయపడాలని దేవుడు కోరుకుంటాడు. అందువల్లే దేవుడు గర్విష్టులను వ్యతిరేకిస్తాడు, కాని ఎవరైతే వినయంగా ఉంటారో, వాళ్ళకి సహాయం చేస్తాడు అని లేఖనాలు చెబుతున్నాయి.
\p
\v 7 కాబట్టి మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. సాతాన్ని ఎదిరిస్తే, వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు.
\s5
\v 8 ఆత్మీయంగా దేవుని దగ్గరకు రండి. మీరు అలా చేస్తే, ఆయన మీకు మరింత దగ్గరగా వస్తాడు. పాపం చేసే మీరు పాపపు పనులనుంచి దూరంగా జరిగి, మంచి పనులను మాత్రమే చెయ్యండి. మీకు మీరు దేవునికి కట్టుబడి ఉంటారో లేదో పాపపు ఆలోచనలను ఆలోచించటం మానివేసి, ఆయన ఆలోచనలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారో, లేదో మీరు నిర్ణయించుకోలేరా?
\v 9 మీరు చేసినది పాపమైనందువల్ల దుఖంతో విలపించండి. స్వార్ధపూరితంగా మాత్రమే మీరు వీటిని కోరుకున్నారు కాబట్టి, ఎంతమాత్రం ఆనంద పడవద్దు, నవ్వవద్దు. దానికి బదులుగా మీరు చేసిన ఈ స్వార్ధపూరిత ఆలోచనలను గూర్చి బాధపడండి, విచారించండి. మీరు చేసినదంతా స్వార్ధపూరిత ఆలోచనలు కాబట్టి బాధపడండి.
\v 10 ప్రభువు ముందు వినయంగా మీకు మీరు మోకరిల్లండి, మిమ్మల్ని మీరు తగ్గించుకుని మీ పాపాలను ఒప్పుకోండి. మీరు ఇలా చేస్తే ఆయన మిమ్మల్ని సన్మానిస్తాడు.
\s5
\p
\v 11 నా సోదరీ సోదరుల్లారా, ఒకరికి వ్యతిరేకంగా చెడ్డగా మాట్లాడడం మానేయండి. ఎందుకంటే తోటి విశ్వాసికి వ్యతిరేకంగా చెడ్డగా మాట్లాడే వాళ్ళు, మన సొంత సహోదరి, సహోదరుల్లాంటి వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళు, దేవుడు పాటించమని ఇచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మీరు ఇలా ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లైతే మీరు ఒక న్యాయమూర్తిలా దానిని ఖండిస్తున్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.
\v 12 కానీ వాస్తవానికి మన పాపాలను క్షమించటానికి, మనుషులను ఖండించటానికి అధికారం ఉన్నది ఆయన ఒక్కడికి మాత్రమే. ఆయన ఒక్కడే మనలను రక్షించగలడు, మనలను నాశనం చేయనూ గలడు. దేవుని స్థానాన్ని తీసుకుని ఇతరులకు తీర్పు తీర్చే హక్కు నీకు ఎంతమాత్రం లేదు.
\s5
\p
\v 13 మీలో కొందరు పొగరుగా ఇలా అంటున్నారు. నేడో, రేపో మేము ఇదిగో ఆ నగరానికి, ఈ నగరానికి వెళ్తాము. మేము అక్కడ ఒక సంవత్సరం పాటు గడుపుతాము. అక్కడ మేము వస్తువులు కొని, ఆమ్మి చాలా డబ్బు సంపాదిస్తాము. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా వినండి.
\v 14 మీరు ఆ రకంగా మాట్లాడరాదు. ఎందుకంటే రేపేమి జరుగుతుందో మీకు తెలియదు. మీరెంత కాలం బ్రతుకుతారో మీకు తెలియదు. మీ జీవితం చాలా చిన్నది. పొగమంచులా కొద్దిసేపు ఉండి, తరువాత అదృశ్యమైపోతుంది.
\s5
\v 15 కాబట్టి మీరు చెబుతున్న దానికి బదులుగా ప్రభువుకు ఇష్టమైతే మేము జీవిస్తాము. ఆయనకు ఇష్టమైతే ఇది చేస్తాము, ఆయనకు ఇష్టమైతే అది చేస్తాము అని చెప్పాలి.
\v 16 కానీ మీరు చేస్తున్నదేమిటంటే, మీరు బడాయిగా అన్ని విషయాలను గూర్చి ప్రణాళికలు వేస్తున్నారు. మీ గర్వపు మాటలు చెడ్డవి.
\p
\v 17 కాబట్టి ఎవరైనా చేయవలసినదేమిటంటే, సరైనవేవో తెలుసుకుని చెయ్యాలి, అలా చేయకపోతే, అతడు పాపం చేస్తున్నాడు.
\s5
\c 5
\p
\v 1 క్రీస్తులో నమ్మిక ఉంచామని చెప్పే ధనవంతులకు నేను ఒక విషయాన్ని ఇప్పుడు చెప్పాలి. నా మాట వినండి. మీరు భయంకరమైన కష్టాలు అనుభవిస్తారు. కాబట్టి మీరు కన్నీరు కారుస్తూ, బిగ్గరగా ఏడవండి.
\v 2 మీ ఐశ్వర్యం కుళ్ళుతో నిండినది. పనికిరానిది. మీ ఖరీదైన బట్టలు చెద పట్టి నాశనం అయినట్టుగా ఎందుకూ పనికి రానివి.
\v 3 మీ వెండి, బంగారం క్రమంగా క్షీణించి పోయినట్లుగా ఏమాత్రం విలువ లేనివి. దేవుడు మీకు తీర్పు తీర్చేటప్పుడు మీ పనికి రాని ఈ సంపద మీరు అత్యాశతో సంపాదించారనీ, ఆ సంపాదనే మీరు దోషి అనీ రుజువు చేస్తుంది. తుప్పు, అగ్ని వస్తువులను నాశనం చేసినట్లుగా, దేవుడు మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు. దేవుడు మీకు తీర్పు తీర్చబోయే సమయంలో మీరు పనికిరాని ఈ సంపాదనను నిల్వ చేశారు.
\s5
\p
\v 4 మీరు చేసిన దాని గూర్చి ఒకసారి ఆలోచించండి. మీ పొలాల్లో పనిచేసిన కూలీలకు ఇస్తామని వాగ్దానం చేసిన కూలి డబ్బు మీరు చెల్లించలేదు. ఆ డబ్బుని మీ దగ్గరే ఉంచుకోవడం ద్వారా మీకు మీరే వాళ్ళ పట్ల ఎంత అన్యాయంగా ఉన్నారో అని మీ అపరాధాన్ని నాకు చూపిస్తున్నారు. మీరు వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్న తీరుగూర్చి ఆ కూలీలు దేవునికి మొర పెడుతున్నారు. దేవదూతల సైన్యానికి ప్రభువైన దేవుడు వాళ్ళు పెడుతున్న ఆర్తనాదాలు వింటున్నాడు.
\v 5 మీరు రాజుల్లా జీవించటానికి ఏది కావాలంటే దాన్ని కోరుకున్నారు. తమను వధిస్తారని గ్రహింపులేని కొవ్వు పట్టిన పశువుల్లా మీరు మీ జీవితాలను ఆస్వాదించటానికి మాత్రమే బ్రతుకుతున్నారు. దేవుడు మిమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడని మీరు గ్రహించడం లేదు.
\v 6 అమాయకులైన ప్రజలను ఖండించడానికే మీరు అనుకూలులైన ఇతరులను మీ కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ మనుషులు ఏ తప్పూ చేయకపోయినా, వాళ్ళను చంపటానికి మీకు అనుకూలంగా మాట్లాడే ఇతరులను మీరు ఏర్పాటు చేసుకున్నారు. మీకు వ్యతిరేకంగా తమను తాము రక్షించుకోవడం ఆ అమాయకుల వల్ల కాలేదు. నా సహోదరి, సహోదరుల్లారా, మిమ్మల్ని అణచివేసిన ఈ ధనవంతులకు నేను చెప్పేది అదే.
\s5
\p
\v 7 నా సహోదరి, సహోదరుల్లారా, ధనవంతులు మీ బాధలకు కారణం అయినప్పటికీ, ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చేదాకా సహనంతో ఓపిక పట్టండి. రైతులు పొలంలో పైరు నాటినప్పుడు, తమ విలువైన పంట ఎదిగి, చేతికి వచ్చేదాకా ఎలా వేచి ఉంటారో గుర్తుకు తెచ్చుకోండి. నాట్లు వేసే కాలంలో పడే వర్షం కోసం, కోతకాలానికి ముందు వచ్చే వర్షం కోసం రైతులు ఓపిగ్గా వేచి ఉండాలి. పంట ఎదిగి, పరిపక్వం కావడం కోసం వాళ్ళు కోతకాలం దాకా ఎదురు చూడాలి.
\v 8 అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువు పై గట్టి విశ్వాసముంచి ఓపికతో వేచి ఉండాలి. ఎందుకంటే ఆయన త్వరలోనే తిరిగి వస్తాడు. ప్రజలందరికీ న్యాయమైన తీర్పు తీరుస్తాడు.
\s5
\p
\v 9 నా సహోదరీ సహోదరుల్లారా, యేసు ప్రభువు మిమ్మల్ని ఖండించి, శిక్షించకుండా ఉండే విధంగా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకండి. ఆయనే మనకు తీర్పు తీర్చేవాడు. మనకు ప్రత్యక్షం కావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
\v 10 నా సహోదరి, సహోదరుల్లారా, సహనంగా ఎలా ఉండాలో అనేదానికి ఉదాహరణగా, చాలా కాలం క్రిందట ప్రభువైన దేవుడు పంపిన ప్రవక్తలను చూడండి. వాళ్ళకు ప్రజలు చాలా బాధలు కలిగించినప్పటికీ, ఎంతో సంతోషంతో, ఓపికతో వాటిని భరించారు.
\v 11 దేవుడు తన కోసం బాధలు పడే వాళ్ళకు సహాయం చేస్తూ, సన్మానిస్తాడని మనకు తెలుసు. మీరు యోబును గూర్చి విన్నారు కదా. అతడు చాలా బాధలు పడ్డప్పటికీ ఆ బాధలను తన సహనంతో భరించినందువల్ల యోబుకు తగిన ఫలితాన్ని తీసుకు రావడానికి ప్రభువైన దేవుడు యోచించాడని మీకు తెలుసు. ఈ సంఘటన నుంచి మనకు తెలిసినది ఏమిటంటే, మన ప్రభువైన దేవుడు దయామయుడు, కరుణామయుడని.
\s5
\p
\v 12 అలాగే నా సహోదరి, సహోదరుల్లారా, ముఖ్యంగా మీరు ఎలా మాట్లాడుతున్నారనే దాని గూర్చి నేను కొద్దిగా చెప్పాలని అనుకుంటున్నాను. మీరు చేసే ప్రమాణాలకు సాక్షిగా ఉండటానికి పరలోకం మీద, భూమిమీద ఒట్టు పెట్టకూడదు. మీరందరూ అవును అంటే అవుననే ఉండాలి. కాదు అంటే కాదనే ఉండాలి. మీరు అంతకంటే ఎక్కువ చెప్పారంటే దేవుడు మీకు తీర్పు తీరుస్తాడు.
\s5
\p
\v 13 మీలో ఎవరైతే కష్టాలను అనుభవిస్తున్నారో, వాళ్ళు దేవుడు తనకు సాయం చేసేలా మొరపెట్టాలి. మీలో ఎవరైతే ఆనందంగా ఉన్నారో, వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ, పాటలు పాడాలి.
\v 14 మీలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, అతడు తన కోసం ప్రార్థన చేయటానికి సంఘ పెద్దలను పిలవాలి. ఆ సంఘ పెద్దలు వెళ్లి, ఆలివ్ నూనెను అతనికి పూసి , ప్రభువు అధికారంతో ప్రార్ధించాలి.
\v 15 విశ్వాసంతో దేవునికి సమర్పించిన ఆ ప్రార్థన ఆనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తిని బాగుచేస్తుంది. అతని ఆరోగ్యాన్ని ప్రభువు తిరిగి అతనికి ఇస్తాడు. ఆ వ్యక్తి పాపం చేస్తే, దేవుడు అతణ్ణి క్షమిస్తాడు.
\s5
\v 16 ప్రభువు రోగులను బాగు చేస్తాడు, మన పాపాలను క్షమిస్తాడు. కాబట్టి మీరందరూ చేసిన పాతకాలను ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఒకరి కోసం మరొకరు స్వస్థత పొందేలా ప్రార్ధించండి. నీతిమంతులైన మనుషులు ప్రార్ధించి, దేనికోసమైనా దేవుణ్ణి తీవ్రంగా అడిగినట్టయితే, దేవుడు శక్తివంతంగా స్పందిస్తాడు. కచ్చితంగా వాళ్ళ ప్రార్థనకు అనుగుణంగా చేస్తాడు.
\v 17 మనలాగే ఏలియా ప్రవక్త కూడా సాధారణ మానవుడు అయినప్పటికీ, వర్షం పడకూడదని దృఢ సంకల్పంతో ప్రార్ధించాడు. అప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షం పడలేదు.
\v 18 అతడు మళ్ళీ వర్షం పంపించమని ప్రార్ధించినప్పుడు, దేవుడు వర్షం కురిపించాడు. అప్పుడు మళ్ళీ మొక్కలు పెరిగి పంటలు పండాయి.
\s5
\p
\v 19 నా సహోదరీ సహోదరుల్లారా, దేవుని నుంచి వచ్చిన సత్యసువార్తను మీలో ఎవరైనా పాటించకుండా అడ్డగిస్తే మీలో ఎవరో ఒకరు అతని దగ్గరకు వెళ్ళి దేవుడు మనకు ఏం చేయమని చెప్పాడో మళ్ళీ అతనికి వివరించి చెప్పాలి. ఆ పాపం చేస్తున్న వ్యక్తి, తాను చేస్తున్న తప్పులను తెలుసుకుని అపివేసినట్లయితే,
\v 20 అతనికి ఆ విధంగా చెప్పిన వ్యక్తి కారణంగా దేవుడు ఆ పాపిని ఆత్మీయ మరణం నుంచి రక్షిస్తాడు. అతని విస్తారమైన పాపాలను దేవుడు క్షమించాడని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి.

243
61-1PE.usfm Normal file
View File

@ -0,0 +1,243 @@
\id 1PE - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h పేతురు రాసిన మొదటి పత్రిక
\toc1 పేతురు రాసిన మొదటి పత్రిక
\toc2 పేతురు రాసిన మొదటి పత్రిక
\toc3 1pe
\mt1 పేతురు రాసిన మొదటి పత్రిక
\s5
\c 1
\p
\v 1 యేసుక్రీస్తు తన ప్రతినిధిగా పంపిన పేతురు అనే నేను, ఆయనపై నమ్మిక ఉంచిన మీకు ఈ లేఖ రాస్తున్నాను. ఆయన తనంతట తానే, మీరు తన వారిగా ఉండాలని ఏరి కోరి ఎంపిక చేసుకున్నాడు. మీ యధార్ధమైన మోక్ష గృహానికి దూరంగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితూనియ అనే ప్రాంతాల్లో చెదరిపోయి పరదేశులుగా ఉంటున్న మీకు శుభమని చెప్పి రాస్తున్న సంగతులు.
\v 2 మన తండ్రి అయిన దేవుడు తాను ముందుగా నిశ్చయించిన ప్రకారం మిమ్మల్ని ఎంపిక చేసి, మీరు క్రీస్తుకు విధేయులై జీవించాలనీ, క్రీస్తు రక్తం మిమ్మల్ని దేవునికి అంగీకారయోగ్యంగా, ఇష్టమైన వారుగా చేయాలనీ తన ఆత్మ ద్వారా మిమ్మల్ని ప్రత్యేకించాడు. దేవుడు మిక్కుటమైన దయను మీపై చూపును గాక. విస్తారమైన శాంతి సమాధానాలతో మిమ్మల్ని జీవింప చేయును గాక.
\s5
\p
\v 3 మన యేసు క్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన మనపై తన దయను కుమ్మరించాడు, ఎంతో కనికరాన్ని చూపించాడు. యేసు క్రీస్తును చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు కొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది.
\v 4 దీని మూలంగా పరలోకం లోనివీ ఎప్పటికీ నాశనం కానివీ, వాడిపోనివీ, మచ్చ, డాగూ లేక ఎంతకాలమైనా భద్రంగా ఉండేవీ మనకు నిరీక్షించదగిన వారసత్వంగా లభించాయి.
\v 5 మీరు యేసును విశ్వసించారు గనుక దేవుడు తన మహా శక్తిచే మిమ్మల్ని కావలి కాస్తున్నాడు. ఈ ఆఖరి సమయాల్లో నివసిస్తున్న మనకు సాతాను శక్తి నుండి సంపూర్ణ విడుదల కలిగేలా ఆయన మిమ్మల్ని రక్షిస్తున్నాడు.
\s5
\p
\v 6 రకరకాల విషమ పరీక్షల వలన కొంతకాలం విచారించవలసి వచ్చినా ఆ తరువాత సంభవించబోయే వాటి వలన మీరు ఆనందిస్తారు. విలువైన లోహాలను శుద్ధమైనవో కావో పరిశోధించినట్టే మీరూ పరీక్షకు గురి కావడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. మీరు ఎదుర్కొంటున్న ఈ శోధనలు ఎంతో ఆవశ్యకం.
\v 7 మీరు మనఃపూర్వకంగా యేసును విశ్వసించారని రుజువు చేయడానికే ఈ పరీక్షలు మీకు ఎదురౌతున్నాయి. అగ్ని వలన నాశనం అయ్యే బంగారమంతటి కంటే మీరు దేవునికి విలువైన వారని దీని అర్థం. మీరు యేసులో నమ్మకం ఉంచడం వల్ల ఆ యేసు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎంతో యోగ్యులుగా ఎంచుతాడు.
\s5
\p
\v 8 మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు.
\v 9 ఆయనలోని మీ విశ్వాసాన్ని మీరు అనుభవ పూర్వకంగా రుచి చూస్తూ ఉంటే దేవుడు మీ పాపాల భారం నుండి మిమ్మల్ని తప్పిస్తూ ఉన్నాడు.
\v 10 ఒకానొక రోజు తాను మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో దేవుడు తన ప్రవక్తలకు ముందుగానే చూపించి విశదపరిచాడు. చాలా కాలం క్రితమే ఈ విషయాలన్నీ వారు ఎంతో శ్రద్ధతో పరిశోధనాత్మకంగా గ్రహించి తమ సందేశాల ద్వారా వెల్లడి చేశారు.
\s5
\v 11 వారు తమలోని క్రీస్తు ఆత్మ ముందుగానే తెలియజేస్తున్న విషయాలను అంటే క్రీస్తు పొందనైయున్న బాధలు, ఆ తరువాత క్రీస్తుకు సంభవించనైయున్న దివ్యమైన విషయాలూ ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయి అని తెలుసుకునేందుకు ఆలోచించి పరిశోధించారు.
\p
\v 12 దేవుడు ఈ విషయాలను వారికి వెల్లడించడం వారి కోసం కాదని అది మీ కోసమేనని ఆయన వారికి చెప్పాడు. వారు పరలోకం నుంచి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా సామర్ధ్యం పొందిన వారై మీకు సువార్త ప్రకటించారు. దేవదూతలు కూడా దేవుడు మనల్ని విమోచించే ఈ వాస్తవ సత్యాలు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు.
\s5
\p
\v 13 కాబట్టి దేవునికి విధేయత చూపడానికి మీ మనసును సిద్ధపరుచుకోండి. నా ఉద్దేశ్యం ఏంటంటే మీరు క్రమశిక్షణతో స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి. పరలోకం నుండి యేసు క్రీస్తు తిరిగి మీ మధ్యకు వచ్చినప్పుడు దేవుడు దయతో అనుగ్రహించే మేలైన విషయాలన్నింటినీ తప్పక పొందుతామనే సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి.
\p
\v 14 ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు శరీర సంబంధమైన తమ తండ్రులకు పిల్లలు ఎలా విధేయులై ఉంటారో అలా మీరు మీ పరలోక జనకునికి విధేయులై ఉండండి. దేవుని గూర్చిన సత్యమెరుగని మీ పూర్వ అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ఇకమీదట ప్రవర్తించవద్దు.
\s5
\v 15 మిమ్మల్ని తన సొత్తుగా పిలిచినవాడు చెడు సమీపించరాని వాడు, పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి.
\v 16 ఎందుకంటే "నేను పరిశుద్ధుడను కాబట్టి మీరూ పరిశుద్ధులుగా ఉండండి" అని పవిత్ర లేఖనాలలో రాసి ఉంది.
\p
\v 17 ప్రతి ఒక్కరి పని గురించీ పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడు దేవుడు. అలాంటి ఆయనను మీరు తండ్రీ అని పిలుస్తున్న కారణాన భూమి మీద మీరు జీవించే కాలమంతా యుక్తమార్గంలో భయభక్తులతో గడపండి. తమ స్వస్థలాల నుండి వెళ్ళగొట్టబడిన వారు దూర ప్రాంతాలలో తమ ఇళ్ళకు తిరిగి చేరేవరకూ ఎంత జాగ్రత్తగా గడుపుతారో అలాగే మీరూ అలాంటి వారేననీ, మీ సొంత ఇల్లు అయిన పరలోకం నుండి వేరై దూరంగా గడుపుతున్నారని గుర్తుంచుకోండి.
\s5
\p
\v 18 మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్ధమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. ఇక మీదట అజ్ఞానంగా ప్రవర్తించడం మానండి. భక్తి శ్రద్ధలతో జీవించండి. ఎందుకంటే నేడుండి రేపు నాశనమైపోయే వెండి బంగారాల్లాంటి అశాశ్వతమైన వస్తువులతో కాక, అక్షయమైన ద్రవ్యాన్ని వెలగా చెల్లించి ఆయన మిమ్మల్ని స్వాధీనం చేసుకున్నాడు.
\v 19 క్రీస్తు మరణించినప్పుడు చిందించిన అమూల్యమైన, పవిత్రమైన రక్తాన్ని మూల్యంగా చెల్లించి దేవుడు మిమ్మల్ని కొన్నాడు. అమూల్యమైన రక్తంతో, అంటే యూదు యాజకులు అర్పిస్తున్న ఏ లోపం, కళంకం లేని గొర్రెపిల్లను పోలిన క్రీస్తు తన అమూల్య రక్తం ఇచ్చి, మిమ్మల్ని విమోచించాడు.
\s5
\v 20 విశ్వం ఉనికిలోకి రాక ముందే దేవుడు క్రీస్తును ఈ విషయానికై నియమించాడు. అయితే ఈ చివరి రోజుల్లోనే దేవుడు ఆయన్ని మీకు ప్రత్యక్ష పరిచాడు.
\v 21 క్రీస్తు చేసిన ఈ కార్యాన్ని బట్టి మీరు దేవునిపై నమ్మకం ఉంచారు. ఆ దేవుడే ఆయనను మరణం నుండి సజీవుడిగా లేపి అత్యధికంగా ఘనపరిచాడు. దాని ఫలితంగానే దేవుడు మీ నిమిత్తం కూడా గొప్ప కార్యాలు చేయగలడని నమ్మారు. మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి.
\s5
\p
\v 22 దేవుని గూర్చిన సత్యానికి లోబడడం ద్వారా ఆయన మీ మనసుల్ని పవిత్రపరచడానికి అనుమతించడమే కాకుండా యథార్ధమైన సోదర ప్రేమను ఆయనను బట్టి పంచగలిగారు. అందుచేత ఆసక్తితో ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి.
\v 23 ఎందుకంటే మీలో ఒక నూతనమైన జీవం మొదలై కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. మీరు పొందిన ఈ నూతన జీవితం ఏదో ఒక నశించిపోయే దానిపై ఆధారపడి లేదు. ఎప్పటికీ స్థిరంగా నిలిచి ఉండేవీ, మీరు నమ్ముతున్నవీ అయిన దేవుని వాగ్దానాలనే ఆధారం చేసుకుని ఉంది.
\s5
\v 24 ఇదంతా సత్యమని మనకి తెలుసు. యెషయా ప్రవక్త రాసినట్టు,
\q1 "మానవులంతా గడ్డిలాంటి వారు.
\q1 వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది.
\q గడ్డి ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది.
\q
\v 25 ప్రభువు వాక్కు మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది."
\m ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండే ఈ క్రీస్తు సందేశమే మీకు సువార్తగా ప్రకటించడం జరిగింది.
\s5
\c 2
\p
\v 1 ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి, కక్షలతో కార్పణ్యాలతో ఇతరులను మోసం చేసే ఏరకమైన ప్రవర్తనా మీలో ఉండకూడదు. కపట వేషధారులుగా ఉండకండి. ఇతరులపై అసూయ పడకండి. ఎవరిని గురించీ చెడు మాటలూ అబద్ద ప్రచారాలూ చేయకండి.
\v 2 అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు తల్లి పాలను ఆశించినట్టుగా, సత్య సంబంధమైన విషయాలను దేవుని నుండి ఆశించండి. అలా ఆ విషయాలను గ్రహించి నేర్చుకుంటున్న క్రమంలోనే, పిల్లలు యువకులుగా ఎదిగినట్టు, మీరును దేవుని ఎడల విశ్వాసంలో బలంగా ఎదుగుతారు. ఈ లోకపు పాపమంతటినుండీ దేవుడు మిమ్మల్ని విడిపించే వరకూ మీ ప్రవర్తన ఇలాగే ఉండాలి.
\v 3 ఇంతే కాక దేవుడు మీపై ఒలకబోసిన దయను మీరు అనుభవించారు కాబట్టి మీరిలా ఉండండి.
\s5
\p
\v 4 ఏదైనా కట్టడానికి పునాదిరాయి అత్యంత కీలకమైనట్లే మానవాళికి ప్రభువైన యేసు కూడా అలాంటి వాడే. అయితే ఆయన పునాది రాయిలాగా జీవం లేనివాడు కాడు. ఆయనలో జీవం ఉంది. అనేకులు తిరస్కరించినా దేవుడు ఎన్నుకున్నది ఆయననే, అమూల్యంగా ఎంచిందీ ఆయననే.
\v 5 ఇల్లు కట్టడానికి మనుషులు వాడే రాళ్ళలాగా దేవుని ఆత్మ నివసించేలా దేవుడు నిర్మిస్తున్న ఆధ్యాత్మిక గృహానికి దేవుడు వాడే సజీవమైన రాళ్లలాగా మీరున్నారు. ఆయన ఇలా చేయడం వల్ల, మీ కొరకు మరణించిన యేసు క్రీస్తు ద్వారా దేవుడు ఆమోదించే ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి దైవపీఠం దగ్గర పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు.
\s5
\v 6 ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది,
\q1 "నేను యెరూషలేములో ఒక వ్యక్తిని మూల రాయిగా నియమిస్తున్నాను.
\q1 ఆ రాయి విలువైనదీ ఎన్నిక అయినదీ ప్రాముఖ్యమైనదీ.
\q1 ఆయనను నమ్మేవారెవరూ సిగ్గు పడరు."
\s5
\p
\v 7 కాబట్టి యేసును విశ్వసిస్తున్న మీకు దేవుని దగ్గర దొరికే గౌరవం ఇది. అయితే యేసును విశ్వసించనివారికి ఆయన ఎలాంటి వాడంటే,
\q1 "ఇల్లు కట్టే వారు నిరాకరించిన రాయి, మూలకు తలరాయి అయింది."
\p
\v 8 లేఖనాలలో ఇంకా ఆయన గురించి,
\q "ఆయన వారికి ఒక అడ్డురాయి లాగా ఉన్నాడు, వారు తొట్రుపడుతున్నారు.
\q ఆయన వారికి ఒక అడ్డుబండ లాగా ఉన్నాడు, వారు తడబడి జారి పడుతున్నారు.
\q రాయి తగిలి పడి గాయపడ్డట్టు ఉన్నారు.
\q దేవుని సందేశానికి అవిధేయులైనవారు తమని తాము గాయ పరుచుకుంటారు.
\q వారికి ఇలా జరుగుతుందని దేవుడు నిశ్చయించాడు."
\s5
\p
\v 9 మిమ్మల్నైతే తనవారిగా దేవుడు ఎన్నుకున్నాడు. మీరు దేవుణ్ణి ఆరాధించే అర్చకుల సమూహంలా ఉన్నారు. అంతేకాదు, రాజుల్లా దేవుడితో ఉండి పాలిస్తారు కూడా. మీరు దేవుని సొంత జన సమూహం. అందువలన ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను ఎలుగెత్తి చాటగలుగుతారు. దేవుని సత్యమెరుగని చీకటిలోనుంచి, ఇంతకు మునుపు మీరు సంచరించిన మార్గాల్లోంచి ఆయన మిమ్మల్ని వెలుపలికి పిలిచాడు. తనను గూర్చిన ఆశ్చర్యకరమైన సత్యాలను మీరు గ్రహించగలిగేలా చేశాడు.
\p
\v 10 మీగురించి లేఖనాలు చెప్పిన సత్యమేంటంటే,
\q "ఒకప్పుడు మీరు ప్రత్యేకమైన జన సమూహం కాదు.
\q ఇప్పుడైతే మీరు దేవుని ప్రజలు.
\q పూర్వం మీరు దేవుని కనికరానికి నోచుకోలేదు.
\q అయితే ఇప్పుడు ఆయన కనికరం పొందారు."
\s5
\p
\v 11 నా ప్రియులారా, పరలోకమే మీ స్వస్థలం, ఇక్కడ మీరు పరదేశులే. అందువలన అలవాటుగా నెరవేర్చుకుంటున్న శరీర దురాశలన్నింటినీ మానవలసిందే. అవే జరిగితే దేవునితో గల చక్కటి సహవాసాన్ని కోల్పోతారు.
\v 12 దేవుణ్ణి ఎరగని వారి మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండండి. అయినప్పటికీ వారు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉన్నా, మీరు మానక చేసే మంచి పనులు చూసి, దేవుడు అందరికీ తీర్పు తీర్చే రోజున ఆయనను మహిమ పరుస్తారు.
\s5
\p
\v 13 ప్రభువైన యేసును ఘనపరచాలని కోరుకుంటున్న మీరు న్యాయమైన ప్రతి అధికారికీ లోబడి ఉండండి. వాళ్లందరిలో ముఖ్యంగా రాజ్య పాలకులకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయని గమనించండి.
\v 14 ఏలిక అందరికీ అధిపతి అని, అధికారులు దుర్మార్గుల్ని శిక్షించడానికీ, మంచి వారిని మెచ్చుకోడానికీ దేవుడు పంపిన వాళ్ళనీ గ్రహించి వాళ్ళకి లోబడి ఉండండి.
\v 15 ఎందుకంటే మీరు ఈ విధంగా మంచి చేస్తూ తెలివి తక్కువగా మాట్లాడే బుద్ధిహీనుల నోరు మూయించడం దేవుని చిత్తం.
\v 16 యజమాని బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందిన వాళ్ళుగా ప్రవర్తించండి. అలాగని దుర్మార్గాన్ని కప్పి పెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక, దేవుని సేవకులుగా ఉండండి.
\v 17 అందరినీ గౌరవించండి. తోటి సోదరుల్ని ప్రేమించండి, దేవునికి భయపడండి, పరిపాలిస్తున్న వాళ్ళని గౌరవించండి.
\s5
\p
\v 18 సేవకులారా, మంచివాళ్ళూ సాత్వికులయిన యజమానులకు మాత్రమే కాక వక్ర బుద్ధి గల వాళ్ళకీ, మీతో కరుకుగా వుండే వారికి కూడా పూర్తి మర్యాదతో లోబడి ఉండండి.
\v 19 మీరు దేవుని గురించిన మనస్సాక్షిని బట్టి అన్యాయాన్ని అనుభవిస్తూ బాధ సహిస్తుంటే అది గొప్ప విషయం. అలా ప్రవర్తించడం మీకు తగినదే. దేవుడు మీ విషయంలో సంతోషిస్తాడు.
\v 20 మీరు పాపం చేసి శిక్ష అనుభవిస్తూ సహిస్తుంటే అదేమి గొప్ప? దేవుడు అలాంటి వాళ్ళ విషయంలో ఏమాత్రం సంతోషించడు. మేలు చేసి బాధలకు గురి అయి కూడా సహిస్తుంటే అది దేవుని దృష్టిలో మంచిది, ఆయన మెచ్చుకుంటాడు.
\s5
\v 21 మీకోసం శ్రమపడిన క్రీస్తు మనస్సు మీకుండాలనే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి, మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఒక ఆదర్శాన్ని చూపాడు.
\v 22 క్రీస్తు నడిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి,
\q1 ఆయన ఎలాంటి పాపం చేయలేదు.
\q1 ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు.
\q1
\v 23 ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు.
\q1 ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు.
\q1 తన నిర్దోషిత్వాన్ని దేవుడే రుజువు చేస్తాడని నిర్ణయించుకున్నాడు.
\s5
\q1
\v 24 ఇక మనం పాపం చేయడం మానివేసి, నీతి కోసం బతకడానికి,
\q1 స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు.
\q1 ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు.
\p
\v 25 మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుడు అయిన యేసు దగ్గరికి తిరిగి వచ్చారు. కాపరి తన గొర్రెలను జాగ్రత్తగా కాపు కాసినట్టు మిమ్మల్ని భద్రం చేస్తాడు.
\s5
\c 3
\p
\v 1 విశ్వాసులైన స్త్రీలారా, మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వాళ్ళలో ఎవరైనా వాక్యానికి అవిధేయులయినా, అసలు క్రీస్తు సువార్తను విశ్వసించకపోయినా సరే, మాటలతో కాకుండా, వాళ్ళ భార్యల ప్రవర్తనే వాళ్ళని ప్రభువు కోసం సంపాదిస్తుంది.
\v 2 ఎందుకంటే వాళ్ళకి మీరిచ్చే గౌరవాన్ని, మీ పవిత్ర ప్రవర్తన వాళ్ళు గమనిస్తారు.
\s5
\p
\v 3 అంతేకానీ పై పైనే కనపడేలా ఆడంబరంగా బంగారు ఆభరణాలు ధరించడం, ఖరీదైన బట్టలు వేసుకోవడం, చిత్రమైన జడలు అల్లుకోవడం లాంటి బాహ్య అలంకారాలు మీకు వద్దు.
\v 4 వాటికి బదులు ఎప్పటికీ వెలిసిపోని సుందరమైన అలంకరణలతో మీ అంతరంగాన్ని అలంకరించుకోండి. నా ఉద్దేశ్యం ఏంటంటే హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. ఇలాంటి అలంకారం నాశనం కాదు. దేవుని దృష్టిలో ఇవి చాలా విలువైనవి.
\s5
\v 5 పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచి ఆయనను ఘన పరచిన స్త్రీలు ఈ విధమైన పవిత్రతతో అలంకరించుకున్నారు. వారు దేవుణ్ణి నమ్మి తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు.
\v 6 ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. మీ భర్తలైనా మరెవరైనా గానీ వాళ్ళ ప్రవర్తన మీకు ఇబ్బందిగా ఉన్నప్పటికీ భయపడకండి. న్యాయం చేయండి, మేలు తలపెట్టండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా శారా కుమార్తెలుగా భావిస్తాడు.
\s5
\p
\v 7 విశ్వాసులైన భర్తలారా, మీ భార్యలు మీకు విధేయులై ఉన్నట్టే మీ నడవడి వాళ్ళకి తగినట్టు ఉండాలి. సాధారణంగా వాళ్ళు మీకంటే బలహీనులని గుర్తుంచుకుని మర్యాద మన్ననలతో వారిని చూసుకోండి. మీకిచ్చినట్టే వాళ్ళకి కూడా దేవుడు నిత్య జీవం ప్రసాదించాడు. ఇలా చేస్తే మీ ప్రార్థనలకు ఎలాటి ఆటంకం కలగదు.
\s5
\p
\v 8 చివరిగా మీ అందరి గురించీ ఒక్కమాట, ఒకరినొకరు ఒప్పుకుంటూ మీ ఆలోచనలలో ఏకభావానికి రండి. ఒకరికొకరు దయగా ఉండండి, కరుణ చూపించుకోండి. ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లాగా కలిసి మెలిసి ప్రేమను పంచుకోండి.
\v 9 మనుషులు మీకు కీడు తలపెట్టినా, అవమానించినా ఎలాటి ప్రతికార ధోరణి ప్రదర్శించకండి. డానికి బదులు వాళ్ళకి మేలు చేయమని దేవుణ్ణి వేడుకోండి. ఎందుకంటే మీరు ఇలా ఉండాలనే దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ఆయన మీకు తోడుగా ఉంటాడు.
\s5
\v 10 మన జీవిత విధానాన్ని గురించి కీర్తనకారుడు రాసింది ఒకసారి చూస్తే,
\q "జీవితాన్ని ప్రేమతో చక్కగా అనుభవించాలనీ, మంచి రోజులు చూడాలనీ కోరే వాళ్ళు,
\q చెడు మాటలు పలకకుండా తమ నాలుకనూ మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులనూ కాచుకోవాలి.
\q
\v 11 వారు చెడు పూర్తిగా మాని మేలే చేయాలి.
\q శాంతిని వెతికి అనుసరించాలి, అందరి శాంతి కోసం విజ్ఞప్తి చేయాలి.
\q
\v 12 ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి. వాళ్ళు చేస్తున్న వాటిని ఆయన అంగీకరిస్తున్నాడు.
\q ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటాయి. ఆయన వాళ్ళకి బదులిస్తాడు కూడా.
\q అయితే ప్రభువు ముఖం చెడు చేసే వాళ్ళకి విరోధంగా ఉంది."
\s5
\p
\v 13 మీరు ఎంత కష్టమైనా మంచే చేయాలి అనుకుని మంచి పనులు చేస్తూ ఉంటే మీకు హాని చేసే వాడెవడు?
\v 14 మీరొకవేళ నీతి జరిగించడం కోసం బాధలు అనుభవించినా మీరు ధన్యులే. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మిగతావాళ్ళు భయపడే వాటికి మీరు భయపడవద్దు. కలవరపడవద్దు. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని కష్టపెట్టినా ఇబ్బంది అనుకోవద్దు.
\s5
\v 15 దానికి బదులు మీ హృదయాల్లో మీరు ప్రేమించే క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవుడు మీ నిమిత్తం ఏం చేస్తాడు, ఆయన నుంచి నమ్మకంతో ఎదురు చూస్తున్నది ఏంటి, ఆయననుంచి మీరు ఏం ఆశిస్తున్నారు? అని ఎవరు అడిగినా సమాధానమివ్వడానికి సిద్ధంగా ఉండండి. చెప్తున్నప్పుడు గౌరవప్రదంగా నమ్రతగా చెప్పండి.
\p
\v 16 మీ వల్ల ఏ తప్పూ జరక్కుండా జాగ్రత్త పడండి. క్రీస్తుతో సహవాసం చేస్తున్న దానిని బట్టి మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకుంటూ మంచి చేస్తున్నప్పుడు, అది చూసిన మీ విరోధులు బహుశా సిగ్గుతో తల దించుకుంటారు.
\v 17 దేవుడే మీరు హింస పొందడాన్ని అనుమతించాడేమో. అలాగైతే, మంచి పనులు చేయడంలో మీకు ఎలాంటి కష్టాలు ఎదురైనప్పటికీ మానక మంచే చేయండి.
\s5
\p
\v 18 మానవాళి పాపాల నిమిత్తం క్రీస్తు ఒక్కసారే చనిపోయాడు. ఆయన ధర్మాత్ముడై ఉండి ధర్మ విహీనులకోసం చనిపోయాడు. మనల్ని దేవుని చెంతకు చేర్చడానికి ఆయన మరణించాడు. మనలాంటి శరీరంతోనే ఆయన మన మధ్యలో జీవిస్తున్నప్పుడు ఆయనను చంపేశారు. కానీ దేవుని ఆత్మ ఆయనను బతికించాడు.
\p
\v 19 దేవుడు చెరలో ఉంచిన చెడ్డ ఆత్మలకి సయితం దేవుని విజయాన్నిఆయన ప్రకటించేలా ఆత్మ సాధ్యం చేశాడు.
\v 20 పూర్వం నోవహు రోజుల్లో పెద్ద ఓడనొకదాన్ని దేవుడు నోవహుతో తయారు చేయిస్తున్నప్పుడు ప్రజలంతా వాళ్ళ చెడు ప్రవర్తన నుండి తన వైపుకు తిరుగుతారేమో అని దేవుడు సహనంతో ఎదురు చూశాడు. అయినా ఈ దుష్ట ఆత్మలు ఆయనకు అవిధేయులయ్యారు. ఆ ఓడ ద్వారా కొద్దిమందే రక్షణ పొందారు. అన్నివైపులా భూమిని వరద ముంచెత్తినపుడు విశేషించి, ఎనిమిది మందిని మాత్రమే దేవుడు ఆ జల వాహినిలోనుంచి క్షేమంగా పైకి తీసుకొచ్చాడు. మిగతా వాళ్ళందరూ మునిగిపోయారు.
\s5
\p
\v 21 ఆ నీళ్ళు ఇప్పుడు మనం తీసుకున్న బాప్తీసాన్ని సూచిస్తూ ఉన్నాయి. అంతేకాక యేసు క్రీస్తును మరణం నుండి లేపడం వలన ఈ నీళ్ళ ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఈ నీళ్ళు మన శరీరానికున్న మలినాన్ని తొలగించడానికి కాదు, మనలో పాపం వలన కలిగిన అపరాధ భావాన్ని దేవుడు సమూలంగా తొలగించాడని మనం నమ్మేలా ఆయన్ను వేడుకుంటున్నామన్నమాట.
\v 22 దూతలూ, అధికారులూ, శక్తులూ, అవి చెడ్డవైనా మంచివైనా అన్నీ దేవుడు ఆయనకు లోబరచగా క్రీస్తు ఇక్కడనుండి వెళ్లి పరలోకంలో తండ్రి పక్కన అత్యున్నత స్థానం నుండి ప్రభుత్వం చేస్తున్నాడు.
\s5
\c 4
\p
\v 1 క్రీస్తు శరీరంతో ఉండగా హింసలు పొందాడు కాబట్టి మీరు కూడా హింస పొందడానికి సమ్మతించండి. ఇలా శరీరాలను హింసకు అప్పగించిన వాళ్ళు పాపం చేయడం మానేస్తారు.
\v 2 దాని పర్యవసానంగా తమ శేష జీవితాన్ని ఇక మీదట చెడిపోయిన మానవ కోరికలను అనుసరించక, దేవుని ఇష్టం కోసమే ఆయన చెయ్యమన్న పనులు చేస్తూ జీవిస్తారు.
\s5
\v 3 దేవుణ్ణి ఎరగని వాళ్ళు తమ ఇష్టానుసారంగా జీవించినట్టు మీరు కూడా ఇప్పటికే ఈ లోకంలో చాలా విలువైన మీ సమయాన్ని అలాగే గడిపేశారు. గతంలో మీరు లైంగిక పరమైన అనైతిక కార్యాలు చేశారు. మద్యపానం చేస్తూ అల్లరి చిల్లరి వినోదాలూ, విచ్చలవిడి విందులలో మునిగి తేలారు. దేవుడు అసహ్యించుకునే విగ్రహ పూజలు సైతం చేశారు.
\v 4 అప్పుడు మీతోపాటు ఇలాంటి వాటిల్లో పాలు పంచుకున్న మీ మిత్రులు, మీరిప్పుడు వాళ్ళతో అలాంటి విషయాలలో కలవకపోవడాన్ని చూసి వాళ్ళకి ఆశ్చర్యమేసింది. పర్యవసానంగా వాళ్ళు మిమ్మల్ని దూషిస్తారు.
\p
\v 5 కానీ ఒకరోజు వాళ్ళు చేసిందంతా దేవుని ముందు ఒప్పుకుని తీరాల్సిందే. ఆయనే వాళ్ళకి తీర్పు తీర్చేవాడు.
\v 6 అందుకే చనిపోయిన వాళ్ళు మానవ రీతిగా వాళ్ళ శరీరానికి తీర్పు జరిగినా వాళ్ళు పరిశుద్దాత్ముని శక్తితో తిరిగి దేవునిలో నిత్యం జీవించేలా వాళ్ళకి కూడా క్రీస్తు సువార్తను ప్రకటించాడు.
\s5
\v 7 ఈ భూమి మీద అన్నిటికీ అంతం అతి త్వరలో సమీపించనైయుంది. కాబట్టి మెలకువ కలిగి తెలివిగా ఆలోచించండి, మీ ఆలోచనలను మీ అధీనంలో ఉంచుకోండి. అప్పుడే మీరు చక్కగా ప్రార్థన చేయగలుగుతారు.
\v 8 అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ఎందుకంటే, ప్రేమిస్తే ఎదుటివాళ్ళ తప్పుల్ని అంతగా ఎంచము. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు.
\v 9 ప్రయాణిస్తూ మీ మధ్యకు వచ్చిన క్రైస్తవులు భోజనం చేసి విశ్రమించడానికి వీలుగా సదుపాయం కల్పించండి. ఏ మాత్రమూ సణుక్కోకుండా అతిథి మర్యాదలు చేయండి.
\s5
\v 10 విశ్వాసులందరూ తమకి దేవుడు అనుగ్రహించిన కృపావరాలను ఇతరుల సేవ కోసం వినియోగించాలి. దేవుడు ప్రేమించి తమకిచ్చిన వివిధమైన ఈ కృపావరాల నిర్వహణ విషయంలో ప్రతి విశ్వాసీ జాగ్రత్తగా ఉండాలి.
\v 11 దేవుడు తమకిచ్చిన వరాన్నిబట్టి విశ్వాసుల సభలో బోధిస్తున్నవాళ్ళు ఆ మాటలు తమవి కాదు, దేవుని మాటలే అని జాగ్రత్తగా మాట్లాడాలి. దయగలిగి ఇతరులకు సేవ చేస్తున్నవాళ్ళు దేవుడిస్తున్న శక్తితో ఆ పనులు చేయాలి, మాకు ఈ సామర్ధ్యం కలుగజేసినవాడు యేసు క్రీస్తే అని దేవుణ్ణి ఘనపరిచేలా మీ ప్రవర్తన ఉండాలి. మనందరం దేవుణ్ణి స్తుతించాలి, ఎందుకంటే ప్రతిదీ నిత్యమూ ఆయనకి లొంగి ఉండేలా సంపూర్ణాధికారం ఆయనకి ఉంది. ఆమేన్.
\s5
\p
\v 12 నా ప్రియులారా, మీరు క్రీస్తు సంబంధులైన కారణంగా మిమ్మల్ని కష్టపెడుతున్న సంగతులూ , అవస్థల పాలు చేస్తున్న విషయాలూ చూసి ఆశ్చర్యపడకండి. మనుషులు రకరకాల లోహాలను పరీక్షించడానికి వాటిని అగ్నిలో వేస్తున్నట్టు, మీకు సంభవిస్తున్న హింసలు కూడా మిమ్మల్ని పరీక్షిస్తున్నాయి. అంతేకానీ మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోవద్దు.
\v 13 అందుకు బదులుగా క్రీస్తుకు సంభవించి, ఆయన సహిస్తూ వచ్చిన అలాంటి సంగతులే మీకు కూడా ఎదురౌతున్నాయని గ్రహించి హింసల్లో ఆనందించండి. క్రీస్తు తిరిగి వచ్చి తానెంతటి మహిమ గలవాడో అందరికీ తెలియచేస్తున్నప్పుడు మీరు ఆనందించగలిగేలా ఇప్పటి హింసల్లో సంతోషించండి.
\p
\v 14 క్రీస్తును నమ్మి స్థిరంగా నిలబడినందుకు మిమ్మల్ని ఎవరైనా అవమానించినా, తిరస్కరించినా దేవుడు మిమ్మల్ని సంతోషంగా అక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే దేవుడు ఎంత ఘనమైనవాడో వెల్లడించే దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. అలాంటి జీవితం దేవుని ఆత్మను చూపిస్తుంది.
\s5
\v 15 మిమ్మల్ని కష్టాల పాలుజేసిన కారణాలు మీరు ఎవరినైనా హత్య చేయడమో, దేనినైనా దొంగిలించడమో, ఏదో ఒక చెడ్డపని చేయడమో, పరాయివాళ్ళ విషయాలలో జోక్యం చేసుకోవడమో కాకూడదు.
\v 16 మీరు క్రైస్తవులైనందువల్ల హింసల పాలైతే వాటి నిమిత్తం సిగ్గుపడకండి. దానికి మించి ఆనందించండి, క్రీస్తుకు చెందిన వారమైనందుకు దేవుణ్ణి స్తుతించండి.
\s5
\p
\v 17 ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మానవాళికి దేవుడు తీర్పు తీర్చే సమయం ఇప్పుడు ఆసన్నమయ్యింది. ఆయన మొదటగా విచారణ తన సొంతవాళ్ళతోనే మొదలు పెట్టబోతున్నాడు. కాబట్టి విశ్వాసులమైన మనల్నే మొదటగా విచారణకు నిలబెడుతున్నాడంటే ఇక ఆయన పంపిన సువార్తను తిరస్కరించిన వాళ్ళ గతి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి!
\v 18 పవిత్ర లేఖనాలలో ఇదే విషయం ఉంది.
\q "నీతిమంతులు అనేకులు పరలోకం చేరక ముందే వ్యయ ప్రయాసలతో కూడిన అనేక పరీక్షలకు లోనౌతారు.
\q భక్తి హీనులూ, పాపులూ మరింత నిశ్చయంగా తీవ్రమైన శిక్షకు, దేవుని దండనకూ గురౌతారు" అని రాసి ఉంది.
\p
\v 19 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడే వాళ్ళు దేవుడే తమ క్షేమాన్ని చూసుకుంటాడనీ, ఆయన ఆడిన మాట తప్పడని తమ సృష్టికర్త అని నమ్మి, మానక మేలు చేస్తూ జీవించాలి.
\s5
\c 5
\p
\v 1 విశ్వాసుల సంఘాలను నడిపిస్తున్న మీలోని పెద్దలకు నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా ఒక పెద్దనే. క్రీస్తు హింసలు పొందగా చూసిన వాళ్ళలో నేనూ ఒకణ్ణి. పరలోకం లోని క్రీస్తు మహిమలో కొంత నేనూ పాలివాడినే.
\v 2 సంఘంలోని విశ్వాసుల క్షేమాన్ని జాగ్రత్తగా పట్టించుకోమని పెద్దలకు నా మనవి. గొర్రెల సంరక్షణను జాగ్రత్తగా నిర్వర్తించే కాపరుల లాంటివాళ్ళే మీరు కూడా. ఇలాంటి పనిని ఏదో బలవంతంగానో, మొక్కుబడిగానో చేయొద్దు. దేవుడు ఆశించిన విధంగా ఇష్టపడి చేయండి. పట్టుదలతో ఉత్చాహంగా చేయండి. అంతేగానీ డబ్బుకు ఆశపడి మాత్రం చేయకండి.
\p
\v 3 దేవుడు మీకప్పగించిన వాళ్ళ మీద యజమానుల్లాగా పెత్తనం చెలాయించకండి. మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ నడుస్తున్న మీ జీవిత విధానం వాళ్ళకొక చక్కని ఉదాహరణగా ఉండాలి.
\v 4 మన ప్రధాన కాపరి అయిన యేసు తిరిగి ప్రత్యక్షమైనపుడు మీరిలా చేస్తూ ఉంటే, మీలో ప్రతిఒక్కరికీ ఘనమైన పారితోషికం ఆయన అందిస్తాడు. అది పరుగు పందెంలో గెలిచిన వాళ్ళకి ఇచ్చే పతకం లాగా ఘనంగా ఉంటుంది. పైగా ఆ పతకం కొంత కాలానికి పాడై పోతుంది గానీ దేవుడిచ్చే పతకం నిత్యం నిలిచి ఉంటుంది.
\s5
\p
\v 5 చిన్నలారా, మీరు సంఘం లోని పెద్దలకు లోబడి ఉండండి. విశ్వాసులందరూ ఒకరికొకరు వినయ విధేయతలతో మెలగండి. ఎందుకంటే దేవుడు గర్విష్టులను తిరస్కరించి వినయం గలవాళ్ళ ఎడల దయగా ఉంటాడు.
\p
\v 6 కాబట్టి దేవుడు తన అధిక బలంతో గర్విష్టుల మదాన్ని అణచి వేస్తాడని తెలుసుకోండి. తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.
\v 7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి.
\s5
\p
\v 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు.
\v 9 క్రీస్తు ఎడలా, ఆయన సువార్త ఎడలా ఉన్న మీ విశ్వాసాన్ని స్థిరంగా కొనసాగిస్తూ వాణ్ణి ఎదిరించండి. ప్రపంచమంతటా ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.
\s5
\v 10 ఎలాంటి పరిస్థితులైనా దేవుడు పట్టించుకుంటాడు, దయతో చక్క దిద్దుతాడు. ఆయనతో ఐక్యమై ఆయనలో నిత్యం ఉండే పరలోక ప్రభావాన్ని పంచుకోవడానికి మనల్ని ఎంపిక చేసుకున్నవాడు ఆయనే. లోకం లోని వాళ్ళు మీకు చేస్తున్న హానిని బట్టి మీరిలా కొంత కాలం బాధలు అనుభవించినా తరువాత తానే మీ ఆత్మ సంబంధమైన కొరతలు తొలగించి, మిమ్మల్ని సరైన ఆత్మ స్థితిలోకి తెచ్చి, మీరు బలపడి విశ్వాసంతో ఆయనను వెంబడించేలా అన్నివిధాలుగా మిమ్మల్ని ఆదుకుంటాడు.
\v 11 ఆయన బలమైన అధికారం నిత్యమూ ఉండు గాక. ఆయనకే ప్రభావం శాశ్వతంగా కలుగు గాక, ఆమేన్‌.
\s5
\p
\v 12 నేను చెబుతుండగా సిల్వాను ఈ లేఖ రాశాడు. అతణ్ణి నమ్మకమైన నా తోటి సహోదరుడుగా నేను ఎంచాను. దేవుడు ప్రీతిగా మన నిమిత్తం చేస్తున్న, మనం యోగ్యులం కాకపోయినా ఆయన ఇస్తున్న విషయాలన్ని క్రోడీకరించి మిమ్మల్ని ధైర్యపరిచేలా రాసిన ఈ చిన్ని ఉత్తరంలోని సమాచారమంతా కచ్చితంగా యధార్ధమే. దీనిలో నిలకడగా ఉండండి.
\p
\v 13 దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నట్టే, అప్పుడప్పుడూ మనం బబులోను అని పిలుస్తున్న ఈ పట్టణంలో కూడా దేవునిచేతా దేవుని కోసం దేవుని ప్రజగా ఎంపికైన వాళ్ళు మీకు అభినందనలు చెబుతున్నారు. నా కొడుకు లాంటి మార్కు కూడా మీకు అభినందనలు చెబుతున్నాడు.
\v 14 ప్రేమ ముద్దుతో ఒకరికొకరు అభినందనలు చెప్పుకోండి. క్రీస్తును చేరిన మీకందరికీ ఆయన శాంతి దయచేయు గాక.

123
62-2PE.usfm Normal file
View File

@ -0,0 +1,123 @@
\id 2PE - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h పేతురు రాసిన రెండవ పత్రిక
\toc1 పేతురు రాసిన రెండవ పత్రిక
\toc2 పేతురు రాసిన రెండవ పత్రిక
\toc3 2pe
\mt1 పేతురు రాసిన రెండవ పత్రిక
\s5
\c 1
\p
\v 1 సీమోను పేతురు అనే నేను మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. యేసుక్రీస్తు తన సేవకుడనైన నన్ను అపొస్తలుడుగా నియమించుకున్నాడు. క్రీస్తు అపొస్తలులమైన మాతో సమానంగా ఆయనలో విశ్వాసముంచిన కారణంగా మీ అందరి కోసం ఈ ఉత్తరం పంపుతున్నాను. క్రీస్తులో విశ్వాసం విషయంలో మేమూ, మీరూ ఒకే స్థాయిలో ఉన్నాము. మనం సేవించే దేవుడు నీతిమంతుడు. ఆయనే మన రక్షకుడు. ప్రభువైన యేసులో నమ్మకముంచిన మీ అందరికి కృప కలగాలని కోరుకుంటున్నాను.
\v 2 దేవుడు మీకు కృపను, శాంతిని కలుగచేయాలని ప్రార్ధిస్తున్నాను, ఎందుకంటే మీరు దేవుడు ప్రభువైన యేసును నిజంగా తెలుసుకున్నారు.
\s5
\p
\v 3 మనం నిత్యజీవంతో ఆయన్ని ఘనపరిచేలా దేవుడు మనకి సమస్తమూ దయచేశాడు. దేవునిగా ఆయన శక్తితో ఇదంతా చేశాడు. మనం ఆయనను తెలుసుకున్నదానికి ఫలితంగా మనకి ఇదంతా దయచేశాడు. మన దేవుడు మంచివాడు, శక్తివంతుడు గనుక మనల్ని తన ప్రజలుగా ఎంపిక చేసుకున్నాడు.
\v 4 దీన్ని బట్టే ఆయన మనకు అమూల్యమైన వాగ్దానాలు దయచేశాడు. ఆయన వాగ్దానంపై నమ్మకం ఉంచి, దేవుని వలె నీతికరమైన మార్గంలో నడుచుకుంటే, అవిశ్వాసుల వలె దుష్ట కోరికలు కలిగి ఉండక మంచి మార్గంలో ఉంటాము.
\s5
\p
\v 5 ఎలాగైతే దేవుడు అవన్నీ చేశాడో, మనం కూడా క్రీస్తులో విశ్వాసముంచడమే కాక, మంచి జీవితం గడపటానికి ప్రయత్నం చెయ్యాలి. అంతే కాకుండా దేవుని గురించి కూడా ఎక్కువగా తెలుసుకుంటూ ఉండాలి.
\v 6 అంతేకాకుండా మీ మాటల్లో, మీరు చేసే పనుల్లో అదుపు కలిగి ఉండాలి. అదుపులో ఉండటమే కాకుండా దేవునికి విధేయులై ఉండాలి. విధేయత కలిగి ఆయన్ని ఘనపరచాలి.
\v 7 ఆయనను ఘనపరచడమే కాకుండా నీ తోటి విశ్వాసులు, సోదర సోదరీల విషయంలో జాగ్రత వహించాలి. దాంతోపాటు ఇతరులను ప్రేమించాలి.
\m
\s5
\v 8 ఈ విషయాలు ఎక్కువగా చెయ్యడం వలన, దేవుణ్ణి తెలుసుకున్నవారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి.
\v 9 కాని ఈ గుణాలు లేనివాడు, అంటే ఈ విషయాలు ముఖ్యం కావు అనుకునేవాడు దూరదృష్టి లేని గుడ్డివాడు. గుడ్డివారికి తమ చుట్టూ ఏమి జరుగుతుందో తెలియదు. అలాంటివారికి లోకసంబంధమైన విషయాలే ముఖ్యం. వారికి దేవుడు తాము గతంలో చేసిన పాపాలనుండి కాపాడాడు అనే విషయం మర్చిపోతారు.
\m
\s5
\v 10 అలాంటి వారిలా ఉండక, దేవునిచే ఎంపికైన వారిలా అందరికీ తెలిసేలా ప్రవర్తించండి. మీరు అలా చేస్తే, ఎప్పటికి దేవుని నుండి విడిపోరు.
\v 11 అంతేకాక దేవుడు మిమ్మల్ని హృదయపూర్వకంగా రక్షకుడైన యేసు తన ప్రజలను పాలించే చోటికి ఆహ్వానిస్తాడు.
\s5
\p
\v 12 వీటి గురించి మీకు ముందే తెలిసినా, మీరు అంగీకరించిన సత్యంలో స్థిరంగా ఉన్నా ఈ సంగతులు మీకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాను.
\v 13 నేను జీవించి ఉన్నంత వరకూ ఈ విషయాలను మీకు గుర్తు చేయడం మంచిదని భావిస్తున్నాను.
\v 14 మన ప్రభువు యేసు క్రీస్తు ముందుగానే నాకు చెప్పిన ప్రకారం నేను త్వరలోనే చనిపోతానని నాకు తెలుసు.
\v 15 కాని, నేను చనిపోయిన తరువాత కూడా మీరు వీటిని ఎప్పుడూ గుర్తు చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటాను.
\s5
\p
\v 16 అపొస్తలులమైన మేము ప్రభువైన యేసు శక్తివంతుడనీ ఆయన తిరిగి రాబోతున్నాడనీ చెప్పాము. మేము ఏదో కట్టుకథలను ఆధారం చేసుకొని ఈ విషయాలను చెప్పడం లేదు. మేము మా కళ్ళతో చూసిన యేసు గొప్పదనాన్ని చెప్పాము.
\v 17 ఆయన మన తండ్రి అయిన దేవుని నుండి గొప్ప వెలుగు రూపంలో ఘనత, మహిమ పొందగా, "ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన విషయంలో నేను ఆనందిస్తున్నాను" అని చెప్పాడు.
\v 18 ఆయనతో మేము ఆ పవిత్ర పర్వతం మీద ఉండగా పైనుండి వచ్చిన ఆ స్వరాన్ని చెవులారా విన్నాము.
\s5
\p
\v 19 క్రీస్తు గురించి ప్రవక్తలు ఎప్పుడో చెప్పిన విషయం వాస్తవమేననిమేము విశ్వసిస్తున్నాం. వారు రాసిన విషయాన్ని నమ్మండి, ఎందుకంటే అది చీకట్లో మనకి దారి చూపించి వెలుగునిచ్చే దీపం వంటిది. ఆ వెలుగు వేకువచుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకూ వెలుగుతుంది.
\v 20 ఏ ప్రవక్త అయినా ఈ విషయాలను ఊహించి చెప్పడం అసాధ్యమని గ్రహించండి.
\v 21 ఏ ప్రవచనం మానవ నిర్ణయం నుండి రాలేదు. దేవుని సందేశం అందించే వాళ్ళు దేవుని ఆత్మచే ప్రేరేపణ పొందినవారు. అందుకని పరిశుద్ధాత్మ కూడా వాటిని అర్థం చేసుకోడానికి సహాయం చెయ్యాలి.
\s5
\c 2
\p
\v 1 గతంలో కూడా ఇశ్రాయేలు ప్రజల్లో అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. అదే విధంగా మీ మధ్య కూడా అబద్ధ బోధకులు వస్తారు. మొదట్లో వారెవరో మీకు తెలియదు, వారు క్రీస్తు మీద నమ్మకాన్ని పోగొడతారు. వాళ్ళని విమోచించినవాడు ఆయనే అయినప్పటికీ, వాళ్ళు మన ప్రభువు ముఖ్యమైన వాడు కాదని ఆలోచించడం ప్రారంభిస్తారు. కానీ దేవుడు తొందరగానే ఆ అబద్ధ ప్రవక్తలను నాశనం చేస్తాడు.
\v 2 అనేకమంది ఆ అబద్ధ ప్రవక్తల్లా జీవిస్తారు. ఆ విధంగా వారు దేవుణ్ణి అవమానిస్తారు.
\v 3 ఈ అబద్ధ బోధకులు కట్టు కథలతో తమ స్వలాభం కోసం మిమ్మల్ని వాడుకుంటారు. వారిని శిక్షించడానికి దేవుడు ఆలస్యం చెయ్యడు, త్వరలోనే వారు నాశనమవుతారు.
\s5
\p
\v 4 పాపం చేసిన దేవదూతల్ని కూడా ఆయన నాశనం చేశాడు. వాళ్ళను నరకంలో దారుణమైన చోటుకి విసిరివేసి, తీర్పు తీర్చి శిక్షించే వరకు చీకటిలో బంధించి ఉంచాడు.
\v 5 అలాగే పూర్వకాలంలో జీవించిన ఉన్న ప్రజలను దేవుడు నాశనం చేశాడు. నీతిని ప్రకటించిన నోవహుతో పాటు మొత్తం ఎనిమిదిమందిని కాపాడి, దైవభక్తి లేని ప్రజల మీదికి జల ప్రళయం రప్పించాడు.
\v 6 దేవుడు సొదొమ, గొమొర్రా పట్టణాలపై తీర్పు విధించి వాటిని భస్మీపటలం చేశాడు. దేవుణ్ణి దూషించే వారికి ఇదొక హెచ్చరిక వంటిది.
\m
\s5
\v 7 కాని దేవుడు అబ్రాహాము బంధువు, నీతిపరుడైన లోతును రక్షించాడు. సొదొమలో ప్రజల అనైతిక కార్యాలు చూసి లోతు మనస్తాపానికి గురయ్యాడు.
\v 8 దినదినం ఆ దుర్మార్గుల మధ్య ఉంటూ, వారు చేసే అక్రమమైన పనులు చూస్తూ, వింటూ, నీతిగల అతను వేదన చెందేవాడు.
\v 9 లోతును కాపాడిన దేవునికి తనను మహిమ పరిచే వారిని ఎలా కాపాడాలో తెలుసు, అలాగే తనను మహిమ పరచని వారిని తీర్పు రోజున ఎలాశిక్షించాలో కూడా ప్రభువుకు తెలుసు.
\s5
\p
\v 10 ముఖ్యంగా తాము చెయ్యాలనుకునే పనులు చేసేవాళ్ళు, దేవునికి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు. వారు అహంకారంతో తమ ఇష్టం వచ్చిన పనులు చేస్తూ, దేవదూతల్ని కూడా దూషిస్తారు.
\v 11 దేవదూతలు వారికంటే ఎంతో గొప్ప బలం, శక్తి కలిగి ఉండి కూడా ప్రభువు ముందు వారిని దూషించి అవమానించలేదు.
\s5
\p
\v 12 చెడ్డ విషయాలను బోధించే పశువుల్లాంటి మనుషులు మన లాగా ఆలోచించరు, వారు దేవుణ్ణి గురించి తెలియక పోయినా దూషిస్తారు. అలాంటి వారిని క్రూర మృగాలను వేటాడినట్టు దేవుడు నాశనం చేస్తాడు.
\v 13 వారి చెడుతనానికి ప్రతిఫలంగా వారికే హాని కలుగుతుంది. వారు అహోరాత్రాలు తాగుతూ విందులు చేసుకుంటారు. వారు ఒకసారి శుభ్రంగా ఉతకిన వస్త్రంపై అంటిన మురికి మచ్చల వంటివారు.
\v 14 వారు కనబడిన ప్రతి స్త్రీతో వ్యభిచరించాలి అనుకుంటారు. వారి పాపానికి అంతం ఉండదు. వారు దేవునిలో బలహీనులుగా ఉన్నవారిని తమతో కలవాలని ఒప్పిస్తారు. క్రీడాకారులు తమ క్రీడలు కోసం శిక్షణ పొందినట్టు వారు అత్యాశపరులుగా మారడానికి తమను తాము తయారు చేసుకున్నారు. కానీ దేవుడు వాళ్ళని శపించాడు.
\s5
\p
\v 15 దేవునికి నచ్చినట్టు వారు జీవించరు. వారు బెయోరు కొడుకైన బిలామును అనుసరించారు. అతడు అవినీతి సంబంధమైన జీతం కోసం ఆశపడ్డాడు.
\v 16 కాని, బిలాము చేసిన దుష్టకార్యాలకు మాటలు రాని గాడిద మానవ స్వరంతో మాటలాడడం ద్వారా దేవుడు నిరోధించాడు.
\s5
\p
\v 17 అబద్దాలను బోధించేవారు నీళ్ళు లేని బావులు. బలమైన గాలికి కొట్టుకుపోయే పొగమంచు వంటివారు. అలాంటి వారికి దేవుడు గాఢమైన చీకటి సిద్ధపరిచి ఉంచాడు.
\v 18 వారు పనికిమాలిన డంబాలు పలుకుతూ ఉంటారు. వారు అప్పుడే విశ్వాసులైన వారిని పాపపు మార్గం లోకి తిరిగి రప్పించి వారిని పాపం చేసేలా ప్రేరేపిస్తారు.
\v 19 ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెయ్యొచ్చని అందరినీ ప్రేరేపిస్తారు. కాని వారే స్వయంగా చెడుకు బానిసలై ఉండి, వారి చెడు మనసు చెప్పినట్లు చేసేవాళ్ళు. ఒక వ్యక్తిని ఏదైతే అదుపు చేస్తుందో, దానికి అతను బానిస.
\s5
\v 20 ఎవరైనా ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు విషయంలో జ్ఞానం వల్ల ఈ లోకపు అపవిత్రతను తప్పించుకున్న తరువాత మళ్లీ తిరిగి పాపంలోకి వస్తే , వారి మొదటి స్థితి కన్నా చివరి స్థితి మరింత దారుణంగా ఉంటుంది.
\v 21 అలాంటి వారు సరైన మార్గంలోకి రాకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే దేవుడు వారిని మరింతగా శిక్షిస్తాడు. వారు దేవుని ఆజ్ఞను, అపోస్తలుల బోధను తిరస్కరించారు.
\v 22 వారు ప్రవర్తించే తీరు "కుక్క తాను కక్కిన దాన్ని తిన్నట్టుగా, కడిగిన తరువాత పంది బురదలో పొర్లడానికి తిరిగి వెళ్లినట్టుగా" అన్న సామెతలాగా ఉంది.
\s5
\c 3
\p
\v 1 ప్రియులారా, ఇది నేను మీకు రాస్తున్న రెండవ ఉత్తరం. మీకు ముందే తెలిసిన విషయాలను గుర్తు చేయడానికి, ఆ విషయాలు గురించి మిమ్మల్ని ఉత్తేజపరచడానికి ఈ రెండు ఉత్తరాలు మీకు రాస్తున్నాను.
\v 2 పవిత్ర ప్రవక్తలు పూర్వకాలంలో చెప్పిన మాటలనూ, మన ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు గుర్తు చేసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను.
\s5
\p
\v 3 మీరు ముఖ్యంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, క్రీస్తు తిరిగి వచ్చే చివరి రోజుల్లో, ప్రజలు ఆ విషయంపై హేళన చేస్తారు, వారు తమకు నచ్చినట్టు చెడు కార్యాలు చేస్తారు.
\v 4 "ఆయన మళ్ళీ వస్తాడన్న వాగ్దానం ఏమయ్యింది? మన పూర్వీకులు చనిపోయారు, కాని సృష్టి ఆరంభం నుండి అన్ని విషయాలూ ఏమీ మార్పు లేకుండానే జరిగిపోతున్నాయి" అంటూ మిమ్మల్ని హేళన చేస్తారు.
\s5
\p
\v 5 వారు హేళనగా , పూర్వం దేవుని ఆజ్ఞ ద్వారా భూమి, పరలోకం సృష్టి అయిందని, ఆయనే నీటిలోంచి భూమిని వేరు పరిచాడని,
\v 6 ఆయన వాక్కును బట్టే, ఆ రోజుల్లో ఉన్న లోకం వరద నీటిలో మునిగి నాశనం అయ్యిందనీ,
\v 7 అంతేకాక ఆయన తన వాక్కును బట్టి ఆకాశాన్ని భూమిని వేరు చేసాడని, భక్తిహీనులకు జరిగే తీర్పు రోజున అగ్నికీలల్లో ఆకాశాలనూ భూమినీ నాశనం చేస్తాడని, వారు గుర్తుంచుకోరు.
\s5
\p
\v 8 ప్రియులారా, దేవుడు భూమిపై జనులకు తీర్పు తీర్చడానికి ఇంకా చాలా కాలం వేచి ఉంటాడని మీకు చెప్పాలనుకుంటున్నాను. కాని ఆయనకు కాలంతో సంబంధం లేదు. ప్రభువు దృష్టికి ఒక్క రోజు వెయ్యి సంవత్సరాలుగా, వెయ్యి సంవత్సరాలు ఒక్క రోజుగా ఉంటాయి.
\v 9 కనుక, దేవుడు తీర్పు తీర్చడానికి రావడం లేదనీ , ఆయన వాగ్దానం ఆలస్యమైందనీ అనుకోకూడదు. కొందరైతే క్రీస్తు అసలు తిరిగి రాడని అంటారు. కాని మనం గమనించాల్సింది ఏమిటంటే, దేవుని ఆలస్యానికి కారణం మన పట్ల ఆయన కృప. ఎందుకంటే ఆయన అందరూ పాపపు జీవితాల నుంచి మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.
\s5
\p
\v 10 అయితే ప్రభువు రాకడ ఎవరికీ తెలియని విధంగా ఉంటుంది. హెచ్చరిక లేకుండా వచ్చే దొంగలాగా ఆయన రాక ఉంటుంది. ఆ సమయంలో పెద్ద గర్జన శబ్దం వస్తుంది. ఆకాశాలు గతించిపోతాయి. పంచభూతాలు మంటల్లో దగ్ధమై పోతాయి. భూమి, దానిలో ఉన్నవన్నీ దేవుని ఎదుట తీర్పుకు గురౌతాయి.
\s5
\p
\v 11 దేవుడు ఈ విధంగా అన్నిటిని నాశనం చేస్తాడు గనుక, మీ ప్రవర్తన మీకు తెలిసి ఉండాలి, అది దేవుణ్ణి మహిమ పరిచే విధంగా ఉండాలి.
\v 12 దేవుడు వచ్చే రోజు కోసం మీరు ఎదురు చూస్తున్నారు గనుక ఆ రోజు త్వరగా రావాలని ఆశించండి. ఆ రోజున ఆకాశం నాశనం అయిపోతుంది. పంచభూతాలు మంటల్లో దహించుకుపోయి కరిగిపోతాయి.
\v 13 ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు వాగ్దానం చేసిన కొత్త ఆకాశం, కొత్త భూమి కోసం మనం ఎదురు చూస్తూ సంతోషంగా ఉంటాము. అందులో నీతిపరులు మాత్రమే నివాసముంటారు.
\s5
\p
\v 14 కాబట్టి, ప్రియులారా, మీరు వీటి కోసం ఎదురు చూస్తున్నారు గనక, మనం చేసే ప్రతి పనీ దేవుణ్ణి మహిమ పరిచే విధంగా, ఆయన దృష్టిలో ఏ పాపం లేకుండా ప్రశాంతంగా జీవించాలి.
\v 15 మన ప్రభువు చూపించే సహనం మన రక్షణ కోసమే అని గ్రహించండి. ఆ విధంగానే మన ప్రియ సోదరుడు పౌలు కూడా దేవుడు తనకు ఇచ్చిన జ్ఞానంతో ఇవే విషయాలు రాశాడు.
\v 16 పౌలు రాసిన ఉత్తరాల్లో కొన్నిటిని అర్థం చేసుకోవడం కష్టం. అయితే దేవుని గురించి తెలియని, నిలకడ లేని కొందరు అనేక ఇతర లేఖనాలను చేసినట్టే వీటిని కూడా వక్రీకరిస్తున్నారు. దాని ప్రతిఫలం, దేవుడు వారిని శిక్షిస్తాడు.
\s5
\p
\v 17 కాబట్టి ప్రియులారా, ఈ విషయాలు మీకు తెలుసు కాబట్టి, ఈ చెడు బోధకుల నుంచి దూరంగా ఉండండి. చెడు విషయాలతో మిమ్మల్ని మోసం చేయ్యనివ్వకండి. మీ విశ్వాసంలో స్థిరత్వాన్ని వాళ్ళు పాడు చేయకుండా జాగ్రత్తపడండి.
\v 18 దానికి బదులుగా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపలో జీవించండి. తద్వారా ఆయనను మరింత ఎక్కువగా తెలుసుకోండి.
\p ఇప్పుడు, నిరంతరం మన ప్రభువైన యేసు క్రీస్తును మీరంతా ఘనపరిచేలా నేను వేడుకుంటున్నాను. ఇది నిజమగు గాక.

198
63-1JN.usfm Normal file
View File

@ -0,0 +1,198 @@
\id 1JN - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h యోహాను రాసిన మొదటి పత్రిక
\toc1 యోహాను రాసిన మొదటి పత్రిక
\toc2 యోహాను రాసిన మొదటి పత్రిక
\toc3 1jn
\mt1 యోహాను రాసిన మొదటి పత్రిక
\s5
\c 1
\p
\v 1 సృష్టిలో ఇంకా ఏమైనా ఉనికిలోకి రాకముందే ఉన్నవాడిని గూర్చి యోహాననే నేను మీకు రాస్తున్నాను. ఆయన బోధిస్తుండగా అపోస్తులమైన మేము ఆయన చెప్పింది విన్నాము. మేము ఆయన్ని చూశాము. మా అంతట మేమే ఆయన వైపు చూసి, ఆయన్ని తాకాము. నిత్యజీవాన్ని గూర్చిన సువార్తను మాకు నేర్పినవాడు ఆయనే.
\v 2 ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, మేము ఆయన్ని చూశాము. మేము చూసిన ఆ వ్యక్తే ఎప్పుడూ జీవిస్తున్న వాడని మేము మీకు స్పష్టంగా ప్రకటిస్తున్నాము. ఆయన ఇంతకుమునుపు పరలోకంలో తండ్రితో పాటు ఉన్నాడు, కానీ మన మధ్య నివసించటానికి పరలోకం నుంచి దిగి వచ్చాడు.
\s5
\p
\v 3 మీరు మాతోపాటు సహవాసంలో కలవడానికి వీలుగా మేము చూసిన, విన్న యేసును గూర్చిన సువార్తను మేము మీకు ప్రకటిస్తున్నాము. మన తండ్రియైన దేవుడితోను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోను ఒకేసారి మేము సహవాసంలో జత కలిశాము.
\v 4 అవి సత్యాలని మీరు కూడా నమ్మి తద్వారా మీరు ఒప్పుకుంటారని ఈ విషయాలను గూర్చి మీకు రాస్తున్నాను. దాని ఫలితంగా మనందరమూ సంపూర్ణ ఆనందాన్ని పొందుతాము.
\s5
\v 5 మేము దేవుని నుంచి విన్న సువార్తనే మీకు ప్రకటిస్తున్నాము. ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. ఆయన అసలు చీకటంటూ లేనివాడు, ప్రకాశమానమైన వెలుగు వంటివాడు.
\v 6 మనం దేవునితో కలసి సహవాసంలో ఉన్నామని చెప్పుకుంటూ, ఇంకా అపవిత్రమైన పద్ధతుల్లో జీవితాలను కొనసాగిస్తే, అది పాపకూపంలో జీవించడం లాంటిదే. ఇంకా చీకటిలోనే ఉన్నట్లే. మనం అబద్ధాలను చెబుతున్నామన్నమాట. దేవుని నిజమైన సందేశంమనకు బోధించిన విధంగా మన జీవితాలను కొనసాగించడం లేదు.
\p
\v 7 అన్ని విషయాల్లో దేవుడు పవిత్రంగా జీవిస్తున్నట్టే, మనం పవిత్రంగా జీవించడం అంటే దేవుని వెలుగులో జీవించడం లాంటిదే. మనం అలా జీవించినట్లయితే మనం ఒకరితో ఒకరం కలిసిమెలిసి ఉంటాము. యేసు మన కోసం మరణించాడు కాబట్టి దేవుడు మన పాపాలను క్షమించి, మనలను అంగీకరిస్తాడు.
\s5
\v 8 మేము ఎన్నడూ పాపం చేయలేదని చెప్పుకునే వాళ్ళు, తమను తాము మోసం చేసుకుంటున్నారు. అంతేకాకుండా దేవుడు వాళ్ళను గూర్చి చెప్పినదాన్ని నమ్మటానికి నిరాకరిస్తున్నారు.
\v 9 కానీ దేవుడు చేస్తానని చెప్పినది ఆయన ఎప్పుడూ చేస్తూనే ఉన్నాడు. అంతేకాక ఆయన చేస్తున్నది ఎప్పుడూ సరైనదే. కాబట్టి మనం పాపం చేశామని ఆయన ముందు ఒప్పుకుంటే, ఆయన మన కోసం మన పాపాలను క్షమిస్తాడు. మనం చేసిన ప్రతి పాపకృత్యం యొక్క అపరాధం నుంచి మనల్ని విముక్తుల్ని చేస్తాడు. అందుచేత మనం పాపం చేశామని ఆయన ఎదుట ఒప్పుకోవాలి.
\v 10 ప్రతి ఒక్కరూ పాపం చేశారని దేవుడు చెప్పినందున, మేము ఎన్నడూ పాపం చేయలేదని చెబుతున్నవాళ్ళు, దేవుడు అబద్ధం చెబుతున్నట్లుగా మాట్లాడుతున్నారు. మన గూర్చి దేవుడు చెబుతున్న దాన్ని వాళ్ళు తిరస్కరిస్తున్నారు.
\s5
\c 2
\p
\v 1 నాకు ఎంతో ప్రియమైన నా సొంత పిల్లల్లాంటి వాళ్ళు మీరు. మీరు పాపానికి దూరంగా ఉండాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. విశ్వాసులైన మీలో ఎవరైనా పాపం చేస్తే, నీతిమంతుడైన యేసు మనలను క్షమించమని మన కోసం దేవుణ్ణి వేడుకుంటాడని గుర్తుంచుకోండి.
\v 2 మన ప్రభువైన యేసు క్రీస్తు స్వచ్చందంగా తన సొంత ప్రాణాన్ని మన కోసం బలిగా అర్పించాడు. తద్వారా దేవుడు మన పాపాలను క్షమించాడు. పిల్లల్లారా అవును. దేవుడు మన పాపాలు క్షమిస్తాడు. మన పాపాలను మాత్రమే కాదు, లోకమంతటా ఉన్న ప్రజల పాపాలను ఆయన క్షమిస్తాడు.
\p
\v 3 దేవుడు మనకు కచ్చితంగా తెలుసని ఎలా చెప్పగలము అనేది నేను మీకు చెబుతాను. ఆయన మనకు చేయమని ఆజ్ఞాపించినట్టుగా మనం నడుచుకుంటే మనం ఆయనతో కలిసి సహవాసంలో ఉన్నామని అది మనకు తెలియజేస్తుంది.
\s5
\v 4 మాకు దేవుడు తెలుసు అని చెబుతున్న వాళ్ళందరూ, దేవుడు చేయమని ఆజ్ఞాపించిన వాటిని పాటించని అబద్ధీకులే. దేవుని సువార్తకు అనుగుణంగా వాళ్ళు తమ జీవితాలను కొనసాగించడం లేదు.
\v 5 అయితే దేవుడు చేయమని ఆజ్ఞాపించిన వాటిని పాటిస్తున్న మనుషులు దేవుణ్ణి అన్ని రకాలుగా ప్రేమిస్తున్నారు. ఈ విధంగా మనం దేవునితో కలిసి సహవాసంలో ఉన్నామని కచ్చితంగా చెప్పవచ్చు.
\p
\v 6 మనం దేవునితో ఐక్యంగా ఉన్నామని చెబితే, క్రీస్తు ఏవిధంగా జీవించాడో, ఆ విధంగా మన జీవితాలను కొనసాగించుకోవాలి.
\s5
\v 7 నా ప్రియమైన స్నేహితుల్లారా, మీరేదో కొత్తది చేయమని నేను రాయడం లేదు. మీరు క్రీస్తులో మొదట విశ్వాసం ఉంచినప్పటి నుంచి, ఏది చేస్తున్నారో దాన్నే చేయమని మీకు తెలిసిందే నేను రాస్తున్నాను. మీరు ఎప్పుడూ వింటున్న సందేశంలోని భాగమే ఇది.
\v 8 కానీ ఈ విషయం పైనే నేను మీకు మళ్ళీ ఒకటి చెబుతాను. ఒక కొత్త విషయాన్ని చేయమని నేను మీకు చెబుతున్నాను. క్రీస్తు చేసిన పని కొత్తది. అలాగే మీరు చేస్తున్న పని కొత్తది. దీని కారణంగా మీరు పాపం చేయడం ఆపేస్తున్నారు. అంతే కాకుండా మరింత మంచిని చేస్తున్నారు. రాత్రి గడిచిపోయి మెల్లగా తెల్లవారుతున్నట్లుగా, క్రీస్తు తిరిగి వచ్చే రోజు ఉంటున్నది.
\s5
\p
\v 9 వెలుగులో నివసిస్తున్నామని ప్రకటించుకుంటున్న వాళ్ళు విశ్వాసులను ఇంకా ద్వేషిస్తున్నట్లయితే, వాళ్ళు ఇంకా చీకటిలో నివసిస్తున్న వ్యక్తులే.
\v 10 కానీ తమ తోటి విశ్వాసులను ప్రేమించేవాళ్ళు, వెలుగులో నివసించే మనుషుల్లాగా ప్రవర్తిస్తారు. వాళ్ళు పాపం చేయడానికి ఇకపై ఏ కారణం లేదు.
\v 11 కానీ తమ తోటి విశ్వాసులను ద్వేషిస్తున్న వాళ్ళు చీకటిలోనే నివసిస్తున్న మనుషుల్లా ఇంకా అపవిత్రమైన విధానాల్లోనే తమ జీవితాలు కొనసాగిస్తున్నారు. చివరికి వాళ్ళు తాము కూర్చున్న కొమ్మ తామే నరుక్కుంటున్నామని వాళ్ళకు తెలియదు. ఆత్మీయ సత్యాన్ని ఎరుగక ఆత్మీయంగా అంధులుగా మారారు.
\s5
\p
\v 12 నేను ప్రేమిస్తున్న నా సొంత పిల్లలే అయినప్పటికీ, ఇది మీకు రాస్తున్నాను. క్రీస్తు మీ కోసం చేసిన బలియాగం వల్ల దేవుడు మీ పాపాలను క్షమించాడు.
\v 13 మిగతావాళ్ళలో పెద్దవాళ్ళైన విశ్వాసులకు నేను ఈ విధంగా రాస్తున్నాను. క్రీస్తు ఎప్పుడూ జీవించే వాడని మీకు తెలుసు. యువకులకు కూడా నేను ఈ విధంగా రాస్తున్నాను. మీరు దుర్మార్గుడైన సాతానును ఓడించారు.
\v 14 చిన్న పిల్లలకు నేను రాస్తున్నదేమిటంటే, దేవుడు మనకు తండ్రి అని మీకు తెలుసు. దాన్నే మళ్ళీ మీకు చెబుతున్నాను. వృద్ధులకు నేను చెబుతున్నదేమిటంటే ఎప్పుడూ ఉనికిలో ఉన్నవాడు క్రీస్తే అని మీరు తెలుసుకున్నారు. యువకులకు నేను రాస్తున్నదేమిటంటే, మీరు దృఢంగా ఉన్నారు. మీకు దేవుడు ఆజ్ఞాపించిన వాటిని పాటించడం కొనసాగించండి. ఎందుకంటే మీరు దుర్మార్గుడైన సాతానును ఓడించారు.
\s5
\v 15 ఈ లోకంలో దేవుణ్ణి గౌరవించని మనుషుల్లాగా ప్రవర్తించకండి. అలాంటి వ్యక్తులు కోరుకుంటున్న వస్తువులను కోరుకోవద్దు. అలాంటి వ్యక్తులు జీవిస్తున్నట్లుగా ఎవరైనా జీవించాలనుకుంటే, వాళ్ళు మన తండ్రియైన దేవుణ్ణి ప్రేమించడం లేదని నిరూపిస్తున్నారు.
\p
\v 16 మనుషులు చేసే అన్ని పాపకార్యాలు, అన్ని విషయాలవైపు మనుషులు చూసే దృక్పథం, వాటిని పొందటానికి తమకుతాము చేసే ప్రయత్నాలు, అన్ని విషయాలను గూర్చి వాళ్ళు తమను తాము పొగుడుకునే ప్రగల్భాల వంటి విషయాలలో పరలోకంలో ఉన్న మన తండ్రికి ఎలాటి సంబంధం లేదు. వీళ్ళు ఈ పాప లోకానికి సంబంధించిన మనుషులు కాబట్టే నేను ఇలా రాస్తున్నాను.
\v 17 దేవుణ్ణి గౌరవించలేని ఈ లోకంలోని మనుషులు, తాము ఎంతో కోరుకునే నశించిపోయే వస్తువులతో పాటు కనిపించకుండా పోతారు. కానీ ఎవరైతే దేవుడు చేయమని కోరిన వాటిని తుచ తప్పకుండా చేస్తారో, వాళ్ళు శాశ్వతంగా జీవిస్తారు.
\s5
\p
\v 18 మీరు నాకు అత్యంత ప్రియమైన వారు. యేసు భూమి మీదకు తిరిగి వచ్చే సమయం దగ్గరలో ఉంది. రాబోయే క్రీస్తును నేనే అంటూ నటించే వ్యక్తి వస్తాడని మీరు ఇప్పటికే విన్నారు. వాస్తవానికి అటువంటి వ్యక్తులు ఇప్పటికే వచ్చారు. వాళ్ళందరూ క్రీస్తుకు వ్యతిరేకులు. ఇలాంటి అబద్ధపు క్రీస్తుల కారణంగానే క్రీస్తు త్వరలో రాబోతున్నాడని మనకు తెలుస్తుంది.
\v 19 నిజానికి వీళ్ళు మొదటి నుంచి మనకు చెందిన వాళ్ళు కాదు కాబట్టే, ఈ మనుషులు మన సంఘంలో ఉండటానికి నిరాకరించారు. వాళ్ళు మనల్ని వదలి వెళ్ళినప్పుడు, వారెన్నడు మనతో కలసి సహవాసంలో లేరని మనం స్పష్టంగా చూశాము.
\s5
\v 20 కానీ పరిశుద్దుడైన క్రీస్తు మీ కోసం తన ఆత్మను ఇచ్చాడు. సమస్త సత్యాన్ని ఈయన ఆత్మయే మనకు బోధిస్తుంది.
\p
\v 21 ఈ లేఖ మీకు రాసేది దేవుని గురించిన సత్యం మీకు తెలియదని కాదు. అది ఏమిటో మీకు తెలిసినందువల్లే రాస్తున్నాను. దేవుడు మనకు ఆ సత్యాన్ని ఎన్నడూ బోధించలేదని మీకు తెలుసు. దానికి బదులుగా ఏది సత్యమో, దాన్ని మాత్రమే ఆయన మనకు బోధిస్తాడు.
\s5
\p
\v 22 ఘోరమైన దగాకోరులు ఎవరంటే యేసుక్రీస్తును నిరాకరించే వాళ్ళు. ఈ విధంగా చేస్తున్న వాళ్ళందరూ క్రీస్తు వ్యతిరేకులు. ఎందుకంటే వాళ్ళు తండ్రిని, ఆయన కుమారుణ్ణి నమ్మడానికి నిరాకరించారు.
\v 23 యేసును దేవుని కుమారుడని గుర్తించడానికి నిరాకరించే వాళ్ళు, ఏవిధంగానూ దేవునితో చేరిన వాళ్ళు కాదు. అయితే ఎవరైతే యేసును దేవుని కుమారుడని గుర్తిస్తారో, వాళ్ళు తండ్రితో కలిసి జీవిస్తారు.
\s5
\p
\v 24 కాబట్టి మీకు సంబంధించినంత వరకు, మీరు ప్రారంభంలో యేసుక్రీస్తును గూర్చి విన్న సత్యంలో మీ విశ్వాసాన్ని కచ్చితంగా కొనసాగించండి. మీరు దానికి అనుగుణంగానే జీవించండి. మీరు అలా చేయగలిగినట్లయితే, మీరు తండ్రి అయిన దేవునితోను, ఆయన కుమారుడితోను కలిసి ఉంటారు.
\v 25 మనం శాశ్వతంగా జీవించటానికి కారణం ఆయనే అవుతాడు అని దేవుడు మనకు చెబుతున్నాడు.
\p
\v 26 క్రీస్తును గురించిన సత్యానికి సంబంధించి మిమ్మల్ని మోసం చేయాలనుకునే వాళ్ళను గూర్చి మిమ్మల్ని హెచ్చరించటానికి నేను మీకు ఇది రాస్తున్నాను.
\s5
\v 27 మీకోసం క్రీస్తు నుంచి మీరు పొందిన దేవుని ఆత్మ మీలోనే ఉంది. కాబట్టి మరెవరో మీకు బోధకులుగా ఉండనవసరం ఏమీ లేదు. మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయం దేవుని ఆత్మ మీకు బోధిస్తాడు. ఆయన ఎన్నడూ అసత్యాన్ని బోధించడు. ఎప్పుడూ సత్యాన్నే బోధిస్తాడు. కాబట్టి ఆయనతో కలసి కొనసాగుతూ, ఆయన మీకు బోధించే మార్గంలో జీవితాన్ని కొనసాగించండి.
\p
\v 28 ఇప్పుడు మీరు నా ప్రియమైనవారే అని భావిస్తూ, క్రీస్తుతో కలసి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఆయన మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు, ఆయన మనల్ని అంగీకరిస్తాడని నమ్మకం ఉండేలా మన పనులు ఉండాలి. మనం అలా చేస్తే, ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట నిలబడి ఎంతమాత్రం సిగ్గుపడే అవసరం ఉండదు.
\v 29 క్రీస్తు ఎప్పుడూ సరైనదే చేస్తాడని మీకు తెలిసినప్పటినుంచి, సరైన దాన్ని చేస్తున్న వాళ్ళందరూ దేవుని పిల్లలుగా మారారని మీకు తెలుసు.
\s5
\c 3
\p
\v 1 మన తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడనే దాన్ని గూర్చి ఆలోచించండి. మనం ఆయన పిల్లలమని చెప్పడానికి ఆయన మనకు అనుమతినిస్తున్నాడు. అది వాస్తవం. కానీ అవిశ్వాసులైన మనుషులకు నిజమైన దేవుడు ఎవరో అర్థం కాలేదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎవరో కూడా వాళ్లకు అర్థం కాలేదు.
\v 2 నా ప్రియమైన స్నేహితుల్లారా, ప్రస్తుతానికి మనం దేవుని పిల్లలమైనప్పటికీ, భవిష్యత్తులో మనం ఎలా ఉండబోతున్నామో అనేది ఇంకా మనకు దేవుడు చూపించలేదు. అయినప్పటికీ క్రీస్తు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మనం ఆయనలా మారిపోతామని మాత్రం మనకు తెలుసు. ఎందుకంటే మనం ఆయన్ని ముఖాముఖిగా చూస్తాము.
\p
\v 3 కాబట్టి ఎవరైతే క్రీస్తును ముఖాముఖిగా చూస్తామని ఆత్మవిశ్వాసంతో ఉంటారో, వాళ్ళు పాపమే లేని క్రీస్తువలే తమను తాము పాపానికి దూరంగా ఉంచుకుంటారు.
\s5
\v 4 దేవుని ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తున్న ప్రతి ఒక్కరూ పాపంలోనే కొనసాగుతున్నారు. ఎందుకంటే పాపమంటే దేవుని ధర్మశాస్త్రాన్ని నిరాకరించడమే.
\v 5 మన అపరాధాన్ని పూర్తిగా తొలిగించటానికి క్రీస్తు వచ్చాడని మీకు తెలుసు. ఆయన ఎప్పుడూ పాపం చేయలేదని మీకు తెలుసు.
\v 6 క్రీస్తు కోరిన విధంగా చేస్తూ పదే పదే పాపం చేయకుండా ఉండండి. కానీ పదే పదే పాపాన్ని చేస్తున్న వాళ్ళకు క్రీస్తు ఎవరనేది అర్థం కాలేదు. అంతేకాక వాళ్ళు ఆయనతో నిజంగా కలవలేదు.
\s5
\v 7 కాబట్టే ఈ పాపం పెద్ద విషయం కాదు అంటూ చెప్పడం ద్వారా ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసం చెయ్యకుండా చూసుకోమని నాకు ప్రియమైన మిమ్మల్ని అభ్యర్ధిస్తున్నాను. ఏది మంచిదో దాన్ని చేయడం, కొనసాగించడం ద్వారా నీతిమంతుడైన క్రీస్తు వలే మీరు నీతిమంతులు అవ్వండి.
\p
\v 8 కానీ ఎవరైతే పదే పదే పాపం చేస్తున్నారో వాళ్ళు సాతాను వంటి వాళ్ళు. ఎందుకంటే ఈ లోకం ప్రారంభమైనప్పటి నుంచే సాతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సాతాను చేసిన పనులను నాశనం చేయడానికే దేవుని కుమారుడు సాధారణమైన మనిషిగా వచ్చాడు.
\s5
\v 9 మనుషులు దేవుని పిల్లలుగా మారినట్లయితే వాళ్ళు పదే పదే పాపం చేయటం కొనసాగించరు. వాళ్ళు దేవుని పిల్లలుగా మారినందువల్ల నిరంతరం పాపం చేయలేరు. దేవుడు వాళ్ళను తన పిల్లలుగా చేసుకున్నాడు. అంతేకాక ఆయన తాను ఎలాంటివాడో అలాంటిదాన్నే వాళ్ళలో పెట్టాడు.
\v 10 దేవుని పిల్లలకు, సాతాను పిల్లలకు మధ్య స్పష్టమైన తేడా ఉంటుంది. సాతాను పిల్లలు ఎవరో మనం తెలుసుకోవడానికి సరైన మార్గం ఏమిటంటే, సరైన మంచి పనులు చేయని వాళ్ళు దేవుని పిల్లలు కారు. తమ తోటి విశ్వాసులను ప్రేమించనివాళ్ళు దేవుని పిల్లలు కారు.
\s5
\p
\v 11 మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేదే మనం మొదట క్రీస్తులో విశ్వాసముంచినప్పుడు మనం విన్న సువార్త సందేశం.
\v 12 సాతాను సంబంధీ, దుర్మార్గుడు అయిన ఆదాము కుమారుడు కయీను చేసినట్లు, మనం ఒకరినొకరు ద్వేషించుకోకూడదు. ఎందుకంటే కయీను తన తమ్ముణ్ణి ద్వేషించి అతణ్ణి చంపాడు. కయీను తన తమ్ముణ్ణి ఎందుకు చంపాడు అనేది నేను మీకు చెప్తాను. కయీను సాతానుకు చెందిన దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రవర్తించటం అలవాటుగా మారడం, అదే సమయంలో అతని తమ్ముడు నీతి మార్గంలో ప్రవర్తించడం వల్ల అతడు తన తమ్ముణ్ణి ద్వేషించాడు.
\s5
\v 13 మిమ్మల్ని అవిశ్వాసులు ద్వేషించినప్పుడు మీరు ఆశ్చర్యపోవద్దు.
\v 14 మన తోటి విశ్వాసుల్ని మనం ప్రేమిస్తునందువల్ల దేవుడు మనల్ని శాశ్వతంగా తనతో పాటు జీవింప చేస్తాడని మనకు తెలుసు. కానీ తమ తోటి విశ్వాసులను ప్రేమించని వాళ్ళను నిత్యజీవంతో ఉన్నవాళ్ళుగా కాకుండా, మరణపు ముల్లు క్రిందనే జీవించే వాళ్ళుగానే పరిగణిస్తాడు.
\p
\v 15 తమ తోటి విశ్వాసులను ద్వేషించి, వాళ్ళ పట్ల ఏ కొద్దిగానైనా చెడు చెయ్యాలని ఆలోచించే వాళ్ళను, దేవుడు హంతకులుగానే చూస్తాడు. హంతకులకు పరలోక ప్రవేశం లేదని మీకు తెలుసు.
\s5
\v 16 క్రీస్తు స్వచ్చందంగా మనకోసం మరణించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, మన తోటి విశ్వాసులను నిజంగా ఏ విధంగా ప్రేమించాలనేది ఇప్పుడు మనకు తెలుసు. కాబట్టి, అదే విధంగా మన తోటి విశ్వాసుల కోసం ఏమి చేయటానికైనా సిద్ధపడాలి. అవసరమైతే వాళ్ళ కోసం మనం మరణించాలి.
\v 17 ఈ లోకంలో బ్రతకటానికి అవసరమైనవన్నీ మనలో చాలా మంది దగ్గర ఉన్నాయి. అయితే మన తోటి విశ్వాసుల్లో బ్రతకటానికి అవసరమైన వాటిల్లో ఏవైనా తక్కువయ్యాయని మనకు తెలిసి, వాటిని ఇవ్వడానికి నిరాకరిస్తే, మనం చెప్పుకుంటునట్లుగా దేవుణ్ణి ప్రేమించడం లేదనేది స్పష్టమౌతుంది.
\v 18 నేను ఎంతగానో ప్రేమిస్తున్న మీకు చెప్పేదేమిటంటే, మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామని కేవలం ఒట్టి మాటల్లోనే చెప్పుకోవడడం కాదు. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవడం ద్వారా యధార్ధమైన ప్రేమను చూపించుకుందాము.
\s5
\p
\v 19 మనం మన తోటి విశ్వాసుల్ని నిజంగా ప్రేమించినట్లయితే, క్రీస్తును గూర్చిన సత్యసువార్తకు అనుగుణంగా మనం కచ్చితంగా జీవిస్తాము అనుకోవచ్చు. తద్వారా దేవుని సన్నిధిలో మనకు ఎలాటి అపరాధభావం ఉండదు.
\v 20 మనం పాపం చేసినందువల్ల మనం అపరాధ భావంతో ఉన్నప్పటికీ, మనం ఆయన్ని విశ్వసించటానికి అర్హులుగా దేవుడు చేశాడు. అందువల్ల మనం నమ్మకంగా ప్రార్ధించవచ్చు. మన గూర్చి దేవునికి తెలుసు.
\p
\v 21 ప్రియ స్నేహితుల్లారా, మన మనసు మనం పాపం చేశామని నిందించకపోతే, మనం దేవునికి ఆత్మవిశ్వాసంతో ప్రార్ధించవచ్చు.
\v 22 మనం ఆత్మవిశ్వాసంతో ఆయనకు ప్రార్ధించి, ఆయన నుంచి ఏదైనా ఆభ్యర్ధిస్తే, మనం ఆయన నుంచి పొందుతాము. ఎందుకంటే దేవుడు చేయమని ఆజ్ఞాపించిన దాన్ని మనం చేశాము. ఆయన్ని సంతోషపరిచేదే మనం చేశాము.
\s5
\v 23 ఆయన మనకు చేయమని ఆజ్ఞాపించినదేమిటో నేను మీకు చెబుతాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం కచ్చితంగా నమ్మాలి. దేవుడు చేయమని మనకు ఆజ్ఞాపించినట్లుగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి.
\v 24 దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేసేవాళ్ళు దేవుడుతో సహవాసం ఉన్నవాళ్లు. దేవుడు వాళ్ళతో కలిసిపోతాడు. ఎందుకంటే దేవుడు మనకు ఇచ్చిన దేవుని ఆత్మ మన దగ్గర ఉన్నది. తద్వారా మనకు దేవునితో సహవాసం ఉందని కచ్చితంగా చెప్పవచ్చు.
\s5
\c 4
\p
\v 1 నా ప్రియ స్నేహితులారా, అనేకమంది మనుషులు ప్రజలకు తప్పుడు సందేశాలు బోధిస్తున్నారు. అయితే ఇలాంటి వాళ్ళు బోధిస్తున్న బోధలను వినే మీరందరూ దాన్ని గూర్చి తప్పక జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాళ్ళు దేవుడి నుంచి వచ్చిన సత్యాన్నే బోధిస్తున్నారా, లేదా అనేది మీకు తెలుస్తుంది.
\v 2 దేవుని ఆత్మ నుంచి వచ్చిన సత్యాన్నే వాళ్ళు బోధిస్తున్నారో, లేదో మీరు ఎలా తెలుసుకోవాలో నేను మీకు చెబుతాను. దేవుడు పంపిన యేసుక్రీస్తు, మనలాంటి మనిషిగా వచ్చాడనే సువార్తను బోధిస్తూ, ధృవపరిచేవాళ్ళే దేవుని నుంచి వచ్చిన సందేశాన్ని బోధించే బోధకులు.
\v 3 యేసును గూర్చిన సత్యాన్ని ధృవపరచని వాళ్ళు, దేవుని నుంచి వచ్చిన సువార్త సందేశాన్ని బోధించేవాళ్ళు కాదు. అటువంటి వ్యక్తులు క్రీస్తును వ్యతిరేకించే బోధకులు. మన మధ్యకు అలాంటి వ్యక్తులు వస్తారని మీరు విన్నారు. ఇప్పటికే అలాంటి వ్యక్తులు మన మధ్యకు వచ్చారు.
\s5
\p
\v 4 నాకు ఎంతో ప్రియమైన మీకోసం నేను చేబుతున్నదేమిటంటే మీరు దేవుని సంబంధులు, అందుకే అలాంటి వ్యక్తుల బోధనలను నమ్మడానికి నిరాకరించారు. ఎందుకంటే మహాఘనుడైన దేవుడు తాను కోరినట్లు మీరు చేయడానికి మీకు అనుమతి ఇచ్చాడు.
\v 5 ఈ లోకంలో దేవుణ్ణి సన్మానించకుండా నిరాకరిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాంటి వ్యక్తులకు చెందినవాళ్ళే ఈ అబద్ధాలను బోధిస్తున్న బోధకులు. అందుకే ఇలాంటి వ్యక్తుల నుంచి అలాంటి మాటలే వస్తాయి. అలాంటి మాటలు అలాంటి వ్యక్తులే వింటారు.
\v 6 మన విషయానికొస్తే మనం దేవునికి చెందిన వాళ్ళం. దేవునికి చెందని వాళ్ళు మనం బోధించే మాటలు వినరు. దేవునికి చెందినవాళ్ళే వింటారు. ఇతరులను మోసం చేసే వాళ్ళకూ, దేవుని గూర్చి సువార్త సత్యాన్ని బోధించే వ్యక్తులకూ మధ్య ఉన్న తేడా ఈ విధంగా మనం గుర్తించవచ్చు.
\s5
\p
\v 7 నా ప్రియమైన స్నేహితుల్లారా, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఎందుకంటే మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలనేదే దేవుని కోరిక. తమ తోటి విశ్వాసుల్ని ప్రేమించేవాళ్ళు దేవుణ్ణి తెలుసుకుని, ఆయన పిల్లలయ్యారు.
\v 8 అలాంటి వ్యక్తులకే దేవుడు తన ప్రేమను చూపిస్తాడు. కాబట్టి తమ తోటి విశ్వాసుల్ని ప్రేమించలేని వాళ్ళకు దేవుడు అంటే ఏమిటో అర్థం కాలేదు.
\s5
\v 9 దేవుడు తన ప్రేమను మనపై ఎలా చూపిస్తున్నాడో నేను మీకు వివరిస్తాను. తన ఏకైక కుమారుణ్ణి మన కోసం భూమి మీదకు పంపి, ఆయన ద్వారా మనకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాడు.
\v 10 మరో వ్యక్తిని నిజంగా ప్రేమించడం అంటే ఏమిటో దేవుడు మనకు అర్ధమయ్యేలా చూపించాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించడం కాదు. దేవుడే మనల్ని మొదట ప్రేమించాడు. కాబట్టే, మనం పాపం చేసి పాపాత్ములం అయినప్పుడు దేవుడే మనల్ని క్షమించటం కోసం, తనను తాను బలిగా ఆర్పించుకోవడం కోసం ఆయన తన కుమారుణ్ణి పంపాడు.
\s5
\v 11 నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు అంతలా మనల్ని ప్రేమించాడు, కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోవడం మన బాధ్యత.
\p
\v 12 దేవుణ్ణి ఎవ్వరూ, ఎన్నడూ చూడలేదు. ఏది ఏమైనా మనం ఒకరినొకరు ప్రేమించుకున్నట్టయితే, దేవుడు మనలోనే నివసిస్తాడని స్పష్టమౌతుంది. అంతేకాక మనం ఒకరినొకరు ప్రేమించుకోవడమనేది దేవుని ఉద్దేశ్యాలను చేయడమే కదా.
\v 13 మనం దేవునితో కలసి ఉన్నామనీ, అలానే దేవుడు మనతో కలసి ఉన్నాడనేది మనం ఎలా స్పష్టంగా తెలుసుకోగలమో నేను మీకు స్పష్టంగా వివరిస్తాను. ఆయన తన ఆత్మను మనలో ఉంచాడు.
\v 14 అపోస్తులమైన మేము దేవుని కుమారుణ్ణి దగ్గరగా చూశాము. ఈ లోకంలోని వ్యక్తులు తమ పాపాలతో శాశ్వతంగా బాధపడుతుంటే, వాళ్ళను రక్షించటం కోసం తండ్రి తన కుమారుణ్ణి పంపాడని అందరికి దృఢంగా చెబుతాము.
\s5
\v 15 కాబట్టి యేసును గూర్చి సత్యాన్ని చెప్పేవాళ్ళతోనే దేవుడు కలసి ఉంటాడు. యేసును దేవుని కుమారుడని అన్నవాళ్ళతోనే దేవుడు ఉంటాడు, కాబట్టి వాళ్ళు దేవునితోనే కలసి ఉంటారు.
\p
\v 16 ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తాడు అనేది మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. ఆయన మనల్ని ప్రేమిస్తాడనేది మేము నమ్ముతున్నాము. దాని ఫలితంగా మేము ఇతరుల్ని ప్రేమిస్తున్నాము. ఎందుకంటే ఇతరుల్ని ప్రేమించడమే దేవుని స్వభావం. ఎవరైతే ఇతరుల్ని ప్రేమించడం కొనసాగిస్తారో, వాళ్ళు దేవునితో సహవాసం ఉన్నవాళ్లు, అలాగే దేవుడు వాళ్ళతో కలసి ఉంటాడు.
\s5
\v 17 మనం ఇతరుల్ని సంపూర్ణంగా ప్రేమించాలి. మనం అలా చేసినట్లయితే, దేవుడు మనల్ని తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు ఆయన మనల్ని వ్యతిరేకించడని మనకు నమ్మకం ఉంటుంది. యేసు తనకు తానుగా దేవునితో కలసి ఉన్నట్లుగానే, మనం ఈ లోకంలో జీవించినంత కాలం దేవునితో కలసి ఉంటామని మనం నమ్మకంతో ఉంటాము.
\p
\v 18 మనం నిజంగా ఆయన్ని ప్రేమించినట్లయితే, మనం దేవునికి ఏమాత్రం భయపడము. ఎందుకంటే ఎవరైతే దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమిస్తారో, వాళ్ళు ఆయనకు భయపడనవసరం లేదు. ఆయన మనల్ని శిక్షిస్తాడని ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే మనం భయపడతాము. కాబట్టి దేవుణ్ణి సంపూర్ణంగా ప్రేమించనివాళ్ళే కచ్చితంగా దేవునికి భయపడతారు.
\s5
\v 19 దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం దేవుణ్ణి , మన తోటి విశ్వాసుల్ని ప్రేమిస్తున్నాము.
\v 20 కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెబుతూ, తన తోటి విశ్వాసుల్ని ద్వేషిస్తే వాళ్ళు అబద్ధం చెబుతున్నారు. మనకు కనిపిస్తున్న మన తోటి విశ్వాసులనే ప్రేమించలేనివాళ్ళు, తాము చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలరు?
\v 21 మనం ఆయన్ని ప్రేమించినట్లయితే, మన తోటి విశ్వాసులను కూడా ప్రేమించాలి. దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఈ విషయాలను మీ మనసుల్లో గుర్తుపెట్టుకోండి.
\s5
\c 5
\p
\v 1 యేసు ప్రభువుని క్రీస్తుగా నమ్ముతున్న వాళ్ళందరూ దేవుని పిల్లలు, వాళ్ళు దేవుని నుండి పుట్టిన పిల్లలు. దేవుడైన తండ్రిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆయన బిడ్డలను కూడా ప్రేమిస్తారు.
\v 2 మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు, ఆయన మనకు ఆజ్ఞాపించినట్లుగా తప్పకుండా మనం దేవుని పిల్లలను ప్రేమిస్తాము. అంతేకాకుండా ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం చేస్తాము.
\v 3 నేను ఈ మాటలను ఎందుకు చెబుతున్నానంటే, నిజంగా దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఆయన మనకు ఆజ్ఞాపించినట్లుగా చేయడమే. అంతేకాకుండా ఆయన ఆజ్ఞాపించినట్లు చేయడం ఏమంత కష్టం కాదు.
\s5
\v 4 దేవుని కారణంగా ఆయన పిల్లలుగా మారిన మనమందరం, అవిశ్వాసులు చెయ్యాలని కోరుకున్న వాటిని చేయడానికి నిరాకరించాము. అంతేకాక మీరు దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానికంటే బలమైనవాళ్లు. క్రీస్తులో నమ్మిక ఉంచినందువల్ల మనం చెడును చేయడానికి నిరాకరించాము.
\v 5 దేవునికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానికంటే, ప్రతి వ్యక్తి కంటే బలమైన వాళ్ళు ఎవరు? యేసు దేవుని కుమారుడని నమ్మే వాళ్ళే. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దానికంటే, ప్రతి వ్యక్తి కంటే వ్యతిరేకించి బలంగా నిలుచున్న వాళ్ళే.
\s5
\p
\v 6 యేసుక్రీస్తును గురించి ఆలోచించండి. దేవుని దగ్గర నుండి భూమి మీదకు వచ్చినవాడు ఆయనే. యోహాను యేసుకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చినప్పుడు, యేసు రక్తం కార్చి చనిపోయినప్పుడు దేవుడు యేసును పంపాడని దేవుడు మనకు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు దేవుని నుంచి వచ్చాడని దేవుని ఆత్మ మనకు కచ్చితంగా ప్రకటిస్తున్నాడు.
\v 7 ఈ ముగ్గురు సాక్షులు అంటే దేవుని ఆత్మ, నీరు, రక్తం.
\v 8 ఈ ముగ్గురూ ఒకే విషయాన్ని మనకు చెబుతున్నారు.
\s5
\v 9 ఎవరైనా ఇతరులు మనకు ఏదైనా విషయాన్ని చెబితే మనం సాధారణంగానే నమ్ముతాము. అంతకంటే దేవుడు మనకు చెప్పిన దానిపై మనం కచ్చితంగా ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు. ఆయన తన కుమారుణ్ణి గూర్చి కచ్చితంగా సాక్ష్యమిస్తూ, నిరూపిస్తున్నాడు.
\p
\v 10 దేవుని కుమారునిలో నమ్మకం ఉన్న వాళ్ళకు, తమ అంతరంగాల్లో ఆయన గూర్చిన సత్యమేమిటో స్పష్టంగా తెలుసు. కానీ దేవుడు చెప్పిన దాన్ని నమ్మని వాళ్ళు ఆయన్ని అబద్ధాలకోరు అని పిలుస్తున్నారన్న మాట. ఎందుకంటే దేవుడు తన కుమారుణ్ణి గూర్చి ఇచ్చిన సాక్ష్యాన్ని, రుజువును నమ్మటానికి వాళ్ళు నిరాకరించారు.
\s5
\v 11 దేవుడు మనతో మీకు నిత్యజీవాన్ని ఇచ్చాను అని చెబుతున్నాడు. మనకు ఆయన కుమారుడితో సహవాసం ఉన్నట్లయితే మనం శాశ్వత కాలం జీవిస్తాము.
\v 12 దేవుని కుమారుడితో సహవాసం ఉన్నవాళ్లు దేవునితో శాశ్వత కాలం జీవిస్తారు. ఆయనతో సహవాసం లేనివాళ్ళు నిత్య జీవాన్ని పొందలేరు.
\s5
\p
\v 13 యేసు దేవుని కుమారుడని నమ్ముతున్న మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఎందుకంటే మీరు మీ నమ్మిక ప్రకారంగానే శాశ్వతంగా జీవిస్తారని మీరు తెలుసుకోవచ్చు.
\v 14 మనం ఆయనతో సహవాసంలో ఉన్నందువల్ల, ఆయనకు ఆమోదయోగ్యంగా ఉన్న దాన్ని మనం ఏదైనా అడిగినప్పుడు, ఆయన మన మనవి వింటాడని మనకు చాలా నమ్మకం ఉంది.
\v 15 అలాగే మనం ఏదైనా అడిగితే ఆయన మన మనవి వింటాడని మనకు తెలిస్తే, అప్పుడు మనం ఆయన్ని ఏది అడిగినా, ఆయన నుంచి పొందుతామని కచ్చితంగా అనుకోవచ్చు.
\s5
\p
\v 16 ఒకవేళ నీ తోటి విశ్వాసుల్లో ఒకరు దేవుని నుంచి వాళ్ళను, వేరు చేయని పాపం చేస్తున్నారని మీరు చూశారనుకోండి, మీరు వాళ్ళు పాపం చేస్తున్నపుడు చూసి, మీరు దేవుణ్ణి అతడు చేసిన పాపం కోసం ప్రార్ధించి అడిగితే, మీ ప్రార్థన బట్టి దేవుడు ఆ వ్యక్తికి అతని జీవితాన్ని అతడికి తిరిగి ఇస్తాడు. అంటే దేవుని నుంచి వేరు చేయని పాపానికి పాల్పడే వ్యక్తికోసం మీరు దేవుణ్ణి ప్రార్ధించవచ్చు. కానీ కొంత మంది దేవునినుంచి దూరం అవ్వడానికి కారణమయ్యే విధంగా పాపం చేస్తారు. ఆ విధంగా పాపం చేస్తున్న వాళ్ళకు సహాయంగా దేవుణ్ణి ప్రార్ధించి అడగమని నేను చెప్పడం లేదు.
\v 17 దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి అపరాధం పాపమే. కానీ మనం చేసే ప్రతి చెడ్డ పని మనల్ని దేవుని నుంచి శాశ్వతంగా దూరం చేయలేదు.
\s5
\p
\v 18 ఏ వ్యక్తి అయినా దేవుని బిడ్డ అయితే అతడు మళ్ళీ, మళ్ళీ పాపం చేయడని మనకు తెలుసు. దానికి బదులుగా దుర్మార్గుడైన సాతాను అతడికి హాని చెయ్యనివ్వకుండా దేవుని కుమారుడు రక్షిస్తాడు.
\v 19 మనం దేవునికి చెందిన వాళ్ళమని మీకు తెలుసు. అలాగే ఈ ప్రపంచం మొత్తం దుర్మార్గుడైన సాతాను గుప్పెట్లో ఉందని మనకు తెలుసు.
\s5
\v 20 దేవుని కుమారుడు మన మధ్యకు వచ్చాడని, దేవుని సత్యాన్ని మనకు అర్థమయ్యేలా చేశాడని మనకు తెలుసు. సత్యవంతుడైన దేవుని కుమారుడైన యేసు క్రీస్తుతో మనం సహవాసంలో చేరాము. యేసు క్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, మనం నిత్య జీవాన్ని పొందడానికి అవకాశం కల్పించే వాడు ఆయనే.
\v 21 నాకు ఎంతో ప్రియమైన మీకు నేను చెబుతున్నదేమిటంటే, ఎలాటి శక్తి లేని దేవుళ్ళను ఆరాధించకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

33
64-2JN.usfm Normal file
View File

@ -0,0 +1,33 @@
\id 2JN - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h యోహాను రాసిన రెండవ పత్రిక
\toc1 యోహాను రాసిన రెండవ పత్రిక
\toc2 యోహాను రాసిన రెండవ పత్రిక
\toc3 2jn
\mt1 యోహాను రాసిన రెండవ పత్రిక
\s5
\c 1
\p
\v 1 పెద్దలలో ముఖ్యుడుగా మీరు నన్నెరుగుదురు. విశ్వాసులైన మీకు ఇది రాస్తున్నాను. దేవుడు ఎన్నిక చేసుకున్న మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. కారణం మనందరమూ ఎరిగిన క్రీస్తు. ఇది సత్యం. నేను మాత్రమే కాదు, క్రీస్తు బోధించిన సత్య వార్తను చక్కగా తెలుసుకుని, నమ్మిన వారందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
\v 2 మనందరం ఒక్కటిగా నమ్ముతున్న క్రీస్తు సత్యమే దీనికి కారణం. ఎందుకంటే మనలో సత్యం నిలిచి ఉంది, అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
\v 3 తండ్రి అయిన దేవుడూ, మానవ కుమారుడూ దేవుడూ అయిన యేసు క్రీస్తూ ప్రతినిత్యం మనపై దయనూ, కనికరాన్నీ కుమ్మరిస్తున్నారు. ఇది మనపై ఉన్న దేవుని ప్రేమకు అద్దం పడుతోంది.
\s5
\p
\v 4 దేవుడు మనకు బోధించిన సత్యాన్ని తూచా తప్పక అనుసరిస్తూ మీలో కొంత మంది జీవిస్తున్నారని తెలుసుకొని నేను చాలా సంతోషిస్తున్నాను. మన పరలోకపు తండ్రి ఆజ్ఞ ఇదే.
\p
\v 5 ఇప్పుడు, నా ప్రియ సంఘస్తులారా దేవుడు చేయమని ఇచ్చిన ప్రతి ఆజ్ఞకూ మీరు లోబడి ఉండండి, అని నేను ప్రత్యేకంగా బతిమలాడుతున్నాను. అందుకే ఈ లేఖ రాస్తున్నాను. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అన్న దేవుని ఆజ్ఞ కొత్తదేమీ కాదు. పైగా క్రీస్తును నమ్మిన మొదటి రోజుల్లోనే ఇకమీదట మనము పరస్పరం ప్రేమ కలిగి ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నాము.
\v 6 దేవుణ్ణి ప్రేమించడం అన్నా, ఒకర్నొకరు ప్రేమించుకోవడం అన్నా దేవుడు మనకు విధించిన ఆజ్ఞలకు విధేయత చూపడమే. పరస్పరం ప్రేమగలిగి దేవుణ్ణి హత్తుకోవాలి అన్నదే దేవుని ఆజ్ఞ.
\s5
\p
\v 7 యేసు క్రీస్తు రక్తమాంసాలతో వచ్చాడని ఒప్పుకోని మోసగాళ్ళు చాలా మంది ఈ లోకంలో బయలుదేరారు. వాళ్ళు ఇతరుల్ని మోసం చేయడమేగాక సంఘాన్ని వదిలి వెలుపలికి వెళ్ళి, మీ చుట్టుపక్కల వారిని కూడా మోసగిస్తున్నారు. వీళ్ళు స్వయానా క్రీస్తు వ్యతిరేకులు.
\v 8 ఇలాంటి బోధకుల విషయంలో జాగ్రత్తపడండి, వారి మోసాల్ని అరికట్టండి. వాళ్ళు మిమ్మల్ని మోసగించనిస్తే మీరూ నేనూ మనందరం కలిసి కష్టపడుతున్న దాని ప్రతిఫలం పోగొట్టుకోవడమే కాక దేవుణ్ణి చేరి మీరు పొందాల్సిన సంపూర్ణ బహుమానాన్ని కూడా పొందలేకపోతారు.
\s5
\v 9 క్రీస్తు చెప్పిన దానికి మార్పు చేర్పులు చేసేవాడూ, క్రీస్తు చెప్పిన దానిని విని కూడా దానిలో కొనసాగనివాడూ దేవునితో పొత్తు లేనివాడు. అయితే క్రీస్తు బోధలు నమ్మికతో స్వీకరించి, వాటి ప్రకారం నిత్యం నడుచుకునేవారు మన తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారునితోనూ ఒకే పొత్తుగా ఉంటారు.
\v 10 అందుకని, ఎవరైనా క్రీస్తు బోధకు భిన్నమైన బోధ ప్రకటిస్తూ వస్తే వారిని మీ గృహాలకు ఆహ్వానించకండి. వారు ఎదురైనపుడు ఎలా ఉన్నారూ? బాగున్నారా? అనో, మంచిది, మీకు మేలు జరుగుగాక! అనో ప్రోత్సహిస్తున్నట్టు పలకరించకండి.
\v 11 ఎందుకు ఈ విషయమై హెచ్చరిస్తున్నానంటే, ఒకవేళ మీరు మీ తోటి విశ్వాసులతో ఎలా ఉంటారో అలాగే వీరితో కూడా ఉంటే వారు చేస్తున్న చెడ్డ పనిలో మీరు కూడా సాయపడుతున్న వారౌతారు.
\s5
\p
\v 12 ఇంకా ఎన్నో సంగతులు మీకు రాయాలని ఉంది. కాని కాగితం, సిరా వాడడం నాకు ఇష్టం లేదు. మన ఆనందం సంపూర్ణం అయ్యేలా మీ దగ్గరికి వచ్చి మీతో ముఖాముఖి మాట్లాడాలని ఆశగా ఉంది.
\v 13 మీతోపాటు దేవుడు ఎన్నుకున్న ఇక్కడి మీ తోటి విశ్వాసులందరూ మీకు శుభాలు తెలుపుతున్నారు.

37
65-3JN.usfm Normal file
View File

@ -0,0 +1,37 @@
\id 3JN - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h యోహాను రాసిన మూడవ పత్రిక
\toc1 యోహాను రాసిన మూడవ పత్రిక
\toc2 యోహాను రాసిన మూడవ పత్రిక
\toc3 3jn
\mt1 యోహాను రాసిన మూడవ పత్రిక
\s5
\c 1
\p
\v 1 ప్రియమైన స్నేహితుడు గాయికి, నీ దృష్టికి పెద్దలలో ప్రముఖుడనైన నేను యథార్థమైన ప్రేమతో రాస్తున్నది.
\v 2 ప్రియ సోదరా, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతూ ఉన్నట్టుగానే అన్ని విషయాల్లో వర్ధిల్లాలనీ, ముఖ్యంగా దేవుని విషయాల్లో ఆరోగ్యవంతుడివిగా ఉండాలనీ నేను ప్రార్ధిస్తున్నాను.
\v 3 నీవు ఎప్పుడూ నడుస్తున్నట్టే క్రీస్తును గూర్చిన సువార్తకు అనుకూలంగా సత్యమార్గంలో నడచుకొంటున్నావని నీ గురించి కొందరు సోదరులు వచ్చి చెప్పగా విని చాలా సంతోషించాను. అన్ని విషయాలలోనూ నువ్వు దైవ సత్యాన్ని స్థిరంగా అమలుచేస్తూ వెంబడిస్తున్నావని వాళ్ళు చెప్పారు.
\v 4 క్రీస్తును విశ్వసించడంలో నా సాయం పొందిన పిల్లలు దేవుని సత్యానికి అనుగుణ్యంగా జీవిస్తున్నారని విన్నప్పుడు నా సంతోషానికి అవధుల్లేవు.
\s5
\p
\v 5 ప్రియ సోదరా, నీ తోటి విశ్వాసులకుగానీ, దేవుని పని నిమిత్తం సంచారం చేస్తూ నీవున్న చోటికి వచ్చిన అపరిచితులకుగానీ నువ్వు చేస్తున్న సాయం స్వామిభక్తితో యేసుకు చేస్తున్న సేవే.
\v 6 నీ ద్వారా మేలు పొందిన కొంతమంది ఇక్కడి సంఘం ఎదుట నీ ప్రేమను గూర్చి సాక్ష్యం ఇచ్చారు. అలాంటివారు ఇకముందు కూడా తమ పనిలో దేవుణ్ణి ఘనపరిచేలా నీ సాయం ఎట్టి స్థితిలోనూ మానక కొనసాగించు.
\p
\v 7 అలా బయటి ప్రాంతాలకు వెళ్ళి యేసును ప్రకటిస్తున్న నీ తోటి విశ్వాసులు, క్రీస్తును విశ్వసించని వారినుండి ఎలాటి ధన సహాయమూ స్వీకరించడం లేదు.
\v 8 కాబట్టి క్రీస్తును నమ్మి వెంబడిస్తున్న మనలాంటి వారు, దేవుని సత్య సువార్తను ప్రకటిస్తున్న ఇలాంటి వారిని జత పనివారిగా స్వీకరించి, వారికి కావలిసిన ఆహారం, ధనం ఇచ్చి ఎలాగైనా వారి పనిలో తోడ్పడాలి.
\s5
\p
\v 9 అక్కడి ఇతర విశ్వాసులకు అండగా నిలవమని మీ విశ్వాస బృందాలకు నేను ఉత్తరం రాసాను. అయినప్పటికీ దియోత్రెఫే దీన్ని అంగీకరించడం లేదు. అతను మిమ్మల్ని తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చూస్తున్నాడు.
\v 10 కాబట్టి, నేను అక్కడికి వచ్చినప్పుడు అతడు చేసిన పనులూ, మాకెంతో నష్టం కలిగేలా మా గురించి ఇతరులకు చెప్పిన చాడీలూ, చెడ్డ మాటలూ అందరిముందూ బయట పెడతాను. అంతే కాదు, దేవుని సువార్త పనిలో అటూ ఇటూ తిరుగుతున్న సాటి సహోదరుల్ని స్వయంగా ఆహ్వానించకపోగా, ఆహ్వానించిన వారిని కూడా అడ్డగించి, సంఘంలో నుండి వెళ్ళగొడుతున్నాడు.
\s5
\p
\v 11 ప్రియ మిత్రమా, ఇలాంటి చెడ్డ తరహా మనుషులను ఏ రకంగానూ అనుకరించవద్దు. మంచి ఉదాహరణను ఎదుట ఉంచుకో. మంచి పనులు చేసేవాడు వాస్తవంగా దేవుని సంబంధి. అలాగే నిత్యం చెడు చేస్తుండేవాడు ఏమాత్రం దేవుణ్ణి దర్శించినవాడు కాడు.
\p
\v 12 దేమేత్రి గురించి విశ్వాసులు అందరూ మంచి సాక్ష్యం చెప్పారు. సత్యం ఒక వ్యక్తి అయితే అతను కూడా దేమేత్రి విషయంలో మంచివాడనే సాక్ష్యం చెప్తాడు. మేమూ అతను మంచివాడనే స్పష్టం చేస్తున్నాము. మేము చెప్పింది నిజమని నీకు బాగా తెలుసు.
\s5
\p
\v 13 ఈ లేఖ మొదలు పెట్టినపుడు మాత్రం చాలా విషయాలు నీతో ప్రస్తావించదలిచాను. కానీ ఇక రాయడం మానుకుంటున్నాను. ఒక ఉత్తరానికే ఆ విషయాలన్నీ పరిమితం చేయదలచ లేదు.
\v 14 బదులుగా, నేను నిన్ను త్వరలోనే చూడగలనని ఆశిస్తున్నాను. అప్పుడు మనం ముఖాముఖీ మాట్లాడుకుందాం.
\v 15 దేవుడు తన శాంతిని నీకు ప్రసాదించుగాక. ఇక్కడి నీ స్నేహితులు నీకు అభివందనాలు చెబుతున్నారు. అక్కడి మన స్నేహితులందరికీ పేరు పేరునా మా అభివందనాలు తెలియజెయ్యి.

58
66-JUD.usfm Normal file
View File

@ -0,0 +1,58 @@
\id JUD - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h యూదా రాసిన పత్రిక
\toc1 యూదా రాసిన పత్రిక
\toc2 యూదా రాసిన పత్రిక
\toc3 jud
\mt1 యూదా రాసిన పత్రిక
\s5
\c 1
\p
\v 1 నేను యూదాను. యేసు క్రీస్తు సేవకుణ్ణి, యాకోబు సోదరుణ్ణి. దేవుడు తన దగ్గరకు పిలిచిన వాళ్ళకి, యేసుక్రీస్తు కోసం దేవుడు భద్రం చేస్తున్న వాళ్ళకీ , తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తున్న వాళ్ళకీ నేను రాస్తున్నాను.
\v 2 దేవుడి కరుణ మీపై ఉండు గాక! ఆయన మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన శాంతి మీకు కలుగు గాక!
\s5
\p
\v 3 మనందరినీ దేవుడు ఎలా రక్షించాడో అనే విషయం గురించి నేను ఎంతో ప్రేమించే మీకు ఈ ఉత్తరం రాయాలని చాలా ప్రయత్నించాను. మనం విశ్వసించే కొన్ని సత్యాలను గురించి మీకు సాధ్యం అయినంత వరకు మీకు చెప్పాలని మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను ఈ ఉత్తరం రాయవలసి వచ్చింది. క్రీస్తులో విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ దేవుడు ఈ విషయాలు బోధించాడు. ఈ విషయాలు ఎప్పటికీ మారవు.
\p
\v 4 మీ సమావేశాల్లోకి కొందరు చొరబడుతున్నారు. పూర్వం ప్రవక్తలు రాసినట్టు వీళ్ళు కీడు చేసే వాళ్ళు. అబద్ద బోధలు చేస్తూ, దేవుడు వాళ్ళ పట్ల దయ చూపిస్తున్నాడు అనుకుంటున్నారు. లైంగిక పాపం చేసే అనుమతిని దేవుడు వాళ్లకు ఇచ్చాడు అనుకుంటున్నారు. వాళ్ళు ఈ విధంగా మన గురువు, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు గురించిన సత్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు.
\s5
\p
\v 5 ఇవన్నీ మీకు ముందే తెలిసినా మీకు నేను గుర్తు చేయాలని ఆశించేవి కొన్ని ఉన్నాయి. ప్రభువు తన ప్రజలను ఐగుప్తు నుండి రక్షించినా, అదే ప్రజల్లో చాలామందిని తనలో విశ్వాసం ఉంచనందుకు ఆయన నాశనం చేసాడు.
\v 6 పరలోకంలో దేవుడు దేవదూతలకు కొన్ని అధికార స్థానాలు నియమించాడు కూడా. కానీ ఆ స్థానాల్లో వాళ్ళు అధికారం నిలుపుకోలేదు. ఆ స్థానాలను కోల్పోయారు. అందుకే దేవుడు ఆ దూతలను గొలుసులతో బంధించి నిత్యం నరకంలోని చీకటిలో పెట్టాడు. దేవుడు తీర్పు తీర్చి, శిక్షించే ఆ ముఖ్యమైన దినం వరకు వాళ్ళు అక్కడే ఉంటారు.
\s5
\v 7 అలాగే సొదొమ, గొమొర్రా పట్టణాలలోని వాళ్ళు, వాటి దగ్గరలో ఉన్న పట్టణాల వాళ్ళు లైంగిక అవినీతికి పాల్పడ్డారు. దేవుడు అనుమతించిన దానికి భిన్నంగా వాళ్ళు అన్ని రకాల లైంగిక సంబంధాలను కోరుకున్నారు. ఆ మనుషులకు, పరలోకంలోని దూతలకు ఏమయ్యింది? అబద్ధ బోధలు బోధించే వాళ్ళను నిత్య నరకాగ్నితో దేవుడు శిక్షిస్తాడని చూపాడు.
\v 8 అలాగే మీ మధ్య నివసించే వాళ్ళు కూడా అనైతికంగా జీవిస్తూ తమ శరీరాలను మలినం చేసుకున్నారు కూడా. దేవుడు వాళ్లకి దర్శనాలు చూపించి అలా చేయమని చెప్పాడని వాళ్ళు అంటారు. కానీ వాళ్ళు దేవుని ఆజ్ఞలకు లోబడరు. దేవుని దూతలను అవమానిస్తారు.
\s5
\p
\v 9 ప్రధాన దూత మిఖాయేలు మోషే శరీరాన్ని ఎవరు స్వాధీనం చేసుకుంటారు అనే విషయంలో సాతానుతో వాదిస్తూ ఉన్నప్పుడు, వాడిని నిందించలేదు, అవమానించలేదు. కేవలం "ప్రభువు నిన్ను శిక్షించును గాక" అని మాత్రమే అన్నాడు.
\v 10 కానీ నేను ఎవరికి అయితే రాస్తున్నానో వాళ్ళు తమకు అర్థం కాని మంచి విషయం గురించి చెడ్డగా మాట్లాడతారు. సాధారణంగా వాళ్ళు అర్థం చేసుకునేవి అన్నీ నాశనం అయ్యేవే కాబట్టి వాళ్ళు ఆలోచించలేని కౄర మృగాల్లాంటి వాళ్ళు.
\p
\v 11 ఈ పనులు చేసే వాళ్ళని దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు. కయీను ప్రవర్తించినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. డబ్బు కోసం బిలాము పాపం చేసినట్టు వాళ్ళు పాపం చేస్తారు. మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, కోరహు చనిపోయినట్టు వాళ్ళు చనిపోతారు.
\s5
\v 12 ఈ మనుషులు నీటి కింద ఉండే బండ రాళ్ళల్లాంటి వాళ్ళు. ఇలాంటి వాటికే ఓడలు గుద్దుకొని బద్దలైపోతాయి. వాళ్ళు తమను సంతోష పెట్టుకోవడం కోసం తింటారు కాబట్టి మీ ప్రేమ విందుల్లో వాళ్ళు పాలు పంచుకున్నప్పుడు వాళ్లకు సిగ్గు ఉండదు.
\p వాళ్ళు వర్షం కురవని మేఘాల్లాగా గాలికి కొట్టుకుపోయే మేఘాల్లాగా ఉంటారు. వాళ్ళు ఆకు రాలే కాలంలో కాయలు కాయని చెట్లవంటి వాళ్ళు. వ్రేళ్ళతోసహా పెకలించిన చెట్లవంటి వాళ్ళు. వారు మంచి పనులు చేయరు. రెండు సార్లు చచ్చిన మనుషుల వంటి వాళ్ళు.
\v 13 తమను తాము అదుపులో ఉంచుకోలేరు. వాళ్ళు సముద్రంలో తుఫాను చెలరేగే సమయంలో వచ్చే బలమైన అలల వంటి వాళ్ళు. సముద్రపు అలలు ఒడ్డుకు నురగ, మురికి తెచ్చినట్టు వాళ్ళు తమ సిగ్గుతో ఇతరుల్ని కలుషితం చేస్తారు. ఆకాశంలో తాము ఉండాల్సిన చోట నిలవని నక్షత్రాల్లాటి వారు. దేవుడు వాళ్ళని భయంకరమైన చీకటిలో నిత్యం ఉంచుతాడు.
\s5
\p
\v 14 ఆదాము నుండి ఏడవ వ్యక్తి హానోకు ఆ అబద్ద బోధకుల సిద్ధాంతాలను గురించి చెప్తూ, "జాగ్రత్తగా వినండి. లెక్కకు మించిన విశ్వాసులతో ప్రభువు కచ్చితంగా వస్తాడు.
\v 15 దేవుణ్ణి అగౌరవపరచిన ప్రతి ఒక్కరికీ తీర్పు తీర్చి, చెడ్డ వాళ్ళందరికీ శిక్ష వేస్తారు. దేవుడికి వ్యతిరేకంగా, కఠినంగా వీళ్ళు మాట్లాడారు కాబట్టి దూతలు ఈ పని చేస్తారు.
\v 16 దేవుడు చేసిన వాటిని గురించి ఈ తప్పుడు సిద్ధాంతాల బోధకులు సణుగుతారు. వాళ్ళకు జరిగిన దాని గురించి వాళ్ళు ఫిర్యాదు చేస్తారు. వాళ్లకు అవి చేయడం ఇష్టం కాబట్టి చెడ్డ పనులే చేస్తారు. గొప్పలు చెప్పుకుంటారు. ఇతరుల నుండి వాళ్లకు కావలసినవి పొందడానికి వాళ్ళను పొగుడుతారు."
\s5
\p
\v 17 కానీ నేను ప్రేమించే ప్రజలారా, చాలా కాలం క్రితం మన యేసు క్రీస్తు ప్రభువు అపోస్తలులు చెప్పింది గుర్తు తెచ్చుకోండి.
\v 18 అంత్య దినానికి ముందు దేవుడు మనకు చెప్పిన సత్యాలను గురించి కొందరు హేళనగా మాట్లాడతారు. దేవుణ్ణి అగౌరవపరచాలనే ఉద్దేశంతో తమ శరీరాలతో పాపం చేస్తారు.
\v 19 విశ్వాసులు ఒకరి మీద ఒకరు కోపగించుకోనేలా వీళ్ళు చేస్తారు. వాళ్ళు చేయాలనుకున్న చెడ్డ పనులన్నీ వాళ్ళు చేస్తారు. వాళ్ళలో దేవుని ఆత్మ నివసించదు.
\s5
\p
\v 20 కానీ నేను ప్రేమించే నా ప్రజలారా, మీరు నమ్మే దేవుని సత్యాన్ని ఉపయోగిస్తూ ఒకరిని ఒకరు బలపరచుకోండి. ప్రార్థన చేసే నడిపింపుకు పరిశుద్ధాత్మను దారి చూపనివ్వండి.
\v 21 దేవుని ప్రేమించే వారికి తగినట్టుగా మీ జీవితాలను నడుపుకుంటూ ఉండండి. మీ పట్ల యేసు క్రీస్తు ప్రభువు కరుణ ఉండాలని నిరంతరం కనిపెడుతూ ఉండండి. ఆయనతో నిత్యం జీవించడం ప్రారంభించే వరకు కనిపెడుతూ ఉండండి.
\s5
\p
\v 22 ఏ బోధలు నమ్మాలో తెలియక సందిగ్ధంలో ఉన్న వాళ్ల పట్ల దయ చూపించి, సహాయం చేయండి.
\v 23 నిత్యాగ్నిశిక్ష నుండి ఇతరులను తప్పించండి. పాపం చేసే వాళ్ళను చూసి జాలిపడండి కానీ వాళ్ళతో కలిసి పాపం చేయడానికి భయపడండి. వాళ్ళ వస్త్రధారణను అసహ్యించుకోండి, ఎందుకంటే వాళ్ళ పాపాలతో అవి మురికి అయ్యాయి.
\s5
\p
\v 24 దేవునిలో మీరు విశ్వాసం ఉంచేలా ఆయన చేయగలడు. ప్రకాశించే వెలుగు ఎక్కడ ఉందో అక్కడికి ఆయన సన్నిధికి మిమ్మల్ని తీసుకు వెళ్తాడు కూడా. మీరు పాపాల నుండి విడుదల పొంది ఎంతో ఆనందిస్తారు.
\v 25 నిజమైన దేవుడు ఆయన ఒక్కడే. మన ప్రభువు యేసు క్రీస్తు మనకు చేసిన దాని ఫలితంగా ఆయన మనల్ని రక్షించాడు. దేవుడు మహిమగలవాడు, శక్తివంతుడు, మహా ఉన్నతమైన వాడు. ఆది నుండి ఆయన సర్వాధికారంతో ఏలుబడి చేసాడు. ఆయన ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఎప్పటికీ అలాగే ఉంటాడు! ఆమెన్.

917
67-REV.usfm Normal file
View File

@ -0,0 +1,917 @@
\id REV - Indian Easy Version (IEV) Telugu
\ide UTF-8
\h ప్రకటన గ్రంథము
\toc1 ప్రకటన గ్రంథము
\toc2 ప్రకటన గ్రంథము
\toc3 rev
\mt1 ప్రకటన గ్రంథము
\s5
\c 1
\p
\v 1 యోహాననే నాకు, యేసుక్రీస్తు చూపించిన దర్శనం. దేవుడు ఈ విషయాలను యేసుక్రీస్తుకు వెల్లడించాడు. వాటిని యేసు తన సేవకులకు వెల్లడి చేయాలని ఆయన ఉద్దేశ్యం. ఈ విషయాలను యేసు తన దేవదూతను పంపి తన సేవకుడైన యోహాననే నాకు తెలియజేశాడు. ఈ విషయాలు త్వరలో జరగబోతున్నాయి.
\v 2 యోహాననే నేను యేసుక్రీస్తు గురించిన నిజమైన వివరణను, అలాగే దేవుని వాక్కు గురించి నేను విన్న, కన్న వాటికి ప్రత్యక్ష సాక్షిగా ఉండి తెలియజేస్తున్నాను.
\v 3 ఈ విషయాలు నెరవేరే సమయం దగ్గర పడింది కాబట్టి, ఈ మాటలను బిగ్గరగా చదివే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే అలా చదివిన వాక్యాలను విన్నవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన చెప్పినది జాగ్రత్తగా విని, దాని ప్రకారం నడిచే వారికి దేవుడు మేలు చేస్తాడు.
\s5
\p
\v 4 ఆసియాలోని ఏడు సంఘాలలో విశ్వాసులకు యోహాననే నేను ఈ ఉత్తరాలు రాస్తున్నాను. దేవుడు మీపై దయ చూపిస్తూ, మీ హృదయాలకు శాంతిని ప్రసాదించు గాక. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ఇప్పుడూ భవిష్యత్తులో కూడా ఉండే దేవుడు. దేవుని సింహాసనం ఎదుట ఉన్న దేవుని ఆత్మ సర్వ శక్తిమంతుడు. దేవుని సింహాసనం ఎదుట ఉన్న ఏడు ఆత్మలు దీనికి ప్రతీకలు.
\p
\v 5 దేవుని గురించిన సత్యాన్ని నమ్మకంగా మనకు తెలియజేస్తున్న యేసుక్రీస్తు ప్రభువు మీకు తన దయను, శాంతిని ప్రసాదించు గాక. చనిపోయిన వారిలో నుండి మొదటివాడిగా దేవుడు ఆయనను లేపాడు. భూమి మీద ఉన్న రాజులందరినీ పాలించేవాడు ఆయనే. ఆయన మనలను ఎంతో ప్రేమించి, మన పాపాలను పరిహరించిన వాడు.
\v 6 ఆయన తన రాజ్యపాలన మొదలు పెట్టాడు. తన తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఆయన్ని ఆరాధించే యాజకులుగా మనలను ఆయన ప్రత్యేకపరుస్తున్నాడు. యేసుక్రీస్తుకు ఎల్లకాలం స్తుతి, కీర్తి చెందు గాక.
\s5
\p
\v 7 చూడండి! క్రీస్తు మేఘాల్లో వస్తున్నాడు. అందరూ ఆయన్ని చూస్తారు. ఆయన్ని సిలువకు మేకులతో కొట్టి చంపిన వాళ్ళు కూడా చూస్తారు. భూమి మీద ఉన్న ప్రతి జాతీ, ఆయన రావడం చూసి బాధలో, శోకంలో మునిగిపోతారు. అది నిజం.
\p
\v 8 మన ప్రభువైన దేవుడు, "అన్ని విషయాలనూ ప్రారంభించిన వాడిని, ఆల్ఫాను నేనే. అన్ని విషయాలూ అంతం చేయగల వాడిని, ఒమేగాను నేనే. నేను ప్రస్తుతం జీవిస్తున్నవాణ్ణి, ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండే వాణ్ణి నేనే. అన్నిటినీ శాసించే వాణ్ణి నేనే. అందరినీ పాలించే వాణ్ణి నేనే" అని ప్రకటిస్తున్నాడు.
\s5
\p
\v 9 యోహాననే నేను మీ సాటి విశ్వాసిని. యేసు పరిపాలనలో మనందరం ఉన్నాము కాబట్టి మీలానే నేనూ బాధలు అనుభవిస్తున్నాను. మన విశ్వాసం కోసం బాధలు పడాలని పిలిచిన పిలుపును మనందరం పంచుకుంటున్నాము. అన్నిటిపైనా ఆయన చేస్తున్న పాలనలో, నియంత్రణలో మనందరం భాగస్తులం. మనకు వచ్చే ప్రతి న్యాయ విమర్శను, పరీక్షను ఓపికతో భరిస్తున్నాము. నేను దేవుని గురించిన సందేశాన్ని, యేసును గురించిన సత్యాన్ని నిరంతరం మనుషులకు చెబుతున్నాను గనక నన్ను ఖైదు చేసి పత్మాసు ద్వీపానికి పంపించారు.
\p
\v 10 ఇతర విశ్వాసులతో కలిసి ప్రభువును ఆరాధిస్తున్న రోజున దేవుని ఆత్మ నన్ను తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. అప్పుడు ఎవరో నా వెనుక మాట్లాడుతున్నట్టు వినిపించింది. ఆ స్వరం పెద్ద బాకా శబ్దంలా ఉంది.
\v 11 అతడు నాతో, "నువ్వు చూస్తున్న దాన్ని పుస్తకం చుట్టలో రాసి, ఏడు సంఘాలకు పంపించు. అంటే ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అనే పట్టణాలలోని విశ్వాసులకు పంపించు" అని చెప్పాడు.
\s5
\p
\v 12 ఈ మాటలు విని ఎవరు మాట్లాడుతున్నారా అని తిరిగి చూశాను. అప్పుడు నాకు ఏడు దీప స్తంభాలు కనిపించాయి.
\v 13 ఆ దీపస్తంభాల మధ్యలో చూడడానికి మనిషి ఆకారంలో ఎవరో కనిపించారు. ఆయన కాళ్ళదాకా ఉన్న అంగీ ధరించి, రొమ్ముకు బంగారు దట్టీ కట్టుకున్నాడు.
\s5
\p
\v 14 ఆయన జుట్టు ఉన్ని వలె తెల్లగా, అప్పుడే కురిసిన స్వచ్ఛమైన మంచులా ఉన్నాయి. ఆయన కళ్ళు దేదీప్యమానమైన అగ్ని జ్వాలల్లా ఉన్నాయి.
\v 15 ఆయన కాళ్ళు మిలమిలా మెరుస్తున్న కరిగిన కంచులా ఉన్నాయి. ఆయన మాట్లాడుతుంటే వచ్చే శబ్దం నీటితో పరవళ్ళు తొక్కుతూ లోతైన, గొప్ప నది పరుగెడుతున్నట్టు ఉంది.
\v 16 ఆయన తన కుడి చేతితో ఏడు నక్షత్రాలు పట్టుకున్నాడు. ఆయన నోటి నుంచి రెండు అంచులా పదును ఉన్న ఒక కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం మధ్యాహ్నం సూర్యబింబమంత దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది.
\s5
\p
\v 17 నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాడిలాగా ఆయన పాదాలపై పడిపోయాను. ఆయన తన కుడి చెయ్యి నాపై ఉంచి, "ధైర్యంగా ఉండు. నేనే సమస్తాన్ని ప్రారంభించిన వాణ్ణి, మొదటి వాణ్ణి. సమస్తం నాశనం చేయగల వాణ్ణి, చివరి వాణ్ణీ నేనే.
\v 18 నేను చనిపోయి మరలా సజీవంగానే ఉన్నాను. నేను ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాను. నాకు మరణంపై పూర్తి అధికారం ఉంది. పాతాళం నా ఆధీనంలో ఉంది."
\s5
\p
\v 19 "కాబట్టి నువ్వు చూసిన దాన్నీ, ఇప్పుడు జరగుతున్న దాన్నీ, భవిష్యత్తులో జరగబోతున్న దాన్నీ వ్రాయి.
\v 20 నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రాలు, ఏడు దీపస్తంభాల అర్థం ఇదే. ఆ ఏడు నక్షత్రాలు ఆసియాలోని ఏడు సంఘాలను కనిపెట్టుకుని చూస్తున్న ఏడుగురు దేవదూతలను సూచిస్తున్నాయి. ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు" అన్నాడు.
\s5
\c 2
\p
\v 1 "ఎఫెసు పట్టణంలో ఉన్న విశ్వాసుల సంఘదూతకు ఈ సందేశాన్ని వ్రాయి. ఏడు నక్షత్రాలను తన కుడి చేతిలో పట్టుకుని, ఏడు దీపస్తంభాల మధ్య నడయాడుతున్న వాడు ఇది చెబుతున్నాడు."
\p
\v 2 "నీ పనులన్నీ నాకు తెలుసు. నా కోసం నీవు ఎంత కష్టపడ్డావో తెలుసు. కష్టసమయాలు వచ్చినప్పుడు ఎంతో ఓర్పుతో సహించావు. దుర్మార్గులను ఎంతమాత్రం సహించక, ఆ మనుషుల విశ్వాసాన్ని ప్రశ్నించావని కూడా నాకు తెలుసు. తమను తాము దేవుడు పంపినట్టు చెప్పుకుంటున్నప్పటికీ, వాళ్ళను దేవుడు పంపలేదని వారి లోగుట్టు పసిగట్టావు."
\s5
\p
\v 3 "నాలో నమ్మిక ఉంచడం కోసం నువ్వు ఎన్నో బాధలు ఓపికతో సహిస్తున్నావని నాకు తెలుసు. నన్ను సేవించడంలో నీవు స్థిరంగా ఉన్నావు. నన్ను అనుసరిస్తున్న కారణంగా మనుషులు నిన్ను ఎన్నో బాధలు పెట్టారు. ఎంత కష్టమైనా నా వాక్యాన్ని వదలక నీ సేవను కొనసాగించావు. నీకు ఎంత కష్టమైనప్పటికీ, ఎన్నడూ వదిలిపెట్టలేదు, ఆపలేదు."
\p
\v 4 "అయితే, నువ్వు కొంత తప్పు చేస్తున్నావు. నువ్వు విశ్వసించిన తొలి రోజుల్లో లాగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం లేదు. నాపై కూడా ప్రేమ సన్నగిల్లింది.
\v 5 కాబట్టి నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తూ ఉండేవాడివో గుర్తు తెచ్చుకోవాలి సుమా. మొదట్లో ఏ విధంగా నన్ను ప్రేమించే వాడివో ఆ విధంగా మరలా ప్రేమించు. నువ్వు అలా చేయకపోతే, నేను నీ దగ్గరకు వచ్చి , నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను. అప్పుడు నువ్వు ఇకపై నా వారిలో ఒకడిగా ఉండవు."
\s5
\p
\v 6 "అయితే నువ్వు ఒక పని బాగా చేస్తున్నావు. అనైతికంగా వ్యవహరించవచ్చనీ, విగ్రహరాధన చేయవచ్చనీ చెబుతున్న ఆ నీకొలాయితులను నేను ఎలా ద్వేషిస్తున్నానో, నువ్వు కూడా వాళ్ళు చేసేదాన్ని అలానే ద్వేషిస్తున్నావు.
\v 7 నా సందేశాన్ని అర్ధం చేసుకోవాలనే ప్రతి ఒక్కరికీ, విశ్వాసుల సంఘాలన్నిటికీ దేవుని ఆత్మ చెబుతున్న సందేశాన్ని జాగ్రత్తగా వినండి. ఆ సందేశం ఇదే. జయించిన వారికి నిత్యజీవాన్నిచ్చే చెట్టు పండును తినేలా నేను అనుమతిస్తాను. ఈ చెట్టు దేవుని తోటలో ఉంది."
\s5
\p
\v 8 "స్ముర్న పట్టణంలో ఉన్న విశ్వాసుల సంఘ దూతకు ఈ సందేశాన్ని వ్రాయి. సమస్తాన్నీ ప్రారంభించిన మొదటి వాణ్ణి నేనే. సమస్తాన్నీ అంతం చేయగల చివరి వాణ్ణి నేనే. నేనే మృత్యుంజయుడిని.
\v 9 నీవు పడ్డ బాధలు నాకు తెలుసు. నువ్వు ఎలాంటి పేదరికంలో ఉన్నావో, నువ్వు ఎంత లేమిలో ఉన్నావో నాకు తెలుసు (కాని ఎవ్వరూ దోచుకోలేని పరలోక సిరిసంపదల్లో నువ్వు నిజంగా ధనవంతుడివే). నువ్వు క్రీస్తును అనుసరిస్తున్న కారణాన మనుషులు నీ గురించి చెడ్డ మాటలు పలుకుతూ నిన్ను శపిస్తున్న అనుభవాలు నీకు తెలుసు. ఆ యూదులు (వాళ్ళు వాస్తవానికి యూదులు కారు) నీ గురించి చెడ్డ విషయాలు చెబుతూ శాపనార్ధాలు పెట్టేవారు. వాళ్ళందరూ సాతాను సమావేశాల్లో సభ్యులు. వాళ్ళెవ్వరూ దేవుని ప్రజల సమావేశాల్లోని వారు కాదు."
\s5
\p
\v 10 "నువ్వు పడబోతున్న బాధలలో దేని విషయం గురించీ భయపడవద్దు. సాతాను మీలో కొందరిని జైల్లో పెడతాడు. నువ్వు ఎలాటి విశ్వాసంతో ఉన్నావో చూడడానికి వాడు నిన్ను కష్ట స్థితిలోకీ నెట్టి పరీక్షిస్తాడు. కొద్దికాలమే నువ్వు బాధలు పడతావు. నాపై నమ్మిక ఉంచడం వల్ల వాళ్ళు నిన్ను చంపినా సరే, నాపై విశ్వాసం కొనసాగించు. నేను నీ తలపై కిరీటం పెడతాను. అది నీకు ఇలాంటి వాటన్నిటినీ అధిగమించే శక్తి ఇస్తుంది. అది నీకు ఉన్న నిత్యజీవానికి చిహ్నం.
\v 11 విశ్వాసుల సంఘాలన్నీ సమావేశమైనప్పుడు దేవుని ఆత్మ చెప్పే సందేశాన్ని జాగ్రత్తగా వినండి. విజయం సాధించిన వారంతా రెండోసారి చనిపోరు."
\s5
\p
\v 12 "పెర్గము పట్టణంలో ఉన్న విశ్వాసుల సంఘ దూతకు ఈ సందేశాన్ని వ్రాయి. నేను ఈ విషయాలు నీకు చెబుతున్నాను. నాది రెండంచుల పదును ఉన్న కత్తి.
\v 13 నువ్వు జీవిస్తున్న చోటు నాకు తెలుసు. ప్రజలను సాతాను తన గుప్పెట్లో ఉంచుకున్న చోటు అది. నీ కుటుంబం నాలో విశ్వాసం ఉంచిందని నాకు తెలుసు. నాపై విశ్వాసాన్ని, నమ్మికను నీవు ఎన్నడూ కాదనలేదు. నా గురించి ప్రజలకు నమ్మకంగా చెప్పిన అంతిపా జీవించిన రోజుల్లో కూడా నువ్వు నన్ను తిరస్కరించలేదు. ప్రజలు నిత్యం అలవాటుగా సాతానుకు విధేయత చూపిస్తున్న పట్టణంలో వారు అతడిని చంపారు."
\s5
\p
\v 14 "అయినా, నీ సాక్ష్యాన్ని దెబ్బతీసి, నీ విధేయతను బలహీన పరిచే కొన్ని విషయాలను నేను చూశాను. చాలాకాలం క్రితం బిలాము బోధించిన విషయాలను నీ సభ్యుల్లో కొందరు బోధించడానికి నువ్వు అనుమతిస్తున్నావు. దేవుని ప్రజల మధ్య అనైతిక లైంగిక కార్యకలాపాలు చేసేలా విగ్రహాలకు బలిగా అర్పించిన వాటిని తినేలా దేవుని ప్రజలను ప్రేరేపించమని బాలాకుకు అతడు బోధించాడు.
\v 15 అదే మార్గంలో, నువ్వు కూడా నీ సభ్యులను నీకొలాయితుల బోధలను అనుసరించేలా, అనైతిక లైంగిక కార్యకలాపాలకు పాల్పడేలా అనుమతిస్తున్నావు."
\s5
\p
\v 16 "నీ ఆలోచన పధ్ధతి మార్చుకో. ఇలా చేయడం మానెయ్యి. లేకపోతే అకస్మాత్తుగా నేను నీ దగ్గరకు వచ్చి, దేవుని వాక్యమనే నా నోటి ఖడ్గంతో వారికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తాను.
\v 17 విశ్వాసుల సంఘాలన్నీ కలిసి సమావేశమైనప్పుడు దేవుని ఆత్మ చెప్పే సందేశాన్ని జాగ్రత్తగా వినండి. జయించిన వారికి నేను దాచి ఉంచిన మన్నాను ఇస్తాను. అది వారికి ఆహారంగా ఉండి, శక్తినిస్తుంది. అంతే కాకుండా అతనికి ఒక తెల్లని రాయిని ఇస్తాను. దానిపై ఒక కొత్త పేరు చెక్కాను. అతనికి నేను ఇచ్చే ఆ పేరు అతనికి మాత్రమే తెలుస్తుంది."
\s5
\p
\v 18 "తుయతైర పట్టణంలో ఉన్న విశ్వాసుల సంఘం యొక్క దూతకు ఈ సందేశాన్ని వ్రాయి. అగ్ని జ్వాలల్లా ప్రకాశించే కళ్ళు, కరిగి తళతళలాడే కంచులా ప్రకాశించే కాళ్ళు కలిగిన దేవుని కుమారుడినైన నేను ఈ విషయాలు నీకు చెబుతున్నాను.
\v 19 నువ్వు చేస్తున్న మంచి పనులన్నీ నాకు తెలుసు. నా మీద నీకున్న ప్రేమ, మీకు ఒకరిపై ఒకరికున్న ప్రేమ నాకు తెలుసు. నా మీద నీకున్న విశ్వాసం కూడా నాకు తెలుసు. నువ్వు ఇతరులకు సేవ చేస్తున్నావని నాకు తెలుసు. ఆ క్రమంలో అనేకమైన ఇబ్బందులను నీవు స్థిరంగా భరిస్తున్నావు. గతంలో చేసిన దానికంటే ఇప్పుడు నువ్వు ఇలాటి పనులు మరి ఎక్కువగా చేస్తున్నావని నాకు తెలుసు."
\s5
\p
\v 20 "అయితే నీలో తప్పు ఉంది. చాలాకాలం క్రితం జీవించిన దుర్మార్గురాలైన యెజెబెల్ రాణి లాంటి స్త్రీని నీ సభ్యుల మధ్య నువ్వు ఉండనిస్తున్నావు. తాను ఒక ప్రవక్తినని ఆమె చెప్పుకుంటున్నది. అయితే ఆమె తన బోధల ద్వారా నా సేవకులను మోసం చేస్తున్నది. విగ్రహాలకు బలి ఇచ్చిన ఆహారాన్ని తినమని, అనైతిక లైంగిక కార్యకలాపాలు చేయమని వాళ్ళను పురిగొల్పుతున్నది.
\v 21 ఈ విగ్రహారాధన ఆచారాలు, లైంగిక అనైతికత నుంచి తప్పుకోవడానికి ఆమెకు నేను సమయం ఇచ్చినా ఆమె వాటిని ఆపడానికి ఇష్టపడలేదు.
\s5
\v 22 దాని ఫలితంగా నేను ఆమెకు తీవ్రమైన అనారోగ్యం కలిగిస్తాను. ఆమె చేస్తున్న పనులు ఆపకపోతే, నీతి తప్పి ప్రవరించిన వారిని కూడా ఆమె పడ్డ తీవ్రమైన బాధలు పడేలా చేస్తాను.
\v 23 కొందరు ఆమె బోధించిన వాటిని అంగీకరించి ఆమె పిల్లలౌతున్నారు. వాళ్ళను నేను కచ్చితంగా చంపుతాను. అప్పుడు ప్రతి ఒక్కరి ప్రతి కదలికా నాకు తెలిసి పోతుందని అన్ని విశ్వాస సంఘాల వాళ్ళు గ్రహిస్తారు. మీ క్రియల ప్రకారం మీలో ప్రతి ఒక్కరికీ ప్రతిఫలం ఇస్తాను."
\s5
\p
\v 24 "అయితే తుయతైర నగరంలో ఉన్న మిగతా విశ్వాసులను గురించి కొంత మంచిగా చెప్పడానికి ఒక విషయం ఉంది. మీలో కొందరు ఈ తప్పుడు విషయాలను అంగీకరించక పోవడం మంచిది. వాళ్ళకు సాతాను బోధించిన నిగూఢ పద్దతులను తిరస్కరించడం మంచిది. ఇక ఏ ఇతర ఆజ్ఞలతో నేను నీపై మరింత భారం పెట్టను.
\v 25 నేను వచ్చే దాకా నాకు విధేయత చూపుతూ, స్థిరంగా నీ నమ్మకాన్ని కొనసాగించు."
\s5
\p
\v 26 "సాతానును జయించే వారికీ మరణం వరకూ నా ఆజ్ఞకు విధేయులయ్యే వారికీ ప్రజలందరి మీదా అధికారం ఇస్తాను.
\v 27 వాళ్ళు ఇనప దండంతో ప్రజలను ఏలుతారు. మట్టి కుండను ముక్కలుగా చేసినట్టే వాళ్ళు దుర్మార్గులను నాశనం చేస్తారు.
\v 28 నా తండ్రి నాకు ఇచ్చిన అధికారంతో ఇదంతా చేస్తాను. విజయంలో గొప్ప సంతోషం పొందడానికై నాతో కలిసి పాలించిన వాళ్ళకి ఉదయతారను ఇస్తాను.
\v 29 విశ్వాసుల సంఘాలన్నిటికీ దేవుని ఆత్మ చెబుతున్న సందేశాన్ని ప్రతి ఒక్కరూ తప్పక జాగ్రత్తగా వినండి, అర్ధం చేసుకోండి."
\s5
\c 3
\p
\v 1 "సార్దీస్ నగరంలో ఉన్న విశ్వాసుల సంఘం దూతకు ఈ సందేశాన్ని వ్రాయి. ఈ విషయాలను నేను నీకు చెబుతున్నాను. ఏడు నక్షత్రాలూ, దేవుని ఏడు ఆత్మలూ కలిగి ఉన్నవాణ్ణి నేనే. నువ్వు చేసిన పనులన్నీ నాకు తెలుసు. నువ్వు బతికి ఉన్నట్టు కనిపిస్తున్నావు గానీనువ్వు చనిపోయావు.
\v 2 జాగ్రత్త. నిద్రనుంచి మేల్కొన్న వాడిలా నీ భక్తి ఎలా ఉందో పరిశీలించుకో. నీకు నీవుగా నీ భక్తిని బలపరుచుకో. ఎందుకంటే నీవు చనిపోయిన వాడిలాగా ఎందుకూ కొరగాకుండా ఉన్నావు. నువ్వు కచ్చితంగా ఇలా చేయాలి. ఎందుకంటే నువ్వు చేస్తున్నది ఏదీ సంతృప్తికరంగా లేదని నా దేవుడు భావిస్తున్నాడని నాకు తెలుసు."
\s5
\p
\v 3 "అయితే మరి నువ్వు మొదట్లో విన్నప్పుడు ఒప్పుకున్న సత్యాన్ని, దేవుని సందేశాన్ని గుర్తుకు తెచ్చుకో. విధేయుడుగా నీ పాప స్వభావం నుంచి మళ్ళుకో. నీవు ఇలా చేయకపోతే, నువ్వు అనుకోని సమయంలో నేను దొంగలా నీ దగ్గరకు వస్తాను. నీకు తీర్పు తీర్చడానికి ఏ సమయంలో నీ దగ్గరకు వస్తానో నీకు ఎంతమాత్రం తెలియదు."
\p
\v 4 "అయితే సార్దిస్ నగరంలో నీలో ఉన్న కొందరు విశ్వాసులు ఏ తప్పూ చేయడం లేదు. తమ బట్టలను మురికి చేసుకోలేదు. తత్ఫలితంగా వారు నాతో కలిసి జీవించే అర్హత ఉన్నవారు కాబట్టి స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారిలాగా వాళ్ళు నాతో కలిసి జీవిస్తారు.
\s5
\v 5 సాతాన్ని జయించిన వాళ్ళకి నేను ఇలాటి తెల్లని బట్టలే ధరింపజేస్తాను. శాశ్వతజీవం పొందినవారి పేర్లు రాసి ఉన్న జీవగ్రంథం నుంచి నేను ఎన్నడూ వాళ్ళ పేర్లు కొట్టివేయను. నా తండ్రి సమక్షంలో, ఆయన దేవదూతల సమక్షంలో నాకు చెందిన వాళ్ళుగా వాళ్ళను అంగీకరిస్తాను.
\v 6 నా సందేశాన్ని అర్ధం చేసుకోవాలనే ప్రతి ఒక్కరికీ, ఒక చోటికి చేరి కలుసుకున్న విశ్వాసుల సంఘాలన్నిటికీ దేవుని ఆత్మ చెబుతున్న సందేశాన్ని తప్పక జాగ్రత్తగా వినండి."
\s5
\p
\v 7 "ఫిలదెల్ఫియ నగరంలో ఉన్న విశ్వాసుల సంఘం దూతకు ఈ సందేశాన్ని వ్రాయి. ఈ విషయాలను నీకు నేను చెబుతున్నాను. నేను పవిత్రుణ్ణి, సత్యవంతుణ్ణి. పురాతన నగరం యెరూషలేములోకి ప్రజల్ని అనుమతించే అధికారం రాజైన దావీదుకు ఉన్నట్టే మనుషులను నా రాజ్యంలోకి అనుమతించే అధికారం నాకు ఉంది. తలుపులు తెరిచే వాణ్ణి నేనే. ఎవ్వరూ వాటిని మూయలేరు. తలుపులు మూసే వాణ్ణి నేనే. ఎవరూ వాటిని తెరవలేరు.
\v 8 నువ్వు చేసిన ప్రతిదీ నాకు తెలుసు. ఎవరూ మూయలేని తలుపును నీ కోసం తెరిచి ఉంచాను. జాగ్రత్తగా తెలుసుకో. నీ శక్తి కొంచెమే అయినా నీవు నాపై నమ్మకం వదలకుండా నేను చెప్పిన దానికి విధేయత చూపించావని నాకు తెలుసు."
\s5
\p
\v 9 "జాగ్రత్తగా ఉండండి. నీ ప్రజల్లో కొందరు సాతానును అనుసరించే వాళ్ళతో ఏకమౌతారు. తాము యూదులమని చెప్పుకుంటారు గానీ వాళ్ళు నిజంగా యూదులు కాదని నాకు తెలుసు. వాళ్ళు అబద్ధం చెపుతున్నారు. నేను వాళ్ళని నీ దగ్గరకు రప్పించి నీ పాదాల వద్ద వినయంగా నమస్కరించేలా చేసి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని వాళ్ళు గుర్తించేలా చేస్తాను."
\p
\v 10 "ఎందుకంటే ఓపికతో బాధను భరించమని నేను నీకు ఆజ్ఞాపించినప్పుడు, నాకు నువ్వు విధేయత చూపించావు. నువ్వు నాకు అవిధేయుడయ్యేలా చేయడానికి ప్రయత్నిస్తున్న వారి నుంచి నిన్ను సురక్షితంగా ఉంచుతాను. వాళ్ళు త్వరలోనే ప్రపంచం లోని ప్రతిఒక్కరికీ ఇలా చేస్తారు.
\v 11 నేను త్వరలో వస్తాను. కాబట్టి దేవుడు నీకోసం కేటాయించిన నీ బహుమతిని పోగొట్టుకోవడానికి ఎవరూ కారణం కాకుండా ఉండేలా, నేను చెప్పిన వాటిని కొనసాగించు.
\s5
\v 12 సాతాన్ని జయించిన వాళ్ళను నేను సురక్షితంగా ఉంచుతాను. వాళ్ళు నా దేవుని ఆలయంలో స్తంభాల్లా బలంగా ఉంటారు. వాళ్ళు స్తంభాల్లా అక్కడే ఉండిపోతారు. వాళ్ళను ఆయనకు చెందిన వారిగా చూపిస్తూ, నా దేవుని పేరుతో వాళ్ళకు గుర్తు వేస్తాను. అలాగే వాళ్ళకు నా దేవునికి చెందిన నగరంతో కూడా గుర్తు వేస్తాను. అది నా దేవుని దగ్గర నుంచి దిగి వచ్చే పరలోక నగరం. అదే కొత్త యెరూషలేము. అలాగే వాళ్ళను నాకు చెందిన వారుగా చూపిస్తూ, నా కొత్త పేరును కూడా వాళ్ళకు గుర్తుగా వేస్తాను.
\v 13 నా సందేశాన్ని అర్ధం చేసుకోవాలనే ప్రతి ఒక్కరికీ, ఒక చోటికి చేరి కలుసుకున్న విశ్వాసుల సంఘాలన్నిటికీ దేవుని ఆత్మ చెబుతున్న సందేశాన్ని తప్పక జాగ్రత్తగా వినండి."
\s5
\p
\v 14 "లవొదికయ నగరంలో ఉన్న విశ్వాసుల సంఘం దూతకు ఈ సందేశాన్ని వ్రాయి. ఈ విషయాలను నీకు నేను చెబుతున్నాను. దేవుని వాగ్దానాలన్నిటికీ హామీ ఇచ్చే వాణ్ణి, దేవుని విశ్వాస్యతగురించీ, నమ్మదగిన గుణం గురించీ సాక్ష్యం ఇచ్చే వాణ్ణి నేనే. దేవుని సమస్త సృష్టికీ పాలకుణ్ణి.
\v 15 నువ్వు చేసిన ప్రతిదీ నాకు తెలుసు. నాపై నమ్మికను నువ్వు తిరస్కరించలేదు గానీ నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించడం లేదు. నువ్వు వేడిగా గాని చల్లగా గాని లేని నులివెచ్చని నీళ్ళవలె ఉన్నావు. నువ్వు చల్లగా గాని వెచ్చగా గాని ఉండాలని నేను కోరుకుంటున్నాను.
\v 16 ఇటు నీ భక్తిలో ఎటువంటి ఎదుగుదలా లేకపోవడం గురించి నీకు ఆందోళన గాని, అటు నా గురించిన ఉత్సాహం గాని నీలో లేదు. కాబట్టి నేను నా నోట్లో నుంచి గోరువెచ్చని నీళ్ళు ఉమ్మివేస్తున్నట్లుగా, నేను నిన్ను తిరస్కరించబోతున్నాను."
\s5
\p
\v 17 "నేను చాలా సంపద కూడబెట్టుకున్నాను, నేను ధనికుణ్ణి, నాకు ఏ లోటూ లేదు, అని నువ్వు చెబుతున్నావు. కాని నువ్వు ఎన్ని విధాల అవసరతల్లో ఉన్నవో ఆ సంగతి తెలుసుకోలేక పోతున్నావు. దిగంబరిగా, అంధుడిగా, దరిద్రుడిగా, దయనీయమైన స్థితిలో దౌర్భాగ్యుడిలా నువ్వు ఉన్నావు.
\v 18 నీకు అవసరమైన వాటన్నిటినీ నా దగ్గర నుంచి పుచ్చుకోమని హెచ్చరిస్తున్నాను. నీవు నిజమైన ధనవంతుడు కావడానికి నా దగ్గర మేలిమి బంగారం కొనుక్కో. దిగంబరంగా సిగ్గుతో ఉండడానికి బదులుగా వేసుకోవడానికి తెల్లని వస్త్రాలు నా దగ్గర కొనుక్కో. ఆ విధంగా నేను నిన్ను నీతిపరుడుగా మారుస్తాను. నీ కళ్ళకు పెట్టుకోడానికి కలికాన్ని నా దగ్గర కొనుక్కో. ఆ విధంగా నువ్వు సత్యాన్ని అర్ధం చేసుకునేలా నీకు సహాయం చేస్తాను."
\s5
\p
\v 19 "నేను ఎవరిని ప్రేమిస్తానో, వాళ్ళని మందలించి సరిదిద్దుతాను కాబట్టి నీ పాపస్వభావం నుంచి మనస్ఫూర్తిగా దూరం తొలుగు.
\v 20 నేను ఇక్కడే ఉన్నాను. ప్రతి ఒక్కరినీ పిలుస్తున్నాను. నీ ఇంటి తలుపు తడుతూ, నీ కోసం వేచి చూస్తూ నిల్చున్నాను. నువ్వు నా స్వరం విని తలుపు తీస్తే, లోపలికి వస్తాను. మనం స్నేహితుల్లా కలసి భోజనం చేస్తాము."
\s5
\p
\v 21 "నేను సాతానును జయించి, ఇప్పుడు నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ఎలా పరిపాలిస్తున్నానో, అలా మీలో సాతాన్ని జయించిన వాళ్ళందరికీ నా సింహాసనం మీద కూర్చుని నాతో కలసి పాలించే అవకాశం ఇస్తాను.
\v 22 నా సందేశాన్ని అర్ధం చేసుకోవాలనే ప్రతి ఒక్కరికీ, ఒక చోటికి చేరి కలుసుకున్న విశ్వాసుల సంఘాలన్నిటికీ దేవుని ఆత్మ చెబుతున్న సందేశాన్ని తప్పక జాగ్రత్తగా వినండి."
\s5
\c 4
\p
\v 1 ఈ విషయాలు జరిగిన తరువాత, యోహాననే నేను ఒక దర్శనం చూశాను. అందులో పరలోక ద్వారాలు తెరిచి ఉన్నాయి. పెద్ద బాకానాదంలా ధ్వనించే స్వరంతో నాతో ఇంతకు ముందు మాట్లాడిన వాడు నాతో, "ఇక్కడికి ఎక్కి రా. ఇకపై జరగబోయే సంఘటనలను నేను నీకు చూపిస్తాను" అన్నాడు.
\p
\v 2 వెంటనే దేవుని ఆత్మ జరగబోయే విషయాలను నాకు వెల్లడి చేయడం ప్రారంభించాడు. ఆయన పరలోక సింహాసనాన్నీ, దానిపై కూర్చున్న పరిపాలకుణ్ణి నాకు చూపించాడు.
\v 3 సింహాసనం మీద కూర్చున్న పరిపాలకుడు ఎర్రని కెంపు లాగా స్పటికాకార చంద్రకాంత మణిలాగా ధగధగా మెరుస్తున్నాడు. సింహాసనం చుట్టూ ఇంద్రధనస్సు కళ్ళు మిరుమిట్లు గొలిపే పచ్చని మరకతం లాగా మెరుస్తున్నది.
\s5
\p
\v 4 ఆ సింహాసనం చుట్టూ మరో ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి. ఈ ఇరవై నాలుగు సింహాసనాలపై ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వారు తమ తలమీద బంగారు కిరీటాలతో, స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారు.
\v 5 ఆ సింహాసనం నుంచి మెరుపులతో, ఉరుములతో కూడిన పెద్ద శబ్దాలు వెలువడుతున్నాయి. ఆ సింహాసనం ముందు ఏడు వెలుగుతున్న దీపాలు ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.
\s5
\p
\v 6 ఆ సింహాసనం ఎదుట గాజుతో చేసినట్టుగా ఉన్న సముద్రం కూడా ఉంది. అది స్పటికంలా పారదర్శకంగా ఉంది. ఇరువైపులా ఒక జీవి చొప్పున, సింహాసనానికి నాలుగు వైపులా నాలుగు జీవులు ఉన్నాయి. ప్రతి ఒక్క జీవికీ ముందూ వెనకా కళ్ళు ఉన్నాయి.
\s5
\p
\v 7 ఆ మొదటి జీవి సింహంలా ఉంది. రెండోది ఎద్దులా ఉంది. మూడో దానికి మనిషి ముఖం లాంటి ముఖం ఉంది. నాలుగో జీవి ఎగురుతున్న గరుడ పక్షిలా ఉంది. నాలుగు జీవుల్లో ప్రతి దానికీ ఆరేసి రెక్కలున్నాయి. ఈ రెక్కలు కిందా పైనా కళ్ళతో నిండి ఉన్నాయి.
\v 8 ఆ జీవులు రేయింబవళ్ళు ఎడతెగక,
\q1 "సమస్తాన్నీ ఏలుతున్న ఆ ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు.
\q1 ఆయన నిరంతరం జీవించే వాడు,
\q1 ఇప్పుడు ఎల్లప్పుడు జీవించేవాడు" అంటున్నాయి.
\s5
\p
\v 9 ఆ జీవులు, సింహాసనంపై కూర్చుని ఉన్న చిరంజీవికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తున్నాయి. ఆ జీవులు ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు, సింహాసనంపై కూర్చున్న ఆ ఇరవైనాలుగు మంది పెద్దలు ఆయన ఎదుట నేలపై సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు.
\v 10 చిరకాలం జీవిస్తూ ఉన్న ఆయన్ని వాళ్ళు ఆరాధిస్తున్నారు. సింహాసనం ఎదుట తమ కిరీటాలను పెడుతూ,
\q1
\v 11 "స్వామీ, దేవా, నీవు
\q1 సర్వశక్తిమంతుడవు, గౌరవనీయుడవు, మహిమాన్వితుడవు కాబట్టి అందరిచేతా స్తుతులు పొందడానికి అర్హుడవు.
\q1 సమస్తాన్నీ నీవొక్కడివే సృష్టించావు.
\q1 ఎందుకంటే అవి ఉనికిలో ఉండాలని నువ్వు సంకల్పించావు.
\q1 నువ్వు వాటిని సృష్టించావు. అందుకే అవి ఉనికిలో ఉన్నాయి" అని ప్రస్తుతించారు.
\s5
\c 5
\p
\v 1 సింహాసనంపై కూర్చున్న ఆయన చేతిలో ఒక పుస్తకపు చుట్టను నేను చూశాను. ఆ పుస్తకపు చుట్టకు లోపల, బయట వ్రాత ఉంది. దానికి ఏడు సీళ్లు వేసి ఉన్నాయి.
\v 2 ఒక బలిష్టుడైన దేవదూత బిగ్గరగా "ఈ పుస్తకపు చుట్టను సీళ్లు విప్పి, తెరిచే అర్హత ఉన్నవారెవరో రండి! ఈ తోలు చుట్ట విప్పండి!" అని ప్రకటించాడు.
\s5
\p
\v 3 ఆ తోలు చుట్టను విప్పి, దానిలో ఏం రాసుందో చూడడానికి పరలోకంలో గానీ, భూమి మీద గానీ, భూమి కింద గానీ సృష్టి అయిన ఏ జీవికి అర్హత లేదు.
\v 4 ఆ గ్రంథం విప్పడానికి ఎవరికి అర్హత లేనట్టు కనిపించి నేను వెక్కి వెక్కి ఏడ్చాను.
\v 5 కాని పెద్దల్లో ఒకడు నాతో "ఇక ఏడ్చే పని లేదు. చూడు, యూదా జాతి సింహ౦, దావీదు రాజు వారసుడు, హక్కుదారుడు సాతానును ఓడించాడు. ఫలితంగా ఆయన ఏడు సీళ్లు ఉన్న గ్రంథం చుట్ట విప్పి చూడడానికి అర్హుడు" అన్నాడు.
\s5
\p
\v 6 సింహాసనం ఎదుట ఉన్న పెద్దల మధ్యా నాలుగు ప్రాణుల మధ్యా గొర్రెపిల్ల ఉండడం నేను చూశాను. తాను వధ అయినట్టుగా కనిపించే గుర్తులు ఆయన ఒంటిపై ఉన్నాయి. అయినా ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయనకు ఏడు కొమ్ములూ, ఏడు కన్నులూ ఉన్నాయి. ఆ కళ్ళు దేవుని ఏడు ఆత్మలు. దేవుడు వాటిని భూలోకమంతటికీ పంపిస్తున్నాడు.
\v 7 గొర్రెపిల్ల వచ్చి సింహాసనంపై కూర్చున్న వాడి కుడి చేతిలో నుంచి గ్రంథాన్ని తీసుకున్నాడు.
\s5
\p
\v 8 ఆయన ఆ పుస్తకపు చుట్టను తీసుకోగానే ఆ నాలుగు జీవులు, ఇరవై నలుగురు పెద్దలూ తమకు తాముగా ఆయన ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రతి ఒక్కరి దగ్గరా వీణ, దేవుని ప్రజల ప్రార్ధనతో నిండిన బంగారు గిన్నెలు ఉన్నాయి.
\s5
\p
\v 9 పెద్దలు, జీవులు ఒక కొత్త పాట పాడారు. వాళ్ళు,
\q1 "గ్రంథాన్ని తీసుకొని, దాని సీళ్లు విప్పడానికి నువ్వే అర్హుడివి.
\q1 ఎందుకంటే నువ్వు విమోచకుడివి గనక వధ అయ్యావు, ఎందుకంటే
\q1 నువ్వు చనిపోయి దేవుని కోసం ప్రతి జనం నుంచి, ప్రతి భాష నుంచి, ప్రతి జాతి నుంచి, ప్రతి వంశం నుంచి మనుషులను నీ రక్తంతో కొన్నావు.
\q1
\v 10 నీ వల్లనే వాళ్ళు దేవుని రాజ్య ప్రజలయ్యారు.
\q1 ఆయన్ని సేవించే యాజకులయ్యారు. వాళ్ళు భూమిపై పరిపాలిస్తారు."
\s5
\p
\v 11 నేను అలా చూస్తూనే ఉన్నాను. పెద్దల చుట్టూ, జీవుల చుట్టూ, సింహాసనం చుట్టూ చేరిన చాలా మంది దేవదూతల స్వరం నేను విన్నాను. వాళ్ళు లక్షల కొద్దీ అక్కడ ఉన్నారు, లెక్కకు మిక్కుటమైన పెద్ద గుంపు ఉంది.
\v 12 పెద్ద స్వరంతో వాళ్ళు పాట పాడుతున్నారు.
\q1 వధ అయిన గొర్రెపిల్ల,
\q1 ఆయనకున్న శక్తి, సంపద, జ్ఞానం, బలాన్ని బట్టి మనం స్తుతులు చెల్లించడానికి ఆయన అర్హుడు.
\q1 ఆయన చేసిన సృష్టి అంతా ఆయన్ని కీర్తించి, స్తుతించడం మంచిది.
\s5
\p
\v 13 పరలోకంలో, భూమి మీదా, భూమి లోపలా, సముద్రంలోనూ ఉన్న జీవులు చెప్పగా నేను విన్నాను,
\q1 "సింహాసనంపై కూర్చున్న వాడికి , ఎప్పటికీ మహిమ, కీర్తి, స్తుతి.
\q1 ఎప్పటికీ సంపూర్ణ శక్తితో ఆయన ఏలు గాక."
\v 14 నాలుగు జీవులు, "అలానే జరుగుగాక" అన్నాయి. అప్పుడు పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి, గొర్రెపిల్లను ఆరాధించారు.
\s5
\c 6
\p
\v 1 ఆ గ్రంథం చుట్టకు ఉన్న మొదటి సీలు గొర్రెపిల్ల విప్పడం నేను చూశాను. అప్పుడు ఉరుము వంటి స్వరంతో నాలుగు జీవుల్లో ఒకటి బిగ్గరగా గట్టిగా "ఇటు రా" అన్నది.
\p
\v 2 ఒక తెల్ల గుర్రం కనిపించింది. దానిపై కూర్చుని ఉన్నవాడి దగ్గర విల్లు, బాణాలు ఉన్నాయి. అతడు జయించడానికి వెళ్తున్నాడని చూపించడానికి దేవుడు అతనికి తలపై పెట్టుకోవడానికి ఆకుల కిరీటం ఇచ్చాడు. అతడు యుద్ధం కొనసాగిస్తూ, గెలుస్తూ బయలుదేరాడు.
\s5
\p
\v 3 అప్పుడు గొర్రెపిల్లలా కనిపిస్తున్న ఆయన రెండో సీలు విప్పాడు. అప్పుడు రెండో జీవి "ఇక్కడకు రా" అని చెప్పడం నేను విన్నాను.
\p
\v 4 అతడు అలా చెప్పినప్పుడు, ఎర్రని గుర్రం కనిపించింది. దానిపైన కూడా ఒకడు కూర్చుని ఉన్నాడు. ఇక మనుషులు ఎంత మాత్రం ప్రశాంతంగా జీవించక, పరస్పరం చంపుకునేలా ప్రేరేపించే శక్తిని దేవుడు అతనికి ఇచ్చాడు. ఇందుకోసం అతడు ఒక పెద్ద కత్తి చేతబట్టుకుని వెళ్ళాడు.
\s5
\p
\v 5 అప్పుడు గొర్రెపిల్ల మూడో సీలు విప్పాడు. అప్పుడు మూడో జీవి "ఇక్కడకు రా" అని చెప్పడం నేను విన్నాను.
\p ఈ సారి నల్ల గుర్రం కనిపించింది. దానిపై ఒకడు కూర్చుని, తన చేతిలో త్రాసు పట్టుకొని ఉన్నాడు.
\v 6 అప్పుడు ఆ నాలుగు జీవుల మధ్య నుంచి వస్తున్నట్లుగా ఒక స్వరం నేను విన్నాను. అది గుర్రం మీద ఉన్నవాడికి "ఒక కిలో గోదుమల ధర చాలా ఎక్కువగా ఉండాలి, మనుషులు కొనుక్కోవడానికి వాళ్ళు రోజ౦తా కష్టపడి పని చేసి డానికి తగిన డబ్బు సంపాదించుకోవాలి. మూడు లీటర్ల బార్లీకీ అదే ధర ఉండాలి. ఒలీవ నూనే ద్రాక్ష రసం పుష్కలంగా లభించాలి" అని చెప్పింది.
\s5
\p
\v 7 అప్పుడు గొర్రెపిల్ల నాలుగో సీలు విప్పాడు. అప్పుడు నాలుగో జీవి "ఇక్కడకు రా" అని చెప్పడం నేను విన్నాను.
\p
\v 8 ఈ సారి బూడిద రంగులో పాలిపోయినట్టు ఉన్న గుర్రం కనిపించింది. దానిపై కూర్చున్న వాడి పేరు "మృత్యు దూత." మరొకడు అతని వెనకాలే వెళుతున్నాడు. అతడి పేరు "చనిపోయిన వాళ్ళు వెళ్ళే ప్రదేశం." భూమి జనాభాలో నాలుగో వంతును చంపడానికి ఈ ఇద్దరికీ దేవుడు శక్తి ఇచ్చాడు. వాళ్ళు క్రూర మృగాల వలనా వ్యాధుల వలనా కరువుకాటకాల వలనా ఆయుధాల వలనా మనుషులను మట్టు పెడతారు.
\s5
\p
\v 9 అప్పుడు గొర్రెపిల్ల ఐదవ సీలు విప్పాడు. అప్పుడు నేను పరలోకంలోని బలిపీఠం కింద దేవుని సేవకుల ఆత్మలను చూశాను. దేవుని సందేశంపై నమ్మిక ఉంచిన కారణంతో వారు మరణశిక్ష పాలయ్యారు. ఆ సందేశానికి దేవుడు తానే సాక్షి.
\v 10 వాళ్ళు గావుకేకలు పెడుతూ దేవుణ్ణి "సార్వభౌమాధికారి అయిన ప్రభూ, నీవు పరిశుద్ధుడవు, సత్యవంతుడవు. మమ్మల్ని హత్య చేసిన వాళ్ళకు తీర్పు తీర్చడానికీ శిక్షించడానికీ ఇంకా ఎంత కాలం ఆలస్యం?" అంటూ అడుగుతున్నారు.
\v 11 అప్పుడు దేవుడు వారిలోని ప్రతి ఒక్కరికీ తెల్ల అంగీ ఇచ్చి, ఇంకా కొంచెం కాలం ఓపిక పట్టమని చెప్పాడు. దేవుని ఇతర సేవకుల, శిష్యుల హతసాక్షుల లెక్క పూర్తి అయ్యే వరకు వారు వేచి ఉండవలసిందే.
\s5
\p
\v 12 అప్పుడు గొర్రెపిల్ల ఆరవ సీలు విప్పాడు. అప్పుడు భూమి భయంకరమైన కుదుపుకు గురైంది. సూర్యుడు నల్లని ఉన్ని వస్త్రంలా అయిపోయాడు. చంద్రబింబం రక్తంలా ఎర్రగా మారిపోయింది.
\v 13 పెనుగాలికి అంజూరపు చెట్టు కదిలిపోయి ఇంకా పండని అంజూరు కాయలు రాలినట్లు, పెద్ద సంఖ్యలో నక్షత్రాలు భూమి మీద పడ్డాయి.
\v 14 పాత కాగితం చుట్ట రెండుగా విడిపోయి ముడుచుకు పోయినట్టు ఆకాశం బద్దలై ముడుచుకు పోయింది. ప్రతి పర్వతం, ద్వీపం తన తావు నుంచి తొలిగి పోయింది.
\s5
\p
\v 15 ఫలితంగా, శక్తిమంతులైన ప్రజలు, ధనికులు, సేనాధిపతులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, బానిసలు, స్వతంత్రులు, మిగతా అందరితో కలిపి, రాజులతో సహా భూమి మీద ఉన్న సమస్త ప్రజానీకం పర్వతాల్లోనూ బండ సందుల్లోనూ గుహల్లోనూ దాక్కున్నారు.
\v 16 వాళ్ళు , "మా మీద పడి మమ్మల్ని కప్పండి. సింహాసనంపై కూర్చున్న ఆయనకు మేము కనిపించకుండా గొర్రెపిల్ల మమ్మల్ని శిక్షించడానికి వీలు లేకుండా మమ్మల్ని దాచిపెట్టండి!" అని పర్వతాలతోను, రాళ్లతోను గగ్గోలుగా అరుస్తూ ప్రాధేయ పడ్డారు.
\v 17 "ఇది మమ్మల్ని శిక్షిస్తున్న భయానకమైన ప్రళయ దినం. ఈ రోజు ఎవ్వరూ ప్రాణాలతో బయట పడే అవకాశం లేదు" అని వాళ్ళంతా ఆక్రోశించారు.
\s5
\c 7
\p
\v 1 ఇది జరిగిన తరువాత నలుగురు దేవదూతలు భూమి మీద నిలబడి ఉండడం నేను చూశాను. ఒకరు ఉత్తరం వైపు ఒకరు దక్షిణం వైపు, ఒకరు తూర్పు వైపు ఒకరు పడమర వైపు నిల్చుని ఉన్నారు. భూమి మీదా సముద్రం మీదా ఏ చెట్టు మీదా కూడా గాలి వీచకుండా వారు అడ్డుకుంటున్నారు.
\p
\v 2 అప్పుడు మరో దేవదూత తూర్పు నుంచి పైకి రావడం నేను చూశాను. అతడు దేవుని ముద్రను ధరించి ఉన్నాడు. సర్వశక్తిమంతుడైన దేవుని ముద్రతో తన సొంత ప్రజలను రక్షించడానికి వారిపై గుర్తు వేస్తున్నాడు. భూమికీ సముద్రానికీ హాని చేయమని దేవును చేత ఆజ్ఞ పొందిన దేవదూతలను అతడు పెద్ద స్వరంతో పిలిచాడు.
\v 3 అతడు వారితో, "మన దేవుని సేవకుల నుదిటిపై గుర్తు వేసేంత వరకూ భూమికి గానీ, సముద్రానికి గానీ, ఆఖరికి చెట్లకు కూడా హాని చేయవద్దు" అని చెప్పాడు.
\s5
\p
\v 4 అప్పుడు దేవదూత, అతడి సాటి దేవదూతలు దేవుని సేవకులకు గుర్తు వేశారు. వారు ఎంతమందికి గుర్తు వేశారో నేను విన్నాను. ఆ సంఖ్య లక్షా నలభై నాలుగు వేలు. వారు ప్రతి ఇశ్రాయేలు గోత్రం నుంచి తీసుకొన్నవారు. దేవుడు ఎవరిని రక్షిస్తాడో, ఆ పూర్తి సంఖ్యను సూచిస్తున్నారు.
\q1
\v 5 యూదా గోత్రం నుంచి 12,000 మందికి గుర్తు వేశారు,
\q1 రూబేను గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 గాదు గోత్రం నుంచి 12,000 మందికి,
\q1
\v 6 ఆషేరు గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 నఫ్తాలి గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 మనష్షే గోత్రం నుంచి 12,000 మందికి,
\s5
\q1
\v 7 షిమ్యోను గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 లేవి గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 ఇశ్శాఖారు గోత్రం నుంచి 12,000 మందికి,
\q1
\v 8 జెబూలూను గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 యోసేపు గోత్రం నుంచి 12,000 మందికి,
\q1 బెన్యామీను గోత్రం నుంచి 12,000 మందికి, ఇలా అన్ని గోత్రాల వారికీ గుర్తువేశారు.
\s5
\p
\v 9 ఈ విషయం జరిగిన తరువాత, ఒక పెద్ద సమూహాన్ని నేను చూశాను. అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు, వారిని లెక్కబెట్టడం ఎవరి తరం కాదు. ప్రతి భాష నుంచి, ప్రతి జనం నుంచి, ప్రతి జాతి నుంచి, ప్రతి దేశం నుంచి వారు వచ్చారు. సింహాసనం ఎదుటా గొర్రెపిల్ల ఎదుటా వారంతా నిల్చున్నారు. వాళ్ళు తెల్లని అంగీలు వేసుకొని, ఖర్జూర చెట్ల కొమ్మలను రెండు చేతుల్లోనూ పట్టుకొని సంబరంగా ఊపుతున్నారు.
\v 10 వాళ్ళు బిగ్గరగా, "సింహాసనంపై కూర్చున్న మా దేవుడూ, గొర్రెపిల్లా సాతాను శక్తినుంచి మమ్ములను రక్షించారు" అని హర్ష ధ్వానాలు చేస్తున్నారు.
\s5
\p
\v 11 దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు జీవుల చుట్టూ నిల్చున్నారు. వాళ్ళందరూ సింహాసనం ఎదుట తమ ముఖాలను నేలకు ఆనించి దేవుణ్ణి ఆరాధించారు.
\v 12 వాళ్ళు , "అవును, ఆలా జరుగు గాక. నిత్యుడవైన మా దేవా, నీవు సర్వజ్ఞుడవని, శక్తిమంతుడవని, నీకు అసాధ్య మేమీ లేదని స్తుతులు, కృతజ్ఞతలు, కీర్తి నీకు చెల్లిస్తున్నాము. నిత్యుడివైన మా దేవా, అలా జరుగు గాక" అన్నారు.
\s5
\p
\v 13 అప్పుడు పెద్దల్లో ఒకాయన నన్ను అడిగాడు, "ఈ తెల్లని అంగీలు వేసుకున్న వాళ్ళు ఉన్నారే, వీరెవరో ఎక్కడినుంచి వచ్చారో నీకు తెలుసా?"
\v 14 నేను "అయ్యా, నాకు తెలియదు. మీకు తప్పకుండా వాళ్ళెవరో తెలుసు" అన్నాను. ఆయన నాతో, "వీళ్ళందరూ మహా బాధలను దాటుకుని వచ్చిన వాళ్ళు" అని చెప్పాడు. గొర్రెపిల్ల వాళ్ళ కోసం చనిపోయాడు. తద్వారా దేవుడు వాళ్ళ పాపాలను క్షమించాడు. వాళ్ళు తమ అంగీలను ఆయన రక్తంలో ఉతుక్కుని తమను శుభ్రపరుచుకున్నారు."
\s5
\p
\v 15 "ఈ కారణం గానే వాళ్ళందరూ దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు. వాళ్ళు రేయింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయన్ని ఆరాధిస్తున్నారు. సింహాసనంపై కూర్చున్న దేవుడు వాళ్ళని సంరక్షిస్తాడు.
\v 16 దాని ఫలితంగా, వాళ్ళకి మరలా ఎప్పటికీ ఆకలి వేయదు. వాళ్ళకి ఎన్నటికీ దాహం వేయదు. వాళ్ళకు ఎన్నటికీ ఎండ దెబ్బ తగలదు, ఎలాంటి వేడిమీ వాళ్ళను ఏమీ చేయదు.
\v 17 కాపరి తన గొర్రెలను జాగ్రత్తగా సంరక్షిస్తున్నట్టుగా, సింహాసనం వద్ద ఉన్న గొర్రెపిల్ల వాళ్ళను జాగ్రత్తగా సంరక్షిస్తాడు. కాపరి తన గొర్రెలను నీటి కాలవల దగ్గరకు ముందుండి నడిపించినట్టు ఆయన వాళ్ళకు నిత్యజీవపు ఊటల వద్దకు దారి చూపిస్తాడు. వాళ్ళకి ఇకపై ఎలాటి దుఃఖం లేకుండా చూస్తాడు. వాళ్ళందరి కన్నీరంతటినీ ఆయన తుడిచివేస్తాడు" అని చెప్పాడు.
\s5
\c 8
\p
\v 1 అప్పుడు గొర్రెపిల్ల ఏడవ సీలు తెరిచాడు. అప్పుడు పరలోకంలో కొంతసేపటి వరకు నిశ్శబ్దం అలుముకుంది.
\v 2 దేవుని ఎదుట నిల్చున్న ఏడుగురు దేవదూతలను నేను చూశాను. ఆయన వాళ్ళల్లో ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క ఒక బాకా ఇచ్చాడు.
\s5
\p
\v 3 మరో దేవదూత వచ్చి బలిపీఠం వద్ద నిల్చున్నాడు. ధూపం వేయడం కోసం అతడి చేతుల్లో బంగారు గిన్నె ఉంది. దేవుని సింహాసనం ఎదుట ఉన్న బంగారు బలిపీఠం మీద దేవుని ప్రజలందరి ప్రార్ధనలతో కలిపి అతడు దానిపై అర్పించడం కోసం పరిమళ ద్రవ్యాలను దేవుడు అతడికి ఇచ్చాడు.
\v 4 దేవదూత చేతిలో ఉన్న గిన్నెలో నుంచి దేవుని ప్రజల ప్రార్ధనలతో పాటు పరిమళ ధూపం దేవుని వద్దకు చేరింది.
\v 5 అప్పుడు దేవదూత బంగారు గిన్నె తీసుకొని, బలిపీఠంలోని నిప్పు కణికలతో దానిని నింపాడు. అతడు వాటిని భూమిపై విసిరాడు. అప్పుడు ఉరుములు పడ్డాయి, మెరుపులు మెరిసాయి, భూమి కంపించి పోయింది.
\s5
\p
\v 6 అప్పుడు ఒక్కొక బాకా చొప్పున ఏడు బాకాలు ఉన్న ఏడుగురు దేవదూతలు, వాటిని ఊదటానికి సిద్ధమయ్యారు.
\p
\v 7 మొదటి దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు రక్తసిక్తమైన వడగళ్ళు, నిప్పులు భూమిపై కురిసాయి. దాని ఫలితంగా భూమి పైభాగం మొత్తంలో మూడోవంతు కాలిపోయింది. మూడోవంతు చెట్లు కాలిపోయాయి. పచ్చ గడ్డిలో మూడోవంతు కాలిపోయింది.
\s5
\p
\v 8 రెండో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు, మండుతున్న పెద్ద పర్వతం లాంటిది సముద్రంలో పడింది. దాని ఫలితంగా సముద్రం మూడో వంతు రక్తంలా ఎర్రగా మారింది.
\v 9 సముద్ర జీవులు మూడో వంతు చనిపోయాయి. సముద్రంలోని మూడో వంతు ఓడలు నాశనం అయ్యాయి.
\s5
\p
\v 10 మూడో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు, ప్రచండంగా కాలుతున్న ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుంచి రాలి మూడోవంతు నదుల్లోనూ మూడోవంతు నీటి ఊటల్లోనూ పడింది.
\v 11 ఆ నక్షత్రానికి చేదు అని పేరు. దాని ఫలితంగా నదుల్లో, నీటిఊటల్లో ఉన్న నీళ్ళు చేదుగా అయిపోయాయి. అవి చేదుగా మారినందువల్ల ఆ నీళ్ళు తాగిన చాలా మంది ప్రజలు చనిపోయారు.
\s5
\p
\v 12 నాలుగో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు దేవుడు సూర్య చంద్ర నక్షత్రాదులు దెబ్బ తినేలా చేశాడు. దానివల్ల అవి తమ కాంతిలో మూడోవంతు కోల్పోయాయి. సూర్యుడు పగటిలో మూడో వంతు సమయం ప్రకాశించడం లేదు. చంద్రుడు, నక్షత్రాలు రాత్రిలో మూడో వంతు సమయం ప్రకాశించడం లేదు.
\s5
\p
\v 13 నేను చూస్తుండగా ఆకాశంలో ఎగురుతున్న ఒక గరుడ పక్షి బిగ్గరగా అరవడం నేను విన్నాను. "దేవదూతలు ఇంకా మిగతా మూడు బాకాలు ఊదినప్పుడు భూనివాసులకు మహా యాతనలు సంప్రాప్తిస్తాయి!" అని అతడు ప్రకటిస్తున్నాడు.
\s5
\c 9
\p
\v 1 ఐదో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక నక్షత్రం రాలి పడటం నేను చూశాను. దేవుడు దానికి పాతాళానికి (అగాధానికి) వెళ్ళే తాళం చెవిని ఇచ్చాడు.
\v 2 అగాధాన్ని తెరచినప్పుడు, గొప్ప కొలిమి నుంచి వచ్చే పొగలా, దానినుంచి పొగ లేచింది. ఆ పొగ సుర్యుడి నుంచి, ఆకాశం నుంచి వచ్చే కాంతిని ఎవ్వరూ చూడకుండా కమ్మేసింది.
\s5
\p
\v 3 ఆ పొగలో మిడతల వంటివి భూమిపైకి వచ్చాయి. తేళ్ళవలె మనుషుల్ని కుట్టే అధికారాన్ని దేవుడు వాటికి ఇచ్చాడు.
\v 4 భూమిపై ఉన్న గడ్డికి గాని, మొక్కలకు గాని, ఏ చెట్టుకు గాని హాని చేయరాదని దేవుడు మిడతలకు చెప్పాడు. దేవునికి చెందినవారుగా సూచించడానికి ఎవరికైతే దేవుడు వేసిన గుర్తు లేదో, వారికి మాత్రమే హాని చేయాలని ఆయన వాటికి చెప్పాడు.
\s5
\p
\v 5 అయితే ప్రజలను చంపే అధికారం దేవుడు మిడతలకు ఇవ్వలేదు. దానికి బదులుగా మనుషులను ఐదు నెలల పాటు చిత్రహింసలు పెట్టమని అనుమతి ఇచ్చాడు. తేళ్ళు కుడితే ఎలాంటి బాధ కలుగుతుందో, అలాంటిదే మనుషులు వాటివల్ల అనుభవించారు.
\v 6 దేవునిపై తిరుగుబాటు చేసిన వారిని మిడతలు చిత్రహింసలు పెడుతున్న సమయంలో, ఆ బాధ, నొప్పి తాళలేక వాళ్ళు చనిపోవాలని కోరుకున్నారు. కాని అది వాళ్ళ వల్లగాలేదు. వాళ్ళకు చావు అల్లంత దూరంలో ఉన్నా వాళ్ళు చనిపోలేక పోయారు.
\s5
\p
\v 7 ఆ మిడతలు చూడడానికి యుద్ధానికి సిద్ధమైన గుర్రాల్లా ఉన్నాయి. బంగారు కిరీటాల వంటివి వాటి తలపై ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాల్లా ఉన్నాయి.
\v 8 వాటికి స్త్రీలకు ఉండే పొడుగాటి జుట్టు ఉంది. వాటి కోరలు సింహం కోరల్లా దృఢంగా ఉన్నాయి.
\v 9 లోహంతో చేసినట్టున్న కవచాన్ని అవి రొమ్ముకు ధరించుకున్నాయి. అవి ఎగురుతుంటే, వాటి రెక్కల చప్పుడు యుద్ధంలో రథాలు లాగుతూ దౌడు తీస్తున్న అనేకమైన అశ్వాల ఘోషలా ఉంది.
\s5
\v 10 వాటి తోకలు తేళ్ళ కొండీల వంటివి. అవి తమ తోకలతో మనుషుల్ని కుడుతున్నాయి. తమ తోకలతో ఆ ఐదు నెలల కాలం ప్రజలకు హాని చేసే అధికారం వాటికి ఉంది.
\v 11 వాటిని పాలించే రాజు అంతం లేని అగాధం కిందికి వెళ్ళిన ఆ దేవదూత. హీబ్రూ భాషలో అతడి పేరు "అబద్దోను." గ్రీకు భాషలో అతడికి "అపోల్యోన్" అని పేరు. ఈ రెండు పేర్లకు అర్ధం "విధ్వంసకుడు."
\p
\v 12 ఆ భయంకరమైన సంఘటన ముగిసింది. అయితే ఇంకా రెండు భయంకరమైన సంఘటనలు రానున్నాయని తెలుసుకో.
\s5
\p
\v 13 ఆరో దేవదూత తన బాకా ఊదాడు. అప్పుడు దేవుని సన్నిధిలో ఉండే బంగారు బలిపీఠపు నాలుగు కొనలనుంచి వస్తున్న స్వరం నేను విన్నాను.
\v 14 ఆరో బాకా ఊదే దేవదూతతో ఆ స్వరం, "యూఫ్రటీసు మహా నది దగ్గర బంధించి ఉన్న ఆ నలుగురు దేవదూతలను విడుదల చెయ్యి!" అని ఆజ్ఞాపించింది.
\v 15 అప్పుడు ఆ నలుగురు దేవదూతలను విడుదల చేశారు. ఫలానా సంవత్సరం, ఫలానా నెల ఫలానా రోజు ఫలానా గంట కోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ప్రజల్లో మూడోవంతును చంపడానికి తమ సైనికులకి అనుమతి ఇవ్వడానికి వాళ్ళు చెర నుండి విడుదల అయ్యారు.
\s5
\p
\v 16 ఆ గుర్రాలపై కూర్చుని స్వారీ చేస్తున్న సైనికుల సంఖ్య ఇరవై కోట్లు. "వాళ్ళు ఎంతమంది?" అని ఎవరో అడగడం నేను విన్నాను.
\v 17 నా దర్శనంలో అవి ఎలాంటి గుర్రాలో, వాటిపై స్వారి చేసే ఆ సైనికులు చూడడానికి ఎలాంటివారో నేను చూశాను. ఆ సైనికులు వేసుకున్న కవచాలు అగ్నిలాంటి ఎరుపుతో, పొగలాంటి ముదురు నీలం రంగుతో, గంధంలా పసుపచ్చ రంగులో ఉన్నాయి. గుర్రాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. అవి నోటి నుంచి అగ్ని, పొగ, కాలుతున్న గంధకం ఆవిర్లు వెళ్లగక్కుతున్నాయి.
\s5
\p
\v 18 గుర్రాల నోటి నుంచి వస్తున్న అగ్ని, పొగ, కాలుతున్న గంధకపు ఆవిరితో అవి మూడింట ఒక వంతు ప్రజల్ని మట్టుబెట్టాయి.
\v 19 ఆ గుర్రాల శక్తి వాటి నోళ్ళలోనూ, వాటి తోకల్లోనూ ఉంది. వాటి తోకలకు పాము లాంటి తలలు ఉన్నాయి, వాటితో అవి ప్రజలకు హాని చేస్తున్నాయి.
\s5
\p
\v 20 అయితే అగ్ని , పొగ, కాలుతున్న గంధకపు ఆవిరి చేత హతం కాని వాళ్ళు తాము చేస్తున్న పాపకృత్యాల విషయం పశ్చాత్తాప పడలేదు. కొయ్య, రాయి, కంచు, వెండి, బంగారం మొదలైన వాటితో వాళ్ళు చేసుకున్న విగ్రహాలను, దయ్యాలను ఆరాధించడం మానలేదు. ఆ విగ్రహాలు చూడలేనివి, వినలేనివి, నడవలేనివి అయినా కూడా ప్రజలు వాటిని పూజించడం మానలేదు.
\v 21 వాళ్ళు హత్యలు, మాయమంత్ర విద్యలు, లైంగిక అవినీతి, దొంగతనాలు మానలేదు.
\s5
\c 10
\p
\v 1 దర్శనంలో మహా శక్తిమంతుడైన దేవదూత పరలోకం నుంచి బయటకు రావడం నేను చూశాను. ఒక మేఘం ఆయన్ను ఆవరించి ఉంది. ఆయన తలపై ఇంద్రధనస్సు ఉంది. ఆయన ముఖం సూర్యబింబంలా ప్రకాశిస్తున్నది. ఆయన కాళ్ళు చూడడానికి అగ్ని స్తంభాల్లా ఉన్నాయి.
\v 2 తెరిచి ఉన్న ఒక చిన్న పుస్తకం చుట్ట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కుడి కాలును సముద్రం మీదా, ఎడమ కాలును భూమి మీదా ఉంచాడు.
\s5
\p
\v 3 ఆయన పెద్ద గొంతుకతో ఏదో అరిచాడు. ఆ శబ్దం సింహ గర్జనలా ఉంది. ఆయన అరిచినప్పుడు ఏడు సార్లు ఉరుము శబ్దం వచ్చింది. ఆ ఉరుములు పలికిన మాటలను నేను అర్ధం చేసుకున్నాను.
\v 4 నేను ఆ ఏడు ఉరుములు పలికిన మాటలను రాయబోతుంటే, ఒక స్వరం పరలోకం నుంచి నాతో, "ఉరుములు పలికిన మాటలను రహస్యంగా ఉంచు, వాటిని రాయకు" అని చెప్పింది.
\s5
\p
\v 5 అప్పుడు సముద్రం మీదా, భూమి మీదా నిలబడిన ఆ దేవదూత, తన కుడి చేతిని పరలోకం వైపుకు ఎత్తి,
\v 6 "శాశ్వత జీవం ఉన్నవాడూ, పరలోకాన్నీ, దానిలోని సమస్తాన్నీ సృష్టించిన వాడూ, భూమినీ, దానిలోని సమస్తాన్నీ సృష్టించిన వాడూ, సముద్రాన్నీ, దానిలోని సమస్తాన్నీ సృష్టించిన వాడూ అయిన ఆయన చెప్పబోయేది సత్యం" అని చెప్పాడు. "దేవుడు తాను చేయాలనుకున్నది ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయడు" అని ఆ దేవదూత చెప్పాడు.
\v 7 ఏడవ దేవదూతకు తన బాకా ఊదే సమయం వచ్చినప్పుడు దేవుడు యుగాలకు పూర్వం తన సేవకులకు, ప్రవక్తలకు చెప్పిన తన రహస్య ప్రణాళిక ముగిస్తాడని అతడు చెప్పాడు.
\s5
\p
\v 8 పరలోకం నుంచి నాతో ఇంతకుముందు మాట్లాడిన వాడు మళ్ళీ నాతో , "భూమి మీదా, సముద్రం మీదా నిల్చున్న ఆ దేవదూత చేతిలో నుంచి తెరిచిన పుస్తకం చుట్టను వెళ్ళి తీసుకో" అన్నాడు.
\v 9 కాబట్టి నేను దేవదూత దగ్గరకు వెళ్ళి "ఆ చిన్న చుట్టను నాకు ఇవ్వండి" అని అడిగాను. అతడు నాతో, "దీన్ని తీసుకుని తిను. నీ నోటికి ఇది తేనెలా తియ్యగా ఉంటుంది, కానీ ఇది నీ కడుపును చేదు చేస్తుంది" అన్నాడు.
\s5
\p
\v 10 నేను దేవదూత చేతిలో నుంచి ఆ చిన్న పుస్తకం చుట్టను తీసుకుని తిన్నాను. నా నోటికి అది తేనెలా తియ్యగా ఉంది కానీ ఆ తరువాత అది నా కడుపులో చేదుగా అయింది.
\v 11 అప్పుడు మరొకరు నాతో, "నువ్వు అనేకమంది రాజులను గురించీ, అనేక భాషలు మాట్లాడే వాళ్ళను గురించీ, జాతుల గురించీ, అనేక దేశాలను గురించీ దేవుని సందేశం మళ్ళీ చెప్పాలి" అన్నాడు.
\s5
\c 11
\p
\v 1 అప్పుడు దేవదూత కొలబద్ద వంటి బెత్తాన్ని నాకు ఇచ్చాడు. దేవుడు నాతో, "దేవాలయానికి వెళ్ళి, ఆలయం, దానిలోని బలిపీఠం కొలత వేయి. అక్కడ ఆరాధిస్తున్న వారిని లెక్కబెట్టు.
\v 2 కానీ ఆలయం బయట ఆవరణను కొలవ వద్దు, ఎందుకంటే దాన్ని నేను యూదేతరులకు ఇచ్చాను. దాని ఫలితంగా వాళ్ళు యెరూషలేము నగరాన్ని 42 నెలల పాటు కాలితో తొక్కుతారు" అన్నాడు.
\s5
\p
\v 3 "నేను ఇద్దరు సాక్షులను పంపుతాను. నేను వాళ్ళకి వెల్లడి చేసిన దాన్ని వాళ్ళు చాటిస్టారు. వాళ్ళు మేక వెంట్రుకలతో చేసిన ముతక బట్టలు ధరించి తాము ప్రజల పాపం విషయం చాలా వేదనలో ఉన్న సంగతిని వెల్లడిస్తారు" అన్నాడు.
\v 4 భూమిని పరిపాలించే వాడి సన్నిధిలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉండే రెండు దీప స్తంభాలుగా రెండు ఒలీవ చెట్లుగా ఉండే ఆ ఇద్దరు సాక్షులు వీరే.
\v 5 ఎవరైనా ఈ సాక్షులకు హాని చేయాలని చూస్తే, వాళ్ళ నోటి నుంచి అగ్ని వచ్చి వాళ్ళను నాశనం చేస్తుంది. వారికి ఏ విధంగా హాని చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారో వాళ్ళను ఆ ఇద్దరు సాక్షులు సరిగ్గా అలానే చంపుతారు.
\s5
\p
\v 6 దేవుడు వారికి వెల్లడి చేసిన దాన్ని చాటించే కాలంలో వర్షం పడకుండా ఆపే అధికారం ఆ సాక్షులకు ఉంది. ప్రతి చోటా నీటిని రక్తంగా మార్చే అధికారం కూడా వారికి ఉంది. అన్ని రకాలైన వ్యాధులను మనుషులకు దాపురించేలా చేసే అధికారం కూడా వారికి ఉంది. వారు తరుచుగా తమకు ఇష్టమైన రీతిలో ఇలాటివి చేస్తారు.
\v 7 దేవుని నుంచి తెచ్చిన సందేశాన్ని వారు చాటించడం పూర్తి కాగానే, అడుగు లేని అగాధం నుంచి క్రూర మృగం పైకి వచ్చి వారిపై దాడి చేసి, జయించి హతమారుస్తుంది.
\s5
\p
\v 8 ఎక్కడైతే వారి ప్రభువుని సిలువ వేసారో, ఆ నగర వీధుల్లో ఆ ఇద్దరు సాక్షుల శవాలు పడి ఉంటాయి. ఆ నగరాన్ని సొదొమ, ఈజిప్టు పోలికతో పిలుస్తారు, ఎందుకంటే దానిలోని ప్రజలు సొదొమ, ఈజిప్టుల్లో నివసించే ప్రజల్లా చాలా దుర్మార్గులు.
\v 9 మూడున్నర రోజుల పాటు వారి శవాలను అనేక దేశాలవారు, భాషాసమూహాల వారు, జాతులవారు, చూస్తారు. వారి శవాలను పాతిపెట్టనివ్వరు.
\s5
\p
\v 10 భూమిమీద నివసించే ప్రజానీకం ఆ సాక్షులు చావడం చూసి సంతోషంతో పండగ చేసుకుంటారు. ఒకరికొకరు బహుమతులు పంపించుకుంటారు, ఎందుకంటే ఈ ఇద్దరు సాక్షులు అసంఖ్యాకంగా వ్యాధుల్నీ, హింసల్నీ వారిపైకి పంపారు.
\p
\v 11 కాని మూడున్నర రోజుల తరువాత దేవుడు వారిని మళ్ళీ బ్రతికేలా చేస్తాడు. వారు లేచి నిలబడగానే, అది చూసి ప్రజలు హడలిపోతారు.
\v 12 ఆ ఇద్దరు సాక్షులు పరలోకం నుంచి పెద్ద స్వరం పిలవగా వింటారు. వారితో ఆ స్వరం, "పైకి రండి" అని చెప్పగా వారు మేఘాల్లోకెగసి పైకి వెళ్తారు. వారు అలా వెళ్ళడం వారి శత్రువులు చూస్తారు.
\s5
\p
\v 13 అదే సమయంలో అక్కడ ఒక పెద్ద భూకంపం కలుగుతుంది. ఫలితంగా నగరంలోని పదోవంతు కట్టడాలు కూలిపోతాయి. ఏడు వేల మంది చనిపోతారు.
\v 14 అది ఘోరమైన రెండవ సంఘటన. జాగ్రత్త! ఇది ముగిసిన వెంటనే మూడవ ఘోరం ముంచుకు రానుంది.
\s5
\p
\v 15 ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో స్వరాలు ఇలా ఘోషించాయి. "మన ప్రభువైన దేవుడు, ఆయన నియమించిన క్రీస్తు ఇకపై ఈ లోక ప్రజలందరి మీదా రాజ్యం చేస్తారు. వారు యుగయుగాలు పరిపాలన చేస్తారు."
\s5
\p
\v 16 అప్పుడు దేవుని ఎదుట సింహాసనాలపై కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలూ సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించారు.
\q1
\v 17 "ప్రభువైన దేవా, సర్వ లోక పరిపాలకా, సర్వ శక్తిశాలీ,
\q1 పూర్వం ఉండి ప్రస్తుతం ఉన్నవాడా, నీవే నిత్యుడవు,
\q1 నిన్నెదిరించిన వారి పీచమణచిన వాడా,
\q1 నువ్వు నీ మహాశక్తి సమేతంగా పాలించడం ప్రారంభించినందుకు నీకు మా కృతజ్ఞతలు.
\s5
\q1
\v 18 విశ్వాసహీనుల క్రోధం మితిమీరింది.
\q1 అందుకే నీ తీవ్ర ఆగ్రహం వారు చవి చూశారు.
\q1 చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికీ,
\q1 నీ సేవకులైన ప్రవక్తలకీ, పరిశుద్ధులకీ, గొప్పవారైనా, అనామకులైనా
\q1 నీ పేరు అంటే భయభక్తులు ఉన్న వారికి పారితోషికాలు ఇవ్వడానికీ,
\q1 భూమిని నాశనం చేసే వారిని లేకుండా చేయడానికీ నీ నిర్ణయ సమయం వచ్చింది" అన్నారు.
\s5
\p
\v 19 అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరుచుకుంది. దేవుని నిబంధన మందసం అందులో కనిపించింది. అప్పుడు మెరుపులూ, గొప్ప శబ్దాలూ, ఉరుములూ, భూకంపమూ కలిగాయి. పెద్ద వడగళ్ళు పడ్డాయి.
\s5
\c 12
\p
\v 1 అప్పుడు ఒక దృశ్యం ఆకాశంలో కనిపించింది. ఒక స్త్రీ సూర్యుణ్ణి తన వస్త్రంగా ధరించి ఉంది. ఆమె కాళ్ళ కింద చంద్ర బింబం ఉంది. ఆమె తలపై పన్నెండు నక్షత్రాల కిరీటం విజయ సంకేతంగా ఉంది.
\v 2 ఆమె నిండు చూలాలు. పురిటి నొప్పులతో తీవ్ర వేదన పడుతూ కేకలు వేస్తూ ఉంది.
\s5
\v 3 ఇంతలో మరో అసాధారణ సంకేతం ఆకాశంలో కనిపించింది. అది రెక్కలున్న మహా సర్పం. వాడికి ఏడు తలలున్నాయి. పది కొమ్ములున్నాయి. వాడి ఏడు తలలపై ఏడు కిరీటాలున్నాయి.
\v 4 వాడు తన తోకతో ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీదికి విసిరికొట్టాడు. ఆ మహాసర్పం కనడానికి నొప్పులు పడుతున్న స్త్రీకి ఎదురుగా నిలబడ్డాడు. ఆ స్త్రీ బిడ్డకు జన్మ నివ్వగానే ఆ బిడ్డను మింగివేయాలన్నది వాడి ఉద్దేశం.
\s5
\p
\v 5 ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ శిశువు ఇనప దండం పట్టుకుని మానవజాతులన్నిటిపై పూర్తి అధికారంతో పరిపాలన చేయాల్సి ఉంది. దేవుడు ఆమె బిడ్డను ఆమె దగ్గరనుంచి లాక్కుని తన సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళాడు.
\v 6 ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది. అక్కడ ఆమెను 1,260 రోజులు ఉంచి పోషించడానికి దేవుడు ఒక స్థలాన్ని సిద్ధం చేసి ఉంచాడు.
\s5
\p
\v 7 అప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. మిఖాయేలూ అతని దూతలూ ఆ మహాసర్పంతో యుద్ధం చేశారు. ఆ మహా సర్పం తన దూతలతో కలసి ఎదిరించి పోరాడాడు.
\v 8 కానీ గెలవడానికి ఆ మహా సర్పానికి బలం చాలలేదు. అప్పుడు దేవుడు పరలోకంలో ఆ మహా సర్పానికీ వాడి అనుచర గణాలకూ మరెప్పటికీ స్థానం లేకుండా చేశాడు.
\v 9 ఈ మహా సర్పానికి అపవాది అనీ, సాతాను అనీ పేర్లున్నాయి. వాడు లోకాన్నంతా మోసం చేసే ప్రాచీన సర్పం. దేవుడు వాణ్ణీ వాడితో పాటు వాడి అనుచరగణాలనూ భూమి మీదికి తోసి వేశాడు.
\s5
\v 10 అప్పుడు పరలోకం నుండి బిగ్గరగా ఒక స్వరం నాకు వినపడింది,
\q1 "మన దేవుడు తన శక్తితో తన వారిని రక్షించాడు. ఇకపై ఆయనే వారి పాలకుడు.
\q1 అభిషిక్తుడు తన పరిపాలన మొదలు పెట్టాడు.
\q1 మన సోదరులను నిత్యం నిందించే వాణ్ణి దేవుడు పరలోకం నుండి తోసేశాడు.
\q1 అహర్నిశలు దేవుని ఎదుట మన సోదరులపై నేరం మోపే వాడు, అపవాది వీడే.
\s5
\q1
\v 11 గొర్రెపిల్ల తన రక్తాన్ని చిందించి, ప్రాణం పెట్టడం వల్ల మన సహోదరులు వాణ్ణి జయించారు.
\q1 గొర్రెపిల్లను గురించిన సత్యసాక్షులుగా నిలిచి, మన సహోదరులు ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
\q1 అలా సత్యానికి సాక్షులుగా నిలిచినపుడు మరణం వచ్చినా సరే వారు తమ ప్రాణాలను ప్రేమించలేదు.
\q1
\v 12 కాబట్టి పరలోకమూ పరలోకంలో నివసించే వారూ సంబరాలు చేసుకోండి.
\q1 భూమి మీదా సముద్రం మీదా నివసించే ప్రజలారా, మీకు యాతన. ఎందుకంటే అపవాది మీ దగ్గరికి దిగి వచ్చాడు.
\q1 వాడు భీకరమైన కోపంతో ఉన్నాడు. దేవుడు తనకు తీర్పు తీర్చి శిక్షించడానికి ఇక కొంచెం సమయమే మిగిలిందని వాడు గ్రహించాడు."
\s5
\p
\v 13 తనను భూమి పైకి తోసివేయడాన్ని చూసి ఆ మహాసర్పం, మగబిడ్డను ప్రసవించిన ఆ స్త్రీని వెంటాడాడు.
\v 14 కానీ అరణ్యంలో తనకు సిద్ధం చేసిన చోటుకు వెళ్ళడానికి ఆమెకు పెద్ద డేగకుండే బలమైన రెక్కల్లాంటి రెండు రెక్కలు దేవుడు ఇచ్చాడు. అక్కడ ఆమె సర్పం బారిన పడకుండా మూడున్నర సంవత్సరాల కాలం ఆమెకు పోషణ ఏర్పాటు అయింది.
\s5
\p
\v 15 అప్పుడు ఆ స్త్రీ నీళ్ళలో కొట్టుకుపోవాలని సర్పం తన పుక్కిటి నుండి నీటిని నదీ ప్రవాహంగా వెళ్ళగక్కాడు.
\v 16 కానీ భూమి నోరు తెరచి ఆ మహాసర్పం నోటి నుండి వచ్చిన నదీ ప్రవాహాన్ని మింగివేసి ఆ స్త్రీకి సహాయం చేసింది.
\v 17 అందుచేత తీవ్ర ఆగ్రహతో ఆ మహా సర్పం, దేవుని ఆదేశాలు పాటిస్తూ యేసును గురించిన సత్యం ప్రకటిస్తూ ఆమె సంతానంలో మిగిలి ఉన్న వారితో యుద్ధం చేయడానికి బయల్దేరాడు.
\v 18 అందుకోసం ఆ మహా సర్పం సముద్ర తీరంలో ఇసుక తిన్నెలపై నిలబడ్డాడు.
\s5
\c 13
\p
\v 1 తరువాత క్రూర మృగం ఒకటి సముద్రంలో నుండి బయటకు రావడం చూశాను. దానికి పది కొమ్ములూ, ఏడు తలలూ ఉన్నాయి. దాని కొమ్ములపై పది కిరీటాలున్నాయి. దాని తలల మీద దేవుణ్ణి అవమానపరిచే పేర్లు ఉన్నాయి.
\v 2 నేను చూసిన ఆ మృగం చిరుత పులిలా ఉంది. దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలాగా దాని నోరు సింహం నోరులాగా ఉన్నాయి. ఆ మహాసర్పం ఈ మృగానికి, మనుషుల మీద పరిపాలన చెయ్యడానికి తన శక్తినీ, తన సింహాసనాన్నీ, గొప్ప అధికారాన్నీ ఇచ్చాడు.
\s5
\p
\v 3 దాని తలల్లో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుగా కనిపించింది. అయితే ఆ గాయం మానిపోయింది. భూనివాసులంతా ఆశ్చర్యచకితులై ఆ మృగం వెంట వెళ్ళారు.
\v 4 తమకు రాజుగా ఉండడానికి ఆ మృగానికి అధికారమిచ్చాడని వారంతా మహాసర్పానికి కూడా పూజలు చేశారు. "ఈ మృగంలాంటి శక్తిమంతుడు ఎవడన్నా ఉన్నాడా? ఇతనితో యుద్ధం చేయగల వారెవరు?" అని చెప్పుకుంటూ వారంతా మృగానికి కూడా పూజలు చేశారు.
\s5
\p
\v 5 బడాయి కబుర్లూ, దైవ దూషణలూ చేయడానికి దానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. నలభై రెండు నెలలు అధికారం చెలాయించడానికి కూడా దానికి అనుమతి ఇచ్చాడు.
\v 6 కాబట్టి దేవుణ్ణి దూషించడానికీ, ఆయన నామాన్నీ, ఆయన నివాస స్థలాన్నీ, పరలోకంలో నివసించే వారినందరినీ దూషించడానికి అది నోరు తెరిచింది.
\s5
\p
\v 7 ఇంతేకాకుండా తన పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని జయించే అవకాశం కూడా దేవుడు దానికి ఇచ్చాడు. ప్రతి వంశం పైనా, ప్రజల పైనా, భిన్నమైన భాషలు మాట్లాడే వారిపైనా, ప్రతి జాతి పైనా దానికి అధికారం ఉంది.
\v 8 భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధకు గురి అయిన గొర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో తమ పేర్లు లేని వారే ఆ మృగాన్ని పూజిస్తారు.
\s5
\p
\v 9 దేవుని నుండి వచ్చిన ఈ సందేశాన్ని అర్ధం చేసుకోవాలి అనుకునే ప్రతివారూ జాగ్రత్తగా చెవులు రిక్కించి వినాలి.
\v 10 చెరలోకి పోవలసిన వాడు చెరలోకి పోతాడు. కత్తితో హతం కావలసిన వాడు కత్తితో హతమౌతాడు. దేవుని చిత్తం మేరకు పరిశుద్ధులైన వారు ఈ విషయంలో తప్పక సహనం, విశ్వాసం కలిగి ఉండాలి.
\s5
\p
\v 11 అప్పుడు భూమిలో నుండి మరో మృగం పైకి రావడం చూశాను. దానికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి చిన్న కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగే పరుషంగా మాట్లాడుతూ ఉంది.
\v 12 ఈ రెండవ మృగం ప్రాణాంతకమైన దెబ్బ తగిలి ఆ తరువాత గాయం మానినట్టున్న మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని దాని సమక్షంలో ఉపయోగిస్తూ, తద్వారా ఆ మొదటి మృగాన్ని భూమీ దానిలో నివసించే వారంతా పూజించేలా ఒత్తిడి చేసింది.
\s5
\v 13 రెండవ మృగం కూడా అనేక చిత్ర చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి మాయలు కూడా చేస్తూ ఉంది.
\p
\v 14 తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉంది. కత్తి దెబ్బ తిని కూడా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలనీ, దాన్ని ఆరాధించాలనీ అది అందరికీ చెబుతూ ఉంది. దేవుడు అనుమతిస్తేనే ఇదంతా జరిగింది.
\s5
\v 15 పైగా అలా స్థాపించిన విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ కూడా దేవుడు దానికి అనుమతి ఇచ్చాడు.
\v 16 ఇంకా తమ కుడి చేతిపై గానీ నుదిటిపై గానీ మొదటి మృగానికున్న పేరును ముద్ర వేయించుకోవాలని ప్రముఖులనూ, అనామకులనూ, ధనవంతులనూ, నిరుపేదలనూ, అధికారులనూ, పనివారినీ అందర్నీ అది బలవంతం చేసింది.
\v 17 ఈ ముద్ర, అంటే ఆ మృగం పేరు గానీ దాని పేరును సూచిస్తున్న సంఖ్య గానీ లేని పక్షంలో ఎవరికైనా క్రయవిక్రయాలు చేసుకునే వీలు లేకుండా చేసింది.
\s5
\v 18 కాస్త తెలివిగా ఆలోచిస్తేనే గానీ ఈ ముద్ర సంగతి అర్ధం కాదు. ఈ సంఖ్య మానవ జాతిని సూచించే 666.
\s5
\c 14
\p
\v 1 ఆ తరువాత నా ఎదురుగా యెరూషలేములో సీయోను పర్వతంపై గొర్రెపిల్ల నిలబడి ఉండడం నాకు కనిపించింది. ఆయనతో కూడా లక్షా నలభై నాలుగు వేల మంది ఉన్నారు. వారందరి నొసళ్ళపై ఆయన పేరూ, ఆయన తండ్రి పేరూ రాసి ఉన్నాయి.
\p
\v 2 అప్పుడు విస్తార జలధారలతో కూడిన సెలయేటి ధ్వనిలా లా, పెద్ద ఉరుము ఉరిమినట్టు పరలోకం నుండి ఒక శబ్దం రాగా విన్నాను. వీణలు వాయించేవారు చాలా మంది కలిసి వాయిస్తున్న శబ్దం వలే అది ఉంది.
\s5
\v 3 ఆ లక్షా నలభై నాలుగు వేల మందిమంది ఏకమై సింహాసనం ఎదుటా, ఆ నాలుగు ప్రాణుల ఎదుటా, పెద్దల ఎదుటా ఒక కొత్త పాట పాడారు. భూలోకంలో గొర్రెపిల్ల విమోచించిన ఈ లక్షా నలభై నాలుగు వేల మంది తప్ప ఇంకెవ్వరూ ఆ పాటను నేర్చుకోలేరు.
\p
\v 4 ఈ లక్షా నలభై నాలుగు వేల మంది, కన్యకలు నైతికంగా ఎంత స్వచ్ఛంగా ఉంటారో అంతలా తమ ఆత్మ విషయంలో కల్మషం లేని వారు. దేవుడు కాని వాడిని ఆరాధించి అపవిత్రులైపోకుండా, తమని తాము కాపాడుకున్నవారు వీరే. వీళ్ళు గొర్రెపిల్లగా వున్న యేసు వెళ్ళిన చోటికల్లా వెళ్తూ ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. వీళ్ళు మానవాళిలో నుండి దేవుని కోసమూ, గొర్రెపిల్ల కోసమూ ప్రథమ ఫలాలుగా విమోచన పొందిన వారు.
\v 5 అబద్ధమన్నది వీళ్ళ నోటి నుండి రాదు. వీళ్ళు నిందా రహితులు.
\s5
\p
\v 6 అప్పుడు మరో దూతను చూశాను. అతడు ఆకాశంలో ఎగురుతున్నాడు. భూమి మీద నివసించే వారందరికీ ప్రతి దేశానికీ, ప్రతి తెగకూ, ప్రతి భాష మాట్లాడే వారికీ, ప్రతి జాతికీ ప్రకటించడానికి అతని దగ్గర శాశ్వత సువార్త ఉంది.
\v 7 అతడు, "మీరు దేవునికి భయపడండి. ఆయనకు మహిమ ఆపాదించండి. ఆయన మనుషులకు తీర్పు తీర్చే సమయం వచ్చింది. కాబట్టి భూమినీ, ఆకాశాలనూ, సముద్రాన్నీ, భూమి మీద నీటి ఊటలనూ సృష్టించిన ఆయనను పూజించండి" అంటూ బిగ్గరగా చెప్పాడు.
\s5
\p
\v 8 వేరొక దూత, అంటే రెండవ దూత అతని వెనకే వచ్చాడు. "నాశనమైపోయింది! తన విపరీతమైన లైంగిక దుర్నీతి అనే ఘాటు సారాయిని భూమి మీద జనాలందరికీ తాగించిన మహా బబులోను, దుష్ట నగరం ధ్వంసమైపోయింది" అని చెప్పాడు.
\s5
\v 9 తరువాత మూడవ దూత వీరి వెనకే వచ్చి పెద్ద స్వరంతో ఇలా చెప్పాడు. "ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ ఎవరు పూజించినా, దాని ముద్రను నుదుటి మీద గానీ చేతి మీద గానీ ఎవరు వేయించుకున్నా,
\v 10 అలాంటి వాళ్ళు ఒకడు కల్తీ లేకుండా తయారు చేసిన ఘాటైన సారాయి తాగినప్పటిలా దేవుని ఆగ్రహాన్ని చవి చూస్తారు. పరిశుద్ధ దేవదూతల ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా అగ్ని గంధకాలు వారిని బాధిస్తాయి.
\s5
\v 11 వారి యాతనకి సంబంధించిన పొగ కలకాలం లేస్తూనే ఉంటుంది. ఆ క్రూర మృగాన్ని గానీ, దాని విగ్రహాన్ని గానీ పూజించిన వాళ్ళనీ, దాని ముద్ర వేయించుకున్నవాళ్ళనీ రేయింబవళ్ళు విరామం లేకుండా నిత్య నరకాగ్నికి దేవుడు అప్పగిస్తాడు.
\v 12 దేవుని ఆదేశాలు పాటించేవారూ, యేసును విశ్వసించిన వారూ అయిన పరిశుద్ధులు సహనంతో, విధేయతతో కొనసాగాలి."
\s5
\p
\v 13 అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం నాకిలా వినిపించింది, "ఇలా వ్రాయి. ఇక నుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు ఎంతో ధన్య జీవులు." దేవుని ఆత్మ ఇలా అన్నాడు "నిజమే, వారు తమ బాధలన్నీ ప్రయాసలన్నీ విడిచి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారు చేసిన మంచి పనులు అందరికీ తెలుసు."
\s5
\p
\v 14 మళ్ళీ నేను చూసినప్పుడు ఒక తెల్లని మేఘం కనిపించింది. ఆ మేఘంపై మనుష్య కుమారుడి లాంటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది.
\v 15 అప్పుడు మరో దూత దేవాలయంలో నుండి బయటకు వచ్చి మేఘంపై కూర్చున్న వ్యక్తితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు, "పంట కోసే సమయం వచ్చింది. భూలోకంలో పంట పండింది. నీ కొడవలితో కోయడం మొదలుపెట్టు."
\v 16 అప్పుడు మేఘంపై కూర్చున్న వ్యక్తి భూమి మీదికి కొడవలి విసిరాడు. వెంటనే భూమి మీద కోత కోయడం అయిపోయింది.
\s5
\p
\v 17 అంతలోనే పరలోకంలోని ఆలయంలో నుండి మరో దూత బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా ఒక పదునైన కొడవలి ఉంది.
\v 18 మరో దూత బలిపీఠంలో నుండి బయటకు వచ్చాడు. ఇతనికి ఆ బలిపీఠంపై ఉన్న అగ్నిపై అధికారం ఉంది. ఇతడు పదునైన కొడవలి చేతిలో పట్టుకున్నఆ దూతను బిగ్గరగా పిలిచి, "భూమి మీద ద్రాక్ష పళ్ళు పండాయి. పదునైన నీ కొడవలితో ద్రాక్ష గుత్తులు కోసుకో" అన్నాడు.
\s5
\v 19 అప్పుడు ఆ దూత తన కొడవలిని భూమి మీదికి విసిరి భూమిమీద ఉన్న ద్రాక్షగుత్తులను కోశాడు. వాటిని దేవుని ఆగ్రహమనే గొప్ప ద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు.
\v 20 పట్టణానికి బయట ఆ ద్రాక్ష గానుగ తొట్టిలో ద్రాక్షలు తొక్కడం జరిగింది. దానిలో నుండి రక్తం ఉవ్వెత్తున చిమ్మింది. గుర్రాల కళ్ళెం అంత ఎత్తున సుమారు రెండు వందల మైళ్ళ వరకూ ప్రవహించింది.
\s5
\c 15
\p
\v 1 పరలోకంలో మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం నేను చూశాను. బ్రహ్మాండంగానూ, అద్భుతంగానూ ఉన్న ఏడుగురు దేవదూతలు కనపడ్డారు. తిరుగుబాటుదారులను శిక్షించడానికి తమ చేతుల్లో ఏడు తెగుళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇవి ఉగ్రతతో దేవుడు విధించే చివరి శిక్ష. వీటితో దేవుడు ఎంత ఆగ్రహంగా ఉన్నాడో తెలుస్తుంది.
\s5
\p
\v 2 తరువాత నేను ఒక గాజు సముద్రం లాంటిది చూశాను. దానితో అగ్ని కలసి ఉంది. క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించకుండా, దాని పేరును సూచించే సంఖ్యను తమపై రాయనివ్వకుండా దానినీ, దాని దూతలనూ జయించిన వారు ఆ గాజు సముద్రం దగ్గర నిలబడి ఉండడం నేను చూశాను. వారి చేతుల్లో దేవుడు ఇచ్చిన వీణలు ఉన్నాయి.
\s5
\p
\v 3 వారు ప్రాచీన కాలంలో దేవుని సేవకుడైన మోషే పాడిన గొర్రెపిల్ల పాట పాడుతూ,
\q1 "ప్రభూ, దేవా, సర్వపరిపాలకా,
\q1 నీవి ఘన కార్యాలు, అద్భుతాలు.
\q1 సార్వభౌమా, నీ క్రియలు శక్తివంతమైనవి, ఆశ్చర్యమైనవి.
\q1 నీ విధానాలు న్యాయమైనవి, సత్యమైనవి.
\q1 స్వామీ, సమస్త మానవాళిపై నిత్యం రాజ్యం చేస్తున్న వాడివి నీవే.
\q1
\v 4 నువ్వు మాత్రమే పరిశుద్ధుడివి, నీకు భయపడనివారెవరు? నీ నామాన్ని కీర్తించనిదెవరు?
\q1 నీ న్యాయమైన తీర్పులు అందరికీ తెలిశాయి. కాబట్టి అన్ని జాతుల వారూ నీ సన్నిధికి వచ్చి నిన్ను పూజిస్తారు."
\s5
\p
\v 5 ఆ తరువాత నేను చూస్తున్నప్పుడు పరలోకంలో సాక్షపు గుడారం ఉన్న అతి పరిశుద్ధ మందిరం తెరుచుకుంది.
\v 6 అప్పుడు ఎదురు తిరిగిన వారిని శిక్షించడానికి ఏడు తెగుళ్ళు చేతిలో పట్టుకున్న ఏడుగురు దూతలు ఆ పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు వచ్చారు. వారంతా పవిత్రమైన, ప్రకాశవంతమైన తెల్లటి నార బట్టలు వేసుకుని ఉన్నారు. రొమ్ముకు బంగారు వల్లెవాటు కట్టుకుని ఉన్నారు.
\s5
\p
\v 7 అప్పుడు ఆ నాలుగు ప్రాణుల్లో ఒకడు మద్యం నింపిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దూతలకు ఇచ్చాడు. ఆ మద్యం తనను తిరస్కరించిన వాళ్ళ నిమిత్తం నిత్యం జీవించే దేవుడు అత్యాగ్రహంతో సిద్ధపరిచిన శిక్షకు గుర్తు.
\v 8 దేవుని దివ్య యశస్సు నుండీ, ప్రభావం నుండీ లేచిన పొగతో దేవాలయం నిండిపోయింది. ఆ ఏడుగురు దూతలు శిక్షార్హులను శిక్షించే ఏడు కీడులన్నీ పూర్తి అయ్యే వరకూ దేవాలయంలోకి ఎవరూ ప్రవేశించలేకపోయారు.
\s5
\c 16
\p
\v 1 దర్శనంలో ఒక పెద్ద స్వరం అతి పరిశుద్ధ స్థలంలో నుంచి, "మీరు వెళ్ళి ఏడు పాత్రల్లో నిండి ఉన్న దేవుని ఆగ్రహ మద్యం భూమి మీద కుమ్మరించండి. దేవుడు వారిపై అమిత క్రోధంతో ఉన్నాడు. ఆ మద్యం అక్కడి వారిని బాధిస్తుంది." అని ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పడం విన్నాను.
\s5
\p
\v 2 అప్పుడు మొదటి దూత బయటకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరించాడు. దాని వల్ల ఆ క్రూరమృగానికి చెందిన ముద్ర వేసుకున్న వారికీ, వాడి ప్రతిమను పూజించే వారికీ ఒంటిపై బాధాకరమైన, వికారమైన కురుపు పుట్టింది.
\s5
\p
\v 3 రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరించాడు. సముద్రమంతా చచ్చిన మనిషి రక్తంలా మారిపోయింది. దాంతో సముద్రంలోని ప్రాణులన్నీ చచ్చాయి.
\s5
\p
\v 4 మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ, నీటి ఊటల్లోనూ కుమ్మరించాడు. అప్పుడు ఆ నీళ్లన్నీ రక్తంగా మారాయి.
\v 5 అప్పుడు నీటి మీద అధికారం ఉన్న దూత దేవుడితో, "పూర్వముండి ప్రస్తుతమున్న దేవా, నిత్యుడా, పరిశుద్ధుడా, ప్రజలపై నీ తీర్పులు న్యాయ సమ్మతమైనవి.
\v 6 నీ పరిశుద్ధుల రక్తాన్నీ, ప్రవక్తల రక్తాన్నీ వారు ఒలికించారు. అందుకే నువ్వు వారికి తాగడానికి రక్తం ఇచ్చావు. ఈ విధమైన తీర్పు చెప్పావు గనక నువ్వు న్యాయవంతుడివి. దీనికి వారు అర్హులే" అని చెప్పాడు.
\p
\v 7 అప్పుడు బలిపీఠం నుండి ఒకడు, "అవును ప్రభూ, దేవా సర్వశక్తిశాలీ, నీ తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి" అనడం వినిపించింది.
\s5
\p
\v 8 నాలుగవ దూత తన పాత్రలో ఉన్న దానిని సూర్యుడిపై కుమ్మరించాడు. అప్పుడు సూర్య ప్రతాపం విపరీతంగా పెరిగిపోయింది. అలా మనుషుల్ని సూర్యుడి వేడితో మాడ్చివేయడానికి ఆ దూతకు అనుమతి వచ్చింది.
\v 9 మనుషులు తీవ్రమైన వేడికి మాడిపోయారు. అయితే ప్రజలు ఈ కీడులపై అధికారం కలిగిన దేవుని పేరును దూషించారే గానీ పశ్చాత్తాప పడడానికీ ఆయన్ని ఆరాధించడానికీ నిరాకరించారు.
\s5
\p
\v 10 అయిదవ దూత తన పాత్రలోనిది క్రూరమృగం సింహాసనం పైన కుమ్మరించాడు. అప్పుడు వాడి రాజ్యం అంతా చీకటి అలముకుంది. మనుషులు ఈ యాతనలకి తట్టుకోలేక నాలుకలు కరచుకున్నారు.
\v 11 అయితే తమకు కలిగిన వేదనలను బట్టీ, కురుపులను బట్టీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి దూషించారే తప్ప తమ చెడు క్రియలు మాని పశ్చాత్తాప పడలేదు.
\s5
\p
\v 12 ఆరవ దూత తన పాత్రలో ఉన్న దానిని యూఫ్రటీసు అనే మహానదిపై కుమ్మరించాడు. దాంతో ఆ నది ఎండిపోయింది. తూర్పు దిక్కునున్న రాజులకు మార్గం సుగమం అయింది. వాళ్ళు తమ సైనికులతో దాడి చేయ గలిగారు.
\p
\v 13 అప్పుడు ఆ మహాసర్పం నోటినుండీ, క్రూరమృగం నోటినుండీ, అబద్ధ ప్రవక్త నోటినుండీ కప్పల్లా కనిపిస్తున్న మూడు అపవిత్రాత్మలు బయటకు రావడం చూశాను.
\v 14 అవి ఆశ్చర్యమైన సూచనలు జరిగించే దయ్యాల ఆత్మలే. శక్తిశాలి అయిన దేవుని మహాదినాన ఆయన తన శత్రువులను శిక్షించబోతున్నాడు. ఆ రోజు జరగబోయే యుద్ధానికి లోకంలో ఉన్న రాజులందర్నీ కూడగట్టడానికి వారి దగ్గరికి వెళ్తున్న ఆత్మలు అవి.
\s5
\p
\v 15 (యేసు ప్రభువు ఇలా అనడం నేను విన్నాను, "జాగ్రత్తగా వినండి! నేను దొంగలా మీరు ఊహించని సమయంలో రాబోతున్నాను. అప్రమత్తంగా ఉండి, సన్మార్గాన్ని అనుసరిస్తూ జీవిస్తున్న వారు సిగ్గుపడరు. వారి విషయంలో నేను సంతోషిస్తున్నాను. ఎలా అంటే పదిమందిలో బయటకు వెళ్ళినప్పుడు తన నగ్నత్వం కనిపించకుండా జాగ్రత్త పడి దుస్తులు ధరించే వాడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు.")
\p
\v 16 ఆ అపవిత్రాత్మలు హీబ్రూ భాషలో హర్ మెగిద్దోన్ అనే పేరున్న స్థలానికి ఆ రాజులందర్నీ పోగు చేశారు.
\s5
\p
\v 17 ఏడవ దూత తన పాత్రలోనిది గాలిలో వెదజల్లాడు. అప్పుడు అతి పరిశుద్ధ స్థలం లోని సింహాసనం నుండి, "దేవుడు తనను ఎదిరించిన వారిని శిక్షించే సమయం ఇక అయిపోయింది" అని ఒకడు పెద్ద శబ్దంతో అనడం వినిపించింది.
\p
\v 18 దూత కుమ్మరించిన పాత్రలోనిది ఖాళీ అయిపోయిన వెంటనే భీకర శబ్దాలూ, మెరుపులూ, భారీ ఉరుములూ కలిగాయి. భయంకరమైన భూకంపం వచ్చింది. మనుషుల సృష్టి జరిగిన కాలం నుండి అలాంటి భూకంపం ఎన్నడూ కలగలేదు.
\v 19 ఆ కారణాన ప్రసిద్ధమైన ఆ మహా నగరం మూడు భాగాలుగా చీలిపోయింది. మిగిలిన దేశాల్లోని నగరాలన్నీ నాశనమయ్యాయి. అప్పుడు దేవుడు మహా బబులోను నగర ప్రజలు ఎంత పాపం చేశారో జ్ఞాపకం చేసుకున్నాడు. కోపంతో తన తీవ్ర ఆగ్రహం అనే మద్యంతో నిండిన పాత్రలోనిది ఆ నగర ప్రజలకు తాగడానికిచ్చాడు.
\s5
\v 20 భూకంపం వల్ల ప్రతి ద్వీపమూ అదృశ్యమైపోయింది. ప్రతి పర్వతం నేలమట్టమై పోయింది.
\v 21 ఆకాశం నుండి మనుషుల మీద సుమారు ముప్పై మూడు కిలోల బరువున్న భీకరమైన వడగళ్ళు పడ్డాయి. ఆ వడగళ్ళ దెబ్బ భయానకంగా ఉంది. కాబట్టి ఇంత ఘోరంగా తమను శిక్షిస్తున్నందుకు మనుషులు దేవుణ్ణి దూషించారు.
\s5
\c 17
\p
\v 1 ఏడు పాత్రలు చేతబట్టుకున్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో, "అనేక కాలువలున్న నగరానికి ప్రతినిధి అయిన మహావేశ్యకు కలిగే శిక్ష నీకు చూపిస్తాను రా.
\v 2 భూరాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. భూమిపై నివసించే వారు ఆమె లైంగిక విశృంఖలత అనే మద్యాన్ని తాగి మత్తులో మునిగారు. అందరూ నీతిమాలి బతికారు" అన్నాడు.
\s5
\p
\v 3 అప్పుడు నేను దేవుని ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. ఒక దూత నన్ను అరణ్యంలోకి తీసుకు వెళ్ళాడు. అక్కడ నేను ఒక స్త్రీని చూశాను. ఆమె ఒక ఎర్రని మృగం మీద కూర్చుని ఉంది. ఆ మృగానికి ఏడు తలలూ పది కొమ్ములూ ఉన్నాయి. దాని ఒళ్ళంతా దేవ దూషణ పేర్లు రాసి ఉన్నాయి.
\v 4 ఆ స్త్రీ ఊదారంగు, ఎర్ర రంగు వస్త్రాలు కట్టుకుని ఉంది, బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో అలంకరించుకుంది. ఆమె చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రలో తాను చేస్తున్న అతి జుగుప్సాకరమైన పనులూ, లైంగిక అవినీతికి సంబంధించిన అపవిత్రకార్యాలూ ఉన్నాయి.
\v 5 ఆమె నుదుటి మీద ఆమె పేరు రాసి ఉంది. దానికో రహస్యమైన అర్థం ఉంది. "ఇది మహా బబులోను. భూమి మీద ఉన్న వేశ్యలందరికీ, ఏహ్యమైన వాటన్నిటికీ తల్లి."
\s5
\v 6 ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తాన్నీ, యేసు హతసాక్షుల రక్తాన్నీ తాగి మత్తెక్కి ఉండడం చూశాను. వారు యేసును గురించిన సత్యాన్ని ప్రకటించినందుకు హింసల పాలయ్యారు. ఆ స్త్రీని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను.
\p
\v 7 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, "నువ్వెందుకు ఆశ్చర్యపడ్డావు? ఈమెకు సంబంధించిన రహస్యాన్నీ ఏడు తలలూ పది కొమ్ములూ ఉండి ఈ స్త్రీని మోస్తున్న క్రూరమృగానికి సంబంధించిన రహస్యాన్నీ నీకు తెలుపుతాను.
\s5
\v 8 నువ్వు చూసిన ఆ మృగం పూర్వం ఉంది కానీ ఇప్పుడు జీవించి లేదు. కానీ అది లోతైన అగాధంలో నుండి పైకి రావడానికి సిద్ధంగా ఉంది. తరవాత అది దేవుని చేతిలో నాశనమైపోతుంది. ఒకప్పుడు ఉండి, ఇప్పుడు లేని, మున్ముందు రాబోయే మృగాన్ని చూసి భూమిమీద నివసించేవారు, అంటే సృష్టి ప్రారంభం నుండీ దేవుని జీవ గ్రంథంలో తమ పేర్లు లేని వారు ఆశ్చర్యపోతారు."
\s5
\p
\v 9 "దీనిని అర్ధం చేసుకోవడానికి జ్ఞానం కలిగిన మనసు అవసరం. ఆ స్త్రీ కూర్చున్న మృగానికి ఉన్న ఏడు తలలు, ఆ స్త్రీ ఏ నగరానికి ప్రతినిధిగా వుందో ఆ నగరం లోని ఏడు కొండలు. ఆ కొండలు కూడా ఏడుగురు రాజులను సూచిస్తూ వున్నాయి.
\v 10 వారిలో ఐదుగురు నాశనమయ్యారు. ప్రస్తుతం ఒకడున్నాడు. చివరి వాడు ఇంకా రాలేదు. వాడు వచ్చినప్పుడు కొంచెం కాలమే ఉంటాడు.
\s5
\v 11 ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూరమృగం ఆ ఏడుగురిలో ఒకడు. కానీ ఎనిమిదవ రాజు కూడా వాడే. నాశనానికి పోయేదీ వాడే.
\s5
\v 12 నీకు కనిపించిన ఆ పది కొమ్ములూ పదిమంది రాజులు. వారికి ఇంత వరకూ రాజ్యం లేదు. కానీ క్రూరమృగం ఏలేటప్పుడు వారు ఒక గంటసేపు రాజుల్లా అధికారం చెలాయిస్తారు.
\v 13 వీరికి ఒకే ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు తమ శక్తినీ అధికారాన్నీ మృగానికి అంకితం చేస్తారు.
\v 14 వీళ్ళు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ ఆయన వారిని ఓడిస్తాడు. ఎందుకంటే గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు. ఆయనతో ఉన్నవారు పిలుపునందుకున్న వారు, ఎన్నిక అయినవారు, నమ్మకమైన వారు."
\s5
\p
\v 15 ఆ దూత ఇంకా నాతో ఇలా చెప్పాడు, "ఆ వేశ్య కూర్చున్న నగరంలో నువ్వు చూసిన జలాలు ప్రజలనూ, జన సమూహాలనూ, జాతులనూ, వివిధ భాషలు మాట్లాడే వారినీ సూచిస్తాయి.
\s5
\v 16 నువ్వు చూసిన పది కొమ్ములూ పదిమంది రాజులను సూచిస్తున్నాయి. వారూ, ఆ మృగమూ ఆ వేశ్యను ద్వేషించి, ఆ నగరంలోని సమస్తాన్నీ దోచుకుంటారు. ఆమె బట్టలూడదీసి దిక్కుమాలిన దాన్నిగా చేసినట్టు ఆ నగరానికి చేస్తారు. ఆమె శరీరాన్ని నాశనం చేసినట్టు ఆ నగరాన్ని మంటల్లో కాల్చివేస్తారు.
\v 17 దేవుని మాటలు నెరవేరే వరకూ వారు తమ హృదయాల్లో ఏకీభవించి తమ రాజ్యాన్ని ఆ మృగానికి అప్పగించడం ద్వారా తన సంకల్పం కొనసాగించేలా దేవుడు వారికి ఆ మనసు పుట్టించాడు.
\s5
\v 18 ఇక నువ్వు చూసిన ఆ వేశ్య భూమిపై రాజులను పరిపాలిస్తున్న మహా నగరమే."
\s5
\c 18
\p
\v 1 ఆ తరవాత పరలోకం నుండి మరో దూత దిగి రావడం చూశాను. అతనికి గొప్ప అధికారం ఉంది. అతనికున్న యశస్సు చేత భూమి అంతా ప్రకాశించింది.
\v 2 అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు.
\q1 "బబులోను నాశనం కాబోతుంది.
\q1 దేవుడు బబులోనును పూర్తిగా నాశనం చేయబోతున్నాడు.
\q1 అందువల్ల అది దయ్యాలకు నివాసమైంది.
\q1 ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది.
\q1 అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.
\q1 బబులోను ఒక వేశ్య లాంటిది.
\q1
\v 3 ఎందుకంటే దైవాగ్రహాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు.
\q1 భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు.
\q1 లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల వల్ల సంపన్నులయ్యారు."
\s5
\p
\v 4 తరువాత యేసు స్వరం పరలోకం నుండి ఇలా వినిపించింది. "నా ప్రజలారా, మీరు బబులోను పాపాల్లో భాగం పంచుకోకుండా, దానికి సంభవించబోయే ఏడు రకాల కీడుల్లో ఏదీ మీకు సంభవించకుండా దానిని విడిచి వచ్చెయ్యండి."
\q1
\v 5 దాని పాపాలు ఆకాశాన్నంటుతున్నాయి.
\q1 దేవుడు దాని నేరాలన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు.
\q1
\v 6 దేవుడు బబులోనును శిక్షించడానికి నియమించిన దూతలతో
\q1 అది చెల్లించిన ప్రకారం దానికి చెల్లించండి.
\q1 అది చేసిన దానికి రెట్టింపు చేయండి.
\q1 అది కలిపిన పాత్రలోనే దాని కోసం రెండొంతులు కలపండి.
\s5
\q1
\v 7 బబులోను ఒక స్త్రీ లాగా తనను తాను హెచ్చించుకుంది. విలాస భోగాల్లో జీవించింది.
\q1 అంతే మొత్తంలో దానికి హింసనూ, వేదననూ కలగజేయండి.
\q1 ఎందుకంటే అది తన మనసులో, "నేను రాణిగా కూర్చుండేదాన్ని, వితంతువును కాను.
\q1 సంతాపం చూడనే చూడను" అనుకుంది.
\p
\v 8 కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్క రోజే కలుగుతాయి. మరణమూ, దుఖమూ, కరువూ వస్తాయి. దాంతో ఆ నగర ప్రజలు చస్తే మిగిలినవారు కుమిలిపోతారు. ఆహారం లేక ఆకలితో విల విల లాడిపోతారు. నగరం అగ్నికి ఆహుతైపోతుంది. ప్రభువైన దేవుడు మహా శక్తిశాలి. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే.
\s5
\p
\v 9 ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ ఆమెకు కలుగుతున్న వేదననూ, ఆమె తగలబడి పోతుంటే వచ్చే పొగనూ చూస్తూ రోదిస్తారు.
\v 10 ఆమెను చుట్టుముట్టిన కీడు తమపై కూడా పడుతుందేమో అని అందరూ భయంతో దూరంగా నిలబడి,
\q1 "అయ్యో, అయ్యో, బబులోను మహానగరమా,
\q1 శక్తివంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చి పడిందా!" అంటూ ఏడుస్తారు.
\s5
\p
\v 11 లోకంలోని వ్యాపారులు కూడా ఆ నగరాన్ని చూసి శోకాలు పెడతారు. ఎందుకంటే, ఇక మీదట వారి వస్తువులు కొనేవారు ఎవ్వరూ ఉండరు.
\v 12 వారి సరుకులు ఏవంటే బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, సన్నని నేత బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టు బట్టలు, ఎర్రని బట్టలు. ఇంకా పరిమళాన్నిచ్చే విలువగల ప్రతి రకమైన కలప, దంతం, ప్రశస్తమైన చెక్క, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళూ మొదలైన వాటితో చేసిన ఎన్నో రకాల వస్తువులూ.
\v 13 దాల్చిన చెక్క, పెద్ద యాలుకలు, ధూపం కోసం వాడే వస్తువులూ, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, నూనె, మెత్తని పిండి. గోదుమలు, పశువులు, గొర్రెలు మొదలైనవి. ఇంకా గుర్రాలూ, రథాలూ, బానిసలూ, మనుషుల ప్రాణాలు.
\s5
\v 14 వారంతా "నీవు ఆశించినదంతా నిన్ను విడిచి పోయింది. నీ విలాసం, వైభోగం మాయమై పోయాయి. అవి ఇక కనపడవు" అని చెబుతూ ఏడుస్తారు.
\s5
\p
\v 15 ఆ నగరంలో తమ సరుకుతో వ్యాపారం చేసి సంపన్నులైన వ్యాపారులు ఆమె దుస్థితిని చూసి ఆ కీడు తమకెక్కడ చుట్టుకుంటుందోనని భయంతో దూరంగా నిలిచి అంగలారుస్తారు, రోదిస్తారు.
\v 16 "సన్నని నేత బట్టలు, ఊదారంగు, ఎర్రని బట్టలు కట్టుకుని బంగారంతో, రత్నాలతో, ముత్యాలతో అలంకరించుకున్న మహా నగరమా, అయ్యో, అయ్యో, అంత ఐశ్వర్యమూ ఒక్క గంటలోనే మాయమైపోయిందే!" అంటూ శోకాలు పెడతారు.
\p
\v 17 ప్రతి నౌకాధిపతి, సముద్ర యాత్రికులు, ఓడ నావికులు, ఇలా సముద్రం మీద ఆధారపడి బతికే వారంతా దూరంగా నిలబడి,
\s5
\v 18 తగలబడి పోతున్న నగరాన్ని, అందులో రాజుకున్న పొగను చూసి, "ఈ నగరానికి సమానమైనదేది?" అంటూ కేకలు పెడతారు.
\v 19 తమ తలల మీద దుమ్ము చల్లుకుని ఏడుస్తూ రోదిస్తూ, "అయ్యో, అయ్యో, మహా నగరమా! సొంత నౌకలు ఉన్న వారంతా ఈ నగరంలోని సంపద వల్ల ధనవంతులయ్యారు. అలాంటిది దేవుని చేతిలో ఒక్క గంటలోనే ఇది ఇలా నామరూపాలు లేకుండా మట్టిపాలై పోయిందే" అంటారు.
\p
\v 20 ఆ తరువాత పరలోకం నుండి ఒక స్వరం "పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే మీరు దేవుని వారు. అది మిమ్మల్ని అత్యంత క్రూరంగా శిక్షించిన దానికి ప్రతిగా దేవుడు ఆమెను శిక్షించాడు."
\s5
\v 21 ఆ తరువాత బలవంతుడైన ఒక దూత పెద్ద తిరగలి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలా అన్నాడు, "బబులోను ప్రజలారా, మీ మహా నగరమైన బబులోను కూడా ఇలాగే హింసల పాలై కూలిపోతుంది. ఇక అది ఎన్నటికీ కనిపించదు.
\v 22 కాబట్టి వీణల శబ్దాలూ, గాయకుల పాటలూ, పిల్లనగ్రోవి, బూరలు ఊదేవారి శబ్దాలూ ఇక ఎన్నటికీ నీ దగ్గర వినిపించవు. ఎలాంటి శిల్పమైనా చెక్కే శిల్పి ఎవరూ నీ దగ్గర ఇక కనపడడు. గానుగల శబ్దాలు ఇక ఎప్పటికీ నీ దగ్గర వినపడవు.
\s5
\v 23 దీపం వెలుతురు నీలో ఇక కనిపించదు. పెళ్ళి కొడుకు స్వరం, పెళ్ళి కూతురు స్వరం ఇక ఎన్నటికీ నీలో వినపడవు. ఎందుకంటే నీ వర్తకులు ప్రపంచంలో ఘనులు. దేశాలన్నీ నీ మాయలో పడి మోసపోయాయి.
\v 24 ఇంకా ప్రవక్తల రక్తం, హతసాక్షుల రక్తం, భూమిపై హతమైన ప్రతివారి రక్తం నీలో కనిపిస్తూ ఉంది."
\s5
\c 19
\p
\v 1 ఈ విషయాలు జరిగిన తరువాత జన సముదాయాలు ఘోష పెడుతున్నట్టు పెద్ద ధ్వనులు పరలోకంలో నుండి నాకు వినిపించాయి.
\q1 "హల్లెలూయ! రక్షణ, యశస్సు,
\q1 బల ప్రభావాలు మన దేవునివే.
\q1 ఆయన మనల్ని కాపాడాడు.
\q1
\v 2 ఆయన తీర్పులు సత్యంగా న్యాయంగా ఉన్నాయి.
\q1 తన లైంగిక అవినీతితో భూలోకాన్ని భ్రష్టత్వంలోకి నెట్టిన
\q1 మహా వేశ్యను ఆయన శిక్షించాడు.
\q1 ఆమె ఒలికించిన తన సేవకుల రక్తానికి ఆయన ప్రతికారం తీర్చాడు, స్తుతించండి."
\s5
\p
\v 3 రెండోసారి వారంతా, "హల్లెలూయా! ఆ నగరం నుండి పొగ కలకాలం పైకి లేస్తూనే ఉంటుంది" అన్నారు.
\q1
\v 4 అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి
\q1 సింహాసనంపై కూర్చున్న దేవునికి,
\q1 "ఆమెన్, హల్లెలూయ! ఇది సత్యం" అని చెబుతూ ఆయనను పూజించారు.
\s5
\p
\v 5 అప్పుడు, "దేవుని దాసులు, ఆయనంటే భయ భక్తులు కలవారు,
\q1 గొప్పవారైనా అనామకులైనా అందరూ మన దేవుణ్ణి స్తుతించండి" అంటూ ఒక స్వరం సింహాసనం నుండి వినిపించింది.
\s5
\p
\v 6 తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు, అనేక జలపాతాల గర్జనలా, బలమైన ఉరుముల ధ్వనిలా ఒక స్వరం ఇలా వినిపించింది.
\q1 "హల్లెలూయ! సర్వ శక్తిశాలి,
\q1 మన ప్రభువైన దేవుడు పరిపాలిస్తున్నాడు."
\s5
\p
\v 7 "గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చింది.
\q1 పెండ్లికుమార్తె సిద్ధపడి ఉంది.
\q1 కాబట్టి మనం సంతోషించి ఆనందించుదాం.
\q1 ఆయనకు మహిమ ఆపాదించుదాం."
\p
\v 8 ఆమె ధరించుకోడానికి మెరిసిపోయే, ప్రశస్తమైన శ్రేష్ఠవస్త్రాలు ఇచ్చారు. ఈ వస్త్రాలు పరిశుద్ధుల నీతి కార్యాలు.
\s5
\v 9 అప్పుడు ఆ దూత నాతో ఇలా అన్నాడు, "గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం అందినవారు ధన్యులు అని వ్రాయి." అతడే ఇంకా, "ఇవి నిజంగా దేవుని మాటలు" అన్నాడు.
\v 10 అందుకు నేను అతణ్ణి పూజించడానికి అతని ముందు సాష్టాంగపడబోయాను. కానీ అతడు, "అలా చేయకు. యేసుకు సాక్షులుగా ఉన్న నీకూ నీ సోదరులకూ నేను దాసుణ్ణి మాత్రమే. దేవుడికి మాత్రమే నువ్వు నమస్కరించాలి. ఆయనే నీకు శక్తినిచ్చి, యేసును గురించి సాక్ష్యం చెప్పడానికి నిన్ను నిలబెట్టాడు" అన్నాడు.
\s5
\p
\v 11 తరువాత పరలోకం తెరుచుకోవడం చూశాను. అక్కడ తెల్లని గుర్రం ఒకదాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. దానిమీద కూర్చున్న వ్యక్తి పేరు "నమ్మకమైన వాడు, సత్యవంతుడు." ఆయన ప్రతివారికీ న్యాయ తీర్పులు వినిపిస్తూ, శత్రువులపై యుద్ధం చేస్తాడు.
\v 12 ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన తలపై అనేక కిరీటాలున్నాయి. ఆయనపై ఒక పేరు రాసి ఉంది. దాని అర్ధం ఆయనకు తప్ప వేరెవరికీ తెలియదు.
\v 13 ఆయన ధరించిన దుస్తులు రక్తంలో ముంచి తీసినవి. "దేవుని వాక్కు" అనే పేరు కూడా ఆయనకుంది.
\s5
\v 14 ఆయన వెనకే పరలోక సేనలు తెల్లని నార బట్టలు వేసుకుని తెల్ల గుర్రాలపై ఎక్కి వెళ్తున్నారు.
\v 15 తనను తిరస్కరిస్తున్న వివిధ జాతి ప్రజలను దండించడానికి ఆయన నోటి నుండి పదునైన కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ఇనుప దండంతో వారిని పరిపాలిస్తాడు. తన శత్రువులను ద్రాక్షల్ని గానుగల తొట్టిలో పడేసి తొక్కినట్టు ఆయనే తొక్కుతాడు. అది సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఆగ్రహం.
\v 16 ఆయన తొడ మీదుగా వున్నా బట్టల మీద "రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు" అనే పేరు రాసి ఉంది.
\s5
\p
\v 17 అప్పుడు ఒక దూత సూర్యబింబంలో నిలబడి ఉండడం నేను చూశాను. అతడు బిగ్గరగా కేక వేసి మాంసాహార పక్షుల్ని పిలిచాడు, "రండి, దేవుడు ఏర్పాటు చేసిన మహా విందును ఆరగించండి.
\v 18 రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, బలవంతుల మాంసం, గుర్రాల మాంసం, వాటిపై స్వారీ చేసేవారి మాంసం, స్వతంత్రులూ, బానిసలూ, పలుకుబడి లేనివారూ, గొప్పవారూ అయిన మనుషులందరి మాంసం, దేవుని శత్రువుల మాంసం వచ్చి తినండి" అన్నాడు.
\s5
\p
\v 19 క్రూరమృగం, భూమి మీదనున్న రాజులందరూ తమ సైన్యాలతో వ్యూహం తీరి ఉండడం నేను చూశాను. వారు ఆ గుర్రం మీద కూర్చున్న వ్యక్తితోనూ ఆయన సైన్యంతోనూ యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు.
\v 20 అప్పుడు ఆ మృగమూ, వాడి ముందు అద్భుతాలు చేసిన అబద్ధ ప్రవక్తా తెల్ల గుర్రమెక్కి వస్తున్న వ్యక్తికి పట్టుబడ్డారు. అద్భుతాలతోనే వీడు మృగం ముద్ర వేయించుకున్న వారిని, ఆ విగ్రహాన్ని పూజించిన వారిని మోసం చేస్తూ వచ్చాడు. అప్పుడు దేవుడు ఈ ఇద్దరినీ గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో ప్రాణాలతోనే పడవేశారు.
\s5
\v 21 మిగిలిన వారు గుర్రం మీద కూర్చున్న వ్యక్తి నోటి నుండి వస్తున్న కత్తివాత పడి చచ్చిపోయారు. వారి మాంసాన్ని పక్షులు కడుపారా ఆరగించాయి.
\s5
\c 20
\p
\v 1 తరువాత ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం చూశాను. అతని దగ్గర అగాధానికి వేసిన తాళం చెవి వుంది. అతని చేతిలో ఒక పెద్ద గొలుసు ఉంది.
\v 2 అతడు అపవాది, సాతాను అనే పేర్లున్న ఆది సర్పం. ఆ మహా సర్పాన్ని చేతిలో ఉన్న గొలుసుతో బంధించి వెయ్యి సంవత్సరాల వరకూ అగాధంలో పడవేశాడు.
\v 3 వాణ్ణి ఆ చీకటి అగాధంలో పడవేసి, దాన్ని మూసివేసి దానికి ముద్ర వేశాడు. ఆ వెయ్యి సంవత్సరాలయ్యే వరకూ ప్రజలను మోసం చేయకుండా వాడు అగాధంలోనే బందీగా ఉండాలి. ఆ తరువాత కొద్ది సమయం వాణ్ణి దేవుని ప్రణాళిక చొప్పున వదిలిపెట్టాలి.
\s5
\p
\v 4 అప్పుడు సింహాసనాలూ, వాటిపై కూర్చున్న వారినీ చూశాను. దేవుడు ఆ కూర్చున్న వారికి తీర్పు చెప్పే అధికారం ఇచ్చాడు. యేసును గురించి సాక్ష్యం చెప్పినందుకూ, దేవుని వాక్కును ప్రకటన చేసినందుకూ శిరచ్చేదనానికి గురి అయిన భక్తుల ఆత్మలు కూడా చూశాను. వారు క్రూర మృగాన్ని గానీ, వాడి విగ్రహాన్ని గానీ పూజించలేదు. వారి నుదుటి మీద గానీ చేతి మీద గానీ ముద్ర వేయనీయలేదు. వారు సజీవులై క్రీస్తుతో కలిసి ఈ వెయ్యేళ్ళు పరిపాలించారు.
\s5
\v 5 ఇదే మొదటి పునరుత్థానం. ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసే వరకూ చనిపోయిన మిగిలిన వారు సజీవులు కాలేదు.
\v 6 ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు పరిశుద్ధులు, దీవెన పొందిన వారు. వీళ్ళపై రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికీ, క్రీస్తుకీ యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు.
\s5
\p
\v 7 వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు.
\v 8 వాడు బయల్దేరి భూమి నాలుగు దిక్కుల్లో యెహెజ్కేలు ప్రవక్త చెప్పిన గోగు, మాగోగులను మోసం చేసి, లెక్కకు సముద్రపు ఇసుకలాగా ఉన్న వారిని దేవుని ప్రజలమీద యుద్ధానికై సమకూరుస్తాడు.
\s5
\v 9 వారు అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమూ, దేవుని ప్రియ పట్టణమూ అయిన యెరుషలేమును ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.
\v 10 వారిని మోసం చేసిన అపవాదిని దేవుడు గంధకంతో మండుతున్న అగ్ని సరస్సులో పడవేస్తాడు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు.
\s5
\p
\v 11 తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న వాడినీ చూశాను. భీతి గొలిపేలా ఉన్న ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. అవి ఇక కనపడలేదు.
\v 12 చనిపోయిన వారు అధికులైనా, అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు ప్రజలందరి క్రియలు లిఖించిన గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఈ గ్రంథం లో నిత్య జీవాన్ని పొందిన వారి పేర్లన్నీ దేవుడు రాశాడు. ఆ గ్రంథాల్లో చనిపోయి ఇప్పుడు తిరిగి లేచిన వారు తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి తీర్పు పొందారు.
\s5
\v 13 సముద్రం తనలో చనిపోయిన వారు తిరిగి లేవగా దేవుని సింహాసనం ఎదుట నిలబడడానికి అప్పగించింది. భూమి దాని వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు.
\v 14 అవిశ్వాసులందరూ చనిపోయాక తామున్న స్థలాలు వదిలి లేవగా వారందర్నీ ప్రచండమైన వేడిమిగల అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం.
\v 15 జీవ గ్రంథంలో పేరు లేని ప్రతివాణ్ణి దేవుడు అగ్ని సరస్సులో పడేశాడు.
\s5
\c 21
\p
\v 1 అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ అంతర్థానం అయ్యాయి. సముద్రం అనేది ఇక లేదు.
\v 2 అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే దేవుని పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న కొత్త పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.
\s5
\v 3 అప్పుడు పరలోకంలో దేవుని సింహాసనం నుండి ఒక గొప్ప స్వరం, "వినండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు.
\v 4 ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. దుఃఖం మరి లేకుండా చేస్తాడు. ఇక మరణం గానీ, వేదన గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి" అని చెబుతుండగా విన్నాను.
\s5
\p
\v 5 అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, "చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, "ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ. నేను వీటిని నెరవేరుస్తాను కాబట్టి వ్రాయి” అని నాతో అన్నాడు
\v 6 ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు, "అన్నిటినీ సమాప్తం చేశాను. ఆల్ఫా నేనే, ఒమేగా నేనే. అంటే ఆదీ నేనే అంతమూ నేనే. దప్పిగొన్న ప్రతి వాడికి నిత్య జీవ జలాల ఊట నీరు ఉచితంగా ఇచ్చి దాహార్తి తీరుస్తాను. వారికిక మరణం లేదు.
\s5
\v 7 సాతానుపై విజయం సాధించిన ప్రతి వాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.
\v 8 అయితే పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం."
\s5
\p
\v 9 అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు నా దగ్గరికి వచ్చాడు. "ఇలా రా, నిత్యం గొర్రె పిల్లతో కలిసి జీవించబోతున్న నూతన వధువును అంటే గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను" అన్నాడు.
\p
\v 10 అత్మావేశుడనై ఉన్న నన్ను దేవదూత ఎత్తైన గొప్ప పర్వతం పైకి తీసుకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలోని దేవుని దగ్గర నుండి రావడం నాకు చూపించాడు.
\s5
\v 11 యెరూషలేము దేవుని మహిమలో విరాజిల్లుతున్నది. అది ప్రశస్తమైన సూర్యకాంతం రాయిలా స్ఫటికంలా ధగ ధగా మెరుస్తూ ఉంది.
\v 12 ఆ పట్టణానికి ఎత్తయిన ప్రహరీ గోడా, ఆ గోడకు పన్నెండు ద్వారాలూ ఉన్నాయి. ప్రతి ద్వారం దగ్గరా పన్నెండు మంది దేవదూతలున్నారు. ఇశ్రాయేలు వారి పన్నెండు గోత్రాల పేర్లూ ఆ ద్వారాలపై రాసి ఉన్నాయి.
\v 13 తూర్పున మూడు ద్వారాలూ, ఉత్తరాన మూడు ద్వారాలూ, దక్షిణాన మూడు ద్వారాలూ, పశ్చిమాన మూడు ద్వారాలూ ఉన్నాయి.
\s5
\v 14 ఆ పట్టణపు ప్రహరీ గోడకు పన్నెండు పునాదులున్నాయి. ఆ పునాదులపై పన్నెండు మంది గొర్రెపిల్ల నియోగించిన అపొస్తలుల పేర్లు కనిపిస్తున్నాయి.
\v 15 నాతో మాట్లాడే దూత దగ్గర ఆ పట్టణాన్నీ, దాని ద్వారాలనూ, ప్రహరీ గోడనూ కొలవడానికి ఒక బంగారు కొలబద్ద ఉంది.
\s5
\v 16 ఆ పట్టణం చతురస్రాకారంగా ఉంది. దాని పొడవు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలబద్దతో పట్టణాన్ని కొలిస్తే దాని కొలత సుమారు రెండు వేల రెండు వందల కిలో మీటర్లు ఉంది. దాని పొడవూ, వెడల్పూ, ఎత్తూ అన్నీ సమానమే.
\v 17 తరువాత అతడు ప్రహరీ గోడను కొలిచాడు. అది మనుషుల లెక్క ప్రకారం నూట నలభై నాలుగు మూరలుంది.
\s5
\p
\v 18 ఆ పట్టణపు ప్రహరీ గోడను సూర్యకాంత మణులతో కట్టారు. పట్టణం చూస్తే నిర్మలమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారంతో కట్టి ఉంది.
\v 19 ఆ పట్టణపు ప్రహరీ గోడ పునాదులు ప్రశస్తమైన రకరకాల విలువైన రాళ్ళతో అలంకరించారు. మొదటి పునాది సూర్యకాంతం, రెండవది ఇంద్ర నీలం, మూడోది యమునారాయి, నాలుగోది పచ్చ,
\v 20 అయిదోది వైఢూర్యం, ఆరోది కెంపు, ఏడోది సువర్ణ రత్నం, ఎనిమిదోది గోమేధికం, తొమ్మిదోది పుష్యరాగం, పదోది సువర్ణలశునీయం, పదకొండోది పద్మరాగం, పన్నెండోది పద్మరాగమణి.
\s5
\v 21 దాని పన్నెండు ద్వారాలూ పన్నెండు ముత్యాలు. ఒక్కో ద్వారాన్నీ ఒక్కో ముత్యంతో కట్టారు. పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారం.
\p
\v 22 అక్కడ ఎలాంటి దేవాలయమూ నాకు కనిపించలేదు. ఎందుకంటే సర్వశక్తిశాలి, ప్రభువు అయిన దేవుడూ, గొర్రెపిల్లా దానికి దేవాలయంగా ఉన్నారు.
\s5
\v 23 ఆ పట్టణంలో వెలుగివ్వడానికి సూర్యుడూ చంద్రుడూ అక్కరలేదు. దేవుని దివ్యతేజస్సు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల దాని దీపం.
\v 24 వివిధ జాతి ప్రజలు ఆ వెలుగులో జీవిస్తారు. భూరాజులు తమ వైభవాన్ని దానిలోకి తెస్తారు.
\v 25 సాయంత్రం వేళ దాని ద్వారాలు మూయరు. ఎందుకంటే అక్కడ రాత్రి లేదు.
\s5
\v 26 ప్రపంచంలోని వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు.
\v 27 పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసిన వారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్న వారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.
\s5
\c 22
\p
\v 1 అప్పుడు జీవజల నదిని ఆ దూత నాకు చూపించాడు. అది స్ఫటికంలా నిర్మలంగా మెరుస్తూ ఉంది. అది దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం నుండీ,
\v 2 ఆ పట్టణం ప్రధాన వీధి మధ్యలో నుండి ప్రవహిస్తుంది. ఆ నదికి రెండు పక్కలా జీవ వృక్షం ఉంది. దాని ఫలాలు నిత్య జీవాన్ని ఇస్తాయి. అది నెల నెలా ఫలిస్తూ, ఏడాదికి పన్నెండు కాపులు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉపయోగపడతాయి.
\s5
\v 3 అక్కడ ఇక శాపం అనేది ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం అక్కడ ఉంటుంది. ఆయన సేవకులు ఆయనను ఆరాధిస్తూ సేవ చేస్తారు.
\v 4 ఆయన్ని ముఖా ముఖిగా చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళపై ఉంటుంది.
\v 5 రాత్రి ఇక ఎప్పటికీ కలగదు. దీపాల కాంతీ, సూర్యుడి వెలుగూ వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వెలుగై వారిమీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు కలకాలం పరిపాలిస్తారు.
\s5
\p
\v 6 ఆ దూత నాతో ఇలా చెప్పాడు, "ఈ మాటలు నమ్మదగ్గవి, సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలకు ప్రభువైన దేవుడు త్వరలో జరగాల్సిన వాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపాడు."
\p
\v 7 యేసు తన వారితో మాట్లాడుతూ "చూడండి! నేను త్వరగా వస్తున్నాను. ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులన్నిటినీ విశ్వాసంతో స్వీకరించేవాడు ధన్యుడు” అన్నాడు.
\s5
\v 8 యోహాను అనే నేను ఈ సంగతులన్నీ విన్నాను, చూశాను. అలా నేను వింటూ చూస్తూ ఉన్నప్పుడు వాటిని నాకు చూపిస్తున్న దూతను పూజించడానికి అతని ఎదుట సాష్టాంగపడ్డాను.
\v 9 అప్పుడు అతడు, "నాకు సాగిల పడకు. నేను కూడా నీలాటి దైవ సేవకుడినే. ప్రవక్తలకూ, ఈ పుస్తకంలోని దేవుని మాటలను విధేయతతో పాటించే వారందరికీ నీ సాటి విశ్వాసులకూ నీ తోటి సేవకుణ్ణి. దేవుణ్ణి పూజించు” అని చెప్పాడు.
\s5
\p
\v 10 అతడు నాతో ఇంకా ఇలా చెప్పాడు, "ఈ పుస్తకంలో ఉన్న ప్రవచన వాక్కులను రహస్యంగా దాచి పెట్టవద్దు. ఎందుకంటే అవి నెరవేరే సమయం దగ్గర పడింది.
\v 11 అన్యాయం చేసేవాణ్ణి అన్యాయం చేస్తూనే ఉండనియ్యి. అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనియ్యి. వారికి ముట్టవలసిన జీతం వారికి దేవుడు త్వరలోనే ముట్టచెబుతాడు. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడిగానే ఉండనియ్యి. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధుడిగానే కొనసాగనియ్యి."
\s5
\v 12 యేసు అందరితో ఇలా చెప్పారు, "చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది.
\v 13 ఆల్ఫా, ఓమెగా నేనే. మొదటి వాణ్ణి, చివరి వాణ్ణి నేనే. ఆరంభాన్నీ ముగింపునీ నేనే."
\s5
\v 14 జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యత పొందాలని తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు. అలాంటి వారు దేవునికి బహు ఇష్టులు.
\p
\v 15 కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ పట్టణం బయట ఉంటారు. వారెప్పటికీ ఈ పట్టణంలో ప్రవేశించలేరు.
\s5
\v 16 యేసు అనే నేను సంఘాలకు చెప్పడం కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరునూ, దావీదు సంతానాన్నీ, ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్నీ."
\s5
\v 17 క్రీస్తుతో పెళ్ళికి సిద్ధపడినట్టు ఉన్నఆయన స్వజనం, దేవుని ఆత్మా కలిసి విశ్వాసం ఉంచడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరితో ఆత్మా, పెళ్ళికూతురూ "రండి" అని చెబుతున్నారు. వింటున్నవాడూ, "రండి" అని చెప్పాలి. దాహం వేసిన వాడు రావాలి. ఇష్టమున్న వ్యక్తి జీవ జలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు.
\s5
\v 18 ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను వినే ప్రతి వ్యక్తినీ నేను హెచ్చరించేది ఏమిటంటే ఎవడైనా వీటిలో ఏదైనా కలిపితే దేవుడు ఈ పుస్తకంలో రాసి ఉన్న కీడులన్నీ వాడికి కలగజేస్తాను.
\v 19 ఎవడైనా దేనినైనా తీసి వేస్తే దేవుడు ఈ పుస్తకంలో వివరించిన జీవవృక్షంలోనూ, పరిశుద్ధ పట్టణంలోనూ వాడికి భాగం లేకుండా చేస్తాడు.
\s5
\v 20 ఈ సంగతులను గురించి సాక్షమిస్తున్న వాడు అంటున్నాడు.
\p "అవును, త్వరగా వస్తున్నాను."
\p ఆమేన్‌! ప్రభు యేసూ, త్వరగా రా.
\v 21 ప్రభు యేసు కృప పరిశుద్ధులందరికీ నిత్యమూ తోడై ఉండు గాక. ఆమేన్‌.

View File

@ -1,5 +1,7 @@
# Telugu IEV
STR https://git.door43.org/unfoldingWord/SourceTextRequestForm/issues/349
STRs:
STR https://git.door43.org/unfoldingWord/SourceTextRequestForm/issues/363
* https://git.door43.org/unfoldingWord/SourceTextRequestForm/issues/349
* https://git.door43.org/unfoldingWord/SourceTextRequestForm/issues/363
* https://git.door43.org/unfoldingWord/SourceTextRequestForm/issues/484

View File

@ -15,14 +15,15 @@ dublin_core:
issued: '2019-11-29'
language:
identifier: te
title: తెలుగు
title: 'తెలుగు (Telugu)'
direction: ltr
modified: '2019-11-29'
modified: '2020-10-16'
publisher: 'Door43'
relation:
- 'te/obs'
- 'te/obs-tq'
- 'te/ulb'
- 'te/ta'
- 'te/tw'
- 'te/tq'
- 'te/tn'
@ -46,51 +47,184 @@ checking:
projects:
-
title: 'అపోస్తలుల కార్యములు '
versification: ufw
identifier: act
sort: 44
path: ./45-ACT.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'ఎఫెసీయులకు రాసిన పత్రిక '
versification: ufw
identifier: eph
sort: 49
path: ./50-EPH.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'లూకా సువార్త '
versification: ufw
identifier: luk
sort: 42
path: ./43-LUK.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'ఫిలేమోనుకు రాసిన పత్రిక '
versification: ufw
identifier: phm
sort: 57
path: ./58-PHM.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'తీతుకు రాసిన పత్రిక '
versification: ufw
identifier: tit
sort: 56
path: ./57-TIT.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'మార్కు సువార్ '
versification: ufw
identifier: mrk
sort: 41
path: ./42-MRK.usfm
categories: [ 'bible-nt' ]
-
title: 'మత్తయి సువార్ '
versification: ufw
identifier: mat
title: 'మత్తయి సువార్'
versification: 'ufw'
identifier: 'mat'
sort: 40
path: ./41-MAT.usfm
path: './41-MAT.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'మార్కు సువార్'
versification: 'ufw'
identifier: 'mrk'
sort: 41
path: './42-MRK.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'లూకా సువార్త'
versification: 'ufw'
identifier: 'luk'
sort: 42
path: './43-LUK.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'యోహాను సువార్త'
versification: 'ufw'
identifier: 'jhn'
sort: 43
path: './44-JHN.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'అపోస్తలుల కార్యములు'
versification: 'ufw'
identifier: 'act'
sort: 44
path: './45-ACT.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'రోమీయులకు రాసిన పత్రిక'
versification: 'ufw'
identifier: 'rom'
sort: 45
path: './46-ROM.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక'
versification: 'ufw'
identifier: '1co'
sort: 46
path: './47-1CO.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక'
versification: 'ufw'
identifier: '2co'
sort: 47
path: './48-2CO.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'గలతీయులకు రాసిన పత్రిక'
versification: 'ufw'
identifier: 'gal'
sort: 48
path: './49-GAL.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'ఎఫెసీయులకు రాసిన పత్రిక'
versification: 'ufw'
identifier: 'eph'
sort: 49
path: './50-EPH.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'ఫిలిప్పీయులకు రాసిన పత్రిక'
versification: 'ufw'
identifier: 'php'
sort: 50
path: './51-PHP.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'కొలస్సయులకు రాసిన పత్రిక'
versification: 'ufw'
identifier: 'col'
sort: 51
path: './52-COL.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'తెస్సలోనీకయులకు రాసిన మొదటి పత్రిక'
versification: 'ufw'
identifier: '1th'
sort: 52
path: './53-1TH.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక'
versification: 'ufw'
identifier: '2th'
sort: 53
path: './54-2TH.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'తిమోతికి రాసిన మొదటి పత్రిక'
versification: 'ufw'
identifier: '1ti'
sort: 54
path: './55-1TI.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'తీతుకు రాసిన పత్రిక'
versification: 'ufw'
identifier: 'tit'
sort: 56
path: './57-TIT.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'ఫిలేమోనుకు రాసిన పత్రిక'
versification: 'ufw'
identifier: 'phm'
sort: 57
path: './58-PHM.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'హెబ్రీయులకు రాసిన పత్రిక'
versification: 'ufw'
identifier: 'heb'
sort: 58
path: './59-HEB.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'యాకోబు రాసిన పత్రిక'
versification: 'ufw'
identifier: 'jas'
sort: 59
path: './60-JAS.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'పేతురు రాసిన మొదటి పత్రిక'
versification: 'ufw'
identifier: '1pe'
sort: 60
path: './61-1PE.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'పేతురు రాసిన రెండవ పత్రిక'
versification: 'ufw'
identifier: '2pe'
sort: 61
path: './62-2PE.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'యోహాను రాసిన మొదటి పత్రిక'
versification: 'ufw'
identifier: '1jn'
sort: 62
path: './63-1JN.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'యోహాను రాసిన రెండవ పత్రిక'
versification: 'ufw'
identifier: '2jn'
sort: 63
path: './64-2JN.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'యోహాను రాసిన మూడవ పత్రిక'
versification: 'ufw'
identifier: '3jn'
sort: 64
path: './65-3JN.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'యూదా రాసిన పత్రిక'
versification: 'ufw'
identifier: 'jud'
sort: 65
path: './66-JUD.usfm'
categories: [ 'bible-nt' ]
-
title: 'ప్రకటన గ్రంథము'
versification: 'ufw'
identifier: 'rev'
sort: 66
path: './67-REV.usfm'
categories: [ 'bible-nt' ]